ఉత్తమ కవితా సంకలనాలకిచ్చే రమణ సుమన శ్రీ ఫౌండేషన్ పురస్కారాలను ఫౌండేషన్ అధ్యక్షులు సుమనశ్రీ ప్రకటించారు. 2015కుగానూ సౌభాగ్య (సౌభాగ్య సమగ్ర కవిత్వం), దెంచనాల శ్రీనివాస్ (భస్మ సారంగీ); 2016కుగానూ సిద్ధార్థ (బొమ్మల బాయి), ఎం.ఎస్.నాయుడు (గాలి అద్దం) పురస్కారం అందుకుంటారు. జనవరి 18న సాయంత్రం 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సెమినార్ హాల్లో జరిగే ఈ ప్రదాన వేడుకలో శివారెడ్డి, చినవీరభద్రుడు, నున్నా నరేశ్, కె.బి.లక్ష్మి, సి.వి.కృష్ణారెడ్డి పాల్గొంటారు.
తాజా కామెంట్లు