Archives for September 2014

ఒక బతుకమ్మ, గౌరమ్మ లేదా ఒక పసుపమ్మ ….

drushya drushyam

ఫొటోగ్రఫీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ఎందుకంటే, వేయి పదాల్లో చెప్పేది కూడా ఒక్క చిత్రం చెబుతుంది.

నిజానికి వేయి పదాలు, లక్ష పదాలు అని ఎందుకుగానీ…
మాటలన్నీ వెలవెలబోయిన చోట ఛాయాచిత్రం కళకళలాడుతుంది.

గొంతు దాటి ఎన్ని మాట్లాడినా చెప్పలేని, అర్థమై కూడా కాని మార్మికత్వాన్ని,
మరెన్నోజీవన రహస్యాలను చిత్రం అలవోకగా బోధపరుస్తుంది.

చీకటీ వెన్నెలనే కాదు…
మనం చూడ నిరాకరించిన బూడిద వర్ణపు అనేకానేక రంగులనూ ఒక జీవనచ్ఛాయ సైతం విశదం చేస్తుంది.

చిత్రమే.
నిజం. ఆత్మీయతలను, అనురాగాలనూ అక్షరాల్లో వ్యక్తం చేసి, అది సరిగా అందలేదని భంగపడకుండా చేసే శక్తి ఛాయాచిత్రానిది.
అది ఏదైనా సరే, ఒక ఛాయ అన్నింటినీ అవతలి మనిషికి నిమ్మళంగా ముట్ట చెబుతుంది.

ఉదాహరణకు ఈ చిత్రం.

+++

పిల్లలు ఎలా ఎదుగుతారు… ఎలా తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి నేర్చుకుంటారో చెప్పే ఒక పెద్ద వ్యాసం రాయవచ్చు.
కానీ రాయనవసరం లేదు.

అలాగే, పిల్లలు తల్లి చేత గోరుముద్దలు తింటూ ఎంత హాయిగా బాల్యాన్ని గడుపుతారో,
తల్లి ప్రేమతో తనవితీరా ఎంత ముద్దుగా ఎదిగి వస్తారో కూడా ఒక గొప్ప ఖండకావ్యం రాయవచ్చు.
కానీ అక్కరలేదేమో!

నిన్నూ నన్నూ కలిపే గొప్ప స్రవంతి ఏదైనా ఉన్నదీ అంటే అది అచ్ఛమైన జీవితమే.
ఆ జీవితాన్ని పెద్ద బాలశిక్షలా చదువుకోవాలంటే చిన్న చిన్న జీవన ఘడియలను సైతం అపూర్వంగా ఒడిసి పట్టుకునే ఒకానొక మాధ్యమాన్నినమ్ముకోవాలి. ఆ నమ్మికే నా వంటి ఎందరిచేతో కెమెరా పట్టించింది.

కొందరు వదిలారు. ఇంకొందరు వదలలేదు.
కానీ, వదలకుండా పట్టుకునేది మనం మాత్రం కాదని నా ఎరుక.

+++

మాధ్యమానికి ఒక స్పృహ ఉంటుంది, కాలానికి మల్లే!
ఎంపిక అన్నది దాని స్వభావం కూడా అని నమ్మాలి.
లేకపోతే మీరు తీసిందే ఫొటో అవుతుంది. మీ చేత తీయించింది పాపం…మసక బారుతుంది.

సరే, ఇది నమ్మిక. విశ్వాసం.
ఒక తెరిచిన కన్ను, మరొక మూసిన కన్ను తాలూకు జీవితానుభవం.
‘లిప్త’జ్ఞానం.

ఒక ప్యాఫన్.
ఆరోగ్యకరమైన పిచ్చి. దృశ్యాదృశ్యం.

+++

ఒక బిడ్డకు తల్లి ఎంత నేర్పుతుందో ఛాయా చిత్రలేఖనమూ అంతే నేర్పుతూ ఉంటది.
నేర్చుకునే కుతూహలం ఈ పిల్లల మల్లే ఉంటే!

లేకపోతే ఈ చిత్రమూ లేదు.
అందులో పరంపరానుగతంగా సాగుతున్న పోషణ, పూజ, పునస్కారాలూ లేవు.

ఏమైనా ఈ చిత్రం నాకిష్టం.
ఇందులో తరతరాలున్నయి. తల్లులు ఒక్కొక్కరూ ఒక దశకు ప్రతీక.
సంలీనం ఉంది. మమేకతా ఉంది. అన్నిటికన్నా స్వచ్ఛత, నిర్మలత్వం ఉన్నది.

మొత్తంగా ఒక బతుకమ్మ, మించిన గౌరమ్మ
లేదా ఒక పసుపమ్మ ఈ చిత్రం.

+++

లక్ష పదాలు, వేయి వాక్యాలు, వంద పేరాగ్రాఫులు, యాభై పేజీలు, ఓ పది పుస్తకాలు, ఒక మహా కావ్యం ఈ చిత్రం.
లేదా ‘అమ్మ’ అన్న ఒక్క తలంపు చాలు…

మాతృక. అంతే.
అదే ఈ ఛాయ చిత్రం.

‘మాతృదేవోభవ’ అన్న శ్లోకం ఒక రకంగా త్రినేత్రాలు పనిచేసే ఛాయా చిత్రలేఖణం గురించే అనిపించే ఈ మాధ్యమానికి,
అందులో జనించిన ఈ అమ్మవారి ఫొటో, తల్లుల ఫొటో, బిడ్డల ఫొటో… ‘దృశ్యాదృశ్యం’ యాభయ్యవ వారానికి ఒక కానుక.

ఆనందం, అభిమానం, తృప్తితో.
వచ్చేవారం మళ్లీ కలుద్దాం. మరి, ధన్యవాదం.

– కందుకూరి రమేష్ బాబు

ramesh

ఒక నేల కన్నీరు

నీటిపై రాత్రి పరిచిన మౌనాన్ని 

ఒక్క వెలుగు పరుగులెత్తిస్తుంది. 

ఏళ్ళుగా మనిషి గుండెలో నెలకొన్న స్తబ్ధత ని 

ఒక్క అక్షరం బ్రద్దలు చేస్తుంది

”సొన కాలువల అపూర్వ పురా గాధ ” లెనిన్ ధనిశెట్టి వ్రాసిన 36  పేజీల చిన్న పుస్తకం చదివినప్పుడు నాకు కలిగిన భావం ఇది .

జీవితపు ఒడ్డున నడుస్తున్నప్పుడు ఎన్నో పోరాటాల చైతన్యపు  అలలు అక్షరాల నురగను అద్దుకొని మనను తాకి ఉలికిపాటును తెస్తూనే ఉంటాయి . కాని కొన్ని మన సమాంతర ఆలోచన దోరణి తో మమేకమై హృదయాన్ని ముంచేస్తూ ఉంటాయి .

”ప్రకృతి మన ఆశకు తగినంత ఇస్తుంది ,దురాశకు కాదు ”…. మహాత్మ గాంధి .

కోస్తా తీరం లో ముఖ్యంగా నెల్లూరు జిల్లా లో సముద్రతీర ఇసుక దిబ్బలలో తమకు తామే ఊరుతూ ఎన్నో వేల ఎకరాల పంటకు ఆలవాలం అవుతూ ముప్పై ఊర్లకు జీవాన్ని పోస్తూ పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తున్న రెండువందల వేల ఏళ్ళ క్రితపు ”సొన కాలువలు ” పారిశ్రామిక పాదాల కింద  స్వార్ధపరులకు సంపదలుగా మారుతూ ఎలా ఉనికిని కోల్పోతున్నాయో  చెప్పే పరిశోధన , వేదన , రోదన ల పుస్తకం ఇది .

దీన్ని ప్రచురించిన అనంతుడు ఫౌండేషన్ వారు దీని గూర్చి వివరిస్తూ  ”విభజనానంతరం సీమాంద్రకు ఇవ్వబోయే ఒక సామాజిక సమస్యను పరిచయం చేసే మొట్ట మొదటి స్నేహపూర్వక సాహిత్య కానుక ఇది ” అనడం దీనిలో ఉన్న రచయిత చిత్త శుద్ధి ని ,రచానా శైలిని మనకు పరిచయం చేస్తుంది .

ఒకానొక రోజు తనను తియ్యటి నీళ్ళతో చల్లటి నీడతో సేద తీర్చిన సొన కాలువలు ,తామే రచయిత ఆలోచనగా మారి తమ సమస్యల సాధన వైపు ఉపక్రమించేలా చేయడం …. రచయిత తన మాటల్లో చెప్పడం ఈ పుస్తకానికి మంచి శైలి ని చేకూర్చింది . ఇక రచయిత  సొన కాలువల మీద చేసిన చారిత్రక  పరిశోదనలు , తిరిగి తిరిగి సాధించిన సాక్ష్యాలు, సమస్యను ప్రతిబింబించిన శైలి …. సొన కాలువల ఆవేదన మన కళ్ళ ముందు కదిలి మోయలేని ఆవేదనతో పుస్తకాన్ని  ఆపకుండా చదివిస్తాయి . నిజానికి ఇదేమి కాలక్షేపపు పుస్తకం కాదు , కాని వర్తమాన సమస్యని మన గుండె గదిలో ఉంచి  ఆలోచనలో పడవేయాలన్న లెనిన్ గారి ఆలోచన సఫలం అయింది .

లెనిన్ ధనిసెట్టి

లెనిన్ ధనిసెట్టి

”సొన కాలువల సోయగాలు చూసాను. సంవత్సరాలు తరబడి అనేక ఋతువుల్లో, అనేక సమయాల్లో, నిశ్శబ్దంగా … సడి చేయకుండా వాటి ఉచ్వాస నిచ్వాసాలు వింటూ సొన కాలువలతో పాటు నేను  ప్రవహించాను ” అనే రచయిత మాటలతో మనం కూడా ఆ ఇసుక దారుల వెంట ,వాటి చారిత్రిక వైభవాల వెంట, వెన్నెల వెలుగుల వెంట ,అవి పండించే పాడి పంటల వెంట, వాటితో అల్లుకున్న జీవ సమూహాల వెంట ,తాటి చెట్ల గుంపుల వెంట, ఒక జియోలాజికల్ అద్భుతం వెంట , ఒక నిస్వార్ధ ఆశయం వెంట, ఒక తవ్వుతున్న నేలతల్లి గుండె మంట వెంట ….. మనసున్న మనిషిగా కదలిపోతాము .

తాను వ్రాసే ప్రతి వాక్యానికి సాక్ష్యంగా రచయిత చూపే ఒక వ్యాసమో, ఒక చరిత్రో ,ఒక జి . ఓ నో చూస్తూ ఉంటె ఒకింత ఆగి అతనిని అభినందించాలి అనిపిస్తుంది .

”The Earth has music for those who can listen ” అంటారు రచయిత ఒక దగ్గర. వినగలిగిన వాళ్లకి ఇందులో సొన కాలువల రోదన వినిపిస్తుంది. మనసుగల వాళ్ళని కదిలిస్తుంది. ఎక్కడో నెల్లూరు జిల్లా లోని సొన కాలువల సమస్యకి, దానిని మనముందు ఉంచిన  రచయితకి , ఎక్కడో నల్గొండ లో ఉన్న ప్రచురణ కర్తలకు ఉన్న సంబంధం ఏమిటి? ఇద్దరు అదే సముద్రం పై నుండి వచ్చిన మేఘాలు ఇచ్చిన నీరు తాగి భూమాత ఇచ్చిన గింజలు తిన్న ఋణం తప్ప .

”In man vs Nature ,nature laughs at last ” అంటారు రచయిత . ఇంకా చివరిగా ”Iam not in them,they are in mine ” అని ప్రకృతి తో తన మమేకాన్ని వివరిస్తారు. ప్రకృతి పై మమకారం కలిగి వాస్తవ జీవిత పధం లో దానికి ఏర్పడే ముప్పు గురించి హృదయమున్న మనిషిగా తెలుసుకోవాలి అనుకున్న ప్రతి వారు కొని చదవవలిసిన పుస్తకం.

Price:20/-

for orders: Anantudu Foundation, Kondagadapa (vi), Mothukuru (Mandal), Nalgonda Telangana. ph:9866061350

mail id :

doctorlenin@gmail.com, mothkurusrinivas@yahoo.co.in

 – వాయుగుండ్ల శశి కళ

మేమెగరడం నేర్చుకునే సమయాల్లో …

Amma Paapa

నీతో ఆడుకునే ఆ నీరెండ మలుపుల్లోనే, పంజరాలు వీడి బయటికొస్తాం. ఆ సాయంకాలపు గాలుల్లో మాత్రమే మాకూ రెక్కలొస్తాయ్. వెనుక కరి మబ్బు తెర, ముందర ఎగిరెళ్ళే తెల్లటి కొంగల్ని రోజూ చూస్తున్నా, ఏదో భావాన్ని భాషతో చిత్రించలేకపోయినట్టు, నీ వెనుక గిరికీలు కొడుతూ మేము చల్లే వెలుగుల్ని తూచలేరెవ్వరూ.

ఎక్కడిదో మంచు మల్లెపూలుగా మారి చారెడేసి కళ్ళలో చలువ పందిళ్ళు వెయ్యడం, ఒక్క వాన చుక్క వెయ్యి వాక్యాలుగా విడిపోయి, మనసు పల్లాలోంచి జారి గుండెలో ఊట బావిగా స్థిరపడటం, ఎక్కడ విరిసిన పూలో గుండె గోడల మీద ఆడుకోవడం, ఇప్పుడిక్కడున్నవాళ్ళందరూ అనుభూతిస్తారు.

అదిగో, విశ్వసంబరాల్ని సంధ్య ప్రమిదలోకి జార్చి, ఆకు కొసల్ని వెలిగిస్తోంది చూడు వెన్నెల. రెక్కలింక ముడుచుకుని, గూటికి తిరిగి చేరేముందు వెన్నెల్ని చుట్టేసి పట్టుకెల్దాం మర్చిపోకేం.

– ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

ఎవరైనా చేసేది వెదకడమే

Ramachandramouli

 

 

 

 

 

రాత్రి
తలుపులపై దబదబ చప్పుడు కొనసాగుతూనే ఉంటుంది
ఎవరు ఎవరిని ఎప్పుడు ఎందుకు పిలుస్తారో తెలియదు
ప్రక్కనే కిటికీ
గాలి ఒక రైలు కేకను ఇనుప చప్పుళ్ళతోపాటు మోసుకొస్తూ
టక టకా పట్టాలపై చక్రాలు పరుగెత్తుతున్న జీవధ్వని
యాత్రించడమొక వ్యసనం
గడపదాటిన ప్రతిసారీ
ఎవరైనా చేసేది వెదకడమే..రోడ్లను..మనుషులను..కాలపు పొరల లోతులను
ఒంటరిగా వెళ్ళడం..సమూహమై తిరిగి తిరిగి
మళ్ళీ ఒంటరిగానే తిరిగి రావడం
కొన్ని కూడికలు..కొన్ని తీసివేతలు..అంతే
ప్రశ్నలేమో పరుగెత్తే అరికాళ్ళకింది గాజుముక్కలు
కారుతున్న రక్తానికి ఉనికుంటుందా..చిరునామా ఉంటుందా
ఉక్కపోస్తూ ఉక్కిరిబిక్కిరౌతున్నపుడు
మార్చురీ గదుల మౌనరోదన..రక్తహీనతతో పాలిపోయిన చంద్రుడు
అర్థరాత్రులు బీట్ కానిస్టేబుల్ కంకకట్టె కణకణ చప్పుడు
అలసి నిద్రపోలేక దుఃఖించే రోడ్లు
ఎక్కడినుండో ఏడుస్తూన్న కుక్క స్పృహ
ఏదో జరుగుతోంది..అని తెలుస్తూనే
ఏదీ జరుగడంలేదన్న అసత్య నిర్ధారణ
శరీరంలోనుండి బయటకు వెళ్ళిపోవడం
ఎప్పుడో మళ్ళీ తిరిగి రావడం..అప్పుడప్పుడు రాకపోవడం
మరణమా అది.?

ఒక ఖాళీ ఊయల ఊగుతూంటుంది దూరంగా..ఒంటరిగా
ఇనుపగొలుసుల చప్పుడు గాలిని చెరుస్తూ
హృదయంనిండా ఒట్టి ఎడారి
ఇసుకతుఫానులో కొట్టుకుపోతూ ఒక నువ్వూ ఒక నేనూ
శేష నిశ్శేషాల స్పృహ
చేయిని విడిచి నువ్వు కోర్ట్ అవరణలోనుండి నడిచివెళ్తున్నప్పటి
నిశ్శబ్ద వియుక్తత
ఏమిటో..అన్నీ లెక్కలు లెక్కలుగా మనుషులు భాగించబడుతున్నపుడు
కన్నీటిని తుడుస్తున్న వ్రేలు విలువెంత..వ్చ్
కనీసం కంటినిండా నిద్రపోవాలన్న కోరికతీరని వ్యాకులతలో
అన్నీ స్వప్న ఖండాలే శకలాలు శకలాలుగా రాలిపడ్తూ
శేషరాత్రంతా వెదుక్కోవడమే ఎవరికివారు
ముసుగులు తొలగిపోతూ,రంగులు వెలిసిపోతూ
లోపలినుండి దహనం మొదలై మంటలు విస్తరిస్తున్నపుడు
కాలిపోయేదేదో..కాల్చబడేదేదో అర్థంకాని నిశ్చేష్ట –

చాలా దూరమే జరిగింది ప్రయాణం
కదలికలన్నీ వ్యూహాలని అవగతమౌతున్నపుడు
నీ నా చలనాలన్నీ
ఒట్టి అనిర్ధారిత సమీకరణాలే
జవాబు రాదు .. నడక ఆగదు
సరియన జవాబు రావాలంటే
సంధించబడ్తున్న ప్రశ్న సరిగా ఉండాలి
అనిర్వచిత గమ్యంవైపు ఎన్నాళ్ళని నడుస్తూనే ఉంటావు
ఆగు..ఆగి చూచుకో లోపలికి…తొంగి తొంగి గమనిస్తున్నపుడు
దిగుడుబావిలోకి వంగి చూస్తున్నట్టు భయమేస్తోందికదా – ఊc.

– రామా చంద్రమౌళి

 

Everyone has to search…eventually!

-Prof. Raamaa Chandra Mouli

 

It’s night

the banging on the doors continues

who knows who would call whom and for what reason !

Wind blowing through the window carried with it

Taktaka… taktakaa

a hooting and the live trundling noise of wheels on the rails

travel, an addiction

after we step out of the threshold, search is unavoidable:

searching for roads

searching for people

searching the layers of life…

alone we go, as a group we roam and roam

and return alone; some additions, some subtractions

that’s all.

All questions reduce themselves to shards

under the running feet…

does the oozing blood have any identity…an address?

When stifled in humid weather, silent tears are shed

within the confines of the mortuary rooms; bloodless, the moon

appeared pale…night is filled with tap…tap noise of the police-batons…

Unable to sleep, the tired roads weep in insomniac sorrow…

Cognizance of a dog’s wail from somewhere; something is happening…

but a false confirmation of nothing occurring…a feeling of

slipping out of the body and slipping back into it at an impromptu moment;

at times not returning to the body too…is that death?

 

A vacant swing keeps swinging afar…alone;

sound from the iron chains suspended to the swing scatter the wind

desert filling the hearts: a you and an I caught in a simoom

Awareness of all that’s left…

Din of forced separation…of your walking away from the court leaving my hand…

Can’t say anything…when people get divided based on estimates

what might be the value of those loving hands that wipe the tears?

Tch…in the agony of unfulfilled wish for a sound sleep everything is

segments of dreams dropping as fossils;  rest of the night is spent

in each searching for one’s self…the masks lift, colours fade while from within

internal combustion begins and spreads as flames, a shock at

the conundrum of what’s burning and what’s being burnt…

 

it’s quite a long journey.

When it’s realized that all movements are strategies

Your and my efforts are mere unproven equations…

There will not be any answers…the walk is never suspended…

Every answer depends upon the manner the question is put.

How long will you go on walking towards an undefined destination?

Stop…! Stop and look within…deep and deeper…

Aren’t you frightened as if you were bending to look into a very deep well?

 

(original evarainaa cheeseedi vedakatamee)

Transl. Prof. Indira Babbellapati

indira

ఓ ‘సీసా’ పద్యం!

10579813_4716432765869_1161298467_n

-మృత్యుంజయ్

మృత్యుంజయ్

మృత్యుంజయ్

“మన చరిత్ర మనమే చెప్పాలి, అందుకే ఈ సినిమా!”

10672304_573040749466414_4661177908740559609_n

సయ్యద్ రఫి పచ్చి తెలంగాణ వాడు. తెలంగాణ వాడిలో ఉండే కలిమిడి తత్వం రఫిలో కనిపిస్తుంది. తెలంగాణ సంస్కృతి, సంస్కారం అణువణువు జీర్ణించుకొని ‘నిజాయితే బలం’గా కనిపించే రఫిని నేను ఇంటర్యూ చేసే మొదటి వ్యక్తి కావడం నాకు గర్వంగా ఉంది. ఏ నటుడైనా దర్శకుడైనా టెక్నీషియనైనా పరిశ్రమలోని బడేబాబుల అండదండలు ఉంటే తప్పా ఎదగలేరు. కానీ సినిమా నిర్మాణంలో ఎటువంటి శిక్షణ తీసుకోకుండా, ఏ సినీ నిర్మాత గడప తొక్కకుండా, ఒక మారుమూల గ్రామం నుండి వచ్చిన సాదారణ వ్యక్తి తన అవకాశాన్ని తానే కల్పించుకొని, తన కళా సంపదనే పెట్టుబడిగా పెట్టి, చాలా వ్యయప్రయాసలతో నిజాయితితో దృడసంకల్పంతో స్వయంశక్తిని నమ్ముకొని కేవలం ఇరవైఐదు సంవత్సరాల వయసులో ‘మధురం’ సినిమా నిర్మించి విడుదల చేయడం అనేది సామాన్య విషయం కాదు.

ఆ సినిమాలోని ఇరవైనాలుగు శాఖల్లో కెమెరా, ఎడిటింగ్‌, మేకప్‌ శాఖలు మినహాయించి తన బహుముఖప్రజ్ఞలతో అన్ని శాఖలు ఆయనే స్వయంగా నిర్వహించడం ఓ ప్రపంచరికార్డు.. ఆ సినిమా సాదించిన విజయం చిత్రపరిశ్రమలో 2002వ సంవత్సరం నుండి చిన్నసినిమాలకు దారి చూపించింది. అప్పటి నుంచి లోబడ్జెట్‌ చిత్రాల ఒరవడి కొనసాగింది.

“ఇంకెన్నాళ్లు” సినిమాలో మూడు తరాల వాస్తవాలను ప్రజలకు చూపించడం కొన్ని శక్తులకు ఇష్టంలేక, సినిమాను అడ్డుకున్నప్పుడు ఆర్దిక భారాన్ని లెక్క చేయకుండా వాస్తవాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా, సినిమాను సిటికేబుల్‌ ద్వారా ప్రజలకు ఉచితంగా చూపించి, జనాన్ని జాగృతం చేయడంలో సఫలీకృతమై ఉద్యమానికి తోడ్పడిండు. సినిమా సాదించిన నంది అవార్డులు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకుపోయిన తీరు ఆయనకు సంతృప్తినే మిగిల్చింది.

ప్రస్తుతం ఆయన దర్శకనిర్మాణంలోనే విడుదలకు తుదిమెరుగులు దిద్దుకుంటున్న రెండు సినిమాలతో ఉత్సాహంగానే ఉన్నడు. మరోవైపు హైద్రబాద్‌ నగర ‘ఖైరున్నిసా’ చారిత్రాత్మక ప్రేమకథను హాలివుడ్‌లో చిత్రీకరించడానికి డైరెక్టర్‌గా అవకాశం రావడం ఆయనలో నూతనోత్తేజాన్ని నింపింది..

@ ‘ఖైరున్నిసా’ చరిత్రను హాలివుడ్‌లో డైరెక్షన్‌ చేసే అవకాశం ఎలా వచ్చింది?

– మన ఇంకెన్నాళ్లు సిన్మా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ జేసినప్పుడు కొంతమంది NRIలు దాన్ని షేర్‌ చేయడం చూడడం జరిగింది. UKలో స్కాటిండస్‌ ప్రొడక్షన్‌ లిమిటెడ్‌ అనే గ్రూప్‌ 1947 చరిత్రను బాగనే చూపియ్యగల్గినని ఒక నిర్దారణకొచ్చి ఇంగ్లీష్‌లో ఒక సిన్మా తీద్దాం అది మన డక్కన్‌ హిస్టరీకి సంబందించి కులీకుతుబ్‌షా ఇంకా మన నిజాం కాలంనాటి చూపించతగ్గ కథ ఏదీ ఉన్న పర్వాలేదని నాకు తెలియపర్చిన్రు. తెలంగాణ హిస్టరీ సొసైటిలో తడకమల్ల వివేక్‌ నాకు పరిచయం కాబట్టి తెలంగాణలో మరుగున పడిపోయిన చరిత్ర, సిన్మాకు పనికొచ్చే కథ కోసం సంప్రదించడం జరిగింది. అప్పడు వాళ్లు నాకు ‘సలాం హైద్రబాద్‌’ అనే బుక్‌ ఇచ్చిన్రు. ఆ బుక్‌ల రకరకాల టచ్చెస్‌ ఉన్నయ్‌ కాబట్టి ఆ బుక్‌ మీరు సదివితే మీకు నచ్చేదేదన్న ఉంటే మీకు సిన్మాకు పనికొస్తుందని చెప్పారు.

అయితే నేనా బుక్‌ సదువుతూ సదువుతూ పోతావుంటే ఒక నాలుగు పేజీలు ఖైరున్నిస గురించి కూడా సదివిన అంత బుక్‌లో ఆమె గురించి నాలుగే పేజీలు ఉన్నప్పటికీ అది నన్ను టచ్‌ చేసిందన్నమాట. అది ఎందుకు టచ్‌ చేసిందంటే ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రిలేషన్‌ మీద తీయడానికి చాన్స్‌ ఉంటది. మంచి యూనివర్సల్‌ సబ్జెక్ట్‌ ఐతది. సినిమా అన్నప్పుడు మతాలు కులాలు అని కాకుండా ఒక ఆకర్షణ, ఆత్మీయత, ఆత్మానుబందం అనేవి ఎవరితోనైనా ఎవరికైనా ఐతదని ఆకథల కనిపిస్తది.

అటు ఇంగ్లీషొల్లు ఇటు దక్కన్‌ ఇస్లామీలు ఉన్నరు కదా సమాజానికి గ్లోబల్‌గా రెండు సంస్కృతులు సూపించొచ్చు అనే భావన కలిగింది నాకు. ఎందుకంటే చారిత్రాత్మకంగా ఎన్నో సిన్మాలు వచ్చినయ్‌గని మనసును రంజింపజేసే ప్రేమే సక్సెస్‌ అయింది. ఇప్పుడు టైటానిక్‌ సిన్మాలో షిప్‌ స్టోరి ఉన్నప్పటికీ అందులో అంతర్లీనంగా ఓ దనవంతురాలికి ఒక గరీబోడికి మద్య ఉన్న ప్రేమనే టైటానిక్‌ సిన్మాను నడిపించింది. ఐతే ప్రేమ ఇది బాగుంటదని డిసైడ్‌ చేసుకొని ఆ బుక్‌లో ఆయన రాసిన రెఫరెన్సెస్‌లోని వైట్‌మొగల్స్‌ అవి ఇవి కూడా సదివిన.

ఐతే ఆ ‘వైట్‌ మొగల్స్‌’ బుక్‌ రాసిన విలియం డార్లింపుల్‌ ఏక్‌నెంబర్‌ బట్టెబాజ్‌ అనిపించింది నాకు. మొత్తం చరిత్రనే ఇంగ్లీషొల్లను హైలెట్‌ చేస్తూ వాళ్లు చేసిన బద్మాష్‌ పనులు కప్పిపుచ్చి ఇక్కడునొల్లందరిని బేకార్లు, బేకూబ్‌లనట్టు రాసిండు. మనమేమో ఆకథను సూపిచ్చేటట్టు లేదు చెప్పేటట్టు లేదు రేపు వచ్చే తరాలుగూడ అదే నిజమనుకునే ప్రమాదం కూడా ఉంది. ఐతే నేనొక సిన్మా వాన్ని కాబట్టి ఒక ఫిలింమేకర్‌గా పుస్తకాలు రాయకున్నా, నా సినిమా ద్వారా అసలు హిస్టరీ ఏందనేది ఆ బుక్‌ రాసిన వారికి దీటుగా ఎవరిది తప్పో నిరూపించుకుంటూ, ఉన్నదున్నట్టు యదార్దగాదను ఉన్న వాస్తవాలను కళారూపంగా చూపించే ప్రయత్నంగనే ఒక బాద్యతగా భావించి ఈ కథను ఎన్నుకున్న.

10628497_549147898523967_2784754594223428916_n

@ ఆ కథపై మీరు చేసిన పరిశోధన ఏంటి?

– పుస్తకాలే గనక తీసుకుంటే వారు వక్రీకరించిన చరిత్రే ఉంటది. ఐతే బతికున్న ముసలొల్లు, పాత నవాబుకాలం నాటి వాళ్లు వారి పెద్దల ద్వారా విన్నవి కూడా ఉంటయ్‌. కొందరు పెద్దపెద్ద జర్నలిస్టులుంటరు కదా పాశం యాదగిరి లాంటొళ్లు ఉంటరు కదా పెద్దపెద్దొల్లు వాళ్లను కూడా సిన్మా అని చెప్పకుండనే అసలీ ‘ఖైరున్నిసా’ ఏంది అని తెలుసుకున్న. సుల్తాన్‌బజార్‌ పోయిన అక్కడ లొకేషన్లు సూశిన, చౌమహల్లా ప్యాలెస్‌ డైరెక్టర్‌కాడికి పోయి మాట్లాడిన ఒక ఖైరున్నిస అనే ఇన్నోసెంట్‌ అమ్మాయిని ఎట్ల ఎక్స్‌ప్ల్రాయిడ్‌ చేసింన్రు అనేది వీళ్లు రాసిన చరిత్రలో ముఖ్యంగ ఉన్నది. ఖైరున్నిసను పొందడానికి కిర్క్‌ పాట్రిక్‌ తన పేరే మార్చుకున్నడు పెళ్లి కూడ నిఖా రూపంల చేసుకున్నడు. ఆయన పేరు సుల్తాన్‌ అని మార్చుకోవడంవల్ల ఇప్పుడు సుల్తాన్‌ బజార్‌కు ఆ పేరొచ్చింది. తర్వాత ఆమెకు పుట్టినటువంటి బిడ్డలను కూడా ఆమెకు చూసే యోగ్యం లేకుండా ఇంగ్లీషొల్లు పట్టుకపోయింన్రు. నా ప్రకారంగా నేనేమంటున్నానంటే ఆకర్షణ ఉండొచ్చు, ప్రేమగూడ ఉండొచ్చు. కాని ప్రేమ అనేది ఒకర్ని పటాయించుడు గిట్లాటివి ఉండయ్‌. ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకునేవి ఉంటయ్‌. వారిద్దరు కూడా ఒకరి కోసం ఒకరు జీవించడం కూడా స్వచ్ఛమైన ప్రేమ ఇద్దరి మద్య నాకు కనిపించింది. తర్వాత చేసే పనులు ఏదైతే ఉన్నయో అది తప్పు. దాంట్లో ఇవ్వన్ని విషయాలు ఎంతబాగున్నయంటే చూసేటోనికి కూడా ఆలోచింపచేసి మనసును టచ్‌ చేయగల్గుతం అన్నట్టు. మనం కరెక్టుగా పాత్రలను తీయగలగడం అనేది చాలెంజింగ్‌గా ఉంటదనేది నా అభిప్రాయం.

@ ‘ఖైరున్నిసా’లో నటీనటులెవరు? వారి ఎంపిక ఎట్లుంటది?

– క్రిక్‌పాట్రిక్‌, రస్సెల్‌ వంటి పాత్రలకు అక్కడ బ్రిటీష్‌ లేక స్కాటీష్‌ యాక్టర్‌ల కోసం యాడ్‌లు కూడా ఇచ్చిన్రు ఆడిషన్‌గూడ మొదలైంది. ఇక్కడ నాదే లేటుంది ఖైరున్నిసగా ఒక కొత్త హీరోయిన్‌ ఉండాలని చెప్పిన. హైద్రబాద్‌లగాని, డిల్లీలగాని ఖైరున్నిస, ఖైరున్నిస బందువుల పాత్రలు వెతకాలిగ. నేనింక ఆడిషన్‌ ఎందుకు మొదలు పెట్టలేదంటే నేను ఏదైతే కమిటై ఉన్ననో ఇంకో వారం పదిరోజులల్ల అన్ని ముగించుకొని నేనిగ ఖైరున్నిస వేటనే ఫస్టు ఉంటదిప్పుడు.

@ ఇంతకు ముందు మీ సినిమాల్లాగ ఈ సినిమాలో మీరు నటిస్తున్నరా?

– లేదులేదు. నేను జస్టు డైరెక్టర్‌నే డైరెక్షనే పెద్ద క్యారెక్టర్‌ నాకు. అది కరెక్ట్‌ చేస్తే చాలు నాకు. ఇంకోటేంటంటే అనుకోకుండా మాటల మద్య నేనొక నాలుగైదు లైన్‌లు ఉర్దుల కొన్ని గజల్స్‌ వాళ్లకు చెప్పిన. అది విని నన్నే మ్యూజిక్‌ చేయమంటున్రు. ఇంగ్లీషొల్లకు అల్పసంతోషం వుంటది. ఈ సిన్మాలో కవ్వాలీలు, సూఫియానా మ్యూజిక్‌ బ్యాక్‌గ్రౌండ్‌ చేయాల్సి ఉంటది అది వాళ్లు నన్నే చేయ్యమంటున్రు. మ్యూజిక్‌ అనేది నా అభిరుచే ఇంకెన్నాళ్లు సినిమా అన్నిట్లో కూడా సందర్బానికి తగినట్టుగా చెయ్యగల్గిన ఐతే ఎవరైన సమర్దులు ఉంటే వారికి బాద్యతలు అప్పగిస్త. సంగీతానికైతే పెడితే రెహమన్‌నే పెట్టాలే లేకపోతే రెహమన్‌ అంతటి టాలెంటై ఉండాలి.

@ మీరు ఇంగ్లాండ్‌లో ఉన్న NRIలతో అక్కడికి వెళ్లి కలిసిన్రా లేకుంటే ఇక్కడ్నుంచే సంప్రదింపులు చేసిన్రా?

– వాళ్లను కలవక ముందే హైద్రబాద్‌ హిస్టారికల్‌ సబ్జెక్ట్‌ గురించి ఇండియాలో ఉన్నప్పుడే కథ చెప్పిన. వారి కోరిక మేరకు రడీ చేసుకున్న. ఒక సంవత్సరం క్రీతం UKలో ఉన్నవారి పిలుపు మేరకు ఇంగ్లాండ్‌ కూడా వెళ్లడం జరిగింది. వెళ్లిన తర్వాత వారితో ముఖాముఖి చర్చలు కూడా చేసిన. అక్కడున్న లొకేషన్లు కూడా చూసి సినిమా ప్రొడక్షన్‌ ఎట్లుంది అన్ని స్టడీ చేసుకొని, విలియం వర్డ్‌స్‌వర్త్‌ ఉన్న ఇల్లు కూడా చూసి అక్కడ నెలరోజులు ఉండి వచ్చిన. అక్కడ వాళ్లు చెప్పేదేమంటే ఇక్కడ మొత్తం మేం సెట్‌ చేసుకున్న తర్వాత మీకు మేం తెలియపరుస్తం మీరు మాత్రం మీ ప్రిపరేషన్ల మీరు ఉండురి. మేం ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు మీరు సిద్దంగా ఉండాలే అని చెప్పిన్రు. నేనొక డైరెక్టర్‌గా నేనేం డిమాండ్లు, కండీషన్లు ఏం పెట్టలే నాకు నేనున్న నాస్థాయికి నాకా అవకాశం రావడమే ఒక వరం.

వాళ్లది ఎట్లుంటదంటే పక్క డాక్యుమెంటేషన్‌లాగా ఉంటది. మన హైద్రబాద్‌ కల్చర్‌ కూడా ఇంగ్లీషొల్లకు చూపిస్తే బాగుంటదనే థాట్‌ కూడా వాళ్లకు ఉన్నట్టుంది. వాళ్లు నన్ను ఎంచుకుంటానికి కారణం ‘ఇంకెన్నాళ్లే’ ముఖ్యమైన పునాది అన్నట్టు. దాంట్లె పాత జమాన తెలంగాణ యాస, భాష, కట్టుబొట్టు మన హద్దులో ఉన్న బడ్జెట్‌తోని ఏదైతే సానుపు వాకిళ్లు పెంకుటిండ్లు, మట్టిగోడలు, మోటబావి, పటేలు, పట్వారీ, దొర గడీలు, దొరసాన్లు ఇవన్ని ఏదైతే సూపియ్యగల్గినమో అక్కడ వాళ్లకు అది నచ్చి ఇంకెన్నాళ్లు సిన్మాకు కాంప్లిమెంట్‌ ఇచ్చి నన్ను పిలవడం జరిగింది. అది చూసి చరిత్రమీదనే తీయాలనే ఇంట్రెస్టు వాళ్ళకు కలిగిందన్నట్టు. ఐతే ఆ చరిత్రకు అక్కడొల్లు వచ్చి డైరెక్షన్‌ చేసేదానికంటే నేనొక ముస్లీం తెలుగు కూడా వస్తది అని ఆలోచించి నన్నే చేయమని చెప్పిన్రు. అక్కడ UKకు పోయినప్పుడే తెలంగాణ NRI ఫోరం కూడా నాకు మెమొంటో ఇచ్చి సన్మానం చేసిన్రు.

@ మరి ఇంతకాలం ఈ విషయం ఎందుకు చెప్పలేదు?

– ఐతే ఇప్పటికి గూడా ఈ సిన్మా గురించి బయట పట్టే ఉద్దేశ్యం లేదు నాకు. ఎందుకంటే సినిమా ప్లాన్‌జేసుడు వేరు, తయారవుడు వేరు, రిలీజ్‌ అవుడు వేరు ఎన్నో ఉంటయ్‌ దాంట్ల. అది చెప్పినంత సులువుగా ఉండది కాబట్టి దాన్ని ప్రాక్టకల్‌గా జరిగినప్పుడే బయటకొద్దాం అనుకున్న. కాని అది ఎట్ల బయట పెట్టిన్నో చెప్తనీకు. వారం రోజుల క్రీతం ది హిందూ పేపర్లో రెసిడెన్సీ బొమ్మపెట్టి, చౌమహల్లా ప్యాలెస్‌ బొమ్మపెట్టి ఖైరున్నిసా సినిమా రాబోతుంది అని ఒక వార్త ఒచ్చింది. అది సదివి నేను పర్షానైనా ఖైరున్నిస గురించి నేను కాకుండా ఇంకెవడన్నా తీస్తుండా లేకుంటే నేనిచ్చిన కథనే ఏమన్న ఇంకేదన్నా జరుగుతుందా అని వందడౌట్లు వస్తయ్‌గదా మనం ఆలోచించుకున్న కథ గురించి ఎవడు తీస్తుండో పేపర్ల లేదు. ఐతే నేను హిందూ పేపర్‌ ఎడిటర్‌కు మేయిల్‌ రాశిన. ఈ కథ గురించి నేనొక సంవత్సరం నుంచి ప్లాన్‌ చేసి ఉన్న కాని మీ పత్రికల వచ్చినట్టు ఆ సినిమా ఎవరు చేస్తున్నరో వివరాలు కావాలని నేను ఈమేయిల్‌ చేసిన.

ఆ ఈమేయిల్‌ ఏమైందంటే యూనుస్‌ లసానియా అని ఆ వార్త రాసిన జర్నలిస్టుకు ఆ ఎడిటర్‌ ఫార్వర్డ్‌ చేసిండు. అది చూసి ఆ యూనుస్‌ లసానియా నాకు ఫోన్‌ చేసి రఫిబాయ్‌ మీరు ఖైరున్నిసా మీద సినిమా తీస్తున్నరట కదా ఎప్పుడు కలవాలే అని అడిగిండు. ఒకరోజు కలిసినప్పుడు నేను ఆవార్త గురించి అడిగితే, ఏం లేదు ట్విట్టర్‌లా విలియం డార్లింపుల్‌ రెండు సంవత్సరాల తర్వాత ఇది సినిమా తియ్యెచ్చు అని ఒక హింటిచ్చిండు ఓహో దీని మీద ఈయన ఆలోచిస్తుండా అని పేపర్ల రాసినం అంతే అని ఆ జర్నలిస్టు చెప్పిండు. తర్వాత మనం తీయబోయో ఖైరున్నిసా వివరాలు తీస్కొని హిందూ పేపర్ల ఫోటోతోని మంచిగనె కవరేజిచ్చి బూస్టప్‌ ఇచ్చిండన్నట్టు. మనం ఇగ మార్కెట్‌ల బయటపడ్డం. ఇగ తప్పదిగ అన్ని పేపర్లకూడా ఇచ్చిన్రు. హిందూల వచ్చిన ఆర్టికల్‌ను అటాచ్‌ చేసి స్కాటీష్‌ వాళ్లకు మేయిల్‌ చేసిన. అయితే వాళ్ల నుంచి నాకు ఫోనొచ్చింది మేమే ఫోన్‌చేద్దాం అని రడీగున్నం మీరు సిద్దమైపోన్రీ 2015 జనవరిలో మొదలు పెట్టి 2015 డిసెంబర్‌ చివరినాటికి కంప్లీట్‌ చేసేటట్టు ప్లాన్‌చెయ్‌, నువ్వు ఏదైన కమిట్‌ అయిన పనులున్నాగని అన్ని ఫినిష్‌ చేసుకొని వచ్చే సంవత్సరానికి మీరు మాకోసం ఫ్రీగా ఉండాలని నాకు ఫోన్లో తెలియజేసింన్రు.

photo.php

@ తెలంగాణ ఉద్యమంలో బాగంగా ఓ ఉద్యమకారుడిగా మీరు సినిమాల్లో సభలలో రోడ్లపై సోషల్‌మీడియా ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి చాలా కృషి చేసింన్రు. ఆ ఉద్యమ స్పూర్తితో తెలంగాణ సినిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌? అట్లనే సినిమా ప్రొటెక్షన్‌ ఫారం స్థాపించి పది జిల్లాల్లో కమిటి వేశారు దాని అవసరం ఎందుకొచ్చింది. దాని లక్ష్యాలు ఏంటి?

– ఉద్యమాన్ని దగ్గర్నుంచి చూసిన్నప్పుడు, ఇండస్ట్రీలో సీమాంద్ర రాజకీయ శక్తులను చూసినప్పుడు, నాకేం అనిపించిందంటే వట్టి సినిమా వాళ్లతోనే ఏది కూడా జరగదు. తెలంగాణల ఉన్నొల్లే తక్కువ మంది అది కూడా సీమాంధ్రులపై ఆదారపడేటొల్లే ఎక్కువ. తెలంగాణ ఉద్యమకారులకు కూడా దీని మీద అవగాహన లేదు. దీనికి మద్దతిచ్చేవారు కూడా ఉండరు. ఇదంతా గ్రహించి సినిమా పరిశ్రమలోనే సంఘాలుగా ఏర్పాటుచేస్తే ఒక గుర్తింపు ఉంటది. తెలంగాణ అసోషియోషన్‌ అట, ఆంధ్రా అట అనేది ఫస్ట్‌ క్రియేట్‌ చెయ్యాలే. ఎందుకంటే ఆంద్రొల్లు మనమంతా ఒకటే మనది తెలుగు అంటున్రు కాబట్టి మనం వేరు అనే విషయాన్ని తెలియజేయాలె. అందులో బాగంగా తెలంగాణ సినిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ దర్శకనిర్మాతల మండలి అని అనిపించుకోవడం జరిగింది ఇది ఫస్ట్‌ ఆపరేషన్‌. తెలంగాణ లైక్‌మైండెడ్‌ పీపుల్‌తోని తెలంగాణ రాకముందే ఆ సంఘాలను ఏర్పాటు చేయడం జరిగింది.

తర్వాత సెకండ్‌ ఫేజ్‌ ఏందంటే ఈ సంఘాలు సినిమాలల్ల పనిచేసి కార్డులున్నొల్లకే అవకాశం ఇస్తున్నరు కాని బయట ఉన్న ప్రేక్షకులు మేదావులు, సిన్మా మీద క్రిటిక్స్‌ రాసేవాల్లు, సినీ గోయర్స్‌ ఇది కూడా ఒక వర్గం ఉంటది కదా వీళ్లందర్ని గూడ “తెలంగాణ సినిమా ప్రొటెక్షన్‌ ఫారం” అని పెడితే సినిమా కళాకారులకు సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు పంపిణిదారులకు ఎగ్జీబీటర్లకు అండగా నిలుస్తుంది.

‘తెలంగాణ సినిమా ప్రొటెక్షన్‌ ఫారం’ ద్యేయం ఏందంటే ఇప్పుడున్న వ్యక్తి పూజల విదానాలన్నింటిని మార్చేసి ఒక మంచి అభిరుచి మన సంస్కృతి సంప్రదాయాలు, నవరసాలున్న తెలంగాణ బతుకులను ప్రేమించేదిశగా ఆస్వాదించే దిశగా మోటివేట్‌ చేసేవిధంగా పనిచేయడం. అదేవిధంగా ఒక పెద్ద స్టార్‌ యొక్క కొడుకు మనవండ్లకు పెద్దఫ్యాన్స్‌ ఉంటరు. తెలంగాణల కొత్తకొత్తగా వచ్చేటోనికి ఉండరు. కాబట్టి మన సమాజమే అతనికి ఫ్యాన్స్‌. ఒక పెద్ద కంపెని సినిమా వస్తే మంచిగ నడిచే సినిమాను హాలు నుంచి తీసేసి అహంకారంతో వాళ్ల సినిమా ఏసుకునేది ఇప్పుడు కొనసాగుతుంది. అలాంటివి జరిగినప్పుడు మన వాళ్ళు తెలంగాణ సినిమా ప్రొటెక్షన్‌ ఫారం మద్దతుతో అన్యాయాన్ని అడ్డుకుంటరు. ఎవడన్న కష్ఠపడి వస్తే వాళ్లను ఆదుకునుడే దీని ద్యేయం. ఇట్లాంటివి ఎన్నో ఉన్నయన్నట్టు. సియంతో ఒక మీటింగ్‌ పెట్టించినం. ఇంకా మన ఇండస్ట్రీనే వేరుకాలే.. రెండువేల ఎకరాలు కూడా తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి ఇస్తం అని సియం చెప్పేశిండు. ఇచ్చిన రెండువేల ఎకరాలలో తెలంగానొల్లు దాంట్లె గడ్డి పీకాల్నా, చెట్లకు నీళ్లు పోయాల్నా ఆయన వైఖరి చెప్పలే.ఇవన్ని నిర్బయంగా నిర్మోహమాటగా అడిగే వేదిక కూడా ‘తెలంగాణ సినిమా ప్రొటెక్షన్‌ ఫారం’ చేస్తుంది.

ఫస్ట్‌ సినిమాలు తీస్తేనే కదా ఇండస్ట్రీ అయ్యేది. మనం సిన్మాలు తియ్యకుంటే సర్కారు మనకు అండగా ఉండాలే.. ఆంధ్రొల్లు ఎట్లైతే సబ్సిడీలు ఇచ్చిండ్రో మనక్కూడా ఇవ్వాలే ఐతే దాని గురించే వేయిట్‌ చేస్తున్నం. త్వరలో ఏమన్న ఇస్తరేమోనని అనుకుంటున్నం. ఇయ్యకుంటే మూమెంట్‌ తీసుకుంటం.

@ మరి మనకు ధియేటర్లు కూడా అందుబాటులో ఉండాలె కదా?

– రైతుబజారులాగ మండలానికో మినీ ధియేటరు పెడితే రేటుగూడా తక్కువ ఉంటది, జనాలకు దగ్గరగా ఉంటది. వచ్చిన సొమ్ము అటు సర్కారు ఇటు తీసినోడు పంచుకోవొచ్చు.

@ ఇప్పుడే చేస్తున్న సినిమాలు ఏంటి?

‘మిస్టర్‌ రాహుల్‌ పక్కా ప్రొఫెషనల్‌’ సినిమా విడుదలకు తుదిమెరుగులు దిద్దుకుంటుంది. ‘జమీన్‌ హమారే ఫిర్‌ బీ పరాయే’ ఉర్దూ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది.

రఫీ సినిమా “ఇంకెన్నాళ్ళు? ” లింక్ ఇదీ… https://www.youtube.com/watch?v=gml73-SBqqQ&feature=youtu.be

ఇంటర్వ్యూ: మామిడి అమరేందర్

10364116_523464131092344_837543891470561885_n

‘అపరిచితం’ చదివాక…నాలుగు మాటలు!

10665717_10202781489839700_1209189682660945809_n

మొదటి పుటలలో కనబడిన స్ఫటికపు వాన రంగు అక్కడే చాలా సేపు ఆపేసింది. 1993 నుంచీ 1999 వరకూ మీరు రాసిన ఏవీ చదవలేని కారణాన, ఆ అబ్బురం. ‘ సమకాలీన సాహిత్యం ‘ నాకు ఆ రోజులలో దగ్గరగా లేదు, ఇప్పటిదాకా పశ్చాత్తాపమూ లేదు.
సగటు పాఠకురాలిగా , ఒక రచన వాస్తవాధారం అని తోచేటప్పుడు – నిజమెంత, కల్పనెంత అని ఎంచే చాపల్యం నాకూ ఉంటుంది. ‘ తేరా నాం ‘ చదివేప్పుడూ ఉండింది, ఆశ్చర్యకరంగా, ఇప్పుడు లేదు. మీ తాండవనృత్యపు పాట కి ఏ చిరుగీతి కారణం అన్నది అప్రధానం అనే తెలివిడి వచ్చింది. :) మీరు అంతగా ఊరించినా ‘ ఆమె ‘ ని వెదికే పని పెట్టుకోలేదు.
అవయవాలు దానం చేయటం పట్లనా మీ అసహనం, దాన్ని ప్రకటించటం పట్లనా ? ‘ సామాజిక స్పృహ ‘ డాగు  అంటని వైయక్తికపు స్వచ్ఛత కి – మరి పనికిరానిదాన్ని తగలబెట్టేయటమే సరైనదనిపిస్తుందా ? ఎలాగ ?
ఎవరెవరో తెలియని మనుషులు, వారిలో తెలుసుకోవలసిన కోణాలు. మీ ఆరాధ్య కవి కి మీరు చెప్పుకోలేనివి, ఆ వైపునుంచి అందుకోలేనివి – ” అట్లా అని పెద్ద బాధా లేదు ” ?
దారి తల ఎత్తునింత సౌందర్యలవము వదలిపోలేదు చంపెడువరకు మిమ్ము !!! ఏమి బాధ పడతారండీ, నా వంటిదానికి చీవాట్లు పెట్టలనిపిస్తుంది, ఆ తర్వాత ఎందుకు పాపం, ఇంత … అని జాలి కానిదేదో.
” ఈ భ్రష్టశాంతిని, బాధామయకాంతిని భరించలేదు కాబట్టే నా అస్తిత్వం వర్షాన్ని నిరాకరించిందేమో ” నాకు తెలిసి ఎవరూ చెప్పని పద్ధతి. నాకొకప్పుడు [బహుశా ఇప్పటికీ ] సంగీతాన్నీ, వెన్నెలనూ అందుకూ భరించే  శక్తి లేదు, నా సాంత్వన వర్షం లో, పుస్తకాలలో.
ఈ రాజ్ బీర్ ఉదంతమంతా , పాయల్ హడావిడి అంతా…వ్యాఖ్య లేదు.
” ఉన్న పడవల్ని ఒక్కొక్కటే ముంచేస్తే ఒడ్డుకు చేర్చేదేది ? ” తెలిసీ ఎందుకిలా ? లేదేమో, మీ నావ భద్రమేనేమో – నా ఆశా, ఆశీస్సూ.
ఒక పసి కూతురు దొరకటమన్న వరాన్ని వైన వైనాలుగా వర్ణించుకున్నది ఆయన కాదనీ మీరేననీ నమ్మకం.
భానుమతి గారి పాట ని దగ్గరగా వినేందుకు కాళ్ళకు అడ్డం వచ్చినవన్నీ తొక్కేసుకుంటూ అడ్డగోలుగా పరుగెట్టి మోకాలి చిప్ప బద్దలు కొట్టుకున్నది…అదీ మీరే.
అయ్యేదీ కాదు, పెట్టేదీ కాదు, ఆ ప్రయత్నం ఉన్నట్లే లేదు, మీ పిచ్చి వరసలూ మీరూనూ. :)
శాకాహారం- అమ్మయ్య !
” జగత్ కల్యాణం అంటే మాదిగాక ఇంకేదనిపించింది ” వాహ్ !
గచ్చకాయ రంగు మస్లిన్ చీర తో మొదలెట్టిన వివరం, మీరు అనుకొనో, అనుకోకో- అచ్చంగా చండీదాస్ ది నాకు. [లేకపోతే మస్లిన్ చీరలు ఇప్పుడెవరు కడతారు, కట్టినా ఆ పేరుతో ఎవరు పిలుస్తారు ? ] టేకు మాను రంగు పూలు…:) టేకు పూలకీ ఒక వింతైన రంగు ఉంటుందని ఈ మధ్యే చూశాను.  మా అమ్మాయికి ఆ వాక్యాలు చదివి వినిపించాను. చివరి వాక్యం మటుకు అచ్చంగా మీ సృష్టే… ” చెస్ట్ నట్స్ ని రెండుగా చీల్చిన పావుకోళ్ళు ” – కళ్ళముందు కనబడిన కందిన పాదాలు.
అవును -బావుంది, ఆమె ప్రేమలో పడినప్పుడు.
చలం గారు వెతుక్కున్న ఐడియల్ షీ ఎక్కడా ఉండదని, ఉండనక్కర్లేదని, అర్థమైపోతే బావుండును. లత  గారు వంశీమోహనుడి గురించి వెతుక్కున్నారు, ఈ ప్లేన్ లో కాదు దొరికేది. అందుకు అశాంతి పడరాదు, పోగు చేసిన కాసినిపూలతో చిన్న ఇల్లు కట్టుకోగలిగితే, ఈ జన్మకి , చాలు.
తండ్రి పోయిన బాధ…ఒక్కతే కూతురికి, ఎంతో- తెలుసు అని చెప్పటం ఇష్టం కానంత పవిత్రం నాకు.
ఏమంత వయసు మీరింది మహా ప్రభో , పింకీ ని ఆ స్థితిలో ఊహించుకుందుకు, తానెంత నొచ్చుకొని ఉండాలి ఆ రాత చదివి. లేదా ? ఈ ఉన్మత్త పితృపాదులు వాళ్ళిద్దరినీ షాక్ చేయటం మానేశారా ? అయితే మంచిదే.
” అస్థిసంచయనమంటే …” ఇక నా వల్ల కాదు. ఏమరుపాటుగా చదివిన పాపానికి ఆయన మాటలు నిద్ర లో కూడా వీడవు ” అంతె, పేరునకంతె …” – ఒద్దు. ఇంకనీయను.
ఈ వేదనలేవీ తాకని లోలోపలి ఆనందంతో తృప్తితో మీ   ముగ్గురు ‘ ష ‘ లతో నూరేళ్ళు వర్ధిల్లండి.

 

Published by Facebook Friends & Folks.

for copies- All leading book stores.

అన్నదమ్ములు

Three_Brothers_1828
ఒకప్పుడు ఒకాయనకి ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఆయనకి వాళ్ళు ఉంటున్న ఇల్లు తప్ప వేరే ఆస్తి ఏమీ లేదు. ఇల్లు కాస్త పెద్దదే.ఆయనకి ముగ్గురు కొడుకులమీదా సమానమైన ప్రేమ. తన తర్వాత ఇల్లు ఎవరికి వచ్చేలా చేయాలో తేల్చుకోలేకపోయాడు. అమ్మేసి డబ్బుని సమంగా పంచవచ్చు, అయితే కొన్ని తరాలనుంచీ తమ కుటుంబానికి చెందినది కాబట్టి ఇంటిని అమ్మేందుకు ఆయనకి ఇష్టం లేదు. చివరికి ఒకరోజు ముగ్గురినీ పిలిచి ఆయన ఇలా అన్నాడు
” మీరు బయటి ప్రపంచం లోకి వెళ్ళి తలా ఏదో ఒక విద్యో, వృత్తో, వ్యాపారమో నేర్చుకోండి. మూడేళ్ళ తర్వాత ఎవరు వాళ్ళు నేర్చుకున్నదానిలో ఎక్కువ ప్రావీణ్యం సాధిస్తారో వారికి ఇల్లు రాసి ఇస్తాను ”
కొడుకులకి ఆ ఆలోచన నచ్చింది. పెద్దవాడు కమ్మరి పని నేర్చుకుందామనుకున్నాడు. రెండోవాడు మంగలి అవాలనుకున్నాడు. మూడోవాడు కత్తిసాము నేర్చుకుందామని. అందరూ బయలుదేరి వెళ్ళారు.

MythiliScaled
అదృష్టం కొద్దీ ముగ్గురికీ మంచి గురువులు దొరికారు. ఎవరికి వారు ఆ విద్యలు చివరంటా నేర్చుకుని మంచి పనితనం సంపాదించారు. ఎంతో నిపుణుడు కావటాన కమ్మరికి రాజు గారి గుర్రాలకి నాడాలు తొడిగే అవకాశం వచ్చింది. ” ఇల్లు నాకే వస్తుంది. సందేహం లేదు ” అనుకుంటుండేవాడు.
మంగలి దేశంలో గొప్ప సంపన్నులకీ పెద్ద అధికారులకీ క్షవరం చేయగలిగేవాడు. అతనూ తనే పోటీలో నెగ్గుతాననే అనుకున్నాడు. కత్తి సాము నేర్వబోయినవాడికి గట్టి దెబ్బలే తగిలేవి. అయితే వాటిని ఓర్చుకునేవాడు . ” ఈ దెబ్బకి భయపడిపోతే ఇల్లు ఎలా దక్కుతుంది ? ” అని తనకి తాను చెప్పుకుంటూ ఉండేవాడు.
feature_1.jpg2
అలా మూడేళ్ళూ గడిచాయి. ముగ్గురూ ఇంటికి తిరిగి వెళ్ళి తీరిగ్గా కూర్చుని తమ విద్యలని ఎలా చూపెడదామా అని మాట్లాడుకుంటున్నారు. అంతలో దూరం నుంచి ఒక కుందేలు వస్తూ కనిపించింది ”మంచి సమయానికి వచ్చావు ” అని మంగలి సబ్బూ నీళ్ళూ సిద్ధంగా పెట్టుకుని ఆ కుందేలు పరుగున వాళ్ళని దాటి వెళ్ళే లోగా దాని మీసాలని పూర్తిగాగొరిగేశాడు. దాని ఒంటి మీద ఒక్క గాటు పడలేదు, ఒక్క వెంట్రుక చెదరలేదు. ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది.
” భేష్ ! చాలా బాగా చేశావు నాయనా ! తక్కిన ఇద్దరూ నిన్ను మించకపోతే ఇల్లు నీదే ” అని తండ్రి అన్నాడు.
కాసేపటికి ఆ దారి వెంట ఒకరు వేగంగా రథాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. ” నాన్నా, చూడు. ఏం చే స్తానో ” అంటూ కమ్మరి ఆ రథం వెనకాల పరుగెత్తాడు. నాలుగు గుర్రాల గిట్టలకీ ఉన్న నాడాలు తొలగించి, రథం వేగం ఏ మాత్రం తగ్గకుండానే మళ్ళీ నాలుగు గుర్రాల పదహారు కాళ్ళ గిట్టలకీ కొత్త నాడా లు తొడిగేశాడు. నడిపేవాడికి ఇదంతా జరిగిందనే తెలియలేదు.
grand12
” చాలా తెలివిగలవాడివిరా నువ్వు. నీ తమ్ముడికి తెలిసినంతా నీ విద్య నీకూ తెలుసు. ఎవరు గొప్పవారో చెప్పలేకపోతున్నాను ” అన్నాడు తండ్రి.
మూడోవాడు ” నేనూ కాస్త చూపించనీ నాన్నా ” అంటుండగానే వాన కురవటం మొదలైంది. అతను కత్తి దూసివిసవిసా తన తలమీద తిప్పటం మొదలుపెట్టాడు. అది ఎంత వేగంగా చేయగలిగాడంటే ఒక్క చినుకు కూడా అతని మీద పడలేదు. వాన అంతకంతకూ పెద్దదయింది. చివరికి తగ్గుముఖం పట్టింది. అంతసేపూ అతను ఇంకా ఇంకా వేగంగా కత్తి తిప్పుతూనే ఉన్నాడు. వాన వెలిశాక, అప్పటిదాకా ఇంట్లో ఉంటే ఎంత పొడిగా ఉండవచ్చో అంత పొడిగా ఉన్నాడు.
అబ్బురంగా చూస్తూ ఉన్న తండ్రి అన్నాడు ” నువ్వే ముగ్గురిలో గొప్ప విద్య చూపావు. ఇల్లు నీకే ఇస్తున్నాను ”
అన్నలిద్దరూ కూడా అతని నేర్పు ఎక్కువదని ఒప్పుకున్నారు. అతన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. అంతకుముందువరకూ ఏది జరగాలని కోరుకున్నాడో తీరా అది జరిగాక మూడోవాడికి అంత బాగా అనిపించలేదు. . అతను చెప్పాడు ” అన్నయ్యలూ, మీరు ఎక్కడికీ వెళ్ళద్దు. అందరం ఇక్కడే ఉందాం ”
వాళ్ళు ఉండిపోయారు. తమ వృత్తులలో చాలా నైపుణ్యం ఉన్నవారు కనుక ముగ్గురూ చాలా డబ్బు గడించగలిగారు. పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లా పాపా కలిగాక ఆ ఇంటిమీదే మరో రెండు అంతస్థులు వేసుకుని జీవితాంతం సుఖసంతోషాలతో గడిపారు.

జర్మన్ జానపద కథ
సేకరణ -Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

తెలంగాణ తెగువ కొండా లక్ష్మణ్‌

 

sangisetti- bharath bhushan photokonda laxman

ఎట్టకేలకు తెలంగాణ తన చరిత్రను తాను రాసుకుంటోంది. తొక్కి వేయబడ్డ గొంతుకలు ఇప్పుడు సరాయించుకొని మా వాటా మాకు దక్కాలని నినదిస్తున్నాయి. రాజుల చరిత్ర, వాళ్లెక్కిన గద్దెల చరిత్ర మాకొద్దంటుంది. అభివృద్ధి నుంచి ఆమడ దూరం నెట్టేయబడ్డ, అణచబడ్డ జాతుల కోసం, మార్జినలైజ్‌డ్‌ వర్గం కోసం, వాళ్లకు రెండు పూటల పట్టెడన్నం కోసం, ఇంత ఆత్మగౌరవం కోసం కొసదాకా కొట్లాడిన వారి జీవితం ఇవాళ చరిత్రకెక్కాలి. పాఠ్యపుస్తకాలై పరిఢవిల్లాలి అని నవ తెలంగాణ కోరుకుంటుంది. చరిత్ర సృష్టించడమే గాకుండా ప్రత్యేక తెలంగాణ సౌధానికి పునాదులేసిన వారిని విస్మరించరాదు. సౌధాలు పైకెంత సుందరంగా ఉన్నా వాటి మనుగడ మాత్రం అందుకు వేసిన పునాదులపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి బలమైన పునాది వేసిన మహనీయుడు, అణచబడ్డవారి గొంతుక, తెలంగాణ ఉద్యమ బావుటా, ఉద్యమకారుల అండ కొండా లక్ష్మణ్‌ బాపూజి. ఈ సెప్టెంబర్‌ 27 ఆయన శతజయంతి సంవత్సరం ఆరంభం కానుంది.

75 ఏండ్ల సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉండి వారి అభ్యున్నతే తన అభ్యున్నతిగా భావించి పనిచేసిన కార్యశీలి బాపూజీ. 1940లో న్యాయవృత్తి చేపట్టినది మొదలు చివరి శ్వాస వరకూ పీడితుల పక్షాన, పేదల పక్షాన నిలబడి ఆనాటి ఏడో నిజాం ఉస్మానలీఖాన్‌ మొదలు ఆధిపత్య భావజాలంతో, అహంకారపూరితంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి వరకూ ఎవరినీ వదిలి పెట్టలేదు. తన, పరాయి బేధం లేకుండా అన్యాయాన్నెదిరించాడు. దౌర్జన్యాలను ప్రశ్నించిండు.

నిజాం ‘నిరంకుశ’ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, బాధ్యతయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ అనుయాయులు ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో మూడో మార్గంగా నిజాంపై బాంబుదాడి చేసి రాచరికానికి చరమ గీతం పాడాలని కొండా లక్ష్మణ్‌ బాపూజీ వ్యూహం పన్నిండు. నారాయణరావు పవార్‌, జగదీష్‌ ఆర్య, పాలమాకుల గంగారాం, జి.నారాయణస్వామి, బాలకిషన్‌లతో కలిసి పథకాన్ని రచించిండు. 1947 డిసెంబర్‌ నాలుగు నాడు నిజాం కారుపై బాంబుని నారాయణరావు పవార్‌ విసిరిండు. దీనికంతటికి మూలకారకుడు కొండా లక్ష్మణ్‌ బాపూజి. క్విట్‌ ఇండియా ఉద్యమంతో ప్రజా జీవనం ప్రారంభించిన బాపూజీ 1945లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి అడ్వకేట్‌గా రాణిస్తూనే ప్రజా ఉద్యమాలతో మమేకమయ్యిండు. హైదరాబాద్‌ అసెంబ్లీకి 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యిండు. ముల్కీ ఉద్యమంలో ప్రజల పక్షాన నిలబడిరడు. ఆ తర్వాత డిప్యూటి స్పీకర్‌గా, మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసిండు.

kaifiyath

1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కాసు బ్రహ్మానందరెడ్డికి అండగా నిలబడి ఉన్నట్లయితే ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అయ్యేవాడు. కాని తెలంగాణ ప్రజల పక్షాన నిలబడడమే గాకుండా అందరికన్నా ముందు మంత్రి పదవికి రాజీనామా చేసి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ బావుటై ప్రతి గ్రామంలో రెపరెపలాడిరడు. ప్రజల్ని చైతన్య పరిచిండు. 1969లో ‘తెలంగాణ ముచ్చట్లు’ పేరిట ఇంగ్లీషు తెలుగు భాషల్లో పుస్తకాన్ని రాయడమే గాకుండా, ఉద్యమ సమయంలో సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజా ఉద్యమాలకు ఊతమిచ్చిండు. తెలంగాణ ప్రజాసమితిలో ప్రముఖ పాత్ర పోషించిండు. చెన్నారెడ్డి, సదాలక్ష్మి, జి.వెంకటస్వామి తదితరులతో కలిసి ఉద్యమాన్ని నడిపించాడు. ఆనాటి ఉద్యమ కాలంలో ప్రతి రోజు బాపూజీ ఉద్యమ కార్యాచరణ పత్రికల ఫ్రంట్‌ పేజి శీర్షికలయ్యాయి. 1969 మొదలు కన్ను మూసేవరకూ ప్రత్యేక తెలంగాణ కోసం పరితపించిండు. ప్రత్యేక తెలంగాణను కండ్ల సూడకుండనే 2012లో కన్ను మూసిండు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా బాపూజీ కీలక పాత్ర పోషించాడు. 90 యేండ్లు దాటిన వయసులో కూడా అటు ఢల్లీి మొదలు ఇటు తెలంగాణలో గల్లీల వరకు గ్రామస్థాయి కార్యకర్త మొదలు జాతీయ స్థాయి నాయకుల వరకు ఎంతో మందితో కలిసి పనిచేసిండు. కేసిఆర్‌, గద్దర్‌, మందకృష్ణ, విమలక్క, బెల్లయ నాయక్‌, యూనివర్సిటీ విద్యార్థులు, వివిధ జాక్‌లు, సకల జనులు, సబ్బండ వర్గాలతోటి, తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికీ కొండంత అండగా నిలబడిరడు. ఒకదశలో మందకృష్ణ మాదిగ బహుజన ముఖ్యమంత్రిగా బాపూజీని ప్రతిపాదించిండు. అందుకు అందరు సహకరించాలని ‘రాజకీయ’ డిమాండ్‌ చేసిండు. 2009 డిసెంబర్‌ తొమ్మిది ప్రకటన తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట తప్పడంపై ఢల్లీిలో డిసెంబర్‌ చలిలో దీక్షకు దిగి కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వంలో కదలిక తీసుకొచ్చిండు. కరుడు గట్టిన తెలంగాణ వ్యతిరేకి లగడపాటి రాజగోపాల్‌ని సైతం ఇంటికి పిలిచి తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షపై ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేసిండు. ఇవ్వాళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బహుజనుల్లోకి చొచ్చుకు పోవడానికి, చైతన్యం పొందడానికి బాపూజీ కార్యాచరణే ప్రధాన కారణం. తెలంగాణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసిన నిస్వార్థుడు.

konda-2కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపనకు తన ‘జలదృశ్యం’ను వేదికగా చేసిండు. అంటే 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే బాపూజీ ఇంట్లో. టీఆర్‌ఎస్‌ పార్టీకి ‘జలదృశ్యం’ను వేదికగా చేసినందుకుగాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా అందులో నుంచి బాపూజీని ఖాళీ చేయించాడు. వృద్ధాప్యంలో కిరాయి ఇండ్లల్లో ఉండాల్సిన దురవస్థ ఏర్పడిరది.

తెలంగాణ కోసం సర్వం ధారబోసిన బాపూజీ అటు సహకార రంగంలోనూ, వెనుకబడిన తరగతుల అభ్యున్నతి పేరిట సామాజిక న్యాయం కోసం, మండల్‌ కమీషన్‌ అమలు కోసం, నేతన్నల ఆకలి చావుల నివారణ కోసం, బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమాలు నడిపిన ధీశాలి. బాపూజీ అనేది కొండా లక్ష్మణ్‌ తండ్రి పేరు. అయితే తన గాంధేయవాద ఆచరణతో, ఆహార్యంతో నిజమైన ‘తెలంగాణ గాంధి’గా నిలిచిండు.

ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వమే ఈయేడాది మొత్తం ‘శత జయంతి’ ఉత్సవాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి. ఆయన జీవిత చరిత్రను సాధికారికంగా రాయించి ప్రకటించాలి. 25 యేండ్లు శాసనసభ్యుడిగా, డిప్యూటి స్పీకర్‌గా, మంత్రిగా ఉండి తెలంగాణ జనసామాన్యానికి సేవ చేసిన బాపూజీ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలి. ఆయన నివసించిన ‘జలదృశ్యం’లో బీసి స్టడీ సెంటర్‌ని ఏర్పాటు చేసి బహుజన ఐఎఎస్‌, ఐపిఎస్‌లను తయారు చేసేందుకు శిక్షణ నిప్పించాలి. ఇదేదో మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించుకునే వరకు నిరంతర ప్రయత్నం సాగాలి. ఈ స్టడీ సెంటర్‌కు తగినన్ని నిధులు కేటాయించి నిజాయితీ గల ఐఎఎస్‌ అధికారికి బాధ్యతలు అప్పగించి జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిభకు మెరుగులు దిద్దాలి. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్‌ 27ని ‘బీసి సాధికారత’ దినంగా ప్రకటించి అన్ని రంగాల్లో బీసిలకు జనాభా దామాషాలో వాటా దక్కేందుకు, అందుకు చట్టంలో మార్పులు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. ‘బీసి సబ్‌ప్లాన్‌’ని ప్రకటించి వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ సబ్‌ప్లాన్‌ సాధన కోసం అన్ని వర్గాల వారు ఐక్యంగా కృషి చేయాలి. బాపూజీ కలలుగన్న సామాజిక న్యాయం తెలంగాణ ప్రజలందరికీ దక్కడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

ఎగిరే పావురమా! – 12

egire-pavuramaa12-banner-1

పక్కనే ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయంలో, పురాణ కాలక్షేపం ముగిసినట్టుంది. మైకు మూగబోయి హడావిడి తగ్గింది. రెండు రోజులుగా కళ్ళతో చూడలేకపోయినా, ఇలా పక్కమీదనుండే వినగలుగుతున్న పురాణ కాలక్షేపం చెవులకి అమృతంలా ఉంది. సాయంత్రాలు ఓ రెండుగంటల సేపైనా కాలు నొప్పిని, బాధని మరచిపోగలుగుతున్నాను… ప్రతిరోజూ నాలుగు నుండి ఆరు గంటల వరకు మరో వారమంతా జరుగుతుందంట ఆ కార్యక్రమం.

ఈ పూట వినవచ్చిన ప్రసంగంలో, ఆ అయ్యవారు చెప్పిన విషయాలు నా గుండెల్ని సూటిగా తాకాయి…

…..’కష్టనష్టాలకి, సుఖధు:ఖాలకి అతీతమైనది కాల గమనం.
కాలానికి అతీతులై కూడా ఎవరూ లేరు
’…..అన్న మాటలకి, ………..
మనసంతా గజిబిజిగా అయిపొయింది.

‘నేను – పుట్టిన ఊరిని, పెంచిన తాతని వదిలొచ్చి మూడున్నర సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయని గుర్తొచ్చింది.
ఈ మూడేళ్ళలో నా జీవనం ఎన్నో మలుపులు తిరిగి, ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొని, మనస్సు అయోమయంలో కొట్టుమిట్టాడుతూనే ఉందని కూడా’ గుర్తొచ్చింది.
తాత ప్రాపకం నుండి బయటపడితేనే నా జీవనం మెరుగవుతుందని, సరైన వైద్యం చేయించుకోవడానికి వీలవుతుందని, అందుగ్గాను సాయపడతానన్న కమలమ్మని నమ్మాను అప్పట్లో…

పద్దెనిమిదేళ్ళు నిండగానే, తాతనుండి నాదైన డబ్బు, ఆస్తి ఇప్పుంచుకోవచ్చని, ఆ తరువాత పట్టణంలో వైద్యం చేయించుకొని నా బతుకు బాగుచేసుకోవచ్చన్న కమలమ్మ మాటతో ఇన్నాళ్ళూ కాలం వెళ్ళబుచ్చాను.
అదే ఆశతో, తాత మీద చాలా బెంగగా ఉన్నా, గుబులుగానే గడుపుకొస్తున్నాను.

…… ఆలోచనలతో ….. గుండెలు బరువుగా తోచాయి….. గొంతు తడారి పోతుంది. ఆపరేషనయ్యి, ఆసుపత్రి మంచంపై కదలకుండా ఉంటూ, మూడు రోజులుగా వేసుకుంటున్న మందులతో, నోరంతా చేదుగా అయిపొయింది.

మంచినీళ్ళన్నా అడుగుదామని తల పైకెత్తి చుట్టూ చూసాను. ఆసుపత్రి ఆయా గాని, నర్సు గాని కనబడలేదు. పిలవలేను…
వాళ్ళూ టైం ప్రకారంగా వస్తున్నారులా ఉంది. ఆగి చూద్దామనుకున్నాను..
నిముష నిముషానికి ఎక్కువౌతున్న కాలుపోటుకి స్పృహ పోతున్నట్టుగా అయిపోతుంటే గట్టిగా కళ్ళు మూసుకొన్నాను.
నొప్పి, దాహం, మగతగా ఉంది……
మరికాసేపటికి అలాగే నిదురలోకి జారుకున్నాను….

egire-pavurama-12-1
**
“ఇదిగో అమ్మాయ్, లేచి నీ మందులేసుకో,” గట్టిగా భుజం పట్టుకు కుదుపుతుంది ఆసుపత్రి ఆయమ్మ.
అతి కష్టంగా కళ్ళు తెరిచి, ఆయమ్మ సాయంతో, తలగడనానుకుని కూర్చుని, వేడి కాఫీ నీళ్ళతో మందేసుకున్నాను. తల భారంగా ఉంది…

“బల్ల మీద బన్ను, అరటిపండు పెట్టారుగా! తినలేదే?….. చూసుండవు…. …ఇప్పుడు తిని నీళ్ళు తాగు…. మందులతో నొప్పి, భారం తగ్గిపోతాయిలే. ఇక ఈ రాత్రికి ఇంతే….. మీ అవసరాలకి నైట్ డ్యూటీ ఆయమ్మ ఉంటది. రేపు తెల్లారుతూనే డాక్టరు వస్తారు. ఇక నేనెళుతున్నా,” అని చెప్పి వెళ్ళిపోయిందామె…

నా పక్కనే కొత్తగా వచ్చిన పేషంట్ అనుకుంటా… బాధగా ఏడుస్తూ, మూలుగుతుంది….
గదిలో ఐదారుగురు రోగులు. అందరూ ఏదో ఒక బాధతో మూలుగుతూనే ఉన్నారు….

నేను ఆసుపత్రిలో జేరి ఇవాల్టికి మూడో రోజు.
వొంటికి ఇంత నొప్పంటూ ఉంటుందని, డాక్టర్లు నా కుడి కాలు మోకాలు వరకు తీసేసినాకే తెలిసింది. నొప్పితో, వొళ్ళంతా బండబారిపోయింది…….

నా మంచం ఎదురుగా తెరిచి ఉన్న వాకిలి నుండి కాస్త చల్లనిగాలి వీస్తుంది. వర్షం మొదలయ్యేలా ఉంది..
ఈ నొప్పి ఒర్చుకోడం ఎలాగో తెలీడం లేదు… ఇప్పుడు మింగిన మందుతో నొప్పి తగ్గి నిద్ర పోతానని చెప్పింది ఆయమ్మ. కళ్ళు మూసి వెనక్కి వాలాను….

గత రెండేళ్లగా ‘మదర్ తెరెసా అనాధాశ్రమం’ కి పనిచేస్తున్నందుకు, వారు చూపుతున్న ఉదారతే, నాకు రాబోతున్న ఈ కృత్రిమ కుడికాలు.
ఈ ఉచిత వైద్యం కోసమే, క్రైస్తవ మతం పుచ్చుకోడానికి, “మదర్ తెరెసా” లోని క్యాంటీన్ కి నామమాత్రపు జీతానికి రోజంతా పనిచేయడానికి ఒప్పుకోక తప్పలేదు…

ఈ ఆపరేషన్ చేయించాలని, ఆమె స్నేహితుడు ప్రహ్లాద్ జేమ్స్ తోను, ‘మదర్ తెరెసా’ వైద్యులతోను సంప్రదించి, నిర్ణయించింది కమలమ్మే.

అప్పట్లో తాత నన్ను వంశీ సంస్థకి డబ్బు కోసం అమ్మేస్తున్నాడని, వాళ్ళు కృత్రిమ కాళ్ళు పెట్టించి వెట్టి చాకిరీ చేయిస్తారని భయపెట్టింది కూడా ఆమే.
మరిప్పుడు మోకాలి నుండి కృత్రిమ కాలే నాకు సరయిన చికిత్సని నిశ్చయించింది. అదేమని అడిగే నోరు గాని, ధైర్యం గాని నాకు లేవు.

పోయిన వారం నాకు పద్దెనిమిదేళ్ళు నిండిన సందర్భంగా కమలమ్మ, ముందుగా ఈ ఆపరేషన్ జరిగవలసిన రోజు నిర్ధారించింది. రెండో పనిగా, పొలం – డబ్బు – కొట్టాం అడుగుతూ, నా చేత తాతకి ఉత్తరం రాయించింది. మూడో పనిగా – గోవిందుతో త్వరలో నా పెళ్ళని ‘మదర్ తెరెసా అనాధాశ్రమం’ లో అందరికీ చెప్పింది,…

తాతకి ఉత్తరం పంపిన మరునాడే, ఊరికి దూరంగా ఉన్న ఈ ఆసుపత్రిలో, నా ఆపరేషన్ జరిపించేసింది కమలమ్మ.

ఈ ఆపరేషన్, మా కొలువులు, ప్రహ్లాద్ జేమ్స్ అనే వ్యక్తి చలవేనంటుంది కమలమ్మ. కమలమ్మకి స్నేహితుడు, శ్రేయోభిలాషి అయిన ప్రహ్లాద్ జేమ్స్, మూడేళ్లగా మా జీవితాలకి సూత్రధారి. అతను గీసిన గీటు దాటకుండా, అతను చెప్పింది చేస్తుంది ఆమె.

కొత్త ఊళ్ళో, సత్రంలో దిక్కు తోచక సతమవుతున్న మా ముగ్గిర్ని ఆదుకొని, ఏడాదిపాటు తన క్యాంటీన్ లో, తరువాత రెండేళ్ళగా ‘మదర్ తెరెసా’లో మమ్మల్ని కొలువులకి పెట్టింది అతనే అవడంతో, మరి అతని మాట వేదవాక్కు కమలమ్మకి…..
ఆలోచనలతో తల మరింత మోద్దుబారింది… మందువల్లేమో, నొప్పి తగ్గినట్టుగా మగతగా నిద్రలోకి జారుకున్నాను…..
**
“అమ్మాయ్, లేలే, తెల్లారుజామున నాలుగయింది. రాత్రంతా ఈ గదిలో అందరూ ఒకటే మూలుగడం. కసేపన్నా నిద్రలేదు.. ఓ వరస మీ అందరి పనులు చూసి, నిన్ను రెండో పక్కకి తిప్పి, పోయి మళ్ళీ తొంగుంటా,” అంటూ కుదిపి లేపింది రాత్రి డ్యూటి ఆయమ్మ…
బయట సన్నని జల్లు మొదలైంది. సుతిమెత్తగా గాలి గదిలోకి వీస్తుంది. తిరిగి నిద్ర పోదామనుకుంటే, మళ్ళీ కాలు నొప్పెట్టడం మొదలైంది.

‘నొప్పి’ తోచగానే కమలమ్మ గుర్తొచ్చింది…గోవిందుతో పాటు.

కమలమ్మని చూసి రెండు రోజులౌతుంది.. మనస్సుకి హాయిగా ఉంది…నిత్యం మాటలతో, చేష్టలతో కాల్చుకుతినే ఆమె నుండి విశ్రాంతి.
ఇక గోవిందు – సరేసరి..ఆమె చేతిలో కీలుబొమ్మ.
అప్పుడప్పుడు తాగి వాగుడు, అరుపులు కూడా.
అయినా అతనంటే నాకు మన్ననే. రెండేళ్లగా, చదువుకునేందుకు సాయం చేస్తున్నాడు. స్కూల్ పుస్తకాలు కావాలని అడగంగానే, నా కాడనున్న ఏడో తరగతి పుస్తకాలు పట్టుకెళ్ళి అనాధాశ్రమం టీచర్లతో నా విషయం మాట్లాడాడు. చర్చ్ లైబ్రరీ నుండి ఎనిమిదో తరగతి పుస్తకాలు పైసా ఖర్చు లేకుండా తెచ్చిపెట్టాడు.
అసలు ఈ ఊరొచ్చిన కాడినుండి కూడా ఇతరత్రా పుస్తకాలు, పత్రికలు, పేపర్లు వీలున్నప్పుడల్లా దొరకపుచ్చుకొని తెచ్చిస్తుంటాడు. కమలమ్మలా కాదు గోవిందు…

ఆలోచనల్లో మెల్లగా తెల్లవారుతుంటే, నా కాలు నొప్పిలా, బయట వర్షం మాత్రం ఉధృతంగా మారింది……
వర్షం పడ్డప్పుడల్లా, తాత గురించిన ఆలోచనలు నన్ను మరింతగా కమ్ముకుంటాయి.
‘గాయత్రీ,’ అనే తాత పిలుపులోని ఆప్యాయత ఎంతగానో గుర్తొస్తుంది. తాత మాట వినబడక యుగాలైనట్టుగా అనిపిస్తుంది.
తాతకి నేను చదువుకోడం ముఖ్యమనే, వెంట తెచ్చుకున్న ఏడవ తరగతి పుస్తకాలు మొదలుకొని వదలకుండా చదువు సాగిస్తూనే ఉన్నాను. పుస్తకాలు – చదువే నాకు ఊరటనిచ్చే తోడయ్యాయి. లోకం తీరు కాస్తైనా తెలుసుకోగలుగుతున్నాను.
వర్షంలోకి తీక్షణంగా చూసాను. తొలిపొద్దు వెలుగుల్లో మెరుస్తున్న వెండి తీగల్లా ఉన్నాయి వర్షపు ధారలు.
ఇలాంటి హోరెత్తే వర్షంలోనే నేనానాడు సొంత మనుషులని వదిలి- అంతగా తెలియని వాళ్ళతో తెలియని జీవనంలోకి పరుగెత్తాను.
అప్పటి స్థితిలో, ఆ వయస్సులో ఆ నిర్ణయం దిద్దుకోలేని తప్పుగా మారిందా?
బతుకులో పెనుమార్పులు తెచ్చి, నేనూహించని ప్రపంచంలో నన్ను నిలబెట్టిందా?
ఆ నాటి నా తలంపు సరయిందా? అని నిత్యం నిలదీస్తుంది మనస్సు.

నేనాశపడ్డట్టుగా ఏమీ జరగకపోగా, తాత కాడికి తిరిగివెళ్ళే దారి తోచక, అలవాటులేని అడ్డమైన కొలువులు చేస్తూ కమలమ్మ చేతిలో పావుగా మారిపోయాను…….ఇక ఈ ఆపరేషన్ తో అందరిలా రెండు పాదాల మీద అయితే, నడుస్తానన్న ఆశ సగం హరించుకుపోయినట్టే….ఓ కాలు కృత్రిమ కాలే మరి….

ఇలా సాగుతున్న ఆలోచనలకి ఆనకట్టు వేసింది, పొద్దున్నే డ్యూటి మారిన ఆయమ్మ బొంగురు గొంతే….

“లే పిల్లా లే, డాక్టరమ్మ వచ్చేలోగా, నీ పనంతా కానివ్వు. తిని, వేడి నీళ్ళతో మందేసుకో… అదేలే వేడి కాఫీ నీళ్ళతో మందేసుకుంటే నొప్పి, నీరసం పోతాయి,” నవ్వుతూ నన్ను పట్టి పైకి లేవడానికి సాయం చేసింది…….,.

నా చుట్టూ సర్దుతూ, “అవునూ మీ వదిన, నీ కాబోయే పెనిమిటి మళ్ళీ రాలేదే? ఇవాళ వస్తారేమోలే! మొత్తానికి, దుర్మార్గుడైన మీ తాత బారి నుండి పారోపోయొచ్చావంటగా! పోనీలే, మంచి పనే చేసావు…మనువయ్యాక కూడా నిన్ను బాగానే చూసుకుంటాడులే ఆ అబ్బాయి,” గబగబా అంటూ కదిలిందామె…
విననట్టే నేల చూపులు చూసాను….ఆమెకా సమాచారం అందించింది కూడా కమలమ్మేగా!.
ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన రోజు మధ్యానం, డ్యూటీలో ఉన్న ఈమెకి, కమలమ్మ చెప్పని సంగతి కాని, ఆడని అబద్దం కాని లేదని తెలుసు…తను చెప్పేవే నిజమని అందర్ని నమ్మించాలని చూస్తది కమలమ్మ …

“ఇదిగో, మళ్ళీ నేనొచ్చేలోగా ఈ బన్ను, పండు తినేసేయి. నీ కట్టు మార్చి మందులిస్తాను,” అని వెళ్ళింది ఆయమ్మ.

గోవిందుతో నా పెళ్ళంటూ ఆయమ్మ అన్న మాటలే గుర్తొస్తున్నాయి.
గడిచిన ఏడాదిగా మాత్రం, ఇలాగే ఎందరికో నా పెళ్ళి మాట చెబుతూ ఉంది కమలమ్మ..
..నన్ను ఉద్ధరించడానికే తనూ, తన తమ్ముడు కంకణం కట్టుకున్నామని చెబుతుంది. వయస్సుకి రాగానే, నేను తాత నుండి నా ఆస్థులు ఇప్పించుకున్నాక, నన్ను కాపాడ్డం కోసం, అదే త్యాగ గుణంతో నన్ను తమ్ముడుకిచ్చి పెళ్ళి జరిపించేస్తానని,,, అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి కూడా పని కట్టుకుని చెబుతుంది.

మొదట్లో నాకు చిరాకు ఏవగింపు కలిగేవి, కమలమ్మ నోటెంట నా పెళ్ళి మాటలు..
ఇప్పుడసలు పట్టించుకోను…

“ఈ అవిటిదాన్ని నాకు కట్టబెడతానంటావ్. దీన్ని కట్టుకుంటే, నా బతుకు హాయిగా గడుస్తాదని బలవంతబెట్టి, నాకిష్టం లేందే ఊరు కూడా దాటించావు.
అది సంపాదించడమే కాక, దాని తాత పొలం, కొట్టాం వస్తాయని కానిమాటలు సెబుతుంటావు…
నాకు బతుకు మీద ఇష్టం పోయింది,” అంటూ కమలమ్మ మీద విరుచుకు పడ్డాడు పీకల వరకు తాగేసి ఒకటి రెండు సార్లు, ఈ మధ్య గోవిందు.
వల పన్ని ఈ అక్కాతమ్ముళ్ళు, నన్నో పథకం ప్రకారమే తాత నుండి వేరు జేసారని తెలిసినప్పుడు కోపంతో గుండెలు మండిపోయాయి. అప్పటికే తాతని వదిలొచ్చి రెండున్నరేళ్ళు గడిచిపోయాయి కూడా…

ఏమీ చేయలేని ఆ స్థితిలోనే, కాస్త ఊరటనిచ్చిన విషయం మాత్రం – కమలమ్మ దండోరా వేసే పెళ్ళి మాటలకి, నాతో పాటు గోవిందుకి కూడా ఎటువంటి విలువా లేదని.
(ఇంకా ఉంది)

మగకాలువ

katta pic

 

 

 

 

 

నారాయణ.. నారాయణ బ్రహ్మలోకం లో తల్లిదండ్రులకు నమస్కరించాడు నారదుడు
అప్పుడు కూడా తాతగారి పేరును ఉచ్చరించడం మర్చిపోనేలేదు.
కుశల ప్రశ్నలయ్యాక భూలోకం ఎలాగుందని అడిగారు బ్రహ్మ, సరస్వతులు.
వాళ్ళకు తెలియక కాదు కానీ. కొడుకుతో ముచ్చటించడంలో వున్న సంతోషం కోరుకుంటున్నారో లేక నిజంగానే లోతైన కారణంవుందో.

‘‘ అది తప్పకుండా చెపుతాను అమ్మా నాన్నలూ ముందుగా నాదో సందేహం తీర్చండి. మీరు నిరంతరం జీవులను తయారు చేసే పనిలోవున్నారు కదా? అసలు జీవికీ నిర్జీవికీ ముఖ్యంమైన తేడా ఏమిటి? లోకం లో సంచరించేటప్పుడు నాకు చాలా సార్లు ఈ సందేహం కలిగింది. నిర్జీవ పదార్ధాలకు మీరు ఏ ముఖ్యమైన లక్షణాన్ని చేర్చడం ద్వారా వాటిని మీరు జీవులుగా మార్చుతున్నారు.’’ మరోసారి మోకరిల్లుతూ అడిగాడు.
‘‘దేవ రహస్యమే అడిగావు నారదా. కానీ నీవడిగాక చెప్పక తప్పుతుందా? అయినా త్రిలోక సంచారివి నీకు తెలియనిదా? నీవేమనుకుంటున్నావో ముందొక మాటచెప్పు’’ నాలుగు ముఖాల్లో ఒక ముఖం మాత్రం నారదుడివైపు ప్రశ్నిస్తే, మరో ముఖం దేవివారివైపు సాలోచనగా చిద్విలాసంగా నవ్వటం నారదుడి కళ్ళలోంచి తప్పుకోలేదు. అయినా ఈ ప్రతిభోధనా పద్దతి  గురించి ఎరిగిన వాడే కావడంతో తనకు తెలిసింది చెప్పటం ప్రారంభించాడు నారదుడు. ‘‘బహుశా చలనాన్ని కలిగివున్నాయా లేదా అనేదాని ఆధారంగానే స్థావర, జంగమాలంటున్నాం కాబట్టి దీన్నే ప్రధాన వ్యత్యాససూత్రంగా తీసుకోవచ్చనుకుంటాను’’ కొంచెం అనుమానంగానే నసిగాడు నారదుడు.
‘‘కాదు’’ అనుకున్నంతా అయ్యింది తప్పనేసాడు బ్రహ్మ తన వివరణతో పాటుగా ‘‘ గ్రహగతులూ, సాగరకెరటాలూ చలనాన్ని కలిగే వుంటాయి అయినా అవి నిర్జీవుల జాబితాలోనే వున్నాయి కదా అలాగే వృక్షాలు స్థానచలనం లేకున్నప్పటికీ అవి జీవులే… మరింకేమైనా ఆలోచించగలవేమో చూడు నారదా?..’ రొట్టె ఇవ్వడం కాదు తయారుచేసుకోవడం నేర్పాలన్న సూత్రంలాగా నారదుడికి విషయాన్ని భోధించే పనిలో పడ్డాడు బ్రహ్మ. ‘‘సరే మరోక్క ప్రయత్నం మాత్రం చేస్తాను. ఈసారి దోషముంటే, సమాధానం మీరే చెప్పాలి మరి’’ నారదుడు ముగింపు ముహూర్తాన్ని కూడా సిద్దంచేస్తూ చెప్పాడు. ‘‘ ఆహారాన్ని తీసుకోవడం అంటే జీర్ణక్రియ, గాలిని పీల్చుకోవడం అంటే శ్వాసక్రియ అయ్యింటాయి అంతేనంటారా? ’’ ఈ సారి కొంచెం పెరిగిన ధైర్యంతో కలగలిసిన సమాధానం వచ్చింది. ‘‘ సరే కొంత మేరకు ఇది సమంజసమే కానీ ఇవే ప్రధాన మూల వ్యత్యాసాలు మాత్రం కాదు కుమారా. ఎందుకంటే ఒక పదార్ధాన్ని లోపలికి తీసుకుని కావలసినంత మేరకు మాత్రమే ఉపయోగించుకుని మిగిలినది వదిలేసే పనిని చాలా ఫ్యాక్టరీలూ, యంత్రాలూ కూడా చేస్తున్నాయి అయినా అవి జీవుల కోవలోకి రావు.అలాగే కొన్ని జీవులు అవాయు శ్యాసక్రియ ప్రక్రియలో మనుగడ సాగిస్తుంటాయి అంటే వాటికి గాలిపీల్చుకోవలసిన అవసరమే లేదు. అదే విధంగా మొక్కల్లో గాలి పీల్చుకునే పద్దతికీ, జంతువుల్లో గాలి పీల్చుకునే పద్దతికీ మధ్య చాలాచాలా తేడా వుంది’’ అంటూ తప్పుని ఎత్తి చూపినట్లుగా కాక విషయాన్ని విశదం చేస్తూ తప్పొప్పుల అవగాహన కలిగిస్తున్నాడు బ్రహ్మ.

Kadha-Saranga-2-300x268
‘‘ ఇంతకీ ఈ విషయానికి ఇన్ని బైట్ల సమయం కేటాయించడానికి కారణం తెలుసా? ఈరోజు జరగబోయే మన సంభాషణంతా ఈ కేంద్రంగానే విస్తరిస్తుంది నారదా. ఇది తెలిస్తేనే అది బాగా అర్ధం అవుతుంది.మొత్తానికి జీవినీ నిర్జీవినీ వేరుచేస్తున్న ప్రధాన కారకం ‘‘ ప్రత్యుత్పత్తి’’.
‘‘ప్రత్యుత్పత్తి మాత్రమేనా’’ నారదుడు బృకుటి ముడిచాడు.
‘‘ అవును నేను చేసే పనే ‘సృష్టించటం’, అదే పనిని నా తర్వాత అచ్చంగా నాలా కొనసాగించే గుణం వున్నవే జీవులు, అంతేకాదు తనలాంటి జీవిని తనంటిది సృష్టించలేదు అందుకోసమే పెరుగుదల దానికోసం ఆహారసేకరణ, సంతానపాలన, రక్షణకోసం సామాజికీకరణ ఇవ్వన్నీ ఏర్పడ్డాయి.’’ ముడి విప్పుతున్నాడో, మరేదైనా ముడివేయటం కోసం అవసరమైన సామగ్రిగా ఇస్తున్నాడో అర్ధంకాలేదు నారదుడికి అయినా అసలైన తేడా ఇదేనని తెలిసేసరికి కొంచెం మనసు తేలిక పడింది. మరికొంత పరిశీలించుకుంటూ పోతే కానీ ఆ సమాధానం మనసుకి సరిగా జీర్ణం కాదు.

‘‘ఇంకా ఏం ఆలోచిస్తున్నావు నారదా, భూలోక విశేషాలను ఏవో చేత.పట్టుకొచ్చినట్లున్నావు కదా అవేమిటో చెప్పు దీనిపై మరింత విపులంగా అవసరం మేరకు తర్వాత మాట్లాడుకుందాం’’ సంభాషణను కొనసాగించమన్నట్లు నారదుడి వైపు చూసాడు బ్రహ్మ.
అవును తండ్రిగారూ భూలోకంలో మీరు తయారు చేసిన జీవరాశి ఎలా వున్నారో, అమ్మదయతో చదువులనూ సాహిత్యాన్నీ అవపోసన పడుతున్నవారు ఎలా వున్నారు అనే రెండు విషయాలనూ కలిపి చెప్పేందుకు చిన్న ప్రయత్నం చేస్తాను. భూలోక సాహిత్య ఢింభకుడొకడు అక్కడి ప్రధాన సమస్యపైనా, మీరిచ్చిన శక్తులను వారెట్లా దుర్వినియోగం చేస్తున్నారన్న దానిపైనా ఒక కథలా రాసాడు. దానిని మీరే స్వయంగా చదువుకుంటే అటు విషయం చెప్పినవాడినీ అవుతాను. దానిపై భూలోక వాసుల అభిప్రాయాన్ని చూపిన వాడినీ అవుతాను. అవధరించండి అంటూ తనచేతిలోని అచ్చుకాగితాలను అమ్మ చేతిలో పెట్టాడు నారదుడు.
కొద్దిగా ఒక తలను అందులోకి వంచి తను కూడా ఆ కథను చదవటం ప్రారంభించాడు బ్రహ్మ.
*****
భారత వంశపు జనసభ
అందంగా వుండి నిండుగా కొలువు తీరివుంది. కానీ అక్కడ రాజుతో సహా ప్రధాన సలహాదారులంతా విషణ్నవదలైవున్నారు. అయితే ఆ ఆందోళనకు కారణం యుద్ధప్రమాదమో, అంతర్గత తిరుగుబాట్ల అలజడో కాదు ఆర్ధికలేమో ఎంతమాత్రమూ కాదు చాలా చిన్నగా కనిపిస్తున్నప్పటికీ పైన చెప్పుకున్న వాటికంటే చాలా రెట్లు ప్రమాదకరమైన అంశం మీద ఆందోళన పడుతున్నారు వారంతా.
‘‘ మహామంత్రీ ఈ మధ్యకాలంలో మరింకేవైనా అంటువంటి ఉన్మాద కృత్యాలు సంభవించాయా?’’ విచారిస్తున్నారు ఈ మధ్యనే ప్రజాస్వామిక పద్దతిలో ఎంపికకాబడ్డ రాజు నరేంద్రజోడీ.
‘‘ లేకేం మహారాజా మరింతగా పెచ్చరిల్లుతున్నాయి కూడా, మహిళల చర్మం కళ్ళబడినా, వారి వంటినుండివచ్చే గజ్జెలు, గాజుల వంటి శబ్దం వినబడినా కృరమైన తోడేళ్ళుగా దేశపు మగవారు మారపోయే మహమ్మారి గుణం అలాగే వుంది. హటాత్తుగా కోరలు పెరిగిపోవటం, కళ్ళు ఎరుపెక్కిపోవడం, ఒక మృగంలా చుట్టూ ఏముందో అనే విషయాన్ని సైతం గమనించకుండా ఆమెను ఆక్రమించేందుకో ఆతర్వాత హత్యచేసేందుకో తెగబడుతున్నారు వీళ్ళు, రాజధానుల్లోనే కాదు మారుమూల పల్లెల్లోనూ ఈ తీవ్రపరిణామాలు చోటుచేసుకున్నాయి మహారాజా’’ ఏకబిగిన వాస్తవ పరిస్థితులను ముందుపరిచాడు మంత్రివర్యుడు.
‘‘ అలాగయితే వెంటనే రక్షకభటుల గస్తీ పెంచండి. మంచి ఆయుధాలూ, అత్యాధునిక వాహనాలూ, మంచి రంగుల్లో సైనికదుస్తులూ, సరికొత్త చిహ్నం కూడా ఏర్పాటు చేయండి’’ ఇంకా కదలరేం అన్నట్లు చూసాడు మంత్రివైపు మహారాజు నరేంద్రజోడీ.
‘‘క్షమించాలి మహారాజా, ఇలా తోడేళ్ళుగా మారుతున్న వారిలో రక్షకభటులుకూడా కొందరున్నారు.’’ లోగొంతుతో చెప్పినా ధృడంగా విషయాన్ని చేరేసాడు మంత్రి. ‘‘

అప్పటివరకూ నిలబడి ఆవేశంతో మాట్లాడుతున్న రాజు నరేంద్రజోడీ ఒక్కసారిగా కుంచించుకుని కాళ్ళలో సత్తువ లేనట్లు సింహాసనంమీద కూలబడిపోయాడు. కనిపించని ఈ శత్రువుని ఎలా ఎదుర్కోవాలో తెలీక నిండుసభ మొత్తం ముఖాలను క్రిందకి దింపుకుని చూస్తున్నారు.
కొంతసేపటికి గొంతుపెగల్చుకుంటూ సాలోచనగా నరేంద్రజోడీనే అన్నాడు ‘‘ పోనీ చట్టపు రక్షణకంటే భద్రమైన కుటుంబ రక్షణకు ప్రాధాన్యత పెంచుదాం. ఎవరికుటుంబంలోని వారే వారివారి ఆడపిల్లలకు రక్షణకల్పించే పద్దతులను గురించి మరింత ప్రచారం చేద్దాం. ’’ తేలికగా ఊపిరి పీల్చుకుంటూ మంచి పరిష్కారమే తాత్కాలికంగా దొరికిందన్నట్లు చెప్పాడు మహారాజు.
‘‘ మరోసారి మన్నించాలి మహారాజా మనుసు ధృఢం చేసుకోండి. నిజాలను చెప్పక తప్పటంలేదు. అసలు చిక్కేమిటంటే ఇలా తోడేళ్ళుగా మారిపోతున్నవారిలో స్వంత కుటుంబం వారుకూడా వున్నారు. తాతలు, మామలు, అంకుళ్ళు ఆ..ఖ..రి..కి.. తండ్రులు సైతం ఈ పిశాచం భారిన పడుతున్నారు, ’’ మంత్రి ఆచితూచి తన మాటల్ని మహారాజుకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాడు.
రాజుకు ఒక్కసారిగా కళ్ళు బైర్లు కమ్మినట్లు, తలంతా బరువెక్కినట్లూ అయిపోయింది. మొత్తం రాజమహల్ తల్లక్రిందులుగా మారిపోయినట్లూ అనిపిస్తోంది. మంత్రిమాటలకు రెండుచేతులూ చెవులపై ఉంచుకుంటూ ‘‘ అమంగళం ప్రతిహతమగుగాక’’ అంటున్నాననుకుంటూనే ఆసనం మీదనుంచీ జారిపడుతూ మూర్చిల్లాడు మహారాజు.
* * *
కళ్ళింతగా చేస్తూ కథను చదువుతున్న బ్రహ్మ తను సృష్టించిన మానవజన్మలో ఇటువంటి వింతలక్షణాలు ఎందుకు కనిపిస్తున్నాయబ్బా అన్నట్లు ఆశ్చర్య పోతూ మిగిలిన తనపనిని కొద్దిసేపు ఆపి సరస్వతిదేవి చేతుల్లోని ఆ కథా కాగితాలవైపే కన్నార్పకుండా చూస్తున్నాడు.
* * *
వైద్యులూ, అంత: పురవాసమూ రాజుగారి మెలకువకోసం ఆయన ముఖంలోకే చూస్తున్నారు.
కొద్దిగా మెలకువతో రాజు అటూ ఇటూ మెసలగానే చుట్టూవున్న వారిలో చిన్న కలకలం. కళ్ళు తెరవగానే మళ్ళీ అదే ప్రశ్నతో మహామంత్రివైపు తిరిగాడు జోడీ. ‘‘ అసలు అటువంటి వారి అంగాంగాలనూ ఛేదించండి, నడిబజార్లో దారుణంగా కొట్టి చంపేయండి, మిగిలిన వారికి బుద్దొస్తుంది’’ మాటల్లో ఆవేశం కనబడక పోయినా ఆలోచనలో మాత్రం మరుగుతున్న కోపానిని మంత్రి గమనించాడు. ‘‘విషయం అదికాదు మహారాజా ఈ మృగాల భారినుంచి మహిళలను రక్షించడం కోసమే ఆలోచిస్తున్నాం కానీ. కొందరు మృగాలుగా మారకుండా చూడాల్సిన భాద్యతా మనదీ సమాజానిదే. వారిని శతృవులుగా రాక్షసులుగా కాక దుష్టులుగా కాక వ్యాధిగ్రస్తులుగా చూడాలి మనం. వారిని ఆ ఊబినుంచి బయటకు తీసేందుకు కనీసం కొత్త వారు అలా మారకుండా ఏం చేయాలి అనేవి ఆలోచించాలి.’’ మంత్రి ఒక్కో చిక్కుముడి విప్పుతున్నట్లు విపులంగా మాట్లాడుతున్నాడు.
‘‘ఇలాగే జరిగితూ వెళితే మన ప్రభుత్వపు పరువు, విధేశాలతో సంభందాలూ ఏమైపోవాలి. ముఖ్యంగా ప్రతిపక్ష వైరివర్గం మనల్ని ఎండగట్టవా? దానికేంచేద్దాం చెప్పండి మహామంత్రీ’’
‘‘ మీరన్న సంక్షోభం మాట నిజమే కానీ వైరి వర్గానికి అంత దృశ్యం లేదు మహారాజా, వాళ్ళలోనూ చాలామంది మంత్రులు ఈ తీవ్రతకు నలిగిపోయినవారే, మొన్నటి వరకూ అధికారంలో వున్న మదనమోహనుడిని ఈ సమస్య ఇబ్బంది పెట్టలేదు కానీ, యువరాజు రాహుల్దేవుడిపై ఈ ప్రభావం వుంది. చాలాసార్లు దగ్గరదాకా వచ్చి తృటిలో తప్పిపోయిందని వేగుల సమాచారం. మీరు వారిని తలచుకొని ఆందోళనచెందాల్సిన పనిలేదు.’’
‘‘ఇకపోతే రెండవ విషయం ఇది ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు వైధ్యులూ, నేరపరిశోదకులూ, శాస్త్రవేత్తలతో కూడిన ఒక ‘‘నిర్భయ’’ పేరుతో నిపుణుల బృందాన్ని మొన్న మీరు స్పృహకోల్పోయిన రోజే నియమించాం మహారాజా. బహుశా వారి పరిశీలనాత్మక నివేదిక కారణాలను కనుగొని కర్తవ్యాలను సూచిస్తుందనుకుంటున్నాము. అప్పటివరకూ మీరు కొంత విశ్రాంతి తీసుకోండి మహారాజా. ’’ అంటూ వెళ్ళేందుకు అనుమతి కోరుతున్నట్లు కొంచెం వంగి నమస్కరించి బయల్దేరాడు మంత్రి.
మొన్నటినుండి స్పృహలో లేనా? స్వగతంలో అనుకున్నట్లు పైకే అనేశాడు.
పర్వాలేదు రాజా పరిపాలనలో వున్నా నిద్రలోనే వుండే చాలామంది కంటే మీరు మెరుగే అందామనుకున్నాడు మంత్రి కానీ అనకుండానే బయటికెళ్ళాడు.

katta illus
* * *
‘‘నిర్భయ’’ బృందం సమస్య మూలాలను శోధించేందుకు తీవ్రపరిశ్రమ చేస్తోంది. ఇప్పటివరకూ తోడేళ్ళుగా మారిన వారు. వారు నేరం జరిపిన ప్రాంతం. మొదలైన వివరాలను స్పష్టంగా తెలిసేలా వేరు వేరు రంగు ఇంకులతో దేశపటంలో గుర్తిస్తున్నారు, నేరం చేసినవారి నివాసాలను మరోరంగు ఇంకు తోనూ చిత్రం గీస్తూ సంభంధిత వివరాలను అంశాల వారీగా నమోదు చేస్తూ ముందుకు వెళుతున్నారు. చిన్న తీగయినా దొరకకపోతుందా అన్న ఆశ వారి పనిలో శ్రమతెలియనివ్వడం లేదు.
దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ మరకల్లా ఏర్పడిన నేరపు చుక్కల్ని చూస్తూ ఆలోచిస్తున్న బృందానికి నిస్సత్తువ వస్తోంది. ఆ చుక్కలు శాపగ్రస్తుడైన ఇంద్రుడి వంటిపై వేయి కళ్ళలాగా, ఒక్కో నేరప్రాంతం మరిన్ని నేరాల పిలకలతో రావణుడి తలల్ని మరిపించేలా పదింతలై విచ్చుకుని కీచకగుండాలై నవ్వుతున్నాయి.
వాళ్ళకి పాపం చాలా రోజుల నుంచి సరైన ఆహారం, నిద్రకూడా లేదు. ఈ నేర కారణం దుష్టశక్తి కాకపోవచ్చనీ ఆహారపదార్ధాలో, క్రిమికీటకాలో కలిగించే వ్యాధికూడా కావచ్చనేది వారి ప్రాధమిక అంచనా. అందుకే పరిశీలించిన ఆహారాన్నే తింటున్నారు, ప్రత్యేకమైన దుస్తులను ధరించి జాగ్రత్తగా పరిశీలనలు కొనసాగిస్తున్నారు. కానీ ఆధారాలు దొరకటం లేదన్న అసహనం వల్లనే మరింతగా అశక్తులైపోతున్నారు.
దేశానికి సంభందించిన ఈ అరిష్టాన్ని అరికట్టేందుకు తమవంతు కృషి చేయలేక పోవడంతో తమ ముఖాలను మహారాజుకో ప్రజలకో చూపించే ధైర్యంలేక తమ పాత్రలని ‘మరపు’ నదిలోకి తోసేసుకుని ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్న సమయంలో కనిపించాడతను. పేరుకూడా చెప్పలేదు పరిష్కారాన్ని మాత్రం లీలగా చూపించేశాడు.

పటాన్ని తెరవమని చెప్పి తన వేలితో ఒక గీతలాగా గీసుకుంటూ వచ్చాడు దేశం ఆ కొసనుంచి ఈ కొస వరకూ.
‘‘ ఏమిటి స్వామీ ఇది?’’ నిర్భయ బృందం నాయకుడు అర్ధంకాక సందేశాన్ని వెలిబుచ్చాడు.
‘‘ ఇదే మీ సమస్యకు కారణం అయిన నది……’’
‘‘నదా??’’
‘‘ అవును నదే…. చూడండి అన్ని సంఘటనలూ ఈ నది చుట్టుపక్కలే జరిగాయి. నిజానికి ఈ నదినీటిని తాగిన కొంత సేపటికే వాళ్ళు మృగాలుగా మారారు ‘ప్రతిసారీ’. ఇది కళ్ళకు మాత్రమే కనిపించే నదికాదు. అలాగని చరిత్రకు ముందే అంతర్ధానం అయిన సరస్వతీ నది లాంటిదికూడా కాదు. ఇప్పుడు ఈ కాలంలోకూడా ప్రవహిస్తూనే వుంది అప్పుడెప్పుడో ఎక్కడో పుట్టింది. ఇది కాలం నుంచి కాలంలోకి ప్రవహించే నది. మధ్యలో మనుషులగుండా వేగాన్ని మార్చుకుంటుంటుంది. ఒక్క సారి స్థిమితులై శ్రద్ధగా చూడండి’’ మార్ధవత పోకుండానే కఠినమైన ఆజ్ఞలా చెప్పాడతను.
వాళ్ళకప్పుడే మంచుపొరలు తొలగుతున్నట్లు కొత్తగా అదేపటంపై ఒక నదిలాంటి రూపం కనిపిస్తోంది. పటం మీదనే కాదు ఎక్కడినుంచో వస్తూ తమచూట్టూ ఆక్రమించినట్లు మొత్తంగా కనిపిస్తున్న ఏదో ఆకారం వుంది.
‘‘ దీన్ని గురించి మరికొంచెం చెప్పండి స్వామీ. నివారణోపాయాలు తెలిసే లాగా’’ అడగాల్సిన ప్రశ్నవేశాడు నిర్భయబృంద ప్రధానసభ్యుడొకరు.
‘‘ మాతృస్వామ్య వ్యవస్థ కాలంలో ఈ ప్రవాహం సన్నగా ఉండిలేనట్లుగా, ఉనికే లేనట్లుగా ప్రవహించేది. అప్పట్లో దీనిపేరు ‘మూగ కాలువ’, ఆ తర్వాత పురుషులకి క్రమంగా కుటుంబమూ, సమాజమూ హస్తగతమవుతున్న రోజుల్లో దీని ఉధృతి పెరిగింది అప్పడిది ‘మగకాలువ’ . మగకాలువగా పిలిపించుకునే కాలానికే ఈ నీటికి ప్రాధమిక రోగలక్షణాలు వచ్చాయి. కొంచెం త్రాగగానే పెత్తందారీతనపు ఘాటు నషాళానికి అంటుతుండేది, కానీ దాన్ని వారు రోగలక్షణంగా భావించక సమాజం లెక్కచేయకపోవడం వల్ల వ్యాధి మరింత ముదిరింది. ఇప్పుడు ఏకంగా మనుషులపై దాడిచేసేలా, మనుషుల రక్తమాంసాలనూ వ్యాపారపు, ఆనందపు సరుకుగా చూసేలా చేస్తోంది ఈ మురికి పట్టిన ప్రవాహం. ఇక ఇప్పుడు దీనిపేరు ‘‘మృగకాలువ’’. బుల్ ఫైట్ లో ఎర్రగుడ్డను ఎలాగైతే చూపించి ఎద్దును రెచ్చగొడతారో, అలాగే డబ్బు నడిచొచ్చేందుకు చర్మాన్ని విశాలంగా పరచి వ్యాధిని రెచ్చగొట్టారు. పసికళ్ళలోకి నీలిరంగును వంపుతూ మందులే పనిచేయని ముర్ఖవ్యాధిగా ముదరబెడుతున్నారు. దీనిలో నిరంతరంగా మరిన్ని కలుషితాలు కలుస్తూ పోతున్నాయి. మరీ ప్రవాహాన్ని మీరు ‘సంస్కృతి’ అని కూడా బ్రమపడుతుంటారేమో.
‘‘అయితే ఈ నీళ్ళను ఎవ్వరూ త్రాగకుండా చేయమంటారా స్వామీ? ’’ బృందసభ్యుల మూకుమ్మడి ప్రశ్న.
‘‘దాహంతో నయినా చావడమే శరణ్యం అవుతుంది మేధావులారా, తప్పు నీళ్ళలో లేదు. దానిలో కలుస్తున్న కలుషితాలలోవుంది. ఆ మూలాలను పూర్తిగా నిర్మూలించండి. నీటిని స్వచ్చంగా మార్చితే తాగటం మేలు చేస్తుంది కూడా. మనసు పెడితే ఒకతరం చదువులు పూర్తిచేసుకునే సరికి మొత్తం కాలువనే తేటగా మార్చేయోచ్చు, నాకిక సెలవిప్పించండి వచ్చిన పని పూర్తయ్యింది.’’ ఎవరి సమాదానం కోసం చూడకుండానే వీళ్ళు ఆశ్చర్యంతో విషయాన్ని ఆకలింపు చేసుకునే లోగానే అతను వడివడిగా నడుచుకుంటూ దూరంగా వెళ్ళిపోయాడు.
‘‘ మరి ఆడవాళ్ళు తాగుతున్నారు కదా అటువంటి ప్రభావం ఎందుకు చూపడం లేదు’’ అడుగుదామనుకున్నారు. యంత్ర వైవిధ్యం ఏదో సమాధానాన్ని స్పరింపజేస్తున్నట్లే అనిపిస్తోంది. అయినా మిగిలినవి మీరే కనుక్కోండి అన్నట్లు అతడు వెళ్ళిపోయాడు అప్పటికే.
నిపుణుల బృందం ఈ అంశాలన్నింటిపై ఒక క్రమంలో పరిశీలనాత్మక రిపోర్టును మహారాజు ముందుంచింది.
‘‘హల్లో… మీరే నండీ… ఈ కథని చదువుతున్న ప్రియమైన పాఠకులూ’’ ‘‘ అనుకోకుండా అదే కాపీ ఇలా మీముందుకు కూడా వచ్చింది. ‘మృగజలం’ నుంచి కాపాడాల్సిన అవసరం మీమీద, నామీద కూడా వుంది. ఎవ్వరి కోసమో కాదు. బతికుండేందుకు మనం ఈ నీళ్ళే గుటకేస్తున్నాం. రేపు మన బిడ్డలూ ఇవే నీళ్ళు తాగాలి, ఈ నీళ్ళను తాగుతున్న వారిమధ్యే బ్రతకాలి. పట్టండి శుధ్ధిచేసే పని మొదలెడదాం. నిజానికి నేను అందులో భాగంగానే ఇదంతా రాసాను ’’

*-*-
కథ అయిపోయింది.

అయినా బ్రహ్మ, సరస్వతి మౌనంగా అవే కాగితాల వైపు చూస్తూనే వున్నారు.
‘‘నీ దీవెనలున్నట్లున్నాయి దేవీ అతని కలంపై, నా సృష్టిలో వెర్రిమొగ్గలేస్తున్న సంస్కృతిని గమనించి జాగ్రత్తగా ఉపమించి ఉపదేశించాలని చూడటం, నిజంగా సాధ్యమా అనిపిస్తుంది కానీ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నాను.’’ బ్రహ్మ నాలుగు ముఖాలూ సుప్రసన్నంగా వున్నాయి.
‘‘మీరు సమాజంలో స్థూలభాగంగా ఒక ప్రవాహ దర్శనాన్ని గమనించారేమో స్వామీ, కానీ శరీరంలో భాగంగా ప్రవహించే అంతస్స్రావీ వ్యవస్థా ప్రవాహమూ, దానిపై ‘మెదడు అదుపు’ కూడా దీనిలో నిర్ధేశించినట్లనిపించింది నాకయితే ఆ విషయాన్ని మరికొంచెం స్పష్టంగా కథలోనే చెప్పివుండాల్సింది.’’ ఏమంటారు అన్నట్లు సర్వస్వతీ దేవి ప్రశ్నించింది.
‘‘ అవును కదా సృష్టికార్యపు భారాన్ని నాతర్వాత భారం తెలియకుండా జీవులు మోసేందుకు పనికిఆహారం పథకంలా తాయిలపు పొట్లాన్ని అలా అంతస్స్రావీ వ్యవస్థలో నేను దాచిపెడితే, దాన్ని అంగడి సరుకుగా చేసి అనవసరపు పందేలతో రెచ్చగొట్టి ఇలా వక్రీభవించి ఉపద్రవంగా మారేలా చేసుకున్న మానవనైజం ఎంత దౌర్భల్యమైంది’’ అశ్చర్యపోతున్నట్లే తిట్టేశాడు స్వామివారు.
నారదుడు అడ్డొస్తూ తన ప్రశ్న వేశాడు ‘‘ కథలో క్రమాన్ని రాజుకి అప్పగించి ముగించకుండా పాఠకుడిని కూడా అందులోకి లాగటం కొత్తగానే వుంది కానీ స్వామీ నాదొక సందేహం. తప్పుగా అనుకోనంటే అడుగుతాను’’ తన సహజ శైలిలో మాటల ప్రవాహం మొదలెట్టాడు.
‘‘ అటు రాజో, రాజరికమో లేదా పాఠకుడు, రచయితా లేదా వారిలా ఉత్సాహమూ,భాద్యతా వున్నవారు ఎవ్వరూ స్పందించలేదను కోండీ లేదా చాలినంత స్పందనే రాలేదనుకోండి. అప్పుడు ఈ కాలువ పరిస్థితి, జనం పరిస్థితి ఏమవుతుందంటారు?’’ ప్రధానమయినదే అయినా పిడుగులాంటి ప్రశ్న వేశాడు నారదుడు.
ముక్తాయింపు మాటలుగా సమాధానం చెప్పే భాద్యతను తీసుకున్నాడు బ్రహ్మ, నెమ్మదిగా తనపనిలోకి వెళ్తూ రెండు చేతులు మాత్రం ఖాళీగా వుంచి ఈ సమాధానానికి అనువుగా ఆ రెండు చేతులూ కదువుతూ వివరించాడు.
‘‘ ఏముంది నాయనా అదే జరిగితే ప్రకృతి లేదా కాలచక్రం తనపని తనుచేసుకు పోతుంది. సృష్టిక్రమ పరంగా బలహీనుడైన పురుషుడు తనే ఈ విషయంలో అధిపతిననుకుంటున్నాడు. సామ్రజ్య దురాక్రమణలు చేసుకుంటూ పోతున్నాడు. కానీ కట్టుబాట్ల గదిలో బంధించ బడిన స్త్రీ తన శక్తిని తెలుసుకుంటుంది. మూసిన గదిలో ఎదురు తిరిగే పిల్లిలా ఎదురుతిరగాల్సిన పరిస్థితి వస్తుంది. తన సామర్ధ్యాన్ని అవగాహన చేసుకున్న స్త్రీ అప్పుడు తను కొన్ని విషయాలను తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇక శీలాలను కాపాడుకునే పనిలో గగ్గోలు పెట్టడం పురుషుల వంతవుతుంది. ఆ కాలువ మౌనకాలువగానో, అవసాన కాలువగానో ఎక్కడో ఇంకి పోతుంది.’’
‘‘ ధన్యోస్మి తల్లిదండ్రులారా, మరిన్ని వివరాలు ముచ్చటించుకునేందుకు మిమ్మల్ని మరోసారి కలుస్తాను’’
‘నారాయణ…. నారాయణ….’
**-
కొనసాగుతూ వున్న కలలో అనుకోని మలుపుకి కుదిపేసినట్లై ‘అతనికి’ మెలకువ వచ్చింది. కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూసాడు. మరికొంచేపు పడుకోవాలా? లేక చెయ్యాల్సిన పని ప్రారంభించొచ్చా అన్నట్లు.

రాజ్యాంగం ముసుగు తీసిన నాలుగు నవలలు

 

(ప్రముఖ రచయిత అక్కినేని కుటుంబరావు రచించిన నాలుగు నవలల్లో చిత్రించిన రాజ్యాంగ నైతికత గురించి విశ్లేషిస్తూ ప్రముఖ రచయిత్రి ఓల్గా ‘సంతులిత’ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తక ఆవిష్కరణ సెప్టెంబర్ 12న ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీలో జరిగింది. ఈ సందర్భంగా చేసిన ప్రసంగ వ్యాసం) 

ఆధునిక తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్య ప్రభావం ఎక్కువ. చాలా నవలలు, కథలు, కవితలు సమాజంలోని అంశాలను ఇతివృత్తంగా తీసుకుని వచ్చాయి. చాలా రచనల్లో వ్యవస్థ దోపిడీ స్వభావం మనకు కనపడుతుంది. మారుతున్న సమాజానికి అనుగుణంగా దోపిడీ వ్యవస్థలు మారుతున్నాయా? లేక కొత్త రూపంలో దోపిడీ, అణిచివేత జరుగుతుందా అన్న ప్రశ్నలను రచయితలు ఎప్పటికప్పుడు వేస్తూనే ఉన్నారు.

‘అబద్దం లేకుండా సాక్ష్యం కావాలంటే ఈ భూప్రపంచకమందు ఎక్కడైనా సాక్ష్యం అనేది ఉంటుందా మీరు అనుభవం లేకుండా నీతులు చెబుతున్నారు కాని.. హైకోర్టులో వకీళ్లు కూడా తిరగేసి కొట్టమంటారు.. నీ పుణ్యం ఉంటుంది బాబూ.. నిజం, అబద్దం అని తేలగొట్టక ఏదో ఒక తడక అల్లి తయారు చేస్తే కాని ఆబోరు దక్కదు..’ అని గురజాడ ‘కన్యాశుల్కం’లో హెడ్ కానిస్టేబుల్ గిరీశంతో అంటాడు. ‘స్వాతంత్య్రం వస్తే ఆ గాడిద కొడుకు హెడ్ కానిస్టేబుల్ మారతాడా..’ అని మరో పాత్ర అంటుంది.. న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, శాంతిభద్రతల వ్యవస్థ ఎంత బూటకమైనదో గురజాడ కన్యాశుల్కం చెబుతుంది. అదే విధంగా ఉన్నవ మాలపల్లి, వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి, మహీధర రామ్మోహన్ రావు రథచక్రాలు, దాశరథి చిల్లర దేవుళ్లు ఇలా ఎన్నో మనకు వ్యవస్థలో దుర్మార్గాల్ని తెలియజేస్తాయి.

అందరికీ సమాన హక్కుల్ని ప్రసాదిస్తూ, స్వేచ్చా స్వాతంత్య్రాలకు విలువ ఇస్తూ, ప్రాథమిక హక్కుల్ని కల్పిస్తూ, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకుంటూ స్వాతంత్య్రం తర్వాత మనం భారత రాజ్యాంగం ఏర్పర్చుకున్న తర్వాత అయినా పరిస్థితులు ఏమైనా మారాయా? రాజ్యాంగం వచ్చింది కాని సమాజంలో వర్గ స్వభావం మారలేదు. ఒక పుస్తకం రాసుకున్నంత మాత్రాన సమాజంలో వర్గ స్వభావం మారుతుందా? అసలు రాజ్యాంగం ఎవరికోసం సమాజంలో ఉన్నవారికోసమా? లేక లేనివారికోసమా? అణిచివేసే వారికోసమా లేక అణగారిన వర్గాల వారికోసమా? పోరాడే వారికోసమా? లేక పోరాడేవారిని తొక్కిపెట్టడం కోసమా? రాజ్యాంగం కులం, మతం, జాతి, ప్రాంతం మొదలైన వాటి ఆధిపత్య స్వభావాన్ని మార్చివేసిందా? పేదలకు, ధనికులకు మధ్య అగాధాన్ని చెరిపివేసిందా? అగ్రకులాలకూ, దళితులకు మధ్య తేడాను తగ్గించిందా? స్త్రీలకు, పురుషులకు మధ్య తేడా తగ్గించిందా? స్వాతంత్య్రం తర్వాత రాజ్యాంగ యంత్రాంగపు వర్గ స్వభావం ఎంత మేరకు మారింది?

స్వాతంత్య్రం తర్వాత ఎన్నో రచనలు మనకు రాజ్యాంగ యంత్రాంగపు వర్గ స్వభావం మారలేదని నిరూపిస్తున్నాయి. అభ్యుదయకవులు, దిగంబర కవులు, విప్లవరచయితలు, శ్రీశ్రీ, ఆలూరి బైరాగి, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, కొడవటిగంటి కుటుంబరావు, చలం, రంగనాయకమ్మ, వరవరరావు, అల్లం రాజయ్య, కేశవరెడ్డి, అంపశయ్య నవీన్, ఓల్గా, అక్కినేని కుటుంబరావు మొదలైన వారందరి రచనలుచదివితే మన రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థ బూటకపు స్వభావం గురించి అర్థమవుతుంది.

volga book release

అయితే సాహిత్య విమర్శ ఈమేరకు ఎంతవరకు న్యాయం చేసింది? మన రచనల్లోచిత్రించిన వ్యవస్థ దుర్మార్గ స్వభావాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఎన్ని విమర్శనాత్మక గ్రంథాలు వచ్చాయి? యూనివర్సిటీల్లో చాలా పరిశోధనా వ్యాసాలు, గ్రంథాలు వచ్చాయి. వరవరరావు  ‘ప్రజల మనిషి’ నవలపై పరిశోధనా గ్రంథం రాశారు. కాళీపట్నం ‘యజ్ఞం’ గురించి పరిశోధనా గ్రంథాలు వచ్చాయి. కాని నిర్దిష్టంగా మన రాజ్యాంగ వ్యవస్థ బూటకత్వాన్ని, రాజ్యాంగ నైతికతను ఆయా రచనల్లో ఎత్తి చూపుతూ వచ్చిన రచనలు చాలా తక్కువ. ఓల్గా గారు అక్కినేని కుటుంబరావు నవలల్లో రాజ్యాంగ నైతికతను విశ్లేషిస్తూ విమర్శనా గ్రంథం రాయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన మొత్తం సమాజం రాజ్యాంగం అనే చట్రం పరిధిలో నడుస్తుందని చెప్పుకుంటాం. ఇంటా, బయటా మన జీవితాల్ని రాజ్యాంగ యంత్రాంగం నిర్దేశిస్తుంది. మన చుట్టూ ఉన్న పార్లమెంట్, అసెంబ్లీలు, ముఖ్యమంత్రులు, నేతలు, మన ఎన్నికలు, న్యాయస్థానాలు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తున్నవే. సమాజంలో సంక్షోభాలు ఏర్పడుతున్నకొద్దీ వీటి ప్రాధాన్యత పెరుగుతుంది. మన జీవితాల్లో రాజ్యాంగం ప్రవేశించిందన్న మాటలో అవాస్తవం లేదు. కాని నిజంగా రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారం అమలు అవుతున్నదా? దాని బూటకపు స్వభావం ఏమిటి? దాని వర్గ స్వభావం ఏమిటి? అన్న అంశాలను మన రచనల్లోంచి ఎత్తి చూపడం ఇప్పుడు చాలా అవసరం.

గురజాడ రచించిన కన్యాశుల్కంల్లోను, రావిశాస్త్రి రచనల్లోను రాజ్యాంగయంత్రాంగం ప్రభావం గురించి బాలగోపాల్ రెండు వ్యాసాలు రాశారు. కన్యాశుల్కంలో న్యాయవ్యవస్థలో చిత్రించిన బూటకత్వాన్ని బాలగోపాల్ ఎత్తి చూపారు. హత్యకేసుపెట్టకుండా లంచం పుచ్చుకున్న హెడ్‌కానిస్టేబుల్ గురించి రాస్తారు. ‘డిప్టీ కలెక్టర్‌కు డబ్బు వ్యసనం లేదు’ కాని స్త్రీవ్యసనం కద్దు.. అని కరటక శాస్త్రి చేత అనిపిస్తాడు. ‘దరిద్రపు సంస్కృతం వదిలిపెట్టి ఇంగ్లీషు నేర్చుకుని నూతన రాజ్యాంగ యంత్రంంలో ఏదో ఒక అంతస్తులో కలిసిపోదామన్న ఆశ శిష్యుడికి ఉన్నందువల్లే లుబ్దావధాన్లుతో వివాహం ఆడడానికి అమ్మాయి వేషం వేసుకుంటాడు.. ఈ ఆశే లేకపోతే కన్యాశుల్కమే లేదు’ అని బాలగోపాల్ తీర్మానిస్తారు. రావిశాస్త్రి రచనల్లో నేరానికీ, రాజ్యాంగ యంత్రాంగానికీ ఉన్న పరస్పరతతో న్యాయవాదులూ, న్యాయమూర్తులూ భాగం పంచుకంటారని మనకు అర్థం అవుతుంది.

‘కట్నం సదివిచ్చుకుని కేసును తేలగొట్టేయడం’ ఎలాగో ముత్యాలమ్మ వంటి నిరక్షరాస్యురాలికి తెలుసు. ‘ఈ నోకంలో డబ్బూ, యాపారం తప్ప మరేట్నేదు.’. అని ఆమె జీవితసత్యాన్ని చెబుతోంది. ఆమె నేరం చేసానని ఒప్పుకోదు కాని కేసు ఒప్పేసుకుంటానని చెబుతుంది. పేదలు కేసులు ఒప్పేసుకోవాల్సి వస్తే చాలా మంది న్యాయమూర్తులు కేసులు తేలగొట్టేస్తారు. కేసులు తేలగొట్టేస్తే న్యాయమూర్తులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి. అది ఢిల్లీ స్థాయిలో కూడా మనం అర్థమవుతుంది. కేసులు తేలగొట్టేసిన న్యాయమూర్తులు గవర్నర్లు కావచ్చు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్లు కావచ్చు. రాజ్యసభ సభ్యత్వాలు పొందవచ్చు. ఇంకేమేదైనా పొందవచ్చు. రాజకీయ నాయకత్వానికీ, న్యాయ, అధికార యంత్రాంగానికీ మధ్య లాలూచీలు, ఒప్పందాల మూలంగానే ఈ రాజ్యాంగ వ్యవస్థ సాగుతుందన్న విషయంలో అవాస్తవం లేదు. ఇక సంస్కరణల తర్వాత మరో వ్యవస్థ ఒకటి ఏర్పడింది. అది కార్పొరేట్ వ్యవస్థ. అది అన్ని వ్యవస్థల్నీ ప్రభావితం చేసేంతగా విస్తరించింది. పార్లమెంట్‌లోనూ, చట్ట సభల్లోనూ, ప్రభుత్వ యంత్రాంగాల్లోనూ, చివరకు న్యాయవ్యవస్థలోనూ దాని ప్రభావం చొచ్చుకుపోయింది. ఇప్పుడు రాజ్యాంగ నైతికత అనేది మరింత చర్చనీయాంశం కావాల్సిన అవసరం ఉన్నది.

అక్కినేని కుటుంబరావు రచించిన నాలుగు నవల్లో రాజ్యాంగనైతికత గురించి విశ్లేషించారు. ఓల్గా. రాజ్యాంగ నైతికత అనే దాన్ని తొలుత రాజ్యాంగ నిర్మాత అంబేద్కరే ప్రస్తావించారు. constitutional morality is not a natural sentiment it has tobe cultivated. We must realise that our people have yet to learn it. Democracy in India is only a top-dressing on an Indian soil, which is essentially undemocratic  అంటారు. అంబేద్కర్. వన్ మ్యాన్ వన్ ఓట్ అనేది మంచిదే కాని వన్ మ్యాన్‌కు వన్ వాల్యూ ఉన్నప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి సక్రమంగా అమలు అవుతుందని అంటారాయన. స్వాతంత్య్రం వచ్చిన 67 సంవత్సరాల తర్వాత అందరు వ్యక్తులకు మనం ఒకే విలువ ఇస్తున్నామా? అన్న ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 

akkineni kutumba rao

అక్కినేని కుటుంబరావు నవలాసాహిత్యమంతా 15, 17,19,21, ఆర్టికల్స్ చుట్టూ తిరుగుతుందని విశ్లేషిస్తారు.. ఓల్గా. కులమత లింగ వివక్షలకు తావు లేదని, అంటరాని తనం అమలు కాకూడదని, భావ ప్రకటనా స్వేచ్చ ఉండాలని, జీవించేందుకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉన్నదని ఈ అధికరణలు చెబుతాయి. కాని నిజంగా రాజ్యాంగం ప్రసాదించిన ఈ అధికరణలు అమలు అవుతున్నాయా?

‘అందరూ సమానమేంటి? ఎంతసమానమైనా బేంబళ్ల దారి వేరు..’ అని ఎంకి పాత్ర సొరాజ్జెంలో అంటుంది. అస్ప­ృశ్యత అగ్రవర్ణాల అవసరాలమేరకే ఉంటుంది. తమ అవసరాలు తీర్చేందుకు అస్ప­ృశ్యత అడ్డురాదు. దొంగతనం చేశారని జోజి అనే పాత్రను చిత్రహింసలు పెట్టి చంపుతారు కమ్మదొరలు. మళ్లీ ఆ కేసును మాలపల్లి యువకులపైనే నెట్టివేస్తారు. యజమానులపై కేసులు పెట్టిన వారే జైలు పాలయ్యారు. జనంలో చైతన్యం అడగడానికి వెళితే ‘మీరింతమంది ఒక్కసారిగా రావడం ఎంతఘోరమైన తప్పో మీకు తెలువదురా.. ఈ విషయం తెలిస్తే ఢిల్లీనుంచి గవర్నమెంట్ సైన్యాలు వచ్చి మిమ్మల్నందర్నీ చంపి కవాతుకొట్టుకెళ్తాయిరా పిచ్చి సన్నాసుల్లారా.. ‘అని కాంగ్రెస్ ప్రతినిధి బ్రహ్మం గారు వారిని భయపెడతారు. ఇదే నవలలలో కూలీ రేట్ల గురించి అడిగిన తిరపతిని చంపి శవాన్ని కాలవలో తోసేస్తారు. మాలవాళ్లు వాళ్లే కొట్టుకున్నారని నిరూపిస్తారు.అవును.. సమాజంలో ప్రశ్నించిన వారిని వ్యవస్థ ఎక్కువ గాసహించదు. భూస్వామిని ప్రశ్నించినా, రాజకీయనాయకుడిని ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, పోలీసుల్ని ప్రశ్నించినా బూటకపు ఎన్‌కౌంటర్లు తప్పవు.. రాజ్యాంగం పేడకుప్పమీద కట్టిన రాజభవనమని అంబేద్కర్ చెప్పిన మాటలు నిజమయ్యాయని ఓల్గా వ్యాఖ్యానిస్తారు.

కుటుంబరావు తన మరో నవల ‘కార్మిక గీతం’ లో యజమానులు కార్మిక చట్టాలను ఎలా ఉల్లంఘించిందీ వివరంగా రాశారు. ‘పోలీసులు, మీడియా, అధికారులు అన్నీ కార్మికుల పక్షం కాకుండా యజమాన్యాల వైపు ఉండే రాజ్యాధికార చట్ర స్వభావాన్ని కార్మిక గీతంలో కుటుంబరావు వాస్తవికంగా చూపిస్తారు.. ‘అని ఓల్గా చెప్పారు. ‘కార్మికగీతం’ పుస్తకాన్ని దాదాపు రెండు దశాబ్దాల క్రితం నేను సమీక్షించాను. అప్పటికీ ఇప్పటికీ కార్మికుల జీవితంలో పెద్దగా మార్పులు లేవు. అయితే కొత్త రూపంలో ఇప్పుడు అణిచివేత ప్రారంభమైంది. భూముల స్వా«ధీనాన్ని, సెజ్‌లను వ్యతిరేకించిన వారిని ఊచకోత కోస్తే ప్రశ్నించేవారు లేరు. పోలీసుల కాల్పుల్లో నలుగురో ఐదుగురో చనిపోతే కాని వార్తల్లో రావడం లేదు. ఎందుకంటే గతంలో లాగానే రాజ్యాంగంలోని అన్ని వ్యవస్థలూ మిలాఖత్ అయిపోయాయి. కార్పోరేట్లు డబ్బులు వెదజల్లి ప్రకటనలు ఇచ్చి మీడియాతో సహా అన్ని వ్యవస్థల్నీ నోరుమూయించే కొత్త సంస్క­ృతి ప్రారంభమైంది. వీటిపై కూడా సాహిత్యం రావాల్సిన అవసరం ఉన్నది.

కుటుంబరావు మరో నవల ‘మోహన రాగం’ లో రాజ్యాంగంలో ప్రజల జీవించే హక్కునూ, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రణాళికా కర్తలే విస్మరించిన తీరును రాశారని ఓల్గా విశ్లేషించారు. ప్రభుత్వ పథకాల్లోని బూటకత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్దంగా నడుచుకుంటామని ప్రమాణం చేసిన శానస సభ్యులు ఖాప్ పంచాయతీలను సమర్థిస్తూ మాట్లాడతారని, వారికి శిక్షలుండవని ఓల్గా అంటారు. ఇక ‘కొల్లేటి జాడలు’ నవలలో మార్కెట్ వ్యవస్థ పర్యావరణాన్ని ఎలా హతమారుస్తుందో కుటుంబరావు వివరిస్తారు. మార్కెట్ అవసరాలకోసం, పెట్టుబడి ప్రయోజనాలకోసం జీవ వైవి«ధ్యంతో ఆటలాడుకుంటున్న వైనాన్ని ఆయన చెబుతారు. ‘వేల సంవత్సరాలుగా జీవ వైవి«ధ్యాన్ని అనేక విధాలుగా రక్షిస్తూ, గౌరవిస్తూ వస్తున్న ప్రజలకు వాటిపై ఉన్న హక్కులను గుర్తించకుండా, ఆ ప్రజలు చేసిన పనికి విలువ ఇవ్వకుండా ఉండటమంటే అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే..’ అంటారు ఓల్గా. ప్రజల జీవనాధారాలకు ముప్పు తెచ్చిపెట్టడమంటే వారి జీవించే హక్కుని హరించి వేయటం కాదా అని ఆమె ప్రశ్నిస్తారు. ఈక్రమంలో కోర్టు తీర్పుల్ని ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారో కూడా ఆమె చెబుతారు. పెద్ద పెద్ద బడాకంపెనీలకోసం పర్యావరణ చట్టాల్ని కూడా ప్రభుత్వాలు ఎలా సడలిస్తున్నారో తెలిసిన తర్వాత మనకు కొల్లేటి జాడలు సారం మరింత అర్థమవుతుంది.

అసలు ఒక రచయిత సమాజంలో దోపిడీని, వర్గ స్వభావాన్ని సమాజంలోని ప్రజల జీవితాల ఆధారంగానే అద్బుతంగా చెప్పడం గొప్ప విషయం అయితే రచయిత ఏమి చెప్పాడన్న విషయాన్ని వివరించడం మరో గొప్ప విషయం. అలా వివరించడం ద్వారా రాజ్యాంగం ఉనికినే ఆమె ప్రశ్నించారు. ‘రాజ్యాంగ ఉల్లంఘనను ఆపడం ఎలా? రాజ్యాంగ వాదాన్ని, రాజ్యాంగ నైతికతను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి చైతన్యం పెంచటం కంటే మార్గం ఉందా?’ అని ఆమె ప్రశ్నిస్తారు. అవునుప్రశ్నించడం ద్వారానే ప్రజల్లో చైతన్యం వస్తుంది. నా ప్రశ్న. ఒక్కటే మనకు లిఖిత రాజ్యాంగం ఉన్నది కాని అది ఎవరికోసం? వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడుతూ, ఎన్నికల్లో వేలకోట్లు ఖర్చులు పెడుతూ, ప్రజల్ని మభ్యపెడుతూ, అసమానత్వాల్నిపెంచుతున్న కోసమా? వాటిని చూసీ చూడనట్లుంటూ అవినీతిలో భాగస్వామ్యం పంచుకుంటున్న అధికార, న్యాయయంత్రాంగం కోసమా? రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తూ తిరుగుబాటు చేసే వాడు విప్లవకారుడైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, దానితో చెలగాటమాటుకుంటున్న వారిని ప్రజాస్వామిక వాదులనాలా? మన జీవితాలతో రాజ్యాంగయంత్రం ఆడుకుంటున్న క్రీడల్ని, పెంచి పోషిస్తున్న అసమానతలను, ప్రశ్నార్థకమైన రాజ్యాంగ నైతికతను మనం సాహిత్యంలో ప్రతిఫలింపచేయాలంటే ప్రజాజీవనాన్ని లోతుగా అధ్యయనం చేయాలి.

-కృష్ణుడు

పేద్రో పారమొ-2

pedro1-1

“నేను ఎదువిజస్ ద్యాడని. రా లోపలికి.”

ఆమె నాకోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంది. అంతా సిద్ధంగా ఉంది అని చెప్పి, నన్ను వెంట రమ్మని సైగ చేస్తూ వరసగా ఖాళీగా కనిపిస్తున్న చీకటి గదులగుండా తీసుకు వెళ్ళింది. కానీ అవి ఖాళీవి కాదు. ఆ చీకటికీ, వెన్నంటే వస్తున్న సన్నపాటి వెలుగుకీ అలవాటు పడ్డాక రెండు వైపులా కనిపించిన నీడలు చూశాక భారీ ఆకారాల మధ్య సన్నటి దారిగుండా వెళుతున్నట్లు తెలిసింది.
“ఏమిటివన్నీ?” అడిగాను.
“చిల్లరమల్లర సామాన్లు” ఆమె చెప్పింది. మా ఇంటి నిండా వాళ్ళూ వీళ్ళూ వదిలేసి వెళ్ళినవే. జనాలు వెళ్ళిపోతూ వాళ్ల వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకున్నారు కానీ తిరిగి తీసుకువెళ్ళడానికి ఒక్కరూ రాలేదు. నీకోసం అట్టిపెట్టిన గది ఈ వెనకాల ఉంది. ఎవరయినా వస్తారేమోనని శుభ్రం చేసి ఉంచుతాను. అయితే నువ్వు ఆమె కొడుకువా?”
“ఎవరి కొడుకుని?” నేను అడిగాను.
“డలొరీటాస్ వాళ్ళ అబ్బాయివి కాదూ?”
“అవును. కానీ నీకెలా తెలుసు?”
“నువ్వొస్తావని చెప్పిందామె. నిజానికి ఇవాళే చెప్పింది. ఈ రోజే నువ్వొస్తావని.”
“ఎవరు చెప్పారు నీకు? మా అమ్మా?”
“అవును. మీ అమ్మే.”
ఏమనుకోవాలో నాకు తెలియలేదు. ఏమనుకోవడానికీ నాకు సమయమీయలేదు ఎదువిజస్.
“ఇదే నీ గది,” చెప్పిందామె.
ఆ గదికి వేరే వాకిళ్ళేమీ లేవు మేమొచ్చింది తప్పించి. ఆమె కొవ్వొత్తి వెలిగించింది. గదంతా ఖాళీగా ఉన్నట్టు తెలిసింది.
“పడుకోవడానికి ఏమీ లేదు,” చెప్పాను.
“దాని సంగతి వదిలెయ్. ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నావు, అలసటకంటే మంచి పక్క ఉండదు. పొద్దున్నే నీకు మంచం ఏర్పాటు చేస్తాను. అన్నీ క్షణంలో ఏర్పాటు చేయగలనని అనుకుంటే ఎలా? కొంచెం ముందుగా చెప్పాలా? ఇంతకుముదు మీ అమ్మ చెప్పిందాకా నాకు కబురే లేకపోయె!”
“మా అమ్మా? మా అమ్మ చనిపోయింది.” చెప్పాను.
“ఓహో అందుకా ఆమె గొంతు అంత పీలగా వినిపిస్తూంది ఎంతో దూరం నుంచి వచ్చినట్టు! ఇప్పుడర్థమవుతూంది. ఇంతకీ ఎప్పుడు చనిపోయింది?”
“వారం క్రితం.”
“పాపం పిచ్చిది. నేనామెను వదిలేశాననుకుని ఉంటుంది. కలిసి చనిపోదామని ప్రమాణం చేసుకున్నాము. చేతిలో చేయి వేసుకుని చివరి ప్రయాణంలో ఏదయినా అవసరం పడినా లేక ఏదన్నా చిక్కు వచ్చిపడినా ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ. మేం ప్రాణస్నేహితులం. నాగురించి ఆమె చెప్పలేదా ఎప్పుడూ?”
“లేదు. అసల్లేదు.”

rulfo

హువాన్ రుల్ఫో

“వింతగా ఉంది. మేమప్పుడు చిన్నపిల్లలమనుకో. ఆమెకి అప్పుడే పెళ్ళయింది. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమూ, ప్రేమా. ఆమె ఎంతో చక్కగా ఉండేది, ఆఁ.. ఎంత చూడ ముచ్చటగా ఉండేదంటే ఆమెను ప్రేమించే వారు చాలా సంతోషపడేంత. ఎవరయినా ఆమెను ప్రేమించాలని కోరుకుంటారు. అయితే నాకంటే ముందే పోయిందన్నమాట. సరే, తొందరలోనే ఆమెను అందుకుంటాలే. స్వర్గమెంత దూరమో నాకంటే ఎవరికీ తెలియదు. అడ్డదారులూ తెలుసు నాకు. కిటుకేమిటంటే దేవుడి దయవల్ల వాడు తలిచినప్పుడు కాకుండా నువు కావాలనుకున్నప్పుడు పోవడం. లేకపోతే నీకు రోజులు మూడకముందే తీసుకెళ్ళమని వాడిని బలవంతపెట్టడం. మనమేదో పాత నేస్తాలమయినట్టు ఇట్లా మాట్లాడుతున్నానేమిటాని అనుకోకు, నువు నా సొంతబిడ్డ లాంటి వాడివే. అవును, వేయి సార్లు చెప్పాను: ‘డలోరిస్ వాళ్ల అబ్బాయి నా కొడుకయి ఉండాల్సింది!’ అని. ఎందుకో ఇంకెప్పుడన్నా చెబుతా. నేనిప్పుడు చెప్పదలుచుకున్నదల్లా మీ అమ్మను పైకెళ్ళే దారిలో ఎక్కడో అందుకుంటాను.”
ఆమెకి తిక్కేమోనని అనుమానమేసింది. కానీ అప్పటికే నేనేమీ ఆలోచించడం లేదు. నేనేదో సుదూర లోకంలో ఉన్నట్టు అనిపించింది. ఆ ప్రవాహంలో నన్ను నేను కొట్టుకుపోనిచ్చాను. మరింత బలహీనమవుతున్న నా శరీరం పూర్తిగా లొంగిపోయింది; ముళ్ళన్నీ జారిపోయి ఎవరయినా బొమ్మలాగా పిండేయగలిగేట్టు.
“నేనలసిపోయాను” చెప్పాను.
“రా వచ్చి కాస్త తిని పడుకో. ఒక ముద్ద. ఉన్నదేదో అదే.”
“వస్తా. తర్వాత వస్తా.”

కప్పు మీద పెంకుల్నుంచి జారుతున్న వాన నీళ్ళు పంచలోని ఇసుకలో గుంటలు చేస్తున్నాయి.

చుక్! చుక్! మళ్ళీ ఇంకో చుక్!

ఇటుకల మధ్య చిక్కుకుని గాలికి ఊగుతూ నృత్యం చేస్తున్న లారెల్ ఆకు మీద నీటి చుక్కలు పడుతుంటే. తుఫాను వెలిసింది. ఉండుండి వీస్తున్న పిల్లగాలి దానిమ్మ చెట్టు కొమ్మల్ని ఊపి మెరిసే చుక్కలని కింద చిమ్ముతూంది. అవి నేలలోకి ఇంకుతూ కాంతిని కోల్పోతున్నాయి. ఇంకా గూళ్ళలో ముడుచుకుని ఉన్న కోళ్ళు ఒక్కసారిగా రెక్కలు విసురుకుంటూ పంచలోకి వచ్చాయి తలలూపుకుంటూ వానకి బయటపడ్డ పురుగుల్ని ఏరుకుతింటూ. మబ్బులు చెదురుతుంటే సూర్యుడూ బయటికిచ్చాడు రాళ్ళ మీద మెరుస్తూ, కాంతి వలయాల్ని పరుస్తూ, నేలనుంచి నీటిని పీలుస్తూ, పిల్లగాలికి ఊగే ఆకులపై మెరుస్తూ.
“అంతసేపు ఏం చేస్తున్నావురా దొడ్లో?”
“ఏం లేదమ్మా!”
“అట్లాగే కూచో! పామొచ్చి పీకుతుంది!”
“సరేనమ్మా!”
నీ గురించే ఆలోచిస్తున్నా సుజానా. పచ్చటి కొండల గురించీ. గాలులు వీచే కాలంలో మనం ఎగరేసిన గాలిపటాల గురించీ. కింద ఊరినుంచి జనసందోహపు చప్పుళ్ళు వినిపించేవి; మనం ఎక్కడో కొండ మీద గాలికి అనువుగా దారం వదులుతూ. “సాయం చేయి సుజానా!” మెత్తటి చేతులు నా చేతులపై బిగుసుకుంటూ. “ఇంకొంచెం దారం వదులు.”
గాలి మనల్ని నవ్వించింది; గాలికి మన చేతివేళ్ళ మధ్యనుండి జారిపోతున్న దారం వెంబడి మన కళ్ళు పరుగెత్తి చివరికి చిటుక్కున తెగి ఏ పిట్ట రెక్కలకో తగులుకున్నట్టు. ఆ కాగితపు పిట్ట దాని తోక వెంబడే అంతెత్తునుండి గిరికీలు కొట్టుకుంటూ, మొగ్గలు వేస్తూ పచ్చటి నేలలోకి మాయమవుతుంది.
నీ పెదాలు తడిగా ఉన్నాయి మంచు ముద్దు పెట్టుకున్నట్టు.
“ఒరేయ్, నీకు చెప్పానా ఆ దొడ్లోంచి బయటికి రమ్మని!”
“సరేనమ్మా! వస్తున్నాను.”
నీగురించి ఆలోచిస్తున్నాను. నీ నీలాల కళ్ళతో నువు నన్నే చూస్తున్న సమయాల గురించి.
అతను తల పైకెత్తి వాకిట్లో వాళ్ళమ్మను చూశాడు.
“ఇంతసేపు ఏమిటి లోపల? ఏం చేస్తున్నావక్కడ?”
“ఆలోచిస్తున్నాను.”
“ఇక్కడే కుదిరిందా? దొడ్లో ఇంతసేపు ఉండటం మంచిది కాదు. ఇంకా చేయాల్సిన పనులు కూడా ఉన్నాయాయె. పోయి మొక్కజొన్నలు వొలవడానికి మీ నాయనమ్మకు సాయం చేయొచ్చుగా?”
“వెళ్తున్నానమ్మా. వెళుతున్నా.”

 

“నాయనమ్మా! జొన్నలు వొలవడానికి నీకు తోడొచ్చా.”

“ఆ పని అయిందిలే గానీ ఇంకా చాకొలేట్ నూరాలి.ఎక్కడికి పోయావు నువ్వు? గాలివాన వచ్చినప్పుడు నీకోసం వెతికాము.”
“నేను వెనక పంచలో ఉన్నా.”
“అక్కడేం చేస్తున్నావు? జపం చేస్తున్నావా?”
“లేదు నాయనమ్మా. ఊరికే వానని చూస్తున్నా.”
అతని నాయనమ్మ సగం పసుపూ, సగం బూడిద రంగులో ఉన్న కళ్ళతో అతని వంక చూసింది చదివేయగలిగినట్టు.
“సరే, పోయి మిల్లు శుభ్రం చేయి.”
మబ్బులపై వందల అడుగుల ఎత్తున, అన్నిటికీ ఎంతెంతో ఎత్తున నువు దాగున్నావు సుజానా. బ్రహ్మాండం ఆవల, ఏ దైవ కటాక్షం వెనకో దాగున్నావు. నేను తాకలేని, చూడలేని చోట, నా మాటైనా నీదరికి చేరని చోట.
“మిల్లు పనికిరాదు నాయనమ్మా. గ్రైండరు పగిలిపోయింది”
” ఆ మికయేలా మళ్ళీ అందులో జొన్నలేసినట్టుంది. ఎన్ని సార్లు చెప్పినా దాని అలవాటు మానిపించలేము. ఇప్పుడింకేం చేస్తాం!.”
“కొత్తది కొనొచ్చుగా? ఇది ఎటూ పాతబడి అరిగిపోయిందిగదా!”
“నిజమే. మీతాత ఖననానికయిన ఖర్చుతోటీ, చర్చికి డబ్బులు కట్టాల్సివచ్చీ చేతిలో పైసా లేదు. సరేలే, ఏదో ఒకటి మానుకుని అన్నా కొత్తది కొందాంలే. నువు ఆ దోన ఈనెస్ వీయల్పాండో దగ్గరికి పోయి అక్టోబర్ దాకా ఖాతా పెట్టుకోమని చెప్పు. కోతలయ్యాక చెల్లు వేద్దాం.”
“సరే నాయనమ్మా.”
“ఎటూ పోతున్నావుగా, పనిలో పని జల్లెడా, కత్తెరా అరువు తీసుకురా. గడ్డి ఆవజాన పెరిగిపోతూ ఉంది. వదిలేస్తే మన వొంటిమీదికి కూడా పాకుతుంది. ఆ పాత పెద్ద ఇల్లయితే ఏమీ అనకపోదును. ఈ ఇంటికి మారినప్పుడు మీతాత చూసుకున్నాడదంతా. అంతా ఆ దేవుడి లీల. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా? దోన ఈనెస్ కి చెప్పు కోతలు కాగానే బాకీ అంతా తీరుస్తామని.”
“సరే నాయనమ్మా.”
హమ్మింగ్ పిట్టలు. వాటి కాలమిది. విరగబూసిన మల్లె పొదలో వాటి రెక్కల చప్పుడు విన్నాడతను.
పవిత్ర హృదయం బొమ్మ పెట్టిన అలమరదగ్గర ఆగి చూస్తే ఇరవై నాలుగు సెంటావోలు కనిపించాయి. నాలుగు సెంటావోలు వదిలేసి ఒక వెయింటె తీసుకున్నాడు.
అతను వెళ్ళబోతుంటే అతని తల్లి ఆపింది.
“ఎక్కడికి వెళుతున్నావు?”
“దోన ఈనెస్ వీయల్పాండో వాళ్ల ఇంటికి, కొత్త మిల్లు కొనడానికి. మనది పాడయిపోయింది.”
“ఒక మీటర్ సిల్క్ గుడ్డ పట్టుకురా, ఇట్లాంటిది,” అని ఒక ముక్క ఇచ్చింది. “మన ఖాతాలో రాసుకోమను.”
“సరేనమ్మా.”
“వచ్చేప్పుడు నాకు యాస్పిరిన్ తీసుకురా. హాల్లో పూలకుండీలో డబ్బులుంటాయి చూడు.”
అతనికి ఒక పేసో కనిపించింది. వెయింటె వదిలేసి పెద్ద నాణెం తీసుకున్నాడు. “ఇప్పుడు ఏదయినా కనిపిస్తే సరిపోయేంత డబ్బుంది” అనుకున్నాడు.
“పేద్రో,” జనాలు పిలిచారతన్ని. “వోయ్ పేద్రో!”
అతను వినిపించుకోలేదు. అతను చాలా చాలా దూరం వెళ్ళిపోయాడు.

 

రాత్రి మళ్ళీ వాన మొదలయింది.

చాలాసేపు అతను జలజల పారే వాన నీటి శబ్దం వింటూ పడుకున్నాడు. ఎప్పుడో నిద్రపట్టి ఉండాలి. లేచేప్పటికి అతనికి చప్పుడులేని జల్లు పడటమే వినిపించింది.
కిటికీ అద్దాలపైన పొగమంచు అలుముకుని వానచినుకులు కన్నీటి దారం కడుతూ జారుతున్నాయి….మెరుపు కాంతిలో వెలుగుతున్న ఆ ధారల్ని చూచాను. ప్రతి నిశ్వాసమూ నిట్టూర్పు అవుతూంది. ప్రతి ఆలోచనా నీగురించే కలుగుతుంది, సుజానా.
వాన గాలిగా మారింది. అతనికి వినిపిస్తూంది “..పాపాలకు క్షమాపణా, దేహానికి పునరుథ్థానం. తథాస్తు.” అది ఇంటి లోలోపల ఆడవాళ్ళు జపమాల చివరి పూసను లెక్కిస్తున్న చోట. వాళ్ళు పూజలనించి లేచారు, కోళ్ళను గూళ్ళలో పెట్టారు, తలుపులకు గొళ్ళెలు పెట్టారు, దీపాలార్పారు.
ఇప్పుడు రాత్రి వెలుగు మాత్రమే ఉంది. వాన కీచురాళ్ళ సొదలా బుస పెడుతూ ఉంది.
“నువ్వొచ్చి జపమాల పట్టుకుని కూచోలేదు ఎందుకని? మీ తాత కోసం నొవేనా (ప్రత్యేక ప్రార్థన) చేస్తున్నాము.”
చేతిలో కొవ్వొత్తి పట్టుకుని వాకిట్లో వాళ్ళమ్మ నిలుచుని ఉంది. ఆమె పొడవాటి వంకరటింకర నీడ కప్పుమీదికి పాకుతూంది. పైన వాసాలు దాన్ని తెగగొడుతూ ఉన్నాయి.
“నాకు దిగులుగా ఉంది.” చెప్పాడు.
ఆమె అటు తిరిగింది. కొవ్వొత్తిని మలిపింది. తలుపు మూస్తూనే ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలయింది. వాన చప్పుడుతో కలిసిన దాన్ని అతను చాలాసేపు వింటూ ఉండిపోయాడు.
చర్చి గంట గంటలు కొట్టింది, గంట తర్వాత గంట, గంట తర్వాత గంటా, కాలం కుంచించుకుపోతున్నట్టుగా.

 

“అవునవును. నేను నీ తల్లిని కావడం కొద్దిలో తప్పిపోయింది. ఆమె దాని గురించి నీకు ఏమీ చెప్పలేదా?”

“లేదు, ఆమె నాకన్నీ మంచి కబుర్లే చెప్పింది. నీ గురించి నేను కంచర గాడిదలతని ద్వారా వినడమే. నాకిక్కడికి దారి తనే చూపించించాడు. అబుందియో అతని పేరు.”
“మంచివాడే ఆ అబుందియో. అయితే అతనికి నేనింకా గుర్తున్నానన్న మాట. మా ఇంటికి పంపిన ప్రతి గిరాకీకి ఏదో కొంచెం ఇచ్చేదాన్ని. ఇద్దరికీ బేరం బాగా కుదిరింది. ఇప్పుడు తలుచుకుంటే బాధే కానీ, రోజులు మారిపోయాయి. ఊరు పాడయినకాడి నుంచీ కబురు తెచ్చేవారే లేరు. అయితే అతను చెప్పాడా నీకు నా దగ్గరికి పొమ్మని?”
“అవును, నీకోసం చూడమని చెప్పాడు.”
“దానికి అతనికెప్పుడూ ఋణపడి ఉంటాను. అతను మంచివాడు, నమ్మకస్తుడు. అతనే ఊళ్ళోకి తపాలా తెస్తుండేవాడు, చెవిటి వాడయ్యాక కూడా. అది జరిగిన పాడు రోజు నాకింకా గుర్తుంది. అందరికీ అతనంటే ఇష్టం కనక అందరూ బాధపడ్డారు. మాకు ఉత్తరాలు తెచ్చి ఇచ్చి మావి తీసుకుపోయేవాడు. అవతలి ప్రపంచంలో ఏం జరుగుతుందో మాకు ఎప్పుడూ చెపుతూండేవాడు, తప్పకుండా వాళ్ళకి మేమెట్లా ఉన్నామో చెపుతూ ఉండే ఉండాలి. వొట్టి కబుర్ల పోగు. ఆ తర్వాత మాత్రం కాదులే. అప్పుడు మాట్లాడడమే మానేశాడు. అతను వినని మాటలూ, గాలిలో ఆవిరయ్యే మాటలూ, రుచి తగలని మాటలూ చెప్పేం లాభమనేవాడు.నీటి పాముల్ని బెదరగొట్టడానికి మేము వదిలిన రాకెట్ అతని తలకి మరీ దగ్గరగా పోయినప్పుడు జరిగిందదంతా. మాట పడిపోకపోయినా ఆ రోజు నుంచీ అతను నోరు విప్పలేదు. ఒక్కమాట మాత్రం చెప్పుకోవాలి, అందుమూలాన అతను చెడ్డవాడయిందేమీ లేదు.”
“నేను మాట్లాడినతనికి బాగానే వినిపిస్తుంది”
“అయితే అతనయి ఉండడు. అదీకాక, అబుందియో చనిపోయాడు. చచ్చిపోయాడనే నా నమ్మకం. అర్థమయిందా, అందువల్ల అది అతనయి ఉండడు.”
“నువు చెప్పింది నిజమే అయ్యుండొచ్చు.”
“సరే, ఇక మీ అమ్మ సంగతికొస్తే ఇందాక చెపుతున్నట్టు….”
ఆ నస వింటూ, నా ముందున్న ఆమెని పరిశీలించాను. జీవితంలో ఎన్నో కష్టాలు చవిచూసినట్లుంది. మొహం పారదర్శకంగా నెత్తురంతా తోడేసినట్టూ, చేతులు ముడుచుకుపోయి ముడతలుపడీ ఉన్నాయి. కళ్ళు లోపలికిపోయి కనపడటమే లేదు. ఆమె కుచ్చులు పెట్టిన పాతకాలపు తెల్ల డ్రస్ వేసుకుని మెడలో దారానికి “పాపులకు రక్ష” అని రాసున్న మరియా సంతీసిమా పతకం ధరించి ఉంది.

(సశేషం)

(మళ్ళీ వచ్చే గురువారం)

వాక్యం ఆగిపోయిన చోట…

1

ఏడుపు కూడా అంత తేలిగ్గా యేమీ రాదు కొన్నిసార్లు!

వొక్కసారి పగలబడి ఏడ్చేస్తే లోపల వున్న దుఃఖమంతా అలల్ని యీడ్చి వొడ్డుకి కొట్టినట్టు వుండేదేమో! ఇవాళ్టికి దగ్గిర దగ్గిర రెండు నెలలు అవుతున్నాయా చే.రా. మాస్టారు వెళ్ళిపోయి!

అప్పట్నించీ లోపలి సజీవమైన అవయవమేదో వున్నట్టుండి నిర్జీవమైపోయినట్టు- లేదూ- వొక వెలితి యింక దేన్తోనూ నింపడానికి వొప్పుకోనట్టు – లేదూ- ఆ మరణపు వొక్క క్షణం అబద్ధమే అని యింకా అనుకుంటూ వున్నట్టుగా వుంది.

మరణాలు కొత్త కాదు. కానీ, ప్రతి మరణమూ కొత్తగా ఏడ్పిస్తుంది. అంతకు ముందు వెళ్ళిపోయిన మనుషులూ తక్కువ కాదు, కాని ఈ క్షణం వెళ్ళిపోయిన ఈ మనిషి యిలా వెళ్లి వుండకూడదనీ, మృత్యువు మరీ ఎక్కువ తొందరపెట్టి లాక్కు వెళ్ళిందనీ అనిపిస్తుంది.

నాన్నగారు పోయినప్పుడు- మట్టి కింద ఆయన్ని నేనే రెండు చేతులా  కప్పెట్టి వచ్చిన తరవాత చాలా రోజులు ఆయన మరణం అంతా అబద్దమనీ, ఆ మట్టి కింద నించి ఆయన వచ్చేస్తారనీ నమ్మేవాడిని. గాఢ నిద్రలో వున్న నిక్షేపంలాంటి మనిషిని తటాలున తీసుకువెళ్ళి మట్టిలో కలిపి వచ్చామనీ అనుకునేవాణ్ణి. అది అబద్దమని తెలిసినా సరే, అలాంటి వొక అబద్దంలో బతికాను కొన్నాళ్ళు. జీవితం ఆయన్ని మళ్ళీ వెనక్కి పిలుస్తుందనీ, “నీ విషయంలో మృత్యువు పొరపాటు చేసింది కౌముదీ!” అని సంజాయిషీ ఇచ్చుకొని, సెకండ్ చాన్స్ ఇస్తుందని కూడా పిచ్చిగా అనుకునేవాణ్ణి.

నాన్నగారు పోయాక చాలా మంది వెళ్ళిపోయారు. కాని, అలా జీవితం వెనక్కి పిలిచి రెండో వంతు ఇస్తుందని ఆశ పడింది వొక్క చే.రా. గారి విషయంలోనే!
అందుకే, యిప్పటికీ ఆయన మరణం నా మనసుకీ నా శరీరానికీ అలవాటు పడని చేదునిజం.

నాన్నగారు పోయినప్పుడు చాలా పత్రికలూ, మీడియా వాళ్ళు ఏమన్నా రాయండీ, చెప్పండీ అని అడిగీ అడిగీ అలసిపోయారు. కాని, ఏమీ రాయలేకపోయాను ఏడాది దాకా!

ఇప్పుడు చేరా విషయంలోనూ అంతే! కూర్చునే కుదురు లేదనీ కాదు, రాయాల్సినవి లేవనీ కాదు. తెలియని మౌనం వొకటి మనసులో కొంత భాగాన్ని తలుపు మూసి వుంచేసింది.

యిప్పటికీ ఈ రాసే నాలుగు వాక్యాల్లో నిగ్రహం వుంటుందని నేను అనుకోవడం లేదు. రాయాలని అనుకున్నది రాయకుండానే మనసూ, కాగితం రెండూ మడత పెట్టుకొని వెళ్ళిపోతానేమో కూడా తెలియదు.

2

టీనేజికీ, సైగల్ పాటలకీ జత కలవదు కానీ, ఎందుకో సైగల్ అలా వచ్చేశాడు అతని మంద్రస్వరంతో నా యవ్వనంలోకి! ఆ “సైగల్ పాట” అనే కవిత రాసి వుండకపోతే, చేరా కూడా నా జీవితంలోకి మరీ అంత నవయవ్వన కాలంలో వచ్చేవారు కాదు. మా యిద్దరి బంధంలో సైగల్ వొక live wire.

నిజానికి అంతకు ముందు నించీ చేరా గురించి folklore కొంత వుండింది మా వూళ్ళో! డబ్బు లేక ఆయన అమెరికాలో వొక ఫ్రెండ్ కి వంట చేసిపెడుతూ కష్టపడి చదువుకున్నారని, ఇక్కడి నించి అంత దూరం ఆయన అమెరికా వెళ్లి తెలుగు వాక్యం మీద రిసెర్చ్ చేసారనీ…ఇలా! నేను డిగ్రీలోకి వచ్చే సరికి ఈ folklore కి ఇంకా కొన్ని juicy details వచ్చి చేరాయి- చేరాగారూ ఆయన ప్రొఫెసరూ కలిసి మందు కొట్టేవారని! ఈ కథ ఎందుకో నాకు అప్పట్లో అంతగా నచ్చలేదు, నాలోపల puritan ఎవడో పీఠం వేసుకొని వుండడం వల్ల! అసలు అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీ వొకటి వుందని కూడా ఆ తొలినాటి folklore వల్లనే తెలిసింది. చివరికి నేనూ అక్కడికే చేరుకుంటానని అప్పటికి నా వూహలో కూడా లేదు. సరే, ఈ పుక్కిటి పురాణాల సంగతి పక్కన పెడితే –

58

చిర్నవ్వే చేరా చిరునామా!

సైగల్ పాట కవిత అప్పట్లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో అచ్చయింది. బహుశా, అచ్చయిన నా తొలి కవితల్లో అదీ వొకటి. నేను రాసేది కవిత్వమనే నమ్మకం ఆ రోజుల్లో నాకు ఏ కోశానా లేదు. ఈ కవిత అచ్చయిన వారం రోజులకి నాకు చేరా గారి వుత్తరం వచ్చింది.  ఆ ఉత్తరం వచ్చిన వారం రోజులకి ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఆయన కాలమ్ “చేరాత”ల్లో దాదాపు సగం పేజీ కేవలం ఆ సైగల్ పాట కవిత మీదే రాసేసరికి ఉత్సాహం కాస్త ఉరకలేసింది.  నా గురించి రాసినందుకు కాదు- పదిహేను లైన్లు కూడా లేని చిన్న కవిత మీద దినపత్రికలో సగం పేజీ రాయడం అంటే మాటలు కాదు. అంటే, వొక చిన్న కవిత వెనక ఇన్ని పెద్ద ఆలోచనలు సాధ్యమా అన్న ఉత్సాహం!

కవిత్వం పట్ల విపరీతమైన మోహం తప్ప కవిత్వ విమర్శ మీద పెద్దగా ఆసక్తి లేని నాకు ఆ వ్యాసం విశాలమైన కనువిప్పు. కవిత్వాన్ని గురించి మాట్లాడుకోవడానికి మళ్ళీ కవిత్వ వాక్యాలనే ఆశ్రయించే వాణ్ని ఆ రోజుల్లో! కవిత్వాన్ని కవిత్వ భాషలో మాత్రమే వ్యాఖ్యానించడం వీలవుతుందని వొక థియరీ కూడా చేసిన వాణ్ని. నా థియరీని రకరకాల పద్ధతుల్లో de-construct చేసి, “లేదు, కవిత్వాన్ని గురించి మనం నిరాడంబర/ నిరలంకార వచనంలో విమర్శ రాయాల్సిందే” అని నన్ను విమర్శ వైపు నెట్టిన నా తొలి ఉపాధ్యాయుడు చేరా.

ఆ రోజుల్లో చేత్తో వుత్తరాలు రాసే అలవాటు ఎక్కువగా వుండడం వల్ల ఎప్పటికప్పుడు తోచినప్పుడల్లా ఆయనకి రాసే వాణ్ని. ఆయన కూడా వెంటనే సమాధానం రాసే వారు. ఈ వుత్తరాలు రాసే అలవాటు నాకు ఎంత లాభించిందో చెప్పలేను. ఇస్మాయిల్ గారి ఉత్తరం ఎప్పుడూ కార్డుముక్క దాటి వెళ్ళేది కాదు. కాని, చేరా గారి వుత్తరం కనీసం మూడు అర ఠావు కాయితాలు వుండేది. చాల వోపిక ఆయనకి ఆ విషయంలో! విషయం డొంక తిరుగుడుగా వుంటేనో, కవితాత్మకంగా వుంటేనో వెంటనే ఆయన్నించి అక్షరాలా మొట్టికాయలు పడేవి. చేరాతో వుత్తరాల వల్ల నా వచనంలో అందమైన కవిత్వం లేకుండా పోతోందని చాలా మంది మిత్రులు ఆ రోజుల్లో బాధపడే వాళ్ళు కూడా! కాని, వచనం అనేది వొక thought process అనీ, rationalization అనీ నేనూ క్రమంగా నమ్మడం మొదలెట్టాక వాళ్ళ బాధ కొంత తగ్గింది. వొక రకంగా చేరాతో సాగిన ఆ వుత్తరాయణం అంతా నాకు వచనరచనలో శిక్షణ అన్నమాట.

సైగల్ పాటతో వొక ఉద్వేగభరితమైన సన్నివేశంతో మొదలైన మా స్నేహం చివరికి అలా ఆలోచనాత్మక దశకి మళ్ళిందన్న మాట.

ఈ స్నేహం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక మేం కలిసి సాహిత్య సభలకు ప్రయాణాలు చేయడం మొదలయింది. ఈ ప్రయాణాలు నా సాహిత్య యూనివర్సిటీలు! గంటల తరబడి ప్రయాణాల్లో నిద్ర కూడా పోకుండా రెండు మూడు ఇంగ్లీషు సాహిత్య విమర్శ పుస్తకాలు దగ్గిర పెట్టుకొని, అవి చదువుతూ, నా చేత వాటిని చదివిస్తూ, వాటి సారాంశం వివరిస్తూ, ప్రశ్నలు వేస్తూ, “ఎంతయినా నువ్వు కవివే! అంతే!” అంటూ మధ్యలో నా మందబుద్ధి మీద జోకులు రువ్వుతూ ఆ ప్రతి ప్రయాణం నేను ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం.

అప్పుడే కవిత్వ నిర్మాణ వ్యూహాల మీద ఆయన కొత్తగా మాట్లాడుతున్న కాలం అది. అందులో భాగంగా ఆయన విపరీతంగా చదివే వారు. విదేశాలలో అప్పుడే వెలువడిన కొత్త కవిత్వ విమర్శ పుస్తకం ఏదీ ఆయన చూపు నించి తప్పించుకునేది కాదు. చదివిన వెంటనే దాన్ని గురించి మాట్లాడకపోతే ఆయనకి ఇబ్బందిగా వుండేది. అలాంటి చాలా సందర్భాల్లో నేను ఎలాగోలా దొరికే వాణ్ని – వుత్తరంలోనో, ఫోన్లోనో, సాహిత్య సభల్లోనో, లేదంటే ఆయన ఇంట్లోనో, కొన్ని సార్లు తను ఎంతో బిజీగా వుండే ఆఫీసులో కూడా ఆ పని అంతా పక్కన పడేసి మాట్లాడుతూనో!

గత నలభయ్యేళ్ళలో కవిత్వాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడారు చేరా. సంపత్కుమారతో మొదలయిన వచన పద్య లక్షణ చర్చ నించి ‘చేరాతల’ కాలమ్ దాకా బహుశా ఆధునిక వచన కవిత్వం గురించి అంత విస్తారంగా చర్చించిన మరో విమర్శకుడు మనకు లేరనే అనుకుంటాను. అవన్నీ వొక ఎత్తు, 1985 తరవాత కేవలం కవిత్వ నిర్మాణ వ్యూహాల మీద ఆయన మాట్లాడిన విషయాలన్నీ ఇంకో ఎత్తు. (ఈ కవిత్వ వ్యూహాల గురించి ఆయన కల్పన కవిత్వ సంపుటి “నేను కనిపించే పదం”లో కూడా ప్రస్తావించారు.)

ఆధునిక భాషా వేత్తలు ఇప్పుడు కేవలం భాషకి మాత్రమే పరిమితమై మాట్లాడడం లేదు. భాష చుట్టూరా వుండే ఇతర సామాజిక మానసిక సాంస్కృతిక అంశాలను కూడా కలుపుకొని మాట్లాడుతున్నారు. వొకవిధంగా భాష అనేది సాంస్కృతిక అంశంగా (cultural pattern) గా మారింది. కవిత్వంలో వాడే భాష, వాక్య నిర్మాణాలూ, idiom, కవి తనకంటూ నిర్మించుకునే individual grammar, కవిత్వ వాక్యాల మధ్య వదిలేసే ఖాళీ జాగాలూ ఇవన్నీ ఇప్పుడు కవిత్వ రసనకి అవసరమవుతున్నాయి. అంటే, para-linguistic features కవిత్వ భాషలో భాగమవుతున్నాయి. 1985 తరవాత వొక భాషావేత్తగా చేరా మాస్టారు కవిత్వ విమర్శలో సాగిస్తూ వచ్చిన interventions ని స్థిమితంగా ఆలోచిస్తే, ఆయన్ని గురించి విమర్శపరంగా మనం చేసే ఆలోచనలు అర్థవంతంగా వుంటాయి. ఈ కోణం నించి చేరా అన్వేషణ ముత్యాల సరాల ఛందస్సు మీద చర్చతో మొదలయిందని నేను అనుకుంటున్నా.

1990 లో బెంగళూరులో ప్రపంచ తెలుగు మహాసభల్లో చేరాతో ఎన్. గోపి, శిఖామణి, కొండేపూడి నిర్మల, నాయని కృష్ణ కుమారి, అఫ్సర్, యాకుబ్.

1990 లో బెంగళూరులో ప్రపంచ తెలుగు మహాసభల్లో చేరాతో ఎన్. గోపి, శిఖామణి, కొండేపూడి నిర్మల, నాయని కృష్ణ కుమారి, అఫ్సర్, యాకుబ్. (ఫోటో సౌజన్యం: చేకూరి సంధ్య)

నా మటుకు నాకు 1990 లో బెంగుళూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలు వ్యక్తిగతంగా మంచి అనుభవం. ఆ మహాసభల వేదిక మీద కవిత్వం చదవమని నాకు ఆహ్వానం రావడం పెద్ద ఆశ్చర్యమైతే, ఆ సభల కోసం హైదరాబాద్ నించి బెంగుళూర్ కి చేరా గారితో రైలు ప్రయాణం, ఆ వూళ్ళో నాలుగైదు రోజులు ఆయనతో కలిసి వుండడం ఇంకా అద్భుతమైన అనుభవం. నాకు తెలిసిన వాళ్ళలో నాయని కృష్ణకుమారి, ఎన్. గోపి గార్లు, శిఖామణి, కొండేపూడి నిర్మల, యాకూబ్ కూడా ఈ సభలకు వచ్చారు.

ఆ ప్రయాణంలోనే చేరాగారు ముత్యాల సరాలు ఛందస్సు మీద మాకు సుదీర్ఘ క్లాస్ తీసుకున్నారు. ముత్యాలసరాలతో గురజాడ గాని, శ్రీశ్రీ గాని ఎందుకు అంత ప్రేమలో పడ్డారో అప్పుడే నాకు గట్టిగా అర్థమైంది. అయితే, అది గురజాడ, శ్రీశ్రీ కంటే ఎక్కువ ఇప్పుడు చేరా విమర్శ గురించి చెప్పే సాధనం.

అప్పటివరకూ వున్న భాషనీ, దాని నిర్మాణాల్ని పడగొట్టి, కొత్త idiom ని కట్టుకుంటూ రావడంతో కొత్త కవిత్వం వస్తుంది. పునాదిలో కొంత పాత వున్నప్పటికీ కొత్త వాక్యం కొత్త గూడులా కట్టుకోకపోతే కవికి చిరునామా మిగలదు. ఆ చిరునామా కోసం వెతుకులాట కేవలం అనుభూతికో, కవిత్వ ఉద్వేగానికో సంబంధించిన విషయం కాదు. అంతకంటే ఎక్కువగా అది భాషకి సంబంధించిన ఉద్వేగం. మొన్నటి గురజాడ గాని, నిన్నటి శ్రీశ్రీ గాని, ఇవాళ్టి కొత్త కవి గాని ఆ పని వున్నపళాన చేయలేరు. వాళ్ళు పాతవాటిలో కొన్నిటికి కొత్త స్ఫురణ యిస్తారు, కొత్తవాటిని బలంగా చెప్పడానికి వీలుగా.

బెంగళూర్ లోనే నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారితో...

బెంగళూర్ లోనే నండూరి రామమోహన రావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారితో…

ఇలాంటి కృషిలో కవికీ, కవిత్వ విమర్శకుడికీ పెద్ద తేడా ఏమీ వుండదు. చేరా తను కొత్తగా చెప్పబోయే వచన కవిత్వ నిర్మాణ వ్యూహాలకు కావలసిన పరిభాష, తాత్విక పునాది ఏర్పర్చుకోడానికే ముత్యాలసరాల దాకా వెళ్ళారని నాకు అర్థమైంది. ముత్యాలసరాల్లో వ్యక్తీకరణకి సంబంధించి వొక linguistic/metrical ease వుంటుంది. అది షేక్స్పియర్ sonnet నించి తీసుకున్న ease లాంటిది. చేరా గారు కూడా కొత్త కవులు భాషలో తీసుకువస్తున్న ఈ linguistic/metrical ease ని చెప్పడానికే ముత్యాల సరాల దాకా వెళ్ళారు. ఇవాల్టి కవి వాడుతున్న భాష వెనక నిర్మితమవుతున్న/ లేదా వినిర్మితమవుతున్న కొత్త వ్యాకరణం అర్థం కావాలంటే ఆ ఇద్దరు మహాకవులూ ముత్యాలసరాలని ఎట్లా చాకిరీ చేయించారో తెలియాలి. ఈ విషయం కొంత నేను ఇదివరకే అచ్చయిన వ్యాస సంపుటి “ఆధునికత- అత్యాధునికత” (1992) లో చర్చించాను కనుక వాటి వివరణలోకి ఇప్పుడు వెళ్ళడం లేదు.

ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం ద్వారా నేనేం సాధించానో నాకు గుర్తు లేదు కాని, ఆ నాలుగు రోజుల పాటు చేరాతో కలిసి వేసిన అడుగులూ, తాగిన కాఫీలూ, భోజన సమయాలూ సాయంత్రపు నడకలూ అటు ఇటు ప్రయాణాల్లో ఆయన విమర్శ హృదయానికీ, ఆయనలోని నిరాడంబర తాత్వికుడికీ దగ్గిరయ్యాను కదా అనిపించింది.

4

అలా దగ్గిరయ్యాక-

2000 లో మాడిసన్ నించి విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం ఆహ్వానం వచ్చినప్పుడు వెళ్ళాలా వద్దా అని విపరీతమైన డైలమాలో వున్నప్పుడు గంటల తరబడి చేరాతో చర్చలు. ఉద్యోగ రీత్యా నేను మంచి స్థితిలో వున్నప్పుడు, యింకా ముందుకు వెళ్ళే అవకాశాలే కనిపిస్తున్నప్పుడు మాడిసన్ వెళ్లి సాధించేదేమిటి అన్నది నా ప్రశ్న. ఇప్పుడు వెళ్ళకపోతే తరవాత repent అవుతావని ఆయన సూటిగానే చెప్పేశారు. చేరాకి మాడిసన్ అన్నా, విస్కాన్సిన్ యూనివర్సిటీ అన్నా ప్రత్యేకమైన ప్రేమ అని నాకు తెలుసు. 2007 లో కూడా నేను వొక గ్రాంట్ మీద ఇండియాలో వుండడమూ, అదే సమయంలో ఇండియా యూనివర్సిటీలలో వొకటి రెండు ఆఫర్లతో వూగిసలాడుతున్నప్పుడు కూడా ఇప్పటికి ఈ వుద్యోగాలు మంచి ఆకర్షణే కాని తరవాత నెమ్మదిగా అసంతృప్తి మొదలవుతుంది అని నీళ్ళు నమలకుండా నన్ను మళ్ళీ అమెరికా వేపు దాదాపూ నెట్టేశారు ఆయన.

మరీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే, హైదరాబాద్ లో వుండగా నేను మానసికంగా ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో వున్నప్పుడు ఆ రెండు రకాలుగా కూడా వొక ఆత్మీయ స్నేహితుడిగానే ఆయన నన్ను ఆదుకున్నారు. ముందూ వెనకా ఏమీ ఆలోచించకుండా నా కోసం పరుగుపరుగున వచ్చారు. సాధారణంగా తెలుగు సాహిత్యలోకంలో ఇలాంటి ఆత్మీయతలు అరుదు.

వొక అక్షర స్నేహం కొన్ని సంవత్సరాల తరబడి కొనసాగినప్పుడు అందులో వ్యక్తిగతం, సాహిత్య గతం అని విభజన రేఖలు సాధ్యపడవు. స్నేహం ఎన్నాల్టిది అన్న ప్రశ్న కూడా వుండదు. కాని, ఏ ఇద్దరు వ్యక్తుల జీవితంలో అయినా ముప్ఫయ్యేళ్ళు అన్నది చాలా దీర్ఘ కాలమే! ముప్ఫయ్యేళ్ళలో ఎన్ని సంభాషణలూ, ఎన్ని కలయికలూ, ఎన్ని ప్రయాణాలూ! వాటన్నిటిని చెప్పుకుంటే పోతే సగం జీవిత చరిత్ర గడిచిపోతుంది.

5

 

2014: హైదరాబాద్ లో కడసారి వీడ్కోలు: అఫ్సర్, గద్దర్,  వరవరరావు, సంధ్య, చలసాని ప్రసాద్, చేకూరి శ్రీనివాసరావు.

హైదరాబాద్ లో కడసారి వీడ్కోలు: అఫ్సర్, గద్దర్, వరవరరావు, సంధ్య, చలసాని ప్రసాద్, చేకూరి శ్రీనివాసరావు (ఫోటో: డాక్టర్ కే. రాందాస్)

వొక నిష్క్రమణ గురించి చెప్పడానికి ఎప్పుడూ మనసొప్పదు. భాషా వొప్పుకోదు. కవిత్వమూ రాదు. వచనంలోనా, ఆ వుద్వేగాలేమీ నిలవవు.

వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతారు మనుషులు. ఈలోపు వాళ్ళు అత్మీయులవుతారే…అవుతూ అవుతూనో, మరీ దగ్గిరగా వచ్చి గుండెలో వొక చిన్ని అర కట్టుకొని, వొక వుదయాన చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారే…అక్కడ మొదలవుతుంది pain- ఈ pain అనేది చాలా చిన్న మాట అనిపించే పెద్ద వెలితి.

వున్నట్టుండి వొక మనిషి మన మధ్య నించి వెళ్ళిపోవడం అంటే చూస్తూండగానే అక్కడ ఆ మనిషి లేని జ్ఞాపకం పుట్టుకురావడం! కొన్ని మాటలు ఆగిపోవడం! మనకై విరిసే కొన్ని చిర్నవ్వుల కళ్ళలోంచి చూపుల మెరుపులు రాలిపోవడం!

అంతకంటే pain – అవన్నీ ఇప్పుడు వొట్టి కాగితాల మీద తప్ప కనిపించకపోవడం!

*

A Few Things About The “All Things”!

Sometime in middle of 1978. Old city of Hyderabad burned with Hindus and Muslims killing each other, and the police killing everyone.

Early May 2003. “Characters should behave unaware of the future that lay ahead of them, and it is in this mystery that life wades forward.” I wrote down something along these lines in my notes after copying it from Gary Saul Morson’s “Narrative and Freedom” book. These were my early notes. I needed to write my book. I had no choice. I felt I will have no future if I didn’t write it.

October 2009. Browsing on the net, I discovered “Rahasya Vaana” poem by Kalpana Rentala on her blog. With a naive boldness that comes only from remembering amateurish skills of younger years, I decided my Telugu is good enough to translate her poem into English. A day or two later, found out one Afsar and his poem “Kondaru Snehitulu…Nanna…Oka Artharaatri.” Soon I learned they are of one family. A month or two later all three of us are talking about starting a Telugu publishing company.

November 2010. Saaranga Books. “Aneka.” Months of toil by Kalpana and Afsar. Still more months of near-anal persistence by me for a certain look and feel for the book.

September 2014. All Things Unforgiven,” the final shape taken by those early May 2003 words. Yes, we all did behave unaware of what the future lay ahead of us. And so when Lev Grossman, the New York Times’ best-selling author of “The Magicians” trilogy, led us—I and four other debut novelists—onto the stage at Brooklyn Book Festival in Brooklyn, New York, this Sunday, Sept 21 2014, for a brief moment these past eleven odd years replayed in my head and I smiled inwardly.

I am not at all glorifying this moment. I believe publishers like Saaranga and writers who publish books are everywhere, and there’s nothing special about them. Still, I am writing this note now because in the book “All Things Unforgiven,” a school-boy named Arya walks back from school to his house in old city on the day of the 1978 Hindu-Muslim communal riots. And that boy came alive in the book extract I read onstage after Grossman introduced me to the audience. This was the extract I read to the audience.

As Arya approached the intersection, which was already crowded with people, he saw, coming out from the narrow lane on the left, a stream of bicycles, rickshaws and auto-rickshaws; evidently all the traffic had been diverted from Charminar.

Across the street, on his right and ahead of him, stood a small mosque and near its entrance stood a group of four or five men, all with their white prayer caps on them. It appeared as though they had just finished their prayer and were standing at the junction talking among themselves.

Arya then saw children, mostly girls, playing in front of the shops, jumping up and down a raised platform. A sudden feeling of nearness towards the children rose in his heart. “Don’t you know it is dangerous to let the children out here, into the open like this, at such times?” he was about to ask someone, but instead something else attracted his attention.

In the adjacent meat shop, through the gap between two large pieces of meat that were hanging by metal hooks, he saw a swinging movement of the shop owner’s arm. With a large black meat cleaver in one hand he cut the meat in rhythmic movements as he deftly moved the pieces sideways and around with his other hand, at the same time saying something to the man by the side of the shop. Next to the man there were three or four older men, also with white prayer caps on them, sitting in plastic chairs, talking something.

Arya was transfixed by these views. “Look how they go in and out of the streets, sit on the chairs and stare at the people, as though out here on the street is their living room, while I am afraid,” he thought. He kept looking at one side and the other, mesmerized by the boldness, by the indifference, and by the fearlessness in all that he saw around him. Once again, the same intense feeling of kinship with everything in these streets rose in the boy’s heart.

He crossed the junction, and going through the traffic that kept on coming from the narrow lane on his left, he turned his head over his shoulder, to see who else was going in his direction.

From the group that was standing in front of the mosque, one of the men stared fixedly at Arya for a few moments, and without taking his eyes off him, spat to his side.

Suddenly Arya became conscious of several eyes staring at him, and an awkward feeling of embarrassment rose in him. He wished to run away, to go near someone or something that was familiar. Still fixing his eyes on Arya, the man removed his cap and, now appearing more menacing, pushed his shirtsleeves up, and spoke to the others, without turning to them.

“He is looking at me thinking if I am a Muslim or a Hindu,” thought Arya, now feeling apprehensive at his circumstance, forgetting his earlier pleasant feeling. “They are talking among themselves, planning to come after me from both sides.”

At once all the faces on the street appeared the same to him, with the same menacing, calculating, fixated look on him, with the full knowledge of how to cordon him off, and how to frighten him. He looked away from them, and shifting his school bag from one shoulder to another, increased his pace. But the heavy bag kept swaying and kept hitting his thigh with a thud, and when the sound of the tiffin box lid breaking open came from within, he slowed down, perspiring and excited with a feeling of terror and shame. The consciousness that his fear had a terrible hold on him disappeared, and in that place now he felt the whole fear itself. The boy could not be sure if the ground was giving away beneath him or whether something unpleasant had begun to churn in his stomach. He slowed down further, and with a defiant expression on his face, through the spectacles that were becoming all misty and kept slipping down his nose, he looked back.

Contrary to his expectations and fears, he saw nothing that moved toward him. There were no crowds that were violent to be seen. He felt flushed. Becoming aware of the pulsations of blood flowing rapidly into his ears, making them swollen, itchy and tingling, he continued along that road, and was seen turning the corner onto the street that brought him nearer home.

And these are the pictures. And yes, I still believe one should write as though the characters should be unaware of the future ahead of them. That’s the only way to be truthful to the moment we are in.

10353693_10152681692118972_4706683076368896267_n ByK9OVTIIAAiUjYPhoto with onstage shot used without permission from Aleksandra Pickering – https://mobile.twitter.com/AleksandraJP/status/514181361796911104/photo/1

 

ప్రపంచ చరిత్రలో మనం!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ఈ వ్యాసపరంపర ప్రారంభంలో ఒకసారి చెప్పాను… కానీ చాలా వ్యాసాలు గడిచాయి కనుక మరోసారి గుర్తుచేసుకోవలసివస్తోంది…
1986లో కాబోలు…నేను మొదటిసారి కోశాంబీని చదివినప్పుడు ఎంత సంభ్రమాశ్చర్యాలు చెందానంటే కొన్ని రోజులపాటు భూమికి ఆమడ ఎత్తులో ఊరేగాను. అప్పుడు నా కళ్ళను కమ్మేసిన విస్మయపు మెరుపు ఇప్పటికీ అలాగే ఉందేమో కూడా. నాలోని పురాచరిత్రాసక్తికి ఇంధనం అందించిన ఆ పుస్తకం, Myth and Reality. పురాకాలాన్ని ఒక అద్భుతంగా నా ముందు ప్రదర్శించిన అంశాలు ఆ పుస్తకంలో చాలా ఉన్నాయి.

వాటిలో పణుల గురించి చెప్పినది ఒకటి.

ఋగ్వేదంలో పణుల ప్రస్తావనను ఉటంకిస్తూ కోశాంబీ ఇంకో మాట అన్నారు. అదేమిటంటే, పురాచరిత్రకు చెందిన ఫొనీషియన్లే పణులు కావచ్చునని! మనం ఒక మిత్ గానూ, విశ్వాసంగానూ చూడడానికి అలవాటుపడిన ఋగ్వేదాన్ని(అలాగే ఆయా సందర్భాలలో మహాభారతం లాంటి ఇతిహాస కథలను, పురాణ కథలను కూడా) ఆయన ఆ మాటద్వారా చరిత్ర వాకిట నిలబెడుతున్నారు. అదే నాలో ఉత్తేజానికి, విస్మయానికి కారణం.

ఆ తర్వాత రాంభట్ల ఆ పురాకాలపు అద్భుతత్వంలోకి నన్ను మరింతగా తీసుకెళ్లారు. కోశాంబీకి, రాంభట్లకూ ఒక పోలిక ఉంది. రాంభట్ల శైలి వ్యాకరణ సూత్రాలలా ఉంటే, కోశాంబీ శైలి గణితసూత్రాలలా ఉంటుంది. అన్నట్టు కోశాంబీ గణితశాస్త్రజ్ఞుడు కూడా. మనదేశానికి సంబంధించి కోశాంబీ, రాంభట్లా ప్రస్తావించిన అనేక పురాచారిత్రక వివరాల గురించీ; వ్యక్తులు, తెగలు, ప్రదేశాల పేర్లు వగైరాల గురించీ అదనపు సమాచారాన్ని సంపాదించడానికి నాకు చాలాకాలం పడుతూ వచ్చింది. అది ఇప్పటికీ పూర్తి కాలేదు. విచిత్రంగా, ఆ అదనపు సమాచారమూ; కోశాంబీ, రాంభట్ల నిర్ధారణలకు ధ్రువీకరణా పాశ్చాత్య పురాచరిత్రకారుల రచనల్లో కనిపిస్తూ వచ్చాయి. పురాకాలంలో ప్రపంచమంతా— కనీసం భారత్, మధ్యాసియా, పశ్చిమాసియా, యూరప్ ల మేరకే చూసినా— ఒకే చరిత్రను పంచుకున్నాయనడానికి ఇది సాక్ష్యం.

ఇందులో ఒక తమాషా ఉంది. ఎంత ప్రపంచ చరిత్ర రాస్తున్నా భారతీయ చరిత్రకారుల రచనలు పాశ్చాత్య కేంద్రితం(centric) గానూ, పాశ్చాత్యచరిత్రకారుల రచనలు భారత్ కేంద్రితంగానూ ఉండవు. అంటే, తను పాశ్చాత్య చరిత్ర చెబుతున్నానన్న స్పృహ భారతీయ చరిత్రకారునిలోనూ, తను భారత్ చరిత్ర చెబుతున్నానన్న స్పృహ పాశ్చాత్య చరిత్రకారునిలోనూ నిర్దిష్టంగా ఉండదన్న మాట. పురాకాలానికి చెందిన ఒక ప్రాంతం, ఒక రాజ్యం, లేదా ఒక తెగ గురించి రాసేటప్పుడు అది అసలే ఉండదు. కానీ చాలాచోట్ల ఉభయుల రచనల్లోనూ ఉమ్మడి అంశాలు, పేర్లు దొర్లుతూ ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పుకుంటే, రాంభట్ల అందించిన ఒక ఆసక్తికర సమాచారాన్నీ, పేర్లనూ పట్టుకుని పాశ్చాత్య చరిత్రకారుల రచనల్లో వాటి వివరాలు మరిన్ని సంపాదించడానికి నాకు పదిహేనేళ్లు పట్టింది. సరే, రాంభట్ల గారికి సోర్సు చెప్పే అలవాటు అంతగా లేకపోవడమూ ఒక కారణం. పై అనుభవం ఎంతో వివరంగానూ, ఉత్కంఠతో కూడిన ఒక కథలానూ చెప్పుకోవలసినది కనుక ఇప్పుడు నేను అందులోకి వెళ్లను.

ప్రస్తుతానికి వస్తే, ఋగ్వేదంలో పేర్కొన్న పణులు, పురాచరిత్ర కాలానికి చెందిన ఫొనీషియన్లే కావచ్చునన్న కోశాంబీ ఊహను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికిప్పుడు నాకు అందుబాటులో ఉన్న హెచ్.జి. వెల్స్ రచన A SHORT HISTORY OF THE WORLD ఆధారంగా ఫొనీషియన్ల గురించి చెప్పుకుందాం.
***
అంతకంటే ముందు కొంత పూర్వచరిత్రలోకి వెళ్ళక తప్పదు…

ఇప్పటి నుంచి 9వేల సంవత్సరాల వెనక్కి వెడితే, అంటే క్రీ.పూ. 7000 నాటికి దిగువ మెసపొటేమియా (నేటి ఇరాక్ ప్రాంతానికి ఇది పురాతన నామం. ఇక్కడి పురాతన జనం సుమేరియన్లు. వీరి పేరు మీద దీనిని సుమేరియా అని కూడా అన్నారు. రెండు నదుల మధ్య ఉంది కనుక ‘లంక’ అని కూడా అనచ్చు)లో యూఫ్రటిస్, టైగ్రిస్ నదుల మధ్య సుమేరియన్లు నగరరాజ్యాలు స్థాపించుకున్నారు. దాదాపు ఇదే సమయంలో నైలు నదీ లోయలో ఈజిప్ట్ ప్రజలూ నగర రాజ్యాలను స్థాపించుకున్నారు. చరిత్రకు తెలిసినంతవరకు ఇవే తొలి రాజ్యాలు.

నగరాలు వేటికి అవే స్వతంత్ర రాజ్యాలు. ప్రతి నగరానికీ ఒక దేవుడూ, పూజారీ ఉంటారు. పూజారే రాజుగా ఉంటాడు. ఒక నగరం ఇంకో నగరాన్ని ఆక్రమించుకోవచ్చు. ఆ నగర దేవుణ్ణి ఎత్తుకు పోయి తమ నగరంలో ప్రతిష్టించుకుంటే, ఆ నగరం వారి స్వాధీనంలోకి వచ్చేసినట్టే. ఓడిపోయిన నగరం గెలిచిన నగరానికి కప్పం చెల్లించుకుంటుంది. సుమేరియన్ల నగరం ‘నిప్పూరు’లో ఒక పురాతన శాసనం దొరికింది. ఆ శాసనంలో తొలి ‘సామ్రాజ్యం’ పేరు నమోదైంది. దాని పేరు ‘ఈరిచ్’. ఈ నగర దేవుడూ, రాజుగా ఉన్న పూజారీ పర్షియన్ గల్ఫ్ నుంచి ఎర్రసముద్రం వరకూ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

‘నిప్పూరు’లో ‘ఊరు’ ఉంది చూడండి; అది మన తెలుగు ‘ఊరు’కు సమానార్థకమే. సమానార్థకమేమిటి, అది పదహారణాల తెలుగు మాటే కావచ్చు. అసలు మెసపొటేమియాలో ‘ఊరు’ అనే పేరుతోనే ఒక నగరం ఉండేది. మెసపొటేమియాకు చెందిన గిల్గమేశుని ఇతిహాసంలో(The Epic of Gilgamesh) గిల్గమేశుని నగరం పేరు ‘ఊరు’. ఇందులోని ఎంకిడు అనే పాత్రకు, మన రామాయణ, భారతాలలోని ఋష్యశృంగుని కథకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఈ ‘ఎంకిడు’ అనే పేరు కూడా తెలుగు పేరులానే ధ్వనిస్తూ ఉండచ్చు. వీటి గురించి మరింత వివరంగా చెప్పుకునే అవకాశం ముందు ముందు వస్తుందేమో చూద్దాం. దానిని అలా ఉంచితే, ఆఫ్రికా ఊళ్ళ పేర్లలో కూడా ‘ఊరు’ ఉన్నట్టు ఇంతకుముందు చెప్పుకున్నాం. రూట్స్ నవలలో కుంటా కింటే ఊరి పేరు జఫూరు.

పద్ధతిగా వ్యవసాయమూ, సేద్యపునీటి వ్యవస్థా, దేవాలయనిర్మాణమూ ప్రారంభమైంది కూడా మెసపొటేమియా, ఈజిప్టులలోనే. సామాజిక వ్యవస్థలు ఏర్పడిందీ అక్కడే. అంటే, ఈ ప్రాంతాల ప్రజలు కొంత మేరకైనా కడుపులో చల్ల కదలకుండా స్థిరజీవితానికి అలవాటుపడినవాళ్ళన్నమాట. స్థిరజీవితం ఉన్నచోటే నాగరికత పుడుతుంది. చరిత్రకు తెలిసినంతవరకు వీరే తొలి నాగరికులు. సుమేరులకు లిపి కూడా తెలుసు.

ఆ తర్వాతి కాలంలో, అంటే, క్రీ.పూ. 6000-3000 మధ్యలో టైగ్రిస్ నది ఎగువన అసీరియన్లు నగరాలను స్థాపించడం ప్రారంభించారు. అప్పుడే, ఆసియా మైనర్(నేటి టర్కీ చుట్టుపక్కల ప్రాంతం)లోనూ, మధ్యధరా సముద్ర తీరంలోనూ, దీవుల్లోనూ చిన్న చిన్న తెగలు నాగరికతవైపు అడుగులేస్తున్నాయి. ఇదే కాలంలో భారత్, చైనాలలో కూడా ఇదే విధమైన పరిణామాలు సంభవిస్తున్నాయి. అంటే, ఇది మన దేశంలో సింధు నాగరికతకు చెందిన కాలం అన్న మాట.
ఇలా ఉండగా సుమేరు, ఈజిప్టు ప్రజల ప్రశాంత జీవన సరస్సును కల్లోల పరిచే ఒక పెద్ద పరిణామం త్వరలోనే జరిగింది— అది సంచార తెగల రూపంలో!
ఆ కాలంలో మూడు ముఖ్య ప్రాంతాలలో, మూడు ముఖ్య రకాలకు చెందిన సంచారజీవులు ఉండేవారు. మొదటి రకం, యూరప్ అడవుల్లో వేటాడుతూ, పశువులను కాచుకుంటూ జీవిస్తున్న నోర్డిక్ జాతివారు. క్రీ.పూ. 1500కు ముందు వీరు తొలి నాగరికులకు తెలియరు. రెండవ రకం, తూర్పు ఆసియాలో విశాల పచ్చిక మైదానాలలో జీవించే వివిధ మంగోల్ తెగలు, హున్నిస్ తెగలు. వీరు అప్పటికి గుర్రాలను మచ్చిక చేస్తున్నారు. వేసవి, శీతాకాల శిబిరాల మధ్య సంచారజీవితం గడుపుతున్నారు. హున్నిస్ తెగలకు, నోర్డిక్ తెగలకు మధ్య రష్యా చిత్తడి నేలలు, కాస్పియన్ సముద్రమూ అడ్డుగోడలుగా ఉన్నాయి. మూడవరకం, సిరియా, అరేబియా ఏడారుల్లో సంచారజీవితం గడుపుతున్న సెమిటిక్ తెగలు. వీరు గొర్రెలను, మేకలను, గాడిదలను కాచుకుంటున్నారు. వీరూ, పర్షియా దక్షిణ ప్రాంతంలో ఉన్న నల్లజనం ఈలమైట్లూ మొదటిసారిగా తొలి నాగరికుల(సుమేరియన్లు, ఈజిప్షియన్లు) సంపర్కంలోకి వచ్చారు. సెమెటిక్ తెగలవారు ఒకపక్క తొలి నాగరిక ప్రాంతాలపై దాడులు చేస్తూ, మరోపక్క వారితో వర్తక వ్యాపారాలు సాగించేవారు.

ఇక్కడ స్థిరజీవులకు, సంచారజీవులకు మధ్యనున్న తేడా గురించి హెచ్. జీ. వెల్స్ రాస్తారు.

స్థిరజీవనం సాగించే వ్యవసాయదారులకన్నా సంచారజీవులు దృఢంగా ఉంటారు. జనాభా పరిమితంగా ఉంటుంది. వీరికి శాశ్వత దేవాలయాలు కానీ, పటిష్టమైన పూజారివ్యవస్థ కానీ ఉండవు. అలాగని వీరిది అంతగా అభివృద్ధి చెందని జీవన విధానమని అనుకోనవసరం లేదు. వ్యవసాయదారులతో పోల్చితే, వీరిది అనేకవిధాలుగా సంపూర్ణజీవితం. ప్రతి వ్యక్తీ తన రక్షణ తను చూసుకోగలిగేలా ఉంటాడు. గుంపులో ఒకడుగా ఉండడు. వీరిలో నాయకుడికే ఎక్కువ ప్రాముఖ్యం, పూజారికి తక్కువ ప్రాముఖ్యం.

విస్తారమైన ప్రదేశాలను చూస్తారు కనుక సంచారజీవులకు విశాల జీవన దృక్పథం అలవడుతుంది. స్థిరజీవుల తీరు తెన్నుల్ని వారు ఆకళించుకుంటారు. అపరిచితులను చూడడానికి అలవాటుపడతారు. పచ్చికభూముల విషయంలో వారు ఇతర తెగలతో పోటీ పడవలసివస్తుంది. ఆ పోటీ సహజంగానే ఘర్షణలకు దారితీస్తుంది. కనుక అందుకు అవసరమైన వ్యూహాలను వారు రచించుకోవలసివస్తుంది. కనుమలు, కొండలు, గుట్టల మీదుగా ప్రయాణిస్తూ ఉంటారు కనుక, వ్యవసాయదారులకు కన్నా వారికి లోహాలతో ఎక్కువ పరిచయం ఏర్పడుతుంది. ఆవిధంగా వారు మంచి లోహశాస్త్రనిపుణులు(metallurgists) అవుతారు. కంచును కనిపెట్టినదీ, ఇనుమును కరిగించడం నేర్చిందీ కూడా సంచారజీవులే ననడానికి ఆధారాలున్నాయి. ముడి ఇనుమునుంచి ఇనుమును వేరు చేసి తయారు చేసిన తొలి పరికరాలలో కొన్ని, తొలి నాగరికతాప్రాంతాలకు చాలా దూరంగా, మధ్య యూరప్ లో దొరకడం ఇందుకొక సాక్ష్యం.

మరోవైపు, స్థిరజీవనులకు వస్త్రాలు నేయడం, కుండలు చేయడం, ఇతర నిత్యావసరవస్తువులను తయారుచేయడం తెలుసు. ఇలా సంచార, స్థిరజీవనుల మధ్య ఉన్న జీవన వైవిధ్యం ఒకవిధమైన ఇచ్చిపుచ్చుకునే సంబంధాలకూ దారి తీయడంలో విశేషం లేదు. అందులో ఒకవైపు దోచుకోవడం, ఇంకోవైపు వర్తక సంబంధాలను నెరపడం–రెండూ ఉంటాయి. ప్రత్యేకించి సుమేరియా గురించే చెప్పుకుంటే, దానికి ఒక పక్క ఎడారులున్నాయి. ఇంకో పక్క వివిధ ఋతువులు ప్రభావం చూపే ప్రాంతం ఉంది. సంచారజీవులు పంటభూములకు దగ్గరలో గుడారాలు వేసుకుని ఉండడం పరిపాటి కావచ్చు. వీరు వర్తకానికీ, దొంగతనానికీ కూడా పాల్పడుతూ ఇండచ్చు. నేటికీ జీప్సీలలో ఇది చూస్తూ ఉంటాం. (మన దగ్గర కూడా పల్లెటూళ్లలోనూ, పట్టణ, నగర శివార్లలోనూ ఖాళీ ప్రదేశాలలో గుడారాలు వేసుకునే సంచారజీవుల్ని ఇప్పటికీ చూస్తూ ఉంటాం). సంచారజీవులు తమ వెంట తెచ్చిన విలువై రాళ్ళ(నవరత్నాలు)నూ, లోహాలనూ, తోలునూ; వేటాడే జాతులవారైతే జంతుచర్మాలనూ ఇచ్చి, స్థిరజీవనులనుంచి కుండలు, పూసలు, గాజు, వస్త్రాలు మొదలైన వాటిని తీసుకునేవారు.

ఇలా ఉండగా…

క్రీ.పూ. 2750 (జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం క్రీ.పూ. 2350) నాటికి ఈ సెమెటిక్ తెగలలోంచి ఒక మహానాయకుడు అవతరించాడు. అతను చదువుసంధ్యలు లేని ఒక బర్బరుడు(బార్బేరియన్). అతను సుమేరియా మొత్తాన్ని జయించాడు. పర్షియా సింధుశాఖనుంచి మధ్యధరాసముద్రం వరకూ ఆధిపత్యాన్ని స్థాపించుకున్నాడు. అతని పేరు సారగాన్. అతని ప్రజలు అక్కడియన్లు. సారగాన్ తన ప్రజలకు సుమేరు లిపిని నేర్పించి, సుమేరు భాషను అధికారభాషగా, విద్యావంతుల భాషగా అమలు చేశాడు. ఇతను, ఇతని వంశీకులు సుమేరు ప్రజలతో, వారి భాషా సంస్కృతులతో పాలు, నీళ్లలా కలసిపోయారు.

200 ఏళ్ళ తర్వాత అమొరైట్లు సుమేరియాను ఆక్రమించుకుని తొలి బాబిలోనియా సామ్రాజ్యాన్ని స్థాపించారు. దీనిని హమ్మురాబీ(క్రీ. పూ. 2100… జోసెఫ్ క్యాంప్ బెల్ ప్రకారం క్రీ.పూ.1728) మరింత పటిష్టం చేశాడు. ప్రపంచానికి తొలి శిక్షాస్మృతిని ఇచ్చిన రాజుగా ఇతన్ని చెబుతారు.

ఇతని కాలంలోనే సెమెటిక్కులు ఈజిప్టును ఆక్రమించుకుని షెపర్డ్ రాజుల పేరుతో పాలించారు. అయితే, వీరు ఈజిప్టు భాషాసంస్కృతులతోనూ, ప్రజలతోనూ మమేకం కాలేదు. క్రీ. పూ. 1600 లలో ఈజిప్టులో పెద్ద యెత్తున ప్రజోద్యమం తలెత్తి వీరిని పారదోలింది.

ఫొనీషియన్ల గురించి చెప్పుకునే ప్రయత్నంలో ఈ చరిత్ర అంతా తడమాల్సివచ్చింది. ఇంతకీ విషయమేమిటంటే, సారగాన్, హమ్మురాబీ, షెపర్డ్ రాజుల్లానే ఫొనీషియన్లు కూడా సెమెటిక్కులు. వీరు సముద్రయానం చేస్తూ నావికులుగా, వర్తకులుగా ప్రసిద్ధి చెందారు. వీరు తొలి నౌకావర్తకులలో ఒకరు. మొదట్లో పశ్చిమ ప్రాంతంలో, ఎక్కువగా స్పెయిన్ లో ఉండేవారు. హమ్మురాబి కాలం నాటికి వీరు మధ్యధరా సముద్రప్రాంతం అంతటా విస్తరించి వలసలు ఏర్పాటు చేశారు. మధ్యధరా తూర్పు తీరం వెంబడి వీరు నెలకొల్పిన రేవు పట్టణాలలో టైర్, సిడాన్ ముఖ్యమైనవి. ఆఫ్రికా ఉత్తరతీరంలో వీరు నిర్మించిన నగరం కార్తేజ్. ఒకప్పుడు పది లక్షల జనాభా ఉన్న పెద్ద నగరం అది.

ఫొనీషియన్లు మధ్యధరా జలాలలో తిరిగిన తొలి నావికులలో ఒకరే కానీ, తొలి నావికులు కారు. వారికి ముందే మధ్యధరా సముద్రతీరంలోనూ, దీవుల్లోనూ కొన్ని పట్టణాలూ, నగరాలూ ఉండేవి. బాస్క్, బెర్బర్, ఈజిప్షియన్ తెగలతో రక్తసంబంధం, భాషా సంబంధం ఉన్న ఏజియన్ జాతి లేదా జాతులకు చెందినవి ఇవి. వీరినే గ్రీకులుగా పొరబడతారు కానీ, కాదు. గ్రీకులకు పూర్వులైన వీరి నగరాలు గ్రీస్, ఆసియా మైనర్, మైసీనియా, ట్రాయ్ లలో ఉన్నాయి. వీరికే చెందిన క్రీటు ద్వీపంలోని క్నోసోస్ అప్పటికి మంచి ఉచ్చ దశలో ఉంది. ఈ ఏజియన్లే చరిత్రకు తెలిసిన తొలి నావికులు.

మన సింధు నాగరికత లానే క్రీటు నాగరికత కూడా ఒక విస్మృతనాగరికత. 19 వ శతాబ్ది చివరిలో జరిపిన పురావస్తు తవ్వకాలలో క్రీటు నగరం క్నోసోస్ బయటపడింది. అప్పటినుంచే ఏజియన్ నాగరికతా వ్యాప్తి గురించి ప్రపంచానికి తెలిసింది. క్రీ.పూ. 1400 నాటికి క్రీటు కూడా మన సింధు నాగరికత లానే హఠాత్తుగా అంతరించిపోయింది. తవ్వకాలలో బయటపడిన క్నోసోస్ శిథిలాలలో అగ్నిప్రమాదం, భూకంపం సంభవించిన ఆధారాలు కనిపించాయి. అవి రెండూ కబళించగా మిగిలిన దానిని గ్రీకులు దోచుకుని ఉంటారని ఊహ.

క్నోసోస్ నిజానికి ఒక నగరం కాదు, ఒక పెద్ద రాజప్రాసాదం మాత్రమే. క్రీటు పాలకుని పేరు మినోస్. ఈజిప్టు ఫారో లానే ఇది కూడా రాచరిక నామం. క్నోసోస్ కు మొదట్లో కోటగోడలు లాంటివి ఏవీ ఉండేవి కావు. రాజప్రాసాదంలో స్నానశాలల వంటి వసతులన్నీ ఉండేవి. క్రీటులో స్త్రీపురుషుల మధ్య పూర్తి సమానత్వం ఉండేది. నాటి క్రీటు స్త్రీలు ధరించిన దుస్తులు నేటి కాలపు దుస్తుల్ని తలపించేలా ఉంటాయి. క్రీటు ప్రజలు ఒక నిరంతర ఉత్సవ వాతావరణంలో ఉల్లాసంగా జీవించినవారుగా కనిపిస్తారు. స్త్రీపురుషుల జిమ్నాస్టిక్సే కాదు, యెడ్ల యుద్ధాలు(bull fights) కూడా క్రీటులో ఉండేవి. ఇప్పటికీ స్పెయిన్ యెడ్ల యుద్ధాలకు ప్రసిద్ధమే.
01bulfight.xlarge1

విశేషమేమిటంటే, ఇప్పటి బుల్ ఫైటర్లు ధరించే దుస్తులకు, అప్పటి క్రీటు బుల్ ఫైటర్లు ధరించిన దుస్తులకు పోలిక ఉండడం!

క్రీటు వాసులు ఎంతో అందమైన కళాత్మకమైన జీవితం గడిపేవారనడానికి వారి దుస్తుల తీరేకాక, తవ్వకాలలో బయటపడిన మృణ్మయపాత్రలు, శిల్పాలు, చిత్రాలు, నగలు, దంతపు వస్తువులే సాక్ష్యం. వారికి లిపి కూడా ఉండేది. గృహ బానిసలు, పారిశ్రామిక బానిసలు ఉండేవారు. ఇంకా ఆశ్చర్యమేమిటంటే, డేడలస్ అనే ఒక క్రీటు వాసి విమానం లాంటి ఒక ఎగిరే వాహనాన్ని తయారు చేశాడనీ, అది సముద్రంలో కూలిపోయిందనే వివరం, అనంతర కాలంలో క్రీటును ఆక్రమించుకున్న గ్రీకుల పురాగాథలలోకి ఎక్కింది. మన రామాయణంలో చెప్పిన పుష్పక విమానానికి మూలం ఇదేనేమో తెలియదు. క్రీటులకు ఉల్కాపాతం ద్వారా లభించిన ఇనుము మాత్రమే తెలుసు. గాడిదలే తప్ప గుర్రం తెలియదు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, గ్రీకుల ఆక్రమణ కంటే ముందే క్రీటు దీవి పక్కన తిష్ట వేసిన సెమెటిక్ సంచారజీవులైన ఫొనీషియన్లు క్రీటుపై దాడులు చేస్తూ ఉండేవారు. మరోవైపు ఉత్తర దిశనుంచి గ్రీకు నావికులు దాడులు చేస్తూ ఉండేవారు. ఈ దాడుల ఫలితంగానే క్రీటు రాజప్రాసాదం చుట్టూ కోటగోడలు లేచాయి. ఆ రోజుల్లో నావికులు వర్తకవ్యాపారాలే కాక, దోపిడీలు చేస్తుండేవారని పైన చెప్పుకున్నాం.

ఫొనీషియన్లు క్రీటు వాసుల తర్వాతే చరిత్ర తెర మీదికి వచ్చి ఉండచ్చు కానీ, వారిని కూడా క్రీటులానూ, మరికొన్ని పురా నాగరికతల్లానూ పాత ప్రపంచానికి పరిమితం చేస్తూ కాలగర్భంలోకి నెట్టి వేసే ఒక కొత్త కెరటం త్వరలోనే మరింతగా ఉధృతంగా విరుచుకు పడింది. పైన చెప్పుకున్న గ్రీకులు ఆ కెరటంలో ఒక భాగమే. అది తొలి నాగరిక ప్రపంచాన్ని అంతం చేసి సరికొత్త ప్రపంచానికి జన్మ నిచ్చింది. ఆ కెరటం పేరు, ఆర్యులు!

ఈ మధ్యలో, ఇప్పుడు యూదులుగా మనకు బాగా తెలిసిన హిబ్రూలకు, ఫొనీషియన్లకు మధ్య ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు ఏర్పడి, ఫొనీషియన్ల సముద్రవర్తకం మరింత విస్తరించింది. అందులోకి వెళ్ళే ముందు ఒక విషయం చెప్పుకోవాలి. క్రీటుతో సహా పైన చెప్పినదంతా(మధ్యలో మన గురించిన ఒకటి రెండు ప్రస్తావనలు తీసేస్తే) పాశ్చాత్యచరిత్రకారుని వెర్షన్ మాత్రమే. ఇందులో మన దేశం తాలూకు లింకులను గుర్తించాలంటే రాంభట్ల, కోశాంబీల వెర్షన్లు చూడాల్సి ఉంటుంది. ఇలా అనడమైతే తేలిగ్గా అన్నాను కానీ, పూర్తి స్థాయిలో అది ఇప్పట్లో సాధ్యమని చెప్పలేను.

మాండొలిన్ ఇప్పుడు వొంటరి మూగ పిల్ల!

         srinivas-01

మాండొలిన్ తీగల మాయాజాలానికి తెర పడింది. కణకణంలో కర్పూర పరిమళాల తుఫానుల్ని రేపే కమనీయ వాద్యమొకటి పైలోకాలకు పయనమైంది. ఏ తంత్రులనుండి వెలువడే రాగాలను వింటే వసంత సౌఖ్యాలు మన చెవులనూ మనసునూ కమ్ముకుంటాయో, ఏ చేతివేళ్లు తీగలమీద విద్యుల్లతల్లా నర్తిస్తుంటే స్వరఝంఝలు ఉవ్వెత్తున ఎగసి నాట్యమాడుతాయో, ఏ నాదవైభవం నిండిన నదీతరంగాల మీద తెప్పలా తేలిపోతుంటే జీవనసార్థక్య భావన హృదయపు లోతుల్లోకి ఇంకిపోతుందో, ఆ తీగల చేతుల తరంగాల మెస్మరిజం మనకిక లేదు.

పాలకొల్లులో ప్రభవించిన పసిడిరాగాల పాలవెల్లీ. నీ మరణవార్తకన్న పిడుగుపాటు ఎంత మృదువైనది! బ్రతుకుబాటలో మధ్యలోనే కూలిన సంగీత శిఖరమా. నీ మాండొలిన్ స్వరాల విందుకు దూరమైన అసంఖ్యాక రసికుల దురదృష్టాన్ని ఏమని వర్ణించడం. నీ పాదాలకు ప్రణమిల్లితే తప్ప నివాళి అన్న పదానికి నిజంగా అర్థం వుందా. సరస్వతీ పుత్రుడా, శయనించు హాయిగా స్వర్గసీమలోని శాంతిపవనాల నడుమ.

*         *         *

మాండొలిన్ శ్రీనివాస్ ప్రతిభకు నోరెళ్లబెట్టని సంగీత రసికులుండరంటే అది అతిశయోక్తి కాదు. అసలు మాండొలిన్ అనేది ఒక పాశ్చాత్యసంగీత వాద్యం. దానిమీద పాశ్చాత్య సంగీతాన్ని పలికించడమంటే ఏమో అనుకోవచ్చు. కాని శుద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నిసర్గసౌందర్యంతో – అదీ అత్యంత పిన్న వయసులో – ధారాళంగా జాలువారించటం ఊహకందని ప్రతిభాపాటవాలను సూచించే విషయం. పూర్వం ఈమని శంకర శాస్త్రి గారు కమ్ సెప్టెంబర్ సినిమాలోని ఇంగ్లిష్ పాటలను వీణ మీద పలికించటం గురించి సంగీత రసికులు ఉత్సాహంగా మాట్లాడుకునేవారు.

మాండొలిన్ శ్రీనివాస్ సంగీతాన్ని ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్లు మళ్లీమళ్లీ వింటూ నాదసాగరంలో ఓలలాడానో లెక్క లేదు. నళిన కాంతి రాగంలో ఆయన వాయించిన ‘మనవి యాలకించ’ అద్భుత కౌశలానికి నిదర్శనం. కలియుగ వరదన (బృందావన సారంగ రాగం) అనే మరో కృతి అత్యంత మనోహరమైనది. రేవతి రాగంలో ఒక జావళిని కూడా ఆయన గొప్పగా వాయించాడు (ఈ రాగానికి హిందుస్తానీ శైలిలో బైరాగీ భైరవ్ అని పేరు). మార్గళి సంగీతోత్సవంలోనో లేక త్యాగరాజ ఆరాధనోత్సవంలోనో ఒకసారి ఒకే వేదిక మీద శ్రీనివాస్, అతని అన్న అయిన రాజేశ్ ఇద్దరూ కలిసి యుగళవాద్య కచేరీ ఒకటి చేసారు. కచేరీ మధ్యలో తన తమ్ముడు శ్రీనివాస్ పలికించిన అద్భుత తంత్రీనాదానికి ముగ్ధుడైన రాజేశ్ వెంటనే అతనికి సల్యూట్ చేయడం రెండుమూడేళ్ల క్రితం యూ ట్యూబ్ లోని విడియో క్లిప్ లో వీక్షించాను. ఆ విడియో మాత్రమే కాక మరికొన్ని మంచి విడియోలు శ్రీనివాస్ వి ఇప్పుడు యూ ట్యూబ్ లో లేవు. కారణం తెలియదు. శ్రీనివాస్ వాయించిన మంచి నంబర్స్ ను వరుసగా పేర్కొంటే ఒక పెద్ద జాబితా తయారవుతుంది. స్వరరాగ సుధా (శంకరాభరణం), సిద్ధి వినాయకం (మోహన కల్యాణి), మామవ సదా జనని (?కానడ), సరసిజాక్ష (కాంభోజి), నిరవతి సుఖద (?కదన కుతూహలం), ఇంతకన్నానందమేమి (బిలహరి), రఘువంశ సుధాంబుధి (కదన కుతూహలం), దరిని తెలుసుకొంటి (శుద్ధ సావేరి) నారాయణతే నమో నమో (బేహాగ్), నగుమోము (అభేరి), బంటు రీతి (హంసనాదం), గజవదన – ఇలా ఎన్నెన్నో.

అంతటి అనన్య ప్రతిభను సొంతం చేసుకోవటం మానవమాత్రుల వల్ల అయ్యే పని కాదనిపిస్తుంది. ఆయన మరో రెండుమూడు దశాబ్దాల పాటు జీవించి, అతని బ్రతుకు సాఫీగా సాగివుంటే భారతరత్న పురస్కారాన్ని కూడా దక్కించుకునేవాడేమో.

                                                                  –  ఎలనాగ

elanaga

 

 

 

అప్పుడే వెళ్ళిపోవాలా శ్రీనివాస్?

_77686021_160577751

విజయవాడలో కర్నాటక సంగీత కచేరీ అంటే గాంధీనగరం హనుమంతరాయ గ్రంధాలయంలో జరుగుతుండేవి సర్వ సాధారణంగా. ఆ నెల కచేరీ టిక్కెట్లు ఇవ్వడానికి వచ్చిన సభ గుమాస్తా చాలా గొప్పగా చెప్పాడు అమ్మతో, “ఈ సారి కచేరీ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో నండీ. ఫోగ్రాము మా గొప్పగా ఉంటది అన్నారు మా అయ్యగారు.” వరండాలో కూర్చుని ఏదో ఇంగ్లీషు డిటెక్టివు నవల చాలా శ్రద్ధగా చదువుకుంటున్న నా చెవిలో ఈ మాటలు పడి కొంత కుతూహలం కలిగించాయన్నది నిజం. కళాక్షేత్రంలో కచేరీ అంటే మాటలు కాదు. అప్పటికి నాకు తెలిసి అలాంటి కచేరీ జరిగింది సుబ్బలక్ష్మి వచ్చి పాడినప్పుడూ, మళ్ళీ బాలమురళీకి విజయవాడ పౌరసన్మానం జరిగినప్పుడూనూ.

కచేరిలో చెవుల తుప్పొదిలిపోయింది. అసలు అంతకు మునుపు ఎప్పుడూ విని ఎరుగని ధ్వని. విచిత్రంగా ఉన్నది. అటుపైన, ఆ రాగాలాపనల నొక్కులేవిటి, ఆ స్వరప్రస్తారాల మెరుపులేమిటి .. ఇంతా చేసి అంత పెద్ద స్టేజీ మీద ఒక నలుసంత పిల్లగాడు. అటూ ఇటూ పక్క వాద్య విద్వాంసులు సూర్య చంద్రుల్లాగా ఉన్నా ఆకాశంలో కదలని స్థానం నాదేసుమా అని ధీమాగా మెరుస్తున్న ధృవ నక్షత్రం లాగా ఆ చిన్న పిల్లాడు, చేతిలో .. ఒక ఆటవస్తువు లాంటి వాయిద్యం .. దాని పేరు మేండొలిన్-ట! కేవలం కొత్త వాయిద్యం కొత్త రకం నాదం అన్న వైవిధ్యం ఒక్కటే కాదు .. ఆ విద్వత్తు, విద్వత్తుని వెలువరించిన తీరు .. విభ్రాంతి కలిగించాయి అనడం అతిశయోక్తి కాదు. అసలే ఆ రోజుల్లో నాకు ఎవరూ ఒక పట్టాన నచ్చే వాళ్ళు కాదు. కానీ కరిగి ముద్దైపోయాను.

కచేరీ పూర్తయ్యాక, చివరి బస్సు పట్టుకోవాలి అని ఎప్పుడూ ఆరాట పడే అమ్మ, ఆ మాటే ఎత్తకుండా స్టేజివేపుకి దారి తీసి, ఆ పిల్లాడి బుగ్గలు పుణికి పర్సులోంచి ఓ పది రూపాయల కాయితం ఆ అబ్బాయి చేతిలో పెట్టి వచ్చింది. ఎవరో శ్రీనివాసుట .. తెలుగు పిల్లాడేట .. మహా ఐతే పన్నెండేళ్ళుంటాయేమో .. అబ్బ, నిజంగా ఆ మేండలిన్‌తో బిల్లంగోడు ఆడుకున్నట్టు ఆడుకున్నాడు.

1424416_737306813028416_4252700639450257697_n

మరోసారి శ్రీనివాస్ విజయవాడలో కచేరి చెయ్యడానికి వచ్చే సరికి మా అమ్మ బుగ్గలు పుణికే స్థాయి దాటి పోయి చాలా ఎత్తుకి ఎదిగి పోయాడు. చూస్తుండగానే సంగీతం షాపుల్లో కొల్లలుగా కేసెట్లు .. ఎక్కడెక్కడివో రాగాలు .. ఏవేవో పోకడలు .. అడిబుడి రాగాలలో పెద్ద పెద్ద రాగం-తానం పల్లవులు. బాగా తెలిసిన నను పాలింప, నగుమోములకి సరికొత్త రంగులద్దకాలు. ఆ ఉప్పెనలో చెన్నై మునిగిపోయింది. ఒక చెన్నై ఏవిటి, ప్రపంచం మొత్తంలో కర్నాటక సంగీతం వినే వారెవరూ ఆ మంత్రజాలంతో ముగ్ధులు కాకుండా ఉండలేదు.

ఫోటో: ఆర్వీవీ కృష్ణారావు గారి సౌజన్యంతో

ఫోటో: ఆర్వీవీ కృష్ణారావు గారి సౌజన్యంతో

నేను అమెరికా వచ్చాక కూడా ఐదారు సార్లు నేరు కచేరీలు విన్నా. ఇన్ని కర్నాటక కచేరీలలోనూ ఒక పరమాద్భుతమైన అనుభవం డెట్రాయిట్ సింఫొనీ హాలులో జాన్ మెక్లాలిన్ శక్తి బేండుతో కలిసి శ్రీనివాసుని వినడం. నయాగరా జలపాతంలో పడితే అది మహా అయితే ఓ మూణ్ణిమిషాల అనుభవం కావచ్చు. సుమారు గంతన్నరసేపు నయాగరా కింద నిలబడితే ఎలా ఉంటుందో .. ఎదురు పడినా ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఒక మందహాసం. వేదిక మీదినించి మాట్లాడినా . మంద్రస్థాయిలో మృదువుగా, పాటని ఎనౌన్స్ చేసేంత వరకే. ఎప్పుడూ ఏ కాంట్రవర్సీలలోకీ పోలేదు. ఒక సారి అతని అమెరికా టూరుగురించి ఏదో అసంతృప్తి చెందిన కొందరు పెద్ద తలకాయలు కొంత అలజడి సృష్టించినా ఇతను సంయమనం కోల్పోలేదు.

తనివి తీరలేదే .. మా మనసు నిండలేదే .. ఎన్ని రికార్డింగులున్నా .. నేరుగా నీ చిరునవ్వుని చూసిన అనుభవం రాదుగా! అప్పుడే వెళ్ళిపోవాలా శ్రీనివాస్?

-నారాయణ స్వామి

10322847_10202715932672029_5083099762996079386_n

వాలకం

drushya drushyam 49...
చాలా మామూలు దృశ్యం.
ధాన్యం బస్తాలపై పక్షులు.

బజార్లలో…
ముఖ్యంగా రోడ్లపై ధాన్యం బస్తాలు తీసుకెళుతున్నలారీలు, ట్రాలీలు…
వీటిని చూసే ఉంటారు.
వాటిపై వాలిన పక్షులను, ఆ గుంపులను చిర్నవ్వుతో చూసే ఉంటరు.
ఎవరికైనా వాటిని చూస్తే నవ్వొస్తుంది.

అవి ముక్కుతో పొడుస్తూ ఆ ధాన్యం గింజలను ఏరుకుని తింటూ ఉంటై.
చప్పున లేస్తూ, ఒక బస్తా నుంచి ఇంకో బస్తా వద్దకు దుముకుతూ ఉంటై.
చిన్నపిల్లల మాదిరి నానా సందడి చేస్తూ ఆ గింజలను ఆరగిస్తుంటై.
దూరం నుంచి చూస్తున్నవాళ్లకు నవ్వాగదు.

ఒక్కోసారి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలుచున్నప్పుడు ఇటువంటి వాహనం, పైన పక్షుల గుంపు కానవస్తుంది.
చూస్తూ ఉంట.

కెమెరా కన్ను తెరిచి, ఫొటో తీసేంత టైం ఇవ్వవు.
‘ప్చ్’ అనుకుంట.

నిజానికి ఆ పక్షులు, ఆ వాహనపు డ్రైవరూ …ఎవరూ నన్ను పట్టించుకోరు గానీ అప్పుడు నన్ను చూడాలి.
ఒక అపరిచిత దృశ్యం బంధించి సంతోషించే నేనూ… వేగంగా పరిగెత్తుతున్న ఆ లారీపై వాలిన పక్షీ వేరు కాదని తెలుస్తుంది.
గింజల ఆశ – ఛాయాచిత్రణం వంటిదే అంటే నమ్మాలి.
అందుకోసం దేనిమీద వాలతామో తెలియదు, నిజం!

కానీ, గమనించే ఉంటారు.
ఆ పక్షులు…వాటి కేరింతలు.
వాటి పని వాటిదే.

ఏమో!
దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్టు వాటికి తెలుసో లేదో.
కానీ, అవి మహా బిజీగా ఉంటై.
ఒకట్రెండు కాదు, ఆ వాహనాన్ని ఏకంగా ఒక పక్షుల గుంపే ఆక్రమించుకుంటుంది.
ఇది కూడా ఒక రకంగా నా దృష్టిలో – సీరిస్ ఆఫ్ ఫొటోగ్రఫి.

క్లిక్ క్లిక్ క్లిక్.
పక్షుల రొద వంటి ఛాయాచిత్రణం.
వస్తువుపై పడి నానా హింస చేయడం.
తర్వాత తుర్రున ఎగిరిపోవడం.

ఎవరికీ తెలియదుగానీ పక్షి వేరు, విహంగ వీక్షణం తెలిసిన ఛాయా చిత్రకారుడూ వేరు కాదు.
ఆక్రమించుకుని, కాస్త సమయంలోనే అబగా అలా గింజల కోసం ఆరాట పడటమే.
అదే సహజం. అట్లే ఇతడూనూ.

సంతృప్తి ఉంటుందని అనుకోను.
కానీ ఒక పక్షి ప్రయత్నం.

ముక్కుతో కరుచుకుని, మంచి గింజ వెతుక్కుని అట్లా కాసేపు పొట్ట పోసుకున్నట్టు
ఈ ఛాయా చిత్రకారుడూనూ అంతే.
ఏదో ఒడిసి పట్టుకున్నట్టు శాంతిస్తడు.

పక్షి అని కాదు, ప్రేమ పక్షే.
ఫొటోగ్రఫీ అన్నది ముందూ వెనకాల ఊహించకుండా వాలిపోవడమే.
అందుకే, పక్షులు వాలినప్పుడల్లా నాకు ఫొటోగ్రఫీ జరుగుతున్న దృశ్యం ఒకటి మనసును ఆనంద పారవశ్యం చేస్తుంది.

ఒక విస్తరణ.
an experiment

తర్వాత?

తిరిగి రావలసిందే?

నిజమే. అప్పటికే కొన్ని మైళ్లు ప్రయాణిస్తయి.
ఆ పక్షులు భారంగా తిరిగి రావలసిందే.
వస్తయి కూడా.

నేనూ అంతే.

ఒక ఛాయా చిత్రకారుడెవరైనా అంతే.
ఆ ఛాయ గడిచినంతసేపూ ఏదీ గుర్తు రాదు.
తర్వాత మళ్లీ మామూలే.
వెనుదిరగాలి, దైనందిన జీవనచ్ఛాయల్లోకి.

వాటికీ తెలుసేమో!
అది వాహనమే అనీ,!
ఆ ధాన్యపు వాహనం ప్రయాణంలో ఒక ఆటవిడుపే అని.
కానీ, తెలిసినా తెలియకపోయినా ఒక వాలకం. అంతే.
అలవడిన వైనం. అంతేనేమో!

కానీ, మనందరి గురించి ఒకమాట.
పక్షి అనో, ఛాయా చిత్రకారుడనో కాదు, మనందరమూ అంతే కదా!
తెలియకుండా మనం వెంపర్లాడే విషయాలు ఎన్నని ఉంటై?

అప్పుడు గుర్తురావు గానీ…
మన పనీ అంతే కదా అంటే ఇప్పుడొకసారి అంగీకరించవచ్చు కదా!

నిజమే కదా!
ఆ వాహనం యజమాని దయగలిగిన వాడైనా, కాకపోయినా
వాటిని అదిలించినా, అదిలించకపోయినా …అవి కొద్దిదూరం తప్పక ప్రయాణిస్తయి.
తర్వాత మళ్లీ ఇంకో పక్షుల గంపు.
మళ్లీ అదే దృశ్యం.

కానీ, ఈ దృశ్యం ఇంకా ఏదో చెబుతుందని తీయాలనిపించింది.
చాలాసార్లు ప్రయత్నించాను. పక్షులు వాలిన చెట్టువలే ఉన్న లారీలను తీయ ప్రయత్నించాను.
కానీ, వేగం వల్ల…అంత ఒడుపుగా ఆ దృశ్యాన్ని పట్టుకోకపోవడం వల్ల ఈ ఒక్క చిత్రమే తీయగలిగాను.

ఇందులో ఏ గొప్పా లేదు.
కానీ తప్పదు. అలా వాలిపోయింది మనసు.
అదే దృశ్యాదృశ్యం.

+++

ఎవరో పిలిచినట్టు వినిపిస్తే తలుపు తీసి చూసినట్టు
అవీ అట్లా రోడ్డు వారగా ఒక కన్నేసే ఉంచుతై…
ఏదైనా ఇలా కనిపించిందా..
కేకేసి అమాంతం ఆ వాహనం వెంటపడ్తయి.

నాకైతే చెట్టపై వాలిన పక్షులకన్నా
బస్తాల లారీపై వాలిన పక్షులే ఆసక్తి.

మానవాసక్తి.

– కందుకూరి రమేష్ బాబు

ramesh

కుహనా సంస్కరణపై కొడవటిగంటి బాణం!

కొడవటిగంటి కుటుంబ రావు గారు (కొ.కు.) విడాకుల చట్టం (అప్పటికింకా దాని రూపం గురించి చర్చలు జరుగుతున్నట్లున్నాయి) గురించిన చర్చతో కథని మొదలుపెట్టారు. అసలు పాయింటు ‘భర్తలు భార్యల్ని హింసించడం’ అన్నట్టు, దాన్ని కొకు వ్యంగ్యంగా సమర్థిస్తున్నట్టూ కనిపించినా (ఏ మాత్రం శృతి కుదరని హస్తిమశకాంతరమున్న జంటల విషయంలో కనీసం) – ఆయన చెప్పదల్చుకున్నది ‘సమస్య యొక్క అసలు మూలాల దగ్గరకి వెళ్ళకుండా పైపైన పాయింట్లతో చెలరేగిపోయే సంఘసంస్కరణాభిలాషుల వల్ల కలిగే ప్రయోజనం సున్నా అనే.

ఈ కథ లోని ‘శివానందం’ పాత్ర సంస్కరణ పేరు చెప్పి పోజు కొట్టే అనేక మందికి ప్రతినిధి.
ఆనాటి నవీన విద్యావిధానంలో ఏదో అరకొరగా ఇంగ్లీషు నాగరికతా ముక్కల్ని మైండ్ లో పోగు చేసుకుని వాటన్నిటి నుంచే జీవిత సమస్యలకి పరిష్కారం దొరుకుతాయనుకునే అమాయకత్వం/మూర్ఖత్వం కలబోసిన మనిషి శివానందం.

ఇలాంటి వాళ్ళని మోసగాళ్ళు, స్వార్థపరులు అనడం సబబు కాదు. తమకే పరిష్కారాలు తెలుసునన్న దృక్పధం ఇలాంటి నవీన బుద్ధిశాలులలో చాలా ఎక్కువగా కనపడటం ఈనాడూ మనం గమనించవచ్చు.

ప్రేమ లేని శాపపు పెళ్ళిళ్ళలో వచ్చే సమస్యలన్నింటికీ (మానసిక శారీరక హింసలు, నస, అక్రమ సంబంధాలు వగైరా) అసలు పరిష్కారం వాటిని అర్థం చేసుకుని పరిష్కరించగల వివేకాన్ని తెచ్చుకోవడంలోనే ఉంటుందని వాచ్యంగా చెప్పకపోయినా సూచ్యంగా చెప్పినట్లున్నారు కొకు.

సంఘోద్ధరణకి బయల్దేరే లోతులు లేని సంస్కర్తల వైఫల్యాన్ని వ్యంగ్యంగా ఎత్తి చూపించడం లోనే ఈ సూచన ఉందనిపిస్తోంది.

లాలిత్యం – ప్రేమ మాట దేవుడెరుగు – చూడగానే కంపరం పుట్టించే రూపాలూ, అవిద్య, మూర్ఖత్వం వల్ల ముఖంలో ముద్ర పడిపోయిన కోపమూ, అసూయా, కుళ్ళుమోత్తనమూ – ఇటువంటి ‘విపరీత’ దాంపత్యాన్ని సంస్కర్తల అమాయకత్వాన్ని ఫోకస్ చేసేందుకే కథలో పెట్టాడేమో అనిపిస్తుంది.

KODAVATIGANTI-KUTUMBARAO

భారతదేశంలోని స్త్రీలందరూ పురాణాలలోని పతివ్రతలని ఫాలో అయ్యే వాళ్ళనీ, ‘సంస్కరణ యావత్తూ మగవాడికే చెయ్యవలసి ఉంది’ అనీ శివానందం నమ్మడం లోనే అతని అవివేకాన్ని, ముందు జరగబోయే కథని సూచిస్తాడు కొకు.

పెళ్ళాలని కొట్టకుండా మగవాళ్ళని ఆపడం కోసం శివానందం వేసిన ‘ప్లాన్ ఆఫ్ కాంపేన్’ (ఒపీనియన్ ఒకటి క్రియేట్ చెయ్యడం, ఉద్రేకిస్తూ ఓ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ రాయడం వగైరా) పెద్దగా ఫలించక చివరికి శ్రీరాములు గారనే పెద్దమనిషిని సంస్కరించబూనుకుంటాడు.

శ్రీరాములు గారు ఈ కుహనా సంస్కర్తకన్నా వెయ్యిరెట్లు తెలిసినవాడు. అయినా శివానందం తన ఉపన్యాసాయుధాన్ని శ్రీరాములు గారి మీద ప్రయోగించడం మొదలుపెట్టగానే ఆయన ‘పడిపోయినట్లు’ నటించి శివానందాన్ని అప్పుడప్పుడూ తన ఇంటికి వచ్చి తనలో కలిగిన పరివర్తనని చూసి తన కాపరాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండమంటాడు.

శివానందం తన స్నేహితుడితో (కథకుడు) కలిసి శ్రీరాములు గారి ఇంటికి వెళతాడు.

అక్కడ శ్రీరాములు గారి భార్య తన గయ్యాళితనాన్ని శివానందానికి రుచి చూపిస్తుంది. ఆడవాళ్ళని కొట్టే మగవాళ్ళని సంస్కరించబూనుకున్న శివానందం తనే ఆమెని కొట్టబోవడం, అతనికి శృంగభంగం కావడంతో కథ ముగుస్తుంది.

ఇంత జరిగినా శివానందంలో ఏమీ మార్పు రాలేదన్న విషయాన్ని చివర్లో శివానందం కథకుడితో అన్న మాటల ద్వారా సూచిస్తాడు కొకు. కొకు తను చెప్పదలుచుకున్నది ఏ ఆవేశమూ లేకుండా నింపాదిగా ఎంత బాగా చెప్పగలడు అన్న దానికి ఈ కథ ఒక ఉదాహరణ. క్రింది లింక్ లో చదవండి……

http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=14745

– రాధ మండువ

ఇంకో నేను

15-tilak

 

 

 

 

నేను నేను కాదు అప్పుడప్పుడూ

రాత్రి నిదట్లో స్కలించిన స్వప్నాన్ని

అస్తిత్వాలు తెలియని నిర్వేదాన్ని

అసంకల్పితంగా

రాలే ఋతువులు

నాలో కొన్ని

నిర్లిప్తాలో

నిస్సంకోచాలో

గోడ మీద అందంగా పేర్చబడ్డ సగం పగిలిన ఆత్మలో

గుర్తులేదు కానీ ఇంకా ఎన్నింటినో

వెలిసిన వర్షం తర్వాత కరెంటు తీగను పట్టుకుని వేలాడే నీళ్ళ బిందువులు

ఆత్మహత్యకు తయారవుతూ

మునుపో

నేడో

ఎప్పుడో

నిశ్శబ్దం నవ్వులో నుండి

పదాలన్ని వెచ్చని పందిర్లుగా

తెరిచి మూసిన తలుపులు

ఒరుచుకున్న ఆకాశపు మట్టి

భావాలు ఇంకొన్ని

కళ్ళనూ

కడుపునూ కన్నీళ్ళతో కుట్లేస్తూ

పగలో ఆకలి పొట్లం

ఇప్పుడు మళ్ళా నేను కాదు

మధ్యాహ్నం కడుకున్న ఎంగిలిని

కూసింత ఎర్రటి ముసురు

ఒక నిద్ర

మరో మెలకువ

రెండూ నాలోనే

నాతోనే

రాళ్లు పడ్డ పదార్థం

తరంగాలుగా పగులుతూ

నన్ను గుర్తుచేస్తూ

మనిషి నిక్షేపాలు

చెరిగిన చెమ్మ అంచు అంచుపై నిలబడుతూ

నన్ను నేను శోదిస్తూ

 

-తిలక్ బొమ్మరాజు

అదేంకాదు కానీ..

bvv prasad

 

 

 

 

 

అదేంకాదు కానీ, కాస్త నిర్లక్ష్యంగా బతికి చూడాలి

దిగంబరా లేచిరా అంటే దిగ్గున నిలబడ్డ బైరాగిలా
ఆకాశం తప్ప మరేమీ అక్కర్లేని అవధూతలా
గాలిపడవ తెరచాపై ఎగిరే ఎండుటాకులా నిర్మోహంగా నిలవాలి

దేనిలోంచీ దేనిలోకీ నాటుకోని
అలలమీది ఆకాశబింబాల్లా కాస్త తేలికగా చలించాలి

ఏముందిక్కడ మరీ అంత బాధపెట్టేది
మరీ అంత లోతుగా ఆలోచించవలసింది

మర్యాదలన్నీ గాలికొదిలేసి చూడాలి
భుజమ్మీద వ్రేలాడే బాణాల్నీ, లక్ష్యాల్నీ
కాసేపు మరపు మైదానంలో వదిలేసి రావాలి

వేటినీ మోసేందుకు మనం రాలేదనీ
జీవనమహాకావ్యం మననే ఓ కలలా మోస్తోందనీ
నీటిబుడగ చిట్లినట్లు చటుక్కున స్ఫురించాలి

అదేంకాదు కానీ, జీవితాన్ని జీవితంలా ప్రేమిస్తూ బతకాలి
అవమానాలూ, ఆందోళనలూ అట్లా ఓ పక్కకి విసిరేసి
లోకం నిండా నాటుకుపోయిన నాటకవిలువల్ని చూసి
జాలిజాలిగా, సరదాగా నవ్వాలి

ఏముందిక్కడ మరీ అంత పొంది తీరవలసింది
పోగొట్టుకుని గుండెచెదిరి రోదించవలసింది

దిగులు సాలెగూళ్ళన్నిటినీ
చిరునవ్వు కుంచెతో శుభ్రంచేసి
విశాలమైన ఆకాశాన్ని చిత్రించి చూడాలి

చూడాలి మనం చిత్రించిన ఆకాశం నిండా
ధగధగలాడుతోన్న ఎండ సంరంభం
వానబృందం ప్రదర్శించే సంగీతనృత్యరూపకం
చలిరాత్రుల వికసించే గోర్వెచ్చని ఊహల పరీమళోత్సవం

అదేంకాదు కానీ
జీవితం లోపలి దృశ్యాలన్నీ బరువెక్కినప్పుడైనా
జీవితమే ఒక ప్రతిబింబం కావటంలోకి కనులు తెరవాలి

 

 -బివివి ప్రసాద్

మిడిమిడి రాతల వల్లే విమర్శ దీపం కొడిగట్టింది!

        విమర్శకుడు అహంకారైతే విమర్శ ప్రేలాపనగా మారిపోయే ప్రమాదముంది. విమర్శకుడు వాచలుడైతే రచయితను చంపేసే అవకాశముంది. విమర్శకుడు కుతార్కికుడైతే రచయిత ఆలోచనను దుర్వ్యాఖ్యానం చేస్తాడు. విమర్సకుడు అపండితుదైతే (అజ్ఞానైతే) ఆవ్యాఖ్యానం అపరిపక్వంగా నిలిచిపోతుంది. విమర్శ వ్యాఖ్యానానికి రచనలోని అంతర్గత సాక్ష్యాలను ఉపయోగించుకోవాలి. మనం ఎత్తిచూపకపోతే దొరకక పోయేవి అనిపించె వాస్తవాలను పాఠకునికి అందించదం మత్రమే వ్యాఖ్యానం అంటారు టి.ఎస్. ఇలియట్. ఇది చాలా విలువైన అభిప్రాయం. దీనిని బట్టి విమర్శకుడు చెప్పేదంతా వ్యాఖ్యానం కిందకు రాదని తెలుస్తుంది. రచయితను ఆకాశానికెత్తే ప్రశంసలన్నీ వ్యాఖ్యానాలు కాదనిపిస్తుంది. రచనలోని అంతస్సారాన్ని గంభీరంగా వెలిబుచ్చే ప్రామాణికమైన అభిప్రాయం మాత్రమే విమర్శ అవుతుంది.

విమర్శకుడు రచయితను గురించి రచనను గురించి నేనెంత గొప్పవిషయం చెబుతున్నానో అన్నట్లుండకూడదు. రచయిత ఎంత గొప్ప రచన చేశాడో చూడండి  అని అంటున్నట్లుగా వుండాలి. సాహిత్య విమర్శలో మాటల దుబారు వల్ల ప్రయోజనం లేదు. పైపెచ్చు గాంభీర్యం కూడా చెడిపోయే అవకాశముంది.

“విమర్శకునికి ఉండవలసిన మొట్టమొదటి అర్హత ఉత్తమ పాఠకుడిగా ఉండటం. విమర్శకుడు ఉత్తమ పాఠకుడే కాకుండా ఉత్తమ విద్వాంసుడిగా కూడా ఉండక తప్పదు” ( వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)

“రచయితకూ చదువు, నిరంతర చదువు – అవసరమే. కానీ విమర్శకునికి అవసరమైనంత చదువు రచయితకు అవసరం లేదు.” – ( వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)

“విమర్శకుడికి తాను ఏ సాహిత్యాన్ని గురించి విమర్శ రాయాలనుకుంటున్నాడో ఆ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన చెయ్యగల అవకాశం ఉన్న సామాజిక మనస్తత్వ శాస్త్ర సిద్ధాంతాల పరిజ్ఞానం ఉండాలి.” (వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)

“రచయిత కన్నా విమర్శకుడు రెండాకులెక్కువ చదివి ఉండాలంటారు.”- (కొడవటిగంటి కుటుంబరావు – సాహిత్య వ్యాసాలు)

అందుకే సాహిత్య విమర్శకుడు జ్ఞాన సంపన్నుడు కావాలి. సాహిత్య విమర్శ జ్ఞాన ప్రధాన ప్రక్రియ. సాహిత్యంలో రచయితలు నిక్షేపించిన జ్ఞానాన్ని సమాజానికి విడదీసి, విశ్లేషించి అందించేది సాహిత్య విమర్శ. సాహిత్యంలోని జ్ఞానాన్ని అవగాహన చేసుకోవటానికి విమర్శకుడు ఆ జ్ఞానానికి సంబంధించిన సర్వాంశాలు తెలుసుకోవాలి. సాహిత్య విమర్శ ఒక ఆహ్లాదకరమైన ఆట, మరోవైపు కఠిన పరీక్ష. సాహిత్య విమర్శకుడు జ్ఞాన సంప్పనుడు అయితే విమర్శను ఆటగా మలచుకొంటాడు. అలా మలుచుకోలేని పక్షంలో అది విమర్శకులను ఆడుకుంటుంది. సాహిత్యానికి సమాజానికి మధ్య వారధి సాహిత్య విమర్శ. విమర్శకులు ఎంత జ్ఞాన సంప్పనులు అయితే వాళ్ళు నిర్మించే విమర్శ రూప వారధి అంత పటిష్టంగా ఉంటుంది. సాహిత్య విమర్శకునికి మూడు రకాల జ్ఞానం ఉండాలి.

  1. దృక్పధ జ్ఞానం
  2. శాస్త్ర జ్ఞానం
  3. కళా సాహిత్య జ్ఞానం

విమర్శకుడు తనదైన దృక్పధాన్ని కలిగి ఉంటూనే తన దృక్పథానికి విరుద్ధమైన దృక్పథాలకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా సంపాదించాలి. భౌతికవాదం దృక్పధం గల విమర్శకునికి భావవాద దృక్పధం స్వరూప స్వభావలు తెలియాలి. అలాగే భావవాదులకు కూడా.

1910 ప్రాంతాలనుంచి 1964 దాకా భారతదేశంలో శ్రీకాకుళ ప్రాంతంలో వచ్చిన ఆర్థిక రాజకీయ పరిణామాల చరిత్ర తెలిస్తే తప్ప కాళీపట్నం రామారావుగారు రాసిన ’యజ్ఞం’ కథ సమగ్రంగా అర్థంకాదు. అలాగే 1921-22 నాటి గుంటూరు ప్రాంత రాజకీయ సాంఘిక ఆర్థిక పరిణామల జ్ఞానంతో ’మాలపల్లి’ని, స్వతంత్రభారతంలో నాలుగు శతాబ్ధాల జీవితానుభవ జ్ఞానంతో “సొరాజ్జెం’ (అక్కినేని కుటుంబరావు) నవలను సమగ్రంగా అర్థం చెసుకోగలం. సామాజికశాస్త్రాలకు సాహిత్యానికి సంబంధం లేదనుకోవడం అసాహిత్యదృక్పధమే అవుతుంది. సామాజిక శాస్త్రాల జ్ఞానంతో వెలువడే సాహిత్య విమర్శ ఎంత సజీవంగా ఉంటుందో ’విభాతసంధ్యలు’ (సె.వి. సుబ్బారావు. సంపాదకత్వం) ’కథాయజ్ఞం’ (చేకూరి రామారావు సంపాదకత్వం) సాహిత్యంలో వస్తుశిల్పాలు (త్రిపురనేని మధుసూదనరావు,) వంటి గ్రంథాలు రుజువు చేశాయి. ఏ రచనను తీసుకొన్నా ఆ రచనలోని జీవితాన్ని పరిశీలించడం వర్తమాన సాహిత్యవిమర్శలో మొదటి భాగం. జీవితం అర్థం కావాలంటే జీవితాన్ని నడిపించే ఆర్థిక సాంఘిక రాజకీయ శక్తుల పాత్ర అర్థం కావాలి. కేవలం సాహిత్య ప్రమాణాలతోనే ఒక రచనను సమగ్రంగా అర్థం చేసుకోవటం సాధ్యం కాదు.

వల్లంపాటి

వల్లంపాటి

“రచనను ఎవరి దృక్పధం నుంచి విలువకట్టాలి అన్న సమస్య కూడా చాలా కాలంగా వివాదస్పదంగానే ఉంది. రచనను రచయితనుంచి మాత్రమే వివరించి విశ్లేషించాలే కాని విలువ కట్టే బాధ్యతను విమర్శకుడు స్వికరింవకోడరు అనేవారు చాలా మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది రచయితలు వీరి అభిప్రాయం ప్రకారం రచయితకే కాని ఉత్తమ పాఠకుడైన విమర్శకుడికి దృక్పధం ఉండకూడదు. ఈ వాదంలో అర్థం లేదు. ఒక దృక్పధం కలిగి ఉండటానికి రచయితలకు ఎంత అర్హత ఉందో విమర్శాకుడికి కూడా అంతే అర్హత ఉంది. రచనను రచయిత దృక్పధం నుంచి అర్థం చెసుకొని తన సామాజిక ఆర్థిక దృక్పధం నుండి ఆ రచనను విలువ కట్టడం విమర్శకుడు నిర్వహించవలసిన భాధ్యతలలో ప్రధానమైనది.” (పేజి నెం. 26 వల్లంపాటి వెంకటసుబ్బయ్య- ”విమర్శా శిల్పం”)

విమర్శకుడు రచయిత ప్రాపంచిక దృక్పధాన్ని తన దృక్పదంతో, రచయితను తన నిబద్ధతతో అర్థం చేసుకొని విశ్లేషిస్తాడన్నది వాస్తవం. చాలా మంది దృష్టిలో విమర్శకుడు రచయిత ఆలోచన ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. అర్థం చెసుకోవటం మాత్రంతోనే విమర్శకుని పని ముగిసిపోదు. అర్థం చేసుకొన్న దానిని విశ్లేషించాలి. దానిమీద తీర్పును ఇవ్వాలి. వర్తమాన విమర్శ వ్యాఖ్యానం స్థాయిని దాటి చాల కాలమే అయ్యింది. వ్యాఖ్యానం మాత్రమే కాక తీర్పును ఇవ్వటంలో విమర్శకుని ప్రాపంచిక దృక్పధం నిబద్ధతలే అతనికి సహయకారులౌతాయి.

సాహిత్య విమర్శకునికి ఉండవలసిన జ్ఞానంలో రెండోవది శాస్త్ర జ్ఞానం. శాస్త్రాలు రెండు రకాలు 1. వైజ్ఞానిక సామాజిక శాస్త్రాలు 2. కళాసాహిత్యశాస్త్రాలు. సాహిత్యవిమర్శకుడు ఏ శాస్త్రజ్ఞానమూ లేకుండా విమర్శ రాస్తే ఫలితం పెద్దగీతకు చిన్నగీత.

సాహిత్యంలోని జీవితాన్ని అర్థం చేసుకోవటానికి సాహిత్య విమర్శకుడికి సామాజిక శాస్త్రాల జ్ఞానం ఎంత అవసరమో రూప-శిల్ప విశేషాలను తెలుసుకోవటానికి కళా సాహిత్య శాస్త్రాల పరిజ్ఞానం అంతే అవసరం. మనకు మూడు రకాల కళా సాహిత్య శాస్త్రాలు ఉన్నాయి. 1. భారతీయ్య కళా సాహిత్యాలంకారశాస్త్రం 2. పాశ్చాత్య కళా సాహిత్యాలంకారశాస్త్రం

3. మార్కీయా కళా సాహిత్యాలంకారశాస్త్రం. మొదటి రెండు ఆయా భౌగోలిక విభిన్న కాల పరిధిలో పుట్టాయి. మూడవది ఆధునిక కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పరుచుకొన్న కళా సాహిత్యాలంకారశాస్త్రం. సాహిత్య విమర్శకులు వాళ్ళ దృక్పథాన్ని బట్టి చైతన్యాన్ని బట్టి అభిరుచిని బట్టి దేనిని స్వీకరించిన తక్కిన వాటిని గురించి కూడా తెలుసుకోవటం మంచిది. మూడింటిని అధ్యాయనం చేసి ఏదో ఒక శాస్త్రాన్ని అనుసరిస్తే కళా సాహిత్యాలను సాధ్యమైనంత సమగ్రంగా అవగాహన చేసుకోగలమో నిర్ణయించుకోవటం ఉత్తమం.

సాహిత్య విమర్శకులకు కావలసిన మూడో జ్ఞానం కళా సాహిత్య జ్ఞానం. ఇందులో రెండు శాఖలు ఉన్నాయి. 1. సృజన కళా సాహిత్య చరిత్ర జ్ఞానం. 2. కళా సాహిత్య విమర్శ చరిత్ర జ్ఞానం. ఒక కాలం నాటి రచన మీద విమర్శ చేస్తున్న విమర్శకుడు ఆ కాలానికి ముందు వెనకల కాలాల్లో వచ్చిన సాహిత్యాన్ని విమర్శ రాస్తున్న విమర్శకుడు సాధ్యమైనంత వరకు చదవాల్సిన అవసరం ఉంది. ఈ జ్ఞానం విమర్శకుని సాంస్కృతిక స్థాయిని పెంచటమే కాక సాహిత్య విమర్శ మహోన్నతంగా రూపోంది, రాణిస్తుంది. అలాగే ఒక ఉధ్యమ సాహిత్యం మీద విమర్శ రాస్తున్నపుడు తక్కిన ఉద్యమాల సాహిత్యాన్ని కూడా చదివి తీరాలి.

 

Kalipatnam_Ramarao

కాళీపట్నం రామారావు

’యజ్ఞం’ (కాళీపట్నం రామారావు) కథలో సర్పంచి శ్రీరాములు నాయుడు సుందరపాలెంలో చేసిన అభివృద్ధిని గురించి మాట్లాడుతూ పెట్టుబడికి రోడ్లు కావాలి, స్కూల్లు కావలి, కరెంట్ కావాలి. ఇది గ్రామం సరఫర చెయ్యలేదు. అందుకే రాజ్యం (State) పూనుకొని ఆ పాత్ర దరించాలి. ప్రైవేట్ పెట్టుబడి దారి విధానానికి రాజ్యం చేయూతనిస్తుంది. ఈ క్రమంలో శ్రీరాములు నాయుళ్ళు జవహర్ లాల్ నెహ్రులు అలంకార ప్రయంగా అదలం ఎక్కాలి. ఈ గ్రామం ఈ దేశం వాళ్ళవల్లే నడుస్తుందని, బాగుపడుతుందని నాయుడు నెహ్రు లాంటి వాళ్ళు అనుకోవచ్చు. కాని వాళ్ళు పెట్టుబడి చెతిలో కీలు బొమ్మలు. వాళ్ళు పెట్టుబడి దారులు వెయ్యమన్న వేషం వెయ్యాలి. అడమన్న నాటకం ఆడాలి. అని గరికపాటి నిరంజన్ రావు చేసిన మార్కిస్ట్ వ్యాఖ్యానం ఇది. దీని ద్వారా మనకి తెసిందేమిటంటే సాహిత్య విమర్శకుడు రచన మీద వ్యాఖ్యానం లేదా విమర్శ చేసేటప్పుడు అతని భావజాలం ప్రాధాన్యం వహిస్తుంది. మార్కిస్ట్ కాని విమర్శకుడు ఇదే అంశంమీద వ్యాఖ్యానం చేస్తే అది ఖచ్చితంగా దీనికి భిన్నంగా ఉంటుంది.

అలాగే ఒక కాలంలో ఒక భాషలో ఒక రచన మీద కాని రచయిత మీద కాని లేదా ఉధ్యమ సాహిత్యం మీద కాని విమర్శ రాసే విమర్శకుడు ఆ రచనల మీద ఇతరులు రాసిన విమర్శను అధ్యయనం చేయటం ఎంతైన అవసరం. ఒక భాష విమర్శకునికి తక్కిన ప్రపంచ భాష సాహిత్య విమర్శ చరిత్ర తెలిసుంటే జరిగే మేలు ఎక్కువ. మన ముందు కాలపు విమర్శకులు సాహిత్య విమర్శలో ఏ ఏ పోకడలు పోయారో తెలిసి ఉంటే, మనం వాళ్ళ కన్న భిన్నంగా, ఆధునికంగా, విమర్శ చేయడం ఎలాగో నిర్ణయించుకోవడానికి వీలుకలుగుతుంది. వాళ్ళ విమర్శ అగిన చోటు నుంచే మన విమర్శ మొదలు పెడితే విమర్శ బండి నిరాటంకంగా సాగుతుంది. మాక్సింగోర్కి రష్యన్ యువ రచయితలకు ఒక సలహా ఇచ్చాడు. నేటి కార్మికుడు ఒక వస్తువును తయారు చేసే ముందు, ఆ వస్తువును తన ముందు కాలపు కార్మికులు ఏలా తయారు చేశారో తెలుసుకొంటే వాళ్ళ కన్నా బాగా ఆ వస్తువును తయారు చెయ్యటానికి వీలైనట్లే, నేటి రచయితలు తమ ముందు కాలంలోని సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదువుకుంటే వాళ్ళ కన్నా బాగా రాయడానికి వీలౌతుంది. ఈ సలహా సాహిత్య విమర్శకులకు కూడా వర్తిస్తుంది.

ఏ కాలంలోనైనా సమాజం తన మనుగడ కోసం ఒక స్పష్టమైన దృక్పథం కలిగి ఉంటుంది. వ్యక్తికైన సమిష్టికైన మనుగడ సాగించటానికి ఒక దృక్పథం అవసరం. ఈ దృక్పథమే మనిషిని, ప్రపంచాన్ని నడిపిస్తుంది. సమాజానికి ఒక నిర్థిష్టమైన ప్రాపంచక దృక్పథం ఉన్నట్లే సమాజ జీవితాన్ని సాహిత్యంగా మలిచే రచయితలకు కూడా తమదైన ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. సమాజ జీవితం పట్ల అనేకులకు అనేక రకాల అవగాహన ఉంటుంది. తమ అవగాహనను శాస్త్రవేత్తలు సామాన్యులు కళాకారులు అభివ్యక్తం చేయటంలో బేధాలు ఉంటాయి. చూపులోనే(దృష్టి) బేధం ఉన్నపుడు చూచిన దానిని చెప్పటంలోను తేడాలు ఉంటాయి.

అధ్యయన లోపం సాహిత్య విమర్శ కృషించటానికి వెనుకడుగు వెయ్యటానికి అవకాశం ఇస్తుంది. సాహిత్య విమర్శ ఎదగలేదనే అభిప్రాయం కలగటానికి కూడా అవకాశం కలిపిస్తుంది. సమస్త సాహిత్య విమర్శ పరిజ్ఞానం నుండి తనదైన మార్గంలో విమర్శ రాస్తే దానికి విశ్వసనీయత అధికారికత కలుగుతుంది. సాహిత్య విమర్శకులలో అధ్యాయన లోపం- జ్ఞానలోపం సాహిత్య విమర్శ క్షీణతకు తద్వారా సమాజ క్షీణతకు దారీ తీస్తుంది. ఈ మూడు రకాలైన జ్ఞానం కలిగిన విమర్శకులు ఉత్తమ విమర్శకులు అవుతారు.

ఒక కథారచన చదివినతరువాత దానిలోని కథ పాత్రలు సంభాషణలు మొదలైన అనేక అంశాలను విశ్లేషించుకుంటాం. ఆరచనలో ఆ పాత్రల ప్రాధాన్యాన్ని ప్రమేయాన్ని వ్యాఖ్యానించుకుంటాం. ఆ రచనలోని కథా నిర్మాణాన్ని , కథాకథనాన్ని, పాత్ర చిత్రణను సభాషణల్ని ఇంకా అనేకాంశాలని ఇతర రచనలలోని అలాంటి అంశాలతో పోల్చి పరిశీలిస్తాం. అన్నీ అయినాక విమర్శకుడు, రచయిత ఈ రచన ద్వారా ఏమిసాధిస్తున్నాడు? అనేదాన్ని నిర్ణయించాలి. సాహిత్యవిమర్శకుడు తీర్పరి పాత్రను నిర్వహించవలసింది ఇక్కడే. ఏ నిర్ణయమూ చేయకుండా ముగించే విమర్శ వల్ల ఫలితముండదు. పాఠకుల్ని నడిదారిలో వదిలేసినట్లౌతుంది.

ఒక రచనలో అన్ని అంశాలు విమర్శకునికి నచ్చక పోవచ్చు. సాహితీలోకంలో చాలా ప్రసిద్ధుడైన రచయిత చేసిన బలహీనమైన రచన మీద విమర్శించి నిర్ణయం ప్రకటించడంలో అనేక పరిమితులు కూడా ఏర్పడవచ్చు. రచనలోని జీవితం మనంచూసిన జీవితంకన్నా భిన్నమైన జీవితానుభావాన్ని చిత్రించి వుండొచ్చు. ఇలాంటివన్నీ… విమర్శకుడు తాను చదివి లేదా విమర్శించే రచన మీద చివరి నిర్ణయాన్ని ప్రకటించడానికి అనేక సవాళ్ళు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలోనే తాను గ్రహించిన సత్యాసత్య ప్రకటనకు తానుగడించిన అధ్యయన జ్ఞానం అవసరమవుతుంది.

తెలుగులో సాహిత్యవిమర్శ దీపం చిన్నది. తెలుగులో సాహిత్యవిమర్శ ఎదగలేదు. విమర్శకులు రచయితల అభిప్రాయాల్ని గౌరవించరు. విమర్శను భరించేస్థితిలో రచయితలు లేరు. తెలుగులో సాహిత్యవిమర్శ ఉన్నట్టా? లేనట్టా? తెలుగులో సాహిత్య విమర్శ ఉండీలేనట్టే! తెలుగులో సాహిత్యవిమర్శ లేనట్టే. –ఇలాంటి వ్యాఖ్యలు నిరంతరం వినిపిస్తూనే వున్నాయి. ఇందుకు కారణం ఎవరు ? అరకొర జ్ఞానంతో మిడిమిడి రాతలు రాసే విమర్శల పాత్ర . తెలుగుసాహిత్యవిమర్శలో శాస్త్రీయత లోపించడం. వ్యక్తిగత అభిరుచులు ప్రాధాన్యం వహించి, నిర్మాణాత్మకత లోపించడం.చరిత్రను గౌరవించలేని దౌర్భల్యం. మార్పుల్ని సహించలేని పిరికితనం, దుర్వ్యాఖ్యానాలతో చెలామణి కావాలనుకునే దురాశ వంటి రుగ్మతలు తెలుగు సాహిత్య విమర్శను అనారోగ్యంపాలు చేస్తున్నాయి. సాహిత్యవిమర్శ ఒక శాస్త్రంగా భావించకుండా, దానిని స్వీయాభిరుచుల ప్రకటన సాధనంగా భావించినంతకాలం తెలుగువిమర్శ గురించి ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతుంటాయి.

.

-డా. కె. శ్రీదేవి

9441404080

చిన్నప్పటి బంధువులూ, ఇంట్లో కొన్ని విశేషాలూ

 

అక్కా, వదినా, కన్నా

అక్కా, వదినా, కన్నా

చిన్నప్పుడు అంటే నేను ఐదో ఏట ఒకటో క్లాసుతో మొదలు పెట్టి, ఎప్పుడూ పరీక్షలు తప్పకుండా “రాముడు బుద్ధిమంతుడు” లాగా పదహారో ఏట ఎస్.ఎస్.ఎల్.సి. పూర్తి అయ్యే దాకా జరిగిన పది, పదకొండేళ్ళు అన్న మాట. ఒక విధంగా ఈ దశాబ్దం నా వ్యక్తిగత జీవితంలో ఏవిధమైన బాదర బందీ లేకుండా “తెలుగు సినిమా స్వర్ణయుగం తొలి దశాబ్దం” లాంటిది అని చెప్పుకో వచ్చును. అప్పటి కింకా టీవీలు, కంప్యూటర్లు, ఇంటర్ నెట్ లు, జేబులో కూడా టెలిఫోన్లు లేక అందరి ప్రాణాలూ హాయిగా ఉండేవి.

అందరూ మంచి ప్రమాణాలతో ఉన్న సినిమాలు, రేడియో కార్యక్రమాలు, దసరా నవరాత్రులలాంటి పండగలలో వీధి నాటకాలు, హరి కథలు, బుర్ర కథలు, నెహ్రూ లాంటి దేశ నాయకులు, ఎప్పుడూ నెగ్గే హాకీ టీమూ, ఎప్పుడూ చిత్తుగా ఓడిపోయే ఇండియా క్రికెట్ టీమూ, అతి తక్కువ మోతాదులో లంచాలు, ఉద్యోగం అంటే కేవలం సిఫార్స్ తోటే వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు, బొంబాయి, మద్రాసు లాంటి పెద్ద నగరాలలో తప్ప ఆ రోజుల్లోనే ఏర్పడ్డ ఆంధ్రా మొత్తం మీద కూడా ఎక్కడా లేని ప్రైవేటు ఉద్యోగాలు, అన్నింటికన్నా ఎక్కువగా నేను అనుభవించి ఆనందించిన బందు ప్రేమ, వారి రాక పోకలు ఇవన్నీ వెరసి నా చిన్నప్పటి జీవితాన్ని స్వర్గధామం చేశాయి. ఈ క్షణాన్న నన్ను మళ్ళీ ఎవరైనా ఆ రోజులకి తీసుకెళ్లగలిగితే ఎంత బావుండునో!

మా చిన్నప్పుడు జరిగిన కొన్ని కుటుంబ విశేషాలు నాకు లీలగా గుర్తు ఉన్నా, ఐదారేళ్ళ క్రితం మా పెద్దన్నయ్య “ఒరేయ్, ఇందులో నేను కొన్ని కొన్ని నోట్ చేసుకున్న పాయింట్లు సరదాగా చదువుకో…అంతా మన చిన్నప్పటి సంగతులేలే..రహస్యాలు లేవు.” అని నాకు తన “సంక్షిప్త డైరీ” ని కాపీ తీయించి ఇచ్చాడు. అందుకే ఈ కుటుంబ విషయాలు,తారీకులతో సహా వ్రాయగలుగుతున్నాను.

నాకు కూడా చాలా లీలగా గుర్తున్నది నా పదేళ్ళప్పుడు …ఫిబ్రవరి 2, 1955 నాడు వంద ఎద్దు బళ్ళు కట్టించి దొంతమ్మూరు, వెల్దుర్తి, సింహాద్రిపురం, తిమ్మాపురం, రాయవరం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, చిన జగ్గం పేట లో స్వంతంత్ర్య పార్టీ తరఫున మా పెద్దన్నయ్య, హనుమంత రావు బావ కేన్వాసు చేస్తూ తెల్లగా గట్ట నుంచి రాత్రి దాకా జరిగిన ఊరేగింపు. ఆ రాత్రి ఊరేగింపు అయ్యాక దొంతమ్మూరు మేడ ముందు పందిరి వేయించి శశిరేఖా పరిణయం బుర్ర కథ చెప్పించాడు మా పెద్దన్నయ్య. నాకు ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఒకే ఒక్క ఉదంతం తప్ప , రాజకీయాలలో ప్రత్యక్షంగా పాల్గొనడం మా ఇంటా, వంటా లేదు. మా నాన్న గారుచిన్నపుడు గాంధీ గారి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమంలో తన   మిల్లు బట్టలు మంటల్లో వేసేసి , జీవితాంతం ఖద్దరు బట్టలే వేసుకున్నారు.

మా చిన్న అన్నయ్య కపిలేశ్వర పురం జమీందారులైన ఎస్. పి. బి. పట్టాభి రామారావు & సత్యనారాయణ రావు గార్లకి ఎలెక్షన్ ఏజెంట్ గా వోట్ల లెక్కింపు లో పాల్గొన్నాడు కానీ ఇవి ప్రత్యక్ష రాజకీయాలలోకి రావు. 1955 జూలై లో మా ఆఖరి చెల్లెలు ఉషా రేవతి పుట్టింది. దాని బారసాల ఆగస్టు ఆరో తారీకున జరిగింది. అ రాత్రి అందరం “రోజులు మారాయి” సినిమాకు వెళ్లాం. ఆ రోజు రిక్షాలో మా నాన్న గారు, ఇంకెవరో సీటులో కూచుంటే, నేనూ, మా తమ్ముడూ ముందు కడ్డీ పట్టుకుని నిలబడి పెద్ద రాజకీయ నాయకులలాగా ఫీలయిపోయాం. ఒక నెల తరువాతే నేను ఇది వరలో ప్రస్తావించిన “అంజలీ దేవి” దర్శనం జరిగింది. అప్పుడు పొలం నుంచి వచ్చిన సవారీ బండిలో నేను, ఆంజీ, జయ వదిన & చెల్లెలు పద్మ, పెద్దన్నయ్య, రంగక్క, అక్క, నారాయణ తాతయ్య గారి కూతురు సత్యవతి అత్తయ్య, దొడ్డమ్మ అనే మా రెండో మేనత్త అందరం కిక్కిరిసి పోయి కూచున్నాం….అంతా అంజలీ దేవిని చూడడానికే!

ఏప్రిల్ 1957 లో మా రాత్తాతయ్య గారు హంసవరంలో పోయారు. ఆయన అసలు పేరు సర్వేశం గారు. మా తాత గారికి స్వయానా సవితి తమ్ముడు గారు. ఆయన భార్య కాంతం బామ్మ గారు లేనిదే మా ఇంట్లో కానీ, మా యావత్ బంధు వర్గం ఇళ్ళలో కానీ ఎటువంటి శుభకార్యమూ జరిగేవి కాదు. వాళ్ళ అల్లుడు మంగా బావ రైల్లో టికెట్ కలెక్టర్ గా పని చేసే వాడు. మహా సరదాగా పేకాట ఆడే వాడు. ఆ ఏడే అక్టోబర్ లో జరిగిన ఘోరం మా అమలాపురం బావ ఏకైక కుమారుడు పెద్ద బుజ్జి గాడు హఠాత్తుగా పోయాడు. వాడు సరిగ్గా నా వయసు వాడే..పన్నెండేళ్ళు. చాలా ఏళ్ల పాటు మేం ఎవరం ఇది తట్టుకోలేక పోయాం.

మే, 28, 1957 న క్రౌన్ టాకీస్ లో నన్నూ, మా తమ్ముడు ఆంజినీ మా పెద్దన్నయ్య “మాయా బజార్” సినిమాకి తీసుకెళ్ళాడు. ఆ సమ్మర్ లోనే కుళాయి చెరువు ఆవరణలో జరిగిన “4వ రాష్ట్ర ఫల, పుష్ప ప్రదర్శన” లో మా తణుకు తాత గారు తాళ్లూరి లక్ష్మీపతి రావు గారు మా అక్క చేత 28 రకాల ఆవకాయలు పెట్టించారు. అందుకు మా అక్కకి ఒక పెద్ద వెండి కప్పు ఆ నాటి వ్యవసాయ శాఖా మంత్రి తిమ్మా రెడ్డి గారు బహూకరించారు. అప్పటి దాకా ఏదో స్కూల్లో బాగా చదువుకుంటే పతకాలు, క్రికెట్ లో నెగ్గితే ట్రోఫీలు ఇస్తారు అని వినడమే కానీ ఆవకాయలు పెట్టి కూడా వెండి కప్పు, రోలింగ్ ట్రోఫీ లి గెల్చుకోవచ్చును అని తెలిసి మేము ఎగిరి గెంతులేస్తుంటే “వెధవల్లారా, చదువు మానేసి ఆవకాయలు, గోంగూరలు మొదలెట్టారంటే చంపేస్తాను” అని మా నాన్న గారు కోప్పడ్డారు.

ఆ రోజుల్లోనే భూ సంస్కరణలు, భూదానం, దున్నే వాడిదే భూమి, ఎవరికీ ఐదు ఎకరాలు దాటి పంట పొలాలు ఉండ కూడదు. ముఖ్యంగా లాండ్ సీలింగ్ ఏక్ట్ అనే అనేక రైతు అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు, ప్రభుత్వ చట్టాలు రావడమో, వచ్చే సూచనలు కనపడడమో ఉండి, అంత వరకూ మా తాత గారి స్వార్జితమైన మా 200 ఎకరాల పై చిలుకు శేరీ పొలానికి మా నాన్న గారు ఏకైక వారసుడే అయినా…ఎందుకైనా మంచిది అని ఆ భూమి అంతా ఆరు వాటాల క్రింద …అంటే మా అన్నదమ్ములం ఐదుగురికీ ఒక్కొక్క వాటా, మా నాన్న గారికి ఒక వాటా చొప్పున చూచాయగా విభజించి ఆ పంపకాల దస్తావేజులని డిశంబర్ 19, 1957 నాడు రిజిస్టర్ చేయించారు మా నాన్న గారు. అప్పటికింకా ఆడ పిల్లలకి కూడా స్థిరాస్థిలో సమాన వాటాలు ఉండాలనే ఆలోచనలు కానీ, చట్టాలు కానే లేవు. సంప్రదాయబద్ధంగా ఆడబడుచులకి కట్న కానుకలు, సారె, నగల రూపంలోనే ఆస్తిలో వాటా ఇచ్చే వారు.

అక్క రంగక్క జయ వదిన

అక్క రంగక్క జయ వదిన

1957 ఆఖరి నెలలలో జరిగిన ముఖమైన విషయం మా చిన్నన్నయ్య ప్రేమలో పడడం. ఆ రోజుల్లో ప్రభుత్వం తరఫున బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లు, అగ్రికల్చరల్ డిమానిస్త్రేటర్ ధవేజీ గారు, పశువుల డాక్టరు, మరికొందరూ దొంతమ్మూరు వచ్చి మా బావ మేడ లో దిగారు. మా పెద్దన్నయ్యకి, బావలతో సహా ఊళ్ళో ఉన్న యువ రైతులకి వ్యవసాయం ఎలా చెయ్యాలో శిక్షణ ఇచ్చారు. నేను చందమామలు చదువుకుంటూ ఈ తమాషా చూడడం కొంచెం గుర్తు. ఆ తరవాత ఆ ఊళ్ళో మహిళా సంఘానికి ప్రెసిడెంటు అయిన మా రంగక్కే వంద మందకి రైతులకి..అంటే పెద్ద, పెద్ద గుండిగెల కొద్దీ అన్నం, పులుసు, కూరలు, పచ్చళ్ళు వండిపెడుతున్నప్పుడు ఆ ఉళ్లోనే ఉన్న మరో కుంటముక్కుల నరసింహం …పెద్దబ్బాయి గారు అని పిలిచే వారు…ఆయన కూతుళ్ళు కనకం, రాజా లు చాలా సహాయం చేశారు. వారిది 500 ఎకరాలకు పైగా మాగాణీ ఉన్న పెద్ద కుటుంబం. పెద్దబ్బాయి & రామాయమ్మ గారి రెండో కొడుకు పేర్రాజు మా చిన్నయ్య సహాధ్యాయి. ఆయన కూతురు అరుణ, అల్లుడు కవి ప్రభాకర్ మా హ్యూస్టన్ లోనే ఉంటారు. నాకు ఎంతో ఆత్మీయులు.

ఇంతకీ 1957 లో ఆ మూడు రోజులూ మా చిన్నన్నయ్య, రాజా ఆ మీటింగులలో కలిసి తిరుగుతూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఈ రోజుల్లో దాన్నే ప్రేమించుకోవడం అంటారు. ఆ తరువాత ఎనిమిదేళ్ళకి వాళ్ళిద్దరికీ పెళ్లి అయింది. ఇంకా పెళ్లి కాని ఆ రోజుల్లో మధ్యలో మా అక్క, తన ఎడం పక్క రాజా వదిన, కుడి పక్కన కనకం వదిన ల ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అలాగే మధ్యలో మా మేనత్త రంగక్కకి ఉన్న ఒకటో, రెండో ఫోటోలలో మా అక్క, జయ వదినలతో ఉన్న ఫోటో కూడా ఇక్కడ జత పరుస్తున్నాను.

ఆ రోజుల్లోనే మా అక్కని మా హనుమంత రావు కి చేసుకుందామని మా రంగక్క అనుకున్నా మా అమ్మకి మేనరికాలు ఇష్టం లేక ఒప్పుకో లేదు. దాంతో మాకు దొంతమ్మూరు తో అనుబంధాలు తగ్గడం మొదలు పెట్టాయి. ఆ రోజుల్లో మా అక్కని చూసుకోడానికి లక్కరాజు సుబ్బా రావు గారి కొడుకు శరభయ్య రావడం నాకు తెలిసీ మా ఇంట్లో జరిగిన మొట్టమొదటి పెళ్లి చూపులు. అతను విమానం పైలట్. ఆ సంబంధం కుదర లేదు కానీ మా కుటుంబాల స్నేహం కొనసాగుతూనే ఉంది. ఆ రోజుల్లోనే మాబ్బులు బావకి 240 రూపాయలు పెట్టి మా నాన్న గారు హెర్క్యులెస్ సైకిల్ కొనిపెట్టారు…రోజూ గాంధీ నగరం లో మా ఇంటి నుంచి జగన్నాథ పురంలో పాలిటెక్నిక్ వెళ్ళడానికి.

మా హనుమంత రావు బావ పెళ్లి జగదీశ్వరి అక్కతో జూన్ 16, 1959 నాడు, మూడు రోజుల పెళ్లి దొంతమ్మూరు లో అయింది. మా పెద్దాపురం మామయ్య గారు, బాసు పిన్ని (మా ఆఖరి మేనత్త) స్నాతకం పీటల మీద కూచున్నారు. మా బంధువర్గం సుమారు వంద మందీ వచ్చారు.

ఆ తరువాత మా కుటుంబంలో మొదటి పెద్ద శుభాకార్యం……అంటే మా పెద్దన్నయ్య పెళ్లి , ఆ పెళ్లి చూపులు వివరాలు మరొక అధ్యాయం…..

– వంగూరి చిట్టెన్ రాజు

chitten raju

 

కొత్త అనువాద నవల ప్రారంభం: పేద్రో పారమొ-1

pedro1-1

పేద్రో పారమొ అనే పేరుగల మా నాన్న ఇక్కడ ఉన్నాడని చెప్పబట్టే ఈ కోమలాకి వచ్చాను. చెప్పింది మా అమ్మే. ఆమె చనిపోయాక వెళ్ళి ఆయన్ని కలుస్తానని మాట ఇచ్చాను. తప్పకుండా వెళతానంటూ అందుకు సూచనగా ఆమె చేతుల్ని గట్టిగా నొక్కాను కూడా. ఆమె చావుకు చేరువలో ఉంది; ఆమెకి ఏ మాట అయినా ఇచ్చి ఉండే వాణ్ణి. “ఆయన్ని కలవకుండా ఉండొద్దు” గట్టిగా చెప్పిందామె “ఆయన్ని కొంతమంది ఒకటంటారు. మరికొంతమంది మరొకటి. ఆయనకీ నిన్ను చూడాలని తప్పకుండా ఉంటుంది.” అప్పుడు నేను చేయగలిగిందల్లా ఆమె చెప్పినట్టు చేస్తానని చెప్పడమే. అదే వాగ్దానాన్ని తరచుగా చేసీ చేసీ, బిగిసిన ఆమె గుప్పిటనుంచి నా చేతుల్ని విడిపించుకున్నాకా అదే మాట మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండిపోయాను.
అంతకుముందు ఆమె చెప్పింది:
“ఆయన్ని ఏమీ అడక్కు. నీకేం రావాలో అంతవరకే. నీకివ్వాల్సి ఉండీ నీకు ఇవ్వనిది.. బదులు చెల్లించనీ నాయనా, ఇన్నేళ్ళూ మన పేరుగూడా తలవనందుకు.”
“అలాగే అమ్మా!”
నా మాట నిలుపుకునే ఉద్దేశం లేదు నాకు. కానీ నేను గమనించేలోపే నా బుర్ర కలల్లో తేలడమూ, ఊహలకు రెక్కలు రావడమూ మొదలయింది. నా తల్లికి భర్త అయిన పేద్రో పారమొ అనే వ్యక్తి కేంద్రంగా పెరిగిన ఆశ చుట్టూ కొద్దికొద్దిగా ఒక ప్రపంచాన్ని నిర్మించుకోసాగాను. అందుకే కోమలాకి రావలసి వచ్చింది.

గస్టు గాలులు వేడిగా సపొనారియా పూల కుళ్ళు కంపుతో విషపూరితమై వీచే వేసవి కాలపు రోజులు.
దారంతా ఎగుడు దిగుడు. ఎగుడా దిగుడా అన్నది నువ్వు వస్తున్నావా పోతున్నావా అన్న దాని బట్టి ఉంటుంది. వెళ్ళేప్పుడు ఎగుడు, వచ్చేప్పుడు దిగుడు.
“ఆ దిగువన కనిపించే ఊరును ఏమంటారన్నావూ?”
“కోమలా అయ్యా!”
“కచ్చితంగా తెలుసా నీకది కోమలాయేనని?”
“బాగా తెలుసయ్యా!”
“అంత దీనంగా ఉంది, ఏమయింది దానికి?”
“రోజులట్లాగున్నాయయ్యా!”

మా అమ్మ జ్ఞాపకాలకు చెందిన ఊరిని చూడబోతున్నానని తెలుసు నాకు. నిట్టూర్పులతో నిండిన జ్ఞాపకాలు. ఆమె జీవితమంతా కోమలా గురించీ, అక్కడికి తిరిగి వెళ్ళటం గురించీ తలపోస్తూ నిట్టూరుస్తూ గడిపింది. అయితే ఆమె వెళ్లలేకపోయింది. ఇప్పుడు ఆమె స్థానంలో నేను వచ్చాను. నేను ఆమె కళ్లతో, ఆమె చూసినట్లుగా చూస్తున్నాను. చూడడానికి తన కళ్లను ఆమె నాకిచ్చింది. లాస్ కొలిమోట్స్ గేటు దాటగానే మొక్కజొన్న పసుపు అంచుతో అందమైన ఆకుపచ్చని మైదానం కనిపిస్తుంది. అక్కడినుంచి కోమలా కనిపిస్తుంది, నేలను తెల్లబరుస్తూ, రాత్రి దాన్ని వెలిగిస్తూ. ఆమె గొంతు రహస్యం చెపుతున్నట్టుగా, తనలో తను మాట్లాడుకుంటున్నట్టూ…అమ్మ.
“అడుగుతున్నానని అనుకోవద్దు గానీ ఇంతకీ మీరు కోమలా ఎందుకు వెళుతున్నట్టు?” ఆ మనిషి ప్రశ్నించడం వినిపించింది.
“నా తండ్రిని చూడడానికి వచ్చాను” జవాబిచ్చాను.
“ఊఁ” అన్నాడు.
మళ్లీ నిశ్శబ్దం.
కంచరగాడిదల గిట్టల చప్పుడుకు అనుగుణంగా నడుస్తూ గుట్ట దిగుతున్నాము. ఆగస్టు వేడికి వాటి నిద్రకళ్ళు ఉబ్బి ఉన్నాయి.
“మీకు మంచి మర్యాదలు జరుగుతాయిలే” మళ్లీ నా పక్కన నడుస్తున్న మనిషి గొంతు వినిపించింది. “ఇటువైపు ఇన్నేళ్ళుగా ఎవరూ రాలేదు. ఇప్పుడయినా ఒకరిని చూసి సంతోషిస్తారు”
కాసేపయ్యాక పొడిగించాడు: “మీరెవరయితేనేం గానీ, మిమ్మల్ని చూసి సంతోషిస్తారు”
తళతళలాడే సూర్యకాంతిలో మైదానమంతా బూడిదరంగు దిగంతాల్ని కప్పిన పొగమంచును కరిగిస్తున్న పారదర్శక కాసారంలా ఉంది.అంతకంటే దూరంగా పర్వతశ్రేణులు. ఇంకా దూరంగా నిస్త్రాణమైన ఒంటరితనం.
“మీరేమీ అనుకోకపోతే, మీ నాయన ఎలాఉంటారు?”
“నేనెప్పుడూ చూడలేదు” అతనికి చెప్పాను. “ఆయన పేరు పేద్రో పారమొ అన్నదే నాకు తెలిసింది.”
“ఊఁ అట్లాగా?”
“అవును. కనీసం నాకు చెప్పిన పేరు అదీ!”
మళ్లీ ఆ కంచరగాడిదలు తోలేవాడి గొంతునుంచి ఇంకో “ఊఁ”.
లాస్ ఎన్క్వెంట్రోస్ కూడలి దగ్గర కలిశాడితను. అక్కడ ఎదురు చూస్తూ ఉంటే చిట్టచివరికి ఇతను కనిపించాడు.
“ఎక్కడికి వెళుతున్నావు?” నేనడిగాను.
“ఆ దిగువకు పోతున్నానయ్యా!”
“నీకు కోమలా అనే ఊరు తెలుసా?”
“అటువైపే నేను పోతుంది!”
అతని వెంటబడి పోయాను. అతనితో కలిసి నడవాలని ప్రయత్నిస్తూ వెనకపడినప్పుడల్లా నేను వెనకే వస్తున్నట్టు గుర్తొచ్చినట్టు కొంచెం నెమ్మదిగా నడిచాడు. ఆ తర్వాత మేం పక్కపక్కనే మా భుజాలు దాదాపు తాకేంత దగ్గరగా నడిచాము.
“పేద్రో పారమొ నాతండ్రి కూడా” అన్నాడతను.
పైన శూన్యాకాశంలో కాకుల గుంపు ఒకటి కావు కావుమంటూ పోయింది.
ఎగుడు దిగుడుగా ఉన్నా మొత్తానికి దిగుతూనే ఉన్న బాట వెంట నడిచాము. వేడిగాలిని వెనకే వదిలేసి, గాలిలేని అచ్చమైన వేడిలోకి దిగుతున్నాము. ఆ నిశ్చలత్వం దేనికోసమో ఎదురుచూస్తున్నట్లుంది.
“ఇక్కడ వేడిగా ఉంది” నేనన్నాను.
“నీకనిపిస్తుందేమో. ఇది పెద్ద లెక్కలోది కాదు” నా తోటిమనిషి అన్నాడు.”తేలిగ్గా తీసుకో. మనం కోమలా కి వెళ్ళేసరికి నీకు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఆ ఊరు బొగ్గుల కుంపటి మీద నరకం వాకిలి దగ్గర ఉన్నట్టు ఉంటుంది. ఊరి జనం చచ్చి నరకానికి వెళ్ళినప్పుడు దుప్పటి కోసం తిరిగి వస్తారని చెప్పుకుంటారు.”
“పేద్రో పారమొ తెలుసా నీకు?” అడిగాను.
అతని కళ్లలో మినుకుమనే స్నేహభావం చూసి అడగొచ్చనిపించింది.
“ఎవరాయన?”
“మనిషి జన్మెత్తిన రాక్షసుడు” చెప్పాడతను.
కారణం లేకుండానే దిగుడుబాట వెంట చాలా ముందుగా వెడుతున్న గాడిదల్ని కర్ర ఊపుతూ అదిలించాడు.
నా జేబులో ఉన్న మా అమ్మ ఫొటో నా గుండెకి వేడిగా తగులుతుంది ఆమెకు చెమట్లు పోస్తునట్టు. అది అంచులు నలిగిన పాత ఫొటో. అదొక్కటే నాకు తెలిసి ఆమె ఫొటో. వంటగదిలో ఎండిన నిమ్మతొక్కా, చాస్టియా మొగ్గలూ, సదాప రెమ్మలూ ఉన్న మట్టి పాత్రలో దొరికింది నాకది. అప్పటి నుంచీ అది నాతోనే ఉంది. నాకున్నదల్లా అదే. మా అమ్మకి ఫొటో తీయించుకోవడం అసలు ఇష్టం లేదు. అది చేతబడి కోసం వాడతారని చెప్పేది. అది నిజమేననిపిస్తుంది ఫొటో అంతా సూదులతో గుచ్చిన గుర్తులూ, గుండె దగ్గర మధ్యవేలు పట్టేంత రంధ్రమూ చూస్తుంటే.
మా నాన్న నన్ను గుర్తు పట్టేందుకు ఆ ఫొటో నాతోపాటు తెచ్చాను.
“అటు చూడు” గాడిదల కాపరి చెప్పాడు ఆగిపోయి. “ఆ గుండ్రంగా పంది పొట్టలా కనిపిస్తున్న గుట్ట చూశావా? మెదియా లూనా దాని వెనకే ఉంటుంది. ఇప్పుడు ఇటు తిరుగు. ఆ కొండ కొమ్ము చూడు. సరిగ్గా చూడు. మళ్ళీ ఈవంక చూడు. ఆ కొస కనిపిస్తుందా? అట్లా అదుగో దూరంగా కనపడీ కనపడకుండా? అదుగో ఆ అల్లదంతా మెదియా లూనా. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. కనుచూపుమేరా అంటారే అంత దాకా. ఆ భూమంతా ఆయనదే. మనం పేద్రో పారమొ కొడుకులమే గానీ మన అమ్మలు మనల్ని చింకి చాపలమీదే కన్నారు. ఇంకా పెద్ద తమాషా ఏమిటంటే ఆయనే మమ్మల్ని బాప్టిజం చేయడానికి తీసుకెళ్ళాడు. నీకు కూడా అంతేనా?”
“నాకు గుర్తు లేదు”
“నీ మొహం లే!”
“ఏమన్నావు?”
“దగ్గరకి వచ్చేశాం అని చెపుతున్నానయ్యా!”
“అవును. నాకు కనిపిస్తుంది.. ఏమయ్యుంటుంది?”
“కరెకామినోస్ అయ్యా! ఆ పిట్టల్ని ఆ పేరుతో పిలుస్తారిక్కడ.”
“అది కాదు. ఊరికి ఈ గతి ఎందుకు పట్టిందా అని ఆలోచిస్తున్నాను. జనసంచారం లేకుండా, అంతా ఎటో వెళ్ళిపోయినట్లు. అసలు ఎవరూ ఉంటున్నట్లే లేదిక్కడ.”
“ఉంటున్నట్లు లేకపోవడం కాదు, ఎవరూ ఉండరిక్కడ”
“మరి పేద్రో పారమొ?”
“పేద్రో పారమొ పోయి ఏళ్ళవుతూంది”

xinmortal-del-bronce.jpg.pagespeed.ic.9TAvf_tMeK

ప్రతి చిన్న ఊళ్ళో పిల్లలు ఆడుకోవడానికివీధుల్లోకి చేరి సాయంత్రాల్ని వాళ్ళ కేకలతో నింపే సమయం. ముదురు గోడలు లేత పసుపు ఎండని ప్రతిఫలించే సమయం.
కనీసం నేను నిన్న సాయంత్రం ఈ సమయానికి సయులాలో చూసింది అదీ. రెక్కలు టపటపలాడించుకుంటూ ఈ దినం నుంచి తప్పించుకుంటున్నట్టు ఎగిరిపోయే పావురాలు భగ్నం చేసిన కదలని గాలిని చూశాను. అవి ఒక్కసారిగా పైకి లేచి ఇళ్ళ కప్పుల మీద వాలిపోయాయి. పిల్లల కేకలు సుడి తిరుగుతూ పైకి లేచి సందె ఆకాశపు నీలంగా మారిపోయాయి.
ఇప్పుడు ఈ సద్దు మణిగిన ఊళ్ళో ఉన్నాను. కింద పరిచిన రాతిపలకల మీద నా అడుగుల చప్పుడు వినిపిస్తూంది. బోలు అడుగులు కుంకే పొద్దులో ఎర్రబారిన గోడల వల్ల ప్రతిధ్వనిస్తూ.

చూస్తే ఆ సమయానికి మెయిన్ రోడ్ మీద నడుస్తున్నాను. వదిలేసిన ఇళ్ళూ, అడ్డు లేకుండా పెరిగిన గడ్డి కప్పిన వాకిళ్ళూ తప్ప ఏమీ లేవు. వాటిని ఏమని పిలుస్తారని చెప్పాడతను? “గోబర్నడోర అయ్యా! క్రియోసోట్ పొదలు. బయటికి వెళితే నిమిషంలో ఇల్లంతా మహమ్మారిలా ఆక్రమిస్తుంది. చూస్తావుగా!”

ఒక వీధి మలుపు తిరుగుతుండగా ఒక స్త్రీ శాలువా కప్పుకుని కనిపించింది; అంతలోనే మాయమయింది. తలుపుల్లేని ఇళ్ళలోకి తొంగి చూస్తూ ముందుకు నడిచాను. మళ్ళీ ఆ శాలువా కప్పుకున్న ఆమె నాకెదురుగా వచ్చింది.
ఆమె పలకరించింది.
ఆమె వంక చూశాను. “దోన (మేడం) ఎదువిజస్ వాళ్ళ ఇల్లెక్కడ?” అరిచాను.
ఆమె చేయెత్తి చూపించింది. “అదుగో ఆ వంతెన పక్క ఇల్లు”
ఆమె గొంతులో మానవ స్వరమే పలుకుతున్నట్టూ, నోటినిండా పళ్ళూ, మాట్లాడుతున్నప్పుడు కదిలే నాలుకా, ఈ భూమి మీద నివసించే మనుషులకున్న కళ్ల లాంటి కళ్ళూ గమనించాను.
అప్పటికి చీకటి పడిపోయింది.
సెలవని చెప్పడానికి వెనక్కి తిరిగింది వెళుతూ. ఆడుకునే పిల్లలూ, పావురాలూ, కప్పుల మీద నీలపు రంగు పెంకులూ లేకపోయినప్పటికీ ఈ ఊరు బతికిఉన్నట్టు అనిపించింది. నిశ్శబ్దమే చెవులపడుతున్నదంటే, అందుకు కారణం ఇంకా నాకు నిశ్శబ్దం అలవాటు కాలేదన్న మాట. బహుశా నా బుర్రంతా శబ్దాలతోనూ, గొంతులతోనూ నిండి ఉండటం వలనేమో.
అవును, గొంతులు. ఇక్కడ, గాలి ఆరుదయిన చోట, అవి నాకు బలంగా వినిపిస్తున్నాయి. అవి నాలో బరువుగా నిండి ఉన్నాయి. మా అమ్మ చెప్పింది గుర్తుంది: “అక్కడ నీకు బాగా వినిపిస్తుంది. నేను నీకు ఇంకా దగ్గరగా ఉంటాను. నా జ్ఞాపకాల గొంతు నా చావు గొంతుకంటే బలంగా వినిపిస్తుంది, చావుకు గొంతు అంటూ ఉంటే” అమ్మ.. బతికి ఉన్నట్టే.
ఆమె ఇక్కడ ఉండి ఉంటే బావుండేది; “ఆ ఇంటి గురించి పొరబాటు పడ్డావు. నువ్వు చెప్పిన చోటు తప్పు. దిక్కూ దివాణం లేని ఊరికి పంపావు. బతికిలేని వాళ్ల కోసం వెతకడానికి” అని ఆమెతో చెప్పడానికి.
నది చేస్తున్న చప్పుడును అనుసరించి వంతెన పక్కనున్న ఇల్లు కనుక్కోగలిగాను. తలుపు కొట్టడానికి చేయెత్తాను కానీ అక్కడేమీ లేదు. గాలి తలుపును బద్దలు కొట్టినట్టు నా చేతికి శూన్యం తగిలింది. ఒకావిడ అక్కడ నిలుచుని ఉంది. ఆమె “లోపలికి రా” అంది. నేను లోపలికి వెళ్ళాను.

ట్లా నేను కోమలాలో ఆగిపోయాను. గాడిదలతో వచ్చినతను తన దారిన వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు చెప్పాడు:

“నేనింకా చాలా దూరం వెళ్ళాలి. అదుగో వరసగా కొండలు కనిపిస్తున్నాయే వాటవతలికి. నా ఇల్లుందక్కడ. నీకు రావాలని ఉంటే సంతోషం. ఇప్పటికి నీకు ఇక్కడ ఉండాలనిపిస్తే ఉండు. ఇక్కడొక చుట్టు తిరిగివస్తే పోయేదేమీ లేదు, ఇంకా బతికి ఉన్న వాళ్ళెవరయినా తగలొచ్చు.”
నేనుండిపోయాను. నేనొచ్చిందే అందుకు.
“ఉండటానికి చోటెక్కడ దొరుకుతుంది?” దాదాపు అరుస్తూ అడిగాను.
“ఎదువిజస్ కోసం చూడు, ఇంకా ఆమె బతికిఉంటే. నేను పంపానని చెప్పు”
“నీ పేరేమిటి?”
“అబుందియో” బదులిచ్చాడు అతను. అతని ఇంటి పేరు వినపడనంత దూరం వెళ్ళిపోయాడు అప్పటికే.

(వచ్చే వారం…)

అనువాదం: చందూ

ఉత్తర అమెరికా తొలి తెలుగు కథ 50వ వార్షికోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

10614218_300362290152515_8326601315087796337_n
అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం)
ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకూ
హ్యూస్టన్, టెక్సస్
ఆత్మీయ ఆహ్వానం
మీ అందరి ప్రోత్సాహంతో, 1998లో ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటిదాకా దిగ్విజయంగా జరుగుతున్న ద్వైవార్షిక అఖిల అమెరికా తెలుగు సాహితీ సదస్సుల సత్సాంప్రదాయాన్ని అనుసరిస్తూ, అంతకంటే ఆసక్తికరంగా 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహానగరంలో రాబోయే అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం) తారీకులలో జరగబోతోంది. ఉత్తర అమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ 1964 లో అప్పటి ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడి యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా, ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య ప్రారంభానికి అదే తొలి అడుగుగా గుర్తిస్తూ ఆ కథ అర్ధ శతాబ్ది ఉత్సవాలు ప్రధాన అంశంగా ఈ “తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా ఆహ్వానిత అతిథులుగా కెనడా నుంచి వస్తున్న ఉత్తర అమెరికా తొలి కథకులైన స్వర్గీయ శ్రీ మల్లికార్జున రావు గారి కుటుంబం, ఉత్తర అమెరికా తొలి కవి & పత్రికా సంస్థాపకులు స్వర్గీయ పెమ్మరాజు వేణుగోపాల రావు గారి కుటుంబం (అట్లాంటా), అమెరికా లో తొలి కథకులైన చెరుకూరి రమాదేవి (డిట్రాయిట్), వేమూరి వెంకటేశ్వర రావు (ప్లెజంటన్, కాలిఫోర్నియా) లకీ, ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యానికి పునాదులు వేసిన తదితర ప్రముఖులకి వారికి ఈ మహా సభలో ఆత్మీయ సత్కారం జరుగుతుంది.
గత యాభై సంవత్సరాలగా అమెరికాలో వెల్లివిరుస్తున్న తెలుగు సాహిత్యం 50వ వార్షికోత్సవ సందర్భంగా అమెరికా తెలుగు కథకి, కవితల ఆవిర్భావాలనీ నెమరువేసుకుని మరింత ఉజ్జ్వల భవిష్యత్తు కోసం పునాదులు బలిష్టం చేసుకునే ఆలోచనలు మనతో పంచుకునే సుప్రసిద్ధ అమెరికా సాహితీవేత్తలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ మహా సభలకు విచ్చేయనున్నారు. ఇటువంటి అపురూపమైన అవకాశం వచ్చినాపుడైనా మన సాహిత్య చరిత్రని మనమే గుర్తు చేసుకుని ఆ చరిత్ర సృష్టించిన వారిని గౌరవించుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టే!
భారత దేశం నుండి కూడా కొందరు ఉత్తమ సాహితీవేత్తలని ఇక్కడికి ఆహ్వానించి అక్కడి సాహిత్య విశేషాలని తెలుసుకోవడం, మన సాహిత్య పురోగతిని మాతృదేశం లో మన వారికి తెలియజేసే మా సాంప్రదాయం ప్రకారం ఈ మహా సభలకు భారత దేశం నుండి ముఖ్య అతిథులుగా తొలి సారిగా హ్యూస్టన్ నగరానికి శ్రీ తనికెళ్ళ భరణి & శ్రీ రావి కొండల రావు రావు గారూ, తొలి సారిగా అమెరికా పర్యటనకు శ్రీమతి ముక్తేవి భారతి, శ్రీ తల్లావఘ్ఘుల పతంజలి శాస్త్రి గారూ ఆహానించబడ్డారు.

10628066_300362316819179_131675058726844698_n
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి వారి సాహితీ లోకం బృందం లాభాపేక్షలేని నిర్వహణలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి సాహితీ సదస్సులో ఉత్తర అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న తెలుగు రచయితలు, పండితులు, విమర్శకులు, వక్తలు, భాషాభిమానులనూ, తెలుగు భాషా, సాహిత్యాలను అన్నిచోట్లా పెంపొందించదల్చుకున్న వారందరినీ పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

సదస్సు ప్రధానాశయాలు

ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య 50 వార్షికోత్సవ సందర్భంగా జరుగుతున్న ఈ తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో అమెరికా సాహిత్య విజయాలని నెమరు వేసుకుని, తోటి రచయితలను, సాహితీవేత్తలనూ, తెలుగు భాషా, సాహిత్యాభిమానులనూ వ్యక్తిగతంగా, ఆత్మీయ సాహిత్య వాతావరణంలో కలుసుకొని, సాహిత్య పరిచయాలను పెంచుకొనడం, ఈ సమావేశానికి వచ్చిన రచయితలందరికీ, తగిన స్థాయిలో తమ రచనలను, సాహిత్య పరమైన అభిప్రాయాలను సహ సాహితీ ప్రియులకి స్వయంగా వినిపించే అవకాశాలు కలిగించడం ఈ సదస్సు ముఖ్య ఆశయాలు.
ప్రత్యేక ఆకర్షణలు
స్వీయ రచనా పఠనం, నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, నూతన పుస్తకావిష్కరణలు, పుస్తక విక్రయ శాల, చర్చా వేదికలు, సరదా సాహిత్య పోటీలు, “సాహిత్య “ప్ర-జ” ప్రత్యేక వేదిక” (సాహిత్యపరమైన ప్రశ్నలూ-జవాబులు), అందరూ అప్పటికప్పుడు పాల్గొనే గొలుసు కథ, మరెన్నో….

10647170_300362460152498_8223353005422413139_n
రచయితలకు, వక్తలకు విన్నపం
ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో ప్రసంగించదల్చుకున్న వారు, స్వీయ రచనా విభాగంలో తమ రచనలను వినిపించదల్చుకున్నవారూ ఈ క్రింది నిర్వాహకులను సంప్రదింఛండి. ప్రసంగాంశాలు ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక పోకడల దాకా తెలుగు భాషాసాహిత్యాలకి సంబంధించినవే ఉండాలి. అమెరికాలో తెలుగు సాహిత్య పోకడల మీద ప్రసంగాలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం.
పై ఊరి వారికి ప్రత్యేక సదుపాయాలు
ప్రతిష్టాత్మకమైన ఈ 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కు ఉత్తర అమెరికాలో ఇతర నగరాలనుంచీ వచ్చే సాహితీవేత్తలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా, అతి తక్కువ ఖర్చుతో వసతి సదుపాయాలు, వాహన సదుపాయాలు చెయ్యబడ్డాయి. సముచితమైన ఏర్పాట్లు చేయడానికి వీలుగా ఈ అమెరికా తెలుగు సదస్సులో పాల్గొన దల్చుకున్నవారు ముందుగా నమోదు చేసుకోవాలి. నమోదు వివరాలు, ఇతర ఆసక్తికరమైన విషయాలు త్వరలోనే ప్రకటించబడతాయి.
రాబోయే అక్టోబర్ 25-26, 2014 తారీకులలో హ్యూస్టన్ లో జరిగే ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ 50వ వార్షికోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు వచ్చే ప్రయాణం ఏర్పాట్లు చేసుకోవలసినదిగా అమెరికా రచయితలనూ, సాహితీవేత్తలనూ, భాషాభిమానులనూ కోరుతున్నాం. ఈ సదస్సుకు సంబంధించిన ఏ విషయం పైనా ఈ క్రింది ఔత్సాహిక నిర్వాహకులను సంప్రదించండి. అతిథులను గౌరవంగా ఆహ్వానించి మర్యాద చేయడమే మా హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి మరియు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి ప్రధాన లక్ష్యం.

Conveners:

Dr. Vanguri Chitten Raju
Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com
&
Maruthi Reddy
Phone: 832-240-6749
E-mail: c_maruthi@hotmail.com

Coordinator:
Sai Rachakonda
Phone: 281 235 6641
E-mail: sairacha@gmail.com
Organizing Committe: C.N. Satyadev, Madhu Pemmaraaju, Satyabhama Pappu, Sarada Akunuri. Krishna Keerthi, Ram Cheruvu, Raghu Dhulipala, Ravi Ponnapalli, Lalitha Rachakonda, Sitaram Ayyagari, Pallavi Chilappagari, Sudhesh Pilliutla, Mallik Putcha.

బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ లో రాజ్ నవల విడుదల

All_Things_Unforgive_Cover_for_ebook

పదేళ్ళ నించీ రాజ్ కారంచేడు వొకే పనిలో రకరకాలుగా కూరుకుపోయి వున్నాడు. రోజు వారీ బతుకు కోసం అతని వుద్యోగమేదో అతను చేసుకుంటూనే, ప్రతి గురువారం సారంగ పత్రిక పనిలో తనదో చెయ్యి ఉంటూ వుండగానే – తనదైన ఇంకోటేదో లోకంలో తన వాక్యాల మధ్య తనే సంచరిస్తూ పరధ్యానమవుతూ ఆశ పడుతూ ఎక్కువసార్లు నిరాశ పడుతూ నిట్టూరుస్తూ యీ చీకటి గుహ చివర వెల్తురేదో వుంది వుందనుకుంటూ- ఇవాళ్టికి ఇదిగో ఇలా ఈ నవల్లో ఇలా తేలాడు రాజుకన్నా బలవంతుడైన ఈ రాజ్ అనే మొండివాడు.

ఈ వారం ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ బ్రూక్లిన్ బుక్ ఫెస్టివల్ లో ఎంపికైన అయిదు ఇంగ్లీషు నవలల్లో రాజ్ నవల All Things Unforgiven కూడా వుండడం మన ‘సారంగ’ కుటుంబీకులందరికీ సంతోష సమయం.

ఈ ఆదివారం అంటే 21 వ తేదీన న్యూయార్క్ బ్రూక్లిన్ బరో హాల్లో మెయిన్ స్టేజ్ మీద రాజ్ రాసిన ఈ నవలని పరిచయం చేయబోతున్నారు. ఈ నవల సారంగ బుక్స్ తొలి ఇంగ్లీషు సాహిత్య ప్రచురణ. అంటే, ఇదే సందర్భంలో సారంగ బుక్స్ మొదటిసారిగా అంతర్జాతీయ పుస్తకాల మార్కెట్లోకి అడుగుపెడుతోందన్న మాట.

RajKaramcheduరాజ్ కారంచేడు ఇప్పటిదాకా కవిత్వ అనువాదకుడిగానే మనకు తెలుసు. రాజ్ అనువాదం చేసిన తెలుగు కవితల ఇంగ్లీషు అనువాదాలు కొన్ని Oxford University Press త్వరలో ప్రచురించబోతున్న తెలుగు కవితల సంపుటంలో చేరాయి. అలాగే, రాజ్ అనువాదం చేసిన శివారెడ్డి, వరవర రావు, ఇస్మాయిల్ ల కవితలు వివిధ అంతర్జాతీయ సాహిత్య పత్రికల్లో ఈ ఏడాది రాబోతున్నాయి కూడా.

ఈ అనువాద కృషికి భిన్నంగా రాజ్ రాసిన ఈ నవల All Things Unforgiven మరచిపోలేని మైలురాయి. హైదరాబాద్ పాతబస్తీలో వొక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం కేంద్రంగా సాగే ఈ నవల అటు హైదరాబాద్ నీ, ఇటు ఆధునికతలోకి అడుగుపెడ్తున్న బ్రాహ్మణ కుటుంబం బతుకు చిత్రాన్నీ, ఆ జీవితాల ఎగుడు దిగుళ్ళనీ బలంగా ప్రతిబింబిస్తుంది. బహుశా, ఇటీవలి కాలంలో హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా వెలువడిన అరుదైన ఆంగ్ల నవల ఇదే కావచ్చు కూడా. ఈ నవల ప్రస్తుతం సారంగ బుక్స్ ద్వారా, అమెజాన్ ద్వారా కూడా అందుబాటులో వుంది.

 

అక్కా చెల్లెళ్ళు

The-Two-Princesses-glass-mask-topeng-kaca-22689515-493-519
ఒకప్పుడు స్కాట్లండ్ లో ఒక రాజు కి వెల్వెట్ చీక్ అని ఒక ముద్దులొలికే కూతురు ఉండేది. చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోయింది. తండ్రి కి తనంటే చాలా ప్రేమ. తనకీ ఏమైనా అయితే రాకుమారికి ఎవరూ దిక్కు ఉండరని భయపడి రాజు కొన్నాళ్ళకి ఒక మధ్యవయసు వితంతువుని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె కూడా ఒక రాజ కుటుంబానికి చెందినదే. ఆమెకీ కాథరీన్ అని ఒక కూతురు ఉంది.ఇద్దరు అమ్మాయిలూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని రాజు ఆశపడ్డాడు. అలాగే వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు.
అయితే కొత్త రాణి బుద్ధి మాత్రం మంచిది కాదు. వెల్వెట్ చీక్ ఎదిగే కొద్దీ ఎంతో అందంగా తయరయింది. తన కూతురుకన్న ఆమె అందంగా ఉందనీ ఆమెకి గొప్ప సంబంధం వస్తుందనీ రాణి అసూయపడింది. ఆ అందాన్ని ఎలాగయినా పాడు చేయాలనుకుంది. ఒక రోజు చీకటి పడేవేళ దుప్పటి ముసుగు వేసుకుని కోళ్ళని పెంచే ముసలావిడ దగ్గరికి వెళ్ళింది. ఆమె కి మంత్రాలూ మాయలూ వచ్చని రాణి వంటి కొందరికే తెలుసు. అంతా విని మంత్రగత్తె ” పొద్దున్నే ఏమీ తినకుండా రాకుమారిని నా దగ్గరికి పంపించు . పని జరుగుతుంది ” అని మంత్రగత్తె చెప్పింది. మర్నాడు పొద్దునే వెల్వెట్ చీక్ ని పిలిచి ఫలానా ఆవిడ దగ్గర్నుంచి కోడిగుడ్లు తీసుకురమ్మని అడిగింది. ” ఏమీ తినకుండా ఉదయపు గాలిలో తిరిగితే ఆడపిల్లల బుగ్గలు ఎఱ్ఱగా అవుతాయి , కాబట్టి అలాగే వెళ్ళు ” అనిసలహా ఇచ్చింది. కానీ ఎందుకు అలా చెప్పిందా అని అనుమానం వచ్చీ ఆకలేసీ వెల్వెట్ చీక్ ఒక పెద్ద కేక్ ముక్క తిన్నాకే బయల్దేరింది. వెళ్ళి గుడ్లు కావాలని ముసలావిడని అడిగింది. ” అదిగో, ఆ కుండ మీద మూత తీస్తే ఉన్నాయమ్మా, తీసుకో ” అంది ఆమె. అలాగే కుండ మూత తీసి గుడ్లు పట్టుకువెళ్ళింది వెల్వెట్ చీక్. ఆమెకి ఏమీ కానందుకు మంత్రగత్తె ఆశ్చర్యపడింది , రాణి కి చాలా కోపం వచ్చింది. మరుసటి రోజు వంటిల్లు తాళం పెట్టించి ఏ ఆహారమూ వెల్వెట్ చీక్ కి అందకుండా చేసింది. ఖాళీ కడుపుతో వెళ్ళిన రాకుమారికి దారివెంట బఠాణీ లు కోస్తున్న పల్లెజనం కనిపించారు. ఆకలికి ఆగలేక గుప్పెడు గింజలు అడిగి తినేసింది. ఈ సారి కూడా మంత్రగత్తె మాయ పనిచేయలేదు.
ఇలా కాదనుకుని మూడో రోజు రాణి తనే సవతి కూతురుని తీసుకువెళ్ళింది. ఏమీ తినే అవకాశమే రాకుమారికి దొరకలేదు. ఈ సారి కోడిగుడ్లు ఉన్న కుండ మూత తీసేసరికి వెల్వెట్ చీక్ చక్కటి ముఖం మాయమై గొర్రె తల వచ్చేసింది. రాణి అతి సంతోషంతో అంతఃపురానికి వెళ్ళిపోయింది. రాకుమారి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ముఖాన్ని జేబురుమాలుతో కప్పుకుని వెళ్ళింది. ఆమెని చూసి కాథరీన్ కి విపరీతంగా బాధేసింది. తన సొంత తల్లి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ” మనం ఇక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండద్దు . మా అమ్మ నిన్నింకేం చేస్తుందో ఏమో ” అని వెల్వెట్ చీక్ ని గబగబా బయల్దేరదీసింది.ఆమె గొర్రె ముఖాన్ని పట్టు శాలువాతో కప్పి ఆమె చేయిపట్టుకుని కాథరీన్ రాజధాని నుంచి బయటపడింది . కొన్ని రోజులకి సరిపడా ఆహారం మూట కట్టుకున్నారు. ఎవరూ చూడని చోట్ల ఏ గడ్డివాముల లోనో రాత్రులు నిద్ర పోయేవారు
నడిచి నడిచి రెండు రాజ్యాల అవతల ఉన్న పట్టణానికి వెళ్ళేసరికి తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. ఒక పెంకుటింటి ముందు ఆగారు. ” ఈ రాత్రికి ఇక్కడ ఉండనివ్వమ నీ, కాస్త భోజనం పెట్టమ నీ అడుగుదాం. రేపు ఏదైనా పని చూసుకోవచ్చు ” అని కాథరీన్ అంది. వెల్వెట్ చీక్ ” నా ముఖాన్ని చూసి ఇంట్లోవాళ్ళు భయపడరా ? నా చెల్లెలివని నిన్నూ దూరంగా ఉంచాలనే చూస్తారేమో ” అంది.
” నీ ముఖం అలా ఉంటుందని ఎవరికి తెలుస్తుందేమిటి ? నువ్వు మాట్లాడకు. ఆ శాలువా గట్టిగా బిగించుకో. అంతా నేను చూసుకుంటాను ” అని ధైర్యం గల కాథరీన్ జవాబు ఇచ్చింది.అలాగే తలుపు తట్టి వెళ్ళి తన అక్కకి జబ్బుగా ఉందనీ , తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోందనీ ఆ రాత్రికి తల దాచుకోనివ్వమనీ అడిగింది. ఆ ఇల్లు ఒక పేదరాసి పెద్దమ్మది. కాథరీన్ నెమ్మదిగా ఉండటం, మృదువుగా మాట్లాడటం గమనించి
” అయితే ఒంట్లో బాగాలేని వాళ్ళని చూసుకోవటం నీకు బాగా తెలుసా ? ” అనిపేదరాసి పెద్దమ్మ అడిగింది. ” ఓ , బాగా తెలుసుగా ” అని కాథరీన్ బొంకింది.
విషయం ఏమిటంటే ఆ రాజ్యపు రాజు గారి పెద్ద కొడుకు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాడు. అతని మతి సరిగా ఉండటం లేదు. రాత్రి వేళల్లో మరీ అలజడిగా ఉంటాడు. అతన్ని ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సి వస్తూంది. ఎవరూ ఆ పనిని సక్రమంగా చేయలేకపోతున్నారు. రాజకుమారుడు పొద్దున లేచేసరికి దెబ్బలు తగిలించుకుని ఉంటున్నాడు.
The-Two-Sisters-xx-James-Sant
పేదరాసి పెద్దమ్మకి కాథరీన్ సమర్థురాలిగా అనిపించి మర్నాడు పొద్దున్నే రాజుకి ఆ మాట చేరవేసింది. ఆయనా కాథరీన్ తో మాట్లాడి తృప్తి పడి ఆ పనిని అప్పజెప్పాడు. రాజకుమారుడు క్షేమంగా ఉంటే సంచీడు వెండి నాణాలు బహుమతి ఇస్తానని చెప్పాడు. ఎవరితోనూ సంబంధం లేకుండా విడిగా ఒక గదిని అడిగి తీసుకుని అక్కని అందులో ఉంచి అని కాథరీన్ రాజకుమారుడి గదికి వెళ్ళింది.
రాజకుమారుడు చూసేందుకు చాలా బావున్నాడు. ఏదో జ్వరం తగిలినవాడిలాగా ఉద్రేకంగా కనిపించాడు. అర్థరాత్రి పన్నెండు గంటలకి కాథరీన్ కి కునుకు పట్టబోతుండగా , ఉన్నట్లుండి అతను లేచి మంచి బట్టలు వేసుకుని మెట్లు దిగి వెళ్తున్నాడు. ఆమె అతన్ని వెంబడించింది. అతను సరాసరి గుర్రాల సాలలోకి వెళ్ళి ఒక గుర్రానికి కళ్ళెం తగిలించి ఎక్కగానే ఆమె కూడా చప్పుడు చేయకుండా వెనక ఎక్కి కూర్చుంది. అడవిలోంచి వాళ్ళు ప్రయాణిస్తూ ఉండగా చుట్టూ విరగకాసిన హేజెల్ నట్ చెట్లు ఉన్నాయి. చేతికి అందినన్ని కాయలు కోసి గౌన్ జేబులలో దాచుకుంది కాథరీన్. పోగా పోగా ఒక విశాలమైన మైదానం వచ్చింది. మధ్యలో ఒక చిన్న కొండ. అక్కడ రాకుమారుడు గుర్రం దిగి, ” తెరుచుకో, ద్వారమా. రాకుమారుడినీ అతని గుర్రాన్నీ లోపలికి వెళ్ళనీ ” అని చిన్న గొంతుతో మంత్రం చదువుతున్నట్లు అన్నాడు.” ఆ వెనకే నన్ను కూడా ” అని గొణిగింది కాథరీన్. సరిగ్గా వాళ్ళు పట్టేంతగా కొండలో తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే మూసుకుపోయింది.
ఆ లోపల ఒక పెద్ద చావడి. రంగు రంగుల కొవ్వొత్తుల తో వెలిగిపోతోంది. మధ్యలో అద్భుత సౌందర్యవతులు కొందరు నాట్యపు దుస్తు లలో ముస్తాబయి ఉన్నారు. జుట్టులో వెల్వెట్ పూల, గులాబీల కిరీటాలు పెట్టుకున్నారు. అదే వయసుగల అందమైన యువకులు కూడా చుట్టూ ఉన్నారు. వింతయిన సంగీతం వినిపిస్తోంది. వాళ్ళంతా ఎల్ఫ్ లు, దేవతలలో ఒక జాతి అది . రాజకుమారుడినిచూడగానే వాళ్ళలో ఒక యువతి పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చింది. ఒక్కసారిగా అతని బద్ధకం, మగత , మాయమైనాయి. ఉత్సాహంగా నవ్వుతూ ఆమెతో అతను నాట్యం చేశాడు. అందరూ జంటలుగా నర్తించటం మొదలుపెట్టారు. ఒక మూలగా మసక చీకటిలో దాక్కున్న కాథరీన్ ని ఎవరూ గమనించినట్లు లేదు. అంతలో ఒక చిన్న పాప ఒక బంగారు బెత్తం తో ఆడుకుంటూ ఆమె ఉన్న చోటికి వచ్చింది. కాథరీన్ కి ముద్దొచ్చి పలకరించబోయింది. ఆ పక్కగా నాట్యం చేస్తూ వెళుతున్న ఒక అమ్మాయి తనతో ఉన్న అబ్బాయితో ఇలా అంది ” ఆ బెత్తంతో మూడుసార్లు తడితే కాథరీన్ అక్క ముఖం మామూలుగా అయిపోతుంది ” కాథరీన్ కి గొప్ప సంతోషం, ఆదుర్దా. మెల్లిగా తన జేబుల్లోంచి హేజెల్ నట్ కాయలు తీసి ఆ పాప ఉన్న వైపుకి దొర్లించింది. పాపకి ఆసక్తి పుట్టి చేతిలో బంగారు బెత్తాన్ని పక్కనపెట్టి కాయలు తీసుకుంది. నింపాదిగా కొద్ది కొద్ది నట్స్ ని అక్కడ వదుల్తూ పాప దృష్టి మరలించి కాథరీన్ బెత్తాన్ని అందుకుని జేబులో దాచుకుంది. సరిగ్గా అప్పుడే నాట్యం ముగిసింది. రాకుమారుడు తప్ప అంతా మాయమయ్యారు. అతను హడావిడిగా వెనక్కి మరలాడు. కాథరీన్ జాగ్రత్తగా వెనకాల ఎక్కి కూర్చుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ అతని గదిలోకి ప్రవేశించారు.తెలతెలవారేదాకా అక్కడే ఉండి కాథరీన్ అక్క ఉన్న చోటికి వెళ్ళింది. పాపం, గొర్రె మొహం వేసుకుని వెల్వెట్ చీక్ నిద్రపోతోంది. బంగారు బెత్తం తో మూడుసార్లు తట్టేసరికి ఆమె ఎప్పటిలా అందంగా అయిపోయింది. అక్కచెల్లెళ్ళు ఇద్దరూ ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు.
fairy ball
రాజు, ముఖ్య సేవికా రాజకుమారుడు రాత్రి ఎలా గడిపాడని కాథరీన్ ని అడిగారు. ” చాలా బాగా గడిపారు ” అని చెప్పింది ఆమె. కొండలోపలి ఎల్ఫ్ యువతులు అతన్ని మంత్రించారనీ దాని సంగతేదో చూడాలనీ మనసులో అనుకుంది . అప్పుడే అక్కడికి తన తలనొప్పి తగ్గిందని అంటూ వెల్వెట్ చీక్ వచ్చింది. రాజు కాథరీన్ మాటలకి చాలా సంతోషించి ఆమె ఖచ్చితంగా నమ్మదగినదని అనుకున్నాడు. వెల్వెట్ చీక్ రూపాన్ని కూడా ఆయన మెచ్చుకుని ఆమె అక్కడే ఉండి పూలు కట్టటం లాంటి సున్నితమైన పనేదో ఒకటి చేయచ్చునని సూచించాడు. రెండో రోజు రాత్రి కూడా కాథరీన్ రాకుమారుడిని కనిపెట్టుకుని ఉంది. అంతా మొదటి రోజు జరిగినట్లే జరిగింది. నాట్యం జరుగుతూ ఉండగా నిన్నటిలాగే ఇంకొక చిన్న పాప వచ్చింది. తన చేతిలో చిన్న కేక్ ఉంది. మళ్ళీ ఒక ఎల్ఫ్ యువతి ఆ పక్కనుంచీ వెళుతూ ” ఆ కేక్ ని మూడు సార్లుగా తింటే రాజకుమారుడి శాపం పోతుంది ” అని తన జతగాడితో చెప్పింది. ఈ పాపనీ హేజెల్ నట్ లతో ఆకర్షించి తను కేక్ ని పక్కన పెట్టగానే తీసుకుని దాచుకుంది. నాట్యం పూర్తయింది.
రాజ భవనానికి తిరిగి వెళ్ళాక రాకుమారుడు ఎప్పటిలా పక్క మీద పడుకున్నాడు. అయితే కాథరీన్ చేతిలో కేక్ ని అతను గమనించాడు. ” నాకు అది తినాలని ఉంది ” అని మత్తుగా అన్నాడు. ఒక్క ముక్క పెట్టేసరికి ముఖం తేటగా అయింది. . ” ఇంకొకసారి ” అడిగాడు. ఈ సారి తినేసరికి లేచి కూర్చోగలిగాడు. మూడో ముక్క తింటూనే లేచి నడిచి తండ్రిని కలుసుకునేందుకు వెళ్ళాడు. రాజు ఆనందం లో మునిగిపోయి కాథరీన్ కి పదే పదే ధన్యవాదాలు చెప్పాడు. ఈ పెద్దకొడుకే తన తర్వాత రాజు అవుతాడు. తన కొడుకుని అంత బాగా చూసుకున్న ఆమె రాబోయే కాలం లో మంచి రాణిగా ప్రజలని కాపాడగలదని ఆయనకి అనిపించింది. ఇద్దరినీ వాళ్ళ ఇష్టం అడిగి పెళ్ళి ఏర్పాటు చేశాడు.
ఆ ముందురోజే, రాజుగారి చిన్న కొడుకు వెల్వెట్ చీక్ ని చూసీ చూడగానే ప్రేమించాడు. వాళ్ళిద్దరి పెళ్ళీ కుదిరిపోయింది. అప్పుడు అమ్మాయిలు ఇద్దరూ వాళ్ళ అసలు కథ చెప్పారు. వాళ్ళ అమ్మా నాన్నా పెళ్ళికి వచ్చారు. వాళ్ళ నాన్న వెల్వెట్ చీక్ ని మళ్ళీ చూడగలిగినందుకు చాలా సంతోషించి కాథరీన్ ని దగ్గరికి తీసుకుని తలమీద ముద్దు పెట్టుకున్నాడు.. ఆయన అనుకున్నట్లే వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు.
ఈ రాజ్యం వాళ్ళ రాజ్యం కంటే చాలా పెద్దది. ఈ రాజుగారు ఇంకా ధనవంతుడు. అందుకని కాథరీన్ కి పట్టిన అదృష్టానికి వాళ్ళ అమ్మ మురిసిపోయింది. వెల్వెట్ చీక్ మీద ద్వేషాన్ని మరచిపోయి ఆమెని క్షమించమని అడిగింది. వెంటనే కాదుగానీ, కాలక్రమాన ఆమెని ఇద్దరు కూతుళ్ళూ మన్నించారు. అందరూ సుఖంగా ఉన్నారు.
స్కాట్లండ్ జానపదకథ , By Elizabeth Grierson

ఎగిరే పావురమా! – 11

egire-pavuramaa11banner
“విననంటే ఎలా గాయత్రి? నువ్వేమౌతావో అనే నా బెంగ. నీ డబ్బంతా పెట్టి పట్నంలో వైద్యం సేయిస్తే నడక, మాట వచ్చేస్తాయి. నీకు పదిహేనేళ్ళు కదా! సరయిన వయసు.
నీకు మేమున్నాము. మా వెంట వచ్చేసేయి. అన్నీ సేస్తాము.
నేనూ, గోవిందు కూడా అండగా నిలబడి నీ మీద ఈగ వాలనివ్వం. అన్నీ సూసుకుంటాం. ఇప్పుడు మేమే నీకు సాయం సేయగలం.
నీ తాత నుండి నీ కొట్టాం, పొలం కూడా అడిగి ఇప్పించుకోవచ్చు. జీవనం ముగిసిపోతున్నవాడు నీ తాత. జీవనం ఇంకా మొదలెట్టని దానివి నువ్వు,” , “ఆలోసించుకో నీ ఇష్టం,” అనేసింది కమలమ్మ.

నా చేయి వదిలేసి, ఎంగిలి చేతిని కంచంలోనే కడిగించి అక్కడినుండి వెళ్ళిపోయింది ఆమె.
దుఖాన్ని అపుకునే ప్రయత్నంలో అక్కడినుంచి లేచి, ఎలాగో నా పక్క మీదకి చేరాను.
ఏనాడు లేనిది, నన్ను కని కాలువగట్టున పారేసిన ఆ నా కన్నతల్లిని తలుచుకున్నాను. నా రోదన వినబడకుండా గొంతు బట్టతో చుట్టిన ఆమె నిర్దయ నిజమేనా అనుకున్నాను. అసలు నన్ను ఇలా దిక్కు మొక్కు లేకుండా చేయడానికి ఆమెకి అధికారం ఉందా? నా ఈ దుస్థితికి ఆ అమ్మ కాదా కారణం? అని తిట్టుకున్నాను…
లేచి మంచినీళ్ళు తాగాను. మరో పక్కకి ఒత్తిగిల్లాను. కమలమ్మ గురకతో అసలు నిద్ర రావడం లేదు. ఆలోచన ఆమె మీదకి మళ్ళింది. మా జీవితాల్లోకి కమలమ్మ వచ్చి మూడేళ్ళవుతుంది. ఆమె ఎసుమంటి మనిషో అంతగా అర్ధం కాలేదు. నా మీద ప్రేమ చూపిస్తది. నా మంచి కోరుకుంటది.
తాతకి అమె నచ్చదు. ఎందుకు?
ఆలోచన తాత మీదకి మళ్ళింది. గుండెలు చల్లగా అయిపోయాయి. గుండెలు జారి నేలకొరిగినట్టుగా అనిపించింది. తల మొద్దుబారింది. నిజంగా నా జీవితం ఇలా అవ్వడానికి తాత కారణమా? నా అవిటితనం తాత వల్ల ఏర్పడిందా?
మరి చంద్రమ్మతో నేను తనకి దొరికినప్పుడు కాళ్ళు, పాదాలు దెబ్బ తిన్నాయని, ఊపిరి కూడా అందకుండా గొంతుకి గుడ్డ చుట్టి ఉందని అన్నాడే?
కన్నతల్లే నిర్దయగా అలా వదిలేసిందేమో అని బాధపడ్డాడే? అది అబద్దమా?

కమలమ్మ మాటలు తలుస్తూ మితిమీరిన బాధతో, కోపంతో వణికిపోతున్న నా వొంటిని, అవిసిపోతున్న గుండెల్ని సముదాయించే ప్రయత్నంలో తెల్లారిపోయింది.
**
నా బాధ, ఆందోళన పట్టనట్టుగా మామూలుగా తెల్లారింది. కమలమ్మ చెప్పిన విషయాలు గుండెల్ని మండిస్తున్నా ఎప్పటిలా నేను గుళ్ళో నా స్థానంలో కూచుని, నా పని చూసుకుంటున్నాను.
పూలపని, వత్తులు, కుంకుమ పొట్లాల పని అయ్యేప్పటికి తొమ్మిదిన్నరయ్యింది.

పదిగంటల సమయంలో, గుడి ఆవరణలోనే దూరంగా ఓ మూలకి పెద్ద బస్సు వచ్చి ఆగింది. కొద్దిసేపట్లో హడావిడి మొదలైంది. అప్పటికే గుడి బయట – చూపు లేని వారు, వికలాంగులు – పిల్లలు, పెద్దలు, వారి వెంట వచ్చిన వారు ఒక పాతిక మందైనా కూడారు.

మరో పది నిముషాలకి పూజారయ్య, ఉమమ్మ, నేను ఆ బస్సు దగ్గరకి వెళ్ళాము. వైద్య సదుపాయాలున్న ఆ బండి చిన్న ఆసుపత్రి లాగానే ఉంది. ఇద్దరు డాక్టరమ్మలు, ఒక డాక్టరయ్య ఉన్నారు.

ముందుగా నన్నే లోనికి తీసుకెళ్ళారు.
వారు నిర్వహించబోయేది – రక్త పరీక్షలతో మొదలెట్టి –
‘అంగవైకల్య సంబంధిత ప్రాధమిక పరిశీలన’ – అన్నారు.
కాళ్ళలో – కదలిక పరిధి, స్పందన – నమోదు చేసారు
గొంతు బయట-లోపల ఫోటోలు, ఎక్సురేలు తీసారు
స్వతహాగా గొంతునుండి వెలువడే ధ్వనులు పలికించి విన్నారు.
నెలక్రితం వంశీ సంస్థతో తాత దాఖలు చేసిన అర్జీ నా ముందుంచారు. నా పేరు రాసున్న దస్త్రం – నా తరఫున తాత దరఖాస్తు పెట్టిన కాగితాలవి. ఉమమ్మ దాన్ని చదవమని నా పక్కన కూచుంది.

అభ్యర్ధి: గాయత్రి సాయిరాం – వయస్సు: 15 సంవత్సరాలు – 6 వ తరగతి విద్యార్ధిని.
సంరక్షకుడు – (తాత) సత్యం సాయిరాం – వయస్సు: 73 సం – గంగన్న పాలెం వాస్తవ్యులు
సంక్షిప్త ఫిర్యాదు : అంగవైకల్యం – (నడక, మాట లేకపోవడం)
వివరణ: 15 యేళ్ళ క్రితం, ఉధృత పరిసరాల్లో – కాళ్ళు, పాదాలు, మెడ, గొంతు భాగాలు నలిగి, శారీరికంగా గాయపడి, తీవ్ర వొత్తిడికి లోనయిన పసిబిడ్డ.
ప్రస్తుత పరిస్థితి: కదలిక లేని కాళ్ళు, సామాన్య మాట సామర్ధ్యం లేని వాక్కు (మూగి).
జరిపిన చికిత్స: కాళ్ళకి, అరికాళ్ళకి ఆకు పసర్ల పూత, ఆయుర్వేదం.
పై విషయమంతా ఆ దస్త్రం లోని వివరణాపత్రికలో స్పష్టంగా రాయించాడు తాత ….
దానితో పాటుగా —
తమ ఆర్ధికస్థితి దృష్ట్యా ఉచిత వైద్యసహాయం కోరుతున్నామని కూడా….తాత చేసిన ఆభ్యర్ధనా పత్రం – ఆ దస్త్రంలో ఉంది.
**
నాతో పాటు మొత్తం ఐదుగురికి మాత్రమే డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు.
ఆ పరీక్షల వివరాలు సాయంత్రానికల్లా చెబుతామన్నారు.
నేను, ఉమమ్మ గుళ్ళోకి వెళ్ళిపోయాము.
**
గుడిలో పని ముగించుకొని ఐదింటికి మళ్ళీ వైద్యుల్ని కలిశాము.
వారు జరిపిన ప్రాధమిక పరీక్షల ఫలితాల పత్రం మా చేతికిచ్చారు.
కదలిక పరంగా :
కాళ్ళల్లో ఎదుగుదల – 80% (ఎనభై శాతం) ఉంటే, స్పందన – 40% (నలభై శాతం) ఉందంట.
అరికాళ్ళల్లో స్పర్సజ్ఞానం – 20% (ఇరవై శాతం)గా.. నిర్దారణయ్యిందంట.
పాక్షిక ప్రతిస్పందనకి కారణం వైజ్ఞానికంగా కనుగొనవలసిన అవసరం ఉందని ప్రస్తావించారు.

కంఠధ్వనుల పరంగా:
నేటి సాధారణ పరీక్షా ఫలితాలు అసంపూర్ణం అని, ప్రత్యేకంగా సున్నితమైన ‘స్వర పేటిక’ వైద్య పరీక్షలు జరపవలసుందని తెలియజేశారు.
యేడాది సమయం పట్టే ఆ వైద్యానికి, ‘వంశీ సంస్థ’ నివాసిగా నమోదైన రుజువు అవసరం అని కూడా సూచించారు ఆ సంస్థ వైద్యులు.

వొత్తిడి పడని మిగతా ప్రమేయాలు సవ్యంగానే ఉండడంతో, సరయిన వైద్యం అందితే, పరిస్థితి మెరుగుపడే అవకాశం హెచ్చుగానే ఉందని కూడా నిర్ధారించారు.
వాళ్ళతో సంప్రదింపులు అయేప్పటికి సాయంత్రం నాలుగయింది.

ఆ తంతు ముగుస్తూనే ఉమమ్మ ఆ వివరణాపత్రం మళ్ళీ చదువుతూ అరుగు మీద నా పక్కనే కూచుంది. సమాచారమంతా సరోజినిగారికి ఫోనులో వివరించి, వంశీ వారి సౌకర్యంలో నివశించే వారికి మాత్రమే, అవసరమైన వైద్య పరీక్షలు చేస్తారని కూడా ఆమెతో చెప్పింది.
ఫోను పెట్టేసి ఆలోచనలో పడింది ఉమమ్మ.
“అంటే నువ్వు ఈ ఊరునుండి వెళ్లి కనీసం ఓ ఏడాది పాటు అక్కడ గుంటూరులో వాళ్ళ వసతిలో ఉండాలన్నమాట. అలా కాకుండా ఇంకే విధంగానైనా ఆ వైద్య పరీక్షలు చేయించవచ్చేమో, సరోజినిగారి సాయంతో కనుక్కుంటానులే,“ అంది ఉమమ్మ.

egire-pavurama-11
**
పొద్దున్నుంచి జరిగిన విషయాలు తలచుకుంటూ మధ్యానం కమలమ్మ ఇచ్చిన పులిహోర తిన్నాను.
వంశీ సంస్థ వారితో, తాత ద్వారా నమోదైన నా వివరాలు పదే పదే గుర్తొస్తున్నాయి. పసిపిల్లగా నా కాళ్ళు చితికిపోతే, గాయాలు మానిన గుర్తులు చూడంగా గుర్తులేదే? మరి మాట ఎందుకు రాకుండా పోయినట్టు? పుట్టుకతో వచ్చిన మూగతనమా?

వెన్నంటే కమలమ్మ మాటలు కూడా పదే పదే గుర్తొస్తున్నాయి. ఇన్నేళ్ళ ‘గాయత్రి’ హుండీ డబ్బు ఎంత? నా కోసం పిన్ని తన వద్ద దాస్తుందేమో? ఆ డబ్బుతో పట్నంలో పెద్దాసుపత్రికి వెళ్ళలేమా? వెళ్ళి వైద్యం చేయిస్తే, నా కాళ్ళు బాగయిపోతాయేమో… నడవగలుగుతానేమో, అది చాలు నాకు…
తాత రిక్షానో, ఆటోరిక్షానో నడిపి సంపాదించిన డబ్బుతో కొట్టాం, పొలం కొనలేడని కమలమ్మ అంటుంది. మరి తాతకెలా ఉన్నాయవి?
జవాబు లేని ఎన్నో విషయాలు.

మా రాబడి – మా తిండికి, జీవనానికి అయిపోతుందేమో.. నాకు వైద్యం చేయించడానికి సరిపడా డబ్బు లేకనే, వికలాంగుల సంస్థలో నన్ను నమోదు చేశాడేమో తాత…
తాతని అడిగి కనుక్కునే స్థితి లేదిప్పుడు. జబ్బు పడిపోయాడు.
నన్ను బాగు చేసే ఓపిక ఇక తాతకి లేదేమో! నా జీవనం నేనే బాగు చేసుకోవాలి. డబ్బు దగ్గర మాకు ఎప్పుడూ కొదవే అని పిన్ని మాటల వల్ల తెలుస్తుందిగా.
నాకు మంచి వైద్యం తాత చేయించలేడేమో. సాయంత్రం వరకు ఆలోచనల్లో మునిగి తేలాను.
కొన్ని నిర్ణయాలు వెంటనే తీసుకోవాలి.

ఎవరి సాయం లేకుండానే, ఇప్పుడు మెల్లగానే అయినా కర్రల సాయంతో మెసలగలను, కదలగలను. ఇప్పుడు నా కదలిక నా అధీనంలోనే ఉంది కూడా…
పనయ్యాక గోవిందు రిక్షాలో తాతని చూడ్డానికి ఆసుపత్రికి వెళతానని కమలమ్మకి తెలియజెప్పాను.
“అయితే నన్ను దారిలో గోవిందు పాకలో దింపెళ్ళండి,” అని నాతో పాటే బయలుదేరింది కమలమ్మ.
**
నేను ఆసుపత్రికి వెళ్ళేప్పటికి తలగడని ఆనుకుని కూచోనున్నాడు తాత. కాస్త తేరుకున్నట్టే కనబడ్డాడు. పక్కన చేరి ఆ రోజు అప్పటివరకు జరిగిన విషయమంతా తెలియజెప్పాను తాతకి.
వంశీ సంస్థ డాక్టర్లు వచ్చారని, నన్ను పరీక్షించారని సైగలతో వివరించాను.
నా వైద్యం విషయం ఏమన్నారని అడిగాడు తాత. మరిన్ని పరీక్షలకి వెళ్ళాలన్నారని తెలియజెప్పాను. నాకు ఏడవ తరగతి పుస్తకాలతో రెండో తరగతి ఇంగ్లీషు కూడా అందాయని తెలిపాను. సంతోషంతో తాతకి కళ్ళల్లో నీరు తిరిగింది.

మొద్దుబారిన నా బుర్ర తాతతో కూడా ఎప్పటిలా ఉండనివ్వలేదు. తాత నన్ను ప్రేమతో పదిహేనేళ్ళగా పెంచాడా? లేక అవిటిని చేసి, నా అవిటితనం ఫణంగా పెట్టి తను బతుకుతున్నాడా? అన్న తలంపే బాధపెట్టింది.

చిక్కిపోయి కళ తప్పిన తాత రూపాన్ని చూసి గుండెలు బరువుగా అనిపించాయి. నన్ను సాకిన ఆ పెద్దాయన నా పాలిట దేవుడో? కసాయివాడో? అన్నదానికి జవాబు దొరకేనో? లేదో?

లోతుగా ఊపిరి తీసి తాత రూపాన్ని నా గుండెల నిండా ఎప్పటికీ చెరగనంత బలంగా నింపుకున్నాను.
తాతకి చెప్పి బయలుదేరాను.
హోరున గాలివాన. తగ్గుముఖం పడుతుందేమోనని కాసేపు వరండాలో వేచి చూసాను.
నిముష నిముషానికి వర్షం ఎక్కువవ్వడం చూసి, గోవిందు నేనున్న కాడికి వచ్చాడు. “నాకు వానలో రిక్షా నడపడం కొత్తేమీ కాదు,” అన్నాడు.
**
రిక్షాలో వొదిగి కూచున్నా, రెండువైపుల నుండి వాన తాకిడి ఉధృతంగా ఉంది. గోవిందుకి అలవాటేగా! తడవకుండా పొడవాటి ప్లాస్టిక్ చొక్కా, తలకి ప్లాస్టిక్ టోపీ వేసుకొని రిక్షా నడుపుతున్నాడు.

ఉరుములు – మెరుపులు – గాలి – వాన – హోరెత్తిపోతున్నట్టుగా ఉంది. నా అలోచనలు కూడా అదే విధంగా ఉన్నాయి.
కోపం, అసహనం, భయం, అనుమానం, అంతలోనే మొండి ధైర్యం గుండెల్ని చుట్టేసాయి.

ఇదే సమయం. తాత ఉంటే ఈ తెగింపు రాదు.
ఆ ప్రేమ నిండిన ముఖం చూస్తూ అనుమాన పడలేను.
నేను ఇలా తెగించలేను.
అందుకే కొట్టాం చేరగానే, గోవిందుని ఆగమన్నాను, సాయం అడిగాను. ఇకనుండి నిబ్బరంగా నడుచుకోవాలి. ధైర్యంగా ముందుకి సాగాలి అని నాకు నేను మరీ మరీ అనుకున్నాను.

అంతే! వెనుతిరిగి చూడకండా పిచ్చిధైర్యంతో, దృఢనిశ్చయంతో, పెట్టెబేడా సదురుకొని – తాతని, అక్కడి నా జీవితాన్ని వదిలేసి, కమలమ్మని కలవడానికి గోవిందుతో అతని పాకకి బయలుదేరాను.

దారిపొడుగునా నా మదిలో మెదిలింది – ప్రేమని పంచిన తాత రూపమే.
ప్రతి పొద్దు నాకోసమే అన్నట్టుగా నాముందు వాలి నాకెంతో ఆనందాన్నిచ్చే నా పావురాళ్ళు, నాకు చదువు చెప్పి ప్రేమతో ఆదరించే ఉమమ్మ రూపం కూడా నా గుండెల్లో కదిలాయి.
ఓ పావురంలా గూడు వీడి పోతున్నానా? అనిపించింది ఓ క్షణం.

‘పావురం శాంతికి చిహ్నంగా ఆకాశంలో సంచరిస్తుందంట’… ‘నేను మాత్రం మదినిండా ఎంతో అశాంతిని నింపుకొని ఓ విహంగంలా గూడు వీడుతున్నాను’ అనిపించింది.

(ఇంకా ఉంది)

చదువుకీ, మనకీ మధ్య ఎందుకూ అంత దూరం?!

myspace

నా అమెరికా ప్రయాణాలు – 3

 

అమెరికాని వ్యతిరేకించడానికి నాకు లక్ష కారణాలున్నాయి. అసహ్యించుకోడానికి కూడా ఎన్నో కారణాలున్నాయి. కానీ, ఆ కారణంతో అక్కడి ప్రజల్లోని ప్రజానుకూలత గురించి, చదువుపట్ల వాళ్ళ ప్రేమగురించి చెప్పకుండా వుండలేను.

పబ్లిక్ లైబ్రరీలు, యూనివర్సిటీ లైబ్రరీలు ఇంకా పుస్తకాల షాపులు కళకళలాడుతుంటాయి చిన్న చిన్న కమ్యూనిటీలకు కూడా మంచి లైబ్రరీలు వుంటాయి. ఖరీదైన పుస్తకాలు కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఆ పుస్తకాల్ని చదివేశాక దగ్గర్లోని లైబ్రరీకి ఉచితంగా ఇచ్చేస్తారు. వాళ్ళు ఒక డాలరుకో, రెండు డాలర్లకో అమ్మకానికి పెడతారు.
మన దగ్గరైతే ఎవరైనా చదువుతూ కనిపిస్తే ఒక వింతగా చూడడం అలవాటైపోయింది మనకి. ఎవరైనా పుస్తకం వేస్తే వెయ్యి కాపీలువెయ్యడం అందులో సగం పంచగా, మిగతావి పుస్తకాల షాపులో మూలుగుతుండడం చూస్తుంటాం.
కానీ అక్కడ ఇంకా చదువుతున్నారు. కిండిళ్లూ, నూక్ ఇంకా ఇతర రీడర్లలో కూడా చదువుతున్నారు. విమానాల్లో, పార్కుల్లో, మెట్రో రైళ్లలో ఈ పుస్తకాలు చదివేవారు కనిపిస్తుంటారు మనకి పుస్తకాలతో, ఈ-రీడర్లతో. పుస్తకాల షాపులు కూడా కళకళ లాడుతుంటాయి జనాల్తో. మనకి వున్న పుస్తకాల షాపులే తక్కువ. అవి నానాటికీ కురచ అయిపోతూవుంటాయి. జ్ఞానం డిజిటల్ రూపాన్ని తీసుకుంటున్నక్రమాన్ని తొందరగా అర్ధం చేసుకోబట్టే, ఈ-రీడర్లు, వికిపీడియా లను సృష్టించుకున్నారు. జ్ఞానం ప్రాజాస్వామీకరించిబడితే, జాక్ లండన్, అప్టాన్ సింక్లయిర్ లు ఫిక్షన్లో కలలుకన్న ప్రజా పోరాటాలు ఏదో ఒకనాటికి రూపుదిద్దుకోపోవు. రెండేళ్లక్రితం నాటి ‘ఆక్కుపై’ ఉద్యమాలు ఎంతోకొంత ఆశని కలిగించకపోవు.

bookworm

నడుస్తూ నడుస్తూ ఒక ‘పుస్తకం పురుగు!’

అమెరికా ప్రజల జ్ఞాన తృష్ణ గురించి నాకు మొట్ట మొదట తెలిసింది టెక్సాస్ యూనివర్సిటీ లైబ్రరీ చూశాక. అఫ్సర్, కల్పనలతో వెళ్ళినపుడు చూశాను కదా, నాకైతే అంతపెద్ద లైబ్రరీ నాకిదివరకు కనబడలేదు. మన తెలుగు పుస్తకాలు కూడా వున్నాయి అక్కడ. నాకిష్టమైన ఇటాలో కాల్వినో గురించయితే పూర్తిగా ఓ రాక్ నిండా వున్నాయి పుస్తకాలు. నేను అనుకున్నాఅప్పటిదాకా, ఆయన రాసినవి అన్నీ చదివేశాను కదా అని. కానీ, చూశాక కానీ తెలీలేదు ఆయన గురించి ఎంత విమర్శా సాహిత్యం వచ్చిందో. ఇక డికెన్స్, జాక్ లండన్ లాటి పేరున్న రచయితల పుస్తకాల గురించి చెప్పనక్కర్లేదు.

క్లాసులు కూడా ఎక్కడపడితే అక్కడ పెట్టుకుంటారు. నాలుగురైదుగురు విద్యార్ధులు, ప్రొఫెసర్ ఏ చెట్టుకిందనో లేకపోతే కేంటీన్లో నో ఆ పూట క్లాసు నడిపేస్తారు.
టెక్సాస్ యూనివర్సిటీ లైబ్రరీకి దాదాపు నడిచే దూరంలో వుంది ఓ హెన్రీ ఇల్లు. చిన్నకధల, మెరుపు ముగింపుల నిపుణుడైన ఇంటిని ఓ స్మారక చిహ్నంగా చేసి నడుపుతున్నారు. అక్కడ ఓ వాలంటీర్ చెప్తుంది, హెన్రీ జీవితం గురించి. అతడి కధల్లోని విభ్రమ కలిగించే మలుపులు ఆయన జీవితంలో కూడా వున్నాయి.

ఇది ఒక ఉదాహరణ మాత్రమే. లండన్ పేరిటా, ఇంకా ఎంతో మంది కవులూ రచయితల పేరిటా ఇలాటి స్మారక చిహ్నాలు ఎన్నో వున్నాయి అక్కడ.

twain

శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక వీధికి మార్క్ ట్వైన్ పేరు…

మనకి వెంటనే అనిపిస్తుంది, మన రచయితల్ని మనం ఎలా గుర్తిస్తున్నామని. ఎలా గౌరవిస్తున్నామని. హోటల్ కార్మికులుగా పనిచేసి బతికిన నాలుగురోజుల్లో గొప్ప సాహిత్యాన్ని అందించిన శారద, భుజంగరావుగారు, అలిసెట్టి ప్రభాకర్, బ్రాహ్మణీయ కవులకు ఏమాత్రం తీసిపోకుండా శతాబ్దం కిందటే గొప్ప కవిత్వం రాసిన గుర్రం జాషువా లాటి ఎంతోమంది ప్రతిభావంతమైన రచయితల గుర్తులు మనపిల్లలకు ఎలా అందకుండా చేస్తున్నామో కదా అనిపించింది. ప్రజలకి ఏమాత్రమూ ఉపయోగపడని, మంచి చెయ్యని రాజకీయనాయకులకోసం వందల ఎకరాల్లో కడతారు సమాధులు. కానీ, ప్రజల దుఖ్ఖాన్ని, సంతోషాల్ని, పోరాటాల్ని, అవమానాల్ని, సంస్కృతిని పొదివిపట్టుకుని భవిష్యత్తుకోసం నిక్షిప్తం చేసే రచయితల్నీ, కవుల్నీ, కళాకారుల్నీ మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యనేచెయ్యం.

 

impromptu

టెక్సాస్ యూనివర్సిటీ లైబ్రరీలో ఈ కాఫీ షాప్ పేరు “J. Alfred Prufrock Love Song ” అది మహాకవి టి. యస్. ఎలియట్ ప్రసిద్ధ కవిత. కవిత పేరే కాఫీ షాప్ పేరు అన్న మాట.

వీకెండ్ సాయంత్రాలు ఎదో ఒక పుస్తకాల షాపులో poetry recitalజరుగుతూనే వుంటుంది. ఒక recital లో కల్పన, అఫ్సర్.

వీకెండ్ సాయంత్రాలు ఎదో ఒక పుస్తకాల షాపులో poetry recitalజరుగుతూనే వుంటుంది. ఒక recital లో కల్పన, అఫ్సర్.

పుస్తకాలపట్ల, రచయితలపట్ల అమెరికా ప్రజలు చూపే ఈ ప్రేమే బహుశా అన్నీ కళారూపాలపై పడుతుంది. న్యూయార్కులో బ్రాడ్వేలో ఇప్పటికీ ఎన్నో రంగస్థలాలున్నాయి. ముందుగా బుక్ చేసుకోకపోతే టికెట్లు దొరకనంత నిండిపోతాయి హాళ్ళు.

అక్కడి లైబ్రరీలు చూశాక దిక్కూదివాణంలేక, కొత్త పుస్తకాలులేక, పాత పుస్తకాల కొత్త ఎడిషన్లులేక నిర్వీర్యమైపోయిన మన యూనివర్సిటీ లైబ్రరీలు గుర్తొస్తాయి మనకి వెంటనే. ఏ యూనివర్సిటీ లైబ్రరీ చూసినా, పోటీ పరీక్షలకి తలపడే విద్యార్ధులేకానీ, మిగతా పుస్తకాలని చదివే వారే కనబడరు. దానికి మనం విద్యార్ధుల్ని తప్పుపట్టలేం. అది వ్యవ్యస్థకి సంబంధించిన అంశం. చదువుకునే సమయంలో చదవనీకుండా చేసే పోటీ ప్రపంచపు దివాళా సంస్కృతి అది. మనం చదువుకోవడం దానికి ఇష్టం వుండదు. అందుకే మెజారిటీ ప్రజలకి చదువుని దూరం చేశాం. ఇప్పటికీ చేస్తున్నాం, ఇంకో రూపంలో.

(ఆఖరి భాగం)

-కూర్మనాథ్