ది లాస్ట్ బ్రాహ్మిణ్: ఒక దళారీ పశ్చాత్తాపం!

last

 

నిజాయితీగా మాట్లాడాలంటే నిర్భీతి ఉండాలి అని అంటారు. నిర్భీతి అనే క్వాలిటీ నిజాయితీగా మాట్లాడ్డానికి పూర్వగామిగా ( precursor) గా ఉండడం ఏమిటి ? మనకు ఏవన్నా నష్టం అంటే అది కూడా తీవ్రమైన నష్టం భౌతికంగానో, ఆర్థికంగానో లేదా మన అభిలాషకు, ఆశలకు  (  aspirations   ) విఘాతం కలుగుతుందనుకున్నప్పుడో భీతి ఉండాలి. అలాంటప్పుడు  నిజాయితీగా మాట్లాడాలంటే వెనకా ముందు ఆలోచించుకోవాలి. ఐతే కొల్పోడానికి ఏమీ లేని తనం ఉన్నప్పుడు, కోల్పోడానికి సిధ్ధపడ్డప్పుడు, కోలుపోతను ఎదుర్కోడానికి సన్నద్ధంగా ఉన్నప్పుడు నిజాయితీగా మాట్లాడ్డానికి భీతి ఎందుకు ?  పైగా మనమొక తప్పులో భాగమై నప్పుడు, ఆ తప్పు డొంక తిరుగుడుగా, సూచనప్రాయంగా, నీళ్ళు నములుతూ కాక నిజాయితీగా ఉన్నదున్నట్టుగా ఒప్పుకోవాలంటే (ఏమీ కోల్పోలేని తనం వలన కలిగే )  నిర్భీతి తో పాటు పాశ్చాత్తాపం కూడా ఉండాలి.  ఆ పాశ్చాత్తాపం ‘ అయ్యిందేదో అయ్యింది ..ఇక పద ‘ అన్నట్టు గాక  Descriptive  గా ఉంటే అందులో నిజాయితీ బలంగా ఉంటుంది.

‘ దళారీ పశ్చాత్తాపం ‘ అనే పుస్తకం విడుదల అయ్యాక ప్రపంచ బేంకు రాజకీయాలు చాలా దుమారమే లేపేసాయి. అంత వరకు ఈ రాజకీయాలు ఎవరికీ తెలియదని కాదు. ఐతే ఒక  insider  పబ్లిక్ గా నోరు విప్పి జరిగింది చెప్పడం తో , కేవలం విశ్లేషణ, గమనికల మీద ఆధారపడ్డ ప్రతి సామ్రాజ్య వ్యతిరేక వాదికి కాన్ ఫిడెన్స్ బల పడ్డది. ప్రతి సంస్థాగతమైన అన్యాయాల పట్ల ఒక ఖచ్చితమైన కంక్లూజన్ కు రావాలాంటే, శతృ స్థావరం నుండి ఒక్క వేగువైనా కావాల్సి వస్తుంది మనకు. శతృవు గురించి అంచనాకు రావడం ఒక ఎత్తైతే , వేగు సమాచారం ఒక బలమైన   conviction  ను నింపుతుంది. అది జరిగే యుద్ధం లో   predictability  ని తెస్తుంది. ‘ నిన్ను నీవు అర్థం చేసుకునే ముందు శతృవును అర్థం చేసుకో ‘ అనే మావో నినాదం సంపూర్తి అర్థాన్ని అప్పుడు సంతరించుకుంటుంది.

ఇంత ఉపోద్ఘాతం ఒక పుస్తక పరిచయానికి ఎందుకు అవసరమౌతుందో తెలుసుకోవాలంటే – అది ‘ ది లాస్ట్ బ్రాహ్మిణ్ ‘ కున్న ప్రత్యేకమైన ఫార్మాట్ ను గుర్తించడమే. ఇది ఆత్మకథ ఫార్మాట్ లో ఒక సనాతన బ్రాహ్మణుడి కుంచిత వ్యవహారాలను నిజాయితీగా పాఠకుల ముందు ఉంచే ప్రయత్నం. అది కూడా అది ఒక సనాతన బ్రాహ్మణ వంశం లో పుట్టి కుటుంబ బంధాలపై ఉండే ప్రేమ చంపుకోలేక  కుటుంబ వ్యవహారాలపై ద్వేషం కలిగి ఉండే ఒక వ్యక్తి ఆ పుస్తక రచయిత  కావడం ఈ ఫార్మాట్ ప్రధాన లక్షణం.

నాకు ఈ  insider view  అవసరం ముఖ్యంగా అఫ్సర్ ‘ చంకీ పూల కథ ‘ రాసినప్పుడు తోచింది. అగ్ర కుల మేధావులు మార్క్సిస్టులమని చెప్పుకునే వాళ్ళు మైనారిటీ వాదాన్ని, సెక్యులరిస్ట్ ఫైట్ ను  ఆస్తికత్వం నాస్తికత్వం మధ్య పోటీ కింద కుదించేసి మాట్లాడ్డం చూడ్డానికి అందంగా articulate  చేయడం , సాధారణ పాఠకులు డ్రైవ్ అయిపోవడం చూసి అనిపించింది ‘ వీళ్ళు కలిసి ఉన్నప్పుడు నిమ్న వర్గాల గురించి ఏమని ఊహించుకుంటూ ఉంటారో కదా ? ‘ అని. ‘ వీళ్ళు అగత్యం లేని పరిస్థితుల్లో నిమ్న వర్గాలను కూడ గట్టుకుని ఎలా పబ్బం గడపాలో అని ఆలోచిస్తూ ఉంటారు కదా ? ‘ అని. ‘ వీళ్ళ మాటలు ఆలోచనలు విన్న వాళ్ళెవరన్నా ఒక ఆర్టికల్ రాస్తే బాగున్ను కదా ? ‘ అని. నలుగురు అబ్బాయిలు గుమి కూడి ఒక అమ్మాయి గురించో , లేదా ఇక ఏదో సెక్సిస్ట్ టాపిక్ గురించో ఏం మాట్లాడుకుంటారో ఊహించి వారి గురించి అంచనాకు రావడం ఒక పద్దతి. ఐతే వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి స్వయాన విని వారి గురించి ఒక అంచనాకు రావడం ఒక పద్దతి.

ఈ వేగులు అందించే సమాచారం లో మన అంచనాలు, విశ్లేషణకు లోతు వెడల్పును పెంచుతాయి.

“ఇలాంటి అభిప్రాయాలు మా నాన్న గారి నుంచి విన్నప్పుడల్లా ఆయన పట్ల నాకున్న వ్యతిరేకత మరింత ప్రబలమ్య్యేది.  శ్రీ శృంగేరీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి మహాస్వామి శ్రీ కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి ప్రాతినిధ్యం వహించే సనాతన ధర్మం అంటే నాకు అరికాళ్ళ కింద మంటలు లేచేవి. మనిషిని మనిషిని విడదీసే ఈ కులాలు నిర్మూలింపబడాలని మానవులందరూ సమానంగ ఉండాలని నేను భగవంతుడిని మూగగా రోదించేవాడిని. మా నాన్న గారిని సనాతన ధర్మం నుండి బయట పడేయమని భగవంతుడిని ఒక సారి కోరుకున్నాను కూడా ” అని మధ్యలో ఒక చోట రచయిత చెప్తాడు. ఈ పుస్తకం మొత్తానికి ఇది భూమిక.  రచయిత తండ్రి తీవ్ర అనారోగ్యం తో, మరణానికి చేరువలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు,  తండ్రి కి కళ్లనీళ్ళ ప్రయంతం సపర్యలు చేసుకుంటూనే , ఆయన  psyche  పట్ల చంపుకోలేని ద్వేషానికి పుస్తక రూపం ఇస్తూ ఉండే  ఒక సంఘర్షణ వాతావరణం ఉండింది.

నాతో చాలా మంది అంటూ ఉంటారు ” బ్రాహ్మణులుగా పుట్టామండి…ఐతే మా చేతులో ఉందా ఏంటి ? మమ్మల్ని ఏ మాట మాట్లాడినా అలా వంకరగా విశ్లేషించడం ఏవన్నా భావ్యమా ? ” అని. పుట్టడం మన చేతులో లేదు. కాబట్టి మాకు మిగతా ఛాందస బ్రాహ్మణుల నుండి, బ్రాహ్మణ వాదులనుండి   exemption  కావాలి అని.  ఈ వాదనలో ఒక సౌకర్యం ఉంది. ఈ ఆత్మ విమర్శలో ‘ ఈ తప్పేదో జరగడం బానే ఉందే ‘ అన్నట్టు ఉంటుంది తీరు. కులం పుట్టుకకు సంబంధించిన అంశం కాదు, అది నిర్దుష్ట  సాంఘిక ఆర్థిక చట్రం కు సంబంధించింది అనే నిర్ధారణ జరిగాక ఈ లిబరల్ వాదనలు ఊపందుకున్నాయి. ‘ అసలు బ్రాహ్మణుడు అని నీకు ఇంకా ఎందుకు గుర్తు ఉంది ? ‘ అని అడిగితే ఏం తెలుస్తుంది ? భర్తనో భార్యనో బ్రాహ్మణ్ అయి ఉంటారు, ఇంట్లో సనాతన అచారాలు అలా కొనసాగుతూ ఉంటాయి, ప్రతి హిందూ పండక్కి ఇంట్లో సందడి ఉంటుంది, అడపా దడపా ఆఫీసుల్లో లిబరల్ బ్రాహ్మిణ్ అవ్వడం వల్ల అసలు సిసలు బ్రాహ్మిణ్ స్థాయిలో గౌరవం లేకున్నా ఉన్నత కులం వాడికుండె సగటు గౌరవం తక్కువ కాకుండా దొరుకుతుంటుంది, బంధువులు , మేధావులు చుట్టూ బ్రాహ్మణులే ఉండి బ్రాహ్మణ సందోహం ఆనందదాయకంగా లేకపోయినా తమ స్థాయిని గుర్తు చేసుకునే నిమిత్తం వరకైనా అలా ఉంటుంది.  ఇదంతా సోషల్ కేపిటల్ వెన్నంటి ఉంటుంది. ఆ మాత్రం దానికి ‘ నన్ను  exempt  చేయండి ‘ అని వాదించి , కొత్త తరహా బ్రాహ్మణ హక్కుల కోసం వాదించడం ఎందుకు ? ‘ సరేనండి…ఇప్పుడు మమ్మల్నేం చేయమంటారు ? పుట్టుకను మార్చలేము కదా ‘ అని వితండ వాదం చేసినప్పుడు నేనంటాను ‘ కులం తెలిస్తే తలలు తెగిపడతాయి అనే రోజు వచ్చినప్పుడు ఇలానే మాట్లాడుతారా మీరు ? ‘ అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే – ఇవేవీ దాచుకోకుండా ‘ అవునండి . నేను బ్రాహ్మణుడిని. ఇది ప్రాయశ్చిత్తం చేసుకోవాలా వద్దా అనే నిమిత్తం లేకుండా నిజాయితీగా మాట్లాడుకునే క్షణాలు. ఇదుగో ఈ కుల నిర్మూలన లో నా చోటు ఎంటొ నాకు తెలీదు గాని – నా దగ్గర జరుగుతుంది ఇది ‘ అని చెప్పేస్తాడు ఈ రచయిత. రోహిత్ వేముల మరణానికి కారణమైన డాక్యుమెంటరీ ‘ ముజఫర్ నగర్ బాకీ హై ‘ ఫిల్మ్ మేకర్ బ్రాహ్మణుడు. ఒక ఇంటర్వ్యూ లో ” నేను బ్రాహ్మణ కులం లో ఉన్నా కాబట్టి నెను ప్లాన్ చేయని నేను ఊహించని అవకాశాలు నా చుట్టు ఉన్నాయి. కాబట్టి నేను సినిమా తీయగలిగాను. కులం అనేది లేకపోతే ఇంత కంటే ఇంకా బాగు తీయగలిగే వారు వచ్చే వారేమో ”  అన్నాడు. బ్రాహ్మణుడు కుల నిర్మూలన ఉద్యమం లో చేరుతున్నప్పుడు ఖరాఖండిగా జనాలకే కాదు, తనకు తాను చెప్పుకోవాల్సిన నిజం ఇది. డీ బ్రాహ్మినైజ్ కావడం లో మొదటి మెట్టు తనకున్న  Brahmin privileges  ను గుర్తించడం. ఇవేవీ లేనట్టు తెలీనట్టు నటించడం, లేదా తనకు మాత్రం అవి సంబంధం లేనట్టు మొహం పెట్టి మిగతా బ్రాహ్మణులను తిట్టడం గమనించలేని మూర్ఖమైన స్థాయిలో దళితులు, ఆదివాసీలు ముస్లిములు ఈనాడు లేరు.

ఈ ఆత్మ కథ లాంటి సాంఘిక ఇతివృత్తం కలిగిన పుస్తకం లో ఒక సనాతన బ్రాహ్మణ తండ్రి తన మొదటి కొడుకు హిందువుగా మారడం ( సనాతన ధర్మం ప్రచారాన్ని  కోరుకోదు. ఇతర వర్ణస్తులను సనాతన ధర్మాన్ని ఆకళింపు చేసుకోమని కోరుకోదు ) ఇంకో కొడుకు ( రచయిత ) నాస్తికుడిగా మారడం, తన వంశానికి ఇక తనే చివరి బ్రాహ్మణుడిగా గుర్తించి చివరి క్షణాల్లో కూడా అదే మనోవ్యధలోనే బతుకుతాడు.

ఈ పుస్తకం ఒక సోషియాలజీ సబ్జెక్ట్ లాంటి పుస్తకం. సనాతన వర్ణశ్రమ ధర్మం లో బతికే ఒక బ్రాహ్మణ తెగ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తుంది, ఎలా జీవిస్తుంది అని తెలియజేసే పుస్తకం. ఇస్లాం అని ప్రస్తావిస్తూ ఖురాన్ ఉంటుంది, క్రీస్తు బిడ్డలు అని ప్రస్తావిస్తూ బైబిల్ ఉంటుంది కాని హిందువు అని ప్రస్తావిస్తూ ఒక్క వేదం లేకపోయినా హిందువులు ఆ వేదాలను, ఆయా గ్రం థాలను నెత్తినేసుకుని తిరగడం భలే విచిత్రం. మొదటగా బ్రాహ్మిణిజం మాత్రమే మతం. అది ప్రజలను వర్ణాలుగా విడదీసింది. శ్రీ రామ కళ్యాణం బ్రాహ్మణుల ఆచారం. శివుడు, కృష్ణుడు వీళ్లందరూ బ్రాహ్మణుల ఇంటిలో మాత్రమే పరిమితం కావాల్సిన దేవుళ్ళు.  Temple system   బ్రాహ్మిణిజం ఈ సమాజం తో terms కుదిరించుకుని ఏర్పరుచుకున్న ఒక రాజీ. పూజారి వృత్తే కాని, బ్రాహ్మణుడి ప్రవృత్తి కాదు. ఈ విషయాలు తెలీక  ప్రతి హిందు ఛాందస వాది , అఖండ భారతం అని ఊగిపోతాడు. మన దేశం లో హిందుత్వం అన్న మతమే లేదు. ఉంటే అది బ్రాహ్మణీయ హిందుత్వం మాత్రమే. బ్రాహ్మణిజం అన్ని కులాల ప్రజలకు దేవాలయ వ్యవస్థ ద్వారా చేరాక, ఆయా వర్ణాశ్రమ ధర్మాలకు లోబడి ఉన్నా ప్రతి వ్యక్తి బ్రాహ్మణుడిని అనుకరించే పద్దతి మొదలయ్యింది. దళితుల్లో క్షవరం చేసే దళితులు వేరుగా ఉంటారు. వాళ్ళు దళితుల్లో దళితులకు  అధములు. సత్యనారాయణ వ్రతం బ్రాహ్మణులు మాత్రమే చేయాల్సిన వ్రతం. ఐతే ప్రతి ఒక్కరూ చేస్తారు. పౌరోహిత్యం లో వైదిక పౌరోహిత్యం వేరు. పౌరాణిక పౌరోహిత్యం వేరు. సనాతన ధర్మం లో ‘ ఘర్ వాప్సీ’ లేదు. ఎందుకంటే అది హిందుత్వాన్ని నమ్మదు కాబట్టి. ( బ్రాహ్మణీయ హిందుత్వానికి సంఖ్యా బలం అవసరం ఎందుకయ్యింది అన్నది ఈ వ్యాసానికి వెలుపలి అంశం. ప్రస్తుతానికి వదిలేద్దాం )  దానికి శూద్రుడైనా ఇతర మతస్థులైనా ఒకటే. ఘర్ వాప్సీ చేసి ప్రయోజనం లేదు. బ్రాహ్మిణిజం అనే మతం ఒక వర్గం లోనే ఉండాల్సిన మతం . ప్రచారప్రధానం అయ్యాక అది బ్రాహ్మణీయ హిందూత్వం అయ్యింది. మనుస్మృతి  మన జీవన విధానం లో భాగమయ్యింది. ‘ వర్ణ ధర్మాన్ని అతిక్రమించడం అంటే తక్కిన వర్ణాల్లోకి బ్రాహ్మణ భావజాలాన్ని ప్రవేశపెట్టడం అన్న మాట ‘ అంటూ , రచయిత ఇలా  అంటాడు ‘ మనుస్మృతి తగలబెట్తడం , భావొద్వేగాలను ప్రతిబింబిస్తుందే తప్ప , మనుస్మృతి సారాంశాన్ని మన జీవితాల నుండి వెళ్ళగొట్తలేదు ” ఇప్పుడు ప్రతి హిందువు ఒక బ్రాహ్మణుడిగా మారడం జరుగుతుంది. బ్రాహ్మణుల్లో వంటా వార్పు చేసే స్త్రీలు, ముట్టు బారిన పడే వీరు శూద్రులతో సమానంగా చూడబడతారు. బ్రాహ్మణ స్త్రీ లు ద్విజులు కాదు. వీరికి ఉపనయనం జరగదు. వేద మంత్రాలు చదివే అధికారం ఆ స్త్రీ లకు లేదు.  బ్రాహ్మణుల్లో స్త్రీలు సాధారణంగా వీణ ఎక్కువ నేర్చుకుంటారు. సనాతన ధర్మ వ్యవస్థలొ బయటి ప్రపంచం తో మగ వాళ్ల కన్న కాస్తో కూస్తో ఎక్కువ  interaction  పెంపొందించుకునే వాళ్ళు స్త్రీలే. ఈ పుస్తకం లో రచయిత తన తల్లి పరిస్థితి గురించి ఎంత మనోవ్యధ చెందుతాడో కళ్లకు కట్టినట్టుగా ఉంటుంది. బ్రాహ్మణులు వాడే తిట్లు వేరు. ‘ సప్త కట్ల వెధవ ‘ ‘ లబోడి శంఖం ‘ లాంటి తిట్లు కనబడతాయి.

ఇలా సోషియలాజికల్ స్టడీ తో పాటు , ఒక బ్రాహ్మణుడిగా ఇంకో బ్రాహ్మణుడి రచనులు ఎలా అంతర్లీనంగా  connect  అవుతాయో కూడా రచయిత వివరిస్తాడు. ” బ్రాహ్మణ స్త్రీ లను చలం లేచి పొమ్మన్నాడని సనాతనస్తులు కాని హిందూ పాఠకులు పొరబడ్డారు. కానీ చలానికి బ్రాహ్మణ కుటుంబాలలోని స్త్రీ లకు అంత ధైర్య సాహసాలు గానీ అవకాశాలు గానీ లేవని స్పష్టంగా తెలుసు. అందువలన సనాతన ధర్మ పీటాలకు అభ్యంతరం లేని ముస్లిం మతస్థులను తన రచనల్లో రహస్యంగా అభ్యర్థిబ్చాడు. ” ” చలం తన రచనల్లో వర్ణ ధర్మాన్ని అతిక్రమించే ఊహ కూడా చేయలేదు. తన రచనల్లో వివాహాన్ని అరికట్టడం ద్వారా జాతి సాంకర్యాన్ని వర్ణ సాంకర్యాన్ని నివారించ బూని నాడు ” ఇలా చలం గురించి  బ్రాహ్మణ కోణం లో చూస్తునే విమర్శిస్తాడు. ఈ విశ్లేషణ ఎంత వరకు కరెక్ట్ అనే కన్నా , ఇందులో ఎన్నో తరాల నుండి జరుగుతున్న బ్రాహ్మణ మేధో అవినీతిని బట్టి మొత్తానికి కొట్టివేసే వాదనగా కూడా అనిపించదు. అలాగే ” శ్రీ శ్రీ రచించిన కవితా ఓ కవితా లోని భాషంతా బ్రాహ్మణుల అద్వైత పరమాత్మ తత్వానికి – శంకరాచార్య వేదాంతానికి పూర్తిగా సంబంధించినదే . విశ్వానాథ సత్యనారయణ , కవితా ఓ కవితా చదివి శ్రీ శ్రీని తెగ కౌగిలించెసుకున్నట్టు చెప్తాడు. ‘ అది పురోగమనంగా కనిపించినా దాని ఆత్మ సనాతనమే . అది ఆ కవిత గొప్ప తనం’  అని అంటాడు రచయిత. అంతే కాకుండా గురజాడను విమర్శిస్తూ ఇలా అంటాడు ‘ సత్య సంధుడైన సౌజన్యారావు పంతుల్ని వైదిక బ్రాహ్మణుడిగానూ, లిటిగెంటు క్లయింటు రామప్పంతుల్ని వియోగి గాను గురజాడ చిత్రించాడు. వైదికులు సహజంగానే  వియోగులను అపహాస్యం చేస్తుంటారు. అంతెకాని గురజాడ ప్రత్యేకంగా బ్రాహ్మణులను విమర్శించింది లెదు ‘ అని కట్టే విరిచి నట్టుగా చెప్తాడు. ‘గురజాడ పూర్ణమ్మని వృద్ధుడికి యిచ్చి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాడు. తన కుమార్తెకు సైతం బాల్య వివాహమే చేసాడు.’ అని మనకు విశదీకరిస్తాడు. అలా చె ప్తూ బ్రాహ్మణ కవులు రచయితల పట్ల ఇలా ముగిస్తాడు. ” మొత్తానికి బ్రాహ్మలకు సరిపడేదేదో కమ్యూనిజం లో ఉంది . అదేదో యెంతో కాలానికి కాని నాకు తెలీలేదు ”

అంతే కాక చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి. మఠాలు ఎలా ఏర్పడ్డాయి, ఆది శంకరాచార్యుడు హిందువా బ్రాహ్మణుడా ? హిందుత్వం పై బుద్దిజం ప్రభావం , పదకొండవ పన్నెండవ శతాబ్దం లో దేవాలయాల పై దాడి దోపిడీ గురించి, చరిత్ర లో గుడికి ప్రాధాన్యత ఎంత ఉంది లాంటి విషయాలు కూడ మనం చూడవచ్చు.

రచయిత కుల నిర్మూలన పై ఆశవహంగా ఇలా  theorise  చేస్తాడు. ” పార్లమెంటును హేళన చేసే వాడు పార్లమెంటును ఏమీ చేయలేదు. పార్లమెంటు అంటే ఏమిటి అని తెలుసుకోడానికి ప్రయత్నించేవాడు మాత్రమే అందుకు భిన్నంగా పని చేస్తాడు. బ్రాహ్మణ సమూహం భారత దేశం లో కనిపించని పార్లమెంటు. అదీ బ్రాహ్మణత్వమంటే. బ్రాహ్మణులు వస్తు జాలం కన్నా కష్టమైన భావ జాలాన్ని ఉత్పత్తి చేశారు. దాని మన్నిక చాలా కాలం ఉంటుంది. అది తిట్లతోనూ హేళనతోనూ నిర్మూలన కాదు. దీనిని ఎదుర్కోవాలాంటే చరిత్ర తెలియాలి. చరిత్ర చలన సూత్రాలు తెలియాలి. మానవ పరిణామం తెలియాలి. సంస్కృతి తెలియాలి. భావజాలం ఉత్పత్తి కారణమైన మూలాలు తెలియాలి. తెలిసిన తర్వాత ప్రత్యామ్నాయ భావజాలాన్ని ఉత్పత్తి చేయగలగాలి ”

ఈ పుస్తకం లో అక్కడక్కడా బ్రాహ్మణ జాఢ్యం చాయలు కూడా లేకపోలేదు. వీరేశ లింగం సనాతన ధర్మానికి తీరని ద్రోహం చేశాడు అని ( సనాతన ధర్మమే ద్రోహం , దానికి తిరిగి ద్రోహం చేయడం ఏంటి ? ) , దీక్షితులు గారికి చందుడిలో మచ్చలా నల్లమందు అలవాటు ( అంటే ఆయన గారు  చంద్రుడు లాంటి వాడు అన్న మాట ) అంటాడు. ఐతే ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే రచయితను అర్థం చేసుకోవాలి. ఇంత నిజాయితీగా రాస్తూ ఇలాంటి వాక్యాలు ఎందుకు దొర్లించాడు అని. రాణీ శివశంకర శర్మ గందరగోలవాది. ఆయన హిందూత్వాన్ని, కులాన్ని ఎంత నిరసిస్తాడొ, క్రైస్తవ్యాన్ని అంత నిరసిస్తాడు. హిందుత్వానికి వచ్చినా ఆ ప్రచార కాంక్ష సామ్రాజ్యవాద క్రైస్తవ కాంక్షగా చూస్తాడు. ఐతే వర్గ లక్షణం లేని మతం ఎలా ఉంటుందొ మనకు సరి అయిన వాదన దొరకదు. చాలా ఎలాబొరేట్ గా ఒక్కో పాయింట్ తీసుకుని ఆయన క్రైస్తవ్యానికి, హిందూత్వానికి పోలిక చూపిస్తూ రాస్తూ వస్తాడు. ముస్లిం మతస్తులు ఇక్కడ బతికి ఇక్కడే ఉండడానికి వచ్చారు. క్రైస్తవులు ఇక్కడ ఉండడానికి రాలేదు. కేవలం దోచుకోడానికి వచ్చారు లాంటి కంక్లూజన్స్ కనిపిస్తాయి ఈ పుస్తకం లో.  ఇందులో కుటిలత్వం ఏమీ లేదు. కేవలం గందరగోళం. కొంచెం పిడివాద మూర్ఖత్వం తప్ప.

ఇలాంటి పాజిటివ్స్ నెగటివ్స్ తో చదవాల్సిన ఈ పుస్తకం సౌదా అరుణ తీసుకొచ్చారు. ఈ పుస్తకం ఏ పుస్తక శాలలో కూడా దొరకదు. కేవలం సౌదాను ప్రత్యక్షంగా కాంటాక్ట్ చేస్తే తప్ప దొరకదు. ప్రచురణ కర్తలు రివ్యూలపై అనాసక్తి ఉంది అని చెప్పారు. అయితే ఈ పుస్తకం ఫార్మాట్ ఇందులో ఉన్న అంశాలు ఎంతగానో ఆకర్శించడం వలన తప్పక షేర్ చేసుకోదలచి రాయాల్సి వచ్చింది ( మితృడు సౌదాకు తప్పని సరి సారంగ పత్రికా ముఖంగా క్షమాపణలు. పాఠకుడికి రివ్యూ చేసే హక్కు నేను ఉపయోగించుకుంటున్నాను )

Note  : ఈ రివ్యూలొ చాలా చోట్ల ఇంగ్లీషు పదాలు దొర్లాయి. అయితే సంస్కృత పర్యాయ పదాలు వాడ్డం చాత కాక అవి అలాగే ఉంచడం జరిగింది. వ్యాసకర్త వద్ద మరింత స్పష్టత కోరదల్చుకుంటే   pvvkumar@yahoo.co.uk  వద్ద గాని, ఫేస్ బుక్  ID – P V Vijay Kumar  వద్ద కూడ కాంటాక్ట్ చేయవచ్చు. 

*

 

 

పేర్ల తో శ్రామిక అస్తిత్వం!

 

Painting: Rafi Haque

Painting: Rafi Haque

పేర్ల వెనుక నిమ్న కులాలుగా పరిగణించబడే వాళ్ళు తమ కులానికి సంబంధించిన శ్రమ పేరును తగిలించుకోవడం – ఐలయ్య సజెషన్. ఇదో చారిత్రక నిర్ణయంగా ప్రకటించాడు ఐలయ్య. ఐలయ్యను ఇంటర్వ్యూ చేసి ఇంగ్లీష్ వెబ్ మేగజైన్ లో ప్రచురించాక ఇదే విషయం మాట్లాడుతూ అన్నాడు ” బాపనోళ్ళకు …చెప్పుకోడానికి ఏ శ్రమ కూడా లేదు. మనం శ్రమ చేయడానికి వెనుకంజ వేయలేదు. శూద్ర కులాలకు వృత్తి ఒకటుంది. అది మన మీద రుద్దబడింది. అయితే మనం చెప్ప్పాల్సింది ” సోమరి పోతులు మీరు. మా ఆత్మ గౌరవాన్ని చంపినా ఏదో ఒక శ్రమ మేము చేసి ఈ సమాజన్ని ఇన్ని యుగాలు పోషించాము. మీరు మా మీద పడి తిన్నాము అని చెప్పుకోడానికి సిగ్గు పడాలి. ” అని నా కులం కనుక్కుని , దానికి సంబంధించిన శ్రమ ను సజెస్ట్ చేసి …  రైటింగ్స్ అన్నిటిలో అదే ప్రచురించుకోమని సూచన ఇచ్చారు.

ఈ స్టాండ్ నేను కంప్లీట్ గా కన్విన్స్ అయిన అంశం కాదు కాబట్టి నేను అనుసరించలేదు. అలా అని నాకు ఎటువంటి కంప్లెయింట్ కూడా లేదు ఐలయ్య గారి సూచన లో.
బ్రాహ్మణిజం మన మీద బలవంతంగా రుద్దిన శ్రమ లు నీచమైనవే కావచ్చు. కాని సమాజానికి ప్రాడక్టివ్ గా ఉపయోగపడిన శ్రమలే. ఆ శ్రమ చేసినందుకు మాకు గర్వం లేదు. కాని శ్రమ నే చేయని సోంభేరుల మీద మాకో ఉన్నతత్వం ఉన్నదనే ఒక ఆలోచన మాలో ఉంది. మాపై రుద్దిన శ్రమలను మేము గ్లోరిఫై చేసుకోము గాని…….బలవంతంగా పూసిన అస్తిత్వాన్ని తిరిగి వాళ్ళ మీదనే ఉపయోగించడానికి వెనుకంజ వేయము. ” నీవు మాదిగోడు ” అంటే మొహం వాల్చేసే వాళ్ళము. అది బ్రాహ్మణుడికి కొండంత బలమిచ్చేది. ” అహె నీవు చెప్పెదేంటి…నేను మాదిగోన్నే…ఏంటంట …నీ ఫీలింగ్ ఇప్పుడు చెప్పు ” అని తల విదిల్చినప్పుడు, ఇందులో అవమాన కరమైన అంశం ఏదో బ్రాహ్మణులే వెతుక్కోవాల్సిన పరిస్థితి కల్పించబడింది.

నిజం చెప్పాలంటే కింద కులాలు, పై కులాలను అనుకరించడం Sanskritisation లో భాగమే. అయితే అదో ధికార స్వరం తో చేస్తున్నదిగా మాత్రమే మనం చూడాలి కాని ఆ నిమ్న స్థాయి హోదాను అంగీకరిస్తున్నట్టు అస్తిత్వ రాజకీయాలు ( Politics of assertion ) ఎప్పుడు చెప్పవు. ఇది అర్థం చేసుకుంటే కన్ ఫ్యూజన్ ఉండదు. అంబేద్కర్ assertion గురించి ఇలా చెప్తాడు ” The assertion by the individual of his own opinions and beliefs, his own independence and interest as over against group standards, group authority and group interests is the beginning of all reforms. ” గ్రూప్…అంటే ఇక్కడ బ్రాహ్మణీయ సమాజం లో ” మా అస్తిత్వమిది … అయితే ఏంటంట ? ” అని ఎలుగెత్తి గద్దించే స్వరాలు ఆ బ్రాహ్మణీయ సమాజం లోని అభిప్రాయాలను, నమ్మకాలను, ప్రామాణికాలను, అథారిటీని ప్రశ్నిస్తాయి అని అర్థం .

 

ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ అంబేద్కర్ ఏమంటాడో గమనించండి ” But whether the reform will continue depends upon what scope the group affords for such individual assertion ” అంటే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ? – ఎంత మేరకు ఈ Assertion ను గ్రూప్ tolerate చేస్తుంది అన్న విషయం తెలుస్తుంది. ఆ గ్రూప్ లో ఉన్న ప్రజాస్వామికత దాన్ని బట్టి తెలుస్తుంది అని అంబేద్కర్ క్లియర్ గా ఒక్ ప్రమాణాని నిర్వచించి చెప్పాడు.

ఇంకా చూడండి ” On the other hand, if the group is intolerant and does not bother about the means it adopts to stifle such individuals they will perish and reform will die out ” అంటే మన assertion వలన కలిగే అసహనమే , మనపై పీడనను పెంచాలనే వాళ్ళ ఆలోచననే సంస్కరణను చంపేస్తుంది.
అంటే మొత్తంగా మన assertion వలన కలిగే అసహనం వారి దుర్మార్గాన్ని పచ్చిగా బయట పెడుతుంది. వారిని expose చేయిస్తుంది. ఇది జాగర్తగా అర్థం చేసుకోవాలి. భౌతికంగా కుల వివక్ష చూపించే రోజులు తగ్గినా కేపిటలిజం ప్రబలినాక implicit casteism పెరిగింది. ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని టచ్ చేస్తారు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి పక్కన కూర్చుంటారు . మరి నేను ఎక్కే 200 సీట్ల విమానం లో దళితులు ఒకరు ఇద్దరు కూడా సరిగ్గా ఉండరెందుకు ? మనం ఈ విషయాన్ని గొంత్తెతి అరిస్తే కుల పిచ్చి అవుతుందా ? లేక assertion అవుతుందా ? మనం దళిత మహా సభ అని పెట్టుకుంటే – దళితులుగా ఉన్నందుకు మనం బ్రాహ్మణులకు ఎంతో ఋణ పడి ఉన్నామని అర్థం వస్తుందా ? బహుజన పార్టీ అంటే – బహుజనులుగా ఉన్నందుకు మనకు ఖుషీగా ఉందని అర్థమ ? ఇది చాప కింద నీరు లాంటి కుత కుత ను …ఉపరితలానికి తెస్తుంది. పాలను పాలుగా …నీళ్ళను నీళ్ళుగా విడగొడుతుంది.
సింపుల్ గా చూస్తే రిజర్వేషన్ గురించి కూడా ఇదే వాదనే కదా వినిపించేది. రిజర్వేషన్ కావాలనుకున్నప్పుడు , మనం కులం గురించి మన అస్తిత్వం గురించి చెప్పుకుంటున్నాము కదా ? ” నీవే కేస్ట్ ” అని అడిగితే ” నేనెందుకు మాలనౌతాను…మీరు అన్నంత మాత్రాన అయిపోతానేంటి ” అనం కదా ? Caste-wise representation (identity ) perpetuates caste అని అన్నప్పుడు సౌత్ బరో కమిటీ ముందు అంబేద్కర్ ఇచ్చినా వాంగ్మూలం ఏంటి ? it ( representation through individual caste identity ) does not perpetuate but it dissolves అని . నేను సఫాయికార్ కార్మిక సంఘం లో ఉన్నప్పుడు …నేను adopt చేసుకున్న నా శ్రమ అస్తిత్వాన్ని, నా పేరుకు తగిలిస్తే అందులో సిగ్గు పడాల్సింది ఏముంది ? ఒక సఫాయి కారుడిగా నేను నా హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు, సంఘం లో నా అస్తిత్వం అదే కదా ? అవును నేను సఫాయి కారుడినే…అయితే ఏంటంట…నన్ను ముట్టుకోవా…మైల పడవా ? అప్పటికి నేను అలా చెప్పుకోకపోతే నన్ను ఈ బ్రాహ్మణిజం తల మీద పెట్టుకుని చూస్తున్నట్టు ! ఒక మాటలో చెప్పాలంటే.

 

ఈ దేశం గొప్ప ప్రజాస్వామిక దేశంగా చలామణీ కావాలని అంతర్జాతీయ స్థాయిలో అనుకుంటుంది. ఈ అస్తిత్వ రాజకీయాలు ఈ దేశాన్ని తెగ ఇరుకున పెట్టేసే స్వభావం కలిగి ఉంటాయి. బ్రాహ్మిణిజం యొక్క గొప్ప గుండె ఎంతో ప్రశ్నిస్తాయి. ” The emancipation of the mind and soul is a necessary preliminary for the political expansion of the people ” పెద్దాయన బాబ సాహెబ్ కు ఉన్న క్లారిటీ చాలా అరుదుగా ప్రపంచ స్థాయిలో మేధావులకు ఉంటుంది. Political expansion కావాలి మనకు. అందు కోసం మనల్ని చూసి మనమే, మన శ్రమను చూసి మనమే సిగ్గు పడ్డం ఆగాలి ( అంటే గర్వించాలి అని దాని అర్థం కాదు ) . ” మాదిగ ” ” మాల ” అని ఒక్కాణిస్తూ ఎంత మంది ముందుకు రాగలరో ఈ సమాజం యొక్క ప్రజాస్వామికతకు సవాల్. ఈ దేశం ” అబ్బే , మా దేశం లో కులం ఏమీ లేదండి. ఎక్కడొ అక్కడక్కడ తప్ప….” అని అంటుంటే ఇదో నిరసన లా ఉంటుంది.

అయితే ఇది సరిపోతుందా ? బ్రాహ్మిణిజం ఎన్నో ఎత్తులు ఎత్తుగడలు నేర్చింది. మీరు అలా కులం పేరు తగిలించుకుంటానే , వచ్చి హత్తుకుంటుంది ” నా గొప్ప తనాన్ని ప్రూవ్ చేసుకోడానికి, నాకు మరీ ఇబ్బంది లేని ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్య వాదాలు ” అంటూ. ఈ assertion ద్వారా బ్రాహ్మిణిజానికి కొంత సాంస్కృతిక ఇబ్బంది కలుగుతుంది కాని…ఇవి Socio-econoimc demographies లో మార్పు తెచ్చే ప్రక్రియలు కావు. పైగా ఈ cultural assertion విజయానికి ముఖ్యమైన precondition – వాల్యూం ఉండాలి. Dalit assertion is not great in volumes despite middle class educated individuals have been spreading the importance of assertion. అది పరిమితి. వీలైతే ఈ వాల్యూం మనం పెంచగలగాలి. లేదంటే ఇంకా ఉన్నతమైన భావ జాలం వేపన్నా నడిపించాలి. మనమెటువంటి గొప్ప ఉద్యమం చేయకుండా ఉన్నప్పుడు కనీసం ఇదన్న చేయాలి కదా ?
ప్రతి సమాజం లో ఏవో ఒక తార తమ్యాలు ఉంటాయి. ఎక్కువగా అవి అన్నీ Open nature కలిగి ఉంటాయి. అంటే – ఎవరన్నా సంపాయించుకోవచ్చు, హోదా సంపాయించొచ్చు. మన కుల వ్యవస్థ closed nature కలిగి ఉంటుంది. ఇందులో gradual promotions కూడా ఉండవు. Caste is an enclosure of class అని అంబేద్కర్ అన్నాడు. అంటే మన socio-economic demographies ముందే ఫిక్స్ అయిపోయాయి. అది close . అందులో ఒక గుంపుగా బయటకు రాలేరు (వ్యక్తులుగా రావచ్చు ) . ఒక గుంపుగా వేరే గుంపులో చేరలేరు. assertion ఈ సంస్కృతిని ఈ స్వభావాన్ని ప్రశ్నించినా , అది గుణాత్మక మార్పు తేగలిగే శక్తి దానికి లేదు. ఐలయ్య సిద్ధాంతం ఎదగనిది అక్కడే.

 

Self-sufficient economy గా ఉన్నప్పుడు శ్రమలు మాత్రమే ఉన్నాయి కులాలు లేవని ఒక అంచనా. ఆ తర్వాత economy expand కావడం తో క్రమేణా ఆర్యులు వారి స్వార్థ ప్రయోజనాల దృష్ట్యా వర్ణ వ్యస్థను ఏర్పరిచారు అదే క్రమేణ కుల వ్యవస్థగా అంచెలంచెలుగా ఎదిగింది అని ఒక వర్షన్. ( Source : Cultural Past by Romila Thapar ) కాబట్టి కులం , శ్రమకు మధ్య న ఉండే Timing గురించి నేను ఇదమిద్దంగా వాదించలేను. అలాగే వ్యభిచారం, అడుక్కోవడం కులానికి సంబంధించిన శ్రమలుగా ఉండాలనే Sanction లేదు. అవి శ్రమ విభజన కిందకు రావు కూడాను. ఆర్థిక లేమి తనం వలన నిమ్న కులాలు గ్రా డ్యువల్ గా అడాప్ట్ చేసుకున్న means of living మాత్రమే. అలాంటి వాళ్ళు ఎటువంటి కులపు శ్రమ తగిలించుకోవాలి అంటే – వారికి శ్రమ allotment లేదు కాబట్టే వారు ఆ శ్రమలు ఎంచుకున్నారు. scavenging లాంటి శ్రమలు చండాల ప్రజలు చేయాలనేది sanction . అలాంటి వృత్తులు తెగించి ఎవరన్నా పేరు చివర తగిలించుకుంటే , వారి కరేజ్ , నిబ్బరం మెచ్చుకోదగ్గ assertion. కాని , పైన చెప్పినట్టుగా ‘ అది సరే, ఆ తర్వాత ఏంటి ? ‘ అనే ప్రశ్న మాత్రం అలానే మిగిలిపోతుంది.
ఉన పోరాటం అస్తిత్వ పోరాటమే కాదు. హక్కుల పోరాటమే కాదు. అది ఇప్పుడు సాంఘిక ఆర్థిక మార్పు కోసం స్థాయిలో ఎదిగిన ఉద్యమం. ఇలాంటి పోరాటాలు కావాలి మనకు. ఇలాంటి సంస్కృతి మనం అలవర్చుకోవాలి. అందుకోసం మనకు assertion politics ను అర్థ చేసుకుంటూనే socio – economic space కోసం ideology ని రూపొందించుకోవాలి.
–          

 

( ఏదైనా స్పష్టత కోసం గాని, మరింత సమాచారం కోసం గాని రచయిత మెయిల్  ID pvvkumar@yahoo.co.uk  గాని  facebook ID ‘ P V Vijay Kumar ‘  పై గాని కాంటాక్ట్  చేయవచ్చు )

 

పంటని వాగ్దానం చేసే కవిత్వం ఏదీ?!

Art: Rafi Haque

Art: Rafi Haque

కవిత్వం గాలిలోంచి పుట్టలేదు. ఆకాశం నుండి రాల లేదు. ఏ దేవుడో వరమిస్తే మొలకెత్త లేదు. కవిత్వం ఎలా పుడ్తుంది అని ఒక కవిని నిద్ర తట్టి లేపితే ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు కలిగే ఆలోచనల వల్ల పుడ్తుంది అంటాడు. ఒకడు విశ్వంతో మమేకమైతే ( అదెలా ఉంటుందో కొంచెం  సంశయాత్మకత   ఉన్నా సరే ) కవిత్వం పుడ్తుంది అంటాడు. ఒకడు ప్రకృతి లో పవళిస్తూ ఉంటే కలిగే ఆలోచనల్లో కవిత్వం పుడ్తుంది అంటాడు. మరొకడు కడుపు కాలితే పుడ్తుంది అంటాడు. ఈ కవిత్వం అన్నది ఎటువంటి బ్రహ్మ పదార్థం ? ఎలా పుడుతుంది ? ఈ  తర్కాన్ని జాగర్తగా అర్థం చేసుకుంటే మనం కవిత్వం గురించి వచ్చే చర్చలను చాలా మట్టుకు అర్థం చేసుకునే ప్రయత్నంలో సఫలం అవ్వచ్చు. లేదా గాలి ఎటు వీస్తే అటు వీచి పోతాము.

అసలు సమాజం ఎలా పరిణామం చెందిందో అందులో భాష ఎలా పుట్టిందో ఏ నియమాలననుసరించి పుట్టిందో తెలుసుకోకుండా కవిత్వం ఎలా పుడ్తుంది అని చర్చించడం అస మగ్రంగా ఉంటుంది.

ఆదిమానవుడి ప్రపంచంలో ప్రకృతి  ప్రధాన పాత్ర పోషించింది. అప్పట్లో ఆదిమానవుడి  పరస్పర సంబంధం ప్రధానంగా ప్రకృతి తోనే నడిచింది. ప్రకృతికి మాటలు రావు , వినిపించవు. చెట్టు ను బతిమాలో బామాలో పళ్ళు సంపాయించుకునే  యాంత్రికవిధానం లేకపోవడంతో మనిషి తన చేతులకు కాళ్ళకు పని చెప్పవలసి వచ్చింది. లేపొతే మనిషి అంతరించాల్సిన ఆగత్యం వస్తుంది. ప్రకృతితో ఉండే  పరస్పర సంబంధం  లో మానవుడు తన అవసరాల దృష్ట్యా తన అవయవాలను భౌతికంగా ఉపయోగించాల్సి వచ్చింది. ఆ క్రమంలో మనిషి చేతులు కాళ్ళు రూపాంతరం చెంది ఒక పరిణామ క్రమంలో మనిషి నాలుగు కాళ్ళ జంతువు నుండి మనిషిగా విభిన్న రూపం దాల్చుకోవాల్సి వచ్చింది. కొద్దిగా  మళ్ళి ఆలోచిస్తే మనిషి మొట్ట మొదటి ఉత్పత్తి పని ముట్టు చేయి. మనిషిలో ఎదుగుదల జరగడానికి కారణం శ్రమ. ఈ పనిముట్టు అనగా చేయి, దానితో పాటు తదితరై అవయవాలలో జరిగిన మార్పు, అందుకు సమన్వయంగా మెదడు అభివృద్ధి చెందడం ఒక మానవ శ్రమ విధాన క్రమంలో అవసరమయ్యింది.  ఇదే పరిణామాన్ని జీవ పరిణామ సిధ్ధాంతాలు మనకు సులువుగా వివరిస్తాయి. ఇక మెదడు అభివృద్ధిచెందిన తర్వాత లేదా చెందుతున్న క్రమంలో తనకు అవసరమైన పనుల గురించి మనిషికి చైతన్యం పెంపొందడం సహజం అయ్యింది. అలా కాకపోయి ఉండి ఉంటే మనిషి  అంతరించిపోయే వాడు.

శ్రమ

Physiological development ——–> pshychological development

 

అంటే మనిషి భౌతిక మానసిక పరిణామ క్రమంలో ప్రకృతి లో మనుగడకు కావాల్సిన  కనీస పరస్పర సంబంధం  ఎంతైతే కావాలో అంత కలిగి ఉన్నాడు. ఆ మాట కొస్తే ప్రతి పక్షికీ ప్రతి జంతువుకు కూడా  స్మృతి చేతన  ఉంటుంది. అప్పుడు భాష అవసరం లేదు ఎందుకంటే – మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా కేవలం భౌతిక అవసరాల కోసం ప్రకృతి తో ఉండే  పరిమిత పరస్పర సంబంధం కు భాష అనవసరం. ఏం మనిషి కూడా అలానే చీమలానో తేనెటీగలానో ఆ మాత్రం  స్మృతి చేతన  తో బతక లేడా ? బతకలేడు. బతికి ఉంటే మనిషి కాకుండా ఏ ఏనుగో, గుర్రమో అయి ఉండేవాడు. ఐతే అతని అవయవాలు అతని భౌతిక అవసరాలు పూరించడానికి అనుగుణంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని గమనించాలి.

ఒక విషయం అర్థం చేసుకుందాము. మానసిక ఎదుగుదల భౌతిక ఎదుగుదల ఒక అనుసంధాన క్రమంలో జరిగింది. అంటే గంట క్రితం ఆలోచించిన విషయానికి ఇప్పుడు మాటలు పుట్టితే ఇక మాటల అవసరం ఏముంది ? లేదా ఇప్పుడు చేసిన పని మన మెదడులో ముద్రించుకోడానికి ఒక రోజు పడితే ఇక పని ఎలా చేయగలం ? కాబట్టి మానసిక ఎదుగుదల అన్నది శారీరక ఎదుగుదలతో పాటు జరగాల్సిన ఒక అనివార్య క్రమంగా మనం చూడొచ్చు.

మెదడు అభివృద్ధి జరిగాక మనిషిలో చైతన్యం అన్నది మొదలయ్యింది. చైతన్యం అంటే The manner in which we interpret, analyse, remember and use the information about the social world . అంటే చుట్టు పక్కల ఉన్న పదార్థాలతో ఉండే ఒక  నిరంతర పరస్పర సంబంధంవలన మనిషికి ఆలోచనలు కలిగాయి . ఎందుకంటే ఈ చైతన్యం వలన మనిషికి  pattern recognition    అర్థం అవుతూ వచ్చింది. ఇదంతా ఒక  ఏక కాల ప్రక్రియ. ఏ ఒక్క గంటలో జరిగిన విధానం కాదిది. కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టింది.

పొద్దున్నే లేచి ఆది మానవుడు లేచి రాతి గొడ్డలితో చెట్టును కొడ్తే ‘ ఠక్ ‘ ‘ఠక్ ‘ అనే చప్పుడే వచ్చేది. అలాకాక ఒక రోజు హఠాత్తుగా ‘ఖణేళ్ ‘ ‘ ఖణేళ్ ‘ అన్నదనుకోండి. వెంటనే అది మొద్దు ఐనా కాకపోయి ఉండాలి లేదా మొద్దుకు ఈ గుణం కొత్తగా ఐనా వచ్చి ఉండాలి అన్న విషయం తర్కించగలడు. అది తేలకపోతే మనిషి మొద్దు మీద ఆధారపడ్డం అన్నా వదులు కోవాలి లేదా ఆ విషయాన్ని శొధించాలి. ( అంటే ఏ ‘X’ మనిషో ‘Y ‘ మనిషో ఐనా మనకెందుకు అని ప్రొసీడ్ అయి ఉండొచ్చు. ఆ   వ్యక్తిగత నడవడిక సామాజిక గతి క్రమాన్ని వివరించదు. పైగా ఈ మార్పు ఒక్క క్షణంలో జరిగింది కాదు ). కాబట్టి జాగర్తగా గమనిస్తే పదార్థం ( అంటే పరిసరాల మొత్తం అని సింపుల్ గా చెప్పొచ్చు ) వలన చైతన్యం కలిగింది. చైతన్యం ఒక రకంగా చూస్తే ఆలోచనల సముదాయము.

పదార్థం ——— > చైతన్యం 

పరిసరాలలో ఉన్న వైరుధ్య భావనల వల్ల ( ‘మొద్దు ‘  గురించి వివరించిన ఉదాహరణలో చూసినట్టు ) క్రమ క్రమంగా ఆలోచనల సమూహం పెంపొందుతూ వచ్చింది. చైతన్యం అన్నది ఒక  శరీర ధార్మిక మార్పు (Physiological change)  దశ నుండి పదార్థం చేత ప్రభావితం చేయబడ్డది. మరింత పరిణతి చెందుతూ వచ్చింది. ఇది జాగర్తగా గమనిస్తే పదార్థం తో జరిగిన ఒక శ్రమ విధానం వలన ఉద్భవించిన విశేషఘటన ( phenomenon)   గా చెప్పొచ్చు.

మనిషి ఈ క్రమంలో పదార్థం పట్ల పెంపొందించుకున్న అవగాహన వలన లోహం కనుక్కోగలిగాడు. దాని వలన ఉండే ఉపయోగాలు గుర్తించగలిగాడు. ఇదే క్రమంలో ఒక ఉత్పత్తి విధానం ఒక పంపిణీ విధానం అమలు లోకి వచ్చాయి. అదే క్రమంలో తనతో పాటు జీవించే తోటి మానవులతో  పరస్పర సంబంధం  మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే మనిషి ప్రకృతి తో పరస్పర ప్రతిస్పందన క్రమంలో ఎదుగుదల చెంది తన చుట్టూ ఉన్న సమాజంతో  కూడా పరస్పర ప్రతిస్పందన ను ఏర్పరుచుకోవడం అవసరం అనే ఒక సందర్భానికి లాగ బడ్డాడు. అంత వరకు సైగలకు పరిమితమైన  సంభాషణ పద్దతికి ఒక భాష అవసరం అయ్యింది. మనం ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటూ వస్తుంటే భౌతిక ఎదుగుదల కు సమన్వయంగా వచ్చిన మానసిక ఎదుగుదల వలన, ఆ మానసిక ఎదుగుదల ఫలితంగా ఏర్పడిన చైతన్యం వలన మరియు ఉత్పత్తి విధానం లో ఒరవడి పెంపొందడం వలన ఆ క్రమంలో మారుతున్న మానవ సంబంధాల వలన ఒక సంస్కృతి  ఏర్పడాల్సిన దిశ అవసరం అని తెలుస్తుంది.

ఇంకా చూద్దాం. సైగలకు పరిమితమైన కమ్యూనికేషన్` పద్దతి క్రమంగా సన్నగిల్లి భాష అవసరం ఏర్పడింది. నాగలి తయారు చేసే దశకు వచ్చే లోపు అనగా సుమారు లోహ పరికరాలు విరివిగా వాడ్డం మొదలు పెట్టడం మొదలు పెట్టాక భాష వచ్చింది అని కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం. ఐతే అంతకు ముందో అంతకు తర్వాతనో మొత్తం మీద భాష మారిన సామాజిక లేదా మానవ సంబంధాలకు అనుగుణంగా అవసరం అయ్యింది. ఆ భాష లేకపోతే పెద్ద మొత్తంలో ఉన్న సాంఘిక అవసరాలు తీరలేవు.

ఇంతవరకు గమినించిందేంటి ? 

  1. మనిషి తన భౌతిక అవసరాల కొరకు శ్రమ చేసే క్రమంలో ఎదుగుతున్నప్పుడు మెదడు a అభివృద్ధి అన్నది శారీరక ఎదుగుదల క్రమంలో అవసరం అయ్యింది.ఆ క్రమంలోనే మనిషి జంతువు నుండి వేరు పడ్డాడు.
  2. మానసిక ఎదుగుదల వలన కలిగిన చైతన్యం వలన ( దీని నిర్వచనం వ్యాసంలో ముందు చూసాము ) పదార్థంతో జరిగే నిరంతర పరస్పర సంబంధం వలన ఉత్పత్తి విధానాని ప్రభావితం చేయగలిగాడు.
  3. ఉత్పత్తి విధానం పెంపొంది సామర్థ్యము పెరుగుతున్నప్పుడు సైగలకు పరిమితమైన సంభాషణ పద్దతి అనివార్యంగా మారాల్సిన పరిస్థితి సమాజంలో ఏర్పడింది
  4. తన చైతన్యంతో కొత్తగ ఏర్పడిన ఉత్పత్తి విధానం పంపిణీ విధానానికి అనుగుణంగా మరియు తన సాంఘిక అవసరాలకు అనుసంధానంగా మనిషి సౄష్టించుకున్న సంభాషణా మాధ్యమం భాష.
  5. పదార్థంతో ఉండే నిరంతర పరస్పర సంబంధం వలన చైతన్యం పెంపొంది ఆలోచన కలుగుతుంది. ఆ చైతన్యం వలననే మనిషి శ్రమ సంబంధాలను మెయింటెయిన్ చేయగలిగాడు. ఇది భాషకు మూలం అయ్యింది.

 

ప్రకృతి సహజంగా అనుసరించే  సహజమైన్ డైయెలిక్టిక్స్   ఉన్నాయి. వాటి ప్రకారమె మనిషి జననం, భాషా జననం జరిగింది. ‘ మనిషికి ఈ పరిణామ క్రమంలో తోక ఎందుకు రాలేదు?’ అని అంటే కోతి ఈ సృష్టిలో ఏర్పడే విధానాన్ని చర్చించినట్టు అవుతుంది తప్ప మనిషి గురించి కాదు. ఇది కేవలం జీవ పరిణామంగా మాత్రమే చూస్తే మనం  జీవ శాస్త్రం  దగ్గర మాత్రమే ముగిస్తాము. డార్విన్` జీవ పరిణామ సిద్ధాంతం సమాజ చలనాన్ని వివరించదు. అది డార్విన్ తప్పు కాదు. దాన్ని  వ్యాఖ్యానించే వాళ్ళది తప్పు. ఆ రకంగా చూస్తే మనకు మన మనుష్య సమాజ పరిణామాన్ని అర్థం చేయించడానికి  ఆంత్రోపాలజీ, ఫిలాసఫీ అవసరం లేదన్నమాట. సాంఘిక చలనాన్ని అర్థం చేసుకోడానికి  డైయెలిక్టిక్స్   అన్వయించడానికి ఆయా విషయాలకు మాత్రమే సంబంధించిన శాస్త్రాన్ని చూస్తే చాలా  పరిమితమైన దృష్టి   అవుతుంది. ఆ క్రమంలో మన ముందు ఉన్న ఒక ప్రాథమిక చట్రాన్ని ఉపేక్షించాల్సి వస్తుంది.

ప్రతి పరిణామము కేవలం సహజమే కాదు. ఆ సహజత్వానికి ఒక నియమం ఉంది. ఒక సహజమైన అవసరం ఉంది. లేపొతే జీవం మనుగడనే సాధ్యం కాదు. భాష పుట్టుక ఎంత చారిత్రక, సాంఘిక అవసరమో మనం గమనించాము. అందుకు చైతన్యం ఎలా దోహద పడిందో ఆ చైతన్యం పదార్థం నుండి ఎలా పుట్టిందో చూసాము.భాష పుట్టుక గమనిస్తే లోహ యుగం ప్రారంభమయ్యాకనే మొదలయ్యింది. ఇదేదో  కేజువల్ గా జరిగిన విషయం లోహం కనుగొనడం మానవ జీవితంలో ఒక విప్లవం. దీనితో ఉత్పత్తి విధానం విపరీతమైన మార్పులకు గురి అయ్యింది. అందుకనుగుణంగానే ఉత్పత్తి సంబంధాలు మారాయి. మారిన మానవ సంబంధాలకనుగుణంగానే సైగలతో ఉన్న  సంభాషణ పద్దతి ప్రతిబంధకమై నిలదొక్కుకోలేక భాష అవసరం వచ్చిపడింది.

ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. తేనె టీగ తన తుట్టెను కట్టుకుంటుంది. దానికుండే ఒక  లిమితెద్  చొన్స్చిఔస్నెస్స్   అది. తేనె టీగకు తుట్టె నిర్మించే ముందు తన తుట్టె ఏ రూపంలో ఉంటుందో ఎంత పొడవుంటుందో ఎంత వెడల్పు ఉంటుందో తెలుస్తుందా ?. అదే మానవుడు తనను ప్రకృతినుండి రక్షించుకునే క్రమంలో తన శ్రమ విధానం లో పెరిగిన  సామర్థ్యము వలన , పదార్థం పట్ల తనకున్న చైతన్యం వలన తాను కట్టుకునే గుడిసె పొడవు, ఎత్తు, వెడల్పు ఎంత ఉంటుందో కట్టక ముందే చెప్పగలడు.మనిషిలో ఉన్న  abstract thinking, logical thinking  వలన (  శరీరానికి మెదడుకు ఉన్న సమన్వయంలో భాగంగానే ఆపై మారిన మానవ సంబంధాల ఫలితంగా ఇలా ఏర్పడాల్సిన పరిస్థితి ఉంది అని గమనించాము) ఊహించే లక్షణం మనిషి మెదడుకు అబ్బింది.ఈ ఎదుగుదల ఏ ఒక్క క్షణం లోనో ఏదో ఒక్కరి లోనో ఒక్కసారిగా కలిగినది కాదు అని గమనం లో ఉంచుకోవాలి.

సమాజ పరిణామ క్రమంలో సమాజంలో కొన్ని institutions  కూడా ఏర్పడగలిగాయి. పెళ్ళి, కుటుంబము, మతము లాంటి కొత్త  institutions  ఏర్పడ్డం మొదలయ్యింది . ఐతే మనిషి తనకున్న Abstract thinking, logical thinking  వలన కలిగిన పరిజ్ణ్జానాన్ని ఉత్పత్తి , పంపిణీ విధానం ( ఇంకో రకంగా చెప్పాలంటే మొత్తంగా ఉత్పత్తి సంబంధాలు అనవచ్చు) వీటిలో ప్రయోగిస్తూ కొత్తగా ఏర్పడిన  institutions   లో కూడా ఉపయోగించడం మొదలయ్యింది. మనిషి దేహానికి సింహం తల తగిలించడం , లేదా ఏనుగు తల తగిలించడం జరిగింది. ఐతే క్రమ క్రమంగా మనుష్యుల్లో వర్గాలు ఏర్పడ్డంతో సమాజాన్ని నడిపే పగ్గాలు సమిష్టిగా ఉండడం ఆగిపోయింది. ఇదే పరిజ్ణ్జానన్ని తన కట్టుబాట్లలో చూయించాడు. తన అలవాట్లలో చూయించాడు. తన రుచుల్లో చూయించాడు. తనకవసరమైన భాషలో కూడా చూయించాడు. ఆ విధంగా భాష లో ప్రయోగం జరగడం తార్కిక క్రమం లో జరగాల్సిన ప్రక్రియ అయ్యింది. నిజానికి ఈ పరిస్థితి సుమారు 4000 సంవత్సరాల క్రితం మించి ఉండదని కొంత మంది చరిత్ర కారుల అభిప్రాయం. భాష పరిణామం చెందాల్సిన అవసరం చూస్తే మళ్ళీ మనం పదార్థంతో జరుగుతున్న  పరస్పర సంబంధం దగ్గరే ఆగాల్సి వస్తుంది.

ఏర్పడిన వర్గాల దౄష్ట్యా , తెగిపోయిన సమిష్టి సంబంధల దౄష్ట్యా ఏదైనా విషయాన్ని సంఘంలో ఆమోదించే క్రమానికి ఒక  ప్రభావశీల భావ వ్యక్తీకరణ  (effective expression)   అవసరం అయ్యింది. ఇదేదో ఒక్క రోజులో ఏర్పడిన ఆలోచన కాదు. అందుకు ఒక విషయాన్ని హత్తుకునేలా అర్థం చేయించడానికి ఆమోదింపజేయడానికి కళలు, సాహిత్యం అవసరమయ్యాయి. ఇందుకోసం సాధారణ వచనాలు సరిపోలేదు. మారిన ఉత్పత్తి సంబంధాలు, ఏర్పడిన వివిధ వర్గ సంస్కౄతులు, మనిషికి ఉన్న భావావేశ వృద్ధి (  emotional development )  ఒక భిన్న భావ వ్యక్తీకరణ జననానికి అవసరాన్ని, అనుకూలతను సూచించాయి ( భాష మొదలు కాక ముందు మానవుడి భావావేశాలకు సంబంధించిన ఎదుగుదల చాలా ప్రాథమిక స్థాయిలోనే ఉండిందని చెప్పుకోవచ్చు. మనకు రాతి యుగం నాటి అవశేషాలు గమనిస్తే మనిషి వేటాడిన జంతువుల బొమ్మలు లాంటివి కనిపిస్తాయి తప్ప ఎక్కడా మనిషి భావావేశాలు ప్రతిబింబించే అవశేషాలు పెద్ద  ప్రాముఖ్యంగా   దొరకవు).

అదే విధంగా సమాజంలో ఏర్పడిన  వైవిధ్య సాంఘిక స్థాయిలలో సమాజం మీద ఆధిపత్యం గురించి, స్వంత ఆస్తి పరిరక్షణ క్రమంలో సాంఘిక అస్తిత్వాన్ని మరింత గట్టి పరుచుకునే క్రమంలో, భిన్న సంస్కృతుల్లో భాగంగా – భాష వివిధ భిన్న రూపాలను ఏక కాలంలో కొనసాగించాల్సి వచ్చింది కూడా. అంటే భాష సమిష్టి ప్రయోజనాల కోసం ఏర్పడి సమాజ పరిణామ క్రమంలో ఆయా సమాజాల్లో ఏర్పడిన  institutions  ను బట్టి, వర్గ సమాజాన్ని బట్టి, సంస్కృతి లో కలిగిన చీలికలను బట్టి ( ఈ మూలకాలన్నిటినీ కలిపి పదార్థం అంటారు అని అనుకున్నాము ) మార్పు చెందుతూ వచ్చింది.

ఏం వర్గ సమాజం ఏర్పడకపోయి ఉండి ఉండొచ్చు కదా? అటువంటి వర్గ సమాజం మాత్రం ఎందుకు అవసరమయ్యింది ? అంటే వర్గ సమాజ జననం స్థూలంగా గమనిస్తే నిజానికి మనుష్య సమాజంలో వెనుకబాటు కాదు. అది ఒక రకంగా అభివౄద్ధి. ఒక తెగ ఇంకొక తెగపై దాడి చేసినప్పుడు గెలిచిన తెగ ఓడిపోయిన తెగను పూర్తిగా నిర్మూలించే వారు. ఐతే ఉత్పత్తి విధానంలో మార్పుల వల్ల వారిని చంపడం కంటే అలా ఓడిపోయిన తెగను తమ ఉత్పత్తి విధానంలో భాగం చేసి వారిని దోచుకుంటూ వారికి బానిస స్థాయిని కల్పించిండంలో ఎక్కువ ప్రయోజనం కనిపించింది. అప్పటి బానిస వ్యవస్థ ఏర్పడ కూడదు అనుకుంటే మొత్తం మనుష్య జాతి అంతా అంతరించి పోయేదేమో !

మన సమాజంలో ఐతే వర్ణ వ్యవస్థ ఏర్పడ్డం వలన ఆధిపత్య వర్గాల ప్రయోజనం కొరకు పాలక వర్గాల భాషనే అధికారిక లేదా అదే సామాజిక భాషగా చెలామణీ అయ్యింది.అదే సంస్కృతమై వెలిసింది.   Known ruling classes  వారి భాషలైన ప్రాగ్ , ద్రవిడ, పాళీ భాషలకు సముచితమైన సాంఘిక స్థాయి కల్పించలేదు. సంస్కృత భాష ప్రాకౄతిక వ్యావహారిక భాషలపై గొడ్డలి పెట్టు అయ్యి ఒక వర్గ ప్రయోజనాలలో భాగమైన మూలకం అయ్యింది. తమ సంస్కృతికి కి  superiority  ని పులిమే క్రమంలో సంస్కృతానికి దైవత్వం ఆపాదింపబడింది ( ఇక మనిషి అంటూ వాడ్డం మానేద్దాం. ఎందుకంటే సమిష్టి ప్రయోజనాల నుండి వ్యక్తిగత లేద వర్గ పరమైన ప్రయోజనాలు ముందుకొస్తున్నప్పుడు సంస్కృతి కూడా చీలి పోయింది మనుష్యులతో పాటు ).

ఇక సాహిత్యం అంత:పుర గోడలకు పరిమితమై పోయింది. సంస్కృత సాహిత్యం మెజారిటీ ప్రజలనుండి విడివడింది. సంస్కృతం అంటే అదో దైవత్వ రూపం కలిగి ఉండాలి అనో, అదో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్న వారి సొత్తు అనో, సంస్కృతం మానవాతీత సంస్కృతిలో భాగం అన్నట్టుగానే project  అయ్యింది. అధ్యాత్మికత ముసుగులోనూ దైవత్వం ముసుగులోనూ ఇలా ముక్కు మూసుకుని తపస్సు చేస్తే , లేదా ఉపాసన చేస్తే కవిత్వం పుడ్తుంది అన్న భావన కలిపింపజేసే ప్రయత్నాలు జరిగి ఇలాంటి అభ్యాసం తుచ్చ మానవులకందరికీ రాదు అన్న విశ్వాసాన్ని పాలక వర్గాలు కల్పించినట్టు మనకు స్పష్టమౌతుంది.

ఇందుకు అప్పటి బ్రాహ్మణీయ హైందవ మత వ్యవస్థ బాగా తోడ్పడింది. ఆ రకంగా చూస్తే  vernacular languages  పుట్టుక సామాజిక సాంస్కృతిక పరిణామంలో ప్రజా సంస్కృతి యొక్క విజయంగా చెప్పొచ్చు. భాష, సాహిత్యము, దానితో పాటు కళలు , సంస్కృతులలో   సమభావము నశించి పాలక వర్గం వేపు ఒక భాగం, ప్రజల వేపు ఒక భాగం అయ్యి చీలిపోయాయి. సమిష్టి ప్రయోజనాలు అన్న భావన నశించాక సాహిత్యంలో ప్రజలకు సంబంధించి ఎన్నో కుట్రలు జరిగాయి. సాహిత్యం ప్రజలకు సంబంధించిన విషయంగా కాక తమ ఆధిపత్యాన్ని నిర్ణయించే మూలకంగా చేయాలని మన సమాజంలో ఎన్నో ఎత్తుగడలే నడిచాయి. ఇందుకు వర్ణ వ్యవస్థ బాగా తోడ్పడింది.సాహిత్యం ఎలా పుడ్తుందో కవిత్వం ఎలా పుడ్తుందో అనే ఒక విశ్వాసాన్ని, పదార్థాన్ని వదిలేసి బ్రహ్మ పదార్థంగా చిత్రీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయని గమనించవచ్చు.

ఐతే భూస్వామ్య వ్యవస్థ కూలుతున్న క్రమంలో పెట్టుబడి దారి ప్రజాస్వామ్యం ముందుకొస్తున్న తరుణంలో మన దేశంలో  sanskritisation ప్రభావం దాని వెనక ఉన్న శక్తులు అనివార్యంగానే బలహీనపడ్డాయి.  తమ మనుగడను విస్తృతం చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

  1. భాషకే కాదు సంస్కౄతికీ, సాహిత్యానికీ , మూలము పదార్థం . ఆలోచనలు విడిగా ఉండవు. పదార్థంతోనే ముడివడి ఉంటాయి.
  2. మనిషి సమిష్టి ప్రయోజనాల కోసం భాష ఏర్పడింది.ఎదుగుతున్న ఉత్పత్తి సంబంధాలను మనగె చేయాలంటే భాష అనివార్యం అయ్యింది.
  3. మనిషికిదెవెలొప్ ఐన abstract thinking, logical thinking సమాజ పరిణామ క్రమంలో ఏర్పడిన  institutions  లో ఉపయోగించుకోవడం జరిగింది
  4. సమాజం లో వర్గాలు ఏర్పడ్డంతో భాష, సంస్కౄతి సాధారణ ప్రజానీక సంస్కౄతి, భాషలతో విడివడ్డాయి. ఇందుకు మత, వర్ణ వ్యవస్థలు మన సమాజంలో బాగా తోడ్పడ్డాయి.
  5. సంస్కృతం సాధారణ ప్రజల భాషను చావు దెబ్బ తీసి తనకో దైవత్వ రూపాన్ని పులుముకుంది. ఇది వర్ణ వ్యవస్థ పుణ్యమే. ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాలు కాపాడుకునే క్రమంలో జరిగింది.
  6. సాహిత్యం అన్నది ఏ ఒక్క వ్యక్తిగత పరిణ్గానం వలన పుట్టుకు రాలేదు. మనిషి తన సాంఘిక అవసరాల కోసం చేసిన ఎన్నో ప్రయోగాల్లో భాషపై జరిగిన ప్రయోగం ఒకటి. అందులో భాగం సాహిత్యం.
  7. భాషకు దైవత్వం ఆపాదించడం సాహిత్యానికి మానవాతీత రూపాన్ని పులమడం సన్స్క్రితిసతిఒన్ అవుతుంది. దీని వలన ఆధిపత్య సంస్కృతి ఏదైతే చలామణిలో ఉందో అది అభివౄధ్ధి చెందడానికి తోడ్పడింది.

 

సాహిత్యం అన్నది బ్రహ్మ పదార్థం కాదు. మరో సారి అనుకుందాము. సాహిత్యం అన్నది బ్రహ్మ పదార్థం కాదు. ఇది ఏ ఋషి హిమాలయాల్లో ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని పరధ్యాన్నంగా ఉన్నందు వల్ల మాత్రాన పుట్ట లేదు. ఎందుకంటే మనిషి ఆలోచన పదార్థం లేకపోతే లేదు. పదార్థాన్ని వదిలి పెట్టి మనిషి ఆలోచనలు రెక్కలు కట్టుకుని ఎగర లేవు. నీల్స్ బోరు పరమాణు నమూనాను కనుక్కోక పోయి ఉంటే ఇక ప్రపంచంలో ఏ రసాయన మూలకాలు ఉండేవి కావు అన్నది ఎంత తప్పో అలాగే కేవలం వ్యక్తిగత పరిజ్ణ్జానాఇకి, మానవ సమాజ అభివౄద్ధికి ఉపయోగ పడే సాహిత్యానికి లింకు పెట్టడం అంతే తప్పు. ఒకప్పుడు రాజు సింహాసీనుడై మధువు సేవిస్తూ ‘ మేము ఆనంద డోలికల్లో తేలియాడుచున్నాము. ఏది మన రాజ నర్తకి ఊరువుల మీద ఒక బహు సుందరమగు పద్యం వినిపించుము ‘ అన్న ఆదేశంతో సాహిత్యం పుట్టుకొచ్చిన చరిత్ర ఉంది. సాహిత్యం అంతపురానికి పరిమితమై వర్ణ వ్యవస్థ చట్రంలో అగ్ర భాగాన ఉన్న వర్గాల ప్రయోజనాలు వారి విలాసాలు తౄప్తి పరిచే విధంగా ఉపయోగపడింది.

చరిత్ర కారులకు ఉదయ పూర్ రాజుల కోటలో ‘ అనంగరంగం ‘ అనే గ్రంథం లభించింది. అందులో మొదటి  చప్తెర్  ‘ లింగ స్థూలీకరణం ‘. ఒక నాడు సాహిత్యమంటే అదే అన్నట్టు శౄంగారం గొప్పదైన నవరసం అని ( శౄంగార రసం అన్నది విశ్రాంతి అధికంగా ఉన్న వర్గాల వారి విలాస కేళికి సంబంధించిన విషయంగానే పరిమితమయ్యింది. దిగువ వర్ణాలు సమాజానికి తమ శ్రమ నందించి సేవ చేసే విషయంలోనే తమ జీవితాన్ని చూసుకున్నారు ) చలామణీ కూడా చేసారు. అందరూ అదో అద్భుత ప్రక్రియ అని అందులో జరిగిన ప్రయోగాలను నోరు తెరుచుకుని చదివి అసలు సాహిత్య ప్రయోజనాన్ని మనకు కాకుండా చేసారు. శ్లోకాలు ఏ చందస్సును పాటించాయి అని తీక్షణంగా పరీక్షించే ముందు మనం శృంగార రసం పేరుతో రాజుల ‘ లింగ స్థూలీకరణ ‘ గురించి ఆందోళన చెందిన కవి సమూహాన్ని, ఆ సాహిత్య కల్పన తీరు తెన్నులను గమనించడం వదిలేస్తే ఇది సాహితీ కౄరత్వం తప్ప ఏమీ కాదు . సాహిత్యం దేవుడి గొప్ప తనాన్ని ఎంతో ఆధ్యాత్మికంగా వర్ణించడానికి ఉపయోగపడ్డది. ఒక మనిషిని పట్టుకుని ‘ నీవు తక్కువ వాడివి పెద్ద పనికొచ్చే లక్షణాలు ఏమీ లేవు ఉత్పత్తి విధానంలో నీ స్థానం ఇదే ‘ అని బోధించడానికి వాడిని బలవంతంగా ఒప్పించడానికి సాహిత్యం ఉపయోగ పడింది.

‘చాతుర్వర్ణం మయా సౄష్ట్యాం గుణ కర్మ విభాగశ తస్య కర్తార మపిమాం వ్ద్యికర్తార మవ్యయం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం ‘ (క్లుప్తంగా చెప్తే నాలుగు వర్ణాలను నేనే సౄష్టించాను. అందులో శూద్రుని పని మిగతా వర్ణాలకు పరిచర్య చేయడమే ) సాహిత్యం పుట్టుక కొన్ని ప్రయోజనాలను ఆశించి జరిగింది. అది ఖచ్చితంగా ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు మాత్రమే దౄష్టిలో పెట్టుకుని జరిగింది అన్న వాస్తవాన్ని ఇక్కడ గమనించగలరు.

ఐతే సంస్కౄత భాష కాల క్రమేణా బ్రాహ్మణీయ వ్యవస్థ తో పాటు బలహీన పడడంతో వ్యావహారిక భాషలో సాహిత్యం కూడా ఏక కాలంలో అభివౄధ్ధి జరగడం జరిగింది. తెలుగులో గురజాడ, గిడుగు రామ్మూర్తి తదితర కవులు తెలుగు సాహిత్యంలో  sanskritisation   ను కాదని దేశీయ చందస్సులో తెలుగు సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు. ఐతే అప్పటికీ ఇప్పటికీ కవిత్వం అన్నా, సాహిత్యం అన్నా ఒక బ్రహ్మ పదార్థం అదో మానవాతీత రూప ప్రమేయం తోనే పుడ్తుంది అని దాన్ని అడపా దడపా ఆధ్యాత్మికతకు లింకు పెట్టి చూడ్డం జరుగుతుంది.

చరిత్రను గమనిస్తే సాహిత్యం ఎప్పుడైనా ఏదో సామాజిక ప్రయోజనం ఆశించకుండా పుట్టదు. పుట్టలేదు. ఐతే పదార్థం ఎప్పుడూ మార్పులకు గురవుతుంది.అందువల్ల చైతన్యం మార్పులకు గురవుతుంది. తద్వారా సాహిత్యం మార్పులకు లోనవుతుంది అన్న ప్రక్రియను అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయా సమాజ ప్రయోజనాలు ఆయా వర్గ సమాజ లక్షణాలు బట్టి వేరు వేరుగా ఉంటాయి. పైన చూసిన శ్లోకం ఎలా పుట్టుకొచ్చింది ? ఇందులో ఎంత గొప్ప సాహిత్యం ఉన్నది అని లొట్టలు వేసుకుని చర్చించే ముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయం – ఇది రాజులకు పురోహిత వర్గానికి ప్రజలను విధేయులుగా ఉంచే ప్రయత్నంలో భాగంగా, పాలక వర్గల ప్రయోజనాన్ని ఆశించే సౄష్టించ బడినది. అది మరవ రాదు. ఇక ఎంత గొప్ప ప్రయోగం జరిగినా సాహిత్యంలో ఒరిగిందేమిటి ? రాజ్య ప్రయోజనాల కోసం కవిత్వం రాయాలంటే అప్పుడు కవులు ప్రజల నుండి రారు. అది సాధారణ ప్రజలు భాగస్వామ్యం కాలేని సాహిత్యం అవుతుంది. ప్రయోగం మీద ఉన్న మక్కువ ప్రయోజనం మీద చూయించలేదు కవులు. వారి అజెండా  మొత్తం వర్ణ చట్రంలో బిగి వేయబడ్డది.

ఐతే సాంఘిక ప్రయోజనాలు ఆశించి కూడా సాహిత్యంలో ప్రయోగాలు జరిగాయి. సాహిత్య శిల్పాల్లో ప్రయోగాలు జరిగాయి. ఈ విషయాన్ని సింపుల్ గా అర్థం చేసుకోడానికి ఒక ఉదాహరణ చూద్దాం. బాల సాహిత్యం కుచేల కథ, గజేంద్ర మోక్షం , భక్త ప్రహ్లాద లాంటి బ్రాహ్మణీయ సాహిత్యం నుండి విడివడి వ్యావహారిక భాషలోనే ఎదిగే ప్రయత్నం జరుగుతుంది. చిన్న పిల్లలను బుజ్జగించడానికి , పడుకోబెట్టడానికి ఉపయోగపడే సాహిత్యం కావాలి. చిన్న పిల్లలను ప్రజాస్వామికంగా  త్రేత్  చేయడానికి బాల సాహిత్యం కావాలి.ఆ ప్రయోజనాలను దౄష్టిలో పెట్టుకుని వచ్చిన అందరికీ తెలిసిన ఒక తెలుగు  ఋహ్య్మె  చూద్దాము ‘ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోట కెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుక్కుమన్నావా ‘ ఇక్కడ దయ చేసి గమనించండి. సాహిత్యం ఎటువంటి రూపాన్ని మలుచుకుంటుందో.  కొట్టో తిట్టో పిల్లలను మేనేజ్ చేయాలి అన్న వాదన సన్నబడుతుంది. ఈ చైతన్యంతోటే ‘చిట్టి చిలకమ్మ ‘ పుట్టింది. సాహిత్యానికి ఎటువంటి ప్రయోజనాలు లేవు అన్న  హైపో తిసిస్   కు అనంగీకారం తెలిపే మంచి ఉదాహరణ ఇది.

ఆ రకంగా ఇది ఒక మంచి సాహితీ ప్రయోగానికి చిహ్నము. అలాగే ఒక వ్యక్తి భావన, వ్యక్తి ఆలోచన పదార్థం పట్ల ఉన్న అవగాహన ద్వారానే రూపుదిద్దుకుంటుంది.  మీకు కవిత్వం రాయాలంటే నది ఒడ్డు కెళ్ళొచ్చు. కవిత్వం రాయాలంటే ఆదివారం చార్మినారు వద్దకు వెళ్ళొచ్చు. మీ ఇంట్లో నెట్ ముందు కూర్చోవచ్చు. పదార్థంతో వల్ల కలిగిన వైరుధ్య భావనల మధ్య జరిగే సంఘర్షణ మనలో అవగాహనను పెంపొందిస్తుంది. ఐతే పదార్థం పట్ల మీ అవగాహన ఎలా పెంపొందుతుందో దాన్ని బట్టే మీ కవిత్వం వస్తుంది. మీ పక్కనే కూర్చున్న వ్యక్తి కి అదే వాతావరణం , పదార్థం పట్ల వేరు అవగాహన కలిగించవచ్చు. ఏది సరి ఐనది ఏది కాదు అన్నది వ్యక్తులు నిర్ణయించే సమస్య కాదు. కాబట్టి వ్యక్తిలో కవిత పుట్టుక గురించి మనం గెన్రలిసె చేయలేము. ఐతే సాంఘిక వ్యవస్థలో సాహిత్యం ఒక భాగమని మరిచి చేసే ఏ ప్రయోగమైనా – ఒకప్పుడు ప్రాచుర్యం లభించిన హేతుబద్దమైన ఆధారం లేని  ఎంపిరికల్ అప్ప్రోచ్   లేని ‘ ఆయిల్ పుల్లింగ్ ‘ ప్రయోగంలానే – మిగిలి పోతుంది.

ఉదాహరణకు మీరు ఒక పాత దేవాలయంలో మహా నిశ్శబ్దంలో ధ్యానం చేస్తూ కూర్చున్నారనుకోండి. అప్పుడు మోగిన గంట మీకు  Evil dead  సినిమా చూసిన అనుభూతిని గుర్తు చేయొచ్చు. మీ ఆఫీసు రిసెప్షనిస్టు నవ్వు లో ఉన్న అనుభూతి గుర్తు రావొచ్చు. లేదా అదో విప్లవ నినాదంగా అనిపించవచ్చు. మీ సాంస్కౄతిక నేపథ్యాన్ని బట్టి మీకు కలిగే భావనలు వేరు. ఐతే అందువల్లనే కవిత్వం పుడుతుంది అని సూత్రీకరించడం అందులోనే ఒక కవితా రూపం జననం దాగుంది అని సైద్ధాంతీకరించడం పూర్తిగా అశాస్త్రీయం. ఒక రకంగా మోసం చేసే ప్రయత్నం కూడా. ఇది మనలో ఉన్న  మధ్య తరగతి భయాలను  సపోర్ట్    చేస్తుంది తప్ప కవిత్వం పట్ల హేతుబద్దమైన ఆలోచనను పుట్టించలేదు. పైగా అలా ఒక కవితా రూపాన్ని ఊహించి దానికో ఆధ్యాత్మిక రూపాన్ని లేద దైవత్వాన్ని తగిలించడం , సామాన్యులకు సాధ్య మయ్యే విషయం కాదిది అని అన్నట్టు  ప్రొజెక్ట్   చేయడం భాషను, సాహిత్యాన్ని  సన్స్క్రితిసె  చేసే ప్రయత్నం తప్ప ఏమీ కాదు.

అలా ప్రయోగం మేనియాలో పడితే సాహిత్యానికి సమాజానికి వచ్చే ప్రాథమిక ప్రయోజనం ఏమీ లేదు. ఏదో హాబీగా కవిత్వాన్ని చూసుకోడానికి, విశ్రాంతి సమయాన్ని ‘ఖుషీగా’ గడపడానికి, భాష పైన  అచదెమిచ్ ఎక్ష్పెరిమెంత్స్   చెయడానికి ఒకరిద్దరు వ్యక్తులు చేసే ప్రయత్నంగా తప్ప ఇక వేరే విధంగా చూడలేము. ఇది ప్రధానంగా ‘ విశ్రాంతి వర్గాల ‘ ఉల్లాస ప్రక్రియ. మనకు చరిత్ర చెప్పిన సత్యం ఏమంటే ఈ ప్రయోగాలు పుట్టిన మరుక్షణం మరణం తేదీలు లెక్కించేలా ఉంటాయి. ‘ ఆయిల్ పుల్లింగ్ ‘ ప్రయోగాలు ఇవి. ” Literature is not merely a form of language gimmick ‘. భాషలో ప్రయోగం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం.

ప్రయోగం కన్నా ప్రయోజనం ముఖ్యం అని వ్యక్తిగా ఒక్కరు గుండె నిండా నమ్మినా అందులో భాగంగానే ప్రయోగాలు అని అర్థం చేసుకున్నా, ఒకే ఒక్క కవిత రాసినా, ఒకే ఒక్క ప్రయోగం చేసినా ప్రస్తుతానికి అది చాలు. ఆ సమిధ ఆరిపొయేలోపు ఇంకో సమిధ వెలగడం ఖచ్చితం. అదే క్రమంలో వందలు వేలు ‘ చిట్టి చిలకమ్మలూ పుట్టుకొస్తాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ‘ విత్తనం మరణించి పంటను వాగ్దానం చేస్తుంది ‘ (శివ సాగర్ ) అన్న నియమం ప్రకృతికే కాదు సాహిత్యానికీ వర్తిస్తుంది.

నరాలు తెంచే

ఇసుక రాళ్ళ వొత్తిళ్ళు మరిచి

కంఠం పెగల నీయని

ప్రాణ కంటక వలయంలో చిక్కుకున్న

నిలయ విద్వాంసులారా !

పడిపోయిన గాయకులారా !

తడి ఆరిన బతుకుల గాథల్లో

నిప్పులు కురిపించే తప్పుడు నియమాలతో

వాస్తవాల కళ్ళు చిదిమే కల్పనా కథకులారా !

కాల గమనంలో

సముద్ర తరంగాలు తలలు వాల్చినా

కవితా హౄదయం సరికొత్త మార్గాలు తొక్కినా

రూపు మాసిన రాజ సౌధాల్ని కీర్తించే

అంత రంగం ఏ మాత్రం మారని

వంది మాగధ నేపథ్య కవనాలు రచించే

ఆత్మ వంచనకొడిగట్టిన కవులారా !

ఆకాశ హర్మ్యాల రాకాసి ముఖాల్ని వదిలి

ఆనంద నిలయ సోపానాలు కూల్చి రండి !!

( చెరబండ రాజు )

 

 

Bibliography :

  1. Social anthropology – S L Doshi, P C Jain
  2. Social and Cultural Anthropology – Nigel Rapport and Joanna Overling
  3. Marxist – Leninst Philosophy – T Vlasova
  4. సాహిత్యంలో వస్తు శిల్పాలు – త్రిపురనేని మధుసూదన రావు
  5. ౠగ్వేద ఆర్యులు – రాహుల్ సాంకౄత్యయన్

 

( మరింత చర్చకు లేదా క్లారిటీ కోసం రచయిత మెయిల్  pvvkumar@yahoo.co.uk  లేదా ఫేస్ బుక్  ID ” P V Vijay Kumar “ లో కాని కాంటాక్ట్ చేయవచ్చు )

 

 

 

 

మైనారిటీ వాదం మత వాదమా ?

 

-పి. విక్టర్  విజయ్ కుమార్

~

‘ చమ్కీ పూల కథ ‘ అని నేను ‘ చమ్కీ  పూల గుర్రం ‘ కథ పై రివ్యూ రాసాక, కొంత మంది మితృలు నాతో ఒక ప్రశ్న లేవనెత్తారు ‘ ముస్లిములను సపోర్ట్ చేయడం అంటే ( ముస్లిం ) మతాన్ని సపోర్ట్ చేసినట్టు ఉండదా ? ‘  అని. ‘ మైనారిటీ మత ప్రజలను సపోర్ట్ చేయడమంటే , వాళ్ళ మతాన్ని కూడా సపోర్ట్ చేయడం అవ్వదా ? ‘ అని. అటు తిరిగి, ఇటు తిరిగి – ఇది చాలా మంది బుర్రల్లోనే, పైగా మార్క్సిజం నమ్మిన వాళ్ళలో కూడా, ఉన్న ప్రశ్న అని చాలా ఆలస్యంగా గమనించాక, ఒక   detailed explanation    ఇచ్చి చర్చిస్తే ,   probably   ఈ చర్చలకు ఒక లంగరు దొరుకుతుందేమోనని ఉద్దేశ్యం తో ఈ వ్యాసం.

వంద ఏళ్లకు పైగా మార్క్సిస్టు చరిత్ర ఉన్న దేశం మనది. అంత అనుభవం ముందు –  ఇది నిజానికి చాలా చిన్న ప్రశ్న. ఒక రకంగా చెప్పాలంటే  preliminary question  . ఐతే ఇప్పుడిప్పుడే ప్రగతి వాద రాజకీయాలు నేర్చుకుంటున్న వారికి, సిన్సియర్ కమిట్ మెంట్ ఉండి  progressive dilemma   ఉన్న వాళ్లకు ఈ వ్యాసం ఉపయోగ పడవచ్చని సాధ్యమైనంత సాధారణ భాషలోనే ఇది రాయడం అయినది.

మతం  superstructure  అని మార్క్సిజం చెప్తుంది. ఆర్థిక ప్రాతిపదిక   base   గా ఉండడం వలన , మతం ఇప్పుడున్న ఆర్థిక అసమానతలు కొన సాగినంత కాలం మతం కొన సాగుతుంది అన్నది   dialectical interpretation  . మరి అంత వరకు మతం మాయమయ్యేంత వరకు, మెజారిటీ మత వాదులు మైనారిటీ మతస్తులపైన చూపించే   prejudices   ను   hostility   ని ఎలా ఎదుర్కోవాలి ? ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోదల్చుకోవాల్సిందేమంటే – ఇది    prejudices    ను రూపు మాపే పోరాటం. అణగారిన వరుసల్లో ఉన్న మైనారిటీల సాంస్కృతిక సమస్యను ఎదుర్కోవడం. మైనారిటీ హక్కుల కోసం పోరాడ్డం , లెదా అందుకు సంబంధించి రచనలు చేయడం అంటే ఆయా   prejudices  ను వ్యతిరేకించడం. అంతేకాని  మైనారిటీ హక్కుల కోసం పోరాడ్డం అంటే – మైనారిటీ మతం   Vs  మెజారిటీ మతం అని అర్థం కాదు. అంతే కాక సెక్యులరిస్ట్ ఉద్యమాలు  మత పరమైన యుద్ధాలు కాదు, లేదా కేవలం మత విశ్వాసాల గొప్ప తనానికి సంబంధించిన పోటీ కూడా  కాదు.

మన దేశం లో మైనారిటీ మతస్తులు – ప్రధానంగా కార్మికులు,   unskilled workers , నిరుద్యోగులుగా ఉన్నారు. వీళ్ళెవరూ అధికారం లో భాగస్తులుగా లేరు. అక్కడక్కడ  tokenism  కనిపిస్తుంది గాని ( సినిమా స్టార్స్, పఠాన్, రాజ వంశస్తులు )  , అత్యధిక పేద వర్గానికి చెందిన వాళ్ళు కూడా వీళ్ళే.  నిజానికి  75 శాతం   death row convicts   ముస్లిములే మరి !   ఇక దళిత క్రిస్టియన్స్ సంగతి తెలియంది కాదు. వీల్లందరు సమస్యలున్నా ఇంకా అంతో ఇంతో మనశ్శాంతిగా, కొంత  జీవితం పట్ల confidence  తో  బతుకుతున్నారు అంటే – దానికి కారణం వారి మత విశ్వాసం. బ్రాహ్మినిజానికి వ్యతిరేకంగా వీరిని , పెట్టుబడి దారీ ఫ్యూడల్ వాదులకు, రాజ్యానికి వ్యతిరేకంగా కూడగట్టాలనుకున్నప్పుడు , నాస్తిక వాదం ను ముందు పెట్టి పోరాటం చేయడం మొదలు పెడితే – ఇక్కడో   friction   అనివార్యం అవుతుంది.  ఐతే   marxism   అన్నది   scientific socialism  ను చెప్తుంది . మతాన్ని నిర్ద్వందంగా  వ్యతిరేకిస్తుంది. అలాంటి సమయం లో – మైనారిటీ మత విశ్వాసాన్ని , తమ నాస్తిక వాదం తో దూషిస్తూ పోతే – శ్రామిక వర్గం లో పాతుకుపోయిన (మూఢ ) విశ్వాసాలను   hurt  చేయడం జరుగుతుంది. అందువలన , వాళ్ళు ప్రగతి వాదం , సెక్యులరిజం వేపు మొగ్గడం పోయి, తిరిగి మత వాద పార్టీల చేతిలో కీలు బొమ్మలై , కుల , వర్గ పాలన చట్రం లోనే ఇరుక్కుపోతారు. మరెలా ? వీరి సంస్కృతిని , వీరిని విస్మరించాలా ?   Communal violence   తో పాటు, వారిని ఆర్థికంగా, సాంఘిక, సాంస్కృతికంగా  అణగదొక్కే పరిస్థితి తో ఇలా గడపవలసిందేనా ?

ఇంతకు ముందు మనం అనుకున్నట్టు – మైనారిటీ హక్కుల పోరాటం –  institutional and individual prejudices   కు వ్యతిరేకంగా జరిగే పోరాటం. అంతే కాని మత విశ్వాసాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదు. మరి మత విశ్వాసాలను అలాగే అంగీకరించి మిన్నకుండి పోవాలా ? అందుకే   dialectics   చూస్తే క్లియర్ గా , వర్గ పోరాటాలను ( సాహితీ, సాంస్కృతిక ఉద్యమాలు కూడా భాగమే ) ఉధృతం చేసి ఆ క్రమం లో, మైనారిటీలను కూడా గట్టుకోవాలి తప్ప వారి విశ్వాసాల పై పోరాటాన్ని   prioritise   చేస్తే, మొత్తంగా వర్గ పోరాటాన్ని పక్కకు పట్టించాల్సి వస్తుంది అని అర్థమౌతుంది.

రష్యా అనుభవం చూస్తే – లెనిన్ అధికారం లో వచ్చిన వెంటనే మతం వ్యక్తిగత వ్యవహారం అందుకు ఎటువంటి    state support   ఉండదు అని ప్రకటించాడు. అంతే కాక ఆయా వ్యక్తిగత విశ్వాసాలను ప్రకటించుకోడానికి పూర్తి స్వేచ్చ ఉందని కూడా ప్రకటించాడు. ఇది ఇక్కడ   paradox  . శ్రామిక వర్గ ప్రగతి నిరోధకమైన మత విశ్వాసాల ప్రచారం కొనసాగించడం దేనికి ? ( కేంద్రీయ) నియంతృత్వ విధానాన్ని అనుసరించి ఒకే వేటులో దీనిని ఎందుకు తొక్కేయలేదు ?  ఇంకొక అడుగు ముందుకేసి – పార్టీలో ఏ వ్యక్తిగత విశ్వాసం ఉన్న వారైనా చేరవచ్చు ఐతే వాళ్ళు పార్టీలో ఉన్న   collective opinion  కు కట్టుబడి ఉండాలి అనే విధానం ప్రకటించాడు. ఇంకా పరిశీలిస్తే – చర్చ్ ఫాదర్స్ ను కూడా సోషలిస్ట్ పార్టీలో సభ్యులుగా చేర్చుకున్నారు. ఇదంతా చూస్తే – సైంటిఫిక్ సోషలిజం, మతాన్ని మత్తు మందుగా ప్రకటించిన మార్క్సిజం, మతం మీద ఒక   lenient view    తీసుకుందని అనిపిస్తుంది. ఐతే, నిజమైన ప్రజాస్వామిక దృక్పథం తో పరిశీలిస్తే   pluralism   మరియు  multiculturalism  తో సోషలిస్ట్ దృక్పథాని ఎలా ముందు తీసుకెళ్ళాలో లెనిన్ ఒక అద్భుత ఉదాహరణ ముందుంచాడని చెప్పుకోవచ్చు. సోషలిస్ట్ పార్టీ ఇటువంటి  stand   తీసుకోవడం గురించి లెనిన్ మాటల్లోనే గమనించండి.

lenin

(  in his writing – The Attitude of Workers’ Party to Religion )

To draw a hard-and-fastline between the theoretical propaganda of atheism, i. e., the destruction of religious beliefs among certain sections of the proletariat, and the success, the progress and the conditions of the class struggle of these sections, is to reason undialectically, to transform a shifting and relative boundary into an absolute boundary; it is forcibly to disconnect what is indissolubly connected in real life. Let us take an example. The proletariat in a particular region and in a particular industry is divided, let us assume, into an advanced section of fairly class-conscious Social-Democrats, who are of course atheists, and rather backward workers who are still connected with the countryside and with the peasantry, and who believe in God, go to church, or are even under the direct influence of the local priest—who, let us suppose, is organising a Christian labour union. Let us assume furthermore that the economic struggle in this locality has resulted in a strike. It is the duty of a Marxist to place the success of the strike movement above everything else, vigorously to counteract the division of the workers in this struggle into atheists and Christians, vigorously to oppose any such division. Atheist propaganda in such circumstances may be both unnecessary and harmful—not from the philistine fear of scaring away the backward sections, of losing a seat in the elections, and so on, but out of consideration for the real progress of the class struggle, which in the conditions of modern capitalist society will convert Christian workers to Social-Democracy and to atheism a hundred times better than bald atheist propaganda.

So,    ప్రధానంగా ఈ కింది పాయింట్స్ మనం గమనించాలి :

(1) శ్రామిక వర్గాల్లో ఉన్న మత విశ్వాసాలను ధ్వంసం చేయడం అది   undialectical   అవుతుంది . ఇది సమస్యను   relative boundary   నుండి  absolute boundary   కి షిఫ్ట్ చేసి తప్పిదం చేసినట్టౌతుంది ( కింద పేరాల్లో దీని కంప్లీట్ మీనింగ్ దానితో పాటు దీన్ని  అంబేద్కర్ ఎలా డీల్ చేసాడో చూద్దాం )

(2)   Country side   శ్రామికులు తమకున్న విశ్వాసాలతో మనుగడ సాగిస్తూ  ( అంటే మనకు పీర్ల దేవుళ్ళు, బతుకమ్మలు, సమ్మక్క సారక్క లకు మల్లే ) ఏదన్నా ఒక ఆర్థిక పోరాటం చేస్తున్నప్పుడు , వాళ్ళను కూడగట్టుకుని పోరాటాన్ని ముందు తీసుకు పోవాలంటే నాస్తిక వాదాన్ని ఉపయోగించడం   వర్గ పోరాటానికి అనవసరం మరియు హాని కారకం  కూడా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ  ఉద్యమ లక్ష్యం పక్క దారి పట్ట రాదు మరియు ఉద్యమ లక్ష్యమే అన్నిటికన్నా ఉన్నతమైనది కాబట్టి.

(3) ఈ విధంగా చేయడం వలన శ్రామికులు మత విశ్వాసం నుండి   social democracy   లోకి మారడం జరిగి తద్వారా క్రమేపీ నాస్తిక వాదం లోకి మారడం జరుగుతుంది. ఇది ప్రత్యక్ష నాస్తిక వాద  ప్రచారం కన్నా వంద రెట్లు మేలు.

లెనిన్ ఎంత క్లియర్ గా చెప్పాడు ఇందులో ? చెప్పడమే కాక, మతం మన జీవితాల్లో నుండి మాయమవ్వడం కోసం కొన్ని దశాబ్దాల కృషి కావాలని తెలిసాక,  మైనారిటీ మత విశ్వాసాలను అధికార వర్గ భావజాలమైన  majoritarianism  కు వ్యతిరేకంగా  organise  చేసి శ్రామిక వర్గాన్ని కూడగట్టమని చెబుతున్నాడు. అంతే కాక, ఈ మైనారిటీ విశ్వాసాలను పని గట్టుకుని దెబ్బ తీస్తూ ప్రవర్తిస్తే , ఈ వర్గాలు మరింతగా కుంచించుకుపోయి మరింతగా  rigid   అయిపోయి ప్రగతి వాద ఉద్యమాల వేపు ఆకర్షించబడకుండా , తమను మతం గోతిలో పాతి పెట్టే తమ శతృవు గుప్పిట్లోకే వెళ్ళిపోతారు. ఇదే అదను తీసుకుని అధికార వర్గం ( బ్రాహ్మిణిజం) , ఈ ఉద్యమాలను తమకు అనుగుణంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తుంది అని స్పష్టంగా తెలియ జేసాడు. ఆపై ఏంగెల్స్ ఏ మతాన్ని అయినా పిడివాదం తో గుడ్డిగా వ్యతిరేకించడం గురించి ఏమన్నాడో చూడండి ” మతం పై ప్రత్యక్ష యుద్ధం చేయడం మూర్ఖత్వం. అటువంటి యుద్ధం మతాన్ని పునరుద్ధరిస్తుంది తప్ప ఫలితం ఉండదు.  నిజానికి ఈ యుద్ధం మతాన్ని మరణించకుండా నిరోధిస్తుంది తప్ప ఎటువంటి దోహదం చేయలేదు   ”

పైన చెప్పిన  relative boundary  మరియు   absolute boundary   అన్నవి చాలా  important concepts . అసలు దేవుడే లేదు అన్నది  absolute boundary .   ‘ దేవుడున్నాడా లేదు అన్నది ప్రధానం కాదు ప్రస్తుతానికి, ఆయా వర్గాల ప్రజలను ప్రజాస్వామికంగా కూడగడుతున్నామా లేదా ‘ అన్నది  relative boundary .  సమస్యను  absolute boundary   కి  షిఫ్ట్ చేసే మార్క్సిస్టులను లెనిన్   Anarchists  గా వర్ణించాడు ( మన యాంత్రిక పిడివాద ఇండియన్ మార్క్సిస్టులు చేస్తున్నదిదే. శ్రామిక వర్గ పక్షపాతం ఉండాల్సిన వాళ్ళకు మైనారిటీ పక్షపాతం ఎందుకుండదో అర్థమవ్వదు. ) . ( మరి ఇదే  anarchist  ల   analogy  ప్రకారం చూస్తే Uniform Civil Code  ను సమర్థించే బ్రాహ్మణియ వాదులు కరెక్ట్ అయిపోవాలన్న మాట )

అంబేద్కర్ , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా నాస్తిక వాదాన్ని ప్రోత్సాహించకుండా , బుద్దిజం ను ఎందుకు పుచ్చుకున్నట్టు ? అంబేద్కర్ ఎప్పుడూ దేవుడిని నమ్మ లేదు . తన దృష్టిలో మతం అంటే ”  no god, no dieties, no rituals and no customs  ” అని ప్రకటించాడు. అలాంటప్పుడు ఇక అసలు మతం దేనికి ? అంబేద్కర్ బ్రాహ్మిణిజానికి ఒక ప్రత్యమ్నాయ వ్యవస్థను సృష్టించాలనుకున్నాడు ( ఇదే   relative boundary   ) అంటే – సాపేక్ష విలువను ఒకటి సృష్టించి బ్రాహ్మిణిజం ను ఆ విలువతో  పోల్చి బ్రాహ్మిణిజం ఘాతుకాన్ని ఎండగట్టడం. దీనికి బదులు,  rationalism  మరియు  education  హీనంగా ఉన్న కాలం లో,  నాస్తిక వాదం ముందుకు తీసుకుపోయి ఉంటే  ఏం జరిగేది ? శూన్యం లో శతృవు పేరు చెప్పి కరవాలం తిప్పినట్టు ఉండేది. ఎందుకంటే అలా చేస్తే ఏ శతృవు తలలు ఎగరవు. కాని వట్టి కరవాలం మాత్రం తెగ వేగంగా కదుల్తూ ఉంటుంది !

ఒక బైబిల్ పిట్ట కథ ఒక ఉదాహరణగా చెప్తాను ఇక్కడ ( దయ చేసి ఇదో ఉదహరణగా మాత్రమే పరిగణించమని మనవి ).  యేసు క్రీస్తు ఒక వ్యక్తికి పట్టిన దెయ్యాన్ని( సాతాను) వదల గొట్టి ‘ అక్కడున్న పందులలోకి వెళ్ళిపో ‘ అని దెయ్యాన్ని ఆదేశిస్తాడు.  అప్పుడు ఆ దెయ్యము  అక్కడున్న పందుల లోకి వెళ్ళిన వెంటనే, ఆ పందులు అడ్డగోలుగా పరిగెట్టి దగ్గరున్న సముద్రం లో పడి చనిపోతాయి. ఇక్కడ చూడాల్సిందేమంటే – ఏం దెయ్యాన్ని ఉత్తిగా వెళ్ళిపొమ్మని చెప్పొచ్చుగా అని ? ఐతే దానికి ఆయనిచ్చిన వివరణ ” ఆ దెయ్యం ఎటువంటి వైపరీత్యాన్ని కలుగ జేస్తుందో , ఎటువంటి ఘాతుకానికి పూనుకుంటుందో , అది వెళ్ళిపోవడం వలన ఎంత మేలు జరిగిందో ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించాలి కాబట్టి “. ఇదో పిట్ట కథ అంతే. శూన్యం లోకి దెయ్యాన్ని వదలగొట్టడం అంటే – నాస్తిక వాదం తో మైనారిటి మత విశ్వాసాలను దెబ్బ తీయడం. పందుల్లోకి పంపి దెయ్యాన్ని నాశనం చేయడం అంటే – ఒక  relative bench mark   సృష్టించి  systematic  గా దెయ్యాన్ని  expose  చేసి, దెయ్యాన్ని తరిమి వేయడం. అంటే దెయ్యం వైపరీత్యాన్ని ప్రజాస్వామికంగా నిరూపిస్తూ ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ ఉద్యమ లక్ష్యం కోసం కూడా గట్టుకోవడం అన్న మాట.

కాబట్టి, సెక్యులరిజాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన ఎంతో అవసరమున్న ఈ కాలం లో, మతమనే దెయ్యాన్ని నాస్తిక వాదం తో మాత్రమే కాక, ప్రజాస్వామిక పోరాటాల్లో మైనారిటీ మత విశ్వాసాలను , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా కూడ గట్టి ఆయా పోరాట క్రమం లో మతం అనే దెయ్యాన్ని వదల గొట్టాలి. ఎందుకంటే మనకు మైనారిటీ మత విశ్వాసానికి మించిన సమస్య కంటే , బ్రాహ్మిణిజం కు వ్యతిరేకంగా సాంస్కృతికంగా , సాహితీ పరంగా కూడా గట్టడమే ప్రధాన లక్ష్యం కాబట్టి. అందునా అసహనం ఒక సిద్ధాంతంగా , ఒక తాత్వికతతో బల పడుతున్న ఈ రోజుల్లో – మెజారిటీ మత వాద బ్రాహ్మిణిజాన్ని ఓడించడం ప్రధాన లక్ష్యం కావాలి కాబట్టి.  ఈ క్రమం లో – మైనారిటిలను ప్రజాస్వామిక ఆలోచన విధానం వేపు, సెక్యులరిస్ట్ జీవన విధానం వేపు కూడగట్టుకుంటే , వారి మత విశ్వాసాలు క్రమేపీ నాస్తిక రూపం లోకి మారకుండా ఉండే   option  ఇంకా ఏం మిగిలుంటుంది ? ఉత్తి నాస్తిక వాదానికి ప్రజలను కూడగట్టే దమ్ముంటే , మనకు ఇక ఏ ప్రగతి వాద సిద్ధాంతాలైనా అవసరం ఎందుకు ఉండేది ?   లెనిన్, అంబేద్కర్ లు చూపిన మార్గాన్ని మించి, ఇంతకంటే ఉన్నతంగా ప్రజాస్వామిక బద్దంగా మతాన్ని కూలగొట్టడం ఎలా సాధ్య పడుతుంది ?

*

చమ్కీ పూల కథ

 

-పి. విక్టర్ విజయ్ కుమార్

~

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక  సమావేశానికి హాజరై, ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అక్కడ జరిగిన  delibartions    గురించి ఆలోచిస్తూ వస్తున్నా. ఎంతో మంది రచయిత్రులు అక్కడ వేదిక మీద ప్రసంగించారు. ఆలోచిస్తున్నా – ప్రతి ఒక్కరిలోను ఏదో తెలీని ఆవేశం ! ఆవేదన ! ‘ ఎన్నో సంవత్సరాల నుండి వీళ్ళందరూ ఇన్ని  రచనలు చేస్తున్నారు. వీళ్ళ కథల్లో ఎన్ని ముస్లిం పాత్రలు, ఎన్ని క్రిస్టియన్ పాత్రలున్నాయి ?  వీళ్ళందరూ సృష్టించిన పాత్రల సంఖ్య లో, మత సహనం అనే ప్రత్యేక ఇతివృత్తం తో రాయకపోయినా, కనీసం పదహైదు  శాతం అన్నా మైనారిటీ లకు సంబంధించిన పాత్రలుంటే , అది  secular world of progressive writers    అయినట్టే కదా ? ముస్లిములు ఘాతుకంగా చంపబడిన 2002 సంవత్సరం తర్వాతైనా లేదా 2013 ముజఫర్ నగర్ ఊచకోత జరిగిన తర్వాతైనా సరే – మన తెలుగు రచనల్లో – ఎన్ని ముస్లిం పాత్రలొచ్చాయి ? ఎన్ని సన్నివేశాల్లో ముస్లిములు కనిపిస్తారు ? 2000 మొదట్నుండీ సామాజిక చిత్ర పటం లో ఇన్ని మార్పులు జరుగుతుంటే, గమనించని రచయితలు, రచయిత్రులు – చేస్తున్న ఈ ఆక్రందనల్లో శూన్యత లేదా ? ‘ ఆలోచనల స్రవంతి తెగదు ఇలా ఆలోచిస్తూ పోతే. నాకు ఎవరినీ నిందించాలనో, ఎవరి మీదో ఒక అసహనం ప్రదర్శించాలనో లేదు  గాని – కథ రాసి ఇంటికొచ్చి పిల్లలకు హోం వర్క్ చేయిస్తూ , మన పిల్లోడు కూడా మిగతా పిల్లల మాదిరిగానో, అంత కంటే ఎక్కువ గానో చదవాలి అనే ప్రెషర్ ను మనం తీసుకోవడమో, పిల్లల మీదకు రుద్దడమో ఎలా చేస్తామో – సింపుల్  గా చెప్పాలంటే అదే రకమైన ప్రెషర్ ఇది !!

మొహరం నెల. సూఫీ తత్వ వాదులు పవిత్రంగా పరిగణించే  రోజులు ఇవి.   మన దేశం లో సంస్కృతి ‘ భారత దేశ సంస్కృతి ‘ అని మత ఛాందస వాదులు, ఒక   hypothetical culture   ను జాతీయ వాదం లో భాగంగా ముందుకు తీసుకువచ్చి, ఇక ఏ ఇతర సంస్కృతి అయినా    subservient   అని గర్భితంగా ప్రజల సంస్కృతిని ప్రభావితం చేయదల్చుకుంటున్నప్పుడు –   composite culture  మానవ సంబంధాల్లో ఎలాంటి ఆర్ధ్రత నింపుతుందో తెలియ జేయడానికి , నాకు తెలిసి ఈ మధ్య కాలం లో జరగని ఒక ప్రయత్నం ఒక ముస్లిం చేసాడు. తన అస్తిత్వాన్ని, తను కోరుకునే సామాజిక సఖ్యతకు చమ్కీలద్ది మనకు ‘ చమ్కీ పూల గుర్రం’ ను అందించాడు.       అఫ్సర్ రాసిన ‘ చమ్కీ పూల గుర్రం ‘ మత తత్వానికి వ్యతిరేకంగా నినదించే సమయం లో – వచ్చిన   most well timed story .

కథ ఇతివృత్తం చూస్తే – ఇద్దరు చిన్న పిల్లల స్నేహానికి మత విశ్వాసాలు, పర మత విశ్వాస అసహనం ఎలా దీనావస్థను కలుగ జేస్తుందో తెలియ జేసే కథనం ఇది. మున్నీ పీర్ల ఆరాధన సంస్కృతికి   symbolic  గా ఉన్న చమ్కీ పూల గుఱ్ఱాన్ని బహుమతిగా ఆపూ కు ఇవ్వడం, ఆపూ –  మున్నీ స్నేహం లో ఉన్న అందాన్ని చమ్కీల  అందం లో చూసి ఆనందపడ్డం, హిందూ మత విశ్వాస విషం లో మునిగిన తండ్రి ఆపూ ను కొట్టి కలవకుండా ఇంట్లోనే ఉండమని హుకుం వేయడం, ఆపూకు విన్న పీర్ల కథలు నెమరేసుకోవడం,  ఆపూ తల్లి ఆపూ లొ ఉన్న విషాద అనుభూతిని చూసి నిస్సహాయంగా బాధ పడ్డం, ఆపూ మున్నీ స్నేహాన్ని కలవరిస్తూ చమ్కీ పూల గుఱ్ఱాన్ని  కలలో కలవరింపుల్లో దగ్గరగా హత్తుకుంటూ నిద్రలో ఒద్దిగలడంతో ఆర్ధ్రంగా ముగుస్తుంది కథ.

మొదటగా  కథా ఇతివృత్తం చూస్తే ప్రధానంగా గోచరించేది  “ culture of love and culture of acceptance “ .  మనమిప్పుడు చూస్తున్నది   “ Politics of hate “ ఇదే “ culture of hatred  “ ను పోషిస్తుంది . దీనికి కౌంటర్ గా  మనం ప్రజలకు రుచి చూపించాల్సింది  “ culture of love and affection “ . ప్రేమించే సంస్కృతి – పర విశ్వాస సహనం తొ ఒక స్థాయి వరకు కలిసి ఎదిగినా అల్టిమేట్ గా  ‘ సమ్మతి ‘ అన్నది ‘ సహనం ‘ కన్నా గొప్ప భావన. ఆ సమ్మతితోనే – ప్రేమలో ఒక ఆర్ధ్రత వస్తుంది. ప్రేమ ప్రజాస్వామికంగా ఉండడం వేరు. ప్రేమ ఆర్ధ్రంగా ఉండదం వేరు. మన దేశం లో సెక్యులరిజం ‘ పరమత సహనం ‘ దగ్గరే ఆగిపోయింది. ఈ కథ ఒకడుగు ముందుకేసి ‘ సహనం ‘ ను ‘ సమ్మతి ‘ అనే ఉన్నత స్థాయి దగ్గరకు తీసుకెళ్ళి , మనుష్యుల మధ్య ఉన్న అనుబంధాల్లో  essence  ను మనకు రుచి చూపిస్తుంది.

కథ చెప్పడం లో ఎన్నుకున్న పద్ధతి

పర విశ్వాస సమ్మతికి ప్రధాన అడ్డు గోడ   judgemental analysis of beliefs   .  రాన్ వైల్డ్ అనే ఒక ప్రఖ్యాత ప్రఖ్యాత కళాకారుడి  మాటలు గుర్తొస్తాయి  ”  Seek the wisdom of the ages, but , look at the world through the eyes of a child ”   . ప్రతి మతం గురించి , ప్రతి విశ్వాసం గురించి   dispassionate   గా తెలుసుకోవడం మేధావులుగా ఒక ఎత్తైతే , చిన్న పిల్లల దృష్టిలో చూస్తే మన ప్రపంచాన్ని మనమే ఎంత జఠిలం చేసుకున్నామో అర్థమౌతుంది.  ఇదే మాట ఆపూ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది ” అది చిన్న పిల్ల. దానికి ఈ వయసులో ఏం తెలుస్తుంది ? ఆ దేవుడి బొమ్మ కూడా ఆట బొమ్మ తప్ప ఇంకేమీ కాదు దానికి. కాసేపు ఆడుకుంటుంది. అంతే ! పిల్లల ఆటలో దేవుళ్ళ గొడవ తెచ్చి పెడితే ఎట్ల ? అక్కడ దానికి భక్తి గురించి , దానికి ఇంకా అర్థం కాని ధర్మం గురించి చెప్తే ఎట్ల ? ” నిజమే కదా ?! మనిషికి మత విశ్వాసాలెందుకు ? తన మీద తనకు భరోసా కలిపించడానికి. దాన్ని ధర్మం పేరుతో ఎంత  complicate  చేసుకున్నాం మనమందరం ? దీనికో తత్వాన్ని అద్ది ఛాందస వాదులు ప్రజా జీవితాన్ని ఎంత దుర్భరం చేసారు ? ఆపూ తన కలలో పీర్ల సాయిబు , పీరు బరువు ఎత్తడానికి ఇబ్బంది పడ్డప్పుడు ‘ జై ఆంజనేయ ‘ అంటుంది. దీన్ని ‘ మన ధర్మం గంగ నీరు, పర ధర్మం ఎండ మావి ‘ లాంటి అసంబద్ధ మైన సిద్ధాంతాలు చెప్పి కల్మషం చేయాలని చూస్తుంది ఒక కేరక్టర్ ఇందులో.

కథ మొత్తం చాలా నిర్దుష్టంగా,  situation specific   గా నడుస్తుంది. మన సెక్యులర్ సాహిత్యం  బ్రాహ్మినిజం తో కాంప్రమైజ్ అయ్యి వచ్చిన అర కొరా సాహిత్యం కూడా   abstractise   అయ్యింది.   Abstractisation is actually the biggest threat to secular writing, which actually needs a specific exemplification, reasoned out writing and usage of empathised forms    అబ్స్ట్రాక్టైజ్ చేయడం వలన, సెక్యులరిజం   గురించి     general sense   లో మాట్లాడి బ్రాహ్మినిజం ను వెనక్కు తోసేస్తుంది. దీనితో పాటు, సమస్యల తీవ్రత తగ్గించి కొంత గందరగోళానికి గురి చేసే ప్రమాదానికి కూడా ఇది తోడ్పడుతుంది. మానవులందరూ సమానులే అని కథ రాస్తే, సెక్యులర్ రచన అయిపోదు. విశ్వాసాల మధ్య ఘర్షణ, మెజారిటి వాదం యొక్క నిరంకుశత్వం గురించి నిర్దుష్టంగా మాట్లాడాకపోతే కథ, కవిత, ఇంకేదైనా సెక్యులర్ రచన కానేరదు. కవితాత్మకంగా చెప్పాలని , ఏవో   abstract expressions  ను మధ్యలో దూర్చడం సెక్యులర్ దృక్పథాన్ని తీవ్రంగా  dilute  చేస్తుంది.  ఈ విషయం మన కథకుడికి బాగా అవగాహన కావడం వలననే ఈ కథ అందంగా రాగలిగింది.

చిన్న పిల్ల ద్వారా మత విశ్వాసాలను వివరించడం ఈ కథ లో ఉన్న గొప్ప ఎత్తుగడ.  మనలో ఈ  complexity   కి దూరంగా బతకాలనుకునే ఒక నిర్మల తత్వం చిన్న పిల్లల హృదయం నుండి వివరించడం వలన మనం కోల్పోయిన దేమిటొ తెలియడానికి – ‘ ఆర్ధ్రత ‘ ఒక ఫాం గా నిలబడగలిగింది ఈ కథలో.   ఆపూ బాధ ఈ కథలో ఉన్న ప్రతి స్త్రీ కేరక్టర్  empathise  చేస్తుంది.  పురుష పాత్రలన్నీ వ్యతిరేకమే ! ఎందుకంటే ఇది ఉత్తి పురుష్స్వామ్యం కాదు – బ్రాహ్మణీక పురుష స్వామ్యం కూడా !

ఇంకా చిన్న చిన్న వివరణలు ( నేను వీటిని కథలో ఎత్తుగడలే అనే అనుకుంటున్నా ) –  మున్నీ , ఆపూ తో మాట్లాడక ఐదు రోజులయ్యింది అని ఉంటుంది . మూడు రోజులు ఎందుకు కారాదు ? ఏడు రోజులు ఎందుకు కారాదు ? మనలో కొన్ని  schemas  ఉంటాయి. ఏది దూరం, ఏది దగ్గిర అనడానికి కొన్ని  schematic feelings   ఉంటాయి. ఇది చాలా చిన్న విషయమే కాని, పాఠకుడికి తెలీకుండా పాఠకుడి మనస్సు మీద కొని   schemas  ను తట్టి లేపుతుంది.  ఫాతమ్మ చేసిన పాల కోవా అంటే ఆపూ కు ఇష్టం. అది మున్నీ ఒక్కతే తింటుందా ? తాను కలిసినప్పుడు ఇస్తుందా – అని ఆపూ ఆలోచిస్తుంది. ఇదొక  affectionate jealousy  కి సంబంధించిన   schema . ఇలా ఇంకా ఎన్నో   schemas   ను , తను చెప్పదల్చుకున్న మెసేజ్ కు అనుకూలంగా వాడుకుంటూ వస్తాడు. పాఠకులకు   cognitive complexities  ఉంటాయి. అందుకు   narrative   గా చెప్పడం ఒక పద్ధతి, సిచ్యుయేషన్ మీదా వ్యాఖ్యానిస్తూ   చెప్పడం ఒక పద్ధతి, వాదన చేస్తూ వివరించడం ఒక పద్ధతి. ఆర్ధ్రత,    empathy  ని వివరించాలంటే కథకుడు   schemas   ను తీసుకుని వాటి ద్వారానే, పాఠకున్ని కన్విన్స్ చేయాలనే పద్ధతి ఎన్నుకున్నాడు. అది సరి అయినదే అని కథ చదివాక ప్రతి ఒక్కరు అర్థం చేసుకోక తప్పదు.  అసలు ‘ చమ్కీ ‘ అన్నదే గొప్ప  schema . అది ఆనందాన్ని, అమాయకత్వాని   symbolise   చేస్తుంది.

మన దేశం లో దర్గాలు , పీర్ల సాయిబులు – అతి శూద్ర హిందువులలో ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ఇది హైందవత్వం , వీళ్ళ జీవితాల్లోకి తగినంత  చొచ్చుకుపోక పోవడం వలన కలిగిన ఒక    modification of belief  . దర్గాలలో దేవుళ్ళు ఉండరు. ఆరాధ్యనీయమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తుల ( ఆ వ్యక్తిత్వం మత తత్వమైనా సరే – అది వేరే విషయం )  సమాధులుంటాయి. పీర్ల చావిడిలో ఆర్భాటాలు ఉండవు. సింప్లిసిటీ ఉంటుంది. అక్కడ  Priests  కు తెచ్చిపెట్టుకున్న గొప్ప తనం ఉండదు. ఏ గొప్ప దర్గా సందర్శించినా   composite culture   మాత్రమే కనిపిస్తుంది. ఎవరన్నా సమానులే అక్కడ. ఎవరికీ స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండదు.

ఈ కథను  నాస్తికులు, గానీ    conservative marxists   గానీ దేవుడికి సంబంధించిన విశ్వాసాన్ని ఇంకోలా  glorify   చేసారు అనొచ్చు. మన దేశం లో హిందూ మెజారిటీ వాదాన్ని ఎదుర్కోవాలంటే – మనం అర్థం చేసుకోవాల్సింది , బ్రాహ్మినిజం సృష్టించిన ప్రతి  sentiment  కు మనం   counter-sentiment   ను సృష్టించాలి.  అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించాడంటే – అసలు మతం లేకపోతే మనిషి మనుగడే లేదు అనే నమ్మకం తో కాదు. దేవుడు – సమూలంగా మన జీవితాల్లో నుండి వెళ్ళిపోవాలంటే ఇంకో 500 సంవత్స్రాల పైనే పట్టొచ్చు. అంత వరకు ప్రజలకు  alternate  ఏం చూపించాలి ?  alternate belief system  డెవలప్ చేయకుండా , మనుష్యులను మనం కూడా గట్టుకోలేము. అలా కాక, ‘ అసలు ఏ దేవుడి గురించీ రాయొద్దు, దేవుడే లేదు అందుకోసం ఎవరూ కొట్టుకోవద్దు ‘  అని రాయండి అనడం  dogmatic argument  తప్ప ఏమీ కాదు.

ప్రతి ప్రజాస్వామిక రచయిత, రచయిత్రి – ఇలాంటి కథ ఏదో ఒకటి, ఇలాంటి పాత్రలతో ఏదో ఒకటి రాయండి చాలు. ఆంధ్ర జ్యోతి వేసుకోకపోవచ్చు, ఆంధ్ర భూమి వేసుకోకపోవచ్చు. నష్టం లేదు. ప్రగతి వాదం ఎప్పుడూ మైనారిటీ వాదమే. అదో దీర్ఘ కాలిక తిరుగుబాటులో భాగంగానే ఉంటుంది. అందుకు రచయిత/త్రి గా ఓపిక కావాలి.  అసలు ఇలాంటి కథ ఒకటి రాసి ఎవరూ  వేసుకోకపోతే, మీ దగ్గరే పెట్టుకోండి. మీ ఫేస్ బుక్ వాల్ మీద పెట్టుకోండి. ఎందుకంటే – మీరు రాస్తున్న దృక్పథం మహోన్నతమైంది కాబట్టి. అది ఏదోలా ఎక్కడో చోట వినబడాలి కాబట్టి.

నాకు మాత్రం ఈ కథ చదివినప్పుడు – కలిగిన ఫస్ట్ హేండ్ ఫీలింగ్ – ఈ కథ ఒక ముస్లిం మాత్రమే రాయగలడు. అది అఫ్సర్ కావడం  incidental  !!  ఆయనకు ఈ సాహితీ కళ ఉండడం సామాజికంగా యాదృచ్చికం.  ఇది ఆయన అస్తిత్వ ఫలం!

*

 

 

 

నా గొయ్యి నాకు ముద్దు !

 

-పి.  విక్టర్ విజయ్ కుమార్ 

~

 

రంగనాయకమ్మ రచనను స్వీకరించడం ద్వారా ‘ సారంగ ‘, మెయిన్ స్ట్రీం  కమర్షియల్ పత్రికల వ్యవహారానికి భిన్నంగా, విభిన్న అభిప్రాయాలను ప్రజాస్వామిక బద్ధంగా చర్చించాలి అన్న ప్రిన్సిపుల్ ను తన చేతనైనంతగా అనుసరించాలనే ప్రయత్నం  అభినందనీయం. ఎవరో సరిగ్గా అబ్జర్వ్ చేసారు – ఈ రచయితలు , మరీ రాజకీయ నాయకులకన్నా దారుణంగా వ్యక్తిగతంగా దూషించుకుంటున్నారు అని. ఆ దృక్పథం ను నేను  పూర్తిగా  endorse    చేస్తూ – రంగ నాయకమ్మ వ్యక్తిగత ప్రవర్తన సబబుగా ఉందా లేదా అంటూ సాగదీసి    court hearings   లా పొడిగించదల్చుకోలేదు.  సింపుల్ గా – ఆ గొడవ ల్లోకి పోకుండా , అసలు రంగ నాయకమ్మ తన పాయింట్ ప్రూవ్ చేసుకోడానికి  ఎటువంటి అప్రోచ్ అవలంబించింది అని చూస్తే చాలు. సాక్ష్యులు లేని వాదనొకటి తీసుకుని వ్యక్తిత్వాలు నిర్ణయించాల్సిన అవసరం ఉండదు. ఇందులో సబ్జెక్టివిటీ కూడా ఉండదు.

(1)   వరూధిని అమ్మ  కు (    KV     అనే రెఫెర్ చేస్తా ఇక నుంచి . ఈమె నోట్లో సెంటిమెంట్స్ ను పెట్టి ట్రేష్ చేసుకోవడం అవసరం లేదు) రంగ నాయకమ్మ   తాను ఒక లెటర్ రాసినట్టు ఇంటర్నెట్ లో పెట్టారు ( లేదా పెట్టించారు ). K V  రంగ నాయకమ్మ అభిప్రాయాలతో ఏకీభవించలేదు అని తెలిసాక,  ఈ  లెటర్ రాసి పంపడం ఏంటి ?  కామన్ సెన్స్ క్వశ్చన్. రంగ నాయకమ్మ అంటుంది ఏంటంటే –  ఆమె నే చెప్పిన మాట వినడం ఆపేసింది. ఆమెతో మాటలు కట్ అయ్యాయి అని.   మరైతే ఖేల్ ఖతం ! ఆ మాటనే రాసేయండిక !   ఎలిబీ సృష్టించుకోవడం దేనికి ?  మీరు ఎంత మంది గురించి వ్యక్తి గత జీవితాలలో onesided   గా రాస్తే మేం నమ్మ లేదు ?

ఈ ఎలిబీ కూడా ఎలా ఉంది చూడండి ? ఏ అడ్రస్ కు పోస్ట్ చేసిందో, ఎక్కడికి పోస్ట్ చేసిందో తెలీదు.   ఎందుకంటే – రంగ నాయకమ్మ మాటలు ఆపేసాక – 2013 కల్లా వాళ్ళు ఇళ్ళు మారిపోయి నెలలు అయ్యింది. వాళ్ళు ఇల్లు మారిన సంగతి ప్రత్యేకంగా ఫోన్ చేసి పలకరిస్తే గాని చాలా మందికి తెలియ రాలేదు.  మీ భార్య తో గొడవ పడ్డారనుకోండి.  మాటల్లేవు ఇద్దరికి మధ్య. మొబైల్ లో  S M S  పంపితే, ఏదోలా ఐనా చూసి రెస్పాండ్ అవుతుందేమో అనుకుని వేచి చూసారనుకోండి – అది సాధారణం. అలా కాక –  మీరే మీ భార్య పేరు మీద ఒక సి ం  కార్డు తీసుకుని , ఒక సెల్ లో వేసి వంద   S M S  లు పంపి , అందరికీ ‘ నేను ఎన్నో   S M S  లు పంపినా ఫలితం లేకుండా పోయింది ‘ అని చూపిస్తే జనాలు నమ్ముతారేమో కాని, అసలు విషయం ఏంటో – మీకూ, మీ భార్యకు మాత్రమే తెలుసు.

అందునా ఆ దాడి చేయాలనే ఆరాటం కొకు మీద కాదు. సాంఘిక , ఉద్యమ జీవితానికి దూరముండే ఒక వ్యక్తి మీద. అది కూడా ఆమెతో జరిగిన  ఒక  private talk    ను ( నాతో పాటు ఎవరూ సాక్ష్యులు లేరు దీనికి ) పబ్లిక్ గా తన   image projection  కోసం వాడుకోవడం లో ఏం బాపుకోవాలనుకుంటుంది రంగ నాయకమ్మ ? ఇక్కడ మీకు ఒక ప్రఖ్యాత అల్ఫ్రెడ్ కిచ్ కాక్ సినిమా గురించి చెప్పాలి –    Dial M for Murder   లో టోనీ అనే కేరక్టర్ తన భార్యను మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి, స్వాన్ అనే కేరక్టర్ తో ఆ మర్డర్ చేయించాలని – ఒక లెటర్ ను అమాయకంగా అతని చేతిలో పెట్టి వేలి ముద్రలు  సంపాదించి ఒక ఎలిబీ ని సృష్టించి, తద్వారా బ్లేక్ మెయిల్ చేసి తన భార్యను మర్డర్ చేయించడానికి ఉసిగొల్పుతాడు.  ఈ స్టొరీ లో థీం చూడండి.  రంగనాయకమ్మ తన గొప్ప తనాన్ని కాపాడుకోడానికి పాటించిన అప్రోచ్ చూడండి).

(2) మధ్యలో చలసానిని, ఈమె   K V   కి డబ్బులిస్తున్నారా అని అడిగినందుకు  ఒక నవ్వు నవ్వాట్ట. మన మధ్యలో లేని చలసాని సాక్ష్యం ఉపయోగించుకోవాలనుకుంది. కానీ చలసాని నవ్వింది, ఈమె వెర్రి ప్రశ్నలను చూసి . అది చలసాని వ్యక్తిత్వం గురించి తెలిసిన ఎవరైనా , చలసానికి రంగనాయకమ్మ మీద ఉన్న అభిప్రాయం గురించి తెలిసిన ఎవరికైనా అర్థమౌతుంది.

(3) లేని సాక్ష్యాల గురించి మాట్లాడే ముందు – చలసాని గారు    K V    కి 50,000 ఇచ్చారా లేదా ? ఎందుకిచ్చారు ? అన్న విషయం లోకి వెళ్ళే ముందు వేసుకోవాల్సిన ప్రశ్న – అసలు రంగ నాయకమ్మకు, తడుముకుని తడుముకుని పని గట్టుకుని ఫోన్ చేసి ఇంకో వ్యక్తి గురించి ( ఇంతకు ముందు అనుకున్నట్టు – సామాజిక జీవితం లో గానీ, ఉద్యమ జీవితం లో గాని లేని మనిషి గురించి ఇదంతా )  ఇంత   criminal anxiety   ఏంటి ?  అది ఏదో ఒక ముప్పాళ్ళ గణపతినో, ఇంకెవరినో  శోధించి, పరిశోధించి వ్యక్తిత్వాలను బయట కు తీసుకొచ్చి ఉంటే ఒక అర్థముంది. ఇది   gossping culture   కలిగినట్టుగా ఎందుకు పరిగణించరాదు ? అది అలా పక్కన పెడితే –  ఒక వేళ చలసాని నిజంగా డబ్బులు  అలా ఇచ్చి ఉంటే – అది    commercial consideration    అనే అర్థం మాత్రమే వస్తుందా ? ఏం చెప్పదల్చుకుంది రంగ నాయకమ్మ ? తీవ్ర వృద్ధాప్యం లో ఉన్న   K V    ని తన వద్దనే ఉండమని ఆత్మీయంగా బలవంతం చేసిన చలసాని, అది కూడా   commercial consideration   లో భాగంగా  చేసాడా ? చలసాని రంగ నాయకమ్మ తో పాటు, ఎందరికో ఎటువంటి ఆపేక్ష లేని సహాయాలు చేసాడు.  ఇంత బలహీనంగా మాట్లాడ్డం, ఆరోపణలు చేయడం రంగ నాయకమ్మ   image saving anxiety   కే చెల్లింది.

(4) అన్నిటి కంటే ఘాతుకం – మొదటి భార్య కొడుకు గురించి మాట్లాడ్డం. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళి పోయింది ?  ఎవరో అనామకంగా ఐ డీ లు మార్చుకుని వచ్చి చేసిన చిల్లర కామెంట్ ను   anchor   చేసుకుని ( ఈమెనే ప్రత్యక్షంగా ఇలా చేసింది అని అడగచ్చుగా ? పిల్లికి ఎలుక సాక్ష్యం ఎందుకు ? ) , ఏవో తాను అర్థం చేసుకున్న కల్పితాన్ని అందరికీ వినిపించింది. ఆప్తులకు తెలుసు – మొదటి భార్య కొడుకుకు   K V    ఏం చేసిందో , ఎలా చూసిందో అన్న విషయం. అది ఇప్పుడు నేను – కోర్ట్ లో కేస్ వివరించినట్టు వివరించడం హీన స్థాయికి చర్చ తీసుకెల్లడవం అవుతుంది అని ముందే చెప్పాను. అసలు మధ్యలో మొదటి భార్య కొడుకు , అనే ఒక   popular negative opinion   ను ఆధారం చేసుకుని ఒక వ్యక్తి మీద బురద చల్లుదామనుకునే అప్రోచ్ గురించి ఆలోచించండి.  ఇప్పుడు నేను రంగ నాయకమ్మ మొదటి భర్త తో ఎలాంటి గొడవుంది, ఇప్పుడున్న భర్తతో తానెంత   equality  పేరుతో   hegemony   ఎలా చలాయిస్తుందని రాస్తే – ఎంత నీచంగా ఉంటుంది ? రంగ నాయకమ్మ   image saving   కోసం ఎంత కన్నా దిగ జారుతుంది. ఇది ఖచ్చితమైన తార్కాణం.

రంగ నాయకమ్మ కు, ఆమెతో ఒక   interaction    లో ఉన్న వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణకు సాక్ష్యులు కాని మనం, ఈ అప్రోచ్ ను ఎలా అర్థం చేసుకోవాలో జాగర్తగా ఆలోచించుకోవాలి అన్నదే ఇక్కడ అభ్యర్థన.  ఆమె రాసిన వ్యాసం లో ఎన్నో ఉన్నాయి – డాక్టర్ కు డబులివ్వమని సజెస్ట్ చేయడం  అందుకు ఆమె ( అమాయకంగా ) నా దగ్గర ఎవరూ డబ్బులు తీసుకోరు అనడం ఒక విలనీ కింద ఈమె రాయడం, కోపం రావాల్సిన సందర్భాల్లో కూడా   K V   కి కోపం రాదు అన్నది కూడా ఒక కంప్లైంట్, ” మీకో చిన్న లెటర్ రాయాలని మొదలు పెట్టాను ” అని లెటర్ మొదలు పెడుతుంది. పెద్ద లెటర్ రాయబోతున్నప్పుడు ‘ రాయాలని ‘ అంటూ రాయడం అమెకున్న  farse opinion making skills   లో భాగమే.

ఇక అన్నిటినీ రాసుకుంటూ పోతే ఒక పుస్తకం అవుతుంది. అందునా కొకు ను ( అలాంటి  social characters  ను)  అడ్డం పెట్టుకుని, అటువంటి విలక్షణ వ్యక్తులతో అనుబంధం లో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క character assassination  చేయాలని పూనుకున్న ఆమెకు బోల్డంత ఫోకస్ ఉంది. నా గొయ్యిలో నే పడ్డమే బెటర్ గా ఉంది. నాకు ఆమె మీదున్న ఉన్న  కొన్ని  సంకోచాలు కూడా ఆమె వ్యాసం తో పటా పంచలయ్యాయి.

*

(అంబేద్క) ‘ రైటేనా ఐలయ్య ‘ ?

 

-పి. విక్టర్ విజయ్ కుమార్ 

~

 

ఐలయ్య అంటే ఒక ధిక్కార స్వరం.  ఐలయ్య అంటే హిందూ బ్రాహ్మణ వ్యతిరేక గర్జన. ఇదే భావన ఈ వ్యాస కర్తతో పాటు ఎందరో ప్రజాస్వామ్య కాముకులను ఆయన విషయం లో ఆకట్టుకుంంటుంది.    ఐలయ్య రాసిన  Why I am not a Hindu, Buffalo Nationalism: A Critique of Spiritual Fascism.    మొదలైన పుస్తకాలు బ్రాహ్మణ హిందూత్వాన్ని నిలువునా ప్రశ్నించాయి. ఈ మధ్య కాలం లో ఐలయ్య రాస్తున్న వ్యాసాల్లో ఎన్నో   contradictions   కనిపిస్తున్నాయి. నిజానికి  – ఇంకా నిశితంగా చెప్పాలంటే , తెలంగాణా ఉద్యమం ఊపందుకున్నప్పటి నుండి తనదైన ప్రగతి వాద శైలిలో కాకుండా , భిన్న స్వరం తో వ్యాసాలు రావడం మొదలు పెట్టాయి. ఆయనకున్న తెలంగాణా వ్యతిరేకతను అటు ఉంచితే, దళిత సంక్షేమ వాదనలో కూడా తేడాలు కొట్టొచ్చినట్టు అగుపిస్తున్నాయి.

ఈ మధ్య తెలంగాణా రాష్ట్ర వ్యవస్థను దుయ్యపడుతూ, విప్లవ వాదుల  ‘ వరంగల్ డిక్లరేషన్ ‘ ను తప్పు పడుతూ ఇలా రాస్తాడు –

” ఇక్కడే కమ్మ క్యాపిటలిజంపై కోపం వెలమ భూస్వామ్యంపై ప్రేమ మార్క్సిజంగా మారింది. “ “ కమ్మ పెట్టుబడిపై మావోయిజానికి అంత కోపమెందుకొచ్చిందీ, వేలాది మంది చనిపోయినంక వెలమ ఫ్యూడలిజంపై ప్రేమ ఎందుకు కలిగింది? ”

ఈ వాక్యాన్ని – దళిత దృక్పథం  తో గమనిస్తే – పెట్టుబడుల్లో కమ్మ పెట్టుబడి తీరు, రెడ్డి పెట్టుబడి తీరు  లేదా అగ్ర కులాల పెట్టుబడులలో ఒక్కో కులం యొక్క పెట్టుబడి తీరు కేవలం వేరు అని కాక గుణాత్మకంగానే వేరు గా   ఉంటుందని చెప్పడానికి సిద్ధమైనట్టు తెలియ జేస్తుంది. పెట్టుబడుల్లో  అందులో అగ్ర కులాల పెట్టుబడుల్లో – కొన్ని ‘ మంచి పెట్టుబడులు ‘ , కొన్ని ‘ చెడ్డ ‘ పెట్టుబడులు ఉంటాయా ? బ్రాహ్మణియ మనువాద శక్తులు – ఈ దేశ కేపీటలిస్ట్ వ్యవస్థను ముట్టడి చేసాక , మీడీయా, ఎంటర్ టెయిన్ మెంట్, ఇంఫ్రాస్ట్రక్చర్ , రిటెయిల్ అని రంగాలలో  అగ్ర కుల పెట్టుబడులు దేశ వనరులను కొల్ల గొడుతున్నాయి. మన దేశం  జీ డీ పీ అభివృద్ధి లో దళితుల షేర్ ఎంత అని ప్రశ్న వేసుకుని , అగ్ర కులాలు , దళితుల షేర్ లో గేప్ – కనీసం 4 శాతంగా గుర్తించినా , 18 సంవత్సరాలలో , దళిత అగ్ర కులాల మధ్య ఆర్థిక అంతరం ఇప్పుడున్న దాని కంటే రెట్టింపు అవుతుంది ( ఇది ఇకనామిక్స్ లో సింపుల్ మేథ్  మేటికల్ ఫార్ములా  ).  ఇందులో – ప్రజాస్వామిక అగ్ర కులాల పెట్టుబడి వలన పెరిగిన అంతరం ఎంత ? అప్రజాస్వామిక  అగ్ర కులాల వలన పెట్టుబడి వలన జరిగిన అంతరం ఎంత అని చూడ్డం – దళిత దృక్పథాన్నే మార్చి చూడ్డం కాదా ?

అంబేద్కర్ ఈ దేశం గర్వించ దగ్గ మొదటి ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన కేపిటలిజం ను ఆర్థిక దృక్పథం తో చూడ్డం మాత్రమే అన్నిటికీ సమాధానం అన్న పిడి వాదాన్ని నమ్మలేదు. అలాగని – కేపిటలిజం లో మంచి కేపిటలిజం చెడ్డ కేపిటలిజం అని ఉంటుందని చెప్పలేదు.   ” Caste is nothing but a class enclosue ”    అని చెప్పిన అంబేద్కర్ , కేపిటలిజం ను సాంఘిక కోణం నుండి విశ్లేషించిన మొదటి సోషలిస్ట్ ఆర్థిక వేత్త. ( అంబేద్కర్ కోరుకున్నది  ” సోషలిస్ట్ డెమోక్రసీ ” అన్నది ప్రస్తుతం సబ్జెక్ట్ కాదు ఇక్కడ ).

” ఇక్కడే కమ్మ క్యాపిటలిజంపై కోపం వెలమ భూస్వామ్యంపై ప్రేమ మార్క్సిజంగా మారింది. ” అని రాస్తే  ఇలాంటి  ప్రవచనాలు ఏం తెలియ జెప్పుతాయి ? బ్రాహ్మణీయత ను విడదీసి – అందులో ఒకె మెతుకు ఏది ఎక్కువ, ఏది తక్కువ అని చూడ్డం వలన ఎవరికి ఉపయోగపడుతుంది ఈ భావజాలం ? రేపు కమ్మ వాళ్ళందరూ చేరి ” చూసారా ! ఐలయ్య లాంటి గొప్పోడే మా కేపిటలిజం పై కోపం తప్ప విప్లవానికి వేరే వ్యతిరేకత లేదు అంటున్నాడు. మేమెలాగైనా మంచోళ్ళే. ” అంటే ఏం సమాధానం నా లాంటి దళిత పక్ష పాతులు ఇవ్వగలరు ?

అన్నిటికంటే బాధాకరమైన ప్రవచనం ఏంటంటే – ” భారత దేశంలో భూస్వామ్య వర్గానికి కుల అణిచివేత స్వభావం ఎక్కువ ఉంటుందా, లేక పెట్టుబడిదారీ వ్యవస్థలో పనిచేసేవారికి ఎక్కువ ఉంటుందా?  ”

ఏంటి ఈ పోలిక ? ఎక్కడికి దారి తీస్తుంది ? ‘ ఎక్కువ ‘ అంటే ఎంత ? అసలు అణచివేసే దుర్మార్గుల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఏంటి ?

ఇలా కాక కొన్ని అసంబద్ధమైన విశ్లేషణలు కూడా విరివిగా కనిపిస్తాయి. ” హైదరాబాదులోని పెట్టుబడి కోస్తా జిల్లాల్లోని ఆగ్రో ఎకానమిలోని సర్ప్లస్ ఆగ్రో ఇండస్ట్రీస్ గా  మారి గ్లోబలైజేషన్లో భాగస్వామ్యంగా ఎదుగుతున్నది. ”

నిజమే ! కోస్తాలో ఆగ్రో ఎకానమీ పెద్ద స్థాయిలో ఉంది. మరి ‘ సర్ ప్లస్  ‘ ఆగ్రో ఇండస్ట్రీ   definition   ఏంటి ? అంబేద్కర్ ‘ సర్ ప్లస్ మేన్ ‘ ‘ సర్ ప్లస్ వుమన్ ‘ అని ‘ సర్ ప్లస్ ‘ ను వాడ్డం జరిగింది కాని – ఒక పరి శ్రమనే ‘ సర్ ప్లస్ ‘ అనడం ఏ సూత్రం ? ఏ దృక్పథం తో అలా అనాలి ?

” మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారం ఉత్పత్తి శక్తులు అభివృద్ధి చెంది లేదా విప్లవాత్మక మార్పుకు గురై ఫ్యూడల్ వ్యవస్థ దెబ్బతిని లేదా దెబ్బతీయబడి పెట్టుబడి వ్యవస్థ వైపు ఉత్పత్తి శక్తులు పయనించడం సరైంది. గతితార్కిక సిద్ధాంతం ప్రకారం మార్పు ప్రక్రియ దాన్నే కోరుకుంటుంది ” – అంటూ ఒక చోట మార్క్సిజం గురించి ప్రస్తావిస్తాడు.   ‘సరైంది ‘ అంటే – అలానే ఉండాలి అనా   ? అలా ఉంటుంది అది అంతే అనా ? గతి తార్కిక సిద్ధాంతం దేన్నీ కోరుకోదు. వివరిస్తుంది.  గతి తార్కిక సిద్ధాంతం కులం ఎలా ఉంటుందో అది ఎలా విశ్లేషించాలో ఒక సూత్రాన్ని మనకు చెప్పొచ్చేమో అంతే కాని ఇలా కన్ ఫ్యూజ్  చేయదు. ఇంత సీరియస్ సబ్జెక్ట్ రాస్తున్నప్పుడు పద ప్రయోగం లో  ఇలా ఐలయ్య ఎలా ఫెయిల్ అవ్వగలడొ తెలీదు.

అంబేద్కర్ ఏమన్నాడో చూడండి –  ” It ( Democracy) has left the economic structure to take the shape given to it by those who are in a position to mould it ”   అన్న దృక్పథం తో ఐలయ్య చెబుతున్న దృక్పథం  తో పోలిస్తే ఎక్కడ సమన్వయం కుదురుతుంది ?

bhim-rao-ambedkar

ఇవన్ని ఇలా ఉండగా ” ఫ్యూడలిజంలో ఉత్పత్తి కులాలు పెత్తనం చెయ్యలేనట్లే, పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా అవి పెత్తనం చేయలేవు. కనీసం ఈ చిన్న రాష్ట్రపు ఎన్నికల రంగాన్నైనా ఒక సోషల్ డెమొక్రాటిక్ ఎన్నికల రంగంగా మార్చి కనీసం ఒక దళితున్నో, బీసీనో (ఏదో ఒక సిద్ధాంత పట్టుతోనే) ముఖ్యమంత్రిని చేసి ………”  ఇలా ప్రతిపాదనలు కనిపిస్తాయి.  ఎన్నికల రంగాన్ని మాత్రమే సోషల్ డెమోక్రటిక్ రంగంగా మలచడం ఏంటి ? బ్రాహ్మణిజం ను ఎదుర్కోవడం ఒక రంగానికి మాత్రమే సంబంధించిన విషయమా ?  అంబేద్కర్ ఈ విషయం లో ఏమన్నాడో  చూడండి    ” … Constitutional Lawyers have been dominated by the antiquated conception that all that is necessary for perfect constitution for democracy was to frame a Constitutional Law. Consequently almost all Laws of Constitution, which relate to countries whic are called Democratic, stop with Adult Suffrage and Fundamental RIght. They have never advanced to the conception that Constitutional Law of Democracy must go beyond Adult Suffrage and Fundamental RIghts ”    ఇంత చక్కటి క్లారిటీ అంబేద్కర్ కుంది. ఆయన ఆలోచనా విధానాన్ని ఇలా అసౌష్టవంగా  చూపించడం దేనికి ?

ఐలయ్య గొప్ప దనం ఐలయ్య లో  కొంత ఉంది. అసలు గొప్ప దనం అతని వాదనకు ప్రత్యామ్నాయంగా నిలబడాల్సిన చిత్తశుద్ధి కలిగిన ఉద్యమాలలో అగ్ర స్థానం లో ఉండే విప్లవ సంస్థ ల్లో ఉండే బలహీనత వల్ల ఉంది.   వి ర సం లాంటి సంస్థలు – చలం, గురజాడ కు జరిపిన వేడుక సభలు – జాషువా , అంబేద్కర్ కు ఎన్ని జరిపారు ?  జాషువా గొప్ప ‘ ప్రతిభ ‘ కల్ల వాడు కాకపోవచ్చు వాళ్ల దృష్టిలో. కాని దళిత కుటుంబం నుండి వచ్చి – బ్రాహ్మణియ సాహితీ వ్యవస్థలో తిష్ట వేయడాన్నైనా అభినందించరా ? ఏదో ఒక సభలో కనీసం టేబుల్ మీద ఆయన ఫొటో పెట్టి నివాళులు అర్పించడానికి కూడా అంబేద్కర్ సరిపోడా వి ర సం దృష్టిలో ? ఐలయ్య మార్క్సిజం కు వ్యతిరేకంగా  మాట్లాడి ఉండవచ్చు కాని – ఆయనపై హిందూ మత తత్వ సంస్థలు పోలీసు కేసు పెట్టినప్పుడు  మద్దతు ప్రకటించిన విప్లవ సంస్థలు, విప్లవ సభ్యులు ఒక్కరన్నా ఉన్నారా ?  కాల్బర్గీ హత్య పై మాత్రం అంత స్పందన ఎలా సాధ్యం ? కర్నాటక లో ఉన్న కాలబర్గీ ఎవరో కూడా – ఈ విప్లవ సంస్థలకు తెలీదే ?  పక్కనే ఉన్న ఐలయ్యకు నామ మాత్రంగా అయినా మద్దతు తెలపడానికి ఏ ఇగో అడ్డొచ్చింది ? ఇలాంటి  behaviour  దళితుల్లో,  ముఖ్యంగా ఎడ్యుకేట్ అయిన దళితుల్లో   confidence  నింపలేకపోతుంది.

MRPS  జెండా పట్టి , కుమ్మక్కు రాజకీయాల్లో ఇమడ లేక వీధిన పడ్డ దళితులున్నారు.  చుండూరు ఉద్యమం లో అన్నీ వదిలేసి , దళితుల పై ప్రేమతో ఉద్యమ బాట పట్టి కెరీర్ లను , కుటుంబాలను నష్టం చేసుకున్న దళితులున్నారు. తెలుగు దేశం, ప్రజా రాజ్యం లాంటి అగ్ర కుల బ్రాహ్మణీక పార్టిలు ఈ ఉద్యమాలను వాడుకుని వదిలేస్తే , దిక్కు తోచక సరి అయిన సైద్ధాంతిక ఆచరణ ఏంటొ తెలియని పరిస్థితుల్లో దళితులు చేరి – ఎవడో ఒకడు మనోడు, ఎక్కడొ ఒక చోట, ఎలాగోలా ఉంటే పర్లేదులే అన్న ‘ రాజీ భావన ‘ కు వచ్చారు. చివరికి దళిత దృక్పథం సరి అయిన నాయకత్వం లేక ‘ రాజీ సిద్ధాంతాలతో ‘ బతుకుతుంది. ప్రతి ప్రజాస్వామిక సిద్ధాంతాన్ని  paranoic (అంటే విషయాన్ని తెలీని అనుమానం తో చూడ్డం)  గా చూడ్డం మొదలయ్యింది. ఇదే ‘ రాడికల్ దళిత వాదంగా ‘ చలామణీ అవుతూ మధ్య తరగతి దళితుల మన్ననలు పొందుతుంది.    ఐలయ్యలా  అక్కడో ఇక్కడో – ఒకటి రెండు అగ్ర కులాలను తిడుతూ – ముఖ్యంగా వెలమ కులాన్ని, ఒకటి అర కులాల్ని ఇదే  paranoic  ధోరణి తో దుయ్య బడితే అది దళిత వాదం అయిపోదు. అంబేద్కర్ చెప్పిన బ్రాహ్మిణిజం ను  letter and spirit  లో అర్థం చేసుకున్న రోజు ఇలాంటి ప్రమాదాలు నివారించ వచ్చు.

ఐలయ్య దుర్మార్గుడు అని చెప్పడం కాదు ఇక్కడ. చారిత్రక నేపథ్యం లో అగ్ర కుల  రాజకీయాలు, దళిత రాజాకీయాలను ఎలా ధ్వంసం చేసాయో గమనించి, ముందుగానే    early symptoms    కోసం గమనించి    cautious   గా ఉండమని చెప్పడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.

*

ఆమె మాట ఎప్పటికీ బంగారు మాటే !!

 

-పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

ఆకాశం లో అర్ధ భాగం ను తెంపుకుని వచ్చి కొడవంటి కుటుంబ రావు గారి  జీవితం లో అర్ధ భాగం పంచుకున్నది వరూధిని అమ్మ. తొంభై ఒక్క ఏడు దాటినా – ఏ మాత్రం సడలని నిబ్బరం, ఏ మాత్రం వీగిపోని సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఇంకా వికసిస్తున్న ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇవన్నీ చూస్తే – ఆమె పెరిగిన సిద్ధాంతాల వాతావరణ ప్రభావం అంత గట్టిగా ఉంటుందేమో అనిపిస్తుంది.

వ్యక్తిగా నిలదొక్కుకోవడం ఒక ఎత్తైతే – ఒక సామాజిక జీవిగా ఇంకా చేతనం కలిగి ఉండడం అంత సులభ తరం కాదు.

పెదనాన్న స్త్రీ వాది చలం, నవలా రచయిత కొమ్మూరి సాంబశివ రావు తమ్ముడు,  తురగ జానకి రాణి, ఇస్మాయిల్, వజీర్ రెహ్మాన్ అందరూ చుట్టూ దగ్గరి బంధువులు. కూతురు కేంద్ర సాహితీ పురస్కార గ్రహీత. కొడుకు, రోహిణీ ప్రసాద్,  భారత దేశం లో పేరెన్నిక గన్న న్యూక్లియర్ శాస్త్ర వేత్త కావడమే కాక, ప్రజల భాషలో సైన్స్ ను వివరించాలనుకునే ‘ స్టిఫెన్ హాకింగ్ ‘ లాంటి వాడు అంతే అతిశయోక్తి కాదు. ఇంత మంది మధ్యలో 90 ఏళ్ళ నుండి పెరిగాక , ఆమెకు వయో భారం వలన వచ్చే మానసిక దైన్యం దాదాపుగా కనిపించదు.

రోహిణీ ప్రసాద్,    BAARC    లో సైంటిస్టుగా ఎన్నో పేటెంట్లు సాధించడానికి కారకుడు. వ్యక్తిగా తన సైన్స్ విజ్ఞానాన్ని పదిలపరుస్తూ ఎన్నో సైన్స్ పుస్తకాలు – వీక్షణం, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ , ప్రజా సాహితీ సంస్థల సహాయం తో ముందు తీసుకు రాగలిగాడు. విశ్వ రహస్యాన్ని ఎంత సింపుల్ గా ప్రముఖ శాస్త్ర వేత్త స్టిఫెన్ హాకింగ్ పాఠకుల ముందు ఉంచాడో – అలా తెలుగులో అటువంటి ప్రయత్నం ఆ స్థాయిలో చేయగలిగింది రోహిణి ప్రసాద్ గారే. నేను, అతడు ఒకే వెబ్ మేగజైన్ కు ఆర్టికల్స్ రాసేవాళ్ళం. చిన్న పత్రిక, పెద్ద పత్రిక అనే స్థాయి లేకుండా – అదే ‘ ఇంటలక్చువల్ మోతాదులో ‘ సైన్స్ ఆర్టికల్ రాసి ఇచ్చేవాడు. తన ఆరోగ్యం పాడవుతుంటే – తనే రీసర్చ్ చేసి వ్యాధి, దానికి చికిత్స గురించి పరిశొధించి డాక్టర్లకు అడ్వైజ్ చేసేవాడు. ఆయన్ డాక్టర్ రోహిణీ ప్రసాద్ అంటే – నిజంగానే డాక్టర్ ఏమో అని వైద్యులు నమ్మేసేంత అమాయకానికి వారిని గురి చేసాడు. సైంటిస్టుగా నిజాయితీ కలిగిన ‘ సైంటిఫిక్ టెంపర్ ‘ కలిగిన వ్యక్తి. సంగీతం లో విద్వాంసుడు.

స్వంతంగా ఎన్నో స్వరాలను సురచించిన వాడు కావడం తో ఆయన రిటైర్ అయ్యాక, ఎవరో సాయి బాబా భక్తులు , సాయి బాబా కోసం స్వరాలు సమకూర్చమంటే – చప్పున ముగించి ఇచ్చేసాడు. వరూధిని అమ్మ ‘ ఏంటీ ? నీకు సాయి బాబా అంటే నమ్మకమా ? ‘ అంటే ‘ కాదు వాళ్ళిచ్చే డబ్బు మీద నమ్మకం ‘ అన్నాడు.  చాలా మంది హేతువాదులు, కుల నిర్మూలనా వాదులు – ఈ సందర్భాన్ని తప్పు పట్టొచ్చు. వాళ్లందరూ కూడా ‘ డబ్బు మీద నమ్మకం లేని వాళ్ళైతే ‘ బాగుణ్ణు. విప్లవ సాహిత్యం లో ఉన్న వాళ్ళ పై జరిగే విపరీతమైన దాడి ఏంటంటే – వాళ్ళు సౌకర్యమైన జీవితాలు గడుపుతున్నారని. నిజానికి కొడవటిగంటి కుటుంబ రావు , రోహిణీ ప్రసాద్ లు సంపాదన మాత్రమే లక్ష్యం పెట్టుకుని ఉంటే – వారు సంపాదించింది చాలా తక్కువే. ఒక ఊహాత్మక ఆదర్శం లో – ప్రగతి వాదులను ఇరికించి ‘   impractical expectations     ‘ పెట్టుకోవడం  ఒక రకమైన ‘   totalitarianism    ‘ అవుతుంది తప్ప ఇందులో గొప్పగా ప్రశంసించ  దగ్గ విషయం ఏమీ లేదు. ఒక మనిషి సాధించిన దేమిటో వదిలేసి, సాధించనిది ఏమిటో ఆలోచించడం మధ్య తరగతి    frustration     లో భాగం తప్ప మరేమీ కాదు.

కలాం లాంటి సైంటిస్ట్ – సైన్స్ నే కాదు, అత్యున్నత రాష్ట్రపతి పదవి స్థానం యొక్క ఆత్మ గౌరవాన్నే వదిలేసాడు. అది పక్కా  ‘  careerism ‘.  ప్రతి విప్లవ కళా కారుడి కుటుంబాన్ని ‘   full time revolutionary   ‘  జీవితం నడపాలని ఆశించడం లో తప్పు లేదు గాని , అలాగే ఉండాలనే ‘ ఆంక్షల జీవితాన్ని ‘ డిజైన్ చేయడం సరి అయిన దృక్పథం కాదు. శ్రీ శ్రీ – సినిమా రచనలు చేసాడు అని విమర్శిస్తే  మనమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ? సినిమాలు అసలు ఉండవద్దనా , సినిమాలు ఉన్నా పర్లేదు శ్రీ శ్రీ మాత్రం రచనలు చేయవద్దనా ? ఈ రకమైన విమర్శ మనలో ప్రతి ఒక్కరు అసలు ఎటువంటి సినిమాలూ ఉండకూడదు , మనం ( మన లాంటి మధ్య తరగతి ప్రజలు )  కూడా ఎటువంటి ‘ బాహుబలి సినిమాలకు ‘ టెంప్ట్ కాకూడదు అనుకున్నప్పుడు సద్విమర్ష అవుతుంది. ఈ డిబేట్ – పక్కన పెడితే – రోహిణీ ప్రసాద్ గారు ఖచ్చితంగా  ‘ సైంటిఫిక్ టెంపర్మెంట్ ‘ కలిగిన నిజాయితీ శాస్త్రవేత్తగానే జీవితాంతం ఉన్నాడు.

వరూధిని అమ్మ , కొకు గారి రచనల ప్రచురణార్థం , ఎటువంటి ఆర్థిక ప్రతిఫలం ఆశించలేదు. అదే శ్రీ శ్రీ రచనల విషయం లో ఏం జరిగిందో చాలా మందికి తెలుసు.

మన పరిస్థితులు మన    conviction    ను ఛాలెంజ్ చేయొచ్చు కాని దిగజారకుండా నిలబడ్డం లో గొప్ప తనం ఉంది.

కుటుంబ రావు గారికి వరూధిని అమ్మకు – వయసులో చాలా వ్యత్యాసం. కుటుంబ రావు గారు , వరూధిని అమ్మ వాళ్ళ నాన్న అప్పట్లో నడిపే తెలుగు సినిమా పత్రికకు రివ్యూలు రాసే వాళ్ళు.  శ్రీ శ్రీ, ఆరుద్ర, మొక్క పాటి నరసింహ శాస్త్రి – వాళ్ళ కుటుంబ మిత్రులుగా మెదిలే రోజులు. కొ కు గారు, తనకున్న ఆర్థిక పరమైన కారణాల వల్ల , చదువు పూర్తి చేయలేక – బోంబే లో ఎయిర్ ఇండియా టికెటింగ్ క్లర్క్గా పని చేస్తున్న రోజుల్లో, వరూధిని అమ్మ వాళ్ళ నాన్న గారు, కొ కు గారు తమ అమ్మాయికి సరి అయిన జీవన సహచరుడవుతాడని ప్రతిపాదించాక – ఇద్దరి సమ్మతం తో ఏ తంతూ లేకుండా వివాహం జరిగింది.

కొకు గారు దినమంతా రచనల్లో తల మునకలైతే – ఇళ్ళు మేనేజ్ మెంట్ అంతా వరూధిని గారిదే. కోపం తో అందరికీ వడ్డించి ‘ మీ వంట మనిషి భోజనానికి పిలుస్తుంది..రండి  ‘ అంటే ‘ నేను వంట మనిషితోనే  కలిసే భోజనం చేస్తాను ‘ అంటు మనసు తేలిక చేయగలిగే వారు కొకు గారు.

వరూధిని అమ్మ ” ఈ రోజుల్లో డబ్బు పిచ్చిలో పడి మనుష్యులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగ్గి పోయింది ”  అంటారు. చిన్న జ్వరం వచ్చినా తనను వదిలి వెళ్ళని కొకు గారు గురించి తెలుసుకుంటే  – విప్లవ సాహిత్యం లో ఉండే కఠినత్వం , మనుష్యుల విషయం దగ్గర ఎంత సున్నితంగా మారిపోతుందో తెలుస్తుంది.

ఇది ఆయన జీవితాన్ని ‘ గ్లోరిఫై ‘ చేయడం కాదు కాని, కుటుంబం  లో ప్రజాస్వామ్యం ఉండాలనే పేరుతో ‘ యాంత్రికత ‘ ను ప్రవేశ పెడుతున్న ఎంతో మంది ప్రగతి వాదులు ఆలోచించుకోవాల్సిన విషయం.

వరూధిని అమ్మ ‘ ఏంటి ? ఎవరాయన చాగంటి అట ? స్నానం ఎలా చేయాలో చెప్తాడేంటి ? ‘ అని పుష్కర స్నానాలను సున్నితంగా అపహాస్యం చేసినా,  ‘ వీళ్ళు పాపాలు చేయొద్దని చెప్పాలి గాని, స్నానం చేస్తే పాపాలు పోతాయంటారేంటి వెధవలు ?! ‘ అని  విసుక్కున్నా – అ    momentary reaction   ఆమె కుటుంబం నమ్ముకుంటూ వచ్చిన విలువల ప్రతిబింబమే.

చలం , వాళ్ళ అక్క ఇంటి కెల్తే ‘ మాల మాదిగల ఇంట్లో తిరిగొచ్చాడని ‘ వరండాలోనే విస్తరి వేసేది. వరూధిని అమ్మ – ఇది ప్రత్యక్షంగా చూసింది.  ప్రజాస్వామిక వాదుల జీవితాలు ఆకాశం నుండి రాలి పడవు. వీళ్ళు నలుగురి మధ్య ఉండి జీవనం నడుపుతూ ఒక ‘ ప్రజల గొంతు ‘ వినిపించాలి. అందుకు కుటుంబం ప్రతిబంధకం అవుతుంది, కుటుంబం లో వ్యక్తుల   aspirations   కూడా ప్రతిబంధకం అవుతుంది. వీరి చుట్టూ ‘  utopian world  ‘ ను విమర్శకులు కట్టి,  positivity     ని తక్కువ చేస్తూ చూడ్డం లో సరి అయిన ప్రమాణం లేదు.

ఒక సారి కొకు గారి మీద , మా రంగ నాయకమ్మ గారు యథావిధిగా ఏదో తనకు తెలిసిన విమర్శ రాసారు. అది వరూధిని అమ్మ చదివింది. అది తప్పుల తడక అని కూడా తెలుసు. రంగ నాయకమ్మ తో కుటుంబ మితృత్వం  ఉన్నందుకు ఆ మాత్రం ఇబ్బంది పడక తప్పదు మరి. ఆ వ్యాసం రాసాక – చాలా రోజుల వరకు , రెగ్యులర్ గా ఫోన్ చేసి పలకరించే రంగనాయకమ్మ వద్ద నుండి వరూధిని అమ్మకు ఫోన్ లేదు. ఒక రోజు అకస్మాత్తుగా ఆమె నుండి ఫోన్ వచ్చింది.

వరూధిని అమ్మ ఫోన్ లో యథాలాపంగానే పలకరించాక, ఉండబట్టలేక రంగ నాయకమ్మ ” మీకు చూపు సరిగ్గానే ఉందా ? ”  అని ఆడిగింది.

వరూధిని గారు ” ఆ ..పర్లేదు …పత్రికలు చదువ గలుగుతున్నాను ”  అని సమాధానం ఇచ్చింది ఆమె ఎందుకు వాకబు చేస్తుందో తెలిసి.

” మరి నే కుటుంబ రావు గారి గురించి వ్యాసం రాసాను చదవలేదా ? ” అని ప్రశ్నించింది.

వరూధిని అమ్మ ఏ మాత్రం హావ భావాలు లేకుండా ” ఆయన పబ్లిక్  పర్సనాలిటి. ఎందరో ఆయన్ను విమర్శిస్తుంటారు. పొగుడ్తుంటారు. అవన్నీ నేనెక్కడ పట్టించుకోను ? ” అన్నది.

అటు పక్క ఫోనులో ఎక్స్ ప్రెషన్  ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం. ప్రజల గురించి రాసిన రచనల మీద – ఇక రాసిన వ్యక్తికి ఏం హక్కు ఉంటుంది ?  అదొ ప్రజల ఆస్తిగా మిగిలాక ,  రచయితగా ఆ వ్యక్తి ఏం చేయాలి ఇక ? వ్యక్తులను, రచనలను వేరు చేసి తమపై వస్తున్న విమర్శ ను స్వీకరించాలని ఈ రోజుల్లో ఎంత మంది ప్రగతి వాద రచయితలు తెలుసుకున్నారు ? తమ రచనకు ఎటువంటి విమర్శ రాకుండా, పూర్తి స్థాయిలో , ఫుల్ టైం బేసిస్ మీద – లాబీయింగ్ – చేస్తున్న రచయితలను మనమెంత మందిని చూడ్డం లేదు ?!

ఇదే విషయమై – వరూధిని అమ్మను తట్టి చూస్తే అంటుంది ” ఈ రోజుల్లో రచయితలకు వ్యక్తిగత ప్రతిష్ట యావ ఎక్కువయ్యింది. ఒకరి భుజాల మీద ఇంకొకరు శాలువాలు కప్పుకుందామనుకుంటారు. ఇదంతా ఒక రొచ్చు లా అయ్యింది ” అంటారు. తనను – కొకు గారి గురించి ఏవన్నా చెప్పమని టీ వీ ఛానల్స్, పత్రికల వాళ్ళు ఎగబడి ఆహ్వానిస్తున్నప్పుడు తను వాళ్ళతో అన్న మాట – ” కుటుంబ రావు గారి రచనలు నేనెంత చదివానో మీరూ అంతే చదివారు. ఇక వ్యక్తిగతమైన విషయాలు , మీతో  నేను పంచుకోవాలనుకుంటే మీరు అర్థం చేసుకోవాల్సింది – అది నా పర్సనల్ వ్యవహారం. పది మందికి చెప్పుకుని పేరు తెచ్చుకునే వ్యవహారం కాదు ” అని.

‘ అమ్మా ! మీరు ఇంత మంది సాహితీ వేత్తల మధ్య పెరిగారు . మీరెందుకు రచనలు చేయలేదు ? ‘ అని ప్రశ్నిస్తే వరూధిని అమ్మ ” కుటుంబ రావు గారు రాసిన సాహిత్యం చదివి విమర్శించాల్సింది మొదట నేనే కదా ? నేను బాగో లేదన్న కథను ఆయన వెంటనే పారేసే వారు. మార్పులు కూడా చేసే ప్రయత్నం చేసే వాళ్ళు కారు. ” అంటారు.

పేరు ప్రతిష్టల  గొడవలో కొట్టుకు పోతున్న ఈ తరం ప్రగతి వాద రచయితలు –   identity crisis    అన్నది లేకుండా బతకడం ఒక ఆచరణే కాదు, మనం నమ్ముకున్న కొన్ని సామాజిక విశ్వాసాలపై ఉన్న     confidence  , మన రచనల్లో అంతర్లీనంగా మనం ప్రకటించిన ఆత్మ విశ్వాసం  అన్న విషయం తెలుసుకోవాలి.

ఈ రోజుకూ రాజకీయ వార్తలను శ్రద్ధగా చదవడం , అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం ఆమెకు షరా మామూలుగానే ఉంది. ” అలా కాదు..చంద్ర బాబు, వేరే దేశాలకెళ్ళి, మన దేశం లో వ్యాపారం చేయమని అడుగుతున్నాడేంటి ? మరి మన వ్యాపారస్తులు ఏమైపోతారు ? ” అమాయకంగా అడిగినట్టు ఉంటుంది కాని, ఈ దేశం లో పాతుకుపోతున్న సామ్రాజ్య వాద వ్య్వస్థ పై ఇంకా ఆ ఆక్రోషం ఉంది ఆమెలో. ” మనం సింగ పూర్ లా మారడం ఏంటి ? మనం మన దేశం లా ఉండాలి కాని ” అంటుంది. ” విప్లవం రావ డానికి ఇంకా చాలా కాలం పడుతుందనుకోండి. అంత వరకు వీటిని ఇలానే భరించాలి మనం ‘ అని లీలగా  నిరాశ  పడుతుంది.

కుటుంబ రావు గారు ఎప్పుడూ అవసరానికి మించిన ధనం ఉండ రాదు అని నమ్మే వారు. ఆయనకు నచ్చేది    classical music  .  కచేరీ ఎక్కడ జరిగినా ఫేమిలీ మొత్తం వెళ్ళే వాళ్ళు. అందుకేనేమో రోహిణీ ప్రసాద్ గారికి కు చిన్నప్పటి నుండి సంగీతాభిమానం. నిజానికి కొ కు గారికి ఫేమిలీ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ. కూరగాయలైనా, ఇంట్లో ఏవన్నా కొనాలన్నా అంతా వరూధిని అమ్మనే చూసుకునేది.  ఆయన సమయం మొత్తం రచనల్లోనే గడిచిపోయింది. చంద మామ ను అందంగా తీర్చి దిద్దడం లో కుటుంబ రావు గారి పాత్ర ఎనలేనిదనే చెప్పుకోవాలి.

చలసాని గారి లాంటి ఆప్త మితృలను కొల్పోతుంటే – వరూధిని అమ్మ కళ్ళల్లో పటుత్వం సడలదు గాని, బాధ ఒక గీతలా గీసినట్టు ఉంటుంది.

ఎప్పుడన్నా వృద్ధాప్యం వలన మనసు బలహీనమైనప్పుడు , వరూధిని అమ్మ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటే – ఆమె ఆప్తులు ‘ నీవు మర్రి చెట్టు నీడలో పెరిగావు. నీవు ఇలా కన్నీళ్ళు పెట్ట రాదు  ‘ అని తనను  ఓదార్చుతారని చెప్తుంది.  నేను ఆమెలో బలహీనతను చూడ్డం ఇష్టం లేకనో, ఆమెలో బలం ఎలాగన్నా అలాగే కొన సాగాలనే   దురాశ వల్లనో  ” అంతే కదమ్మా ? ” అనబోతాను కాని ” అందరూ మామూలు మనుష్యులే. అందులో విలక్షణత ప్రతి క్షణం, ప్రతి ఒక్కరికీ సాధ్య పడదు  కదా !  ” అని సర్దుకుంటాను.

*

రక్తంతో వెల్ల వేసుకుంటున్న గోడలు !!!

 

పి.  విక్టర్ విజయ్ కుమార్ 

 

There is no exaggeration in saying that the entire destination of the country depends upon its intellectual class. If the intellectual class is honest and independent, it can be trusted to take the initiative and give a proper lead when a crisis arises. It is true that the intellect by itself is no virtue. It is only a means and the use of a means depends upon the ends which an intellectual person pursues. – DR. B R AMBEDKAR

కన్నడ శైవ భక్తి ఉద్యమం కు ఆద్యుడు బసవేశ్వరుడు.  బ్రాహ్మణిక పెత్తందారీ తనానికి తిరుగుబాటు ఉద్యమంగా మొదలయ్యింది. స్వంత ఆస్తి లేని సంస్కృతి కలిగిన ‘ జంగమ ‘ సాధు వ్యవస్థకు బసవేశ్వరుడు  నాంది పలికాడు.  దేవలయాలను, బ్రాహ్మణ పెత్తనాన్ని నిరసించాడు. స్త్రీ, కుల అంతరాలు లేకుండా శివుడి లింగాన్ని ధరించవచ్చు అనే సంస్కృతిని  బసవేశ్వరుడు   ప్రచారం చేసాడు. ( ఆ తర్వాత శైవ భక్తి ఉద్యమం నీరు గారి,  లింగాయతులు కుల వ్యవస్థ లో ఇమిడిపోయారు.  అది వేరుగా చర్చించవలసిన విషయం )  ఈ సంస్కృతికి ప్రాతిపదికగా ఉన్న ‘ వచన సాహిత్యం ‘  పై చేసిన పరిశొధనకు  కేంద్ర సాహిత్య అకాడమీ ‘ అవార్డ్ అందుకున్న మేధావి మల్లేశప్ప కాల్బర్గి.  విగ్రహ పూజను వ్యతిరేకించడమే కాక, బసవేశ్వరుడి అనుచర కులమైన లింగాయతుల అస్తిత్వానికి సంబంధించిన కొన్ని వివాదస్పదమైన ప్రశ్నలు లేవనెత్తాడు.  2014 లో ,   Anti-Superstition Bill   ను సమర్థిస్తూ ‘ హిందూ విగ్రహ రాళ్ళ  మీద ఒంటేలు పోస్తే శాపం తగలదు ‘ అన్న ఙానపీఠ అవార్డ్ గ్రహీత అనంత  మూర్తి రాతలను సమర్థిస్తూ ఉపన్యాసం ఇవ్వడం హిందూ ఛాందస వాదులకు కంటగింపు అవ్వడం, ఫలితంగా అతి హేయంగా హత్య కావించబడ్డం జరిగింది. ఈ చిన్న ఉపోద్ఘాతం , మనకందరికీ తెలిసిన వార్తాంశాలే. కలబర్గి  హత్య మరో సారి లేవనెత్తిన ప్రశ్నలు – ఉద్యమ కారుల మీదనే కాక బ్రాహ్మణియ వ్యతిరేక భావజాలాన్ని సమర్థించే ఆలోచనల కలిగిన మేధో వర్గం పై కూడా ఇటువంటి నిష్కారుణ్యమైన చర్యలు ఎందుకు ?  ప్రగతివాద అలోచనా విధానం బ్రాహ్మణియ వ్యవస్థపై ఎందుకంత చెంప పెట్టుగా ఉంటుంది ? ఈ అసహనం ఎందుకంత భరించలేనంతగా ఉండాలి ?

మన విద్యా వ్యవస్థ  –   Unity in diversity  కలిగున్న దేశం అని చిన్నప్పట్నుంచీ మనకు నేర్పించింది. ఇది వాస్తవం లో   ‘ Geographical unity ‘   గానే మిగిలి పోయింది తప్ప సాంస్కృతిక సహనం లేకుండా ,   Freedom of Speech  , ప్రాథమిక హక్కు స్థాయిని కోల్పోయి, కేవలం   selective right  స్థాయికి దిగజార్చబడ్డది.  మన దేశం లో ఉన్న సంస్కృతులు, సాంప్రదాయాలు – ప్రపంచం మొత్తం మీద ఏ దేశం లోనూ ఉండవు. సామాజిక అభివృద్ధి అంటే – ప్రతి వరుసలో ఉన్న సంస్కృతిక సముదాయం కు సంబందించిన అభివృద్ధి అన్నది ఇంకా మన ఆర్థిక వ్యవస్థలో   sink   అవ్వలేదు. మన ఆర్థిక పురోగతికి – ‘ మెజారిటేరియనిజం ‘  అన్నది ప్రధాన ప్రగతి వ్యతిరేక సంస్కృతి. ఈ ‘ మెజారిటేరియనిజం  కు ప్రధాన ఉనాది ‘ బ్రాహ్మణ హిందూ ఛాందస వాదం ‘.  మన దేశం లొ కుల వ్యవస్థ ఏర్పాటు లోనే – అసహన ప్రాతిపదిక ఉంది. అధికార వర్గం లో ఉన్న అగ్ర కుల వ్యవస్థ ,  తమ ‘ సాంస్కృతిక సైద్ధాంతికత ‘ ను అణువణువునా కాపాడుకునే క్రమం లో డెవెలప్ చేసుకున్న ‘ అసహనం ‘ ఇది.

నిజానికి ‘ అసహనం ‘ అన్న అంశం ప్రజాస్వామిక దృక్పథం లో ‘  sense of belongingness  ” ను తెలియ జేస్తుంది. అయితే ఇదే ‘  sense of belongingness  ‘ అధికార దాహం రుచి చూసినప్పుడు   perversion  వస్తుంది .

ఆర్థిక వ్యవస్థ ఏర్పడే క్రమం లో సంస్కృతి ఏర్పడుతుంది. అదే సంస్కృతి క్రమేనా, అధికార వర్గ రాజకీయాలను బట్టి,  ఆర్థిక వ్యవస్థ ప్రగతిని నిరోధించే స్థాయికెల్తుంది. ముఖ్యంగా   equitable development   గురించి మాట్లాడినప్పుడు ఈ అధికార సంస్కృతి విరుద్ధ స్వభావాన్ని పులుముకుంటుంది.

మన ప్రజల్లో ఎంత విభిన్నత ఉన్నా, ఒక ‘  commonality  ‘ ఉంది. అందుకే ఇన్నాళ్ళు ఈ దేశం లో ఒకే చోట బతుకుతున్నాం. ఐతే వ్యవస్థలో   Commonality   ని గౌరవించాలంటే ‘ స్వేఛ్చ ‘ ఉండాలి. ఆ స్వేచ్చ హక్కు దారునికి కలుగజేసే స్వయంప్రతిపత్తి వలన  సృజనాత్మకత బలపడుతుంది. సృజనాత్మకతకున్న గుణం ఏంటంటే – అది  constant change   కోరుకుంటుంది. బండరాయిగా మిగిలిపోయిన మతానికి  ఋఇగిదిత్య్  అన్న లక్షణం దాని విలువల వ్యవస్థను గట్టిగా కాపాడే క్రమం లో ఏర్పడుతుంది. ఇది ‘ సృజనాత్మక ‘ ఆలోచనను ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. అందుకే మతాలను ఉద్ధరిస్తూ ముందుకు వచ్చిన ‘ భక్తి ఉద్యమాలు ‘ సృజనాత్మకతను సహించలేక వీగిపోయి చివరికి తిరిగి    establish   అయిన మతం లోనే భిన్న రూపాన్ని సంతరించుకుని మిగిలిపోవడం చారిత్రకంగా మనం గమనిస్తున్నాము. పాఠకుల అవగాహన కొరకు క్లుప్తంగా , చిన్న స్కిమాటిక్ రూపం లో కింద ఇవ్వడం జరిగింది.

Commonality ===> స్వేచ్చ ====>హక్కులు===> స్వయంప్రతిపత్తి ===> సృజనాత్మకత ===>  change

ఐతే – ఇంత తీవ్ర స్థాయి అసహనం మన దేశం లో ఎందుకుంది ? ఈ ‘ అసహనం ‘ మత వాద దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా ఇస్లామిక దేశాల్లో, కేథలిక్ ఆర్థోడక్సీ ఉన్న దేశాల్లో చూస్తున్నాము. ఆ మతాల బూచిని చూపి ఇక్కడ ‘ హిందూ బ్రాహ్మణ వాదులు ‘ మన దేశం లో మనమేదో చాలా ఉదారంగా ఉన్నట్టు పోజు పెడుతుంటారు. ఈ దేశం లో మనకున్న స్వాతంత్ర్యం –   negotiate   చేసుకుని సంపాదించుకున్నది అన్న విషయం ప్రతి అగ్రకుల మనువాది, హిందూ ఛాందస వాది చాలా సౌకర్యంగా మర్చి పోతారు.   Two nations theory   ప్రతిపాదించాక, బ్రిటిష్ ను వెళ్ళగొట్టాడం  లో మాకు ఉపయోగపడండి , మనమందరం లౌకిక రాజ్యం ఏర్పరుచుకుందాం అన్న కాంగ్రెస్ , గాంధీ సమావేశ ప్రకటనలు ఎవరికీ గుర్తు రావు. ‘ కమ్యూనల్ అవార్డ్ ‘ ప్రకటించాక, అంబేద్కర్ ప్రతిపాదించిన అద్భుతమైన  separate electorates  ప్రతిపాదనను కు ప్రత్యమ్నాయంగా  తో   negotiate   చేసి,   Poloitical reservations   కు కుదించారని  మర్చిపోయి – ముస్లిములు , దళితులు మా భిక్ష ద్వారానే ఇక్కడ బతుకుతున్నారు అన్న విషయాన్ని ప్రాచుర్యం చేస్తారు. అప్పట్లో విసిగి వేసారిన అంబేద్కర్ ఈ మోస పూరితమైన , వెన్ను పోటు పొడవగలిగిన బ్రాహ్మణీయాన్ని నిరసించి ‘ అసలు మాకు ప్రత్యేక గ్రామాలు ఇవ్వండి. మమ్మల్ని మీరు లోపలికి తీసుకుని మమ్మల్ని ఉద్దరిస్తున్న పోజు మీకెందుకు ? ‘ అన్న ప్రతి పాదన కూడా చేసాడు.

ఉద్యమం చేస్తున్న ఉద్యమ కారునికి కి   aggression   ఉంటుంది. ఆలోచనలను ప్రభావితం చేయదల్చుకున్న మేధావికి   intelluctual conviction   ఉంటుంది. ఈ బ్రాహ్మణియ అసహనత   aggression   ను  intelluctual  conviction    ను ఒకే స్థాయిలో పోల్చి చూడ్డం లో ఉన్న మర్మం మనం జాగర్తగా గమనించాలి.

హిందూ వ్యవస్థ చాలా పురాతన వ్యవస్థ. ఈ వ్యవస్థ మొదట్లో కొంత పురోగతి స్వభావాన్ని కలిగి ఉండడం కూడా పొడిగించబడిన దీని మనుగడకు ఒక చిన్న కారణం అవ్వచ్చు. అయితే చాలా బలహీనమైన మనువాద భావ జాలం పైన స్థిర పడి, ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కూడా – అదే షేప్ ను నిలుపదల్చుకుంది  ( ఎన్ని వ్యాయామాలు చేసినా లేని కండలు రావిక , వట్టి వాపులు మిగలడం తప్ప ) . ఇంత పురాతన హిందూ వ్యవస్థ గోడలు బీటలు వారుతున్నాయి. ఈ సందర్భం లో – దీని అస్తిత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తేనే  ఈ గోడకు ఇంకా నెర్రలు పాకుతాయి.  ( సాధారణంగానే ప్రతి మత వ్యవస్థకు ఈ లక్షణం ఉంటుంది. అయితే పూర్తిగా premitive society stage  నుండి బతుకుతున్న,  హిందుత్వం ఔట్ డేట్ అయిపోయిన మతం కావడంతో కొన్ని పిరికి ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. హిట్లర్ సమయం లో , ఈ దాడి ఇంకో అడుగు ముందుకేసి – నాజీ  సంస్కృతిని  నిలబెట్టుకోవడానికి గోబెల్స్ ను నియమించింది. నాకు తెలిసి – ఇదో మోసపూరితమైన సంస్కృతిక వ్యవహారమైనా హిట్లర్ ఆ మేరకు బూటకమైనా సరే, ఒక ప్రజాస్వామిక రూపాన్ని,  దాన్ని బలాన్ని ఆ మేరకు నమ్మాడు. మన ఖర్మ ఏంటంటే – ఇక్కడ అదే మత ఛాందస వాదం, పచ్చి నెత్తురు తాగడం ద్వారానే మార్పు కొనాలనుకుంటుంది ).

మోదీ వచ్చాక ,   political participation of varied culutures   అన్న విషయమే పక్క దారి పట్టి, ప్రధాన విద్యా, ప్రణాళికా సంస్థల్లో ‘ అసహన సిద్ధాంతాన్ని ‘ ప్రతిపాదించే  థర్డ్ క్లాస్ మేధావులనే ఎన్నుకుని మరీ నియమించడం జరుగుతుంది. కాల్బర్గి లాంటి మేధావులను హత మార్చడం జరుగుతుంది.

నిజానికి ‘ వైరుధ్య ఆలోచన ల ‘ సమూహం మనలో సృజనాత్మకతను వృద్ధి చేస్తాయి. భిన్న కోణాల్లో మనుష్యులను వ్యవస్థను ఎలా అర్థం చేసుకోవాలో తెలియ జేస్తాయి. నిజానికి, మనిషికి రాజకీయ వ్యవస్థ అవసరం కాదు సౌకర్యం. భిన్న అవసరాలు, భిన్న దృక్పథాలు ఉన్న కోట్ల మనుష్యులు – కలిసి సుఖంగా బతకాలనుకున్నప్పుడు , అందరూ ఒక  క్రమం లో ముందుకెళ్ళడానికి , రాజకీయ వ్యవస్థ ఏర్పడింది. మనింట్లో , మనం సంపాయించి వంట చేసుకోడానికి – రాజకీయ వ్యవస్థ ఎందుకు ? మన భర్తలతో , పెళ్ళాలతో కాపురం చేయడానికి రాజకీయ వ్యవస్థ ఎందుకు ? ప్రతి వ్యక్తి ఒక భిన్నమైన  entity  .  ఈ సృష్టిలో ఉన్న గొప్ప తనమే ఇది. ” విభిన్నత ” ఈ సృష్టి ప్రసాదించిన వరం.

మన ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళాలంటే – మనలో ప్రతి ఒక్కరు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ, ఒక డీసెంట్ జీవనాన్ని సాగించాలంటే  – ఆర్థికావకాశాలు  సమానంగా సృష్టించుకోవడం అవసరం. ఇంత వరకు అధికార వాసన చూడని సరి కొత్త శ్రేణులను , ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడం ముఖ్యము. కేవలం ఒకే  గాటికి కట్టినట్టు ప్రయాణించే , ఆర్థిక వ్యవస్థ మనకు   genocides   మాత్రమే మిగులుస్తుంది. ఇందులో భాగంగా – కాల్బర్గి  లాంటి మేధావులు ప్రాణలు వదలాల్సి వస్తుంది. తస్లీమా నస్రీన్ లాంటి మహిళా మేధావులు – దేశం వదిలి బతకాల్సి ఉంటుంది. పెరుమాల్ మురుగన్ లాంటి రచయితలు కలం వదిలేయాల్సి వస్తుంది. సాయిబాబా లాంటి ప్రొఫెసర్లు  physically challenged  అయినా జైళ్ళల్లో మగ్గాల్సి వస్తుంది.  విప్లవ రచయితలు, కళాకారులు  కుట్ర కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అరిస్టాటిల్ అంటాడు ‘  man is a political animal  ‘  అని. మనిషి తన సౌకర్యం కోసం రాజకీయ వ్యవస్థ ను ఎంతగా కాంక్షిస్తున్నాడో, ఎంతగా మమేకమై బతుకుతున్నాడో  తెలపడానికి ఈ మాట అన్నా , అదే రాజకీయ వ్యవస్థలో జంతువులు చేరాక – ఇక సమాజం లో మనుష్యులకు తావేది ?

 

(  PS:  ఈ వ్యాసం లో చాలా చోట్ల ఇంగ్లీషు పదాలు వాడాల్సి వచ్చింది. ఇందుకు తగిన తెలుగు పదాలు లేవని భావించబట్టే ఇలా వాడడం జరిగింది. లేదంటే సంస్కృత పదాలు వాడడం వలన కన్ ఫ్యూ జన్  పెరుగుతుంది తప్ప లాభం ఉండడం లేదు.   పాఠకులు అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను.)

 

ఆ బ్రెడ్డుకు మరీ ఇంత బటరేంది సారూ !

 

పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

సోమవారం పొదున్నే బ్రేక్ ఫాస్ట్ కోసం బ్రెడ్ కు బటర్ రాసుకుంటూ ‘ వివిధ ‘ పేజీలు తిప్పాను. ‘ ఇదేం ఆనందం సారూ ! ‘ అని రాసిన ఆర్టికల్ లో నా ఆర్టికల్ ప్రస్తావిస్తూ ఒక రంగనాయకమ్మ అభిమాని రాసిన వ్యాసం చదివాక, ముచ్చటేసింది. బ్రెడ్ నోట్లో పెట్టుకుని నముల్తూ ఉంటే, చదువుతూ బటర్ ఎక్కువ రాసానేమో, వెగటనిపించి పక్కన పెట్టి, ఇంకో బ్రెడ్ మీద ‘ జాం’ రాసుకుని తినేసాను. ఇక ఈ వ్యాసానికి ప్రత్యుత్తరం రాయాలనిపించి ఇదుగో –

‘ వసంత కన్నాభిరాన్ గారు వ్యక్తిగతంగా రంగ నాయకమ్మను విమర్శిస్తూ రాసిన కవిత గురించి మొదట మాట్లాడాలి, ఆ అప్రోచ్ తీవ్రంగా వ్యతిరేకించదగ్గది ‘ అనే పాయింట్ ప్రధానంగా కనిపిస్తుంది ఈ వ్యాసం లో. వ్యక్తి ప్రతిపాదించిన విషయాన్ని వదిలి వ్యక్తిగత విమర్శ చేయడం అన్నది తప్పుడు నడక అనే వాదన గురించి ఈ సాహితీ లోకం లో ఇప్పుడు మాట్లాడ్డం పదో తరగతి కుర్రోడు రెండో ఎక్కం నేర్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి – ఈ రెండో ఎక్కం వ్యవహారం మాట్లాడే ముందు – 2010 సంగతి మాట ఒకటి చూద్దాం. ఆజాద్, హేమచంద్ర పాండే ఎన్ కౌంటర్ జరిగాక, అంత్య క్రియల సందర్భంగా వర వర రావు గారు చదివిన మెసేజ్ ను విమర్శిస్తూ రంగ నాయకమ్మ ఆంధ్ర జ్యోతి లో ‘ ఒకే కలం….’ అనే వ్యాసం లో ఇలా రాసింది

” మరి, నిషేధిత పార్టీ తో ఎంతో దగ్గిర సంబంధం లో ఉన్నట్టు ఆధారాలతో సహా కనబడుతోన్నా, వర వర రావు గారి మీద పోలీసుల దృష్టి పడలేదంటే , ఆ వింతకి ఏదో ప్రత్యేక కారణం ఉండి ఉండదా ? “. వాళ్ళ సంస్థ నిర్మాణం లో భాగం కాకుండా దూకుడుగా ‘ వర వర రావు కోవర్ట్ ‘ అనే విషయాన్ని సజెస్ట్ చేస్తూ రాయడం , ఇది వ్యక్తిగత విమర్శగా రంగ నాయకమ్మ అభిమానులకెందుకు తట్ట లేదు ? ఇది కేవలం వ్యక్తి గత విమర్శ అని సర్దుకు పోవడానికి కూడా కుదరని ఘాతుకమైన విమర్శ !! అంతే కాదు – ఈ స్థాయిలో విమర్శించబడ్డ వ్యక్తి రాసిన వ్యాసం పరిశీలనకు ఎలా తగిందో కూడా ఎవరికీ క్లూ లేదు.

ఒక సిప్ టీ తాగేసా. చక్కర సరిగ్గా సరిపోయింది.

ఈ ఆర్టికల్ రాసిన అభిమానిలో ఒక అమాయకత్వం ఉంది. మార్క్సిస్ట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ – మధ్య తరగతిని ఎలా కన్ ఫ్యూజ్  చేయొచ్చో తెలియజేయాలి.

‘ మార్క్స్ తో  పాటు  అంబేద్కర్ కూడా  కావాలి ‘ అని విప్లవ సంస్థలు కూడా గ్రహించి ఒకడుగు ముందుకెళ్ళి, దళిత దృక్పథం తో సంస్థలను స్థాపించడం, దళిత పోరాటాలకు వెనుదన్నుగా నిలవడం జరుగుతున్న పరిస్థితి వచ్చాక మధ్యలో కలగ జేసుకుని , ‘ అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి ‘ అనడం లో కుట్ర తేట తెల్లంగా కనిపిస్తుంది. దీనికో భీభత్సమైన సైద్ధాంతిక  చర్చ  ఏముంది ? అంబేద్కర్ సాధించిన వృద్ధి ‘ వ్యక్తి కి సంబంధించిన ది మాత్రమే . వ్యవస్థకు సంబంధించింది కాదు ‘ అనే  బోలు వాదన – ఎన్నో ఏళ్ళుగా కొరవడిన దళిత ఉద్యమాలను వాటి మహోన్నత కుల నిర్మూలన ఆశయాన్ని కించ పరచడం లో భాగం ఎందుకవ్వదో తెలుసుకోలేని పరిస్థితిలో రంగనాయకమ్మ అభిమానం చేరుకుంది. దీనికి గొప్ప సైద్ధాంతిక చర్చ అవసరం లేదు అన్న విషయాన్ని ఇంకా గమనించుకోలేని సాధారణ ఆలోచన కూడా ఈ అభిమానం లో ఒక లేమి.

టి మరో సిప్ చేసా. చిక్కగా ఉంది.

ఇక రంగనాయకమ్మ ప్రజలను, అభిమానులను – చైతన్య వంతం చేసిన విధానం గురించి కృతఙతతో ఉండడం అనే కారణం తో ఆమె తప్పు రాసినా  అర్థం చేసుకోవాలనే ఒక లిబరల్ దృక్పథం  ను ప్రగాఢంగా వాంఛించడం. నిజమే ! రంగ నాయకమ్మ మార్క్సిజం కు సమబంధించి మంచి ‘ గైడ్స్ ‘ రాసింది. అది ఎంత మంచో పక్కన పెడితే – అదే లాజిక్ తీసుకుంటే – ఈ దేశం లో ప్రభుత్వం ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని, ప్రభుత్వం తయారు చేసిన సిలబస్ చదివి పైకొస్తున్న ప్రజలు ఇంక ఎవరూ ప్రభుత్వాన్ని విమర్శించరాదు. ఎందుకంటే విద్య ప్రభుత్వ పుణ్యమే కాబట్టి.

ఇక ఆమె చెప్తున్నదే మార్క్సిజమా అన్నది మౌళికమైన ప్రశ్న ! ఆమె చెప్తున్న మార్క్సిజం ఆమె వర్షన్ మాత్రమే. గతి తార్కిక భౌతిక వాదాన్ని వదిలేసి , ఆదనపు విలువ సిద్ధాంతాన్ని మాత్రమే లెక్కలేసి  వివరించడం పూర్తి మార్క్సిజం కాదు. అది నిజం మార్క్సిజం కాదు. దీనికి తోడు   – మార్క్సిజం ను అన్వయించాలసిన సమస్యలకు  ‘ బూర్జువా ‘ టేగ్ తగిలించేస్తే , అది మార్క్సిస్టు  విశ్లేషణ కాదు.

నాకు మార్క్స్ అంటే ఇష్టం, అంబేద్కర్ అంటే ఇష్టం, చలసాని ప్రసాద్ అంటే ఇష్టం –  కానీ రంగనాయకమ్మ చెప్పిందాని లో గూఢం అర్థం చేసుకోను అంటే – ఇదేదో పప్పులో వెల్లుల్లి వేస్తే ఇష్టం, పోపు పెడ్తే ఇష్టం అన్నట్టు మాత్రమే ఉంటుంది.

‘ బూర్జువా డెమొక్రసీ ‘ పరిధికి మించి అంబేద్కర్ ఆలోచనలు ఉపయోగ పడ్తాయా ‘ అనే ప్రశ్న ఈ వ్యాసం లో ఎక్కడో తగుల్తుంది. ఈ బూర్జువా పదం ఇదేదో దండకం అయిపోయిందన్నది ఇక్కడ స్పష్టం. దళితులు సమానత్వాన్ని కోరుకోవడం – ఒక ప్రజాస్వామిక డిమాండ్.  సమానత్వం వచ్చాక , ఎటువంటి విప్లవం తీసుకోవాలో అప్పుడు అది ‘ బూర్జువా సమస్య ‘ అవుతుందో కాదో తేల్చొచ్చు. ఇదే పేరుతో దళితులకు సమానత్వం సాధించడం సెకండరీ అని చిత్రీకరించిన బ్రాహ్మణిక కుట్రలు ఈ రోజో రేపో బౌన్స్ అవ్వక మానవు.

టి కప్పు జాగర్తగా పట్టుకుని సిప్ చేసా. వేడిగా ఉంది టీ.

ఈ వ్యాసం లో చాలా విచిత్రంగా – రంగ నాయకమ్మ రాసిన  పుంఖాను పుంఖాలైన వ్యాసాలకు బలవంతంగా ఒక సింపతీ తీసుకురావాలనుకోవడం. అదే సమర్థనీయం ఐతే – కుట్ర కేసులకు వ్యక్తి గత జీవితాలను ఒడ్డిన వి ర సం కు ఎంత సిపతీ కావాలి అన్న ఆలోచన రంగనాయకమ్మ అభిమానులకు ఎందుకు తట్టదో తెలుసుకోలేనంత ‘ దూరా ‘ భిమానం ‘ అయ్యింది. మళ్ళీ అదో ప్రశ్న – ‘  ఏం ఈ పుస్తకాలు  మార్క్సిస్ట్ – లెనినిస్ట్ పార్టీలు తీసుకు రావచ్చుగా ‘  అని ? …  ఏం ఎందుకు తీసుకు రావాలి ? – ఒరిజినల్ మార్క్స్ పుస్తకాలు చదవడానికి,  చదివే వాళ్ళకు బద్దకమైతే – అది భగ భగ మండి పోతున్న ‘ విప్లవ సమస్యా ‘ ?  అలా పుస్తకాలు తీసుకు వస్తేనే సిన్సియారిటీ నా ? ఇది విప్లవోద్యమమా లేపోతే ‘ పబ్లికేషన్స్ ఉద్యమమా ‘ ? ఇలా పుస్తకాలు ప్రచురించే బెంచ్ మార్క్ ఏంటో ఎన్ని టీ కప్పులు ఖాళీ చేసినా తెలీదు.

ఇంకో సిప్ కొట్టా. నాలుక పై వేడిగా టీ దిగుతుంది.

అలాగే – శ్రీ శ్రీ విషయం లో వర వర రావు గారి వ్యాసం శీర్షిక భాగం లో ” ఎటువంటి రాజకీయ , సాంస్కృతిక సందర్భం లోనైనా శ్రీ శ్రీని ముందు బెట్టి రచయితలను కలుపుకు  రావచ్చనేది చలసాని అవగాహన ” అని ఉంటే అందులో ‘ వీర పూజ ‘ ప్రస్తావన ఎక్కడిది ? ఆయన్ని తల మీద పెట్టుకుని ఊరేగినట్టు ఏముంది ? ఇదే శ్రీ శ్రీ,  విరసం నుండి  బహిష్కరించబడ్డప్పుడు మరి ‘ వీర ద్వేషం ‘  కనిపించలేకుండ పోవడం తమాషా. శ్రీ శ్రీ వి రసం లో చేరకున్నా విరసం ఏర్ప్డడేది . అదో చారిత్రక సందర్భం. శ్రీ శ్రీ , మోటార్ సైకిల్ కు పెట్రోల్ అడ్జస్ట్ చేసి ఇవ్వాలనుకున్న ఫస్ట్ కిక్కు మాత్రమే. వెంటనే ఇచ్చే రెండో కిక్కుకు మోటార్ సైకిల్ చచ్చినట్టు కదిలేది. అలాగని మొదటి కిక్కు వృథా చేసుకోకూడాదనుకునే  ‘ ఎంథూసియాజం ‘ మాత్రమే చలసాని ప్రసాద్ గారికి ఉంది  అన్న సాధారణ విషయాన్ని కూడా ఇంత విడమరిచి చెప్పాల్సి వస్తుందేంటో ?!  శ్రీ శ్రీ ని వెంటనే కార్ ఎక్కించకుండా – ఒక రెండు నెలలు ‘ మార్క్స్ ‘ టెస్ట్ పెట్టి తీరుబడిగా ఆహ్వానించి ఉంటే సరిపోయి ఉండేదా ?  పైగా వి ర సం ఏర్పడాలంటే – మొదట ప్రణాళిక రాసుకోవాలట, తర్వాత కార్య వర్గం నిర్మించాలంట –  ఆ తర్వాతే వి ర సం ఏర్పాడలట ! మార్క్సిస్టు ‘ రూలు బుక్కు ‘ ఒకటి తయారు చేయాలిక. ఎప్పుడెలా ప్రవర్తించాలి అని. రంగ నాయకమ్మ అభిమానులు గ్రహించాల్సింది ఏంటంటే – దోపిడీ, అణచివేత కు రూల్స్ లేవు,  మార్క్సిస్ట్ ఫిలాసఫీ రిజిడ్ ఫిలాసఫీ కాదు.  మార్క్సిజం మీద గైడ్స్ రాసి రంగ నాయకమ్మ ఇప్పుడు ‘ విప్లవ రూల్ బుక్కులు ‘ రాస్తుంది.

టీ అయిపోవచ్చింది. దాని ఘాటైన వాసన మనస్సును ఉత్తేజ పరుస్తుంది.

రంగ నాయకమ్మ కలం కు,  పోటు ఇవ్వడం తెలీదు. ఆ పోటుకు అభిమానులనుకున్నట్టు బాధితులెవరూ లేరు. నిజానికి ఇదంతా రంగ నాయకమ్మకు దళిత వాదులు, ప్రజాస్వామిక కాముకులు ఇచ్చే పోటు. అసలు కలం పోటు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే విరసం తో మమేకమైన చెరబండ రాజును చదవాలి. అంతే కాని ఇన్ని సంవత్సరాలు  ఎప్పుడో పాతిన ‘ వృక్షాలను ‘ ‘ మొక్కలను ‘ అమ్ముకుంటూ బతకడం కాదు.

చివరి సిప్ చేసేసా. ఈ రోజు ఏంటో టీ మస్త్ కిక్ ఇచ్చింది ! లేచి బటర్ ఎక్కువ రాసేసుకున్న బ్రెడ్ ను డస్ట్ బిన్ లో పారేసి వచ్చేసా.

 

(PS : This write up absolutely aims to dispassionately convince the masqueraded arguments in the name of Marxism and this comes with an earnest request to all readers to consider the essence of the article with an objective view and feel free to reach the writer in his inbox for any queries at pvvkumar@yahoo.co.uk or on Facebook )

 

 

 

 

 

 

 

 

 

 

రంగనాయకమ్మ లవ్స్ రంగనాయకమ్మ !!

 

పి.  విక్టర్ విజయ్ కుమార్ 

 

రాబర్ట్ నాగేంద్ర పొద్దున్నే దక్షిణ్ ఎక్స్ ప్రెస్ కు దిగాడు.

 

బలవంతంగా నిద్ర లేచి వాడిని పిక్ అప్ చేసుకుని బైక్ మీద రూం కు తీసుకొచ్చాను. దారిలో అడిగాను ” ఏంట్రా కబుర్లు ” అని. వాడు గడ్డం గీక్కోవడం నాకు బైకు అద్దం లో కనిపించింది. ” ఆ స్టుపిడ్ గడ్డం తీసేయొచ్చు కదా ? ” విసుక్కున్నాను. వాడు కిసుక్కుమని ” బిన్ లేడెన్ కు అసలు షేవ్ చేసుకుందామని జీవితం లో ఒక్క సారన్నా టెంప్ట్ అయి ఉంటాడంటావా ? ” అన్నాడు.  ” ఆ… టెంప్ట్ అయి ఉంటాడు ” ఒక క్షణం పాజ్ ఇచ్చి ” ఎప్పుడు అని మాత్రం నీవడగవని నాకు తెలుసు ” అన్నా.

” యు ఆర్ గ్రోయింగ్ అప్ మై బోయ్ ” అని భుజం తట్టాడు నాటకీయంగా.

రూం చేరుకునేంత వరకు ఇద్దరి మొహాల్లో నవ్వు బిగబట్టుకుని ఉన్నాము.

ఇంటికొచ్చి రిఫ్రెష్ అయిపోయి, టిఫిన్ పానాదులయ్యాక కాఫీ చేతులో పెట్టి మళ్ళీ అడిగా ” ఏంట్రా కబుర్లు ” అని. హైదరాబాదుకు ట్రెయిన్ పట్టుకునే ముందు ఆప్పుడెప్పుడో వాడితో మాట్లాడిన ” యూరిన్ పాలిటిక్స్ ” తర్వాత ఇదే మళ్ళీ వాడితో కన్ ఫ్రంటేషన్ కుదిరిన ఛాన్స్.

” చూడ్రా భై …మోడి దుబయ్ లో ‘ కేవలం మాటల ద్వారానే ఏ సమస్య అయినా సాధించుకోవచ్చు ‘ అని అంగానే అక్కడ పొట్టేగాండ్లు విజిల్స్ ఎందిరా నాయ్నా ! అదేమన్నా ఈయన పేటెంట్ పెట్టి కనుక్కున్న ఒక ఫార్ములా నా  లేపోతే అమితాబ్ బచ్చన్ షోలే డైలాగ్ ఆ ? ” అని సిగరెట్ వెలిగించాడు.

” భక్తులు రా…భక్తులు….అంతే ”

” అవున్ రా భై …వీళ్ళకన్నా రంగ నాయకమ్మ భక్తులే బెటర్ ”

వాడి సెటైర్ కు నవ్వేసాను కాని – ” ఒరేయ్ ! రంగనాయకమ్మ లో తప్పులుండొచ్చు కాని మరీ మోడీ తో కంపేర్ చేయడం బాలేదు రా ” నేను కూడా కొంచెం సెంటిమెంటల్ ఫీల్ అయ్యి నొచ్చుకున్నా.

” అబ్బో ! నీవు ఆమె పూజ ఎప్పుడు మొదలు పెట్టావురా బాబాయ్…” అని ట్రే కోసం సీరియస్ గా కలియ తిరిగి కూర్చున్న కుర్చీ పక్కనే యేష్ విదిలించాడు. ఆ చుట్టూ తిరిగి చూడ్డం కూడా ఓ బహానా వాడికి. అలా చూస్తే నేనే పరిగెత్తుకెళ్ళి ఎక్కడున్నా హడావిడిగా ట్రే పట్టుకొచ్చి వాడి పక్కన పెడ్తానని వాడి అంచనా .

మళ్ళీ దమ్ము తీసి అన్నాడు –

” విప్లవ రచయితల సంఘం, ఎలాంటి కుట్రలతో, ఎలాంటి అబద్దాలతో, ఎంత నిజాయితీ హీనంగా, ఎంత విప్లవ వ్యతిరేకంగా ఏర్పడిందో, ఆ పాత చరిత్రని ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుసుకోవచ్చు. ఈ వాక్యాలు ఎక్కడన్నా విన్నట్టుందా ” అప్పజెప్పినట్టు చెప్పి అడిగాడు.

” ఐ నో యు ఆర్ రెఫెరింగ్ హర్ ఆర్టికల్ ఆన్ విరసం ”

” కదా ! కుట్ర కేసులు పెట్టించుకుని తిరుగుతున్న విరసాన్ని కుట్ర పూరితం అనేసింది. రంగనాయకమ్మను నేను ఆడ మోడీ అంటే నీకు వచ్చిందా ? ”

” వి ర సం పేద్ద ….. వీర సాహిత్య సంస్థా మరి ? ”

” అది వాళ్ళు సమాధానం ఇచ్చుకుంటారు వీరులైతే . మనకెందుకు కాని ” అని రావు గోపాల్ రావు స్టైల్ లో గొంతు మార్చి అన్నాడు ” మడ్డరు జేసినోడు దొంగ కొడుకు, ముడ్డి మీద ఏసుకునే డాయర్ ఎత్తుకెల్లినోడు దొంగ కొడుకైతే , ఈ పెపంచకం లో పెతోడు సమానంగా దొంగ కొడుకులే రా సెగట్రీ   ”

” ఐ అబ్జెక్ట్ మై డియర్ బట్ట తల బిన్ లేడెన్…..నీవు పాయింట్ డైవర్ట్ చేస్తున్నావు. ఆమెను మోదీ తోనూ , ఆమె పాఠకులను మూర్ఖ మోదీ భక్తులతోనూ పోల్చడం దారుణం ”

” ఒరేయ్ తప్పుల్లో డిగ్రీలు లేవనేది  ఆమె పాటించే సూత్రమే. అందుకే విరసానికి, వీ ఎచ్ పీ కీ తేడా లేకుండా తిడుతుంది ”

” మరి విరసం తప్పులు లేని సమాజం కోసం కృషి చేస్తున్నప్పుడు తప్పుడు దారులు ఎలా తొక్కుతుందిరా ? రంగ నాయకమ్మ తిట్టడం లో ఘాటు ఎక్కువయ్యింది కాని , సారాంశం లో తప్పు లేదు కదా ? ” కాఫీ సిప్ చేస్తూ అడిగాను.

” బామ్మర్దీ ! వాస్తవాలు , ప్రజలకు వీర రసం తాగించే విరసం చెప్పేంత వరకు ఆగు. అది ఆమె విరసం ను తిట్టడం అని నీవనుకుంటున్నావా ? నా బాబే ! అది జస్ట్ ‘ సెల్ఫ్ లవ్ ‘ ”

అనేసాడు వీడు. అనాల్సిన మాట గబుక్కున అనేసాడు.

* * *

వీడు చిన్నప్పట్నుండి అనాథ జీవితమే. ఆల్ మోస్ట్ మా ఇంట్లోనే పెరిగాడు. వాడికి మనుష్యులంటే ప్రేమ.

కాలేజిలో ఎంతో శ్రద్ధగా ” రామాయణ విషవృక్షం “ చదువుతుంటే వచ్చి అల్లరిగా లాగేసేవాడు. ఏమంటే ఇందులో ‘ మార్క్సిజం తక్కువ. మనాయకం ఎక్కువ అనే వాడు ‘. ఈ మధ్య ‘ తత్వ శాస్త్రం- ఒక చిన్న పరిచయం ‘  అనే బుక్కు కొన్నానని వాడికి ఢిల్లీకి ఫోన్ చేసి చెప్తే అడిగాడు ” ముందు మాటలో మొదటి వాక్యం చదువు అన్నాడు ”

” ‘ తత్వ శాస్త్రం పట్ల నాకెప్పుడూ ఆసక్తి రాలేదు ‘ అని ఉంది ఏం ? ” అడిగా.

అందుకు వాడన్నాడు ” పుస్తకం గురించి వ్రాయమంటే ఈమె మనసులో ఏమనుకుందో, ఆ మనసు లోపల  లోపల ఉన్న మనసులో ఇంకేమనుకుందో, ఆమెలో వస్తున్న ఎమోషనల్ చేంజ్ కు ఆ విక్రం గైడు లాంటి పుస్తకానికి ఏవన్నా సంబంధం ఉందిరా ?  చదువు…చదువురా…రేయ్ చదువు…..ముందు మాట తోటే నీకు దిమ్మ తిరిగిపోద్ది. అందులో ‘ నేను పెన్సిల్ తో రాసుకున్నాను, మళ్ళి రుద్ది చెరిపేసాను, మళ్ళి రాసాను, మళ్ళీ చెరిపేసాను ‘ లాంటి దిక్కుమాలిన  డీటైలింగ్ చూసాక భారతం లో భారతుడిలా పిచ్చోడైపోయి ఆమెనే అనుకుని ఆమె చెప్పులకు పూజ చేస్తావు ”

” భారతం కాదు …రామాయణం….” టక్కున అన్నా

” ఇదే మరి రంగ నాయకమ్మ భక్తి తెలివి అంటే. అంత ముఖ్యమైన విషయం వదిలేసి…ఎక్కడో దొర్లిన టైపో లాంటి తప్పును పట్టుకుని ఊగులాడ్డం ”

* * * *

వాడు తాగేసి కప్పు కింద పెడుతూ , కాఫీ అడుగున మిగిలిపోయిన చక్కర వేలుతో తీస్తూ నాకుతూ అన్నాడు ” ఆమె ఒకరిని తిట్టినా…ఆమె ఒకరిని పొగిడినా…అంటే ఆమె మార్క్సు, ఏంగెల్స్ &  కో ను తప్ప ఎవరినీ పొరపాట్న కూడా మెచ్చుకోదనుకో….వాటెవర్….అది ఆమె మీద ప్రేమను ఆమె అలా వ్యక్త పరుచుకుంటుంది అంతే –  I mean its pure platonic self-love  ”

నా మొహాన్ని చూసి చప్పరిస్తూ అన్నాడు ” నీ బోటి వాళ్ళు చూసి ‘ ఆహ ఏమి సద్విమర్శ , ఓహో ఏమి మొహమాటం లేని విమర్శ ‘ అంటారన్న మాట ”

నేను కుర్చీలో ఇబ్బందిగా సర్దుకున్నాను.

నాలో కనిపించని ఇబ్బందిని గమనించి దగ్గరకొచ్చి భుజం మీద చేయి వేసి అన్నాడు.

” మచా ! నీకో పిట్ట కథ చెప్తాను ఉండు. జాగర్తగా విను. ఒక నిర్భాగ్యుడెవడో  కొండ మీద నుండి కాలు జారో, ఎవరో తోసేస్తేనో…పడిపోతున్నాడు…దొర్లుతూ…గిర గిరా తిరుగుతూ…. అప్పుడు రంగ నాయకమ్మ లాంటి వాళ్ళను ‘ విషయం కాస్తా చూడండి ‘ అని ఎవరో…ప్రభుత్వాధికారి అనే అనుకో…. పంపాడు . ఆమె హుటా హుటిన అక్కడికి చేరింది. కొండ మీద నుండి జారి పడే మనిషిని చూసింది…తీక్షణంగా గమనించింది..సెకన్ లలో సమస్యను సూక్ష్మంగా ఆకళింపు చేసుకుంది….ఆమె చాలా షార్ప్ కదా మరి…. వెంటనే అప్పటికప్పుడు ఒక మెయిల్ పంపింది…… ” అసలు ఈ కొండ ఇక్కడ భూ అంతర్భాగం లో జరిగిన మార్పుల వల్ల ఏర్పడి, ప్రమాదాలకు తావుగా నిలుస్తుంది. భూ అంతర్భాగం లో జరిగే మార్పులను పసిగట్టి మనం అరికడితేనే ఈ సమస్యకు మూలం దొరుకుతుంది. ఐతే ‘ కొండ ఎత్తుగా ఉంటుంది…కాలు పెట్టడంలో  జాగర్తగా ఉండాలి’ అని తెలుసుకోలేని అవివేకత్వం  ఈ సమాజం లో ఉన్నంత కాలం ఈ ప్రమాదాలు తప్పవు. ఇప్పుడు ఇక్కడ కింద పడిపోతున్న వ్యక్తి నిజానికి ఎన్నో రాళ్ళను , గడ్డి పీచులను ఆసరా తీసుకోవడం లో కనీస తెలివి కూడా చూపించ లేకపోవడం అన్నది మనమెవ్వరూ గమనించట్లేదు. నిజానికి మనం అవసరం ఏమీ లేకుండానే ఇతడు రక్షించుకునే పరిస్థితిని కూడా విస్మరించాడు. దీనికి ప్రధాన మూలం ఎక్కడుందంటే అతని బుర్ర లోనే ఉంది. అది పగిలే దాక ఆయన్ని రక్షించడం వృథా ! ”

నన్ను అనునయంగా నిమురుతూ అన్నాడు ” విమర్శించడం గొప్ప కదురా ! భూలోకం పైన కాళ్ళు వదిలేసి ….అందరు పరలోక రాజ్యం లో బతుకుతున్నట్టు…అప్పుడు ఎవడన్నా గట్టిగా దగ్గినా తుమ్మినా తప్పౌతుంది….అలా విమర్శిస్తే ఏమౌతుంది ?  That clearly explains one has blurred vision of priorities of society. ఇప్పుడు నాకు ఒక ఘోరమైన కేన్సర్ ఒకటి  వచ్చిందనుకో. హడవిడిగా ఒక టెబ్లెట్ వేసుకున్నాను. దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలిసీ వేసుకున్నాను. లేపొతే నొప్పి భరించ లేకపోతున్నాననుకో.తర్వాత  వ్యాధి తగ్గించిన విషయం వదిలేసి – ఆ టెబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి విమర్శిస్తే ఎలా ఉంటుంది ?    ”

సిగరెట్ పీక ఆర్పి కిటికి లోంచి చాకచక్యంగా విసిరి, నా కుర్చీ హేండ్ రెస్ట్ మీద వాడు రెస్ట్ తీసుకుంటూ ”  This is nothing but perversion for idealistic attitude.  నేను నీతో బెట్ వేస్తా. ఇటువంటి  Attitude  ఉన్న వాళ్ళ మీద నా అంచనా. …. అఫ్ కోర్స్ ఆ బెట్ డబ్బులు నీ జేబులో నుండే నా దగ్గరకొచ్చి మళ్ళీ నీ జేబులోకి పోతాయనుకో . ఎవరన్నా ఒక్కరంటే ఒక్కరు ….. barring her husband  …..సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుండి ” నేను రంగ నాయకమ్మ ఫ్రెండ్ ” అని గర్వంగా ఒక్కరు డిక్లేర్ చేయ కలిగినా లేదా ఈమె తడపాయించే ఒక్క శ్రామికుడు లేదా ఒక్క దళితుడు….ఇదో గొడవ …దళితుడంటే ‘ ఎవరూ ‘ అని దీర్ఘం తీసేస్తుందిప్పుడు ‘ నోర్ముయ్ అందరూ పేదోళ్ళే అని అరిచేస్తుంది ‘….సరే ఏదైతేనేం…ఒక్కరన్నా …ఒక్కరంటే ఒక్కరు….వచ్చి ఈమె వలన సాంఘిక న్యాయం మాకు కలిగింది అంటే ……. again I am telling you , I will pay you one thousand rupees signed by Raghuram rajan and will shave my lovely beard off… ” అన్నాడు.

నేను ఒక్క ఉదుటున లేచి నవ్వుతా వాడిని  వంగో బెట్టి రెండు గుద్దులేస్తూ పక పకా మని నవ్వాను.

వాడి కాలర్ పట్టుకుని ” ఒరేయ్ ! నీకు మాత్రం సెల్ఫ్ లవ్ తక్కువా ” అన్నా.

” సరెలేరా …. పెతోడికి కొద్దో గొప్పో ఉంటుంది. చూశావా…రంగ నాయకమ్మ వాసనలు ఎలా తగిలాయో నీకు….ప్రతి మనిషికి అంతో ఇంతో ఉండే ఇసుమంత సెల్ఫ్ లవ్ ను…ఆమెకుండే  Obsessed self-love   ను ఒకటేలా చూస్తున్నావ్ !  ” అని మొహానికి చేయి అడ్డుగా పెట్టుకున్నాడు నే కొడతానేమో  అన్నట్టు.

కాలర్ వదిలేసి నేను గట్టిగా నవ్వుతూ ఎదురుగా ఉన్న దివాన్ మీద జారగిల పడ్డాను.

” ఓకే రా…. I agree with you for now  కాని ఆ ఇంకో పెద్దామె చటుక్కున ఈమెను పర్స్ నల్ అటాక్ చేస్తూ కవిత వ్రాయడం మాత్రం తప్పురా. ఈ విషయం లో నీవేం చెప్పినా నే తలూపను ” అనేసి గట్టిగా నా చెవుల చుట్టు చేతులు పెట్టి తల పట్టుకున్నాను.

వాడు నా చెవి దగ్గర గట్టిగా అరుస్తూ ”  Self-love never generates logical thinking in other person. In fact, it obstructs the logical thinking and diverts the targeted audience’  attention to the person talking about the subject but not on the subject, per se. And so Mrs. Ranganayakamma runs the risk of taking the brunt personally. ”  నా చెవులపై చేతులు  పక్కకు లాగి  ” And this goes on as long as Ranganayakamma loves Ranganayakamma but nothing else !!! ”  అని గట్టిగా గుయ్ మంటూ అరిచాడు వెధవ .

*

కలాం వెనక వున్నది మనువాదమే!

 

పి. విక్టర్ విజయ్ కుమార్

హద్దులు దాటుతున్న కామెంట్ లను చూసి ” ఈ కామెంట్ లను moderate చేయమంటారా ? ” అంటూ తమ నైతిక బాధ్యతను నిర్వర్తించే క్రమం లో నన్ను సంప్రదించారు సారంగ టీం. అబ్బుర పడ్డా ఎడిటర్ కు ఉండాల్సిన sincerity చూసి. వ్యాస కర్తగా చెప్పా ” కలాం వెనకేసుకొస్తున్న మనువాద భావ జాలం నమ్ముకున్న వారి ప్రవర్తన ప్రతి ఒక్కరికీ తెలియాలి . మీరు అనుమతిస్తే అన్ని కామెంట్స్ ను కలుపుతూ ఒక ఫైనల్ నోట్ సబ్ మిట్ చేసుకుంటా అని. అనుమతించిన సారంగకు ధన్య వాదాలు .

” కలాం నిజాయితీ గా ఎదిగిన ప్రొఫెషనల్ కు తార్కాణంగా , మధ్య తరగతి ప్రజల కలల ఆదర్శంగా నిలిచాడు. ” లాంటి ఉపోద్ఘాతం తో తో మొదలు పెట్టి ” ఒక ‘ కెరీరిస్ట్ లిబరల్ ‘ ను ‘ ప్రజల మనిషి ‘ అనడం మాత్రం హత్యా పాతకం !! ” తో ముగిసిన వ్యాసమిది. ఒకరు ముందూ వెనకా చూడకుండా ” రబ్బిష్ ” అన్నారు, ఇంకొంచెం ముందుకెళ్ళి ” పిచ్చ నా ____ ” అన్నారు ( ఫిల్ ద బ్లాంక్స్ అని రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకపోయింది…ప్చ్ ! ), మరొకరు వ్యాస కర్తను ” చెప్పుచ్చుకు కొట్టాలి ” అన్నారు, ఎవరో ” ఫూల్” అన్నారు, ఇంకొకరు ఉద్వేగం ఆపుకోలేక “ఆకుకు ____ తెలియని వ్యాసమిది ” ( ఫిల్ ద బ్లాంక్స్ రిక్వెస్ట్ చేయడానికి అది నాకొక్కడికే సంబంధించింది కాదు. మొత్తం స్త్రీ సమాజానికి సంబంధించింది) అని దుర్గా మాతగా కొలిచే ఆడ వాళ్ళను అలవోకగా వాడుకుంటూ అటాక్ చేయడానికి వెనుకాడ లేదు.

అసలు మనువాద ఆలోచన విధానం అన్నది ఈ దేశాన్ని సగం తినేసింది. వ్యతిరేక దృక్పథాన్ని సహించలేని ఓర్వలేని తనం ఆ మనువాదం నర నరాన ఉంది. దళితుల నాలుకలను తెగ కోసిన ” దుర్మార్గమైన అసహనం ” కలిగిన నీతి అది. అదే నీతి దేశం లో మత విద్వేషాలకు ఆజ్యం పోస్తుంది. అదే కుటిల నీతి – మీరు మొత్తం చరిత్ర చదవండి….ప్రెసిడెంట్ స్థానానికి నారాయణన్ కల్పించిన విలువ, ఇక ఏ ఒక్కరన్నా కల్పించి ఉండి ఉంటే చెప్పండి. దేశ అత్యున్నత స్థానం లో దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ కు తలూపే ప్రెసిడెంట్ లు తప్ప ఎవరూ కనిపించరు. దళితుడైన నారాయణన్ ప్రెసిడెంట్ కావడానికి కారణం బీసీ, దళిత కులాలను రెప్రెజెంట్ చేసే పార్టీలే . 1997 లో అతను ప్రెసిడెంట్ అవ్వడం కాంగ్రెస్ నిర్ణయం కాదు. అది వెనుకబడిన కులాలు, ద్రవిడ పార్టీలు ఎంచుకున్న వ్యక్తి నారాయణన్. అతను తీసుకున్న తిరస్కార నిర్ణయాలు కాంగ్రెస్ కు , బీ జే పీ పార్టీలకు కొరుకుడు పడ లేదు. మొదటి టర్మ్ లో నిజానికి పర్ఫార్మెన్స్ చూపినా , సెకండ్ టర్మ్ కు కాంగ్రెస్ , బీ జే పీ మద్దతుతో పైకొచ్చిన కలాం అవసరం లేకపోయింది.

ఇది నారాయణన్ ను ” గ్లోరిఫై ” చేయడం కాదు. నారాయణన్ పక్కా కాంగ్రెస్ పార్టీ వెనుదన్నుగా ఉంచుకుని పైకి వచ్చాడు. నిజానికి నాకూ గ్రీవెన్స్ ఉంది – ఒక పేద దళిత కుటుంబం నుండి వచ్చి, క్రియా శీలంగా, తనకున్న పరిమితుల్లో , తనకున్న రాజకీయ చాక చక్యం తో , తనకున్న స్థాయిలో ఈ దేశం లో అణగారిన దళితులకు తగినంత కృషి చేయలేదే అని.

ఐతే ఈ వ్యాసం మొత్తం అడిగిన ప్రశ్న ఒకటే – నిజాయితీగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి – మీరు ఏ గొప్ప కలాం లో చూసారో ఆ గొప్ప నారాయణన్ లో ఎందుకు కనిపించలేదు ? ఒళ్ళు తెలీకుండ మీదకెత్తుకునే తిరిగే కలాం లో ఉన్నదేంటి ? నారాయణన్ లో లేని దేంటి ? కలాం చేసిన తప్పుల్లో అర్థం చేసుకునేదేంటి ? నారాయణన్ తప్పుల్లో అర్థం కానిదేంటి ?….కలాం కు ఇచ్చిన స్థానం నారాయణన్ కు ఎందుకు కల్పించలేకపోయింది ?

Systemic bias అర్థం చేసుకోవాలంటే మనువాద ఆలోచనలు ముందుకు తోస్తాయి. ఇంత మీడియా ( అప్పట్లో వేదాలు ) తెగ నోరేసుకు తిరిగితే – ఇన్నాళ్ళు మాకున్న నమ్మకం బూటకమైతే – మేమెలా తట్టుకో గలం అనే ఒక భావన. అలాగే క్వశ్చన్ చేయడాన్ని మనువాద ఆలోచన అక్కడే ఆపేస్తుంది. తిరుగు బాటుకు తగిన గుణ పాఠమెంటో చెప్పాలనే ఉవ్విళ్ళూరుతుంది. ముఖ్యంగా హైందవ నాగుపామును తలకెత్తుకున్నాక – కరిపించుకోవాల్సిందే తప్ప విసిరి కొట్ట రాదు. ఇదీ మనువాద ఆలోచన !

” ఏ వ్యక్తినైనా మహానుభావుడిగా వర్ణించే మన దేశ ప్రజల సంస్కృతిలో మనువాదం బలపడిపోయింది. మన ప్రమాణాలు అతి తక్కువ స్థాయికి దిగ జారి కేవలం – నిజాయితీగా ఇబ్బంది కలగ కుండా తమ విధిని నిర్వర్తించడం కూడా ఒక మానవాతీత గుణం అయిపోయింది ” అని ఈ వ్యాసం చెప్పడం గమనించి ఉంటే కృతజ్ఞతలు.

అంబేద్కర్ మూడు సార్లు ఎలక్షన్ లలో పోటి చేసి డిపాజిట్ కూడా లేకుండా ఓడించబడ్డాడు. కోల్పోని ధైర్యం తో అంబేద్కర్ స్వాంతంత్ర్య సమరం peak లో ఉండగా – గాంధీ ని దుమ్మెత్తి పోసాడు. ( నిజానికి గాంధీ [ ఇమేజ్ ను బహిర్గతం చేసి ] నోట్లో దుమ్ము కొట్టాడు అంటే నిజమేమో ?! ) . అంబేద్కర్ ” నేను హిందువుల తోటలో పాము లాంటి వాడిని ” అని చేసిన తిరస్కార గర్జన ఇప్పటికీ చల్లార లేదు.

గాంధీ విమర్శకు అతీతుడా ? కలాం విమర్శకు అందని దేవుడా ?

మీరు ఆరిందం చౌదరి రాసిన పుస్తకాలు చదివారా ? కలలు అమ్మడం ఒక గొప్ప మార్కెటింగ్ కళ. అందునా అభివృద్ధి కరువైన మన దేశం లో అది మరీ సులభం. ఆరిందం చౌదరి పుస్తకాలు మిమ్మల్ని కలాం పుస్తకాలకు ధీటుగా ఇన్స్పైర్ చేయకుంటే చెప్పండి. Ayn Rynd వ్రాసిన ” సీక్రెట్ ” పుస్తకం చదవండి – మీలో ఉరికే పాజిటివ్ ఎనర్జీ మీరే చూసుకోండి . ఆరిందం చౌదరి స్కాం లో అరెస్ట్ అయ్యాడు. Ayn Rynd కోట్లకు పడగలెత్తింది – కేవలం కలలను అమ్మడం తోటే. నిమ్న దేశాల్లో, నిమ్న మనసులకు Emotional hype ఇవ్వడం గొప్పగా చిత్రీకరించడం మను వాదానికే చెల్లింది.

కలాం పబ్లిక్ లైఫ్ – మధ్య తరగతి మనిషి కెరీర్ కోరికలకు ప్రతిబింబంగా , వివాదాలకు అతీతంగా ఇమిడి పోయే అందమైన జీవితాన్ని ఎన్నుకోడానికి మార్గ దర్శంగా నిల్చాడు కాని , తన సైన్స్ తో మానవత్వం కలిపి ప్రాక్టికల్ గా ప్రజల కోసం చేసింది ఏమీ లేదు. మీ దగ్గర ఏవన్నా గట్టి సాక్ష్యాలు ఉంటే తీసుకు రండి. తెలుసుకోవడానికి అభ్యంతరం ఇసుమంత కూడా లేదు. We are inspired by Kalam’s life అంటే అది వ్యక్తి గత అభిప్రాయం And you need a model man to build a career to emulate, which is completely understandable. దానితో పేచీ లేదు. ” ప్రజల మనిషి / పీపుల్స్ ప్రెసిడెంట్ ” అంటేనే చిక్కు !! ఇక్కడ – ఒక Individual interest కలిగిన అభిప్రాయాన్ని , అందునా ఒక మంచి ‘ స్వంత జీవితం ‘ గడపాలనే ఒక closed view ను Public opinion for public good లా చూపడం తో ఈ వ్యాసం ఖచ్చితంగా విబెధిస్తుంది.

‘ అచ్చే దిన్ ‘ పేరుతో మభ్య పెట్టి , 60 సంవత్సరాలలో చేయనిది 5 సంవత్సరాలలో చేస్తానని మానవాతీతమైన ప్రమాణాలు చేసి, నల్ల ధనం వెనక్కు తెస్తాననే అత్యాశ కలిగించి – కనీ వినీ ఎరుగని రీతిలో అధికార దాహం లో కులం, మతం ను వెనకేసుకుని సిం హాసనం ఏలుతున్న మోదీ దీర్ఘ కాలము నిలవడు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలు కూడా అంతే. ఆ రోజు – ఇంత మహనీయుడు కలాం పాత్ర మరి ఏంటి ఈ పాపం లో అంటే – గుండెలు తడుముకోవాల్సిందే.

దయ చేసి వ్యవస్థతో మమేకమైన ఒక వ్యక్తిని అంచనా వేయడానికి mid way లేదు గమనించండి.

కలాం కొటేషన్స్ మత్తెక్కిస్తాయి. అది విషయం కాదిక్కడ. బాబా ల ముందు సాగిల పడ్డం యే విజ్ఞానానికి ప్రతీక ? యే సెక్యులరిజానికి ప్రతీక ? కలాం కు కావాల్సింది పొగడ్త కాదు. నిజానికి బోలెడంత సానుభూతి !! తన కుటుంబం నమ్మని మత గ్రంథాలను చదివాడు, తన సైన్స్ నమ్మని స్వాములకు దండం పెట్టాడు, ఊచకోత జరుగుతున్నా ఒక పక్క నారాయణన్ ” ఈ అల్లర్లకు అక్కడి అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ఉంది ” అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంటే తన కళ్ళకు, తనలో మానవత్వానికి గంతలు కట్టేసుకున్నాడు . ఇదంతా తాను ఈ దేశం నమ్ముకున మను వాద వ్యవస్థ లో మనడానికి పడ్డ కష్టాలు. ఒక మైనారిటీ వ్యక్తి ఈ దేశం లో ముందుకెళ్ళాలంటే – ఎన్నొ పరీక్షలకు గురి అవ్వాలి. తన ఆత్మ గౌరవాన్ని పణం పెట్టి తన ఇమేజ్ ను పదే పదే చెక్ చేసుకోవాలి – అని కలాం తన జీవన విధానం లో చెప్పకనే చెప్పాడు. ఆయన ( నేను నమ్మని ) ఆత్మ , పనికి రాని పొగడ్తల కోసం కంటే సానుభూతి కోసం చూస్తుందని నా నమ్మకం !!

P S : సారంగ లో యాక్టివ్ గా ఉండే ఎంతో మంది మార్క్సిస్టులకు ఒక విఙప్తి ! మనమింకా అద్భుతమైన ఆదర్శ సమాజం ఏర్పరుచుకోలేదు. నారాయణన్ ఈ బూర్జువా వ్యవస్థ accommodate చేసిన దళిత వ్యక్తి. ఆయనకున్న పరిమితులు ఆయనుకున్నాయి. సమస్య అది కాదిక్కడ. వ్యవస్థీకృతమైన మనువాదాన్ని వ్యతిరేకించాలంటే – నారాయణన్ ను సపోర్ట్ చేయ డానికి వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు.

గాంధీ ” sentiment ‘ అయితే అంబేద్కర్ ” Counter sentiment ” అవుతాడు. కలాం ” sentiment ‘ అయితే నారాయణన్ ” Counter sentiment అవుతాడు.

మన దేశం లో ఉన్నది ప్రధానంగా మనువాద బ్రాహ్మణీయ అగ్ర కుల సమాజం. కాబట్టి ” కలాం ఇమేజ్ ” కేవలం మత ఛాందస వాద సమస్యే కాదు. This is an issue of systemic bias this state is practicing
Dont hesitate to support Narayanan, if you truly believe , you have to fight out the menace of majority fundamentalism in this country and I am sure this casteist society will have one ” Counter sentiment “, it tries to hide, unless you really search for.
*

కలాం: హారతిలో ధూపం ఎక్కువ!

పి. విక్టర్ విజయ్ కుమార్ 
మన 11 వ రాష్ట్రపతి అయిన అబ్దుల్ కలాం మరణం తో సాధారణ మీడియా, సోషల్ మీడియా, ప్రభుత్వాలు, సంస్థలు శోక సంద్రం లో తేలాయి. ప్రతి చోటా, ప్రతి నోటా ఇంత వరకు ఏ రాష్ట్రపతికీ, ఇందిరా గాంధి తర్వాత కేంద్రం లో పరిపాలించినా ఈ ఒక్క నాయకుడికీ,  ఇంత స్థాయిలో Mourning  జరగలేదు. నిజానికి కలాం మన దేశం లో ‘ గాంధీ ‘ లా విమర్శకు అతీతమైన ఒక ‘ సెంటిమెంట్ ‘ లా రూపాంతరం చెందాడు. 
 
అబ్దుల్ కలాం వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులతో నడిచింది. పేద తమిళ ముస్లిం కుటుంబం లో పుట్టి ‘ రాకెట్ సైంటిస్ట్ ‘ గా ఎదిగి భారత్ దేశానికి 11 వ రాష్ట్రపతిగా నియమితుడయ్యాడు. కలాం భారత ప్రభుత్వానికి సైంటిఫిక్ అడ్వైజర్ గా , పోఖ్రాన్ – 2 కు ప్రధాన పాత్ర ధారి గా బాధ్యతలు నిర్వర్తించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్ లో ఇంత ప్రశస్తమైన పాత్ర పోషించిన వ్యక్తులు దేశం లో అరుదే. విక్రం సారాభాయ్, సతీష్ ధావన్ లు ఈ సైంటిఫిక్ రంగం లో ప్రముఖులుగా చెప్పుకోవచ్చు. అయితే కలాం గొప్ప తనం ఏమంటే – రాజకీయాల్లో ప్రవేశించి రాష్ట్ర పతిగా కూడా  2002-2007 మధ్య కాలం లో బాధ్యతలు నిర్వర్తించడం. రాష్ట్రపతిగా పదవి విరమించాక అధ్యాపకుడిగా ఎన్నో ప్రసిద్ధ కళాశాలల్లో కాలం గడిపాడు. కలాం నిజాయితీ గా ఎదిగిన ప్రొఫెషనల్ కు తార్కాణంగా , మధ్య తరగతి ప్రజల కలల ఆదర్శంగా నిలిచాడు. ( రాజకీయ పూరితమైన భారత రత్న, పద్మ విభూషణ్ లాంటి బిరుదులు అసలు గొప్ప తనంగా మాట్లాడ్డం గురించి వదిలి వేయద్డం ఉద్దేశ్య పూర్వకమే. దీనికి సంబంధించి వివేచన గురించి పాఠకులే ఆలోచించుకోవాలి )  
 
ఈ చిన్న ఉపోద్ఘాతం ను ఇక్కడ వదిలేద్దాం. కలాం కెరీర్ , నిజాయితీ , అధ్యాపకుడి పాత్ర – ఇవన్నీ చూసి , అతని మరణానికి ఈ ప్రభుత్వం , ఈ మీడియా, ప్రభుత్వ సంస్థలు ఇస్తున్న గొప్ప నివాళులను  Objective  గా గమినించకుండా వదిలేయడం సమయోచితమైన ప్రతిస్పందన అవ్వదు.
 
కలాం సైంటిస్ట్ గా తన కెరీర్ ను మలుచుకున్నాడు. ఒక ప్రొఫెషనల్ సైంటిస్ట్ గా మాత్రమే తన విధిని నిర్వర్తించి నిజాయితీగా పని చేసాడు. 2002 లో నారాయణన్ రాష్ట్రపతిగా రెండో సారి ఎన్నిక కావాల్సిన సందర్భం ఉండింది. ( 1997 జూలైలో గుజ్రాల్ నేతృత్వంలో ఉన్నా మైనారిటీ ప్రభుత్వం అధికారం లో ఉండగా నియమితుడయ్యాడు. తర్వాత వాజపేయి కాలం లో కొన సాగాడు ). ఇక్కడ నారాయణన్ గురించి కొద్దిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.  నారాయణన్, భారత దేశ రాష్ట్రపతులలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుని ఉన్నాడు. పేద దళిత కుటుంబం లో పెరిగి, జర్నలిస్టుగా, ఎకానమిస్టుగా, భారత దేశ దౌత్య వేత్తగా, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి గా, ఉపరాష్ట్రపతిగా ఆపై రాష్ట్రపతిగా ఎదిగాడు. నారాయణన్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక అసంబద్ధ ప్రభుత్వ విధానాలను ఎన్నిటినో వ్యతిరేకించాడు.  ఆ స్థాయిలో వ్యతిరేకించిన రాష్ట్రపతికి మనకు లేడంటే అతిశయోక్తి కాదు.
డిసెంబర్ 1992 (ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ) బాబ్రి మసీదు అల్లర్లపై నీళ్ళు నమలకుండా ‘ గాంధి హత్య తర్వాత దేశం చవి చూసిన ఘోరమైన ఉదంతం ‘ గా వర్ణిచాడు. గుజ్రాల్ ప్రభుత్వం సంకీర్ణ రాజకీయాలకు తలొగ్గి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల దోసి ప్రెసిడెంట్ రూల్ ను విధించాలనే నిర్ణయాన్ని, వాజ పేయి ప్రభుత్వం బీహార్ లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోసి ఎమర్జన్సీని విధించాలనే నిర్ణయాన్ని చాలా ఎత్తుగడ తో సుప్రీం కోర్ట్ తీర్పును అడ్డుపెట్టుకుని వ్యతిరేకించాడు. ఒక రాష్ట్రపతిగా తాను రబ్బర్ స్టాంప్ కాదు, ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాలకు తాను మడుగులొత్తననే  విషయాన్ని బహుశా నారాయణన్ తప్ప ఇంకెవరూ ప్రయత్నించలేదు. 2002 గూజరాత్ ఊచకోత  విషయం లో కూడా తానో మౌన పాత్రను ఎన్నుకోలేదు. క్రియాశీలంగా వాజ్ పేయి ప్రభుత్వానికి ‘ గుజరాత్ అల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది ‘ అని నిర్మొహమాటంగా లేఖ  వ్రాసాడు. ఇక్కడ గమనించాల్సిందేమంటే – 2002 – 2007 మధ్యలో రాష్ట్రపతి ( అబ్దుల కలాం ) పక్కా రబ్బర్ స్టంపు గా పనిచేసాడే కాని – ప్రభుత్వానికి కించిత్తు ఇబ్బంది కలిగే అంశాలను తడుముకోలేదు. పైగా, ఉరిశిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడే మనవతా వాది అబ్దుల్ కలాం తన వద్దకు వచ్చిన మెర్సీ పిటిషన్ ల విషయం లో ఏ మాత్రం వైవిధ్యంగా ప్రవర్తిచలేదు.
కలాం 2003 లో ‘ యూనిఫాం సివిల్ కోడ్ ‘ కు మద్దతు పలకడం చూస్తే అతని రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతాయి. ప్రధానంగా 2005 లొ  బీహర్ ప్రభుత్వం పై ప్రెసిడెంట్ రూల్ విధించడం లో తన సంతకం వేయడానికి  ఏ మాత్రం వెనుకాడ లేదు. నిజానికి నారాయణన్ రాజకీయ వ్యక్తిత్వం ముందు కలాం రాజకీయ జీవితం వెల వెల బోతుంది.
 
( కలాం గుండె జబ్బుల విషయం లో ఖర్చు తక్కువగా ఉండేట్టు హైదరాబాదు లోని పెద్ద కార్పోరేట్ హాస్పిటల్ సంస్థతో కలిసి ఒక ‘ స్టెంటు ‘ ను తయారు చేయడం లో పోషించిన పాత్ర – సైంటిఫిక్ రీసర్చ్ కు మానవత్వాన్ని కలగలిపిన ఒకే ఒక్క ఉదాహరణ – తప్పకుండా మెచ్చుకోదగ్గది ( అయితే ఇది ఎంత ప్రాచుర్యం లోకి వచ్చింది, ఎంత సఫలం అయ్యింది అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు ) . అంతే కాక తనకున్న ఉన్నత స్థాయిని ఉపయోగించుకుని సైన్స్ ను , మానవత్వం తో ప్రజా సంక్షేమం తో కలిపి కృషి చేసిన సందర్భాలు దాదాపు సున్న. 
 
బీ సీ , దళిత రాజకీయ పార్టీల మద్దతు కూడాగట్టుకున్న నారాయణన్  అప్పటికే ‘ తిరస్కార నిర్ణయాలకు ‘ నెలవుగా నిలిచి ఉండడం తో , 2007 లో మత వాద  NDA  రాజకీయ పార్టీలు ప్రత్యామ్నాయం కోసం వెదుకులాట మొదలు పెట్టాయి. అప్పుడు దొరికిన రాజకీయ అనుకూల ఆణిముత్యమే ‘ అబ్దుల్ కలాం ‘ !!   ఒక దళితున్ని దించి బ్రాహ్మణ అగ్రవర్ణాలను ప్రెసిడెంట్ ( కృష్ణకాంత్ , పీ సీ అలెగ్జాండర్ ) చేసి వ్యతిరేకతను కొని తెచ్చుకోవడం కన్నా , ‘ వెజిటేరియనిజం ‘ ను నమ్ముకుని బ్రాహ్మణ వాద పార్టిలకు అనుకూలంగా ఉన్న మేధావి అందునా ముస్లిం కావడం  NDA  ప్రభుత్వానికి లడ్డు దొరికినట్టయ్యింది. ఒక ముస్లిం కేండిడేట్ ను , దళిత కేండిడేట్ కు వ్యతిరేకంగా  నిల్చోబెట్టడం – మనువాద రాజకీయ పార్టీ అయిన ‘ సంఘ్ పరివార్ ‘ ఎత్తుగడలకే చెల్లింది.
kalam2
 
ఏ వ్యక్తినైనా మహానుభావుడిగా వర్ణించే మన దేశ ప్రజల సంస్కృతిలో మనువాదం బలపడిపోయింది. మన ప్రమాణాలు అతి తక్కువ స్థాయికి దిగ జారి కేవలం – నిజాయితీగా ఇబ్బంది కలగ కుండా తమ విధిని నిర్వర్తించడం కూడా ఒక మానవాతీత గుణం అయిపోయింది. ఇదే అబ్దుల్ కలాం ‘ కుడంకులం న్యూక్లియార్ ప్రాజెక్టును ‘ క్లియర్ చేస్తున్నప్పుడు , అక్కడి లోకల్ ప్రజలు, ఆందోళన కారులను కనీసంగా కూడా సంప్రదించకుండా పని చేయడం , ఆయనలో ఉన్న ‘ బూటక తటస్థ ‘ విధానానికి చిహ్నం.
 
కలాం కు నిజానికి గొప్ప గొప్ప ఆదర్శాలు లేవు. ఒక సాధారణ మధ్య తరగతి వ్యక్తికి ఉండే అభిలాష , ఒక లిబరల్ వాదిగా ఉండాలనే ఒక ఆదర్శ భావన తప్ప. అంత గొప్ప సైంటిస్ట్ గా ఉండి – దేశ ప్రజల్లోని ‘ స్పిరిచువాలిటీ ‘ పేరుతో ఉన్న మూఢ నమ్మకాల గురించి, బాబాల గురించి నోరు ఎత్తింది సున్న. ఆయన జీవిత కాలం మొత్తం లో ఒక్క వాక్యం దీనిపై వ్రాసి ఉన్న సందర్భం లేదు. పైగా కలాం ప్రతి బాబా , స్వాములను వారి ‘ స్పిరిచువాలిటీ ‘ ని కళ్ళ కద్దుకోవడం లో ఏ మాత్రం వెనుకాడే వాడు కాడు.
 
నిజానికి కలాం ను కేవలం శాస్త్రవేత్తగా మాత్రమే చూస్తే – మన దేశం సీ వీ రామన్, చంద్ర శేఖర్, రామానుజం (మేథ్స్), విక్రం సారాభాయి లాంటి ఎంతో గొప్ప శాస్త్రవేత్తలను మన కిచ్చింది ( వీళ్ళెవరూ రాజకీయ ప్రధాన పాత్రలు ఆశించలేదు ) .   
 
 కలాం జీవన విధానాన్ని ‘ ఓవర్ రొమాంటిసైజ్ ‘ చేస్తున్న విధానం – మోడల్ ప్రజా జీవితం గురించి కొన్ని అంశాలను ముందుకు తెస్తుంది. కెరీర్ మీద బుద్ధిగా శ్రద్ధగా లగ్నం చేయడం, ఎవరికీ నొప్పించని విధంగా అంటే ప్రధానంగా బ్రాహ్మిణిక రాజ్యానికి వ్యతిరేకంగా ఎటువటి దృక్పథం పెట్టుకోకుండా లిబరల్ వాదం తో లోతుల్లోకి వెళ్ళకుండా సాధారణ అంశంగా పేదరికం గురించి బాధ పడ్డం, విశ్లేషించకుండా ప్రజల మధ్య సామరస్యాన్ని బోధించడం తదితర క్వాలిటీస్ కలిగి ఉండే వ్యక్తి మన దేశానికి ఎంతో అవసరం అన్నట్టు తెలుపుతుంది.
 
నిజానికి ఒక సైంటిస్ట్ గా – మత వాదాన్ని బలంగా ఎంతో చాక చక్యంగా ఎదురించాల్సిన కలాం అందులోనే ఇరుక్కు పోవడం బాధాకరం. కొశాంబి లాంటి చరిత్ర కారులు – ప్రజలకు ఉపయోగ కరమైన చరిత్రను వినిపించారు  గాని , కెరీర్ మీద మాత్రమే దృష్టి పెట్ట లేదు.
 
ఒక ‘ కెరీరిస్ట్ లిబరల్ ‘ ను ‘ ప్రజల మనిషి ‘ అనడం మాత్రం హత్యా పాతకం !!
*

గాయం తో పాటు జయం కూడా వీరుడిదే !! 

పి. విక్టర్ విజయ్ కుమార్
వీరుడంటే ఎవరు ?
శతృవు తల్చుకుని తల్చుకుని కుళ్ళి కుళ్ళి
ఏడ్వడానికి ఒకే కారణంగా –
స్వయంప్రతిపత్తి రాజ్యంలో
ఒక ఝంఝ మారుతమై
నిరసన జెండాపై నిలిచిన వాడు
 
భీరువంటే ఎవడు ?
అనుక్షణం అభద్రతతో నూతి నీళ్ళ నుండి
ఆకాశం చూసి వీరుడొస్తాడేమోనని
వణుకు గర్భాన్ని నఖక్షతం చేసిన వాడు –
ఈత చాప చేతిలో చుట్టుకుని
పోటెత్తే సంద్రాన్ని ఇసుక దాటి రానీవ లేదనుకునేవాడు !
* *
 
గీత చదవడం రాజ్య వ్యతిరేకం కానప్పుడు
గీత దాటడం ఇంకెలా ఉంటుంది ?
అధ్యయనాలు అగ్రహారాలు దాటనప్పుడు
అభినివేశం ఇంక ఏ తీరుగుంటుంది ?!
గిరి గీసిన వలయం లో గొంతుకను
మంత్ర దండం వేసి బిగిస్తే
భీరువుల స్వయంపాలనకు
వీరులు ప్రేతాత్మలే ఔతారు…..
  * *
 
నీకు నాకూ
భూమిక ఒకటే !
నీలో ఉరుకులెత్తేది
నాలో ఉరుకులెత్త్తేది
మట్టుబెట్టాలనే ఆరాటం !!!
నీ ఛాతీ కి అడ్డంగా మంత్రించిన పత్తితో ఏకిన దారపు పోగు…
నా చేతి నిండా పిడి పై అనుశాసనంగా నిల్చున్న ఉక్కు కరవాలం …..
నీవు భీరువు వేపు !!
నేను వీరుడి వేపు !

 

ఒక ఆకాశ రామన్న ఉత్తరం ఆధారంగా ” అంబేద్కర్ పెరియార్ స్టడీ సర్కిల్ ” అనే స్టూడెంట్ అసోసియేషన్ ను ‘ డీరికగ్నైజ్ ‘ చేయాలని ఐ ఐ టీ – మద్రాస్ డీన్ ఆఫ్ స్టూడెంట్స్ నిర్ణయం తీసుకుంది. ఈ విధాన నిర్ణయానికి ఒక పక్క ‘ స్వయం ప్రతిపత్తి ‘ కలిగిన సంస్థ అంటూనే , ఇంకో పక్క నారద జోక్యం తో మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఈ విధాన నిర్ణయానికి అనుకూల  వాతావరణాన్ని కల్పించింది. ‘వివేకానంద స్టడీ సర్కిల్  పేరుతో గీతా ప్రభోధాలను బ్రాహ్మిణీక మత చాందస వాదాన్ని ఆయా మత శక్తులు విరివిగా వాడుకునే విషయం ఇంత వరకు సంస్థ పట్టించుకోక పోవడం గమనార్హం.

విద్యాసంస్థలు తార్కిక చర్చలకు ప్రధాన సంధాతలుగా ఉండడం సర్వ సాధారణ విషయం. అంబేద్కర్ , పెరియార్ వంటి ఆలోచనా విధాన పరుల భావాలు ఖచ్చితంగా ప్రస్తుత నమ్మకాలకు విభిన్నంగా ఉంటాయి. అయినంత మాత్రాన అంబేద్కర్ తో రాజ్యాంగం ముసాయిదా వ్రాయించుకోకుండా ఉండలేదు – ఈ స్వతంత్ర భారత దేశం. నిజానికి ఆకాశ రామన్న ఉత్తరాలపై రియాక్ట్ కాకూడదనే విధానం ను కూడా పట్టించుకోకుండా మంత్రిత్వ శాఖ విద్యా సంస్థను  ‘ ప్రాంప్ట్ ‘ చేయడం, ముందస్తుగా వివరణ కూడా అడక్క పోవడం ఒక కుట్ర గా విదితమౌతుంది. ఏది ఏమైనా వాక్స్వాతంత్ర్య హక్కును నియంత్రించడం అప్రజాస్వామికం. …

యూరిన్ పోలిటిక్స్

పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

vijaykumar viktar” యూరిన్ కాషాయం రంగులో ఉందిరా ఇప్పుడు “

 ఇండియా గేట్ ను ఎగా దిగా చూస్తూ నాలుక కొస నుండి సిగరెట్ పొగ వదుల్తూ అన్నాడు మా వాడు. వాడి పేరు రాబర్ట్ నాగేంద్ర. వాళ్ళ తాతకు బ్రిటీష్ టైం లో రాబర్ట్ అనే దొర హెల్ప్ చేసాడని వీడి పేరుకు ఆ తల అతికించాట్ట.  సన్నగా జొన్న మొక్క బెండులా ఉంటాడు. దానికి తోడు నాగజెముడు పొదల్లా గడ్డం. పైన బట్ట తల. కేప్ పేట్టి ఒసామా బిన్ లేడెన్ అంటే నమ్మేయొచ్చు.

” టెస్ట్ చేయించుకో…..అబ్బ….బాబూ ! ఆ సిగరెట్ ఆపరా… ఆ కంపు భరించలేను నేను ” అన్నా. ” పబ్లిక్ లో తాగుతూ చట్టాన్ని కూడా అతిక్రమిస్తున్నావు. పోలీసోడు చూస్తే ఫైన్ వేస్తాడు ”

వాడు ఫక్కున నవ్వాడు. ” అరేయ్ బాబాయ్ ! నీవు ఫ్రాంక్ గా ఒక మాట చెప్పరా. సిగరెట్ పబ్లిక్ గా తాగితే  Cigarette and Other Tobacco Products Act  కింద రెండొందలు లేదా ఐదొందలు జరిమానా వేస్తారేమో. ఇంట్లో మొక్కల చుట్టూ రోజూ యూరిన్ పోస్తే పక్కింటొడికి వచ్చే కంపుకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 268 కింద పబ్లిక్ న్యూసెన్స్….అదెంత పెద్ద అఫెన్స్ తెల్సా ? బొక్కలోకి తొయ్యొచ్చు ”

” వెళ్ళి గడ్కారికి చెప్పు ” నేను పార్కులో మొక్క కున్న పువ్వు తెంపి ముక్కు వద్ద పెట్టుకుని పీల్చాను.

నా మొహం మీద పొగ ఊదాడు. వాడికి నేనంటే చిన్నప్పటుండీ ఒక ఎగతాళి. కలిసే పెరిగాం కదా అందునా బాల్య స్నేహం …భరించాలి !

” గడ్కారి ఇంట్లో మొక్కలకు యూరిన్ పోస్తానంటే పక్కింటోళ్ళకు న్యూసెన్స్ . అది అఫెన్స్ అనే విషయం వదిలేసి యూరిన్ లో గొప్ప తనాలు వెతుకుతారేంద్ర భయి ?! ”

” యూరిన్ లో లీటర్ కు పది గ్రాముల దాకా యూరియా ఉంటుంది. నీవు నెల రోజులు ఒక మొక్క చుట్టూ పోస్తూ ఉంటే కనీసం పావు కేజీ యూరిన్ దానికందుతుంది. అదే క్వాంటిటీ యూరియా ఫర్టిలైజర్ కొనాలంటే కేజీ సుమారు ఐదు, ఆరు రుపాయలౌతది. సేవింగ్ ఏ కదమ్మా ఇదంతా ? ”

వాడు గడ్డం వాడే లాక్కుని అన్నాడు ” ఈ లెక్కన టాయిలెట్స్ రావడం వల్ల మన దేశ సంస్కృతి కూడా దెబ్బ తింటుంది అన్న మాట ” ఏదో అనలిటికల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.

” తెలుసు….పబ్లిక్ గా పిస్ కొట్టడమే కదా ?”

‘ ధభా ‘ అని వీపు చప్పరించి ఫక్కున నవ్వాడు ” వెరీ షార్ప్ ”

” సోచ్ హోతో శౌచాలయ్ హై…రాంగ్….సోచ్ హో తో శౌచాలయ్ నహీ కరెక్ట్. చాలా విచిత్రంగా మోదీ ఒకటి కష్టపడి చెప్తాడా ? ఆయన వెనకాలే వీళ్ళందరూ ఇంకోటి చెప్తారేంద్ర భయ్ ” వేసాడు ఇంకోటి వీపు మీద.

ఒక ఫేమిలీ దూరంగా పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు. చిన్నపిల్లోడు చల్లటి సాయంత్రం లో పచ్చటి గడ్డి బయల్ల మీద బాల్ తో ఆడుకుంటున్నాడు. అక్కడ ఇంకా కొన్ని ఫేమిలీస్ కలిసి సమయం గడుపుతున్నారు.  సాయంకాలం ఇండియా గేట్ దిట్టంగా కనిపిస్తుంది.  మధ్యలో ద్వార ప్రవేశం ‘ కొండంత అండగా ఉంటాను నీవిటొచ్చేయ్ ‘ అన్నట్టు ఉంటుంది.

BottledUrine

” మన హైదరాబాద్ రింగ్ రోడ్డులో చెట్లు నాటుతున్నారు. ఒక్కో చెట్టుకు ఒక్కో కవర్ కట్టి ”  Please piss here. We shall be glad  ‘ అని పెట్టాలి ” అన్నాడు.

” యా….అసలు పెద్ద పనికే ఒక ప్రొవిజన్ పెడ్తే ఇంకా బాగుంటుంది.  you get lot of organic fertiliser   ”

” రోడ్డు మీద ట్రావెల్ చేసే వాళ్ళకు  ” Please carefully drive…organic fertilisation in process   ‘ అని పెట్టాలి ”

ఇంకో సిగరెట్టు తీసాడు. ” ఒరేయ్…ప్లీజ్…దూరంగా వెళ్ళి తాగురా…” అన్నా.

వాడో అనాథ. చిన్నప్పుడు బీడీలు తాగేవాడు. చదువు లో మాత్రం ఫస్ట్ ఎప్పుడూ. నేనే లాస్ట్. వాడికి ఉద్యోగం చేయడమంటేనే అలర్జీ . నే ఉద్యోగం చేస్తూ పది సంవత్సరాలు గడిపినా వాడు మాత్రం ఇంకా హైదరాబాదులో నిరుద్యోగిగా పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు.

” ఏదో రోజు ….ఇదే కంపును ఆనందంగా అహ్వానించే రోజు రాక మానదు లే నీకు. కంపుగున్నవి , కంటగింపుగా ఉన్నవి ఇంపుగా, ఇల సొంపుగా అవుతాయి.  వెయిట్ అండ్ సీ ….శివుడు హాలాహలం కంఠం లో దాచుకున్నందుకు ఆ వేడిని తట్టుకోడానికి ఏం తాగాడో తెలుసా ? ఇదే పొగనిచ్చే గంజాయిని…..ఈ పొగ కూడా డివినిటీ తీసుకుంటుంది త్వరలో….ఇదే పొగను రిఫైన్ చేసి ఆహా ఒహో అంటూ వాడుకునే  రోజులొస్తాయ్ ఇక……” అని ఆ చివరి సిగరెట్టును జాగర్తగా జెబులో కూర్చోబెట్టాడు.

” మరేం   !…….కౌ యూరిన్ రిఫైనరీ రాజస్థాన్ లో పెట్టారు. డివినిటీ నో గాడిద గుడ్డో…ఐడియా జీవితాన్ని మార్చేసింది కదా ?! ”

” హలో….చెన్నై లో సిటీ మధ్యలో పొంగిపొర్లే  డ్రైనేజ్ గంగ పక్కనే 2000 సంవత్సరం లో ప్లాంట్ పెట్టి ఇప్పటి వరకు …అందులో డ్రైనేజి వాటర్ నుండి మినరల్ వాటర్ కన్నా మంచి నీళ్ళు తయారు చేస్తున్నారు. లీటర్ కు ఐదు పైసల కన్నా తక్కువ ఖర్చులో. నీటి బెడద ఉన్న  ప్రాంతాల్లో ఫేక్టరీకి కావాల్సిన నీళ్ళు అవే వాడుకుంటున్నారు.  ఇంతకన్నా మంచి ఆయిడియా ఉందా , యాక్చువలీ ?  ”

” ఓహో ! నీటి కొరత ఉండే చెన్నై లో ….అంత మంచి నీళ్ళు మరి జనాలకు సప్లై చేయొచ్చు కదా ? ”

” మన దేశ సంస్కృతి గో మూత్రం తాగడం పర్మిట్ చేస్తుంది. మనుష్యులది కాదు ”

నేను వాడి భుజం మీద ఆప్యాయంగా చేయేసాను. వీడికి మనుష్యులంటే మాత్రం ఎందుకంత మక్కువో ?!  చూడ్డానికి వాడు సమాజం లో చితికి పోయిన  నిరుద్యోగి లా ఉంటాడు కానీ , ఒక స్ట్రక్చర్ లో పని చేయాలంటే చిరాకు వాడికి. అందుకే మార్కెటింగ్, సాఫ్ట్ వేర్, పబ్లిక్ రిలేషన్స్ లలో వాడికో మూడు , నాలుగు ఉద్యోగాలొచ్చినా ఎక్స్ పెరిమెంట్ చేసి, పడక వచ్చేసాడు.

కలిసి నడుస్తున్నాము.

మబ్బులు కమ్ముకున్నాయి కదా…..ఇండియా గేట్ మీద మేఘాలు అందంగా అటూ ఇటూ తచ్చాడ్డం బాగుంది.

వాడు గడ్డం గోక్కుంటూ కంటిన్యూ చేసాడు.

” బయో డైజెషన్ ప్రాసెస్ తెల్సు కదా ? గో మూత్రమే కాదు …ఏ మూత్రమైనా….ప్రాసెస్ చేస్తే మీథేన్ వస్తుంది…అదే మన అంబాని అందరికీ టొపీ పెట్టిన సహజ వాయువు….వీళ్ళ బొంద…..గో మూత్రం కెమికల్ కంపోజిషన్ గమనిస్తే , గొర్రె మూత్రం చూసినా, ఒంటె మూత్రం చూసినా కొంత తేడా ఉంటుంది కాని ఆర్గానిక్ ప్రాపర్టీస్, మెటీరియల్ గా ఏవీ తేడా ఉండదు. ”

‘ వీడిప్పుడు టెక్నాలజీ మూడ్ లోకి వెళ్ళాడు ‘ అనుకున్నాను. ”  Urine is Urine. Its excreta of living beings containing several biological waste elements   ” అని పక్కనుండి పాస్ అయిన పటియాలా డ్రస్ పంజాబీ అమ్మాయిని సాలోచనగా చూస్తూ అన్నాడు.

వాడి గడ్డం లాగి నా వేపుకు తిప్పుకుని, వాడు వదిలేసిన పాయింటు దగ్గర కంటిన్యూ చేసాను.  ” మొరార్జీ దేశాయ్ గొప్పోడురా…అప్పట్లోనే …మూత్రం తాగేసాడు మొహమాటం లేకుండా. … జనాలే అపహాస్యం చేసారు. కానీ …ఇంట్రెస్టింగ్ ఏంటంటే…మొరార్జీ సిండ్రోం  కళ్ళ ముందు ఉండగా, జంకకుండా, గడ్కారీ ఇలా ఓపెన్ గా చెప్పుకోడానికి భలే తెగింపులే  ? ”

State of waters - boy and frog

” ఎంత ధైర్యమైనా వస్తుందిరా. ఇంతకు మునుపెప్పుడన్నా దేశ ప్రతిష్ట గంగలో కలిసి పోతుంది అనే కాన్సెప్ట్ తో చట్టం పని చేయడం చూసావా ? ”

” లే ”

” దేశ జనాభా , కుటుంబ నియంత్రణ అని స్మరించే మనము – పందుల్లా పదేసి మందిని కనడం మన కర్తవ్యం, గురుతర బాధ్యత అని ధైర్యం చేసి ఎవడన్నా అంటాడు అని ఊహించావా ? ”

” లే ”

” ఇదీ అంతే ….. సౌదీలో ఇస్లామిక్ ఆర్థిక శాస్త్రం ఉంటుంది. ఇక్కడ కూడా అదే తరహాలో మత ఆర్థిక శాస్త్రం …. ”

నేను వెంటనే అన్నాను ” వెస్ట్రన్ ఎకానమిస్ట్స్ ఇస్లామిక్ ఆర్థిక శాస్త్రాన్ని ఆకాశానికెత్తినప్పుడు దీన్ని ఎందుకు తలకెత్తుకోరు ?! ”

” వెస్ట్రన్ నాయాళ్ళు. స్పైన్ లేని నాయాళ్ళు. వాళ్ళ మాట చెప్పక ”

వాడు – మేము కాలేజీలో ఉన్నప్పుడు నేను రంగ నాయకమ్మ పుస్తకాలు చదివితే ఇరిటేట్ అయ్యి లాక్కుని ” సెల్ఫ్ లవ్ ‘ స్టోరీలు చదవక ” అని విసిరికొట్టి చేతిలో ” చీకటి రోజులు ” ” చిత్ర హింసల కొలిమిలోంచి ” లాంటి నావల్స్ పెట్టేవోడు. ఏమిరా అంటే ” లోయలో పడే మనుష్యులను రక్షించాలనుకునే రచయితలు లోయలో పడే మనుష్యుల వ్యథను  వివరిస్తారు…వర్ణిస్తారు….కాని లోయల నైసర్గిక పరిణామాలను, జారి పడే మనుష్యుల అవలక్షణాలను  విశ్లేసిస్తూ తమ ఐ క్యూ ను, ఏప్టిట్యూడ్ ను చాటిచెప్పుకుంటూ ‘ సెల్ఫ్ లవ్ ‘ డిస్ప్లే చేయరు ” అనే వాడు.

వాడికి సిగరెట్ తాగాలనే అర్జ్ పెరిగినట్టుంది. అందునా ఒకటే సిగరెట్ మిగిలి ఉంది వాడి దగ్గర. ఊరికే చేతులు జేబు మీద పెట్టి తడుముతున్నాడు.

” లుక్…మన దేశ సంస్కృతిని మనం ఎత్తి పట్టాలి ”

” అందుకేగా టాయిలెట్స్ తీసేయాలి అనేది. అదే భారతీయ సంస్కృతి కూడా !”

పిల్లోడు ఆడుకుంటున్న బాలు ‘ టపీ ‘ మని రాబర్ట్ గాడి యెదపై వచ్చి కొట్టుకుంది. పిల్లోడు బాలు పట్టుకుని వెనక్కి చూడకుండా పరిగెత్తుకెళ్ళాడు…పొరపాట్న ఎక్కడ ఆపేస్తాడో అన్నట్టు.

రాబర్ట్, బంతి దెబ్బకు జేబులో నలిగి పోయిన సిగరెట్టును వేళ్ళ మధ్య అటూ ఇటూ తిప్పుతూ చూస్తూ ఉన్నాడు.

” మన సంస్కృతికి , రాజకీయాలు ముడేస్తే ఏమౌతుంది ? ”

” ఉ____   రాజకీయాలు పుడ్తాయ్ !! ”

వాడికి బాగా కాలినట్టుంది …………… …………..!!!!

లెఫ్ట్ వాళ్ళకి అంబేద్కర్ ఏమిటో తెలియదు: నకుల్

 పి. విక్టర్ విజయ్ కుమార్

 

గత వారం ముజఫర్ నగర్ మీద డాక్యుమెంటరీ గురించి మీరు చదివారు.  నిండైన గడ్డం తో , గొప్ప చదువరి చూపులతో కనిపించే ఉత్సాహ వంతమైన యువ మేధావి నకుల్ సింగ్ సాహ్నీ నుండి డాక్యుమెంటరీ  దృక్పథం, ప్రణాళిక విషయాలతో పాటు పెరుగుతున్న మత ఛాందస వాదం  కుల రాజకీయాలు, ముజఫర్ నగర్ ఊచకోత సంఘటన యొక్క ప్రత్యేక స్వరూప లక్షణాలు, భారతీయ కిసాన్ యూనియన్  తిరోగమన పాత్ర, ప్రస్తుత పరిస్థితుల్లో మత ఛాందసవాద వ్యతిరేక పోరాటం లో అంబేద్కర్ ప్రాముఖ్యత, హిందూ ఛాందస వాదానికి వ్యతిరేకంగా పోరాడగలిగే సైద్ధాంతిక ఆలోచన ధోరణి లాంటి విషయాలపై  నకుల్ తో కాసేపు..

విజయ్ : నకుల్ గారు, మీరు  మీ టీం  కృషి ఘనంగా అభినందనీయం. శుభాకాంక్షలు ! ఈ దేశం లో ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా హిందూ ఛాందస వాదం పేట్రేగి పోతున్న సమయం లో , ద్వేషం  అసహనమే రాజకీయాలను నడుపుతున్నప్పుడు చాలా సమయానుకూలంగా మీ డాక్యుమెంటరీ రావడం జరిగింది. నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి  వచ్చి సమయం వీలు చేసుకుని ఈ సినిమా చూడ్డమే కాకుండా 10 డీ వీ డీ లు స్నేహితుల కోసం కొన్నాం.

నకుల్ : విజయ్ గారు,   మీకు సినిమా నచ్చడం సంతోషం.

విజయ్: ఈ డాక్యుమెంటరీ సున్నితంగా సూక్ష్మంగా మత ఛాందస వాదాన్ని పరిశీలిస్తుంది.  ” ముజఫర్ నగర్ బాకీ హై …” తీయడం లో మీ దృక్పథం ఏంటి ? అసలు ఇదే ప్రధాన విషయంగా ఎందుకు ఎన్నుకోవాలనిపించింది ?

నకుల్ : మనం కొని సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలి. ”  Immoral Daughters of the land ”  అనే డాక్యుమెంటరీ మీద పని చేస్తున్నప్పుడు ఈ ఆలోచన తట్టింది. ఆ డాక్యుమెంటరీ హర్యానాలో ఖాప్ పంచాయితీల గురించి మరియు పరువు హత్యల గురించి తీయడం అయ్యింది. అకస్మాత్తుగా పరువు హత్యలు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం చేసుకోదల్చుకున్నాను. ఒక ప్రధాన విషయం తెలిసిందేమంటే – నిమ్న కులాలలో పెరుగుతున్న ప్రకటిత భావనకు వ్యతిరేకంగా అగ్ర కులాలలో పెచ్చరిల్లిన విరోధం ప్రధాన కారణం. సరిగ్గా ఇదే అంబేద్కర్ చెప్తాడు. ” ఒక యువతి తన కులానికి బాహ్యంగా ఉన్న వ్యక్తితో పెళ్ళి చేసుకున్నప్పుడు, కుల వ్యవస్థను కాపాడే ఈ వివాహ వ్యవస్థను వ్యతిరేకించి,  ఈ కుల వ్యవస్థకున్న ఒక ప్రధాన పునాదిని పగలగొడుతున్నట్టే ! ” . ఈ డాక్యుమెంటరీ మీద పని చేస్తున్నప్పుడు డిసెంబర్ 2010 లో హర్యానా కు బయటి ప్రాంతాల్లో నివసిస్తున్న  జాట్ కులసముదాయం లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలని  ముజఫర్ నగర్ వెళ్లాను. ‘ఖాప్ పంచాయత్ విధానం ‘ తిరిగి తెరపైకి రావడం నేను గమనించాను. జాట్ అస్తిత్వ రాజకీయాలు  అంతర్లీనంగా దళిత , మహిళా వ్యతిరేకమైనవి.

అప్పట్లో , పశ్చిమ యూ పీ లో , ఈ జాట్ అస్తిత్వ రాజకీయాలు త్వరలో హిందూ మతతత్వ రాజాకీయాలలోకి జారుకుంటున్నాయనే విషయం నాకు అనిపించింది. ఆ ప్రదేశాలు ముస్లిం జనాభా ఎక్కువగా కలిగినందువలన , ఆ రాజకీయాలు ముస్లిం మైనారిటీ వ్యతిరేక రూపాన్ని తీసుకుంటాయనే భావన నాకు కలిగింది. తిరిగి వచ్చాక మితృలతో మాట్లాడుతూ  అన్నాను ” ఈ జాట్ అస్తిత్వ రాజకీయాలు విషపూరితమైన హిందుత్వ రాజకీయాలుగా రూపు దిద్దుకుంటాయనే ఒక చెడు భావన నాలో ఉంది ” అని. మరి అదే జరిగింది ఇప్పుడు !. జాట్ ఛాందసవాదం అంటే అంతర్లీనంగా సాంఘిక ఛాదస్తాన్ని ఎగదోయడం, కులాంతర వివాహాలు చేసుకోకుండా మహిళలను నిరోధించడం. ఇలాగే, ఈ కులాంతర వివాహాలను అరికట్టకుంటే త్వరలో ఇది ముస్లిం లను హిందూ స్త్రీలు పెళ్ళి చేసుకోవడం కూడా ఆపలేదు. ఐతే ఈ ధోరణి ఎంత దాకా తెగించ గలదు అని నేను ఊహించలేదు . వాస్తవానికి, ఈ డాక్యుమెంటరీ, ముందు తీసిన డాక్యుమెంటరీకి తరువాయి భాగం లానే. అక్కడి నుండే నేను తీగ లాగాను.

విజయ్: హిందూ అగ్రకుల శక్తులు సమర్థిస్తున్న కుల తత్వ వాదము, కుల రాజకీయాలే ఈ మత ఛాందస వాదాన్ని ప్రోత్సాహిస్తున్నాయని మీరు అనుకుంటున్నారా ? కుల రాజకీయాలే మత రాజకీయాలకు భూమికగా నిలుస్తున్నాయా ?

నకుల్ : మత తత్వ వాదం అంటే బ్రాహ్మినీక మనువాద సిద్ధాంతానికి పొడిగింపే. మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఛాందస వాదం పెరిగేకొద్ది – ఇది కేవలం ముస్లిం లకు మాత్రమే అభద్రత కాదు, మహిళలకూ మరియు పెద్ద స్థాయిలో దళితులకు కూడా. ఈ రాజకీయాలు అంతర్లీనంగా మైనారిటీ, మహిళా, దళిత వ్యతిరేక రాజకీయాలే. ఆ విధంగా ఈ ముజఫర్ నగర్ సంఘటన ఏ విధంగా పితృ స్వామ్యం, కులతత్వం మరియు మత తత్వం అనుసంధించబడ్డవో చెప్పడానికి అద్భుత ప్రామాణికం. హెడ్గేవార్ ఒక ఆర్ ఎస్ ఎస్ సంస్థను స్థాపించడం ఎందుకనే ఒక ప్రశ్నకు బదులిస్తూ ఇలా అన్నాడు ” ముస్లింల లో అగ్రెషన్ పెరుగుతుంది ” అని. అదే పొడిగిస్తూ ఇలా అన్నాడు ” దీనితో పాటు నిమ్న కులాల్లో కూడా అగ్రెషన్ పెరిగిపోతుంది ” అని. ఆయన పుట్టి పెరిగిన మహారాష్ట్రలో జ్యోతిబా ఫులే నుండి అంబేద్కర్ వరకు ఈ ఉద్యమాలు బ్రాహ్మాణధిపత్యాన్ని ప్రశ్నించడం పెరిగిపోయింది. ఆర్ ఎస్ ఎస్ ప్రధాన ఉద్దేశ్యం బ్రాహ్మనీక ఆధిపత్యాన్ని ఎత్తి పట్టడమే. అందువలన ఇది కేవలం ముస్లిం వ్యతిరేక తత్వమే కాడు , దళిత వ్యతిరేక తత్వం కూడా. కాబట్టి ఈ మత తత్వ వ్యతిరేక పోరాటం పురుషాధిక్య వ్యతిరేక  కుల వ్యతిరేక పోరాటాలతో గాఢంగా మిళితమవ్వాలి. ఈ మత ఛందస వాదులే కదా అంబేద్కర్ ప్రవేశ పెట్టిన హిందూ కోడ్ బిల్లును కూడా వ్యతిరేకించారు ?! వీళ్ళు బహిరంగంగానే మనుస్మృతిని సమర్థిస్తారు. ఇంకా కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తున్నట్టు కొంతైనా నటిస్తుంది. అదే బీ జే పీ మనుస్మృతిని ఇప్పటికీ పూజింపదగినదిగా భావిస్తుంది.  అవును, మీరు చెప్పిన దానితో నేను పూర్తిగా ఎకీభవిస్తున్నాను – ఇవన్నీ ఒకే హిందూ ఛాందసవాదాన్ని సమర్థించే భావజాలాలే.

nakul

విజయ్ : మనకు స్వాతంత్ర్యం వచ్చాక ఎన్నో హేయమైన మత ఘర్షణలు జరిగాయి.   అయితే ఈ ముజఫర్ నగర్ అల్లర్లలో ఎవైనా ప్రత్యేకాంశాలు మీరు గమనించారా ?

నకుల్ : ప్రతి మత ఘర్షణలో ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మిగతా అల్లర్లను ఇంత దగ్గిరగా నేను అధ్యయనం చేయలేదు కాబట్టి ఇదమిద్ధంగా వ్యాఖ్యానించలేను. కానీ నాకు కొన్ని పరిశీలనలు ఉన్నాయి. బాబ్రి మజీదు సంఘటన సమయంలో కూడా ఇక్కడ చిన్నా చితక అల్లర్లు తప్ప , అది కూడా , పట్టణ ప్రాంతానికి పరిమితమై ఉన్నాయి. ఈ సారి మాత్రం ఈ అల్లర్లు గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించాయి. ప్రతి అల్లరి వెనుక ఉండే సహజ సిద్ధమైన ఆర్థిక మూలాలు ఇందులో కూడా ఉన్నాయి.  భారతీయ కిసాన్ సంఘం ను విచ్చిన్నం చేసి రైతు ఉద్యమాలను నీరు గార్చడం ఒకటి. రైతు ఉద్యమాన్ని నీరు గార్చడం తో పాటు ఇది బీ జే పీ కీ మిల్ ఓనర్లకు దోహదం చేసింది. 2005 నుండి చూస్తే షుగర్ మిల్స్ క్రమంగా ప్రైవేటు పరం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో కులం , మతం మాత్రమే కాదు – కార్పోరేట్ ల లోభం కూడా ఉంది. ఎన్నో అంశాలు కలిసి దగ్గరకు వచ్చాయి. నిజాయితీగా చూస్తే – మోదీ గుజరాత్ అల్లర్లకు ప్రధాన కారణం అని ప్రతి కార్పోరేట్ కు తెలుసు మరెందుకు ఆయన్ను సమర్థించాయి ?

విజయ్ : మీరు క్షేత్ర స్థాయిలో పని చేసారు. బీ జే పీ అధికారం కోసం అర్రులు జాస్తున్నప్పుడు , మోదీ పదవి కోసం తీవ్రంగా మోహం లో ఉన్నప్పుడు జరిగిన ఈ అల్లర్లు మునుపు అల్లర్లతో పోల్చి చూస్తే – ముందుగానే ఊహించి, ప్రణాళిక బద్ధంగా , నేర్పుగా రచించబడ్డ  అల్లర్లుగా అనిపిస్తుందా ?

నకుల్ : అవును. ఇవి ముందుగానే రచించ బడ్డ అల్లర్లు. గుజరాత్ అల్లర్లు ఒక స్థాయిలో రచించబడ్డదైతే ఇవి ఇంకో స్థాయిలో రచించబడ్డాయి. ఇది డాక్యుమెంటరీలో కూడా చూపించడం జరిగింది. వీళ్ళు స్థిరంగా చిన్న చిన్న అల్లర్లను మలుస్తూ వచ్చారు. ముస్లిం జనాభా అధికంగా ఉండదం వల్ల పశ్చిమ యూ పీ ని ఎన్నుకున్నారు. వీళ్ళకూ తెలుసు – ముస్లిం లు తిరగబడితే ఈ గొడవలు త్వరగా వ్యాపిస్తాయి అని. భారతీయ కిసాన్ సంఘం ను ఉపయోగించుకున్న విధాన్ని చూసినా, రైతు ఉద్యమాన్ని నీరు గార్చిన విధానాన్ని గమనించినా, పన్నాగ పూర్వకంగా హిందూ స్త్రీల భద్రత గురించి ప్రచారం చేయడం పరిశీలించినా ఇది తేట తెల్లం అవుతుంది. ఇదంతా 6 – 7 నెలల ముందు నుండే పన్నాగం పన్నిన్నట్టు నాకు అనిపిస్తుంది.

విజయ్ : భారతీయ కిసాన్ సంఘం (బీ కే యూ ) గురించి – బీ కే యూ నిజాయితీగా రైతు సమస్యల కోసం అంతకు మునుపు పోరాడిందంటారా ? కనీసం ఆ మేరకు ఆ అల్లర్ల మునుపు వరకైనా చేసిందంటారా ?

నకుల్ : 1989 లొ చూస్తే బీ కే యూ చారిత్రక రైతు ఉద్యమాన్ని నడిపిందన్న మాట వాస్తవం. అయితే ఆ ఉద్యమం ధనిక రైతులకు ప్రాతింధ్యం వహించందనే మాట కూడా వాస్తవమే.

విజయ్ : ప్రాంతీయంగా బీ కే యూ ఉద్యమం ను హిందూ అగ్రకుల వ్యవసాయదారులు, ధనిక రైతుల సముదాయం చేజిక్కించుకుని ఒక నమ్మకమైన స్థానాన్ని సంపాయించుకుని, ఒక సంక్షేమ కారణం కోసం మాత్రమే పోరాటం చేసే నాయకత్వంగా నమ్మబలికే రూపాన్ని తీసుకున్నాక – తమ స్థాయిని ఇప్పుడు అల్లర్లను రెచ్చ గొట్టాడానికి ఉపయోగించుకున్నాయా ?

నకుల్ : మీరు సినిమాను గమనిస్తే గులాబ్ అహమ్మద్ అనే ముస్లిం నాయకుడు బీ కే యూ నుండి విడిపోతాడు.  బీ కే యూ ఉద్యమం ముస్లిం లను మరియు జాట్లను కలిపి ఉండడం వలన బలహీన పడ్డట్టు బీ జే పీ భావించింది. ఇది విచ్చిన్నం చేయడం ద్వారా మొత్తం రైతు సంఘటననే నిర్వీర్యం చేయొచ్చని భావించింది. ఆ తర్వాత బీ కే యూ కేవలం జాట్లు శాసించే సంస్థగా  మిగిలిపోయింది.

విజయ్ : మీ సినిమా ఎలా సాగిందో , ఎలా నమూనాగా రూపొందించుకున్నారో , ఆ విధానం ఎలా ఉందో వివరిస్తారా ?

నకుల్ : అల్లర్లు జరిగిన ఒక వారం తర్వాత నేను షూటింగ్ మొదలు పెట్టాను. ఎలా వెల్తున్నామో మాకు క్రమంగా అర్థం అయ్యింది అప్పుడు. ఎలా మాముందు వాస్తవాలు రూపుదిద్దుకుంటూ వచ్చాయో అలా మేము ప్లానింగ్ వేసుకుంటూ వెళ్ళాము. నెలకు 10-15 రోజులు మా మకాం అక్కడే. ఒక 2-3 నెలల తర్వాత కూర్చుని – స్క్రిప్ట్ పోగు చేయడం మొదలు పెట్టాను. మేము – నాతో పాటు ఇద్దరు జర్నలిస్టులు – అందులో ఒకరు నా భార్య, తారిక్ అన్వర్, కెమెరా మ్యాన్ మహమ్మద్ గని, కామేష్, పులోమా పాల్, ఆషిష్ పాండే మిగతా మిత్ర బృందం ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కెమెరా మ్యాన్ మహమ్మద్ గని పేరు మేము చాలా సార్లు మార్చి మార్చి జాగర్త పడ్డాము. ( నవ్వులు)

విజయ్ : షూటింగ్ తీసే సమయం లో ప్రాక్టికల్ సమస్యలు ఏవి ఎదుర్కున్నారు ? ఈ డాక్యుమెంటరీని అడ్డుకునే ప్రయత్నాలు ఏమన్నా జరిగావా ?

నకుల్ : మీరు సినిమా చూసారు. అందులో బీ జే పీ ఎం ఎల్ యే ఒకరు కెమెరాని మూసేస్తాడు. ఇది మొహమ్మీదనే చేస్తాడు. ప్రత్యక్షంగా ఏవీ నిర్దుష్టమైన బెదిరింపులు లేవు . కానీ, ఆ ప్రాంతపు మితృలు మాత్రం నన్ను ” నీ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు ” అంటూ జాగర్త పరిచే వాళ్ళు.

nakul2

విజయ్ : వాస్తవానికి, అమిత్ షా రెచ్చ గొట్టే ఉపన్యాసం కూడా మీ కెమెరాలో చిక్కించుకున్నారు…..

నకుల్ : అవును. అది బట్ట బయలు చేసాక అమిత్ షా ను ఎన్నికల ప్రచారం ఒక వారం మేరకు చేయకుండా ఎన్నికల సంఘం నిరోధిస్తూ ఆంక్షలు విధించింది. నా భార్య ఒక ఆర్టికల్ కూడా వ్రాసింది. మేము ఈ క్లిప్ ను నెట్ లో పెట్టాము. కొన్ని పార్టీలు , ఈ క్లిప్ ఆధారంగా ఎన్నికల సంఘం కు ఫిర్యాదు చేసాయి.

విజయ్ : ఈ అల్లర్లలో దళితుల పాత్ర సహజంగానే వారికుండే సాంఘిక ఆర్థిక కారణాల దృష్ట్యా ఒక ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుంది. నాకు ఇందులో ఒక వ్యక్తి చెప్పే మాటలు గుర్తు ఉన్నాయి ” వాళ్ళకు ఈ విషయంలో ఏది ఎన్నుకోవాలో అస్కారం, అవకాశం లేదు. వాళ్ళు పారిపోయైనా వెళ్ళాలి లేదా బానిసలా బతకాలి ” అని. ఈ హిందూ ఛాందస వాదులు ఈ అల్లర్లు రెచ్చ గొట్టాడానికి దళీతులను వాడూకున్నట్టుగా మీకు అగుపించిందా ?

నకుల్ : ఈ నిర్దుష్టమైన అల్లర్ల విషయం లో కాదు. ఈ సినిమాలో ముస్లిం లు ‘ దళితులను మాలానే పరిగణించారు ‘ అని అనడం కనిపిస్తుంది. బీ ఎస్ పీ,   BAMCEF  యొక్క పాత్ర కూడా ఉంది ఇందులో. ఇందువలన కొన్ని దళిత కులాలు, ఉప కులాలు రాజకీయ చైతన్య వంతులు అవ్వడం జరిగింది. చాలా మందికి బీ జే పీ దళిత – ముస్లిం అల్లర్లను రెచ్చ గొట్టే ప్రయత్నం లో ఉందని అర్థం అయ్యింది . దళిత – ముస్లిం అల్లర్లను సృష్టించడానికి బీ జే పీ మురాదాబాద్ లో కూడా కృషి చేసింది . కానీ సఫలీకృతం అవ్వలేదు. ఎవో కొన్ని వాల్మీకి సముదాయం లోని కొన్ని సెక్షన్ లు బీ జే పీ కి మద్దతు ఇవ్వడం కనిపించింది. కాన్షీ రాం తర్వాత, మాయావతి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని చంపి వేసింది. ఆ తర్వాత బాం సెఫ్ ఉద్యమాన్ని కూడా క్రమ క్రమంగా చంపేసింది. అధికారం సంఘటించడం అవసరమే కాని అందుకు సిద్ధాంతాలను పణం పెట్టి కాదు. ఈ సినిమాలో ఒక దళితుడు చెప్పడం గమనించవచ్చు ” ఆమె పండిట్ లను చుట్టూ పోగేసుకుంది ” అని. అయితే , కాన్షీ రాం పోషించిన పాత్ర, దాని ప్రభావం ఇప్పటికీ ఉంది. బీ ఎస్ పీ ఒక్క సీట్ కూడా గెలవ లేకపోయింది కాని, 19 శాతం ఓట్లు సంపాయించగలిగింది కదా? ఎవరు వీళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు ?. ఆ ప్రాంతాలలో దళిత – ముస్లిం అల్లర్లను రెచ్చ గొట్టడం బీ జే పీ కీ సులభతరం కాదు.

విజయ్ : మీరు బీ జే పీ , ఆర్ ఎస్ ఎస్ వాళ్ళ నడవడిక గమనించినట్టైతే అంబేద్కర్ ను మమేకం చేసుకోడానికి ఆశ మీరిన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అంబేద్కర్ హిందూ ఛాందస వాదానికి వ్యతిరేకంగా పోరాడిన వీరోచిత సైనికిడు. ” నేను హిందువులకు తోటలో పాము లాంటివాడిని ” అని స్పష్టంగా అన్నాడు. హిందూత్వం అని కూడా ఉల్లేఖించకుండా సరాసరి ” హిందువులే ” అనేసాడు. ఈ తృణీకార, నిస్పృహ వైఖరి వారిపై నిర్మొహమాటంగా ఎదురు తిరగడం లాంటిది. ఈ విషయం లో మీ నిర్దుష్ట అభిప్రాయం ఏంటి ? ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటారు ?

నకుల్ : నా మట్టుకు నేను ఈ విషయం లో లెఫ్ట్ ను తప్పు పడతాను. లెఫ్ట్ అంబేద్కర్ ను మమేకం చేసుకోలేకపోయింది. అందుకే రైట్ చేసుకుంటుంది. లెఫ్ట్ కుల సమస్యను సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయింది. అంబేద్కర్ ను మొత్తానికే నిర్లక్ష్యం చేసారు. సోవియట్ యూనియన్ నుండి తీసుకున్న నమూనాను పూర్తిగా భిన్నమైన ఈ దేశ సమాజం లో  ‘ కాపి అండ్ పేస్ట్ ‘ చేయ జూసారు. అసలు కులం, వర్గం లో సమైక్య భాగంగా ఎందుకు గుర్తింపు పొందలేక పోయింది ? . ఈ నాటికీ లెఫ్ట్ ఈ విషయం అర్థం చేసుకోలేదు. సీ పీ ఎం పార్టీ కాంగ్రెస్ ను ఇటీవలే పూర్తి చేసుకుంది. కానీ పోలిట్ బ్యూరోలో ఒక్క దళిత వ్యక్తి లేడు. లెఫ్ట్ అంబేద్కర్ ను దత్తత తీసుకుని ఉంటే రైట్ కు వేరే గతి ఉండేదే కాదు. అద్వాని రథ యాత్ర చేసినప్పుడు కులతత్వ రాముడి బొమ్మ పక్కనే అంబేద్కర్ బొమ్మను పెట్టుకునే సిగ్గుమాలిన తనం ప్రదర్శించారు. కానీ దురదృష్టం ఏంటంటే మార్క్స్ పక్కన పొరపాట్న కూడా అంబేద్కర్ ఫోటో పెట్టిన పాపానికి లెఫ్ట్ పోలేదు. కాబట్టి ఎవరిని ఈ విషయం లో నిందించాలి ?

విజయ్ : రాజ్యం ఏదన్నా అణచివేయలేకపోతే మమేకం చేసుకుంటుంది. అంబేద్కర్ ను మమేకం చేసుకోవడం అంటూ జరిగితే చాలా వినాశనం జరుగుతుంది.

నకుల్ : ఖచ్చితంగా అవును. చూడండి..” ఘర్ వాప్సీ ” కి అంబేద్కర్ స్పష్టంగా వ్యతిరేకం. కానీ ఈ విషయం లో అంబేద్కర్ ను అనుకూల స్వభావిలా చిత్రీకరించే యత్నాలు జరుగుతున్నాయి.

విజయ్ : నాకు ఈ డాక్యుమెంటరీ లో వ్యక్తిగతంగా కష్టం కలిగించిన విషయం ఒకటి ఉంది. హిందూ ఛాందస వాదమే కాదు అసలు హిందూత్వానికే వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన వ్యక్తి అంబేద్కర్. ఆర్ ఎస్ ఎస్ హెడ్ క్వార్టర్స్ అయిన నాగ్ పూర్ లో బుద్ధిజం స్వీకరించిన సాహసం ఆయనది. చాలా ప్రణాళికా బద్ధంగా హిందూత్వం పై దాడి చేసిన వ్యక్తి ఆయన. ఈ సినిమాలో అంబేద్కర్ ను మెరుగుగా వాడే అవకాశం మీరు వినియోగించుకోలేదెందుకని ? ఈ సినిమా మొత్తం అంబేద్కర్ గురించి నిశ్శబ్దంగా ఉంది. ఈ సినిమాను ఈ విషయం లో మెరుగు పరిచే అవకాశం ఉందని మీరు అనుకోవడం లేదా ?

నకుల్ : ఈ సినిమా అతని తాత్విక వాదాన్ని ఎన్నొ విధాలుగా తీసుకువస్తుంది. మత ఛాందస వాదం పై పోరుకు అంబేద్కర్ తాత్విక వాదాన్ని మరింతగా అన్వేషిస్తుంది.బీ ఎస్ పీ ఈ విషయం లో విఫలమయ్యింది అనే విషయం కూడా సినిమలో చెప్ప బడుతుంది. మనకు అంబేద్కర్ కావాలి. భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతో మంది కావాలి. ఈ కుల, మత, వర్గ అంశాలు ఒకటినొకటి ముడి వేసుకున్న పరిస్థితిని మనం అంగీకరించాలి. మీరు చెప్పదల్చుకున్నదేంటో నాకు అర్థమయ్యింది. ఐతే ఈ సినిమా ఇంకా ఎన్నో విషయాల గురించి చెప్తుందనే విషయాన్ని కూడా చూడాలి. సినిమా లింగ సమస్యను, బీ కే యూ పరిస్థితిని …ఇలా ఎన్నిటినో చూపుతుంది. మీరు చెప్తున్నట్టుగా చేయాలంటే ప్రత్యేకమైన సినిమా తీయాల్సి ఉంటుంది. అంబేద్కర్ గురించి ప్రత్యేక ఉల్లేఖనలు ఉన్నాయి. అలాగే భగత్ సింగ్ గురించి కూడా. భగత్ సింగ్ మరియు అంబేద్కర్ కలిసి సహ జీవనం చేయగలరు అని కూడా గమనించాలి.

విజయ్ : హిందూ ఛాందస వాదాన్ని ఎదుర్కునడానికి ప్రత్యేక సైద్ధాంతిక వాదం ఏది సరి అయినది అని మీరు అనుకుంటున్నారు ? లేదా ఈ సమస్యను ఒక సాధారణ కోణం లో చూడ వలసిందేనా ?

 నకుల్ : నా ఉద్దేశ్యం లో సాంప్రదాయ మార్క్సిజం విఫలమయ్యింది. అంబేద్కర్ ను, ముస్లిం లను అర్థం చేసుకోగలిగే మార్క్సిజం కావాలి మనకు. చాలా మంది అగ్ర కులాల వాళ్ళు పైకి రిజర్వేషన్ లు ఎందుకు అని ప్రశ్నించినా – వాళ్ళ మనసుల్లో మన దేశం లో దళితుల పట్ల వ్యవస్థీకృతమైన వివక్ష ఒకటి ఉందనే విషయాన్ని ఒప్పుకుంటారు. ఐతే ఇంకా ఆ విధంగా ముస్లిం లు కూడా వివక్షకు గురవుతున్నారనే విషయాన్ని ఒప్పుకునే స్థాయికి రాలేదు. ప్రతి అగ్ర కుల వ్యక్తికి ” నాకు కులమంటే నమ్మకం లేదు ” అని చెప్పడం చాలా సులభం. ఎందుకంటే వాళ్ళూ దళితులకు మల్లే  దైనందిన వ్యవహారాల్లో కులం గురించి ఙ ప్తికి  తెచ్చు కోవాల్సిన పరిస్థితి రాదు. సాంఘిక న్యాయం వర్గ పోరాటం అంత ప్రధానమైనది.

 విజయ్ : ఇప్పుడు చివరి ప్రశ్న. ఇది మీ గురించే. మీ గురించి చెప్పండి. మీ భవిషత్ ప్రణాళికలు ఏవన్నా ఉంటే చెప్పండి

 నకుల్ : నేను ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్ ఆనర్స్ లో గ్రాడ్యుయేషన్ చేసాను. తర్వాత పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో  2005-06 లో చేరాను. ”  Once upon a time in chheharta  ” అని నా మొదటి డాక్యుమెంటరి. శ్రామిక వర్గ పోరాట చరిత్ర గురించి తీసిందది. తర్వాత బోంబే లో 2 సంవత్సరాలు గడిపాను. ఐతే సృజనాత్మకతను పరిమితం చేస్తుందనే ఉద్దేశ్యం తో  కమర్షియల్ సినిమాల వేపు మొగ్గు చూపలేకపోయాను. ఖచ్చితమైన భవిష్యత్ ప్రణాళికలు లేవు కాని …ఒకటి మాత్రం చేస్తా – అది ” సినిమాలు తీస్తూ ఉండడమే ! ” ( నవ్వులు)

*

ముజఫర్ నగర్ రావణ కాష్టం ఆరిపోదు !!

పి. విక్టర్ విజయ్ కుమార్ 

 

మునుపెన్నడూ లేని ధోరణులను మన దేశ రాజకీయాల్లో చూస్తున్నాము. ” పబ్లిక్ గా ఏమి చేసినా సరే – అది చట్ట బద్ధంగా ఐనా సరే, చట్ట వ్యతిరేకంగా ఐనా సరే, అక్రమంగా అయినా సరే, అన్యాయంగా అయినా సరే…ఎటొచ్చీ జాగ్రత్తగా , సక్రమంగా, సంబంద్ధంగా తయారు చేసిన ఒక ప్రణాళిక ఉంటే చాలు….ఈ దేశ ప్రధాన మంత్రి అయిపోవచ్చు  ” . ” దేశ పరువు ప్రతిష్ట ” అనే అప్రస్తుతమైన కల్పిత పదాలని కనుగొన్న ” భావ చిత్ర  రాజకీయ ” (image politics) శకం కు  మనమిప్పుడు సాక్షులుగా ఉన్నాము. మీడియా రొదలు, ఆగి ఆగి, గొంతు మార్చి మార్చి వినిపిస్తే నిజమని నమ్మే ధోరణి ఒక సూత్రంగా మారి, మనుగడ సాగించే  ” వ్యక్తి పూజ ” రాజకీయాలను మనమెప్పుడో జీర్ణించేసుకున్నాం.

ఐతే ఈ రోజు రాజకీయల్లో నిజమెంత అని ప్రజలు ఒక అంచనాకు వస్తున్న ప్రయత్నం లో ఉండగా నకుల్ సింగ్ సాహ్ని అనే 32 ఏళ్ళ యువకుడు ” ముజఫర్ నగర్ దాడులు ( అల్లర్లు ?? ) ”  మరియు వాటి రాజకీయత కు సంబంధించిన అల్లికను దులిపి నిర్భీతితో ముసుగు తొలగించే అడుగు వేసాడు.

” ముజఫర్ నగర్ బాకీ హై…..” ( ముజఫర నగర్ సశేషమే ! ) అనే డాక్యుమెంటరీ మత ఛాందస వాదపు గొంతుకను సున్నితంగా , సూక్ష్మంగా తెగ కోసి దాని జిత్తుల పార్శ్వాన్ని ఎండగట్టే కృషి పట్టుదలతో తయారు చేసిన ఒక కళాఖండం. ఎన్నికల సమయంలో, ముందుగానే రచింపబడ్డ వందకు పైగా మరణాలు , ఎన్నో సామూహిక మాంభంగాలు – ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ప్రజలను ఊచ కోత కోసిన ‘ ముజఫర్ నగర్ ‘ మన దేశ సామాజిక చిత్తరువుపై చెరగని నల్లటి మచ్చను వదిలివెళ్ళింది.

ఉత్తర ప్రదేశ్ చరిత్రలో మొట్ట మొదటి సారి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎన్నిక అవ్వని ఒక పరిణామాన్ని కేవలం ఉత్తర ప్రదేశ్ కే కాదు దేశ రాజకీయాలకు రుచి చూపించింది ?!!

అదే నకుల్ గారి యొక్క డాక్యుమెంటరీలో అగుపడే ఒక సాధారణ వ్యక్తి మాటల్లో చెప్పాలంటే –

” దీని బాధ్యత ప్రభుత్వానిదే. అది కాంగ్రెస్ కావచ్చు, ఎస్ పీ కావచ్చు, బీ ఎస్ పీ కావచ్చు. ఎవరి స్వార్థం మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. ఐతే మోదీ విషయం లో – నేను నూటికి నూరు శాతం ఖచ్చితంగా చెప్పగలను దీనికి ఆయనే కారణం అని. యూ పీ లో మోదీకి ఎప్పుడూ ఉనికి లేదు. గతం లో ఒక భారీ ర్యాలీని తీసిన సమర్థత లేదు ఇక్కడ. మొట్ట మొదటి సారిగా ఇక్కడ ఆయన అడుగు పెట్టాడు. అప్పటి నుండి ఇక్కడ ఈ అస్తవ్యస్థత ఏర్పడింది. ”

ఈ దేశం లో జరిగే పరిణామాలను అర్థం చేసుకోవడానికి మనకు ఎంతో ప్రశంసించబడ్డ మేధావులు , సాంఘిక శాస్త్రవేత్తల సహాయం అవసరం లేదు – ఒక సాధారణ మనిషి కున్న సమాచారం, విశ్లేషణను సరిగ్గా గమనిస్తే చాలు. నకుల్ గారు మనల్ను ఆ దృక్పథం లో క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళి ఎంతో చాతుర్యంగా లింగ సమస్యకు , మత ఛాందస వాద సమస్యకు మరియు కుల సమస్యకు ఉన్న అంతర్లీన బంధనాలను ఎంతో సమర్థవంతంగా ఎండగడతాడు.

1424293384-672_Nakul-pic

” షుగర్ బౌల్ ”  గా ప్రసిద్ధి పొందిన ముజఫర నగర్ సెప్టెంబర్ 2013 లో మతతత్వ విషాన్ని వెళ్ళగక్కి దేశ ప్రజాస్వామిక వాదులకు చేదు రుచి చూపించింది.  3.3 లక్షల హెక్టేర్లకు పైగా వ్యవసాయిక భూమిని కలిగి, 10 కి పైగా షుగర్ ఫేక్టరీలు ఉండి మరియు ఎన్నో స్టీల్ మిల్స్ కలిగిన ముజఫర్ నగర్ ఉత్పాదక ఉపాధిని కల్పించే గలిగే సమర్థతో , ఈ దేశం లో జీవించడానికి అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో ఒకటిగా పేర్కొనబడవచ్చు. దేశ రాజధానికి కేవలం 120 కి.మీ దూరంగా ఉన్న ఈ ప్రాంతం ఎంతో ప్రణాళికా ప్రాముఖ్యతను కలిగి ఉందని చెప్పుకోవచ్చు. దేశం లో మిగతా ప్రదేశాల్లా కాక, మూడో వంతుకు పైగా ముస్లిం జనాభాను కలిగి ఉంది. ముజఫర్ నగర్ జనాభా సాంద్రత 1000/ చ.కి.మీ కి పైగా  ఉంది. ఇది సగటు దేశ జనాభా సాంద్త్రత 382/చ.కి.మీ తో పోలిస్తే చాలా ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే ఈ ప్రాంతం ఎంత ఉపాధి సౌకర్యాలు కల్పించే ప్రదేశమో తెలుస్తుంది. ఐతే ఇక్కడ సెక్స్ నిష్పత్తి చూస్తే – దేశ సగటు 940 ఉండగా ( ప్రతి వేయి మంది పురుషులకు) – కేవలం 889 గా మాత్రమే ఉంది.

ఈ ప్రదేశం లో మత ఛాందసవాదం ఇంతగా ఎలా పాతుకుపోయిందో ఎంతో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉండగా , డాక్యుమెంటరీలో ఆ ప్రదేశ వికాసమంతా కొన్ని వర్గాల మధ్యనే , ముఖ్యంగా జాట్ల మధ్య, కేంద్రీకృతం అయినట్టు తెలుపుతుంది. ఈ జాట్ సముదాయం ఒక బలవంతమైన శక్తిగా , మత ఛాందస వాదానికి ఒక ప్రధాన చట్రంగా నిలిచింది.

ఈ డాక్యుమెంటరీ అమిత్ షా రెచ్చగొట్టే  ఉపన్యాసాన్ని కూడా మనముందుకు తీసుకు వస్తుంది. ” పశ్చిమ ప్రాంతపు ఉత్తర్ ప్రదేశ్ లో  ఎన్నికలు మన పరువుకు సంబంధించిన వ్యవహారం. మనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన ఎన్నికలు ఇవి. మరియు మనకు అన్యాయం చేసిన వారికి ( ??) ఒక గుణ పాఠం నేర్పించాల్సిన ఎన్నికలివి “. ఈ ఉపన్యాసం ను వీడియో క్లిప్ ద్వారా బయట పెట్టడం వలన ఎన్నికల సంఘం అమిత షా ను ప్రచారంలో నిరోధించాలని కట్టుదిట్టం చేసింది.

muja1

డాక్యుమెంటరీ షూట్ చేసే బృందము  వి ఎచ్ పీ నాయకులను, భారతీయ కిసాన్ సంఘం కార్యకర్తలను, బీ ఎస్ పీ, ఎస్ పీ నాయకులను, దళిత ముస్లిం సెక్షన్ లను మరియు జాట్లను కలిసి, వారి అభ్హిప్రాయాలను, అనుభవాలను సేకరిస్తుంది.

ఈ డాక్యుమెంటరీలో సమయానుకూల బేక్ గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే,  ఎడిటింగ్ చూస్తే  మంచి టెక్నికల్ విలువలు కూడా అగుపిస్తాయి. ఫోటోగ్రఫీ మనల్ను జనాల మధ్య తిప్పుతూ విషయాన్ని ఎంతో సహజంగా అర్థం చేయించే విధంగా ఉంటుంది. సంఘటన విశదీకరణ లో దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. ఎన్నో వదంతులను ఈ డాక్యుమెంటరీ నివృత్తి చేస్తుంది. పాకిస్తాన్ లో తీసిన ఒక వీడియో క్లిప్ ను ప్రాంతీయంగానే జరిగిన ఒక సంఘటనగా మలిచి  హిందూ మత ఛాందస వాదులు ద్వేషాన్ని ప్రబలింపజేస్తూ వదంతులు సృష్టించడానికి ఎలా ఉపయోగించుకున్నారో చూపిస్తుంది. ఈ ముజఫర్ నగర్ సంఘటన లో ఒక విశేషాంశం ఏమంటే హిందూ స్త్రీలపై అత్యాచారాలు అనే విషయాన్ని  ఒక పని ముట్టుగా విరివిగా వాడుకోవడం.

ఇంటర్వ్యూ చేయబడిన ప్రజలు ఎంతో ఆసక్తికరమైన అంశాలు తెలియజేసారు.

” కులం , మతం తో సంబధం లేకుండా మగాళ్ళందరూ ఒకటే. పరువు అనే విషయం కేవలం స్త్రీల భుజ స్ఖందాలపై ఉంచి దాన్ని కాపాడే బాధ్యత కేవలం మహిళలదే అని అనుకుంటారు ”

” దళితులు కూడా మాలాగనే కూలీలు. కానీ కత్తులు కొడవళ్ళు పట్టుకుని మమ్మల్ని వాళ్ళు వెంటాడారు. ఇలా చేయమని వాళ్ళకు ఆదేశాలున్నాయి. లేకపోతే తమ పొలాలలో పనులు దొరకవని భయం పుట్టించారు. బలహీనుడు అంత కన్నా ఏం చేయగలడు ? పరిస్థితుల నుండి పరిగెత్తన్నా వెళ్ళాలి లేదా బానిసలా అణిగి మణిగి ఉండాలి ”

” మాకు అంబేద్కర్ స్పష్టంగా చెప్పాడు. మేము హిందువులం కామని ”

డాక్యుమెంటరీ , భగత్ సింగ పోస్టర్ ఉండగా, సమ సమాజాన్ని ఆకాంక్షిస్తూ, ఒక గీతం తో ముగుస్తుంది. ఒక చోట ఒక చిన్నపిల్లాడు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నప్పుడు , ఈ దేశం లో మైనారిటీల పరిస్థితిని గుండెను తడిమేలా అద్దం పడుతాడు.

” ఇది మా ఇల్లే. పోలీసులు తగల బెట్టారు ”  …..!!!

నిండైన గడ్డం తో , గొప్ప చదువరి చూపులతో కనిపించే ఉత్సాహ వంతమైన యువ మేధావి నకుల్ సింగ్ సాహ్నీ నుండి డాక్యుమెంటరీ  దృక్పథం, ప్రణాళిక విషయాలతో పాటు పెరుగుతున్న మత ఛాందస వాదం మరియు కుల రాజకీయాలు, ముజఫర్ నగర్ ఊచకోత సంఘటన యొక్క ప్రత్యేక స్వరూప లక్షణాలు, భారతీయ కిసాన్ యూనియన్  తిరోగమన పాత్ర, ప్రస్తుత పరిస్థితుల్లో మత ఛాందసవాద వ్యతిరేక పోరాటం లో అంబేద్కర్ ప్రాముఖ్యత, హిందూ ఛాందస వాదానికి వ్యతిరేకంగా పోరాడగలిగే సైద్ధాంతిక ఆలోచన ధోరణి లాంటి విషయాలపై …..                                                        “సారంగ”  ప్రత్యేక ఇంటర్వ్యూ వచ్చే వారం..

 

 

ఒకే ఒక బలమైన ఆయుధం- ” అంబేద్కర్ “!

పి.విక్టర్ విజయ్ కుమార్

దళితులు , గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు , ప్రజాస్వామిక వాదులు – మదిలో  కొవ్వొత్తులు వెలిగించి మరో జీవన వైవిధ్యాన్ని , జీవన శైలిని నేర్పించిన మహానుభావునికి మదిలో వెల్లువెత్తిన కృతజ్ఞతతో  ఆయన జన్మ దినాన్ని స్మరించుకున్నారు…ఎప్పటిలానే.
అంబేద్కర్ ఒక వర్గానికి కులానికి సంబంధించిన మేధావి కాదు. ఆయన 1990 లలో ఒక  Parallel Thinker . ఒక సాంప్రదాయక ఆలోచనా విధానాన్ని బద్దలు కొట్టి ” సాంఘిక చైతన్యం ” అనే అంశాన్ని ప్రతి మేధావి ఆలోచనలో భాగం చేయాల్సిన పరిస్థితిని కల్పించిన మొదతి భారతీయ తాత్విక వేత్త. 1920 ల నుండి గాంధీ తో సహా ప్రతి నాయకుడికీ –  ఏ రాజకీయ వేదిక అయినా సరే – కొరకరాని కొయ్యగా నిలబడ్డాడు. ఆయన ఆర్థిక శాస్త్రం లో కొలంబియా యూనివర్సిటీ నుండి  MA, PhD,    London School of Economics  నుండి  D Sc  పట్టభద్రుడయ్యాడు. లండన్ నుండి బారిష్టర్ డిగ్రీ పొంది అకడమిక్ గా సాధించిన అద్భుత విజయాన్ని ఆ రోజుల్లో తన కుల వ్యతిరేక తపనను తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నాడు.  ఆయన ఈ దేశం సంపాయించిన మొట్ట మొదటి ఆర్థిక వేత్త అనే విషయం మనం ఇక్కడ గుర్తించాలి. ఇదే విషయాన్ని అమర్త్య సేన్ స్వయానా అభిమానంగా చెప్పుకుంటాడు.
అంబేద్కర్ , గాంధి,  కాంగ్రెస్ గురించి ప్రస్తావిస్తూ ఇలా అంటాడు  ” కాంగ్రెస్ హిందూ పెట్టుబడిదారులు చేరవేసిన మధ్య తరగతి హిందువుల సంస్థ. వీరి ఉద్దేశ్యం భారతీయులను స్వతంత్రులను చేయడం కాదు. బ్రిటీష్ వారి నుండి విముక్తి పరచడమే. బ్రిటీష్ వారి ఆధిక్య స్థానాన్ని వీరు ఆక్రమించుకోవడం. ఇదే స్వాతంత్ర్యం ఐతే హిందువులు తర తరాలుగా అస్పృశ్యులను ఎలా పరిగణిస్తూ వచ్చారో అదే కొనసాగుతుంది “
అంబేద్కర్ ఈ దేశం లో దళితులకే కాదు , ప్రతి మేధావికి నేర్పించింది ” వ్యక్తిత్వం ” ” స్వతంత్రత ” (  Individuality and independent thinking  )  . చెప్పదల్చుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తీకరించడం , మెజారిటీ అభిప్రాయాన్ని కాలదన్ని స్వంతంత్ర ఉద్దేశ్యాన్ని ప్రకటించడం లో అంబేద్కర్ ప్రతి మేధావికి మార్గ దర్శకుడు.
1918 లో మాంటేగ్ – ఛేంస్ఫర్డ్ సంస్కరణల ప్రక్రియలో భాగంగా ఇండియాలో ఎలక్షన్ విధానాన్ని పునర్నిర్వచించే ఉద్దేశ్యం తో  ‘ సౌత్ బరో కమిటీ ‘ ని నిర్మించారు.  అంబేద్కర్ యొక్క విద్యా ప్రఙలు  తెలుసుకున్న ప్రబుత్వం , అంబేద్కర్  యొక్క అభిప్రాయాలు తెలపమని ఆహ్వానించింది. అప్పుడు అంబేద్కర్ కు 28 సంవత్సరాలు. స్వాతంత్ర్య ఉద్యమం ఇవ్వలేని గుర్తింపు  బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చిందంటే – మన దేశం లో స్వాతంత్ర్య ఉద్యమ పోరాటం లో పాతుకు పోయిన కుల పిచ్చి తీవ్రత ఏంటో మనకు తెలుస్తుంది. ఈ రోజు ” భారత్ మాతా కీ జై ” ” వందే మాతరం ” లాంటి స్వాతంత్ర్యా పోరాట నినాదాల్ని వల్లించే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ నినాదాల్లో కుల వ్యవస్థ ఎలా గంగ వెర్రులెత్తిందా అని.
కానీ అంబేద్కర్ 1930 లో అఖిల భారత నిమ్న వర్గాల కాంగ్రె సభలో తన ఉపన్యాసంలో ఇలా అంటాడు ” మన దేశం లో మన దురదృష్ట పరిస్థితులను నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నట్టు బ్రిటిష్ చెప్పుకుంటుంది.  అది కేవలం ఈ దేశ రాజకీయ పురోగతిని అడ్డుకోవడం కోసమే అలా చేస్తుంది “
అదే ఉపన్యాసం లో ఇలా అంటాడు –
” మన దేశానికి స్వయంప్రతిపత్తి ఇవ్వడం నేను వ్యతిరేకించలేను. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం మన సమస్యను ఎప్పటికీ తీర్చలేదు. ఐతే కాంగ్రెస్ తో కలవడం వలన మనం సమస్యను ఎలా పరిష్కరించుకోగలమో నాకు అర్థం కాదు. …”
ఈ ఉపన్యాసం తర్వాత ” యూ టూ బ్రూట్ ! ”  ( You too Brutus ! )  పేరుతో తిలక్ తన ” కేసరి ‘ పత్రికలో అంబేద్కర్ ను ” దేశ ద్రోహి ” గా ” బ్రిటిష్ ఏజంట్ ” గా అభివర్ణించాడు.
అంబేద్కర్ కు ఉన్న స్పష్టత , వ్యక్తిత్వం అబ్బురమైనవి.  కులం లాంటి నికృష్ట సాఘిక సమస్య పై అవగాహన లేకున్నా  కేవలం స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందు ఉండి నడిపిస్తుందనే ఒక్క కారణం వల్ల కాంగ్రెస్ గొప్పదైపోదు అని అంబేద్కర్ అభ్రిప్రాయ పడ్డాడు.
ఇలా చూస్తే విప్లవ ఉద్యమాలు కూడా కేవలం కుల సమస్యను దాని లోతుల్లో పరిశిలించడం లో ఫెయిల్ అయ్యినప్పుడు ( తర్వాత దిద్దుబాటు కనిపించినా ) ఇదే వాదనలు వినబడ్డాయి. దళిత వాదులకు వచ్చిన ‘ కాన్ ఫిడెన్స్ ‘ ఇక్కడి నుండే. మీరు విప్లవ ఉద్యమం నడుపుతున్నారనే ఒకే కారణం వలన మేము మీతో ఉండలేము అని ఎదురు వినిపించారు. ( ఐతే ఆ దళిత వాణిలో పదును ఎక్కువ రోజులు నిల్వలేదు. అది తర్వాత చూద్దాం )
అంబేద్కర్ 1930 లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి , కాంగ్రెస్ బహిష్కరించినా, తను  హాజరౌతాడు. ( రెండొ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ అలక తీరి హాజరుతుంది ).  అంబేద్కర్ తనకు కావల్సిన విషయాన్ని సాధించడనికి  Diplomatic tactics  చాలా వాడాడు. తప్పని తెలిసిన చాలా విషయాలను ఎత్తుగడల కింద మలిచాడు.  Absolute sense of facts  ను  relative sense of facts  ను జాగర్తగా అంచనా కట్టాడు.  అలా కాక అంబేద్కర్ సాయుధ విప్లవ కారుడై ఉండి ఉంటే ఒక అద్భుతమైన అమరుడై మన పుస్తకాలలో వెలిగే వాడు కాని అదెలా ఉంటుందంటే – మృత శిశువుకు జన్మనిచ్చి చనిపోయిన తల్లిలాంటి స్థానం. ఇన్ని సంవత్సరాల సాయుధ పోరాటం ఎన్ని ఒడిదుడుకులకు లోనైందో ఊహించలేము. ఐతే అదే దళిత పక్ష పాత దృష్టితో చూస్తే – చివరకు దళితులకు ఏమి మిగిలి ఉండేది – అమరుడైన అంబేద్కర్  అద్భుతమైన చారిత్రక  గుర్తులా ?  అసలు ‘ మతమంటేనే మత్తు మందు ‘ అనే ఒక  absolute fact  ను పట్టుకుని వేలాడుతూ ఉండి ఉంటే దళితులకు ఎటువంటి మత ప్రత్యామ్నాయం చూపించకుండా ఉండి ఉంటే హిందూత్వాన్ని వెల వెల బోయేట్టు చేయగలిగే వాడు కాదు. ఈ విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోకుండా అంబేద్కర్ మతాన్ని ప్రోత్సాహించాడు అని కొంతమంది ప్రగతిశిల వాదులు అనుకోవడం అవివేకం.  
అంబేద్కర్ వికృత బ్రాహ్మణ ఛాందస శక్తుల మధ్య ఒక్కడే ఒక్కడై హిందువులను ద్వేషించి , సిగ్గు పడేట్టు చేసి – ఆర్ ఎస్ ఎస్ బలమైన స్థావరమైన నాగ్ పూర్ లో బుద్ధిజం స్వీకరించాడు. అంబేద్కర్ తెగువకు తార్కాణాలెన్నో !
అంబేద్కర్ కమ్యూనల్ అవార్డ్ విషయంలో దళితులకు ” ప్రత్యేక ఓటు పద్ధతి ” ని బలంగా ముందు తీసుకువచ్చాడు. అదే జరిగి ఉంటే ఈ రోజు దళితులు అనూహ్యంగా ఒక సమాంతర రాజ్యాన్ని సాధించగలిగే వాళ్ళు. వాళ్ళ వోటుతో వారి అభ్యర్థులను ఎన్నుకునే పద్ధతి ఒక రాజకీయ ఎత్తుగడతో కూడిన ప్రణాళిక. బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకున్నా, గాంధి హిందు వ్యవస్థ యొక్క ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒప్పుకోక పోవడం వలన జరిగిన ” పూన ఒడంబడిక ” లో ” రిజర్వ్డ్ ఓటింగ్ సిస్టం ” వచ్చింది.
చరిత్ర చదివితే మనకర్థమయ్యేది – హిందూ వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వకుండా హిందూ వ్యవస్థ ప్రతిపాదించిన రాజీ ఫార్ములానే రిజర్వేషన్ లు !
అంబేద్కర్ సాంఘిక మార్పు కోరుకున్న ఒక బూర్జువా ఆలోచన కలిగిన మేధావిగా ఇప్పటికీ ఎంతో మంది విప్లవ మేధావుల్లో ఉంది. రంగనాయకమ్మ లాంటి మేధావులు – ఒక 500 పేజీల పుస్తకం కూడా విడుదల చేసారు – అంబేద్కర్ లోని తప్పులు ఎత్తి చూపిస్తూ.
అంబేద్కర్ కు సాంఘిక మార్పు ఒక దీర్ఘ కాలిక ప్రక్రియ అనే విషయం తెలీదు అనడానికి ఏ విధమైన ఆధారాలు లేవు. అలాగే తాను ప్రతిపాదించిన పద్ధతుల వల్ల విప్లవాత్మక మార్పు వస్తుందనే నమ్మకాన్ని వెలువరించిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అంబేద్కర్ దీర్ఘ కాలిక పోరాటం మృత శిశువుగా మిగలనీయ కూడదనే ప్రయత్నం లో – దళితుల చైతన్యాన్ని నిశితంగా అంచనా వేసుకుని  existing institutions  ను తన మనుష్యుల కొరకు వాడుకున్నాడు. ప్రతి ప్రజాస్వామిక మేధావిని విప్లవ కారుడుగా ఉండాల్సింది అని కోరుకునే ఒక వెర్రి అంచనా అంబేద్కర్ ను తక్కువ చేస్తుంది. రంగ నాయకమ్మ చేసిన పెద్ద పొరపాటుఇదే ! ఆమె అంబేద్కర్ తప్పులు విజయవంతంగా ఎత్తి చూపింది కాని – అంబేద్కర్ లేని దళితుల జీవితం ఎలా ఉండేదో ఒకే ఒక్క క్షణం ఊహించి ఉండి ఉంటే – ఈ కుల వ్యవస్థ ఉన్నంత కాలం అంబేద్కర్ లో తప్పులు ఎన్నడం ప్రధానం కాదు, ఆయన కృషిని , ఆయన సిద్ధాంతాలను కులవ్యవస్థలో మగ్గిపోయిన అణగారిన వర్గాలకు ప్రేరేపితంగా ఎలా ప్రెజెంట్ చేసి ఉండల్సిందో ఆలోచించడం ప్రధానమై ఉండేది. ఇంతా చేసి ” మృత శిశువు ” లాంటి ఆదర్శ రాజకీయ సొల్యూషన్ తో ముగించింది తప్ప – కాంక్రీట్ గా ఈ కుల వ్యవస్థ ఎలా నిర్మూలింపబడి ఉండొచ్చో తెలియ జేయడం చాత అవ్వలేదు.  రంగ నాయకమ్మ లాంటి మేధావులకు  ” self-goal ”  కొట్టుకోవడం లో ఉన్న ఆనందం , కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాజీ లేకుండా ఆలోచించే ఉద్దేశ్యం లో లేదు.  
అకడమిక్  మార్క్సిస్ట్ ల పరిస్థితి ఇలా ఉంటే –  Dalit fundamentalism  ఒక దృక్పథంగా ఒక మార్గంగా ముందుకొచ్చి – 1980-90 లలో వచ్చిన దళిత చైతన్యాన్ని సరిగ్గా గైడ్ చేయడం లో విఫలం అయ్యింది. ” కుల నిర్మూలన ” కు ముందు మాటగా ” డాక్టర్ అండ్ సెయింట్ ” అనే ఒక అద్భుతమైన విశ్లేషణ అరుంధతి రాయ్ వ్రాయగలిగింది కాని మన దేశం లో దళిత వాణిని ఎత్తి పట్టిన దళిత వాదులు కాదు. అంబేద్కర్ వీళ్ళకు నేర్పించిన ” ధిక్కార స్వరం ” ధిక్కారం దగ్గర , ” ఆత్మ గౌరవాన్ని ” ఆంజనేయ దండకంగా చదవడం లోనే మిగిలిపోయింది. దళిత వాదులు రాజకీయ కెరీరిస్టులుగా, ఆచరణ లేమి కలిగిన వ్యక్తులుగా మిగిలి ఒక  Group force  గా ముందుకు రాలేకపోయారు. ఆచరణ అవలంబనం లేని ధిక్కారం ఛాందస వాదంగా మిగిలిపోతుంది తప్ప బలమైన రాజకీయ వాదంగా నిలబడలేదు. దళిత వాదం స్త్రీ వాదం లాగే  Urban middle class  కు పరిమతమై సహజ మరణానికి దగ్గరగా ఉంది. ధిక్కార స్వరం వినిపించిన దళిత వాణికి ఆధిపత్య సంక్షోభం తో కొట్టుమిట్టాడుతుంది. ఏ ఒక్క నాయకత్వము కూడా దళిత వాదులను ఎక్కువ కాలం ఒకే గాటికి కట్టలేక పోవడానికి ప్రధాన కారణం ఈ  Dalit fundamentalism  ప్రధాన కారణం.
ఇక అంబేద్కర్ ను ఇప్పటి పరిస్థితుల్లో చూడాలంటే – రోజు రోజుకు ఆయన ప్రాధాన్యత పెరుగుతుందే తప్ప తరగడం ఉండడం లేదు. గుజరాత్ గొడవల వెనుక ఉన్నదెవరో బీ జే పీ కి ఓటేసిన ప్రతి హిందువుకూ తెలుసు. అయినా సరే దళిత, గిరిజన, మైనారిటీల సంక్షేమానికి వ్యతిరేకంగా పని చేసే రాజకీయ నాయకున్ని ప్రధానిగా ఎన్నుకోవడం ఈ దేశం లో పాతుకుపోయిన హిందూ ఛాందస వాదానికి ప్రతీక. ఈ హిందూ ఛాందస వాదానికి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్ యొక్క ఆలోచనా విఢానాన్ని బలంగా తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతో ఉంది. ” మైనారిటీ  ఒక పేలుడు పదార్థం లాంటిది. అది పేలిందంటే రాజ్యం యొక్క మనుగడ ఛిన్నాభిన్నం అవుతుంది ” ” హిందుత్వం ఒక మతం కాదు. ఒక వ్యాధి ” ” ఈ దేశం లో హిందువులు వ్యాధి గ్రస్థులు. వారి వ్యాధి ఈ దేశ ఆరోగ్యానికి , ఆనందానికి హాని కలిగిస్తుందనే విషయం తెలియ జేసేట్టు చేస్తే నాకు సంతృప్తి కలుగుతుంది ”  ” హిందువులకు నేను తోటలో పాము లాంటి వాడిని ” ‘ హిందువులు అత్యంతగా ద్వేషించే వ్యక్తి ఈ దేశం లో నేనే ” అని ఎంతో ధైర్యంగా చాతీ విరిచి హిందూ ఛాందస సమాజాన్ని ఎదుర్కున్న అంబేద్కర్ మన సమకాలీన పరిస్థితులకు ఎంతో అవసరం. ఈ విషయం గ్రహించిన కాషాయ సంస్థలు ముందుగానే అంబేద్కర్ ను తమ వాడిగా సృష్టించే ప్రయత్నం చేయడం కాకతాళీయం కాదు. హిందూ ఛాందస వాదం క్రిస్మస్ ను మిగేస్తుంది. ఈస్టర్ ను మింగేస్తుంది. మన జీవితం లో అనుభవించే ప్రతి చిన్న హక్కును చిదిమేస్తుంది. ఇదే ఫాసిజం గా రూపాంతరం చెందుతుంది. దానిని ఎదుర్కోగలిగిన ఒకే ఒక బలమైన ఆయుధం ” అంబేద్కర్ ” ఒకటే !!!
వినిపించని ఓ కేకలా
వినిపించినా క్షణ కాలమే కొట్టూ మిట్టాడిన ఓ ఆర్తనాదం లా
అతని భాష మిగలాలని కోరుకోలేదు
ఒక దృఢ నిశ్చయం తో బండ రాళ్ళను ఛేదించి
మేరువులా ఒక నిట్ట నిశీధిన  ఆయన వచ్చాడు
పగిలిన పిగిలిన గొంతులకొక భాష
ధారపోస్తున్నప్పుడు
ఆయన ఊహించాడు
ఒకే భాష – ఒకే మాటగా ఒక పునాదిని మిగిలిద్దామనుకుంటే
తన భాషకో ఆయుష్షు కావాలనుకున్నాడు
అర్థమయ్యే భాషను సిద్ధం చేయడానికి
తనకో ప్రాణం కావాలనుకున్నాడు
అంతే తప్ప
పిడికిలితో మెరుపులు రాజేస్తున్నప్పుడు
అగ్ని స్నానం చేస్తాడు
నిజానికి లావా ఉప్పెనల్లో  ఎన్నో సార్లు మరణించి తిరిగి లేచాడు
ఆయన ఎంచుకున్నది మృత శిశువుకు జన్మనిచ్చి
తనువు చాలించిన తల్లి పాత్ర కాదు
అమరత్వానికి వ్యర్థార్థాలు వెదికే సమయం కాదప్పుడు
ఆయన భాష నేర్చిన స్వర పేటికలు నెత్తుటి గడ్డలు
కక్కినా మరణాన్ని కాంభోజ రాగం లో ఆలాపిస్తాయి
మొదట ఒక భాష కావాలి
ఆ భాష కోసం
మృత్యు ధారియై ఆయన నిలవాలి
ఆయన నమ్మిందంతే  !
*

దేశ భక్తులు పోలీసులు – ఎన్ కౌంటర్లే దేశ సేవ!

పి. విక్టర్ విజయ్ కుమార్ 

ఎన్ కౌంటర్ జరిగిన ప్రతి సారి – ‘ పోలీసులు తమ వృత్తి ధర్మానికి ప్రాణలొడ్డినప్పుడు రాని హక్కుల సమస్య ఒక నేరస్తున్ని ఎన్ కౌంటర్ చేసినప్పుడు రావడం ఏంటి ‘ అనో ‘ పోలీసులకు మనుష్యులు కాదా ?వాళ్ళకు హక్కులు లేవా ? ‘ అనో కొన్ని కామన్ ప్రశ్నలు మన మధ్యలో ప్రయాణం చేస్తూ ఉంటాయి.

ఒక మితృడు వాదించాడు ఇలా –

” కూలీలైతేనేం….ఏం కోట్లు విలువ చేసే ఎర్ర చందనం ఎత్తుకు పోతున్నప్పుడు వెధవలకు తెలీదా అందులో రిస్క్ ? కాల్చి పారేయాలి నాయాళ్ళను. చంద్ర బాబు అంటే మాటా ?! మజాకా ?! ”

నేను అడిగాను ” మొన్న నీవు తాగి డ్రైవ్ చేసినప్పుడు , నీకు చలాను వేసాడు కదా పోలీసు ?”

” అవును ?! ” అందులో ఏమంత వింత అన్నట్టు చూసాడు.

” చలాను ఇవ్వకుండ ‘ తాగి డ్రైవ్ చేస్తే ఎంత నష్టమో తెలుసా ‘ అని చాచి లెంప కాయ ఇస్తే ఎలా ఉండేది నీకు ” అన్నా.

“ఆ……మ్మ్.. .మ్మ్ మ్మ….రీ …తాగినందుకే లెంపలు వాయిస్తారా ? వాడి బామ్మర్దులనుకుంటారా ……. లేపొతే ……ఎవన్ని పడ్తే వాన్ని వాయించొచ్చనుకుంటారేంటి ”

* * * * *

ఇంకొక మితృడు –

” చేసేది దొంగ తనం. పోలీసులు కాల్చకుండా ఉంటారా ? ”

” అవును. కాల్చకుండా ఉంటారా ?…అసల నీ చేతిలో ఒక గన్ను ఉండి ….నీవు అక్కడ ఉండి…వాళ్ళను కాల్చేసి ఉన్నావనుకో …..పోలీసులు నీలానే ‘ చేసేది దొంగ తనం . మరి ఇలా చావరా ఏంటి ‘ అని వాళ్ళను చంపేసిన నిన్ను సత్కరిస్తారా ? లేదా అరెస్ట్ చేసి 302 సెక్షన్ బుక్ చేస్తారా ? ”

” ఆబ్వియస్లీ …కేస్ బుక్ చేస్తారు ”

” ఓహ్ ! ఈ దేశానికి నీవు మాత్రం అంటే ఎంత శీత కన్ను ? ‘
* * * * * *

ఇంకో మితృడు –

” పోలీసులు పాపం రాత్రనక, పగలనక పెళ్ళాం పిల్లల్ని వదిలేసి ….దొంగ తనం చేస్తున్న వాళ్ళను కాల్చి చంపితే జనాలకు…చంపారనే విషయం గుర్తుంటుంది తప్ప….అయ్యో పోలీసులు ప్రాణాలను రిస్క్ చేసి …..వాళ్ళ డ్యూటీ చేస్తున్నారు కదా …అని ఒక్క వెధవ కు అనిపించదు ‘ …..( ‘వెధవ ‘ అన్ని పలికినప్పుడు మాత్రం నా మొహాన్ని చూసి )

” మీ పక్కింట్లో కుక్క పిల్ల రాత్రులు అరిచి అరిచీ నీకు నిద్ర లేకుండా చేస్తుంది అన్నావు కదా మొన్న ? ”

” అవును ? ” ఇప్పుడు దీనికేం ఎదవ లింక్ అన్నట్టు మొహం చిట్లించాడు.

” ఆ కుక్కను చంపేస్తే ? ”

” చీ …సిగ్గు లేదూ ?! కుక్క ఓనర్ గాడికి బుద్ధి లేదు . పాపం కుక్కేం చేసిందంట మధ్యలో ? ”

” మీ వీధిలో గస్తీ తిరుగుతున్న పోలీసుకు కంప్లైన్ చేసావనుకో ‘ ఏవండీ , ఈ వెధవ కుక్క తెగ మొరుగుతుంది. దాని ఓనర్ గాడికి బానే ఉంది. మాకే నిద్ర పట్టటం లెదు ‘ అని. జస్ట్ అనుకో…పోలీసాయనుండి ‘ సార్…ఈ తల నొప్పి ఎందుకు ?’ అని గన్ తీసి కుక్కను ఒక్క సారి టపీమని కాల్చేసాడనుకో….అలా జరిగిందనుకో…..పర్లేదా ? ”

” అది పాపం కదా ? ”

” నీకు జరిగింది కూడా పాపమే కదా ? ”

” ఐతే పోలీసోళ్ళు చంపేస్తారా ? అందునా కుక్కను ? ”

” వాళ్ళు రాత్రంతా మేల్కుని మనల్ని పరిరక్షిస్తున్నారు కాబట్టి ఒక మంచి కోసం కుక్కను చంపేసినా ఒప్పేసుకోవచ్చులే !! ”

* * * * * * * *

మొదటి మితృడే మళ్ళీ ఇలా అడిగాడు –

” పోలీసులను లేండ్ మైను పెట్టి నక్సలైట్లు లేపేసినప్పుడు అప్పుడు గుర్తుకు రాని హక్కులు ఎవర్నో దొంగ నాయాళ్ళను చంపితే గుర్తుకొస్తుందా ఈ హక్కుల వాళ్ళకు ? ”

” నీవు తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు పోలీసు చలాను ఇవ్వకుండా లాగి కొట్టి ఉంటే నీవేం చేసేవాడివి ? …జస్ట్ ఆస్కింగ్….”

” ఏం చేసేవాన్ని ……పడేవాన్ని ”

” ఏం తిరగ బడొచ్చు కదా ? ”

” ఇంకో రెండు ఎక్కువ తగిలిస్తారు. లేదంటే లోపలేసి కుమ్మేస్తారు ”

“కుమ్మించుకోడానికి నీవు రెడి అయినా …అది ఒక లెక్క కాదు అని అనుకున్నా …నీవు కూడా వాళ్ళను కుమ్మేస్తావన్న మాట ??? ”

” ఏమో ?! ”

” అంటే నీవు తిరిగి కుమ్మే రిస్క్ ఉందని తెలిసినా …వాళ్ళు నిన్ను మేన్ హేండిల్ చేసారన్నట్టు…అంతేనా ? ”

” అంతే కదా ?”

” నీకు తాగడం తెలుసు కాని తన్నడం తెలీదు కాబట్టి బతికి పోయారు పోలీసులు. అందరూ నీలానే ఉంటే ఎంత బాగుణ్ణు ? ”

“_______”

* * * * * * * *
మొన్న తీవ్ర వాదులు విచ్చల విడిగా పోలీసులపై కాల్పులు జరిపి పొట్టన పెట్టుకుని ఎన్ కౌంటర్ లో చావడం నా భార్య ఫోన్ చేసి చెప్పింది ‘ ఇదుగో ఇది న్యూస్ ‘ అని. నేను అన్నా ‘ ఇంకొన్ని రోజుల్లో ఆంధ్ర తెలంగాణా లో ఎన్ కౌంటర్స్ జరుగుతాయి మళ్ళీ ‘ అని.

ఈ దేశం లో మధ్య తరగతి జనాభా 50 శాతానికి పైనే ఉంటుంది. ఈ మధ్య తరగతి కి ఉండే ఒక ధోరణి ” Excessive neutrality ‘ ని కోరుకోవడం . ఏ సమస్య అయినా ఏదీ , ఎవరికీ నష్టం జరక్కుండా జరగాలని ఆశించడం …అది కుదరకపోతే న్యాయాన్ని ‘ బ్రేక్’ చేసిన వాడిని కాక సామరస్యానికి తల ఒగ్గ్గని వాడిని ప్రశ్నించడం. ఐతే ఏదైనా – సమస్య తమ స్వంత తలలకు చుట్టుకోనంత కాలం మాత్రమే ఈ ‘obsession ‘ ఉంటుంది.

చరిత్రలో ఏ ఉద్యమం చూసినా, ఏ డెవలప్ మెంట్ చూసినా – మద్య తరగతి పాత్ర ఇదే !
మన అభివృద్ధి చెందే భారత దేశం లో ఈ ధోరణి తో మన రాజకీయాలు , రాజకీయ పార్టీలు కూడా సతమౌతూ ఉంటాయి. అదే పాశ్చాత్య దేశాల్లో చూస్తే – ఎన్ కౌంటర్ జరిగితే – అది నిజం ఎంకౌంటర్ జరిగిందా …ఫేక్ ఎంకౌంటర్ జరిగిందా అనే చర్చ దగ్గిర సాధారణంగా ఆగిపోతుంది తప్ప – అసలు ఫేక్ ఎన్ కౌంటరా కాదా అనె ప్రశ్న లేకుండా చచ్చిపోయినోడు – చావడానికి అర్హుడా కాదా అనే దగ్గర చర్చ ఆగుతుంది ఇక్కడ.

అందుకే – కొన్ని సంవత్సరాల క్రితం వై యెస్సార్ టైం లో వరంగల్ లో అమ్మాయిలపై యాసిడ్ దాడి చేసిన ముష్కరులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసినప్పుడు అక్కడ ఎస్. పీ హీరో అయ్యాడు. అదేంటో మరి వాళ్ళను నక్సలైట్లు చంపి ఉంటే – నక్సలైట్లను ఎన్ కౌంటర్ లో లేపేసే వాళ్ళు ! అప్పుడు ఎవరూ అయ్యో అనరు ?! బాగా ఆశ్చర్యం వేసే విషయం ఏంటంటే – ప్రజలు పుష్ప గుచ్చాలు ఇస్తుంటే ఎస్ . పీ గారు నవ్వుతూ కెమెరాకు పోజు ఇవ్వడం. ( ఏం ! మీ కూతురికో…మీ భార్యకో..అమ్మకో ఇలా జరిగి ఉంటే …మీరూ చెయ్యరా…అని ఒక personalised question ఒకటి ఎదురు చూడాలి ఇక ) . ఆయన గారు అంతటితో ఆగలేదు – ఒక గంజాయి స్మగ్లర్ను, ఒక పెద్ద నక్సలైటు లీడర్ ను ఎన్ కౌంటర్ లొ అంతం చేసాడు.

పోలీసులు మన వ్యవస్థలో చంపడానికి unconditional authorisation ఉన్న ఒకే ఒక Employee group గా ఈ దేశం లో ఉన్నట్టు అనిపిస్తుంది.

అమ్మాయి మీద యాసిడ్ పోసిన రాక్షసుడు, దేశ ధనాన్ని కొల్లగొట్టే ఎర్ర చందనం ‘కూలీ ‘ దొంగలు ….అందరూ దోషులే ! 5000 కోట్ల ఇన్వెస్టర్ల సొమ్ము, బేంకుల సొమ్ము ఎగ గొట్టిన రామలింగ రాజు కూడా ముష్కరుడే ! పోలీసులు ఆయన్ను ఎన్ కౌంటర్ చేయరు. ఒక ప్రజాస్వామిక వాదిగా ఆయన్ను ఎన్ కౌంటర్ చేసినా నేను సమర్థించలేను.

National Human Rights Commission రిలీజ్ చేసిన Manual on Human Rights for Police Officers ఎన్ కౌంటర్స్ గురిచి చెబ్తూ ఇలా అంది –

” False encounters are, at times, staged by police officers because there is pressure by the political masters to show quick results by means,fair or foul ” అని కారణం చెప్తూ ” The public, particularly the educated middle class, also donot mind if the police take the law in their own hands and become executioners, particularly with regard to the dreaded criminals ” అని ప్రస్తావిస్తుంది.

అసలు చట్ట ప్రకారం ఎవరు ఎవరినైనా ఏ కారణం చేతనైనా – పోలీసు అయినా సరే – మర్డర్ చేయడం నేరము అని చెప్తుంది. ఇలా ఎందుకు చెప్పడం ? పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం కరెక్ట్ అయినప్పుడు మనం చాట్టాన్నిల ఎందుకు రాసుకోవడం ? అలా కాక – ఫలాన నేరం చేస్తూ దొరికినప్పుడు – మొహమాటం లేకుండా పోలీసులు కాల్చేయొచ్చు అని చట్టం చేస్తే సరిపోతుంది కదా ? వాళ్ళు చంపడం – దాని మీద మనమంతా చర్చించడం ఎందుకు ? ఫలానా సెక్షన్ అండ్ సబ్ సెక్షన్ ప్రకారం పోలీసులు ఈ దిగువ చెప్పబడిన నేరాలు చేస్తే ఎవడినైనా సరే అడ్డంగా కాల్చేయొచ్చు అని చట్టం మార్చేస్తే పోలా ?

” న్యాయాన్యాయా లేంది సార్…కొడుకులను వర్సపెట్టి కాల్చేయకుండ…” అని నా కేబిన్ లోకి విసురుగా వచ్చాడు మా ఆఫీసు లొ పని చేసే క్లర్క్. ” ఏం బాబు….నీ కొడుకును ‘ ఐ పీ యెస్ చేయి నాయనా ‘ అని పోరు పెడుతంటావు కదా ….అఫీషియల్ గా మర్డర్ చేసే అవకాశం కూడా ఒకటి దొరుకుతుంది అని కూడా చెప్పి కష్టపడి చదవడానికి inspiration ఇస్తావా ఇక ? ” అన్నా.

నాతో వాదించలేకో , వాదించడం ఇష్టం లేకో వెళ్ళిపోయాడు.

ఈ దేశం లో నక్సలైట్లు రాజ్యాంగాన్ని నమ్మరు. ఈ దేశం లో రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని నమ్మరు. చివరికి – ఈ దేశం లో – ప్రజలు కూడా రాజ్యాంగాన్ని నమ్మరు. ఏం దేశమయ్యా బాబు ఇది ?

అకస్మాత్తుగా మనం ఒక వ్యవస్థలో బతుకుతున్నాము అన్నది చాలా సౌకర్యదాయకంగా మన మధ్య తరగతి ప్రజలు మర్చిపోతారు. ఏదో ఇంకా ఏ గుప్త సామ్రాజ్యమో ఉన్నట్టు అకస్మాత్తు భావన వస్తుంది.

నేరాన్ని ఎలా రూపు మాపాలి ? నేరం మళ్ళీ బతక కుండా ఎలా భూస్థాపితం చేయాలి అనడానికి మన దగ్గర సమాధానాలు లేకపోతే నేరస్తులను చంపడం సమాధానంగా కనబడుతుంది. నేరస్తులను చంపడం సమాధానం ఐతే చంపే వాడు కూడా నేరస్తుడౌతాడు. ఎత్తుకు పోయి అడవిలో కణత మీద పిస్టల్ పెట్టి ట్రిగ్గర్ నొక్కే పోలీసులు మాత్రమే నేరస్తులు కారు ?!

మొన్న తెలంగాణ లో మధ్య ప్రదేశ్ నుండి పారిపోయిన టెర్రరిస్టుల ఎన్ కౌంటర్ లో సాధారణ పోలీసులు కూడా ప్రాణం కోల్పోవడం విచారకరం. ఐతే ఈ సంఘటన తో – రెండు రాష్ట్రాల పోలీసులకు ఒక నైతిక బలం చేకూరింది. తర్వాత జరిగిన రెండు ఎన్ కౌంటర్స్ కూడా Planned murers అని పెద్ద తెలివిలేనోళ్ళకైనా తెలిసిపోతుంది.

” మరి ఎందుకు అంతగా పట్టు పడుతున్నావు…పోలీసులు మర్డర్ చేసినా మన మంచికే కదా….చట్టం లో లోపాలు ఉన్నప్పుడు …మనకు అంకుశం రాజశేఖర్ లు కావాలి లే ! వదిలెయ్ ! ” ఒక మధ్య తరగతి ప్రబుద్ధుడి జడ్జ్మెంట్.

మనకెంత ఆత్మ వంచన కదా ? వేల మందిని చేతికి మట్టి అంటకుండా చంపినోడు మన దేశ సిం హాసనం మీద కూర్చున్నాడు. ఏ ‘అంకుశం’ పోలీసు ఆఫీసర్ వాడిని ఎన్ కౌంటర్ చేస్తాడు ?

SP సజ్జనార్ మర్డర్ యాసిడ్ అటాక్ ముష్కరులతో ఆగిపోలేదు. కుక్కను చంపే ముందు పిచ్చిదని చెప్తే చాలంటే – మనమందరం ఇల్లు దాటి బయట కెళ్ళకుండా కుక్కల్లా పడి ఉంటాం. ఎవడు ఎవడిని పిచ్చి కుక్క అంటాడో అని బిక్కు బిక్కు మనుకుంటూ.

ఐతే సమస్యేమీ లేదు అందులో – అందరం కుక్కల్లా బతకాలనుకున్నప్పుడు.
మనమెలా బతకాలనుకున్నామో మనకు క్లారిటీ వచ్చేంత వరకు ఈ విచిత్ర వాదనలు వినాల్సిందే !

PS : The objective of this rhetoric essay is not to demean any individual of the skewed thinking but to let reader understand, in simple terms, that the institutionalised crime is more dangerous than individualised crime and we need to address institutionalised crime on priority basis. It may look ‘ heroic’ on face of it to contain individual crime by illegal means by the Police . However, the same is nothing but ‘shortsightedness ‘ and it is the effort of ‘ State ‘ to play with middle class belief system in order to protect its systemic inability to address the core content of the problem. It is often misconstrued that the crime cannot be contained through law and law has its limitations which justifies action of police to take law into their hands at their ‘discretion’. It is actually a misnomer undermining human’s ability to develop better society and strengthen institutions for safety and security while there are set examples in other parts of the world. Pursuit for low crime rate in a society is a incessant endeavour of nation and does not confine itself only to ‘ law and order’ and hence finding solutions within the hands of police makes us feeble and desperate prompting us to romanticise the police system