కొంతమంది కవిత్వం మాత్రమే రాస్తారు, ఇంకా కొంతమంది ఆ కవిత్వమే జీవితంగా బతికేస్తారు. అలాంటి జీవితాల్లో కవిత్వమూ, వ్యక్తిత్వమూ కలిసిపోయి- రెండీటి మధ్య ఎల్లలు చెరిగిపోతాయి. రాసిన వాక్యాల నీడలో నడిచిన పథికుడు ఆయన. కడదాకా స్వేచ్చనే ఊపిరిగా,సిద్ధాంతంగా బతికిన పోరాటజీవి 1912 లో పూనాలో పుట్టిన కుసుమాగ్రజ్ 1999లో నాసిక్ లో కన్నుమూసారు. “నాసిక్ అనగానే నాకు కుసుమాగ్రజ్. ఆయన వాక్యాల్లో కలలు కంటాను నేను, ఆ కలవరింతల్లో నిద్రపోతాను నేను. ఆయన కవిత్వంలో మేలుకుంటాను నేను” అన్నారు గుల్జార్ నాసిక్ వెళ్ళినప్పుడు!
*
తాజా కామెంట్లు