దేశానికి స్వాతంత్రం సంభవించి డెబ్భై వసంతాలు గడిచిపోయాయి. గడిచిపోయాయి అని చెప్పటం చాలా తేలిక. కానీ…మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అంత సులభం గా మనకు చిక్కలేదంటే రాబోయే తరాలకు నమ్మశక్యం కాకపోవచ్చు. అంతగా స్వేచ్ఛకు అలవాటు పడిపోయాం. కానీ ఈ ఫలాలు మనకు అందించడానికి ఎంతోమంది వారి ప్రాణాలను ఫణంగా పెట్టారు. అప్పట్లో వారికి ఒక్కటే లక్ష్యం. భారత్ ను దాస్య శృంఖాలలనుంచి విముక్తి పొందించాలనేదే ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యం ముందు ఎంతటి సమస్య అయినా దిగదుడుపే. అందుకే హిందూ,ముసల్మానులు స్వాతంత్య్రోద్యమంలో తమ వంతు పాత్ర నిర్వర్తించారు. అమరులయ్యారు.
తాజా కామెంట్లు