శ్రీమతి గన్నవరపు సరోజినీ, సత్యనారాయణ మూర్తి స్మారక కథల పోటీ ఫలితాలు

సారంగ పత్రిక తో కలిసి నిర్వహించిన శ్రీమతి గన్నవరపు సరోజినీ, సత్యనారాయణ మూర్తి స్మారక కథల పోటీలను ఆదరించి కథలు పంపించిన రచయితలందరికీ ధన్యవాదాలు. దాదాపు నలభై కథల నుంచి రెండు కథలను బహుమతి కి ఎంపిక చేయటం కొంచెం కష్టమే అయినప్పటికీ న్యాయ నిర్ణేతలు మొత్తం పోటీకి వచ్చిన కథల నుంచి రెండు కథలను ప్రథమ, ద్వితీయ బహుమతులకు ఎంపిక చేసారు.

మొదటి బహుమతి గా మూడు వేల రూపాయలు గెల్చుకున్న కథ “ మీ అమ్మ మారిపోయిందమ్మా !” ( రచన :  జి.ఎస్. లక్ష్మి)

రెండవ బహుమతి గా రెండు వేల రూపాయలు గెల్చుకున్న కథ “ భగవంతుని భాష “ ( రచన : పి.వి. శేషారత్నం)            

సాధారణ ప్రచురణ కు ఎంపికైన కథలు

అనుబంధానికి నిర్వచనం : సుజలా గంటి

తాంబూల సందేశం : డా. దేవులపల్లి సుజాత

ఎండపొడ కు ఆహ్వానం

పాత్రికేయ రచయిత, ఫొటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు ఈ చలికాలంలో ఎండపోడతో మన ముందుకు వస్తున్నాడు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆర్థిక సహకారంతో సామాన్యశాస్త్రం గ్యాలరీలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. దాదాపు 80 ఛాయా చిత్రాలతో నెలరోజుల పాటు వెచ్చటి స్పర్శను పంచబోతున్నాడు. వెలుగు నీడల మాధ్యమం అయిన ఫొటోగ్రఫితో ఈ సారి ఎండకు, నీరెండకు, ఎండపొడకూ తేడా ఉందని, వెలుతురంతా ఒకటే కాదనీ చెప్పబోతున్నాడు. ప్రవేశం ఉచితం. అందరికీ ఆహ్వానం.
వేదిక: సామాన్యశాస్త్రం గ్యాలరీ. అలంకార్ హోటల్ దగ్గర, ఒయు కాలనీ, మనికొండ రోడ్, హైదరాబాద్.
ప్రదర్శన ప్రారంభంః 9 సోమవారం 2017. సాయంత్రం. 6.10 నిమిషాలు.
ప్రారంభకులుః మామిడి హరికృష్ణ, డైరెక్టర్, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
ముఖ్య అతిథిః కట్టా శేఖర్ రెడ్డి. ఎడిటర్, నమస్తే తెలంగాణ.
ప్రదర్శన వేళలుః ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30 వరకు.
శని, ఆదివారాలు ఉదయం 1 1 నుంచి రాత్రి 9 దాకా.
మరిన్ని వివరాలకుః  99480 77893

కథల పోటీకి ఆహ్వానం!

kathala-potee

కథల పోటీకి ఆహ్వానం

Namaste-02

తెలుగు సాహిత్యంలో.. ఆ మాట‌కొస్తే భార‌తీయ సాహిత్యంలో క‌విత్వం త‌ర్వాత స్ధానం క‌థ‌కే ద‌క్కుతుంది. క‌థ‌ త‌ర్వాతే న‌వ‌ల‌, నాట‌కం, నాటిక‌, విమ‌ర్శ. తెలుగు క‌థ‌ని మహారచయితలు గుర‌జాడ అప్పారావు, వ‌ట్టికోట ఆళ్వార్ స్వామి, చ‌లం, రాచ‌కొండ విశ్వ‌నాథ శాస్త్రి వంటి వారు దేదీప్య‌మానం చేశారు. అలాగే నేటితరం రచయితలైన చేతన్ భగత్, రాబిన్‌శర్మ వంటి వారు కూడా ఈ తరాన్ని ప్రభావితం చేస్తూ రచనలు చేస్తున్నారు. అలా తెలుగు క‌థ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఓ గుర్తింపు తెచ్చుకుంది. మారుతున్న స‌మాజంతో పాటు క‌థ కూడా ఆయా కాల‌మాన ప‌రిస్ధితుల‌ను బ‌ట్టి కొత్త రూపం సంత‌రించుకుంది. కొన్నాళ్ల పాటు స్ధ‌బ్దంగా ఉన్న తెలుగు క‌థ మ‌ళ్లీ విక‌సిస్తోంది. కొత్త‌గా వంద‌లాది మంది ర‌చ‌యిత‌లు, ర‌చ‌యిత్రులు అనేక కొత్త అంశాల‌తో క‌థ‌లు రాస్తున్నారు. ప్ర‌తి క‌థ వ‌స్తుపరంగానూ, రూప‌ప‌రంగానూ కూడా కొత్త కాంతులీనుతోంది. ఈ స‌మ‌యంలో క‌థ‌కు మ‌రింత గౌర‌వాన్ని తీసుకురావ‌డం, కొత్త క‌థ‌కుల‌ను ప్రోత్స‌హించాల‌నే స‌దుద్దేశ్యంతో మీడియా రంగంలోకి దూసుకువ‌స్తున్న న‌మ‌స్తే ఆన్ లైన్ క‌థ‌ల పోటీని నిర్వ‌హించ‌ త‌ల‌పెట్టింది. స‌మాజంలో వ‌స్తున్న మార్పులతో పాటు సమాజ గమనాన్ని పాఠకులకు చూపించాలనే తపన ఉన్న యువ రచయితలు, ర‌చ‌యిత్రులకు ఇదో సువర్ణావకాశం. ఈ పోటీలకు కథలను పంపే వారు హాస్యం, కరుణ, సమాజ హితం కోరుకునే అంశాలతో కథలు రాసి పోటీకి పంపండి. ఈ కథల పోటీలో విజేతలు కండి… ఊహించని నగదు బహుమతి గెలుచుకోండి. కథలు పంపాల్సిన చిరునామా…

టు ది

అసోసియేట్ డైరక్టర్

నమస్తే ఆన్ లైన్

304, ప్రతీక్ వెంచర్స్

వి.వి.వింటేజ్ బొలేవార్డ్

రాజ్ భవన్ రోడ్డు

సోమాజిగుడా

హైదరాబాద్ 500082

లేదూ..

stories@namaste.in/

మెయిల్ చేయండి

కథల పోటీ నియమ నిబంధనలు

కథలు విధిగా మూడు లేదా నాలుగు పేజీలు మించకూడదు

కథల్లో హింస, శృంగారం వంటి అంశాలకు తావివ్వరాదు

ఒక్కో రచయిత, రచయిత్రి ఎన్ని కథలైనా పంపవచ్చును

కథతో పాటు ఆ రచన తన స్వంతమనే హామీ పత్రాన్ని విధిగా జత చేయాలి

బహుమతి పొందిన కథలతో పాటు ప్రచురుణార్ధమైన కథలను నమస్తే ఆన్ లైన్ లో పబ్లిష్ చేస్తాం.

రచనలు పంపిన వారు వారి పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా పంపాలి.

కథల ఎంపిక, విజేతల ఎంపిక వంటి అంశాలపై తుది నిర్ణయం పోటీ నిర్వాహకులదే.

కథలను నమస్తే ఆన్ లైన్ పోటీకి పంపిన తర్వాత మరో పత్రికకు కాని, వెబ్ సైట్లకు కాని పంపరాదు. అలా పంపినట్లు రుజువైతే ఆ రచనను అనర్హమైన రచనగా పరిగణిస్తాం.

కథలు మాకు చేరాల్సిన చివరి తేది 15 – 09- 2016

and also

బ్లాగర్లకు పోటీకి ఆహ్వానం

ఇది బ్లాగ్స్ కాలం. తమ భావాలు.. మనోభావాలు ఏమైనా సరే హాయిగా.. స్వేచ్ఛగా… పంచుకునే కాలం. ఇంతకు ముందు పత్రికల్లో రాయడానికి ఎదురు చూపులు చూసి వేసారిపోయేవారు. ఎంతటి బంగారంలాంటి రచయితైనా ఏదో ఒక పత్రిక గోడ చేర్పు అవసరం పడేది. ఇప్పుడు కాలం మారిపోయింది. ఎవరి పత్రిక వారికుంది. అదే బ్లాగ్. ఎలాంటి రచయితైనా ఓ బ్లాగ్ క్రియేట్ చేసుకుని తన ఇష్టాలు.. అయిష్టాలు.. తన సృజ‌నాత్మ‌క‌త‌.. తన స్వవిషయాలు.. ఇలా ఏవైనా రాసుకుని అభిమానులను సంపాదించుకుంటున్నారు. అలాంటి బ్లాగర్లు వందల్లో ఉన్నారు. వారిలో దాగి ఉన్న సృజ‌నాత్మ‌క‌ శక్తి ప్రపంచానికి ఈ బ్లాగుల ద్వారానే తెలుస్తోంది. ఇలాంటి బ్లాగర్లలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన లీలా బన్సాల్, ప్రభు దత్తా సాహ, సురభి సురేంద్ర, యోగితా అగర్వాల్ వంటి ఎందరో ఉన్నారు. వారి సరసన మీరు చేరేందుకు నమస్తే ఆన్ లైన్ ఓ వేదిక కానుంది. నానాటికి విస్తరిస్తున్న ఈ బ్లాగు ప్రపంచంలో బ్లాగర్లకు వినూత్న పోటీని నిర్వహించతలపెట్టింది నమస్తే ఆన్ లైన్. సమస్త పప్రంచాన్ని మీ చేతిలో ఉంచేందుకు మీడియా రంగంలోకి వస్తున్న నమస్తే ఆన్ లైన్ బ్లాగర్ల సృజ‌నాత్మ‌క‌ శక్తికి ఓ పోటీ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనేందుకు బ్లాగర్లకు ఆహ్వానం పలుకుతున్నాం. మీకు నచ్చిన.. మీరు మెచ్చిన అంశంపై మీరు రాయవచ్చు. మీ రచనలు పంపాల్సిన చిరునామా

టు ది

అసోసియేట్ డైరక్టర్

నమస్తే ఆన్ లైన్

304, ప్రతీక్ వెంచర్స్

వి.వి.వింటేజ్ బొలేవార్డ్

రాజ్ భవన్ రోడ్

సోమాజిగుడా

హైదరాబాద్ 500082

లేదూ..

blogs@namaste.in

మెయిల్ చేయండి

బ్లాగ్ పోటీ నియమ నిబంధనలు

మీరు రాసే అంశం విధిగా మూడు వందల పదాలు మించకూడదు

మీరు రాసే వ్యాసంలో హింస, శృంగారం వంటి అంశాలకు తావివ్వరాదు

ఏ ఒక్క వ్యక్తినో… కొందరు వ్యక్తుల మనోభావాలనో దెబ్బతీసే విధంగా ఉండకూడదు. ఒక్కో బ్లాగర్ ఎన్ని రచనలైనా పంపవచ్చును

బ్లాగ్ తో పాటు ఆ రచన తన స్వంతమనే హామీ పత్రాన్ని విధిగా జత చేయాలి

బహుమతి పొందిన వ్యాసాలతో పాటు ప్రచురుణార్ధమైన ఇతర వ్యాసాలను నమస్తే ఆన్ లైన్ లో పబ్లిష్ చేస్తాం.

రచనలు పంపిన వారు వారి పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి తప్పనిసరిగా పంపాలి.

ఈ పోటీకి పంపిన మీ రచనలు మరే ఇతర బ్లాగుకు కాని, పత్రికలకు కాని, వెబ్ సైట్లకు కాని పంపరాదు. అలా పంపినట్లు రుజువైతే మీరు పంపిన ఆర్టికల్ ను పోటీకి అనర్హమైనదిగా పరిగణిస్తాం.

బ్లాగుల ఎంపిక, విజేతల ఎంపిక వంటి అంశాలపై తుది నిర్ణయం పోటీ నిర్వాహకులదే.

బ్లాగులు మాకు చేరాల్సిన చివరి తేది 15 – 09- 2016

ఆధునిక తెలుగు కవితా సదస్సు

 

 

 

~

ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో మొదలైన ఆధునిక తెలుగు వచన కవిత్వం ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటిలోకీ అత్యున్నత స్థాయిలో కొనసాగుచున్నది. కవుల సంఖ్య, వెలువడుతున్న కవితల, కవితా సంపుటాల సంఖ్య, కవిత్వ పాఠకుల సంఖ్య, పత్రికలలో కవిత్వానికి దొరుకుతున్న స్థలం వంటి ఏ ప్రమాణాలతో చూసినా, కవితల వస్తు శిల్పాల విశిష్టత దృష్ట్యా చూసినా, కవిత్వంలో ప్రతిఫలిస్తున్న సామాజిక సమస్యల, పరిష్కారాల, అనుభూతుల దృష్ట్యా చూసినా కవిత్వానిదే అన్ని ప్రక్రియల్లోకీ అత్యున్నత స్థానం. వెయ్యి సంవత్సరాల తెలుగు లిఖిత సాహిత్య చరిత్రలో ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా ఏకైక, అతి ప్రధాన ప్రక్రియగా రాజ్యం చేసిన కవిత్వం ఇవాళ అనేక ప్రక్రియల్లో ఒకటిగా ఉన్నప్పటికీ సమాజపు ఆదరణలో తన గత వైభవాన్ని కోల్పోలేదు.

మరీ ముఖ్యంగా గత అర్థశతాబ్ది పరిణామాలనే చూస్తే తెలుగు కవిత్వ ప్రక్రియ విప్లవవాదం, స్త్రీవాదం, దళితవాదం, బహుజనవాదం, మైనారిటీవాదం, ప్రాంతీయవాదం వంటి సామాజిక ఉద్యమాలతో జవజీవాలు పెంచుకుని పరిపుష్టమయింది. తెలుగు కవిత్వం అంతకుముందు తెలియని వస్తువులనూ, శిల్ప శైలీ పద్ధతులనూ, నుడికారాన్నీ ఎన్నిటినో గత నాలుగైదు దశాబ్దాలలో సంతరించుకున్నది. ఈ కవిత్వ సంరంభాన్ని సన్నిహితంగా పరిశీలించడం ఆసక్తిదాయకంగా, ప్రేరణాత్మకంగా ఉంటుంది.

అటువంటి ఆసక్తిదాయకమైన, ప్రేరణాత్మకమైన పనికి దేశ రాజధానీ నగరంలో వేదిక కల్పించాలనీ, ఢిల్లీ లోని తెలుగువారికి ఈ కవిత్వ రుచులు ఉదాహరణప్రాయంగానైనా అందించాలనీ ఒక ప్రయత్నం చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలనుంచీ,   విభిన్న దృక్పథాలకు, కవితా పద్ధతులకు ప్రాతినిధ్యం వహించే ఏడు మంది కవులతో ఒక రోజంతా కవిత్వం గురించి చర్చించడానికీ, వారి కవిత్వాన్ని వినడానికీ, ఇతర ప్రభావశీల కవిత్వం గురించి తెలుసుకోవడానికీ ఢిల్లీ లోని తెలుగు వారికి ఇది ఒక అరుదైన అవకాశం.

అంతే కాక సాహిత్యానికి రంగస్థలానికి ఉన్న దగ్గర సంబందాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రఖ్యాత రంగస్థల కార్యకర్త , కేంద్ర  సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత మాయా కృష్ణరావు గారి “Walk the Talk” ఏకపాత్రాభినయంను ఏర్పాటు చేయడం జరిగింది.

Sadassu

హస్తినలో మళ్ళీ కృష్ణుడు!

Invitation A4.pmd

-దేవరకొండ సుబ్రహ్మణ్యం

~

కృష్ణా రావు గారు ఎన్నో సంవత్సరాలగా డిల్లీలోని తెలుగు సాహితీ అభిమానులకు మంచి మిత్రుడు. . వారు డిల్లీలో ఆంధ్రజ్యోతి దినపత్రికకు సహా సంపాదుకులుగా ఉన్నప్పుడు ప్రతీ బుధవారం “ఇండియా గేటు” అనే శీర్షిక ఆంధ్రజ్యోతి కి రాసే వారు. ఆ దినపత్రికలో చాలా మంచి శీర్షికలలో అదొకటి. బుధవారం పొద్దున్నే లేచి ఆ శీర్షిక చదవడం చాలమందికి ఒక వ్యాపకంగా ఉండేది . వారు దేశం లో జరిగే హీన రాజకీయాల్ని చాల నిశితంగా విశ్లేషిస్తూ రాసే వారు. ముఖ్యం గా 2014 తర్వాత మన దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పులను చాల బాగా పర్తిసీలించి విశ్లేషించే వారు. వారి శీర్షికలో వస్తువు తో పాటు, వారు చెప్పే విధానం, వాడే భాషా కూడా చాల బావుండేవి. ఈ వ్యాసాలతో “నడుస్తున్న హీనచరిత్ర ” అనే పుస్తకాన్ని మే 29 న హైదరాబాదులో ఆవిష్కరించారు.

ఈ పుస్తక పరిచయం డిల్లి లో జూన్ 30 న సాయంత్రం 5.30 నుంచి 7 వరకు తెలుగు సాహితి , ఎమెస్కో సహకారం తో స్థానికంగా ఉన్న తెలంగాణ/ఏ.పి భవనం లో ఏర్పాటు చేస్తోంది.

 

రచనలకు ఆటా ఆహ్వానం

Ata

తెలంగాణాపై రచనలకు ఆహ్వానం

telangana

రోహిత్ కోసం …

 

కొన్ని మరణాలే చరిత్ర సృస్తిస్తాయి , మరు తరానికి దిశానిర్దేశం చేస్తూ ఐకాన్లుగా చరిత్రపుటల్లో శాశ్వతం అవుతాయి . రోహిత్ మరణం కొండంత దుఃఖం, బండబారిన వ్యవస్థ మీద ఒక వంటరితనపు నెత్తుటి మరక . ఈ దుఃఖాన్ని తెలుగు సాహిత్యంలో నిలబెట్టి వ్యవస్థని ఎదురు తీయాల్సిన సమయం ఇది నక్షత్రాలని పుస్తకాల్లో బంధించలేం కాని రోహిత్ కో చిన్న ట్రిబ్యూట్ గా ఒక పోయెట్రీ అంతాలజీ తేవాలన్న చిరు కోరిక.

ఒక బిడ్డ మరణం ఇంకో నలుగురు బిడ్డలకి వెలుగవ్వాలన్న వెర్రితనం పాతిక ముప్పై కవితలు ఒకటి రెండు ఆర్టికల్స్ తో ఒక చిన్న పుస్తకంగా వేద్దామన్న ఆలోచన ఇంగ్లీష్ లో ఇప్పటికి ఇలాంటి ఒకే సబ్జెక్ట్ మీద అందరు రాసి ఒక పుస్తకంగా తేవడం ఉంది తెలుగులో నాకు తెలిసి తక్కువ లేదా అసలు లేదు . ఎవరి పుస్తకాలు వాళ్ళు లేదా ఒకరి కవిత్వమే ఒక పుస్తకంగా రావడం లాంటి ప్రక్రియలనుండి కొంత మార్పు రావాల్సిన సమయం ఇది .కవుల కంటే కవిత్వం గొప్పది అన్న నిజాన్ని గుర్తిస్తూ ఇష్యూ బేస్డ్ పోయెట్రీ ముందుకు తేవడం ఇక్కడ ప్రధాన అంశం . ఇందులో భాగం అవ్వాలన్న మనసున్న కవులకి రచయితలకి ఇది ఒక ఆహ్వానం మీ కవిత్వం మీ వాక్యం , ఈ బలవంతపు హత్యలపై మీ అభిప్రాయం ఆలోచన ఆర్దత ఏదయినా సరే పంపొచ్చు వీలునన్ని ప్రచురిద్దాం.

మనిషి కి మనిషి సాయం తప్ప ఇందులో కండిషన్స్ ఏమి లేవు ఒక వేళ మీరు ఆల్రెడీ రాసేసి ఫెస్బుక్లో కాని ఇంకో సోషల్ మీడియాలో కాని వేసి ఉంటే కూడా పంపొచ్చు ( ఎందుకంటే ఎమోషన్ మళ్ళీ మళ్ళీ అంతే స్ట్రాంగ్ గా వెలిబుచ్చడం సాధ్యం కాదన్న విషయం నాకు తెలుసు ) పోతే మీ కవిత , వాక్యం ప్రింట్ చేయోచ్చనే నో అబ్జెక్షన్ కవరింగ్ లెటర్ లేదా నాలుగు వాక్యాలు రాసి పంపండి కవితతో పాటు . మీ పేరు లేదా మీరే కలం పేరు తో రాయదలుచుకున్నారు క్లియర్ గా తెలపండి . మీ ఫోటో మీ కాంటాక్ట్ నంబర్ అడ్రెస్ లాంటివి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వొచ్చు ఇందులో కూడా ఏమి కండిషన్స్ లేవు ఇస్తే నష్టం లేదు, లేదా ఈ పబ్లిసిటీ అదీ అక్కర్లేదు అనుకున్నవాళ్ళతో కూడా సమస్య లేదు జస్ట్ మీ పేరు తో వేసేస్తాం .

వీలున్నంత త్వరలో పంపితే మంచితే ఒక వారం లేదా పక్షం రోజుల్లో ఫైనలైజ్ చేద్దాం అన్న ఒక ఆలోచన మీ రచనలు పంపాల్సిన ఆఖరు తేది :05/02/16 మెయిల్ ఐడి : nisheedhii@gmail.com

తక్కువ సమయంలో అంతాలజీ బయటికి రావాలన్న ఉద్దేశ్యం, రచనల్లో మార్పులు చేర్పులు చివరి కూర్పులు , ప్రూఫ్ రీడింగ్ అన్ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకొని పంపితే బెటర్ .

-బ్రెయిన్ డెడ్ 

మనసు పలికే మాట కోసం “రిఫిటి”!

 

 

And must thy lyre, so long divine,

Degenerate into hands like mine?

 

–Lord Byron, in his “The Isles of Greece”

 

తొమ్మిదేళ్ళ కిందట ఎమ్మెస్  రామారావు గారి “చెంగూల అల మీద...” పాటని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసాక కలిగిన అంతర్మధనం తరవాత ఈ రిఫిటి ఆలోచనకి బీజం పడింది. ఆ అనువాదం నాకు అంత తృప్తినివ్వలేదు. మరీ సందేశంలా అనిపించింది, మూలంలోని కవిత్వమంతా కరిగిపోయి-

తెలుగు మాత్రమే కాదు, చాలా భాషలు మాట మీద బతుకుతాయి. మాటలోని జీవం మీదా, తీయదనం మీద బతుకుతాయి. మనం కీబోర్డు ముందు కూర్చుని ఆ భాషని ఉపయోగిస్తున్నప్పుడు వాటిలోని ఆ జీవమంతా రాలిపోతుంది. మాటకి వుండే అందమంతా పోతుంది. మాట ఒక తీర్పరి వాక్యంలాగా మొద్దుబారిపోతుంది. మాటలు పెళుసు అయిపోతాయి.

నిజానికి, రోజు వారీ జీవితంలో మాటలు అంత పెళుసుగా వుండవ్. తమ అనుభవాలు చెప్తున్నప్పుడు మనుషులు వాటికి వేర్వేరు అర్థచ్చాయలు ఇస్తారు,  thesaurus లో మాదిరిగా- ఇన్ని అనేకార్ధాలని ఎలా చేరుకుంటాం? కేవలం కళలూ సాహిత్యం ద్వారా మాత్రమే! కాని, ఇప్పటి మన ఆన్ లైన్ ప్రపంచంలోకి వెళ్తే, మన దృష్టి మారిపోతుందని తేలికగానే అర్థమైపోతుంది. ఎంత గొప్ప  భావమైనా, ఒక YouTube సినిమా పాట లింక్ దగ్గిర  ఆగిపోతున్నట్టు అనిపిస్తోంది. నిజానికి మాటలోంచి పుట్టి, మాటలో పెరిగిన మనం ఇంతకంటే ఇంకో మెట్టు ఎక్కవచ్చు. మన ఈ లిఖిత సంభాషణల ప్రపంచానికి spoken word ని మళ్ళీ కేంద్రంగా మారిస్తే ఎలా వుంటుంది ఆలోచించండి. ఇప్పుడు మనకి అందుబాటులో వున్న ఈ సమస్త టెక్నాలజీకీ  ఆ spoken wordకీ ముడి కలిపితే ఎలా వుంటుంది? ఈ ఆలోచనల ఫలితమే: Riffiti mobile app.

Riffiti ఇప్పుడు Android and iPhone మీద ఉచితం! దీన్ని మీరు ఓపెన్ చేసినప్పుడు, మీ ముందు భిన్న ప్రపంచాలు-  Worlds-  దొరలిపోతాయి. ఒక్క ప్రపంచం ఒక టాపిక్ లోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది. మాటలు కలుపుతుంది. మీతో మాట్లాడిస్తుంది.  ఆ మాటకొస్తే మీరే ఒక World ని సృష్టించవచ్చు. ఆ World లో విడదీయలేని భాగం కావచ్చు. కేవలం ఇరవై సెకండ్లలో మీకూ మీ బాహ్య ప్రపంచానికీ మధ్య ఒక బంధం ఏర్పడుతుంది. ఇక్కడ ఎవరైనా ప్రశ్నలు అడగవచ్చు, ఎవరైనా సమాధానాలు ఇవ్వచ్చు. అయితే, ప్రశ్నల దగ్గిరే ఆగిపోవాలనీ లేదు. ఇక్కడ మాటకి ఆకాశమే హద్దు. Riffiti  ని మీరు ఎలా మలచుకుంటారన్నది మీ ఇష్టం, మీ స్వేచ్చ! ఇందులో వున్న గొప్ప సౌందర్యం ఏమిటంటే: ఇక్కడ మాటలన్నిటికీ spoken word మాత్రమే హద్దు. సుదీర్ఘమైన సందేశాలు అక్కర్లేదు. చక్కగా మీరు ఎలా వుంటే అలా మాట్లాడండి. మీ మాటే వినిపిస్తుంది, మీరే కనిపిస్తారు,  తెలుగు పలుకులోని తీయదనంలా, జీవంలా- మహాకవి బైరన్ అన్నట్టు ఆ – divine lyre- వినిపించనివ్వండి.

మన కళలూ మన సాహిత్యంలోకి కొత్త వెలుగులు ప్రసరించే నది స్వచ్చంగా స్వేచ్చగా ప్రవహించడానికి Riffiti ఒక మూలం అవుతుందని నా నమ్మకం. రచయితలూ, కవులూ, యాత్రా చరిత్రల రచయితలూ, నాటికలూ, స్కిట్స్ రచయితలూ- వీళ్ళే కాదు, ప్రతి ఒక్కరికీ Riffiti అందమైన అనుభవమే! అందులోకి అడుగు పెట్టండి, మరిన్ని అడుగులు కలుస్తాయి, ఇక వెనకడుగు అన్నదే లేదు!

iPhone FREE app link: https://itunes.apple.com/us/app/riffiti/id970498462

Android FREE app link: https://play.google.com/store/apps/details?id=com.riffiti

​ఈ విషయంలో ఏమైనా మాట్లాడాలీ అనుకుంటే:  raj@riffiti.com కి రాయండి. సంతోషంగా సమాధానమిస్తాను.

 

  • రాజ్ కారంచేడు 

 

 

 

 

 

 

That is how I feel about our spoken languages, especially my Telugu language. The lyre that the sound of Telugu is, is degenerating, literally, into the quick, coarse and judgmental hands on online keyboards. About nine years ago when I tried to translate this M.S. Ramarao song, “Chengoola Alameeda…” into English. The outcome was pedantic, and less than honorable. I think that was when the seeds for Riffiti were sown in my head.

 

“Oral tradition is antifragile,” said Nassim Taleb. People’s varieties of experiences are like entries in a thesaurus. They give us access to degrees of meaning. How do we access these shades of meanings? Arts and literature of course, is the answer. But as we move to online worlds, our attention spans are dwindling. The best we are able to do is to link to some YouTube movie song link. But we can do better. What if we make spoken word the center of our online interactions? What if we bring back the oral tradition with the clever use of technology? The result is Riffiti mobile app.

 

When you open Riffiti (a free app both on Android and iPhone), you will see Worlds, which are topic/interest focused. Anyone can create or join a World. In a Riffiti World people can interact by speaking into mobile video for 20-seconds maximum. Moreover, anyone can ask questions by typing them in. But such interactions do not have to be questions. It’s all up to how we want to use Riffiti. The beauty of Riffiti is all interaction takes place via spoken word. No need to write lengthy texts. We made it this way because showing one’s face and speaking in one’s own words is a powerful way to keep the divine lyre of Telugu singing!

 

I am convinced that Riffiti will be a place where a river of insight from literary and art world will flow freely in spoken words. Writers, poets, journalists, travel lovers, playwrights, skit and comedy artists, young men and women, practically everyone with something to say, will find Riffiti a place they love to check in, and no reason to leave!

 

Here are the download links for the free Riffiti app:

 

iPhone FREE app link: https://itunes.apple.com/us/app/riffiti/id970498462

Android FREE app link: https://play.google.com/store/apps/details?id=com.riffiti

 

​Please send email to raj@riffiti.com for any questions, I will answer them personally. ​

 

శివ‌లెంక రాజేశ్వ‌రీదేవి క‌విత‌ల కోసం…

 

తెలుగులో మేలైన క‌విత‌లు రాసి,
ఇటీవ‌ల కాలం చేసిన క‌వ‌యిత్రి శివ‌లెంక రాజేశ్వ‌రీదేవి.
ఆమె స్వీయ క‌వితా సంపుటిని మిత్రులం ప్ర‌చురించ‌ద‌ల‌చాం.
రాజేశ్వ‌రీదేవి ర‌చ‌న‌ల రాత‌ప్ర‌తులు, ప‌త్రికా ప్ర‌చురితాలు త‌మ వ‌ద్ద వున్న‌ట్ల‌యితే
అవి ఈ కింది చిరునామాకు పంపించ‌మ‌ని కోరుతున్నాం.

నామాడి శ్రీ‌ధ‌ర్‌, # 3 – 129, అంబాజీపేట, తూర్పు గోదావ‌రి, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.
పిన్ : 533214. ఫోన్ : 9396807070. ఈమెయిల్‌ : namadisreedhar@gmail.com

22న కేశవ రెడ్డి సంస్మరణ

11004482_10205259283228962_1333239311_n

వంగూరి ఫౌండేషన్ 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

2011VFAnewLogoSmall120వ ఉగాది ఉత్తమ రచనల పోటీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలకు ఆహ్వానం
(రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: మార్చ్ 1, 2015)

గత 19 సంవత్సరాల సంప్రదాయాన్ని పాటిస్తూ, రాబోయే “మన్మధ ” నామ సంవత్సర ఉగాది (మార్చ్ 21, 2015) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు 20వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు.భారత దేశంతో సహా అన్ని దేశాల తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని కోరుతున్నాం. స్నేహపూర్వకమైన ఈ “పోటీ కాని పోటీలో” మూడు విభాగాలు ఉన్నాయి.
ప్రధాన విభాగం – 20వ సారి పోటీ నిర్వహణ
ఏ వయస్సు వారైనా, ఏ దేశంలో ఉన్నా, తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.
ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $58

“మొట్ట మొదటి రచనా విభాగం” -6 వ సారి పోటీ నిర్వహణ
కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఆరవ సారి ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలను ఈ “పోటీ” లో పాల్గొనమని ఆహ్వానిస్తున్నాం.
“నా మొట్ట మొదటి కథ”: (ఉత్తమ కథ): $116
“నా మొట్టమొదటి కవిత”: (ఉత్తమ కవిత): $58
యువతరం విభాగం- 2 వ సారి నిర్వహణ
ఈ నాటి యువతరంలో సృజనాత్మకతని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో కేవలం 18 నుండి 35 సంవత్సరాల వయస్సుగల యువ రచయితలని ఈ నూతన విభాగంలో పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రచనతో పాటు మీ వయస్సు ధృవీకరణ పత్రం నకలు ఏదైనా (పుట్టిన తేదీ పత్రం, కళాశాల వారు జారీ చేసిన పత్రం వగైరా ..) జతపరచాలి.
ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $116
ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: $58

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు
• ఒకే రచయిత ఒక్కొక్క ప్రక్రియకూ ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. వ్రాత ప్రతిలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి.
• తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
• రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. “మొట్టమొదటి కథ” మరియు “మొట్టమొదటి కవిత” పోటీ లో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి.
• బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది.నెట్ లోనూ, ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
• విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు కాని, అంతకు ముందు కానీ (మార్చ్ 21, 2015) ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితల ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
• విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
Last Date to receive entries is: March 1, 2015
Please send entries by e-mail attachments (PDF, JPEG or Unicode fonts)
sairacha2012@gmail.com & vangurifoundation@gmail.com

భవదీయులు,
వంగూరి చిట్టెన్ రాజు, (అధ్యక్షులు) & శాయి రాచకొండ (సంపాదకులు)
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
హ్యూస్టన్ & హైదరాబాద్
Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com
www.vangurifoundation.blogspot.com

చాసో చూపు: మరువం చర్చా వేదిక 10 న…

10920260_10152630910212864_8275112804177833100_o

రజని నూరేళ్ళ పండగ…వచ్చే వారం!

2001_photo

తెలంగాణా కత 2013 ఆవిష్కరణ 29న!

10583882_10204556357861922_3574023066456842865_n

T katha pamphlet-page-001

‘సారంగ’లో త్వరలో ‘జాయపసేనాని’ నాటకం

 

 నేపథ్యం

 

ఓరుగల్లును పరిపాలించిన గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు,బావమరిది..తర్వాతి కాలంలో తామ్రపురి( ఇప్పటి చేబ్రోలు)ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలిన “జాయపసేనాని” భారతీయ నాట్య శాస్త్రానికి సంబంధించి భరతముని చే రచించబడ్డ ప్రామాణిక గ్రంథమైన “నాట్య శాస్త్రము”ను సమగ్రముగా అధ్యయనము చేసి కాకతీయ మహాసామ్రాజ్య వివిధ ప్రాంతాలలోని ప్రజాబాహుళ్యంలో అప్పటికే స్థిరపడి ఉన్న స్థానిక నాట్యరీతులనుకూడా పరిగణనలోకి తీసుకుని “మార్గ”(classical) పద్ధతులతో పాటు “దేశీ” నాట్య రీతులనుకూడా ప్రామాణికంగా గ్రంథస్తం చేసి ప్రసిద్ధ “నృత్త రత్నావళి”ని క్రీ.శ.1254 లో ఆవిష్కరించాడు.దీన్ని శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ తెలుగులోకి అనువదిస్తే అంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ 1969 లో పుస్తకంగా వెలువరించింది.

దీనిలోని ప్రధాన “దేశీ” నాట్యమైన శివతాండవ శృంగ నర్తనం “పేరిణి”నృత్యాన్ని డా.నటరాజ రామకృష్ణ తన జీవితకాల సాధనగా రూపొందించి 1985 లో శివరాత్రి పర్వదినాన చారిత్రాత్మక రామప్ప దేవాలయంలో నాలుగు లక్షలమంది వీక్షకుల సమక్షంలో పదివేల ప్రమిదలు ప్రాంగణంలో వందమంది కళాకారులతో “పేరిణి” నృత్యాన్ని ఒక ప్రపంచ రికార్డ్ గా ప్రదర్శించారు.

ఈ నేపథ్యంలో రాయబడ్డ గంట నిడివి గల నాటకం ఈ “జాయపసేనాని”.ఇది మొదట “ఆల్ ఇండియా రేడియో” లో జాతీయ నాటక సప్తాహంలో భాగంగా ప్రసారమైంది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం మొట్టమొదటగా ప్రభుత్వంచేత జనవరి 9,10,11 2015 తేదీల్లో వరంగల్లులో నిర్వహించతలపెట్టిన “కాకతీయ ఉత్సవాలు”లో భాగంగా ఈ “జాయపసేనాని” నాటకం ప్రదర్శించబడనున్నది.

ఈ నేపథ్యంలో..రామా చంద్రమౌళి చే రచించబడ్డ “జాయపసేనాని” నాటకం ఇప్పుడు..మన “సారంగ” పాఠకులకోసం.

2 copy

జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు

స్పష్టంగా, సూటిగా, నిరాడంబరంగా, గంభీరంగా ఉండే సమాజ కేంద్ర కవిత్వం రాసే కవులు “సహజ కవి ప్రతిభా పురస్కారాల కోసం” కవితల సంపుటాలు పంపించవలసినదిగా కోరుతున్నాం. వచన కవిత/పద్యం/గేయాల సంపుటి ఏదైనా ఒక పుస్తకం పంపితే చాలు. ప్రచురించిన సంవత్సరంతో పని లేదు.కవికి 2000 రూ. నగదు, శాలువా, జ్ఞాపికతో రావి రంగారావు సాహిత్య పీఠం పక్షాన సత్కరించటం జరుగుతుంది.
డిసెంబరు 31 లోగా పుస్తకాలు పంపించవలసిన చిరునామా.
డా. రావి రంగారావు, 101, శంఖచక్ర నివాస్, అన్నపూర్ణ నగర్ 5వ లైన్ తూర్పు,
గోరంట్ల, గుంటూరు- 522034
phone 9247581825
ebooks may be sent to mail : raavirangarao@gmail.com

‘కౌముది’ మాస పత్రిక కథల పోటీ

10685021_917373834941810_1501476356_n

కారామాస్టారు@90

Kalipatnam_Ramaraoఒక కధ కధాశిల్పానికి నమూనాయై  చరిత్రలో మిగిలి పోతుంది. ఒక  కధ కధా సౌష్టవానికి వ్యాకరణం అందిస్తుంది. ఒక  కధ కధా సాహిత్యంలో మైలురాయిగా మిగిలిపోతుంది. ఒక  కధ చదువరుల  ప్రాపంచిక దృక్పధాన్ని మార్చివేస్తుంది. కొత్త రచయితలు ఒకానొక  కధ చదివి, ఆ కధా బలానికి గౌరవవందనం చేసి, పెన్ను మూసేసి, తను కొనసాగించదలచిన కధా ప్రక్రియకు తాత్కాలిక  విరామం ప్రకటించి ఉత్సాహం స్థానంలో శ్రద్ద పెట్టాలని అనుకొంటారు.

“కధలు ఎలా ఉండాలి? ఎలా రాయాలి?” అనే చర్చ సర్వత్రా జరుగుతున్న ఈ  సందర్భంలో వర్ధమాన రచయితలు ఈ ప్రశ్నలకు జవాబులు ఒక నాటి మేటి కధకుల కధల నుండి పిండుకోవటం ఒక మేలైన పద్దతి. కారాగారి తొంభైయ్యవ పుట్టిన రోజు సందర్భంగా “కధ ఎలా రాయాలి అనే ప్రశ్నకు కారా గారి కధల నుండి సమాధానం” అనే అంశం మీద మీ అభిప్రాయాలను, నవంబరు 9న రాబోతున్న “సారంగా – సాహిత్య పత్రిక, కాళీపట్నం రామారావుగారి ప్రత్యేక సంచిక” కోసం రాసి పంపవలసిందిగా కోరుతున్నాము. మీ అభిప్రాయం ఒక పేజీకి పరిమితం చేస్తే చాలు. మీ వ్యాసాలను manavi.battula303@gmail.com కు అక్టోబరు 31 లోపల పంపండి.

 

తెలంగాణ కత కోసం

 

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

 

తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భంలో ఉన్నాం. ఇన్నాళ్లు ఆధిపత్య భావజాలం గల ఆంధ్రప్రాంత రచయితలతో పోటీలో అనేక అవమానాలు, వివక్ష, విస్మరణ, అణచివేత ఎదుర్కొంటూ వచ్చాం. ఇవాళ మన రాష్ట్రం వేరు, మన కథ వేరు. ఈ శుభ సందర్బంలో మన జీవితాలు, మన సంస్క ృతి, మన సమస్యలు, మన జీవద్భాషలో రాసుకున్న కథల్ని కళ్ళకద్దుకుంటూ సంకలనాలుగా తీసుకురావాల్సిన సమయమిది. అందుకు ప్రతి ఏటా కథవార్షిక వెలువరించాలని నిర్ణయించాం.

ఇందుకోసం ఏ యేడుకి ఆ యేడు పత్రికల్లో అచ్చయిన కథలతో పాటు అచ్చుకు నిరాకరించిన కథలను సైతం పరిశీలించి ప్రచురించాలనేది లక్ష్యం. ప్రతి ఏడాది జనవరి పది లోపు మాకు ఈ కథలు అందాల్సి ఉంటుంది. ఈ సారి తెలంగాణ కత -2013కి గాను అక్టోబర్‌ 31 లోగ కతలు పంపగలరు. ఈ సంకలనాలకు సంగిశెట్టి శ్రీనివాస్‌, స్కైబాబ సంపాదకులుగా వ్యవహరిస్తారు.

క్రమం తప్పకుండా ఈ సంకలనాలను ప్రచురించడానికి అవసరమయ్యే ఆర్థిక వనరులను సమకూర్చేందుకు మిత్రులు అల్లం కృష్ణచైతన్య ముందుకొచ్చారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు.

 

కతలు పంపాల్సిన చిరునామా:

స్కైబాబ,

402, ఝాన్సీ రెసిడెన్సీ, ప్లాట్‌ నెం. 30 హెచ్‌.ఐ.జి. హుడా కాలనీ,

తానాషా నగర్‌, మణికొండ గ్రామం, హైదరాబాద్‌ `89, తెలంగాణ.

లేదా

ఈ మెయిల్‌ : sangishettysrinivas@gmail.com

కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్-2014

తెలుగు నెటిజనుల అభిమాన పుస్తక ప్రపంచం కినిగె.కామ్ నిర్వహిస్తున్న

కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్-2014 కు ఇదే మా ఆహ్వానం!

మీరు 28 సంవత్సరములు లోపు వారా? మీ సృజనాత్మకత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తెలియాలనుకుంటున్నారా? అయితే ఈ స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ మీ కోసమే! 750 పదాలు మించకుండా ఒక చక్కని కథను వ్రాయండి! రూ. 20,000 విలువైన బహుమతులను గెలుచుకోండి! మీరు చేయవలసినదల్లా మీ కథను యూనీకోడులో టైపు చేసి editor@kinige.com కు 31 అక్టోబరు 2014 లోపు ఈ-మెయిల్ చేయడమే.

పోటీ పూర్తి వివరాల కోసం patrika.kinige.com సందర్శించండి.

మీకు మరింత సమాచారం కావాలన్నా లేక సందేహాలున్నా editor@kinige.com కు

ఈ-మెయిల్ చేయండి (లేదా) 94404 09160 నెంబరుకు కాల్ చేయండి.

 

కినిగె.కామ్ గురించి

వందలాది రచయితలు, వేలాది పుస్తకాలు, అసంఖ్యాక పాఠకులతో తెలుగు ఆన్‌లైన్ పుస్తక రంగంలో నెం.1 స్థానంలో ఉన్న సంస్థ Kinige.com. పుస్తకాలు చదవడాన్ని సులభతరం చేయడం ద్వారా పాఠకులకు, రచయితలకు మధ్య వారధిలా నిలిచింది. తెలుగువారి విశ్వసనీయతను, అభిమానాన్ని పుష్కలంగా పొందిన కినిగె.కామ్ ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పూర్తిచేసుకొని 5వ సంవత్సరం లోనికి అడుగు పెట్టబోతోంది www.kinige.com

 

ఉత్తర అమెరికా తొలి తెలుగు కథ 50వ వార్షికోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు

10614218_300362290152515_8326601315087796337_n
అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం)
ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకూ
హ్యూస్టన్, టెక్సస్
ఆత్మీయ ఆహ్వానం
మీ అందరి ప్రోత్సాహంతో, 1998లో ప్రారంభం అయినప్పటినుంచి ఇప్పటిదాకా దిగ్విజయంగా జరుగుతున్న ద్వైవార్షిక అఖిల అమెరికా తెలుగు సాహితీ సదస్సుల సత్సాంప్రదాయాన్ని అనుసరిస్తూ, అంతకంటే ఆసక్తికరంగా 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహానగరంలో రాబోయే అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం) తారీకులలో జరగబోతోంది. ఉత్తర అమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ 1964 లో అప్పటి ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడి యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా, ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య ప్రారంభానికి అదే తొలి అడుగుగా గుర్తిస్తూ ఆ కథ అర్ధ శతాబ్ది ఉత్సవాలు ప్రధాన అంశంగా ఈ “తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” నిర్వహించబడుతోంది. ఈ సందర్భంగా ఆహ్వానిత అతిథులుగా కెనడా నుంచి వస్తున్న ఉత్తర అమెరికా తొలి కథకులైన స్వర్గీయ శ్రీ మల్లికార్జున రావు గారి కుటుంబం, ఉత్తర అమెరికా తొలి కవి & పత్రికా సంస్థాపకులు స్వర్గీయ పెమ్మరాజు వేణుగోపాల రావు గారి కుటుంబం (అట్లాంటా), అమెరికా లో తొలి కథకులైన చెరుకూరి రమాదేవి (డిట్రాయిట్), వేమూరి వెంకటేశ్వర రావు (ప్లెజంటన్, కాలిఫోర్నియా) లకీ, ఉత్తర అమెరికా తెలుగు సాహిత్యానికి పునాదులు వేసిన తదితర ప్రముఖులకి వారికి ఈ మహా సభలో ఆత్మీయ సత్కారం జరుగుతుంది.
గత యాభై సంవత్సరాలగా అమెరికాలో వెల్లివిరుస్తున్న తెలుగు సాహిత్యం 50వ వార్షికోత్సవ సందర్భంగా అమెరికా తెలుగు కథకి, కవితల ఆవిర్భావాలనీ నెమరువేసుకుని మరింత ఉజ్జ్వల భవిష్యత్తు కోసం పునాదులు బలిష్టం చేసుకునే ఆలోచనలు మనతో పంచుకునే సుప్రసిద్ధ అమెరికా సాహితీవేత్తలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ మహా సభలకు విచ్చేయనున్నారు. ఇటువంటి అపురూపమైన అవకాశం వచ్చినాపుడైనా మన సాహిత్య చరిత్రని మనమే గుర్తు చేసుకుని ఆ చరిత్ర సృష్టించిన వారిని గౌరవించుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టే!
భారత దేశం నుండి కూడా కొందరు ఉత్తమ సాహితీవేత్తలని ఇక్కడికి ఆహ్వానించి అక్కడి సాహిత్య విశేషాలని తెలుసుకోవడం, మన సాహిత్య పురోగతిని మాతృదేశం లో మన వారికి తెలియజేసే మా సాంప్రదాయం ప్రకారం ఈ మహా సభలకు భారత దేశం నుండి ముఖ్య అతిథులుగా తొలి సారిగా హ్యూస్టన్ నగరానికి శ్రీ తనికెళ్ళ భరణి & శ్రీ రావి కొండల రావు రావు గారూ, తొలి సారిగా అమెరికా పర్యటనకు శ్రీమతి ముక్తేవి భారతి, శ్రీ తల్లావఘ్ఘుల పతంజలి శాస్త్రి గారూ ఆహానించబడ్డారు.

10628066_300362316819179_131675058726844698_n
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి వారి సాహితీ లోకం బృందం లాభాపేక్షలేని నిర్వహణలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ స్థాయి సాహితీ సదస్సులో ఉత్తర అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ ఉన్న తెలుగు రచయితలు, పండితులు, విమర్శకులు, వక్తలు, భాషాభిమానులనూ, తెలుగు భాషా, సాహిత్యాలను అన్నిచోట్లా పెంపొందించదల్చుకున్న వారందరినీ పాల్గొనమని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

సదస్సు ప్రధానాశయాలు

ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య 50 వార్షికోత్సవ సందర్భంగా జరుగుతున్న ఈ తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో అమెరికా సాహిత్య విజయాలని నెమరు వేసుకుని, తోటి రచయితలను, సాహితీవేత్తలనూ, తెలుగు భాషా, సాహిత్యాభిమానులనూ వ్యక్తిగతంగా, ఆత్మీయ సాహిత్య వాతావరణంలో కలుసుకొని, సాహిత్య పరిచయాలను పెంచుకొనడం, ఈ సమావేశానికి వచ్చిన రచయితలందరికీ, తగిన స్థాయిలో తమ రచనలను, సాహిత్య పరమైన అభిప్రాయాలను సహ సాహితీ ప్రియులకి స్వయంగా వినిపించే అవకాశాలు కలిగించడం ఈ సదస్సు ముఖ్య ఆశయాలు.
ప్రత్యేక ఆకర్షణలు
స్వీయ రచనా పఠనం, నిష్ణాతుల సాహిత్య ప్రసంగాలు, నూతన పుస్తకావిష్కరణలు, పుస్తక విక్రయ శాల, చర్చా వేదికలు, సరదా సాహిత్య పోటీలు, “సాహిత్య “ప్ర-జ” ప్రత్యేక వేదిక” (సాహిత్యపరమైన ప్రశ్నలూ-జవాబులు), అందరూ అప్పటికప్పుడు పాల్గొనే గొలుసు కథ, మరెన్నో….

10647170_300362460152498_8223353005422413139_n
రచయితలకు, వక్తలకు విన్నపం
ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో ప్రసంగించదల్చుకున్న వారు, స్వీయ రచనా విభాగంలో తమ రచనలను వినిపించదల్చుకున్నవారూ ఈ క్రింది నిర్వాహకులను సంప్రదింఛండి. ప్రసంగాంశాలు ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక పోకడల దాకా తెలుగు భాషాసాహిత్యాలకి సంబంధించినవే ఉండాలి. అమెరికాలో తెలుగు సాహిత్య పోకడల మీద ప్రసంగాలను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం.
పై ఊరి వారికి ప్రత్యేక సదుపాయాలు
ప్రతిష్టాత్మకమైన ఈ 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కు ఉత్తర అమెరికాలో ఇతర నగరాలనుంచీ వచ్చే సాహితీవేత్తలకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా, అతి తక్కువ ఖర్చుతో వసతి సదుపాయాలు, వాహన సదుపాయాలు చెయ్యబడ్డాయి. సముచితమైన ఏర్పాట్లు చేయడానికి వీలుగా ఈ అమెరికా తెలుగు సదస్సులో పాల్గొన దల్చుకున్నవారు ముందుగా నమోదు చేసుకోవాలి. నమోదు వివరాలు, ఇతర ఆసక్తికరమైన విషయాలు త్వరలోనే ప్రకటించబడతాయి.
రాబోయే అక్టోబర్ 25-26, 2014 తారీకులలో హ్యూస్టన్ లో జరిగే ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ 50వ వార్షికోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సుకు వచ్చే ప్రయాణం ఏర్పాట్లు చేసుకోవలసినదిగా అమెరికా రచయితలనూ, సాహితీవేత్తలనూ, భాషాభిమానులనూ కోరుతున్నాం. ఈ సదస్సుకు సంబంధించిన ఏ విషయం పైనా ఈ క్రింది ఔత్సాహిక నిర్వాహకులను సంప్రదించండి. అతిథులను గౌరవంగా ఆహ్వానించి మర్యాద చేయడమే మా హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి మరియు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి ప్రధాన లక్ష్యం.

Conveners:

Dr. Vanguri Chitten Raju
Phone: 832 594 9054
E-mail: vangurifoundation@gmail.com
&
Maruthi Reddy
Phone: 832-240-6749
E-mail: c_maruthi@hotmail.com

Coordinator:
Sai Rachakonda
Phone: 281 235 6641
E-mail: sairacha@gmail.com
Organizing Committe: C.N. Satyadev, Madhu Pemmaraaju, Satyabhama Pappu, Sarada Akunuri. Krishna Keerthi, Ram Cheruvu, Raghu Dhulipala, Ravi Ponnapalli, Lalitha Rachakonda, Sitaram Ayyagari, Pallavi Chilappagari, Sudhesh Pilliutla, Mallik Putcha.

వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యం లో లండన్ లో నాల్గవ ప్రప్రంచ తెలుగు సాహితీ సదస్సు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హ్యూస్టన్, హైదరాబాద్),  “యుక్త” (యునైటెడ్ కింగ్డం తెలుగు సంఘం) వారి సంయుక్త నిర్వహణలో  “నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” రాబోయే సెప్టెంబర్ 27 -28, 2014 తారీకులలో లండన్ మహా నగరంలో జరగబోతోంది. 
 
ఐరోపా ఖండంలో తొలి సారిగా  తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వేస్తున్న ఈ మహా సభలలో వక్తలుగా పాల్గొని, తమ రచనలను, సాహిత్య పాటవాన్ని సహా సాహితీవేత్తలతో పంచుకోమని ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఐరోపా ఖండ వాసుల్ని వంగూరి ఫౌండేషన్  సాదరంగా ఆహ్వానిస్తోంది. . పూర్తి వివరాలు ఇందుతో జత పరిచారు.  
 
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ఇది వరలో నిర్వహించిన మూడు ప్రపంచ సాహితీ సదస్సులు, ఇతర సాహితీ సమావేశాల వివరాలు ఈ క్రింది లంకె లో చూడగలరు. 

సోవియట్ సాహిత్యంతో ఓ సాయంత్రం!

Anil battula Invitation_10 sep 2014_Hyderabad

త్వరలో…”ఎగిరే పావురమా!”

egire-pavurama1

త్వరలో కొత్త సీరియల్ …”ఎగిరే పావురమా!”

egire-pavurama-advt

శేఖర్ మిత్రులం !

sekhar1
ప్రియ కార్టూనిస్ట్ మిత్రులారా!

మనలో చాలా మందికి తెలిసే వుంటుంది,మనలో వొకడు మన వాడు, మలి తరం రాజకీయ కార్టూనిస్టులలో మహా చురుకులు పుట్టించిన శేఖర్ గత కొంత కాలం గా తీవ్ర అనారొగ్యం తో పోరాడుతున్నారు.

ఆయన జీవిత కాలంలో ఎదుర్కొన్న సమస్యలు , సాగించిన పోరాటాలు ఒకెత్తు, ఇప్పుడిది మరో ఎత్తు, పెదాల పై చిరునవ్వు ఆరనీకుండా, కుంచెలొ సిరా ఇంకనీకుండా ఆయన చేస్తున్న ఈ పోరాటం కేవలం యోధానుయోధులు మాత్రమే చేయగలిగినది. శరీరం లోని ప్రతి కండరం యమ యతనలకు గురై బాహ్య ఆకారం శుష్కించిన ఆయన మనో నిబ్బరం ఆత్మ విశ్వాశం ముందుకన్నా మరింత కాంతులీనుతూనే వుంది.

అయినా మనం మనకు చేతనైనంతలొ ఆయనపై మనకు గల ప్రేమ ను తెలిపే ఒక చిన్న ప్రయత్నం చేద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా వున్న కార్టూనిస్టులం అందరం కలిసి ఒక రోజు శేఖర్ తో గడుపుదాం,మీరు మాలో ఒక భాగం అనే విషయం ఆయనకు తెలుపుదాం, మేం చేసిన పుణ్యం ఏదైనా వుంటే అది మిమ్మల్ని మాకోసం కాపాడుకుంటుంది అనే విషయం గుర్తించమందాం.

ఇదే సమయం, మనలోని “మనిషి” మరో మనిషి కోసం కలవడానికి.

ప్రియమిత్రులారా ఇదంతా ఒకరు నెత్తిన వేసుకుని ఫలనా రోజు, ఫలానా చొటు అని నిర్ణయించి మీ రాక కై ఎదురు చూస్తున్నాం అనే ఆహ్వనం కానే కాదు, శేఖర్ నా సోదరుడే కాదు మీకుకూడా, మనమంతా ఒకే తల్లి బిడ్డలం అనేదే నిజం. ఈ రెండు మూడు రోజుల్లో మీ అందరి సలహాల మేరకు కార్యక్రమం నిర్ణయించబడుతుంది, మీ సలహాల సూచనల కోసం ఎదురు చూస్తున్నాం .

మీతో పాటు మీ అందరి గొంతుల తరపున

అన్వర్.

శివారెడ్డి, ఇనాక్ కు ‘ దాట్ల’ సాహిత్య పురస్కారాలు

siva_reddyinak1ప్రతి సంవత్సరం ఒక కవి, కధకునికి పురస్కారాలు అందించడానికి ‘దాట్ల దేవదానం రాజు సాహితీ సంస్థ ‘ నిర్ణయించింది.ఈ సంవత్సరానికి (2014) ప్రముఖ కవి కె. శివారెడ్డి, ప్రముఖ కధకులు కొలకలూరి ఇనాక్ గార్లకు సంస్థ పురస్కారాలు ప్రకటించింది. కవి, కధకుడు దాట్ల దేవదానం రాజు 60 వ జన్మదినోత్సవం మార్చి 23 వ తేదీన యానాం లో జరిగే సభలో పురస్కార ప్రదానం జరుగుతుంది. ఈ పురస్కారం కింద ఒక్కొక్కరికీ  పదివేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు.

ఆ రచనల్ని, ఆ వ్యక్తిత్వాల్ని గుర్తు చేసుకుందాం..!

puttapartichasoTIRUMALA-RAMACHANDRA

పుట్టపర్తి, చాసో, తిరుమల రామచంద్ర ….గత ఏడాది, ఈ ఏడాది ఈ ముగ్గురు మహారచయితల శతజయంతి సంవత్సరాలు! వారి రచనలూ, వారి వ్యక్తిత్వాలు మన సాంస్కృతిక జీవితాల్లో తరిగిపోని వెన్నెల వీచికలు. ఆ వెలుగుని ఈ తరానికీ అందిద్దాం, వారి రచనల్ని, వ్యక్తిత్వాల్ని తలచుకుంటూ!

వారి రచనలే కాదు, వారి వ్యక్తిత్వ విశేషాల్ని తలపోసుకునేట్టుగా వారి స్మృతుల్ని కూడా అక్షరబద్ధం చేయండి.

మీ రచనలు editor@saarangabooks.com కి పంపండి.