జ్ఞాపకాల యాత్ర

sindhumadhuri
మెడకి కుట్టుకున్న దండ బిగిసి

రక్త నదుల ఎదురెదురు మోత

వళ్ళంతా గాట్ల మాంసం.

కోతలన్నీ  కప్పి ఉంచే  గవురవం

విత్తనాల పండగ మొలకలన్నీ

మొటిమలై  మాడిన నేల మొకం

కబురుల కీటకాల రొదన

భూమీ ఆకాశాలు లాగి తన్తే

మళ్ళీ నీ  నీ జ్ఞాపకాల చూపు

రెప్పల పొరల   కోతకి కన్నీళ్ళ  వణుకు

లోకమంతా  పోయినాక ఎముకల

కోలాటం మోత  బందాలు

ప్రమాణాల  ముళ్ళకంచ కొక్కానికి
ఉగుతున్న గుండె దేగేసిన ముళ్ళ లో

స్వరం స్పర్శా వాతాన పడి

 

ఒకటి పక్కన ఎన్ని సున్నా లలో
శరీరం మట్టి మట్టి శరీరం
 చీల్చే సాయ వ్యవసాయాలు
 తిరిగి కౌగిలి దున్నె తలపులు
కోరికని కడుపులో కుక్కుకుని
నన్ను నరికే కత్తి  నా   వెన్నుపూస
గాలి లో అడతన్న మాసపు కండల రుచీ రంగూ
వేట సింహం దగ్గరకు లక్కుని వాసన చూసి
ఇష్టంగా త్రుప్తి గా  తింటా పోగేసిన
సమాది పునాది ఎముకలు
మూసిన కళ్ళ తో గాయపు
పేడు తడిమి పురుగు పట్టిన
పున్దుని ఎండలో పెట్టీ  కదలికలు
కనపడి నిన్న పడిన వాన  ఉమ్మి ,
మల్లెల జల్లుగా రక్తపు మట్టీ
కాసిని వాసన లేని కనకాంబరాలు
జల్లి oచుకునే  కళే బర  యాత్ర ని
( రైతుబజారు  హక్కుల కోసం పోరాడే తమ్ముడు కర్రి రవీంద్ర సాయి ని,  నమ్మిన స్నేహితులే ఎండ్రిన్ తాగించి చంపేసిన దుర్ఘటన మనసు ని కోసేస్తున్నప్పుడు రాసిన కవిత )
                                                   -మన్నం సింధు మాధురి