జానపదంలో మెరిసిన మెరుపులు ​

unnamed-1

జానపద గీతాలు

మన తెలుగు జానపద బాణీల ప్రేరణతో ఎన్నో జానపద సినీగీతాలను తయారు చేసారు మన సినీ సంగీతకారులు. పాత నలుపు-తెలుపు చిత్రాలన్నింటిలో దాదాపు ఒక జానపద గీతం తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు ఐటెం సాంగ్ ఉన్నట్లన్నమాట :) సినిమా కథతో సంబంధం లేకపోయినా ఓ స్టేజ్ షో లాగనో, హాస్యనటుల పైనో లేదా నేరుగా నాయికానాయకుల పైనో ఈ జానపదగీతాలను చిత్రీకరించేవారు. ఇంపైన సంగీతసాహిత్యాలతో ఈనాటికీ చిందెయ్యాలనిపించేంతటి సమకాలీనత ఆ పాటలలో ఉంది. వీటిలో విశేషం ఏంటంటే సరదాగా ఉంటూనే ఏదో ఒక నీతిని తెల్పేలాగ లేదా ఒక విషయాన్నిగురించిన ఇరు పక్షాల చర్చల్లా కూడా కొన్ని సాహిత్యాలు ఉంటాయి. వినడానికి సరదాగా ఉండే అలాంటి కొన్ని సినీజానపద గీతాలను కొన్నింటి గురించి ఇవాళ చెప్పుకుందాం.

జానపద బాణీల్లో ఉన్న హిట్ సాంగ్స్ తలుచుకోవాలంటే మూగమనసులు చిత్రంలో “గోదారి గట్టుంది”, “గౌరమ్మా నీ మొగుడెవరమ్మా..”, రాజమకుటంలో “ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కల రేడు”, సాక్షి చిత్రంలో “అటు ఎన్నెల ఇటు ఎన్నెల”, పాండవ వనవాసం” లో సముద్రాల రాఘవాచార్య రచన “మోగలిరేకుల సిగదానా”, కలసి ఉంటే కలదు సుఖం లో “ముద్దబంతి పూపెట్టి”.. ఇలా బోలెడున్నాయి. “నాకూ స్వాతంత్య్రం వచ్చింది” చిత్రంలో గోపి రచించిన “ఎంకీ నే సూడలేనే ఎలుతురులో నీ రూపు ఎలిగిపోతుంటే” అనే పాట కూడా బాగుంటుంది కానీ లింక్ ఎక్కడా దొరకలేదు. ఇలా ఎంకి మీద “దాగుడుమూతలు” చిత్రంలో బి.సరోజాదేవి పాట ఒకటి బావుంటుంది. సాంఘిక చిత్రమే అయినా సందర్భానుసారంగా ఎంకి వేషంలో మురిపిస్తుంది సరోజాదేవి.

* ఎంకొచ్చిందోయ్ మావా…

* తోడికోడళ్ళు చిత్రంలో “టౌనుపక్కకెళ్ళద్దురా డింగరి” అనే జానపద బాణీ ఉంది. బస్తీకెళ్దాం, సొమ్ము చేసుకుందాం అని అబ్బాయి పాడితే, పట్నం మోజులో పడి మోసపోవద్దు అని అమ్మడు పాడుతుంది. చక్కని సందేశం, నీతి రెండూ ఉన్న పాట ఇది.

* “వెన్నెల రేయి చందమామ వెచ్చగనున్నది మావా

మనసేదోలాగున్నది నాకేదోలాగున్నది.. ”

అంటూ వయసులో ఉన్న యువతీయువకులు పరస్పరం చెప్పుకునే ఊసులే ఈ పాట. రంగుల రాట్నం చిత్రంలోని ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చినది ఎస్. రాజేశ్వరరావు గారు, కొసరాజు సాహిత్యం. పాడినది బి.గోపాలం, ఎస్.జానకి. ఈ పాట చివర్లో వచ్చే డప్పు వాయిద్యం చాలా ఉత్సాహకరంగా ఉంటుంది.

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7057

* ఊ..హూ… ఊ… అంటూ ఓ మధురమైన హమ్మింగ్… తర్వాత,

“గట్టుకాడ ఎవరో… చెట్టునీడ ఎవరో

నల్ల కనుల నాగసొరము.. ఊదేరు ఎవరో”

అంటూ సాగే జానకి పాడిన ఈ పాట బంగారు పంజరం చిత్రంలోనిది. దేవులపల్లి సాహిత్యం.

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2089

ఈ జానపద గీతాల్లోని ఇంకో ప్రత్యేకత ఏంటంటే మొహమాటాలూ, దాపరికాలు లేకుండా ఉన్నదున్నట్లు మనసులో మాటలన్నీ చెప్పేసుకుంటున్నట్లుంటాయీ సాహిత్యాలు. సరదాగా ఒకరినొకరు వేళాకోళాలాడుకుంటూనే అభిమానాలూ తెలుపుకుంటారు జంటలు. అనురాగం చిత్రంలోని ఈ పాట అందుకో చక్కని ఉదాహరణ..

“శనగ సేలో నిలబడి చేయ్యిజాపే ఓ పూసలోళ్ళ రాజమ్మా..” అనే పాటను క్రింద లింక్ లో వినవచ్చు:

అలాంటిదే “భలే రంగడు” చిత్రంలో ఇంకో పాట ఉంది..

“మెరిసిపోయే ఎన్నెలాయే

పరుపులాంటి తిన్నెలాయే

నన్ను ఇడిసి ఏడ బోతివిరా… బంగారుసామీ

రేతిరంతా ఏమిసేతునురా – ”

అనే పి. సుశీల పాడిన ఈ పాటను క్రింద లింక్ లో వినవచ్చు:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1225

* “వెలుగు నీడలు” చిత్రంలో “సరిగంచు చీరగట్టి బొమ్మంచు రైక తొడిగి ” అని ఓ స్టేజ్ సాంగ్ ఉంది. ఈ పాట సాహిత్యంలో “మింగ మెతులు లేదాయే..”, ఇంట్లో ఈగల మోత..” మొదలైన రెండు మూడు సామెతలు కూడా దొర్లుతాయి.

*ఇదే సినిమాలో హీరోహీరోయిన్లు నదిలో పడవ మీద వెళ్తుంటే, ఏటి గట్టు వెంబడే వెళ్టున్న పల్లెపడుచులు ఒకరినొకరు హుషారు చేసుకుంటూ పాడుకునే మరో గీతం ఉంది.

“ఓ రంగయో పూల రంగయో

ఓరచూపు చాలించి సాగిపోవయో

పొద్దువాలిపోతున్నదో..ఓఓయి.. ఇంత మొద్దు నడకనీకేల పోవోయి.. ”

* మంచి హుషారును తెప్పించే పాత పాటల్లో జమునారాణి పాడిన ఈ పాటను జత పరుచుకోవచ్చు. “ఎర వేసి.. హ… గురి చూసి.. పట్టాలి మావా..” అనే లైన్ భలే ఒడుపుగా పలుకుతారావిడ. బంగారు తిమ్మరాజు చిత్రం లోని ఈ పాటన్ ఉ ఇప్పటికీ టివి, స్టేజ్ షోస్ లో పాడుతూనే ఉన్నారు జమునారాణి.

“నాగమల్లి కోనలోన

నచ్చింది లేడికూన

ఎర వేసి గురి చూసి పట్టాలి మావా ” –

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7035

* జానపద బాణీ లానే కాక ఈ పాటలోని నీటిసూత్రాలు ఎంతో ఆకట్టుకుంటాయి ఈనాటికీ. మంచి మనసులు చిత్రంలో జమునారాణి, ఘంటసాల పాడారీ గీతాన్ని.

మావ మావ మావ

ఏమే ఏమే భామా…

* “రోజులు మారాయి” చిత్రంలో “పొలియో పొలి” అనే జానపద గీతం ఉంది. ఇది కాక బాగా పాపులర్ అయిన మరో పాట “ఏరువాకా సాగారో”. రైతన్న నైజాన్నీ, కృషినీ, దేశానికి చేసే సేవనూ మెచ్చుకుంటూ పాడే ఈ పాట సాహిత్యం ఎంతో బావుంటుంది. వహీదా రెహ్మాన్ హిందీ చిత్రాల్లో ఇంకా పాపులర్ అవ్వక మునుపు నటించిన నృత్యగీతం ఇది.

” కల్లాకపటం కాననివాడా

లోకంపోకడ తెలియని వాడా

ఏరువాకా సారారోరన్నో చిన్నన్నా

నీ కష్టమంతా తీరునురోరన్నో చిన్నన్నా..”

* “అదృష్టవంతులు” చిత్రంలోని “మొక్కజొన్న తోటలో ” పాటను మోస్ట్ పాపులర్ జానపద గీతం అనచ్చేమో! రేడియోలో చాలాసార్లు విన్నాకా ఓసారి టివిలో ఈ పాట చూసినప్పుడు బోలెడు ఆశ్చర్యపోయాను. ఇలాంటి పాటా ఇది అని?! నిజంగా ఏ పొలాల్లోనో, మంచె పక్కనో ఓ అమ్మాయి నిలబడి పాడుతుందేమో అనుకునేదాన్ని చిన్నప్పుడు. కానీ వినడానికి మాత్రం భలే సరదాగా హుషారుగా ఉంటుందీ పాట. కె.వెంకటరత్నంగారు రాసిన జానపద గీతం ఇది.

http://www.raaga.com/player5/?id=191693&mode=100&rand=0.06835282778691398

* “తల్లిదండ్రులు” చిత్రంలో “గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో ” అనే పాట ఉంది. పల్లెపడుచులందరూ చక్కగా గొబ్బిళ్ళు పెట్టుకుంటూ పాడుకునేలాంటి పాట. ఇది కూడా నెట్ లో ఎక్కడా దొరకకపోతే నా దగ్గర ఉన్నది క్రింద లింక్ లో అప్లోడ్ చేసాను.

“చెంచులక్ష్మి” చిత్రంలోని పాపులర్ సాంగ్ “చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?” నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి. జిక్కీ, ఘంటసాల పాడిన ఈ పాటకు సంగీతం ఎస్.రాజేస్వరరావు.

మరికొన్ని జానపద బాణీల్లోని సినీగీతాలు వాటి క్రింద ఉన్న లింక్స్ లో వినవచ్చు:

* “అల్లుడొచ్చాడు” చిత్రంలో అది కూడా జానపద బాణీలోని పాటే అనుకోవచ్చు.

“అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు

నేనేదింక కోరేదికలేదు అందరివోలె అడిగేదాన్ని కాదు

కొందరివోలె కొసరేదాన్నికాదు

ఓ మావా..ఓహో బంగారి మావా…” అని టి.చలపతిరావు సంగీతంలో సుశీల పాటొకటి సరదాగా బావుంటుంది. . వినాలంటే క్రింద లింక్ లో మొదటి పాట:

http://tunes.desibantu.com/alludochchadu/

* “పట్నంలో సాలిబండ పేరైనా గోలకొండ

చూపించు సూపునిండా”

– అమాయకుడు

(క్రింద పేజ్ లోని లిస్ట్ లో నాలుగవ పాట)

http://www.sakhiyaa.com/amayakudu-1968-%E0%B0%85%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/

* ఎయిర సిన్నోడేయ్ రా – పూలరంగడు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1739

* చివరిగా… “నీతోటే ఉంటాను శేషగిరి బావా” – జమిందార్

ఇంతా తెలిసి యుండి..

 

తృష్ణ

తృష్ణ


మన నలుపు తెలుపు తెలుగు చిత్రాల్లో సాంఘికాలే కాక జానపదాలూ, చారిత్రకాలు కూడా చాలా ఉండేవి కదా. వాటిల్లో తప్పనిసరిగా ఓ శాస్త్రీయపరమైన నృత్యగీతం ఉంటూండేది. ఉపమానం బాగోదు కానీ ఇప్పుడు తప్పనిసరిగా ప్రతి సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉన్నట్లన్నమాట. కొన్ని చిత్రాలో అయితే రెండు మూడు నృత్యగీతాలు ఉండేవి. అప్పట్లో ప్రేక్షకులు కూడా ఎంతో మక్కువగా అటువంటి నృత్యగీతాలు చూసేవారూ, వినేవారూనూ! అర్థమైపోయిందిగా.. ఈనాటి నేపథ్యం “నృత్యగీతాలు”. పాత సినిమాల్లోని కొన్ని నృత్య ప్రధానమైన గీతాలను గురించి ఇవాళ చెప్పబోతున్నాను..


సినిమాల్లో నృత్యగీతాలు అన్నీ పూర్తిగా శాస్త్రీయమైనవి కావు. కొన్ని సెమీ క్లాసికల్ గీతాలు కూడా ఉన్నాయి. ఇంకా వాటిల్లో కొన్ని పదాలు, జావళీలు కూడా ఉన్నాయి. ‘జావళి’ అంటే నాయకుడిని ఉద్దేశించి నాయిక పాడే శృంగారభరితమైన విరహగీతం. ఐతే, ఎక్కువగా ఇవి శాస్త్రీయనృత్యముపై ఆధారపడి శృంగార రస ప్రధానంగా ఉంటాయి. పదము, జావళీ.. ఈ రెండు నృత్యప్రధానమైన  నాట్యరీతులూ నాట్యప్రదర్శన చివరి భాగంలో ప్రదర్శిస్తూ ఉంటారు. పదములలో భక్తి రసం, అభినయం ఎక్కువగా ఉంటాయి కానీ జావళీలలో మాత్రం సాహిత్యం ఎక్కువగా ఉంటుంది. తేలికైన భాషలో సులువుగా పాడుకునేలాగ ఉంటాయివి. కర్ణాటక సంగీతంలో కూడా ఎన్నో జావళీలు ఉన్నాయి. పూర్తిస్థాయి కచేరీ అయిపోయిన తర్వాత లాలిత్యంతో కూడిన ఇటువంటి సంగీత రచనలను పాడే అలవాటొకటి ఉంది. మన తెలుగుచిత్రాల్లో జానపదాలు, చారిత్రక చిత్రాల్లోనే కాక సామాజిక చిత్రాల్లో కూడా అందమైన జావళీలను పొందుపరిచారు మన సినీ కవులు. ఈ నృత్యగీతాలను చాలా వరకూ ఆయా చిత్రాల నాయికలే అభినయించేవారు. కొన్నింటిని మాత్రం ప్రత్యేకంగా శాస్త్రీయ నృత్యం తెలిసినవారితో చిత్రీకరించేవారు. నటి ఎల్. విజయలక్ష్మి ఇటువంటి నృత్యప్రధానమైన ఎన్నో గీతాలకు, జావళీలకూ చక్కని అభినయాన్ని అందించారు.


* ముందుగా “మంగమ్మ శపథం” చిత్రంలోని ఈ జావళీ చూద్దాం. ఎల్.విజయలక్ష్మి అభినయం, ఆ వెన్నెల రాత్రి, మండపం సెట్టింగ్.. లతలు.. రెల్లు పూలు..అన్నీ కూడా పాట మూడ్ ని ఎలివేట్ చేస్తాయి.
“అందాల నా రాజ అలుకేలరా..”


* బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గానంతో పాటూ అభినయాన్ని కూడా చూపిన రెండు మధురమైన నృత్య గీతాల్లో ఒకటి మల్లీశ్వరి చిత్రంలోని “పిలిచిన బిగువటరా..”. దేవులపల్లి రచించిన ఈ జావళి ఎంత ప్రఖ్యాతిగాంచిందో వేరే చప్పక్కర్లేదు..


* “పూజాఫలం” చిత్రంలో రెండు నృత్యగీతాలు ఉన్నాయి. రెండింటికీ ఎల్.విజయలక్ష్మే నృత్యం . ఒకటి “మదనా మనసాయెరా”. 
రెండవదైన “శివదీక్షాపరురాలనురా..” చాలా బావుంటుంది. కురంజి రాగంలోని ఈ “పదము” పదిహేడవ శతాబ్దానికి చెందిన ఘనం సీనయ్య రచన. ఇతను మధుర రాజుగారైన విజయరంగచొక్కనాథుని కొలువులోని ఒక మంత్రిట. ఈ పదానికి ఎంతో చరిత్ర ఉంది. ఎందరో గాయనీమణులు ఎన్నోసార్లు రికార్డుల్లో పాడారుట. ఇంతే కాక పలు పాత చిత్రాల్లో కూడా ఈ పదాన్ని వాడుకున్నారు. “పూజాఫలం”లో నాట్యకళాకారిణైన ఎల్.విజయలక్ష్మి అభినయం, ఆ ముద్రలు, హావభావాలు చూచి తీరవలసిందే..! ఇక జానకి గాత్రం గురించి ఎంత మెచ్చినా తక్కువే :)
(పూజాఫలం – శివదీక్షాపరురాలనురా)

* ఇక రెండవది “విప్రనారాయణ” చిత్రంలోని “రారా నా సామి రారా”. ఈ చిత్రంలో రాజుగారి కొలువులో నాట్యకళాకారిణిగా, అహంకారిగా ఒక భక్తుడిని ఓడించడానికి వచ్చి చివరికి తానే అతడికి దాసురాలైయ్యే ప్రేమమూర్తిగా భానుమతమ్మ నటనను మెచ్చి తీరవలసిందే!
“రారా నా సామి రారా.. ” (విప్రనారాయణ)క్రింద లింక్ లో వినవచ్చు:


* బొబ్బిలి యుధ్ధం చిత్రంలోని “నిను చేర మనసాయెరా” కూడా ఎల్.విజయలక్ష్మి అభినయించిన జావళీయే. ఇందులో సాలూరి రాజేశ్వరరావు సంగీతానికి పి.సుశీల గాత్రాన్నందించారు.
నిను చేర మనసాయెరా నా స్వామి (పి.సుశీల – బొబ్బిలి యుద్ధం) 

* దేవదాసు చిత్రానికి ఆర్.బాలసరస్వతీదేవి పాడిన మరో నృత్యగీతం “ఇంతా తెలిసి యుండి ఈ గుణమేలరా…”. చివరలో “మువ్వ గోపాలా” అని వస్తుంది కాబట్టీ ఇది క్షేత్రయ్య పదమేమో అనుకుంటాను నేను. ఈ సినిమా రికార్డ్ మీద అన్నీ తప్పులే రాసారని వి.ఏ.కే. రంగారావుగారు ఎక్కడో కోప్పడ్డారు కూడా.
క్రింద లింక్ లో ఈ పాటను వినవచ్చు:

 
* “జయసింహ” చిత్రంలో పి.సిశీల పాడిన జావళి “నడిరేయి గడిచేనే చెలియా రాడాయెనే సామీ..”. అభినయం చేసినదేమో ప్రఖ్యాత హిందీ సినీతార వహీదా రెహ్మాన్.
టి.వి .రాజు సంగీతం, సముద్రాల జూనియర్ రచన.



 * ప్రఖ్యాత కర్ణాటకసంగీత విద్వాంసురాలు ఎమ్.ఎల్.వసంత కుమారి “జయభేరి” చిత్రానికి ఒక నృత్యగీతాన్ని పాడారు. వీరు సినిమాల కోసం పాడిన అతి తక్కువ పాటల్లో ఇది ఒకటి. మరొకటి “భలే అమ్మాయిలు” చిత్రం కోసం “గోపాల జాగేలరా.. నను లాలించి పాలింప రావేలరా..” అని గాయని పీ.లీలతో కలిసి పాడారు.
పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన “నీవెంత నెరజాణవౌరా..”  క్రింద లింక్ లో వినవచ్చు:


* పి.సుశీల “శ్రీ కృష్ణ విజయం” చిత్రం కోసం పాడిన మరో పాట “జోహారు శిఖిపింఛమౌళి ” ఎంతో ప్రఖ్యాతి చెందింది. ఈ పాటలో సుశీలమ్మ రాగాలాపన, హై పిచ్ కి వెళ్ళినా తరగని ఆ గాత్ర మాధుర్యం నాకెంతో నచ్చుతాయి. పెండ్యాల సంగీతం. ఈ పాటకు నాట్యం చేసినదేమో మరో ప్రముఖ హిందీ నటి “హేమమాలిని”. విడియో దొరకలేదు. క్రింద లింక్ లో ఆడియో వినేయండి:


* దర్శకుడిగా విశ్వనాథ్ మొట్ట మొదట తీసిన “ఆత్మ గౌరవం” చిత్రంలో ఓ చక్కని క్షేత్రయ్య పదాన్ని వాడుకున్నారు. “ముందటివలే నాపై నెనరున్నదా సామీ..” అని సుశీలమ్మ గానం చేస్తుంటే… వినడానికి రెండు చెవులు సరిపోవు అనిపిస్తుంది నాకైతే. అంత బాగా పాడారావిడ. ఈ పాట ఎంత వెతికినా నెట్లో దొరకలేదు :(



* మిస్సమ్మ చిత్రం లో మరో నృత్యగీతం ఉంది. “బాలనురా మదనా” అనే ఈ గీతాన్ని కూడా పి.సుశీల గానం చేసారు. పింగళివారి రచన, సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం. 
గీతాన్ని క్రింద లింక్ లో వినవచ్చు..



మరికొన్ని నృత్య గీతాలు:

* తెనాలి రామకృష్ణ: ఇచ్చకాలు నాకు నీకు ఇంక ఏలరా(పి.లీల)
(లిస్ట్ లో ఆఖరి పాట)

* రారా ప్రియా సుందరా (భక్తప్రహ్లద )
*అందని సురసీమనీదేనోయీ (భక్తప్రహ్లద)
*మనసైన దాననురా (వీరాంజనేయ)
సాలూరి, ఆరుద్ర
* ఎంతటి సరసుడవో (మల్లమ్మ కథ)
* అందెలు పలికె (భక్తపోతన)
* సరసాల జవరాలను (పి.లీల)(సీతారామకల్యాణం)
* జోహారు గైకొనరా (పి.లీల) (అప్పు చేసి పప్పు కూడు)
* అందాల బొమ్మతో (పి.సుశీల)(అమరశిల్పిజక్కన్న)
* నగుమోము చూపించవా గోపాలా(అమరశిల్పిజక్కన్న)
* మనసే వికసించెరా (అమరశిల్పిజక్కన్న)


చివరిగా బాపూ కళాత్మక సృష్టి “ముత్యాల ముగ్గు”లోని ఈ పాట చూపెట్టకపోతే ఈ వ్యాసం అసంపూర్ణం అనిపించదూ…:) 
అసలు చీర కట్టులోని అందం బాపూ చూపినట్టుగా ఎంకెవరూ చూపలేరు అని నాకో గట్టి నమ్మకం.
(ముత్యాల ముగ్గు: ఎంతటి రసికుడవో..)


( మరో నేపథ్యంతో మళ్ళీ కలుద్దామేం…)

అల్లరి పాటలు…!

తృష్ణ

తృష్ణ

 
నేను 6th classలో ఉండగా మా ఇంట్లో మొదటి బ్లాక్ అండ్ వైట్ టివీ వచ్చింది. అప్పట్లో టివీ అనేది కొత్త సరదా అవడం వల్ల అన్ని కార్యక్రమాలతో పాటూ ‘చిత్రహార్’ కూడా వదలకుండా చూసేవాళ్ళం. చిత్రహార్ లో హీరో హీరోయిన్ ని ఏడిపిస్తూ పాడే టీజింగ్ సాంగ్స్ కొన్ని వచ్చేవి. పాట చివరిదాకా హీరోయిన్ ని ఏడిపిస్తూ, తిప్పేస్తూ, ఊపేస్తూ, అల్లరి పెడుతూ ఉంటే అప్పటిదాకా చిరాకుపడ్డ అమ్మాయి అబ్బాయిని కోప్పడకుండా పాట చివరికి వచ్చేసరికీ నవ్వేసేది. అలా ఎందుకు నవ్వేస్తుందో అర్థమయ్యేది కాదు. పాట అయిపోతోంది బట్టి తప్పనిసరిగా నవ్వేస్తుందన్న మాట అనుకునేదాన్ని. తర్వాత కొన్నాళ్ళకు తెలుగు కార్యక్రమాలు మొదలయ్యాకా చిత్రలహరి వచ్చేది. అందులోనూ కొన్ని పాత పాటలు ఇలానే ఉండేవి. పాట చివరిదాకా హీరో హీరోయిన్ ని నానారకాలుగా అల్లరిపెడుతూనే ఉంటాడు. ఇప్పటికీ నాకు అర్థంకానిది ఒకటే.. అలా ఎత్తి కుదేసి, దొర్లించేసి, అల్లరిపెట్టేసాకా ఒక్క లెంపకాయ వెయ్యాల్సింది పోయి పాట చివరికి హీరోయిన్ నవ్వేసి ఎందుకు కూల్ అయిపోతుందో.. అని!!
 
 
ఈసారి ‘పాట వెంట పయనం’ లో ఇలాంటి అల్లరి పాటలు కొన్ని చూపిద్దామని. అంటే అన్నీ పాట చివరిదాకా వచ్చాకా హీరోయిన్ నవ్వేసే పాటలు కాకుండా; అబ్బాయిలు అమ్మాయిల్ని ఏడిపిస్తూ పాడే పాటలు + అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ఏడిపిస్తూ పాడే కొన్నిపాటల్నే వెతికి తెచ్చాను. అప్పట్లో అమ్మాయిలు ఇంత ఫాస్టా? ఇంత ధైర్యమా? అని ఆశ్చర్యం వేస్తుంది అలాంటి కొన్ని పాటల్ని చూస్తే. పాటలు వెతుకుతూంటే నే గమనించిన సంగతి ఏంటంటే ఇలాంటి అల్లరి పాటల్లో చాలా వరకూ అక్కినేని పాటలే ఉన్నాయి. వేరే హీరోల పాటలు వెతకచ్చు కానీ చాలావరకూ చెవికింపుగా ఉండే పాటలు అవడం వల్ల ఈసారి ఎక్కువగా అక్కినేని పాటల్నే ఎంచుకోవడమైంది.
 alBKcXRoY1dqb1Ex_o_buddhimanthudu-movie-songs---havvare-havva---anr-vijaya-
 
ముందు అబ్బాయిలు అమ్మాయిల్ని ఏడిపిస్తూ పాడే కొన్ని పాటలు చూద్దాం.. అలాంటి పాటల్లో నాకు బాగా నచ్చేది “ప్రేమించి చూడు” చిత్రంలో పాట.
“మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయము వలదా హోయ్…ఓ చెయి వేసేదా”
అని నాగేస్రావ్ పాడుతూంటే, ఆ అక్కాచెల్లెళ్ళు రుసరుసలడుతూ టైరులో గాలి కొడుతుంటే నాగేస్రావ్ మీద కోపం రాదు సరికదా భలే సరదాగా ఉంటుంది..
 
 
“బులిబులి ఎర్రని బుగ్గల దానా చెంపకు చారెడు కన్నుల దానా
మరచిపొయ్యవా నువ్వే మారిపోయావా..
నన్ను మరచిపోయావా..నువ్వే మారిపోయావా” 
అని అబ్బాయి పాడుతుంటే, అబ్బాయితో పాటే అమ్మాయి కూడా ఈల వెయ్యడం గమ్మత్తుగా ఉండేది చిన్నప్పుడు ఈ పాట చూసినప్పుడల్లా! “శ్రీమంతుడు” చిత్రంలోని పాట ఇది..
 
 
ప్యాంటు, చొక్కా వేసుకున్న అమ్మాయి వెనకాలే ఓ అబ్బాయి ” అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్యా… ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా..య్యా..య్యా…” అని పాడుతూ ఉంటే “మనకి తెలిసిపోయింది కదమ్మా ఈ అబ్బాయికి తెలియలేదా అది అమ్మాయి అని” అని అమ్మని అడిగేవాళ్లం చిన్నప్పుడు..:)
(చిత్రం: అదృష్టవంతులు)

 
“ఇల్లరికం” చిత్రంలో మారువేషం వేసుకుని భర్త తన భార్యనే అల్లరిపెట్టే ఈ పాట చాలా సరదాగా, వినడానికి కూడా బావుంటుంది. 
ఎంత వెతికినా ఈ పాట వీడియో దొరకలేదు..:( ఆడియో లింక్ మాత్రమే ఇస్తున్నాను. 
(నిలువవే వాలు కనులదానా..)
 
 
 
 
“నేనంటే నేనే” సినిమాలోని ఈ సూపర్ స్టార్ కృష్ణ  పాట ఎంత ఫేమస్సో వేరే చెప్పాలా?! కొత్త సినిమా పాటలు చూసీ చూసీ, ఈ పాటలో అమ్మాయికి స్కర్ట్ వేసినా కూడా ఎంత నీట్ గా ఉందో పాట అనిపిస్తుందీ పాట చూస్తూంటే.
(ఓ చిన్నదానా నన్ను విడిచి పోతావటే..) 

 
యద్దనపూడి నవల “మీనా” ఆధారంగా తీసిన “మీనా” చిత్రంలో ఓ పాట ఉంది. ఓ పట్నం పిల్ల పొలంలోకి వచ్చి నడవలేక అవస్థ పడుతుంటే ఆమెని అల్లరిపెడ్తూ ఓ బావ పాడే పాట ఇది. 
“చేనుకి గట్టుంది.. ఇంటికి గడపుంది 
కంటికి రెప్పుంది.. కన్నెకు హద్దుందీ
హద్దు మీరినా, కాలు జారినా.. అంతా గల్లంతౌతుందీ..
అమ్మాయిగారండీ..” అని సాగే ఈ పాట సాహిత్యంలో ఎంతో నీతి కనబడుతుంది. 
ఈ చిత్రంలో నాయికగా వేరే ఎవరైనా అయిఉంటే సినిమా ఇంకా బాగుండేదేమో అన్నది నా డౌటాభిప్రాయం.
 
 
ఇంకా చెప్పుకుపోతే బుధ్ధిమంతుడు చిత్రంలో “హవ్వారే హవ్వా హైలెస్సో.. దాని యవ్వారమంతా హవ్వా హైలెస్సో” పాట, 
పల్లెటూరి బావ చిత్రంలో  “ఒసే వయ్యారి రంగీ..” , 
లేత మనసులు చిత్రంలో “హల్లో మేడం సత్యభామ..”, 
కొడుకు కోడలు చిత్రంలో  “గొప్పోళ్ళ చిన్నది..” ఇలా బోలెడు పాటలున్నాయి! 
ఈ వరుసలో ఒక కలర్ సాంగ్ మాత్రం పెట్టకుండా ఈ సిరీస్ పూర్తవదు. అదే ” నిర్ణయం” చిత్రంలో నాగార్జున పాడే “హలో గురూ..ప్రేమకోసమేరా జీవితం..” పాట. నాటక రచయిత, సినీ రచయిత గణేశ్ పాత్రో రాసిన పాట ఇది. అప్పట్లో విపరీతంగా ఫేమస్ అయిపోయిన ఈ పాట ఇప్పటికీ ఎక్కడో అక్కడ మోగుతూనే ఉంటుంది. అమల ఎంత బావుంటుందో ఈ పాటలో!
 
***    ***   ***
 
ఒకే చిత్రంలో సాహిత్యంలో కాసిని మార్పులతో రెండు పాటలు, రెండు సిట్యుయేషన్స్ లో చాలా చిత్రాల్లో పెడుతూంటారు. వాటిని “టేండమ్ సాంగ్స్” అంటారు. సాధారణంగా ఇలాంటివి ఒక హ్యాపీ, ఒక పేథోస్ ఉంటుంటాయి. “వినుము చెలీ తెలిపెదనే ఒక మధుర రహస్యం”, “చేతిలో చెయ్యేసి”, “నల్లవాడే..”, అందాల ఓ చిలుకా”, “ఆడేపాడే పసివాడా” మొదలైన పాటలన్నమాట. అలాంటి టేండమ్ హ్యాపీ సాంగ్స్ మేల్, ఫీమేల్ వర్షన్స్ కొన్ని సినిమాల్లో ఉన్నాయి. ఒకటీ”దొరికితే దొంగలు” చిత్రంలో ఉంది. ఒకటేమో అబ్బాయిని అమ్మాయి ఏడిపించేదయితే, మరొకటి అబ్బాయి అమ్మాయిని ఉడికించేది..
“ఎవరికి తెలియదులే యువకుల సంగతి..”
“ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి..”
***   ***   ***
మరిప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్ని ఏడిపించే పాటలు కూడా కొన్ని చూద్దామా…
 
మరిప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్ని ఏడిపించే పాటలు కూడా కొన్ని చూపిస్తానేం…
మొదట బ్రహ్మచారి చిత్రంలో అమ్మాయి + స్నేహితురాళ్లందరూ కలిసి ఓ అబ్బాయిని బాగా ఏడిపించేసే పాట ఉంది. అప్పట్లో ఇలాంటి పాట సెన్సేషనే అయి ఉంటుంది. ఇలాంటిదే.. అంటే హీరోయిన్ తన స్నేహితురాళ్లతో కలిసి “హల్లో ఇంజనియర్ హల్లో మైడియర్..” అంటూ హీరోని అల్లరి పెట్టే పాట “ధర్మదాత” చిత్రంలో కూడా ఉంది.  అందులోనూ అక్కినేని హీరో, అల్లరి అమ్మాయేమో నటి కాంచన.
ఇప్పుడు బ్రహ్మచారిలోని  “ఓ బ్రహ్మచారి నిను కోరి.. నిలుచున్నది.. చిన్నది.. నిను చేరి” పాట చూసేద్దాం..
 
 
తర్వాత, సావిత్రి ఏ.ఎన్.ఆర్ కి చెమటలు పట్టిస్తూ “ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట..” అంటూ పాడే పాటొకటుంది. చిన్నప్పుడూ చిత్రలహరిలో చూసేప్పుడు ఈ పాటలో “శ్రీవారూ..” అని సావిత్రి ఎందుకు పిలుస్తోంది అని అడిగితే అమ్మ సినిమా కథ చెప్పింది. తర్వాతెప్పుడో ఊళ్ళోకకొచ్చే పాత సినిమాలు తీసుకెళ్ళి చూపించినప్పుడు ఈ సినిమా కూడా చూపించింది.
(చిత్రం: మంచి మనసులు)
 
 
అవసరమైతే హీరోలను సైతం ఆటపట్టించగల అప్టుడేట్ యువతిగా పేరుపడ్డ నటి జమున. “బందిపోటు దొంగలు” చిత్రంలో అక్కినేని ని అల్లరి పెడుతూ జమున పాడే పాటుంది.. “కిల్లాడి దొంగా డియ్యూం డియ్యూం..” అని. అది కాకుండా “ముహుర్తబలం” చిత్రంలో జమునదే ఇంకో పాట ఉంది. పైన మీనా చిత్రంలో హీరో కృష్ణ ఓ పట్నం అమ్మాయిని ఏడిపిస్తే పాడతాడు కదా, ఇందులోనేమో పట్నం బాబులా వచ్చిన కృష్ణను అల్లరిపెడుతూ అల్లరి అమ్మాయిగా జమున పాడుతుందీ పాట.
(డొయ్ డొయ్ డొయ్ డొయ్ వస్తున్నాడోయ్..)
 
 
“గొప్పోళ్ల చిన్నది గువ్వల్లే ఉన్నది..
కొండ మీడి కోతల్లే చిక్కనంటది..
చెట్టు కొమ్మల్లే గుండేను ఊపేస్తది..”
అని కొడుకు కోడలు చిత్రంలో అమ్మాయిని ఉడికిస్తూ అబ్బాయి పాడే పాటొకటి ఉంది. అదే అమ్మాయి మళ్ళీ ఆ అబ్బాయిని ఏడిపిస్తూ “నా కంటే చిన్నోడు.. నా తమ్ముడున్నాడు.. అన్నాడూ ఒక పిలగాడు..” అని పాడే అల్లరి పాటొకటి ఉంది. వాణీశ్రీ  బాగా చలాకీగా నటించిన ఈ పాట చూసేద్దామిప్పుడూ..
(చిత్రం: కొడుకు కోడలు)

 

 
 
మైనర్ బాబు చిత్రంలో 
“కారున్న మైనరు.. కాలం మారింది మైనరు
ఇక తగ్గాలి మీ జోరు 
మా చేతికి వచ్చాయి తాళాలు..హోత్తెరీ..” అంటూ వాణిశ్రీ పాట మరొకటి ఉంది. 
మైనర్ బాబుని అల్లరిపెడుతూ, డబ్బున్న అబ్బాయిల గుణాలని ఎద్దేవా చేస్తూ ఓ పేదింటి పిల్ల పాడే పాట ఇది..
 
***   ***   ***
(మరోసారి మరో నేపధ్యంతో మళ్ళీ కలుద్దామే..)

వెలిగినదొక వానవిల్లు…నిను తలవంచి చూసెనే…

 CMS-when-it-is-raining...!!!(1)
ఎండలు ముదురుతున్నాయ్.. ఎటు వెళ్ళినా విపరీతమైన వేడి, చెమట, చిరాకు. శీతాకాలంలో ఈ చలి ఎప్పుడు వెళ్పోతుందో అని ఎదురుచూస్తామా, ఎండలు రాగానే ఉక్కిపోతున్నాం బాబోయ్ అని గోల పెడతాం. మిగతా కాలాల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి తెల్లారుతూనే ఫుల్ స్వింగ్ తో తన ప్రతాపాన్ని మనబోటి అల్పులపై చూపెట్టేస్తున్న మిస్టర్ సూర్యుడిని చూసి భయపడిపోతున్నాం.  అందుకనే ఈసారి కాస్త వెరైటీగా వాన పాటల వెంట పయనిద్దామని డిసైడయ్యా..:) కాసిని వాన పాటల్ని చూస్తే వాతావరణమెలా ఉన్నా “చినుకు చినుకు చినుకు చినుకు….” అంటూ కనీసం మనసైనా చల్లబడుతుంది కదా అని. ఉరుములు, మెరుపులతో కాలింగ్ బెల్ మోగించి, చిన్న చిన్న చినుకులతో ఎంట్రీ ఇచ్చి, జడివానగా మారిపోయి పుడమిని నిలువెల్లా తడిపేసే వర్షహేలను చూసి పులకించిపోని హృదయం ఉంటుందా?! అసలు వర్షాన్నీ, వెన్నెలనీ ప్రేమించని మనిషులుండరు కదా!  కాకపోతే కిటికీలోంచి చూస్తూ కూచోవడానికి అద్భుతంగా ఉంటుంది గానీ అర్జెంట్ పనులున్నప్పుడు, బట్టలు ఆరనప్పుడు మాత్రం వాన మీద కోపం వస్తుంది.
మన తెలుగు సినిమాల్లో వానపాటలకేం.. బోలెడున్నాయ్. పాత సినిమా పాటల్లో కూడా చిటపట చినుకుల్ని బాగానే కురిపించేసారు మన సినీ కవులు. “మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరునవ్వులు కాబోలు/ ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు..” అంటూ శంకరశాస్త్రి గారితో కూడా పరవశ వర్షానందగానాన్ని ఆలపింపజేసారు వేటూరి. ఇంకాస్త వెనక్కి వెళ్తే, చిటపట చినుకులతో కురిసింది వాన, మెరిసింది జాణ(అక్కా చెల్లెలు), వాన కాదు వాన కాదు వరదా రాజా.. (భాగ్యచక్రం), కరుణించవా వరుణదేవా(రాజకోట రహస్యం), చిరు చిరు జల్లుల చినుకుల్లారా(ప్రైవెటూ మాష్టారు), చినుకులలో.. వణికి వణికి(రహస్య గూఢచారి), వాన వెలిసిన వేళ(ఘరానా దొంగ),వాన జల్లు కురిసింది…లేరా..(సంపూర్ణ రామాయణం), కొండపైన వెండి వాన(ఇంటి దొంగలు), మొదలైన వాన పాటలు వినడానికి చాలా బావుంటాయి. అయితే,  వర్షం పడటం ఎక్కువగా చూపెట్టిన వాన పాటలు అయితే సరదాగా ఉంటుందని అలాంటి పాటల్ని వెతికానీసారి. అందువల్ల బ్లాక్ ఽ వైట్ తో పాటూ కాసిని రంగురంగుల పాటలతో ఈసారి పాట వెంట పయనాన్ని ముస్తాబు చేసాను. మరి ఎలా ఉన్నాయో వినేసి, చూసేసి చెప్పేయండీ…
వానపాటల్లో మొట్టమొదట అంతా చెప్పుకునేది ఈ పాట గురించే! వినడానికి పరమ అద్భుతంగా ఉంటుంది కానీ చూట్టానికే నాకు మనసొప్పదు :( వీరోవిన్ గారి ఆహార్యం ఎందుకో నా ఫ్రేం లో ఇమడదు. అసలు పాత నటీమణుల్లో బి.సరోజ నాకు బాగా నచ్చుతుంది కానీ ఈ పాటలో మాత్రం స్కార్ఫ్, రెండు పూలజడలతో నన్ను భయపెడుతుందావిడ. అందుకని ఈ పాట ఆడియోని మాత్రమే క్రింద ఇస్తున్నాను..:)
కొన్ని పాటలు అలా కళ్ళు మూసుకుని వినడానికి చాలా బావుంటాయి. ఎన్నిసార్లైనా అలానే వినాలనిపిస్తుంది తప్ప చూడాలనిపించదు. అలాంటి పాట ఇది. ఓ ప్రేమ జంట హద్దుల దగ్గర ఆగడానికి పడే పాట్లు, వారి తపన, గుసగుసలు ఈ పాటలో తెలుపుతారు గీతరచయిత రాజశ్రీ.
“వానల్లు కురవాలి వరిచేలు పండాలి
మా ఇంట మహలక్ష్మి చిందెయ్యాలి..” అంటూ సాగే ఈ కొసరాజు గీతం మనల్ని పూర్తిగా పల్లె వాతావరణంలోకి తీసుకుపోతుంది. స్పెషల్ పాటలకు పెట్టింది పేరైన ఎల్.ఆర్.ఈశ్వరి వాయిస్ ఈ పాటలోని విశేషం.
(చిత్రం: అల్లుడే మేనల్లుడు)
“ముత్యాల జల్లు కురిసే, రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే…అమ్మమ్మా”
అంటూ “కథానాయకుడు” చిత్రంలో జయలలిత ఆనందంతో చేసే నృత్యం చూసి తీరవలసిందే! సుశీల గాత్రంలోని గమకాలు కూడా గిలిగింతలు పెడతాయి. అమ్మాయి కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నా ఎబ్బెట్టుగా అనిపించకుండా చిత్రీకరించిన దర్శకుడిని మెచ్చుకుని తీరాలి.
ఇన్ని పాటల మధ్యన ఓ సరదా గీతం కూడా చూద్దామా..
“చిటపట చినుకుల మేళం తడిపొడి తపనల తాళం” అంటూ “ముద్దుల కొడుకు” చిత్రంలో శ్రీదేవి, అక్కినేని చెప్పే ‘అందమైన అనుభవాలు’ భలే సరదాగా ఉంటాయి. ఈ పాటలో బాలూ గాత్రం అచ్చం అక్కినేని పాడుతున్నట్లే ఉంటుంది. ఇలా ఏ హీరోకి పాడితే ఆ హీరో స్వరాన్ని ఇమిటేట్ చేయడం వల్లనే తన పాటలంతగా ఆకట్టుకున్నాయి మనల్ని.
“వానదేవుడే కళ్ళాపి చల్లగా… వాయుదేవుడే ముగ్గేసి వెళ్లగా..”
“కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే… ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే ” అంటూ గీతాంజలిలో గిరిజ చేసే అల్లరి చూసి అప్పటికప్పుడు తానూ వర్షంలో తడవాలని అనుకోని అమ్మాయి ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. తను వేసుకున్న ఆద్దాల డ్రెస్ లు, చెప్పే డైలాగ్స్, పాడే పాటలూ అన్నీ ఒక అబ్సెషన్ లా ఉండేవి అప్పట్లో అమ్మాయిలందరికీ!
ఈ పాటలో “వెళ్ళడాయె కళ్ళు లేని దేవుడెందుకో మరి..” అన్న వాక్యం మాత్రం ఇప్పటికీ అర్థం కాదు నాకు :(
పెళ్ళిచూపుల నుండి తప్పించుకోవడానికి ఓ అమ్మాయి కాలేజీ నుండి ఇంటికి రాకుండా ఈ పాట పాడుతూ సాయంత్రాన్ని గడిపేస్తుంది. అంత కష్టపడ్డా ఫలితం దక్కదు. ఆమె వచ్చేదాకా వేచి ఉండి, పిల్ల నచ్చిందని చెప్పి మరీ వెళ్తాడు పెళ్ళికొడుకు. రేవతి అంటే ఎంతో ఇష్టాన్ని పెంచేసిన మణిరత్నం మౌనరాగం ఇది.
“డాన్స్ మాష్టర్” అనగానే కమల్ కన్నా ముందర నాకు గుర్తొచ్చేది ఈ చిత్రంలో రేవతి నటన. అసలు సూపరంటే సూపరే. చలాకీ కాలేజీ పిల్ల గా రేవతి పాడే ఈ పాట తాలూకూ తమిళ్, తెలుగు రెండు వర్షన్స్ బావుంటాయి.
ఇళయరాజా సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంటర్లూడ్స్ తో సహా అన్ని బిట్స్ కంఠస్తం నాకు.
కాస్త కొత్త చిత్రాల వైపుకి వస్తే “వర్షం” చిత్రం మొత్తం వాన గురించే కదా. అందులో నాయిక వర్షంతో చేసే స్నేహం, దెబ్బలాట, కబుర్లు అన్నీ భలేగా ఉంటాయి. అన్ని పాటలూ కొన్నాళ్ళ పాటు తెగ మోగాయి ఇంట్లో. ముఖ్యంగా ఈ పాట… అందులో వాన చప్పుడు, త్రిష పట్టీలు… అన్నీ బావుంటాయి.

 

“వాన” చిత్రంలో  కార్తీక్ అద్భుతంగా పాడిన “ఆకాశగంగ” పాటలో వర్షాన్ని చాలా అందంగా చూపిస్తారు. నేను చిత్రాన్ని ఇంతవరకూ చూడలేదు కానీ అండులో పాటలు, ప్రత్యేకంగా ఈ పాట మాత్రం బోల్డు సార్లు విన్నాను. అసలు కార్తీక్ కాకుండా ఇంకెవరన్నా ఈ పాట పాడితే ఇంత బావుండేది కాదేమో అనిపిస్తుంది కూడా.
చివరిగా కొత్త పాటల్లో నాకు బాగా నచ్చిన ఒక వాన పాట.. “నాన్న” చిత్రంలో సైంధవి పాడిన “వెలిగినదొక వానవిల్లు..”! ఈ పాటకు తియ్యటి సైంధవి గళం ప్రాణమా, ప్రకాష్ కుమార్ సంగీతం ప్రాణమా అంటే తేల్చడం కష్టం. డబ్బింగ్ పాట కావడమే ఈ పాటకు చిన్న లోపం. డబ్బింగ్ పాటల్లో సాహిత్యం కుదరదు కదా సరిగ్గా! అయినా కూడా అలా వింటూ వింటూ ఏవేవో కొత్తలోకాల్లో విహరించి రావచ్చు…
మరి బాగున్నాయా వాన పాటలూ? కాస్తైనా సేద తీరారా? మళ్ళీ మరో కొత్త నేపథ్యంతో మరోసారి కలుసుకుందాంమే…
rajiతృష్ణ.

అలుక కతమును తెలుపవు..?

radha-in-viraha
“ఘాటైన ప్రేమకు అసూయ ధర్మామీటర్ లాంటిది” అయితే, ఆ ప్రేమ లోతు ఎంతుందో తెలిపేది అలుకే మరి!
ఎందుకంటే ఎవరిమీదైనా అలిగినప్పుడే కదా అవతలివారి ఓపిక, సహనం ఏపాటివో తెలిసేది. స్నేహితులైనా, ప్రేమికులైనా, తల్లీపిల్లలయినా, భార్యాభర్తలయినా, చివరికి కొత్తల్లుడయినా సరే అలకపాన్పు ఎక్కగానే విసుక్కోకుండా బ్రతిమాలి, బుజ్జగించి అలక తీర్చి తిరిగి మచ్చిక చేసుకోవడంలోనే అలుకతీర్చేవారి ఓర్పు, నేర్పూ దాగి ఉంటుంది. అలుక కోపానికి చెల్లెలే అయినా గుణగణాల్లో మాత్రం పూర్తిగా భిన్నం. అడక్కుండా వచ్చేది కోపమైతే, కావాలని తెచ్చిపెట్టుకునేది అలుక. ఇదీ సరససల్లాపాల్లో ఉపయుక్తమైనది. కోపం దూరాన్ని పెంచితే, అలుక విరహాన్ని పెంచి మనసుల్ని దగ్గర చేస్తుంది. మరి మన సినీకవులు అలిగినవారి మీదా, అలుకలు తీరినవారి మీదా, అలుక తీర్చేవారి మీదా ఎటువంటి పాటలల్లారో తెలుసుకుందామా…
“ఉరుములు మెరుపులు ఊరుకే రావులే
వానజల్లు పడునులే మనసు చల్లబడునులే”
అంటూ  ఓ అమ్మాయి పాడితే దిగిరాని అబ్బాయి ఉంటాడా? అలుకెందుకో తెలియకపోయినా, దానికి తగిన కారణమేదో ఉండే ఉంటుందని అర్థం చేసుకుని బుజ్జగించే మనసు తోడైతే ఇక కావలసినదేమి ఉంటుంది?!
” గోరొంక కెందుకో కొండంత అలక
అలకలో ఏముందో తెలుసుకో చిలకా..” అంటూ సాగే ‘దాగుడుమూతలు’ చిత్రం లోని పాటను చూసేద్దామా..
అనగనగా ఓ గౌరి.. ఆమె మనసు దోచుకున్న ఓ మావ! అంత మనసైనవాడు అలిగేస్తే ఆ చిన్నది ఊరుకుంటుందా? “ముక్కు మీద కోపం నీ మొఖానికే అందం” అంటూ తన ఆటపాటలతో కవ్వించి నవ్విస్తుంది.  అలా సల్లాపాలాడుతూనే “అడపదడప ఇద్దరూ అలిగితేనే అందం… అలకతీరి కలిసేదే అందమైన బందం” అంటూ మౌలికమైన ప్రేమ సిధ్ధాంతాన్ని కూడా చెప్పేస్తుంది. అల్లరిగోదారిలా పరుగులెడుతూ, కొండపల్లి బొమ్మని గుర్తు చేసే గౌరి ఇంకా ఏమేమంటుందో చూద్దామా..
“అలుక కతమును తెలుపవూ? పలుకరించిన పలుకవూ?
ఏల నాపై కోపమూ ఏమి జరిగెను లోపమూ?”
 అని “పెళ్ళి సంబంధం” చిత్రంలో సుశీల పాడిన ఓ చక్కని గీతం ఉంది. అలుక కు కారణం తెలుసుకునే ప్రయత్నంలో ఈ పాటలో గాయని వేసే ప్రశ్నలు గమ్మత్తుగా ఉంటాయి.. మీరూ వినండి..
ఆ లింక్ లో వినబడకపోతే క్రింద లింక్లో మూడవ పాట:
“సత్యాపతి” అనే లోకనిందను మోసినా, ఆ భామగారి రుసరుసలను, అలుకలను తప్పించుకోవడం కృష్ణపరమాత్ముడికే తప్పలేదు! విరహాన్ని భరించలేక చివరికి..
” అలిగితివా సఖీ ప్రియా అలకమానవా?
ప్రియమారగ నీ దాసుని ఏలజాలవా?..”
అంటూ ప్రియమైన సత్యభామను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని తంటాలు పడ్డాడో పాపం కృష్ణుడు…!
ఇదే సన్నివేశానికి “శ్రీ కృష్ణతులాభారం” చిత్రంలో సత్యభామాకృష్ణులకు మరో పాట కూడా ఉంది.. “ఓ చెలీ కోపమా.. అంతలో తాపమా…
సఖీ నీవలిగితే నే తాళజాల…” అని! కానీ రెంటిలోనూ “శ్రీకృష్ణార్జున యుధ్ధం” చిత్రం లోని ఈ పాటే నాకు ఎక్కువ నచ్చుతుంది…
అలిగితే అందంగా ఉంటారని ఆడవారిని పొగిడే మగవారే కాదు, అలిగిన భర్తల అందాలను పొగిడే భార్యలు కూడా ఉన్నారండోయ్! అలిగిన భర్తను చిన్ని కృష్ణుడితో పోలుస్తూ, అతడి అందాలను మురిపెంతో భార్య పొగడుతూ ఉంటే.. పైకి బెట్టు చూపిస్తూ లోలోపల మురిసిపోతాడొక పతిదేవుడు. తల్లిలా, అనునయంగా స్తుతిస్తున్న ఆమె ప్రేమకు లొంగిపోక ఏమౌతాడు? గాఢమైన పరస్పరానురాగాలున్న ముచ్చటైన ఆ జంట క్రింది పాటలో…
పిఠాపురం నాగేశ్వరరావు, స్వర్ణలత పాడిన హాస్యభరితమైన యుగళగీతమొకటి “శాంతినివాసం” చిత్రంలో ఉంది. హాస్య నటులు రేలంగి, సురభి బాలసరస్వతి నటించారందులో. అలుక మానమని అతడు, అతడ్ని నమ్మనంటూ ఆ చిన్నదీ దాగుడుమూతలు ఆడుతూ పాడతారు.
ఈ సరదా పాటని క్రింద లింక్లో చూడండి..
“జల్సారాయుడు” సిన్మా లో పిఠాపురం నాగేశ్వరరావు, జిక్కీ పాడిన మరొక సరదా పాట ఉంది.
“అరెరెరె…తెచ్చితిని ప్రేమ కానుక
అలుక ఎందుకే? అది నీ కోసమే…
అమ్మగారు అలిగినా భలే వేడుక.. ” అని అబ్బాయి అంటే,
నీవెవరివో నేనెవరో… నీ మాయ మాటలు నేను నమ్మను.. అని అమ్మాయి అంటుంది. అమ్మాయిని నమ్మించాలనే తాపత్రయంతో అబ్బాయి, అతని మాటలన్నీ తోసిపుచ్చుతూ అమ్మాయి మాటలతో బాగానే షటిల్ ఆడుకుంటారు. ఆరుద్ర రచన ఎంత బాగుందో అనిపిస్తుంది పాట వింటుంటే..!
క్రింద లింక్ లో రెండవ పాట:
“కంటి కబురూ పంపలేను
ఇంటి గడప దాటలేను
అ దోర నవ్వు దాచకే
నా నేరమింక ఎంచకే..
అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింక.. అలక చాలింక! “
అంటున్న ఓ అమ్మాయి నిస్సహాయపు నివేదన విని మనసు ఆర్ద్రంగా మారిపోతుంది..!
జంధ్యాల తీసిన “శ్రీవారి శోభనం” చిత్రంలో ఎస్.జానకి పాడిన ఓ అపురూపమైన గీతం లోవీ వాక్యాలు. ఓ ముసలావిడగా, ఆమె మనవరాలుగా ఇద్దరి అనుకరణా తానే చేస్తూ ఎస్.జానకి పాడే ఈ పాట గాయనిగా ఆవిడ చేసిన ఓ గొప్ప ప్రయోగమే అనాలి! మేడ పైనున్న ప్రియుడిని ఉద్దేశిస్తూ మనవరాలు పాడితే, శీతాకాలపు చలికి వణుకుతూ ముసలావిడ కూడా తన గొంతు కలుపుతుంది. చిత్రకథ తెలీకపోయినా పాట చూస్తూంటే ఆ అమ్మాయి తెగువకూ, ధైర్యానికీ ఆశ్చర్యం కలిగి, మేడపైనున్నతడు అలక చాలించి ఆమె ప్రేమను స్వీకరిస్తే బాగుండునని కోరుకుంటాం మనం కూడా. తాను స్వరపరిచిన ఏ పాటతోనైనా మనకు అంతటి దగ్గరితనాన్ని ఇచ్చే మహత్తు రమేష్ నాయుడు బాణీలకు ఉంది మరి!
ప్రేమికుల అలకలు తీరాకా కూడా చెప్పుకునే ఊసులు కొన్నుంటాయి. ఏవో కథలు, గాధలూ, వలపులూ, మాధుర్యాలు అంటూ ఈ ప్రేమికులు పరవశులై ఏమని పాడుకుంటున్నారో క్రింద పాటలో విందామేం..
‘మానాన్న నిర్దోషి’ చిత్రం లో పాట ఇది..
“అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా”
(అలకలు తీరాయిగా! మరో నేపథ్యంతో మరోసారి మళ్ళీ కలుద్దాం…)

– తృష్ణ

raji

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ…

 13 - 1 (5)
రేపటిరోజున ప్రేమికులంతా కలసికట్టుగా జాతిమత ఖండాంతర బేధాలను మర్చిపోయి వేలంటైన్స్ డే జరుపుకుంటారు. నిరసనలూ, వ్యతిరేకోద్యమాల సంగతి ఎలా ఉన్నా; రేపే కాక ఈ నెలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రేమ పండగ జరుపుకుంటారు ప్రేమికులు. ఈ పండుగని వారంతా అత్యంత వైభవంగా జరుపుకోవడానికి టివీలు, ఎఫ్.ఎం లూ, గ్రీటింగ్ కార్డ్ షాపులూ, ఇంటర్నెట్ అన్నీ కూడా వాటి వంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తాయి. అందుకని ఇవాళ మనం కూడా కొన్ని ‘ప్రేమభరితమైన యుగళగీతాలను’ వినేసి ప్రేమా జిందాబాద్ అనేద్దాం! ఈ సిరీస్ ముఖ్యంగా పాత పాటల మీద కాబట్టి, ప్రేమ గురించి ఆనాటి సినీకవుల భావాలెలా ఉన్నాయో వినేద్దామా.. 
 
 
ఒకప్పుడు పాటల్లో ప్రేయసీప్రియులు ”నువ్వూ నేనూ ఒకటి’,”నీ కోసం నేను’,”నాలోకమే నీవు’ అనేవారు. ప్రేయసి నవ్వులను మెరుపులతో, ప్రేయసిని పువ్వులతో పోల్చేవారు ఆనాటి కవులు.  కాలమేదైనా ప్రేమభావన ఒక్కటే కాబట్టి అది అలానే ఉన్నా, మనుషుల మనసుల భావాల్లోనే తేడా కనబడుతోంది. ఆ భావానుగుణంగా పాటల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. కొత్తతరం ప్రేమపాటల్లోని ఉపమానాలు చెప్పే సాహసం చెయ్యను కానీ పాత పాటల్లోని మధురిమల్ని గుర్తు చేసే ప్రయత్నం మాత్రం చేస్తాను. 
 
 
“ఓదార్పు కన్న చల్లనిది… నిట్టూర్పు కన్న వెచ్చనిది… గగనాల కన్న మౌనమిది..” అని ప్రేమ గుణాలను వర్ణిస్తూ “పూలెన్ని రాలిపోతున్నా పులకించు ఆత్మగంధమిది..” అని ముక్తాయించారొక పాటలో వేటూరి. అంతటి ఉదాత్తమైన ప్రేమ భావన తమ హృదయాలలో జనించగానే కలిగే పులకింతలూ, గిలిగింతలు, గుండెల్లో గుబులు గురించి తెలియజేసే యుగళగీతాన్నొకదాన్ని విందాం ముందుగా…
 
ఏమో ఏమో ఇది.. నాకేమో ఏమో అయినది..
(చిత్రం: అగ్గిపిడుగు, రాజన్ నాగేంద్ర, నారాయణరెడ్డి)
 
 
అలా పులకరింతల్లో తేలిపోయాకా ప్రేయసి ప్రియులిద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరి నిలిచిపోవాలని తహతహలాడతారు.. కలలుకంటారు. “వాగ్దానం” చిత్రంలోని “నా కంటిపాపలో నిలిచిపోరా.. నీ వెంట లోకాలు గెలువనీరా..” అనే కథానాయిక కల పాట ఆ కోరికలేమిటో తెలుపుతుంది..
 
 
 
ప్రేమకి పునాది చెలిమి ఐతే, ఆ చెలిమి బలిమిగా మారి ఇద్దరు యువతీయువకుల మనసుల్లో మధురమైన రాగాలను పలికిస్తుంది.  ఆ రాగాలు పలికించే ఆలాపనేమిటో,  అది ఆ రెండు జీవితాలనూ శృతి చేసే ఆరాధనగా మారితే గుండెల్లో వినబడే మధురగీతమేమిటో తెలుసుకోవాలంటే “మౌనగీతం” చిత్రంలోని ఈ పాట వినాల్సిందే! డబ్బింగ్ సినిమాల్లో కూడా తెలుగుతనం పోని విధంగా సాహిత్యాన్నందుకున్న పాటల కాలమది.
 
“చెలిమిలో వలపు రాగం.. వలపులో మధురభావం
రాగం భావం కలిసే ప్రణయగీతం పాడుకో…”
 
 
“మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది?
తోటలో ఏముంది నా మాటలో ఏముంది?
ఏటిలో ఏముంది నా పాటలో ఏముంది?”
అంటూ ప్రశ్నలు వేస్తూ వేస్తూ.. కథానాయకుడితో “నేనులో నీవుంది నీవులో నేనుంది..” అనిపించగలిగిన గడసరి ‘లక్షాధికారి’ చిత్రంలో కథానాయకురాలు. ఇటువంటి పాటే మనకు ‘ఆకలిరాజ్యం’ చిత్రంలో కనబడుతుంది.  ఆ పాటలో కూడా ప్రియుడితో చివరకు “నేను నీవనీ..అన్నా.. మనమే కాదా..” అనిపిస్తుందా కథానాయిక. రెండూ పాటల్నీ కూడా మోస్ట్ రొమాంటిక్ డ్యూయెట్స్ అనవచ్చు!
 
ఇప్పటి సినీనాయికలు చనువు గా ‘నచ్చావురా…’, ‘ఒరేయ్..’, ‘ఏరా..;, ‘వాడు’…అని సంబోధిస్తూ పాడేస్తున్నారు కానీ పాపం పాత పాటల్లో నాయికలు ప్రియుడిని ‘స్వామీ’ అంటూ ఎంతో గౌరవాన్ని కూడా ఇచ్చేవారు. “గులేబకావళి కథ” చిత్రంలో “నన్ను దోచుకొందువటే ..” పాటలో నాయకుడు “ఎంతటి నెరజాణవో నా అంతరంగమందు నీవు… కలకాలం వీడని సంకెలలు వేసినావు” అని చనువిచ్చినా, నాయిక మాత్రం “కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ.. నిన్నే నా స్వామీ” అంటూ అతనిపై తనకున్న ప్రేమతో పాటూ తన గౌరవాన్ని కూడా తెలుపుతుంది .
ప్రేమికులకు ఒకరిపై ఒకరికి అనురాగం తో పాటూ నమ్మకం కూడా పుష్కలంగానే ఉంటుంది. అలాంటి గట్టి నమ్మకంతోనే ఓ చెలి “నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే… పూవులేక తావి నిలువలేదులే.. ” అని పాడుతుంది. ఆ అబ్బాయి మాత్రం తక్కువ తిన్నాడా.. ఏ మాత్రం తొణక్కుండా “తావి లేని పూవు విలువ లేనిదే… ఇది నిజములే..  నేను లేని నీవు లేనెలేవులే…” అంటాడు! పరస్పరాభిమానాలూ, ఇరు వైపులా ఒకరిపై ఒకరికి ఇలాంటి ఎనలేని నమ్మకముంటేనే ఏ బంధమైనా కలకాలం నిలుస్తుంది.
రెండు మనసులు ఒకటైయ్యాకా ఇక ఒకరికొకరు ఇచ్చుకునేందుకు ప్రత్యేకమైన బహుమతులేముంటాయి? 
“ఏమివ్వను నీకేమివ్వను 
నా మనసే నీదైతే ఏమివ్వను..” 
అని అమ్మాయి అంటే,
“ఏమడుగను ఇంకే మడుగను 
నీ మనసే నాదైతే ఏమడుగనూ?” అంటాడు అబ్బాయి.
ఇలా ఒకరైపోయాకా ఒకరిలో ఒకరు కలిసి కరిగిపోవడం తప్ప ఇచ్చిపుచ్చుకునేందుకేం మిగులుతాయి..?!
ఈ పాటలో “నిన్నే వలచి నీ మేలు తలచి 
బ్రతుకే నీవై పరవశించు చెలినీ..నీ జాబిలినీ..” అనే వాక్యాలు నాకు భలే నచ్చుతాయి.
ప్రేమగీతాలనగానే తప్పనిసరిగా చెప్పుకోవాల్సిన పాట పూజ చిత్రంలోని ఈ గీతం…! వాణిజయరాం స్వరం ఈ పాటలోని మరో ప్రత్యేకత.

ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ…
ప్రేమకథా చిత్రాలు తీయడంలో ప్రత్యేక ఒరవడిని సృష్టించిన జంధ్యాల తన సినిమాలన్నింటిలో సంగీతానికి పెద్ద పీట వేసారనే చెప్పాలి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆయన చిత్రాల్లోని పాటలు ఉదహరించాలంటే పెద్ద వ్యాసం రాయాలి.  శ్రీవారికి ప్రేమలేఖ లో “లిపి లేని కంటి బాస.. తెలిపింది చిలిపి ఆశ/ నీ కన్నుల కాటుక లేఖలలో నీ సొగసుల కవితల లేఖలలో”
బాబాయ్ అబ్బాయ్ లో “తెలుసా…నీకు తెలుసా”.., మల్లె పందిరిలో “కదిలే కోరికవో”, చిన్నికృష్ణుడు లో “మౌనమే ప్రియా ధ్యానమై” ఇలా చెప్పుకుపోతే జాబితాకు అంతులేదు. 
 
రెండుపాటల్ని మాత్రం ఈ వ్యాసంలో తప్పక చెప్పాల్సినవి ఉన్నాయి. ఒకటి ముద్దమందారం చిత్రంలో “అలివేణీ ఆణిముత్యమా..” ! బాలు, జానకీ కూడా అద్భుతంగా పాడాలని పోటీలు పడి పాడారేమో అనిపించేలా ఉంటుందీ పాట. గుసగుసలాడుతున్నట్లుగా ఉండే జానకి స్వరం సన్నివేశానికీ, నాయికకూ అతికినట్లుగా ఎంత బాగా నప్పేసిందో వర్ణించలేము. రమేష్ నాయుడు సంగీతం కూడా మిన్నే!
ఇంకా..ఈ పాటలో “ఆవిరి చిగురో..ఇది ఊపిరి కబురో…” అని వేటూరి మాత్రమే రాయగలిగిన సాహిత్యం ఈ గీతాన్నొక పొగడపూల మాలగానే తయారు చేసేసాయి..
 
 
జంధ్యాల చిత్ర గీతాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో ప్రేమ గీతం నాలుగు స్థంభాలాటలోని “చినుకులా రాలి…”! ఈ ట్యూన్ ఒక కన్నడ బాణీకి రీమేక్ అంటారు. హిందీలో “ఐసీ దీవాన్గీ..దేఖీ నహీ కహీ..” అనే షారుఖ్ ఖాన్ పాటకు ఈ పాట పల్లవి ట్యూన్ వాడుకున్నారు. 
 
“చినుకులా రాలి.. నదులుగా సాగి/ వరదలైపోయి, కడలిగా పొంగు.. 
నీ ప్రేమ, నా ప్రేమ / నీపేరే నా ప్రేమ..”

“హిమములా రాలి.. సుమములై పూసి
ఋతువులై నవ్వి.. మధువులై పొంగు.. నీప్రేమ నా ప్రేమ..”
 
“మౌనమై మెరిసి /గానమై పిలిచి /కలలతో అలసి /గగనమై ఎగసి../ నీ ప్రేమ, నా ప్రేమ..”
 
అసలు ఈ పాటలో  ఏ వాక్యాలు కోట్ చెయాలో తెలీదు. అంత అందమైన సాహిత్యాన్నందించారు వేటూరి. ప్రేమగీతాల గురించి చెప్పుకునేప్పుడు తప్పనిసరిగా గుర్తుచేసుకోవల్సిన గీతమిది! 
 
 
 
“నీ కళ్ళలో తొంగి చూడనిదే నిదురేది ఆరేయి నా కళ్లకు
నీ పాట మనసారా పాడనిదే నిలకడ ఏదీ నా మనసుకూ..
ఊపిరిలో ఊపిరిలా.. ఒదిగేదే మన ప్రేమా..
కలనైనా.. క్షణమైనా.. మాయనిదే మన ప్రేమ… మన ప్రేమ”
 
ఇది కదూ ప్రేమభరితమైన తీయని యుగళగీతం…
 
“రాధా కల్యాణం” చిత్రంలోని ఈ మధురమైన గీతాన్ని వినపించకుండా ఈ వ్యాసం పూర్తవ్వగలదా…! కె.వి.మహాదేవన్ సంగీతం.. పాట మధ్యలో వచ్చే వయోలిన్ బిట్స్ పాటకు ప్రాణం పోస్తాయి. వినేయండి మరి..
 
 
 
(మరో నేపథ్యంతో మళ్ళీ కలుద్దాం మరి…)
raji– తృష్ణ

భలే భలే అందాలు సృష్టించావు…..

 
“A thing of beauty is a joy for ever: 
Its lovliness increases; it will never 
Pass into nothingness; but still will keep 
A bower quiet for us, and a sleep 
Full of sweet dreams, and health, and quiet breathing.. “
అన్నాడు “కీట్స్” మహాశయుడు “Endymion” అనే మహాకావ్యంలో! 
ఈ వాక్యాల్లోంచే “అందమే ఆనందం ఆనందమే జీవితమకరందం”  అనే పల్లవి వచ్చి ఉంటుందని నా ఊహ. 
 
అదే కీట్స్ “Ode on a Grecian Urn” అనే కవితలో
“Beauty is truth, truth beauty,” that is all
Ye know on earth, and all ye need to know..”
అని కూడా అన్నాడు. అయితే ఈ వాక్యాలను గురించి విమర్శకుల మధ్య చాలా చర్చ జరిగింది. 
ఆ చర్చ సంగతి వదిలేస్తే, అసలు అందాన్ని చూసి ఆనందించనివారెవ్వరు? ప్రపంచంలో, ప్రకృతిలోనూ, మనుషుల్లో, మనసుల్లో, మమతల్లో ఎక్కడైనా సరే అందాన్ని భౌతికంగానో అంతర్గతంగానో చూసినప్పుడు తెలియని ఆనందంతో మనసు నిండిపోతుంది. ఎవరి హృదయానికి ఎటువంటి ఆనందం(భౌతికమైనదా, అంతర్గతమైనదా అన్నది) కావాలన్నది వారి వారి మనస్తత్వాలను బట్టి ఉంటుంది. 
 
 
మనిషి కోరిక ఎటువంటిదైనా దానికి చిట్టచివరి కొన ఆనందమే కదా! ఆ ఆనందం “అందం ద్వారా కూడా మనిషికి చేరువవగలదు. అందమైన పరిసరాలను చూసి ప్రకృతారాధకులు ఆనందపడితే, ప్రేయసీప్రియులు తమతమ ప్రియతముల అందచందాలను చూసి ముచ్చటపడతారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల ముద్దులొలికే సుందరాకారానికి ముగ్ధులైతే, భక్తులు తమ ఇష్టదైవాల సౌందర్యాకృతులకూ, గుణగణాలకూ దాసోహమంటారు.
 
మరి ఆ అందాన్ని గురించి మన సినీకవులెటువంటి వర్ణనలు చేసారో వినేద్దామా…
 
 
1) అందం పై సినీగీతాలనగానే పైన చెప్పుకున్న బ్రతుకుతెరువు చిత్రం లోని “అందమే ఆనందం..” పాటే గుర్తుకు వస్తుంది. ఈ పాట పల్లవి ఒక ఆంగ్ల పద్యాన్ని గుర్తుకు తెస్తే, చివరి వాక్యం “all the world’s a stage” అని షేక్స్పియర్ రాసిన వాక్యాలను గుర్తుకుతెస్తుంది. వీటి సంగతి ఎలా ఉన్నా పాట ఆద్యంతం మధురమైన సాహిత్యాన్ని అందించారు సముద్రాల రామానుజాచార్యులు. ఇదే పల్లవితో కొద్దిపాటి సాహిత్యపు మార్పులతో పి.లీల పాడిన పాట కూడా వినసొంపుగా ఉంటుంది. ఘంటసాల ,పి.లీల పాడిన ఈ రెండు గీతాలను క్రింద లింక్ లో పక్కపక్కనే వినవచ్చు: 
 
 
2) “భలే భలే అందాలు సృష్టించావు.. ఇలా మురిపించావు ” అంటూ అందమైన ప్రపంచాన్ని, ప్రకృతినీ సృష్టించిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూ, మానవతావిలువలను మరచిపోయి మృగంలా మారిపోతున్న మానవుణ్ణి మార్చమని కోరుకుంటాడు గాయకుడు ఈ పాటలో. ప్రకృతి నుండీ, పశుపక్ష్యాదుల నుండి మానవుడు నేర్చుకోవాల్సిన నీతిని గురించి తెలిపే ఈ పాట భక్త తుకారాం చిత్రం లోనిది.
 
 
3) ” అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు..” 
అంటూ సాగే ఈ పాటలో శ్రీరాముడి మనోహరమైన రూపవర్ణన చేస్తూ, ఏ గుణగణాల వలన  ఆయన దేవుడయ్యాడో, రాముడు ఎందువలన ఉత్తమ పురుషుడుగా నిలిచాడో తెలుపుతుంది గాయని. “ఇన్సాఫ్ కీ డగర్ పే బచ్చోం దిఖావో చల్ కే” అనే హిందీ పాట లోని ఇంటర్ల్యూడ్(బి.జి.ఎం)లో వచ్చే వాద్యసంగీతం ఈ పాటలో చరణాంతర కోరస్ గా రూపుదిద్దుకుంది. “ఉయ్యాల జంపాల” చిత్రంలోని ఈ పాట
 
 
 
4) ” అందాల పసిపాపా.. అన్నయ్యకు కనుపాప
బజ్జోవే బుజ్జాయీ నేనున్నది నీ కొరకే
నీకన్నా నాకెవరే.. ”  అంటూ చెల్లెలికి జడ వేసి, ఆటలాడుతూ, ఆమె ఉన్నతిని కోరుతూ జోలపాడతాడొక అన్నయ్య. ఇలాంటి అన్నయ్య ఉంటే ఇంకేం కావాలి అనిపిస్తుందీ పాట చూస్తే. ముద్దులొలికే ఆ ఒంటరి పసి పిల్లలను చూస్తే జాలి కూడా కలుగుతుంది. అన్నాచెల్లెళ్ల అందమైన అనుబంధానికి ప్రతీకనిపించే ఈ ముచ్చటైన గీతం “చిట్టిచెల్లెలు” చిత్రం లోది. 
 
 
5) ” అందంలో పందెమేస్తా అందర్నీ ఓడిస్తా ” అంటూ భానుమతి గారి స్వరం ఖంగుమంటూ సవాలు విసురుతుంది. ” అబలంటే మోజులా?”  అని నిలదీస్తూ తన దగ్గర ఆకతాయిల ఆటలేవీ సాగవని హెచ్చరిస్తుంది గాయని ఈ పాటలో. “ఆలీబాబా 40 దొంగలు” చిత్రంలోని ఈ పాటకు సుసర్ల దక్షిణామూర్తి సంగీతం సమకూర్చారు.
క్రింద లింక్ లోని వరుసలో మొదటి పాట:
 
 
 
6) తమ ప్రేమకు ఎదురైన అడ్డుతెరలు తొలగి ఒకటవబోతున్నామన్న ఆనందంతో  “అందాలు తొంగిచూసే..హా… ఆనందం ఈల వేసే..రా..”  అంటూ రెండు ప్రేమ జంటలు ఆనందంతో ముచ్చటగా పాడుకుంటాయి. చూస్తున్నంతసేపు నవ్వుల పువ్వులు పూయించే హాస్యరస ప్రధానమైన “ప్రేమించి చూడు” చిత్రంలోని పాట ఇది.

 
 
7) “నీలో విరిసిన అందాలన్నీ నాలో వీడని బంధాలాయే ” అంటూ అమ్మడి అందాలకు తానెలా వశమైపోయాడో తెలుపుతాడో ప్రియుడు. 
“నీలో పలికిన రాగాలన్నీ నాలో శ్రావణమేఘాలాయే” అంటూ తన ఆనందాతిశయాలను తెలియచేస్తుందాతని ప్రియురాలు. 
 “ఆ కోరికలే ఇద్దరిలోనా కార్తీకపూర్ణిమలై వెలగాలి..”  అంటూ తమ బంధం ఏడేడు జన్మల బంధమై నిలవాలని తహతహలాడతారిద్దరూ!
“మనుషులు మట్టిబొమ్మలు” చిత్రంలోని ఈ చక్కని పాట క్రింద లింక్ లో వినేయండి..
 
 
8) “అందాల బొమ్మతో ఆటాడవా
పసందైన ఈ రేయి నీదోయి స్వామి” అంటూ తన జావళీతో కవ్విస్తుందో నాయిక.
 
“చల్లగాలితో కబురంపితిని చందమామలో వెదకితినోయి
తార తారను అడిగితినోయీ” అంటూ ప్రియుని కోసం ఎంతగా ఎదురుచూసిందో, ఎంతగా వెతుకులాడిందో తెలుపుతూ సాగే ఈ జావళీ ” అమరశిల్పిజక్కన్న” చిత్రం లోది. చంపకు చారడేసి కన్నులతో బి.సరోజాదేవి ప్రేక్షకులను గారడీ చేస్తుంది.
 
 

9) ప్రియుడి రూపలావణ్యాలు చందమామ కన్నా మిన్నవంటూ అతగాడిని పొగడ్తలతో ముంచెత్తుతూ మురిసిపోతుందో అందమైన ఇంతి. ఇంటి గుమ్మంలో నిలబడి “అందచందాల సొగసరివాడు విందు భోంచేయవస్తాడు నేడు ” అంటూ భోజనానికి పిలిచిన ప్రియుడి కోసం ఎదురుచూస్తూ గానం చేస్తుంది.
మెచ్చవలసింది పాటలోని సాహిత్యాన్నో, అందాల చందమామనో, తెరపై కనబడే అమ్మడినో, ఆమె మెచ్చే ప్రియుడినో తేల్చుకోలేకపోతాం మనం.
అంత చక్కని ఈ పాట “దొంగరాముడు” సినిమా లోది.
 
 

10) సినిమాకథా అదీ తెలీకపోయినా చిన్నప్పుడు రేడియోలో వినేప్పటి నుండీ ఈ పాట బాగా నచ్చుతుంది నాకు. ఎం.ఎస్ .విశ్వనాథన్ అందించిన సంగీతం, ఎస్.జానకి గళం రెండూ వేటికవే అన్నట్లుంటాయి. ఆత్రేయ రచన గురించి చెప్పేదేముంది..
 
“అందమైన లోకమని రంగురంగులుంటాయని 
అందరూ అంటూంటారు రామ రామ
అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా..
చెల్లెమ్మా..అందమైంది కానే కాదు” అంటూ లోకం పోకడని ఎంతో సమమైన ఉపమానాలతో తెలియపరుస్తుంది గాయని.
 
“ఆశలకు అంతముందా “
 
“గడ్డిమేసి ఆవు పాలిస్తుంది పాలుతాగి మనిషి విషమౌతాడు
అది గడ్డి గొప్పతనమా? ఇది పాల దోషగుణమా?”

“లోకమంతా ఇదే తీరు పిచ్చమ్మా..”
 
“డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా పేదవాడు నాడే పుట్టాడమ్మా
ఆ ఉన్నవాడు తినడు ఈ పేదని తిననివ్వడు
కళ్ళు లేని భాగ్యశాలి నువ్వమ్మా
ఈ లోకం కుళ్ళు నువ్వు చూడలేవు..”
 
మొదలైన వాక్యాల్లో లోకంలోని కల్మషాలన్నింటినీ క్లుప్తంగా కళ్లముందు ఉంచుతారు ఆత్రేయ..!
“తొలి కోడి కూసింది” చిత్రం లోని పాటని క్రింద లింక్ లో వినవచ్చు..

  ***
 
 
“అందం” పై మరి కొన్ని సినీ గీతాలు:
 
 
“అందమైనతీగెకు పందిరుంటే చాలును 
పైకి పైకి పాకుతుంది చినదానా
పరవశించి సాగుతుంది చినదానా”
(భార్యాబిడ్డలు)
 
 
 
“ఆనందతాండవమే ఆడెనుగా ఆ శివుడు అనాదిగా
అదే నేను చేస్తున్నా ఏడవకండి..”
అందమైన అనుభవం..
 
 
 
“అందమైన అనుభవం..” ( title song) ఒఠ్ఠి స్వరం + ఈ మాటలతో చిత్రంగా ఉంటుందీ పాట..

 
 
“అందములు విందులయే అవని ఇదేగా
కమలాసనుని కోటిశిల్ప కూటమిదేగా
ఎందును లేని తీయందనాలు చిందులు వేసేనుగా”
(భూకైలాస్)
 
 
“అందమంటే నువ్వే
ఆనందమంటే నువ్వే
నువ్వంటే నువ్వే
నీవంటిది నువ్వే నువ్వే “
(ఇల్లాలు)
 
 
ప్రతి అందం జంట కోసం పలవరించిపోతుంది 
(ఊర్వశి)
 
 
 
“అందమంతా నాదే చందమంతా నాదే 
ఇంక సుందరాంగులందు రాణి నేనే గదే”
(పెద్దరికాలు)
(8th song in the link)
 
 
“అందాల ఆనందం ఇందేనయ్యా
అందం చూడవయ్యా ఆనందించవయ్యా”
(దేవదాసు) 

 
“అందానికి అందం నేనే జీవన మకరందం నేనే
తీవెకు పూవుని నేనే పూవుకి తావిని నేనే”
 (చివరికి మిగిలేది)
 
 
 
“అందం ఉరికింది వయసుతో పందెం వేసింది
మనసులో బందీ అయ్యింది ఇదే మీ బంధం అంటోంది”
(బంగారు సంకెళ్ళు)
 
 
“ఆహా అందము చిందే హృదయకమలం అందుకునే రాజొకడే”
(ఆడబ్రతుకు)
 
“అందమైన జీవితము అద్దాల సౌధము
చిన్న తప్పు చేసినా ముక్కలై మిగులును”
(విచిత్ర బంధం)
 
 
“అందమైన లోకముంది అనుభవించు కాలముంది.. “
(అందమైన అనుభవం)
 
 
మళ్ళీసారి మరో నేపథ్యంతో కలుద్దాం…
 

rajiతృష్ణ

సిరిమల్లె పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వూ…

on smileనవ్వు!

దేవుడు మనిషికి ప్రసాదించిన అందమైన వరం.. నవ్వు! నవ్వే జంతువొకటేదో ఉందని అంటూంటారు కానీ అసలు ‘గొడ్డుకీ మడిసికీ’ తేడాను తెలిపేది నవ్వే కదా.  చక్కగా పలువరస కనబడేలా, మనసులో ఆనందమంతా నవ్వులో కనబడేలా హాయిగా నవ్వుతున్న మనిషిని చూస్తే ఎంత చిరాకులో ఉన్నా అప్రయత్నంగా మనమూ ఓ చిరునవ్వు నవ్వమూ?! మనసారా హాయిగా నవ్వుకోగలిగిన మనిషిని ఏ చింతలూ కలవరపరచలేవు. నాకైతే నవ్వు లేని మొహం విచ్చుకోని మొగ్గలా అసంపూర్ణంగా అనిపిస్తుంది.

జీవితంలో ఎన్ని చికాకులూ, సమస్యలూ ఉన్నా కొందరి మొహం మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. అలాంటివారిని చూస్తే మన చికాకులు కూడా మర్చిపోతాం. మరికొందరుంటారు.. వీళ్లకు అసలు నవ్వడం రాదా అని సందేహం కలిగేట్లు, ఎప్పుడూ కనుబొమలు చిట్లించుకుని చికాకు పడుతునే ఉంటారు. వాళ్ల ముడిపడ్డ కనుబొమలు విడదీసి దగ్గరకు రాకుండా సెలోటేప్ వేసి దూరంగా అతికించేయాలనిపిస్తుంది అలా చిరాకుపడేవాళ్లను చూస్తే!  అసలు ఓ మనిషి తత్వాన్ని వాళ్ల నవ్వుతో అంచనా వేసేయచ్చు.

ఇక ఈ నవ్వులో ఎన్ని రకాలో..! పలకరింపు నవ్వు, మొహమాటం నవ్వు, ఆశ్చర్యపు నవ్వు, చమత్కారపు నవ్వు, విచారపు నవ్వు, వెటకారం నవ్వు, కళ్లలో ప్రేమ నిండిన నవ్వు, పొట్ట చెక్కలయ్యే నవ్వు… ఇలా మాటలు అవసరం లేకుండా ఒక్క నవ్వుతోనే మనసులోని భావమంతా గుమ్మరించేయచ్చు. అమాయకమైన పసిపాప బోసి నవ్వులు ప్రశాంతతని, హాయినీ ఇస్తే, అందమైన అమ్మాయి నవ్వులు ఆనందాన్ని ఇస్తాయి. మరి ఇంత చక్కని ఆహ్లాదకరమైన “నవ్వు” గురించి మన సినీ కవులు ఏమన్నారో వినేద్దామా…

1) “సిరిమల్లె పువ్వల్లే నవ్వు చిన్నారి పాపల్లే నవ్వూ..
చిరకాలముండాలి నీ నవ్వు..
చిగురిస్తు ఉండాలి నా నవ్వు.. నా నవ్వు…”
అంటూ ప్రియురాలి నవ్వు  తనను పలువిధాలుగా ఎలా ప్రభావితం చేసిందో చెప్పే పాట ఇది..
నటీనటుల కన్నా జానకి నవ్వులే ఈ పాటకు ప్రత్యేకమైన అందం.

(జ్యోతి)

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5307

2) “ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వు
జాజిమల్లెపువ్వు బజ్జోమ్మ నువ్వు”
అంటూ సాగే ఈ జోలపాటలో జోలతో పాటూ నాయకుడి ఒంటరితనపు ఛాయలు కూడా వినిపిస్తారు పి.బి…

( సత్తెకాలపు సత్తెయ్య)

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6505

3) “ఖుషీ ఖూషీగా నవ్వుతూ
చలాకి మాటలు రువ్వుతూ
హుషారు గొలిపేవెందుకే
నిషా కనుల దానా”
అని అబ్బాయి అంటే,

“ఖుషీ ఖూషీగా నవ్వుతూ
చలాకి మాటలు రువ్వుతూ
హుషారుగా ఉందాములే
నిషా కనులవాడా”
అంటుంది అమ్మాయి..! వీళ్ల కథేమిటో విందామా…

(ఇద్దరు మిత్రులు)

4) “మనసు తీరా నవ్వులె నవ్వులె నవ్వులె నవ్వాలి
మనము రోజూ పండుగె పండుగె పండుగె చెయ్యాలి ”
అంటూ సాగే ఈ పాట సరదాగా జీవితాన్ని గడపమనే సందేశాన్ని ఇస్తుంది..
ఈ గీతానికి “నెవెర్ ఆనె ఎ సండే<

అనే పాపులర్ ఆంగ్ల గీతం ప్రేరణ. దీని అసలు మాతృక ఒక గ్రీక్ సాంగ్ ను ఇక్కడ <

వినవచ్చు.

అసలు పాట క్రింద లింక్ లో..

(గూఢచారి 116)

5) “పువ్వులా నవ్వితే
మువ్వలా మోగితే
గువ్వలా ఒదిగితే
రవ్వలా పొదిగితే
నిన్ను నేను నవ్విస్తే
నన్ను నువ్వు కవ్విస్తే
అదే ప్రేమంటే…అదే అదే…” అని సాగే ఈ సరదా పాటని వినేద్దాం…

(ప్రేమబంధం)
http://www.raaga.com/player4/?id=193973&mode=100&rand=0.2858572390396148

6) “నవ్వవే నా చెలీ..నవ్వవే నా చెలీ..
చల్లగాలి పిలిచేను.. మల్లెపూలు నవ్వేను..
వలపులు పొంగే వెళల్లో..”
అని ప్రియురాలిని నవ్వమని, లోకమేమన్నా ఆమెకు తాను తోడున్నాని ధైర్యం చెప్తూ ఓ ప్రియుడు పాడే పాట ఇది..

( అంతా మన మంచికే)

7) “మిసమిసలాడే చినదానా
ముసిముసినవ్వుల నెరజాణా
సిగ్గులు చిలికి సింగారమొలికి చేరగ రావేమే
నా చెంతకు రావేమే”
అని ఓ ప్రేమజంట పాడుకునే పాట ఇది..

(పూలరంగడు)
http://www.song.cineradham.com/player/player.php?song[]=2330

శ్రీ తిరుపతమ్మ కథ చిత్రంలో ఓ చిత్రమైన పాట ఉంది.

8) “ఈ చిరునవ్వులలో .. పూచిన పువ్వులలో
ఓ చెలియా నా వలపే విరిసినదే” అని చెలికాడు అంటే
“నవ్వులు వీడునులే.. పువ్వులు వాడునులే
నీ వలపే నా మదిలో నిలుచునులే..” అంటుంది నాయిక
వాద ప్రతివాదాల్లా ఉంటుందీ పాట..

http://www.mediafire.com/listen/k4c5wcktxcse5dn/Sri+Tirupatamma+Katha+-+Ee+chiru+navvulalo.mp3

9) “చిరునవ్వుల చినవాడే
పరువంలో ఉన్నాడే
నా మనసే దోచాడే
ఏమేమో చేసాడే..”
అనే సాగే ఈ పాటలో ఓ ప్రియురాలు తన మనసుని ప్రియుడు దోచుకున్న వైనాన్ని తెలుపుతుంది..
(పవిత్రహృదయాలు)

10) “కిలకిల నవ్వులు చిలికిన
పలుకును నాలో బంగారు వీణ”
అంటూ చెలి సోయగాలు తనలో ఏలాటి కోరికలు రగిలించాయో వర్ణిస్తాడు నాయకుడు.
(చదువుకున్న అమ్మాయిలు)

11)  “ఈ ముసి ముసి నవ్వుల విరిసిన పువ్వులు గుసగుసలాడినవి ఏమిటో ..” అంటూ మరో ప్రేమజంట పాడుకునే గీతాన్ని విందామా..

(ఇద్దరు మిత్రులు)

12) “నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా
నీ సరి ఎవరమ్మా..”
అంటూ ప్రేయసిని నవ్వులపువ్వుతో పోలుస్తాడీ ప్రియుడు. పాట చాలా బాగుంటుంది కానీ నవ్వు గురించిన వర్ణన ఎక్కువ ఉండదీ పాటలో…

(అందమైన అనుభవం)

“నవ్వు” పై రాసిన మరికొన్ని సినీగీతలు:

* “నవ్వు నవ్వించు ఆ నవ్వులు పండించు”
(లక్ష్మీనివాసం)

* “చిన్నారి నవ్వులే సిరిమల్లె పువ్వులు
అల్లారుముద్దులే కోటి వరాలు”
(పవిత్రబంధం)

* “బుజ్జి బుజ్జిపాపాయి బుల్లి బుల్లి పాపాయి
నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెన్నెలలోయీ..”
(ఆడబ్రతుకు)

* “నవ్వే ఓ చిలకమ్మ
నీ నవ్వులు ఏలమ్మా
ఆ నటనలు చూడమ్మా
ఏ జవరాలినుడికించకమ్మా ”
( అన్నదమ్ములు)

* “నవ్వని పువ్వే నవ్వింది
తన తుమ్మెద రాజుని రమ్మంది..”
(చదరంగం)

* “కిలకిల నగవుల నవమోహినీ ప్రియ కామినీ”
ఘంటసాల భాగేశ్వరి రాగం లో పాడిన ఈ గీతం “వసంతసేన” చిత్రంలోది.

* “నవ్వరా నువ్వైనా నవ్వరా
ఆ నవ్వే నిను పెంచు పాలబువ్వరా బాబూ..”
(అబ్బాయిగారు అమ్మాయిగారు)

* “నవ్వు నవ్వు నవ్వు నవ్వు
నవ్వే బ్రతుకున వరము”
(ఆకాశరామన్న)

ఇవండీ.. నవ్వులపువ్వులు పూయించే కమ్మని ఆపాత మధురాలు! మళ్ళీసారి మరొక నేపథ్యంతో కలుసుకుందామేం…

raji–తృష్ణ

పగలే వెన్నెల జగమే ఊయల…

Full-moon

శరదృతువు కదా చీకట్లు ముసరగానే చల్లని తెల్లని వెన్నెల పరుచుకుంటోంది. బాల్కనీలోంచి, కిటికీ గ్రిల్ లోంచి కురుస్తున్న వెన్నెలకాంతి మనసుని కూడా నింపేస్తోంది. నిశీధివేళ బస్సులో వెళ్తూంటే నా సీటు పక్కనున్న కిటికీలోంచి తొంగి చూస్తూ నాతో పాటే ప్రయాణిస్తూ వచ్చేస్తోంది చంద్రకాంతి. మామూలురోజుల్లో వెన్నెలకీ ఈ శరత్కాలపు వెన్నెలకీ ఎంత తేడానో! ఇంత వెలుగు ఎక్కడ్నుండి తెస్తాడో చంద్రుడు తెలీదు కానీ చూసేకొద్దీ చూడాలనిపించేలా మనోల్లాసాన్ని పెంచి, తన కౌముదిలో మనల్ని ముంచిపోతాడు. ఊ..ఊ.. తెలిసిపోయిందా ఈనాటి గీతనేపథ్యం ఏమిటో… అవును.. అదే… తెల్లని చల్లని “వెన్నెల”!

“కార్తీకమాసపు రాత్రివేళ
కావాలనే మేలుకున్నాను
చల్లని తెల్లని వెన్నెల
అంతటా పడుతోంది
మెత్తని పుత్తడి వెన్నెల
భూమి ఒంటిని హత్తుకుంది…”
అంటారు తిలక్ మహాశయులు తన ‘వెన్నెల’ కవితలో!
కవిత మధ్యలో వెన్నెల ఎలా ఉందో వర్ణిస్తూ ఎన్ని ఉపమానాలు చెప్తారో…

“చలి చలిగా సరదాగా ఉంది వెన్నెల
చెలి తొలిరాత్రి సిగ్గులా ఉంది
విరిసిన చేమంతిపువ్వులా ఉంది
పడకగదిలో వెలిగించిన
అగరొత్తుల వాసనలా ఉంది
పడగిప్పిన పాములు తిరిగే
పండిన మొగలి వనంలాగుంది
పన్నీరు జల్లినట్టు ఉంది
విరహిణి కన్నీరులా ఉంది
విరజాజుల తావితో కలిసి
గమ్మత్తుగా ఉంది
విచిత్రమైన మోహమణి
కవాటాలను తెరుస్తోంది
యౌవన వనంలోని కేళీ సరస్సులా ఉంది
దవుదవ్వుల పడుచు పిల్లలు
పకపక నవ్వినట్టుంది
దాపరికంలేని కొండజాతి
నాతి వలపులాగుంది…”
(తిలక్ గళంలో ఈ కవిత ‘ఇక్కడ’ వినవచ్చు)

ఇన్ని ఉపమానాలు చెప్పేసాకా, ఇంకా వెన్నెల అందాలను వర్ణించటానికి ఎవరికైనా పదాలూ, అక్షరాలూ ఏం మిగులుతాయి :) అంతలోనే ఇంకోలాగ కూడా అనిపిస్తుంది.. ఎవరెంత పొగిడినా, ఎన్ని అక్షరాల నగిషీలు చెక్కినా వెన్నెల అందం తరగదు.. మనకు తనివీ తీరదు.. అంతటి సౌందర్యం వెన్నెల సొత్తు మరి! అందుకే, సినీకవులు వర్ణించిన మరిన్ని వెన్నెల సోయగాలను కళ్ళలో నింపుకుందాం… నాతో రండి మరి…

వెన్నెల పాటలు అనగానే నాకు గుర్తొచ్చే మొదటిపాట సాక్షి చిత్రంలో బాపూ బొమ్మలాంటి అందమైన పాట..

1) “అటు ఎన్నెల ఇటు ఎన్నెల
ఎటు సూస్తే అటు ఎన్నెల
ఓరందగాడా బంగారుసామీ…” అంటూ మొదలుపెట్టి

“ఏరులాగ ఎన్నెలంతా జారిజారి పారిపోతే ఏటికెడద అడ్డమేసెదరా..
నిన్ను చూస్తే మనసు నిలవదురా..”
అని కవ్విస్తుంది ఓ నాయిక!

“మల్లెమొగ్గల నవ్వు నవ్వకురా నీ నవ్వులోనే తెల్లవారునురా” అంటున్న ఈ గుమ్మ పాడే మొత్తం పాట ఇక్కడ:
1) http://www.youtube.com/watch?v=SniweKKmOCo

2) “కురిసే వెన్నెల్లో మెరిసే గోదారిలా
మెరిసే గోదారిలో విరబూసిన నురగలా.. ” అంటూ తెల్లని చీరలో మెరిసిపోతున్న నాయికని చూసి ఆశ్చర్యపోతాడొక కథానాయకుడు. ఈ అందాలరాముడి సంగతేమిటో, ఆ చిన్నదాని వలపుపాట ఏమిటో ఇక్కడ చూడండి..
2) http://www.youtube.com/watch?v=UFoqzbG2gnw

3) ఒంటరివాళ్ళు ఓపనిదీ
జంటకు చాలీచాలనిదీ
చెలి కన్నులలో వెలిగేదీ
చిలిపిపనులు చేయించేది…ఈ వెన్నెలేట! మీకు తెలుసా?

“ఈ వెన్నెల.. ఈ పున్నమి వెన్నెల..
ఈనాడూ ఆనాడూ.. అదే వెన్నెల..”
అంటూ వెన్నెల వర్ణాలను వివరిస్తారు నాయికానాయకులు ఈ పాటలో.
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=576

4) “మధురమైన రేయిలో
మరపురాని హాయిలో
పండూవెన్నెలే నేడు
పాడేనేలనో…”
అని ‘తోబుట్టువులు’ చిత్రంలో ఓ మనోహరమైన వెన్నెల పాట ఉంది.. హాయిగా ఉయ్యాలలో ఊగుతున్నట్లుంటుంది ఈ పాట వింటుంటే..

3) https://www.youtube.com/watch?v=tJinQfhfCm0#t=119

5) “చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో
అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే” అంటున్న ఈ ప్రేమికుడి ఆనందమేమిటో కాస్త విందురూ…
(చిత్రం: సంసారం, సంగీతం: దక్షిణామూర్తి)

6) “మెరిసిపోయే ఎన్నెలాయే
పరుపులాంటి తిన్నెలాయే
నన్ను ఇడిసి ఏడ పోతివిరా.. బంగారు సామీ
రేతిరంతా ఏమిసేతునురా”
అని వగలుబోతుంది ఓ చిన్నది. ఈ చిన్నదాని అలుకలేమిటో.. ఫిర్యాదులేమిటో క్రింద లింక్లో వినేయండి…

http://www.song.cineradham.com/player/player.php?song[]=1627

7) ” వెన్నెల పందిరిలోన
చిరునవ్వుల హారతులీనా
పండు వెన్నెల మనసు నిండా వెన్నెలా
కొండపైనా కోనాపైనా కురిసే వెన్నెలా…విరిసే వెన్నెలా ”
అంటూ వెన్నెలను చూసి మురిసిపోయే ఈ పాట ‘దేవులపల్లి’ రచన ! ‘అద్దేపల్లి రామారావు’ స్వరపరిచిన ఈ పాటను ‘బంగారు పాప’ చిత్రానికి ఎ.ఏమ్.రాజా,సుశీల పాడారు…
http://www.oldtelugusongs.com/newsongs/vintage/BangaruPapa_1954-AMRaja&Suseela-VennelaPandiriLona_Devulapalli_AddepalliRamaRao.mp3

8) “చల్లని వెన్నెలలో నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకుని నా మదిలో ఒదిగిపో..”
అంటూ సాగే ఈ పాట వెన్నెలంత చల్లగా, శాంతంగా ఉంటుంది..
(శ్రీమంతుడు /టి.వి.చలపతిరావు)

9) “నవమినాటి వెన్నెల నేను
దశమినాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయి
కార్తీక పున్నమి రేయి..”
ఎన్నిసార్లు విన్నా దాహం తీరని పాట కదూ ఇది! వేటూరి మాత్రమే రాయగలిగిన పాట అంటే అతిశయోక్తి కాదు..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7236

10) వెన్నెల పాటల్లో తప్పనిసరిగా గుర్తుచేసుకోవాల్సిన వేటూరి రచన “చంద్రకాంతిలో చందన శిల్పం ..”
నాయిక సోయగాన్ని నదులతో పోలుస్తూ..
..తుంగభద్రవో
..కృష్ణవేణివో
..గౌతమివో
..వంశధారవో
అంటూ వేటూరి వర్ణిస్తూంటే వినటానికి రెండుచెవులు చాలవు…అద్భుతమైన రచన!
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6017

11) “అటు చల్లని వెలుగుల జాబిలి
ఇటు వెచ్చని తూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి
కోమలీ…ఓ జాబిలీ.. ” అంటాడో చినవాడు
“వాడేవీడు” చిత్రంలోని ఈ పాట ఇక్కడ..

12) “పూవై విరిసిన పున్నమి వేళ బిడియము నీకేల బేలా..” అంటూ తొలిరేయిన ముచ్చటగా పాడుకుంటాడో కొత్త పెళ్ళికొడుకు. ఆతని తొందర, వధువు సిగ్గుదొంతరలు.. ఈ పాటలో..
(శ్రీతిరుపతమ్మ కథ, ఘంటసాల)

13) “విరిసిన వెన్నెలవో
పిలిచిన కోయిలవో
తీయని కోయిలవో
చెలీ.. చెలీ.. నీవెవరో”
అంటూ చెలిని పలురకాలుగా వర్ణించే ఈ పాట ‘బందిపోటు దొంగలు’ చిత్రంలోది…

14) “ఈ పాల వెన్నెల్లో నీ జాలి కళ్ళల్లో ఇద్దరూ ఉన్నారూ.. ఎవ్వరూ వారెవరూ?” అనడుగుతుంది ప్రియురాలు
“ఈ పాల వెన్నెల్లో నా జాలి కళ్ళల్లో.. ఇద్దరు ఒకరేలే.. ఆ ఒక్కరూ నీవేలే..” అంటాడు ప్రియుడు.
ఈ ప్రేమికుల గుసగుసలూ ఉసులూ, బాసలూ ఏమిటో ఇక్కడ చూసేయండి..

15) లవకుశ చిత్రంలో రాముడు అయోధ్యకు వచ్చాకా జనావళి ఆనందోత్సాహాలతో పాడుకునే ఈ పాట సంగీతంలో కూడా వెన్నెలలు కాయించారు ఘంటసాల…
(విరిసె చల్లని వెన్నెల )

16) “విరిసే వెన్నెలలో వెంట జంట ఉండాలోయ్ ” అంటూ హాస్యనటుడు రేలంగి పాడిన ఓ పాట ఉంది.. ‘ధర్మ దేవత’ చిత్రంలో!
పాడినది: రేలంగి, జిక్కీ; సాహిత్యం: సముద్రాల రాఘవాచారి, సంగీతం: సి.ఆర్.సుబ్బరామన్.
(6th song in the link)
http://www.sakhiyaa.com/dharma-devata-1952-%E0%B0%A7%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%A4/

ఇలా వెన్నెల రేయిలో ప్రేయసీప్రియులు పరవశించే పాటలే కాక పగటిపూట కూడా తమ రచనలతో వెన్నెలలు పూయించారు మన సినీకవులు.. అటువంటి ఓ రెండు పాటలు…

* ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ
వింత కాదు నా చెంతనున్నది వెండివెన్నెల జాబిలీ నిండుపున్నమి జాబిలీ..” అని చమత్కరిస్తాడు ఓ చెలికాడు. అతని కధేమిటో కనుక్కుందామా?

** “ఆధా హై చంద్రమా…” అనే ప్రఖ్యాత హిందీ పాట నుండి ప్రేరణ పొందింది పూజాఫలం చిత్రంలోని “పగలే వెన్నెల జగమే ఊయల…”! హిందీ ట్యూన్ ని కొద్దిగా స్లో చేస్తే ఈ పాట పోలికలు తెలుస్తాయి మనకి..

ఈసారికి ఇవేనండీ.. మరి బాగున్నయా వెన్నెలగీతాలు…?! మరో గీతనేపథ్యంతో మరోసారి కలుద్దామేం…

పూల బాసలు తెలుసు ఎంకికీ..

“బతుకంతా పాటలాగ సాగాలి” అని పాడుకున్నారొక కవి! పాట అంటే కేవలం సంగీతమే కాదు, అందమయిన సాహిత్యం!  ప్రతి పాటకూ ఓ ప్రత్యేకమైన పదనేపథ్యం ఉంటుంది. ఏదో ఒక విషయం పైన  రాయబడిన బోలెడు. నవ్వు, పువ్వు, వెన్నెల, జీవితం.. ఇలానన్నమాట. అలాంటి కొన్ని నేపథ్యాలను ఎన్నుకుని, ప్రతి వ్యాసంలో ఆ నేపథ్యం తాలుకూ పాటలను గుర్తుకు తెచ్చి, వినిపించే ప్రయత్నం చేయబోతోంది “పాట వెంట పయనం…”

 

 

ఫోటో: దండమూడి సీతారాం

ఫోటో: దండమూడి సీతారాం

పువ్వులు“!

సృష్టిలో తియ్యనిది స్నేహమైతే, సృష్టిలోకెల్లా అందమైనవి పువ్వులు అంటే ఒప్పుకోనివారుండరు. నక్షత్రాలు ఆకాశంలో పువ్వులైతే, పువ్వులు భువిపై ఉన్న నక్షత్రాలు కదూ! అసలు పువ్వులు లేని ప్రపంచాన్ని ఊహించగలమా? పువ్వులు లేని ప్రపంచం నవ్వులేని మొహంలా, గడప లేని ఇల్లులా ఉండేదేమో! కరుణశ్రీగారు పుష్పవిలాపాన్ని మాత్రమే చెప్పారు గానీ ఈ పూలకి మాటలు వచ్చి ఉంటే.. మనతో ఎన్నెన్ని కబుర్లు చెప్పి ఉండేవో.. ! ఒక పూల తోటలోంచి వెళ్తుంటే ఆ పువ్వులన్నీ మనతో ఏవేవో కబుర్లు చెప్తున్నట్లే ఉంటుంది. అందుకేనేమో నాయుడు బావ కూడా “పూల బాసలు తెలుసు ఎంకికీ.. తోట పూల మనసులు తెలుసు ఎంకికీ…” అని పాడాడు.

పువ్వులతో నా సాంగత్యం చిన్నప్పటిది. మా చిన్నప్పటి ఇంట్లో వెనుకవైపు పెద్ద పెరడు ఉండేది. అందులో పారిజాతం, రెండు మూడు మల్లె పొదలు, పందిళ్ళపై పాకిన సన్నజాజి, విరజాజి తీగెలు, గులాబీలు, ఇంకా చుట్టూతా ఏవో గడ్డీపువ్వులతో అనేక వర్ణాల్లో ముస్తాబైన  ఆ తోటంతా సాయంత్రమయ్యేసరికీ మనోహరమైన పరిమళాలను ఉండేది. ఇంకా మా వాకిట్లో అమ్మ పెంచిన కనకాంబరాలు, నిత్యమల్లి, బంతిపూలు, మెట్టతామర, రెండు మూడు రంగుల డిసెంబరు పూలు, ముళ్లగోరింటలు కాక మాతో పాటూ పెరిగిన ఓ పెద్ద రేక నందివర్థనం చెట్టూ ఉండేవి. ఇవన్నీ కాక ఊరెళ్తే, మా నాన్నమ్మ పెంచిన తోటలో దేవకాంచనాలు, పదమూడు రకాల రంగురంగుల మందారాలు, ఆకు సంపెంగ, సింహాచలం సంపెంగ, పారిజాతాలు, చామంతులు, నైట్ క్వీన్, సన్నజాజి, రేకమాలతి పూలు.. ఇవన్నీ నాకు స్వాగతం చెప్పేవి. “ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకూ.. పూలిమ్మని రెమ్మ రెమ్మకూ..” అని పాడుకుంటూ ఆ పూలచెట్ల మధ్యనే తిరిగేదాన్ని. ఇలా ఈ పూలదీ నాదీ ఏనాటిదో అనుబంధం..! అందుకే నాకనిపిస్తుంది.. పుస్తకాలు నాకు మాట్లాడే స్నేహితులైతే.. పువ్వులు నాతో మౌనంగా సంభాషించే మిత్రులు అని!  అందుకనే ఈ పాట వెంట పయనంలో మొదటగా నాకత్యంత ప్రియమైన పువ్వులపై సినీకవులు రాసిన కొన్ని మధురమైన తెలుగు పాటలను ఇవాళ మీకు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా..!

పూల మీద ఎన్నో సినీగీతాలున్నాయి… “ఏ దివిలో విరిసిన పారిజాతమో”(కన్నెవయసు), “ముద్దబంతి పువ్వులో”(మూగమనసులు), “గులాబీలు పూసేవేళ”(భలే అబ్బాయిలు), “మల్లెలు కురిసిన చల్లని వేళలో..”(అడుగుజాడలు),  “సన్నజాజిపూవులు “(అమాయకురాలు),  “నువ్వేనా.. సంపంగి పువ్వున నువ్వేనా”(గుప్పెడుమనసు), “మల్లెలు పూసే వెన్నెల కాసే”(ఇంటింటి రామాయణం), “సిరిమల్లె పువ్వల్లె నవ్వు”(జ్యోతి), “మరుమల్లియ కన్నా తెల్లనిది” (మల్లెపూవు), “సిరిమల్లె నీవే విరిజల్లు కావే”(పంతులమ్మ), “పూసింది పూసింది పున్నాగ..”(సీతారామయ్యగారి మనవరాలు).. చెప్పుకుపోతే ఎన్నో..! పూల సొగసునీ, సోయగాన్నీ, వయ్యారాల్నీ తలుచుకుంటూ మరి నాతో పాటూ మరికొన్ని పూలపాటల్ని వింటూ మీరు కూడా ఆ పరిమళాలను ఆఘ్రాణించండి.

పువ్వులన్నింటిలోనూ మల్లెపూలపై బాగా ఎక్కువ పాటలు రాసారు మన సినీకవులు. అన్నింటిలోనూ ‘మల్లీశ్వరి’ చిత్రంలోని దేవులపల్లి వారి రచన “మనసున మల్లెల..” నాకత్యంత ఇష్టమైన పాట. ఆల్ టైం ఫేవొరేట్ అనచ్చు. ఈ పాటలో సంగీత సరస్వతి భానుమతి గళంతో వెన్నెలలు కాయిస్తుంది. ఎడబాటు లోని విరహాన్నీ, చెలికాని సాన్నిధ్యం లోని అలౌకికానందాన్ని కలగలిపిన ఈ పాటను మీరు చూసేయండి మరి…

http://www.youtube.com/watch?v=CF1v6M6m86U

***

 మల్లెపూలు, గులాబీలూ, సన్నజాజులూ మొదలైన పువ్వులని అమ్ముకునే అమ్మాయి ఓ  పాట పాడుతూ పూలమ్ముతూ ఉంటుంది. పాట బావుంటుంది కానీ కనులు కనబడని ఓ అమ్మాయి పూల అందాలను వర్ణిస్తూ అలా పూలు అమ్ముతుంటే ఎందుకో కళ్ళల్లో నీటిపొర అడ్డుపడకమానదు. “రాజీ నా ప్రాణం” చిత్రంలో “మల్లెపూలు మల్లెపూలు..కావాలా..” అని ఆర్.బాలసరస్వతిదేవి పాడిన పాటని రాసింది కూడా కృష్ణాశాస్త్రి గారే! స్వరపరిచింది ఎస్.హనుమంతరావు. వీరు ఎస్.రాజేశ్వరరావు గారి అన్నగారు.

ఈ పాటను ఇక్కడ చూడవచ్చు:

https://www.youtube.com/watch?v=7ZxfNYGjEJg

ఈ “మల్లెపూలు మల్లెపూలు..పాటకు ‘La Violetera’ అనే స్పానిష్ ట్యూన్ మాతృక. పాటను తెలుగులో, తమిళంలో కూడా బాల సరస్వతి పాడారు. ఒరిజినల్ స్పానిష్ తో పాటూ తెలుగు, తమిళ భాషల్లో బాల సరస్వతి  పాడిన పాటలను ఒకే విడియోలో క్రింద లింక్ లో వినవచ్చు:

http://www.youtube.com/watch?v=IwEJKZo3q0o

 ***

 

“ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ

గిరిమల్లికలు తప్ప గరికపువ్వులు తప్ప

ఏ కానుకలను అందించగలను చెలీ

గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప

జగతిపై నడయాడు చంచలా మల్లికా తరుణి ఆకృతి దాల్చు

శరదిందు చంద్రికా..శరదిందు చంద్రికా..”

అంటాడో ప్రియుడు..

http://www.raaga.com/player4/?id=192695&mode=100&rand=0.9301893163938075

ఇదే చిత్రం(ఏకవీర)లో చెలి అందాన్ని ప్రశంసిస్తూ, ఆమెను పువ్వులతో, తారలతో పోలుస్తూ.. చెలి కన్నులలో కలువల్లా విరియాలని, చెలి వాల్జెడ సందులలో మల్లియలై తాను విరియాలంటాడు మరొక ప్రేమికుడు..

http://www.youtube.com/watch?v=xOTR-8J9d8I

 

***

 Rajayya 1

 

‘మల్లెకన్న తెల్లన, వెన్నెలంత చల్లన ఏది ఏదని.. ’ అడుగుతాడు ఓ బావ..

‘తేనె కన్నా తీయన, తెలుగంత కమ్మన ఏది ఏదంటుంది’ ఓ మరదలు..

ఈ బావా మరదళ్ళ సరసాన్ని ప్రశ్న- జవాబుల రూపంలో వినడానికి ఎంతో సరదా ఐన పాటగా రూపొందించారు “ఓ సీత కథ” సినిమాకు ‘మహదేవన్’ స్వరపరచగా బాలు, సుశీల గానం చేసారు. ‘సి.నారాయణ రెడ్డి’ రచన.

ఈ గీతాన్ని ఇక్కడ వినవచ్చు:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4810

 

 ***

 ప్రియుని ఎదలో నిలవాలని, ఇద్దరూ ఒకటిగా కలిసిపోవాలని ఆశ పడుతుంది ప్రియురాలు. అతని సాంగత్యంలో సిగ్గుల మొగ్గై తాను కరిగిపోవాలని ఏవేవో కలలు కంటుంది. అలా కలల ఊయలలో, ఊహల్లో ఉయ్యాలలూగుతూ ఓ ప్రియురాలు పాడుకునే పాట ఇది..

వెన్నెలలో మల్లియలు

మల్లెలలో ఘుమఘుమలు

ఘుమఘుమలో గుసగుసలు

ఏవేవో కోరికలు ఏవేవో కోరికలు..

“మనుషులు-మమతలు” చిత్రంలోని ఈ పాటకు టి. చలపతిరావు సంగీతాన్ని అందించగా, సుశీలమ్మ కమ్మగా పాడారు.

http://www.youtube.com/watch?v=ieRLv2u7rUg

 

***

 అందమైన పడుచుపిల్ల ముద్దబంతి పూలు పెట్టుకుని వయ్యారాలు పోతూ నడుస్తూంటే కొంటె పిల్లాడు ఊరుకుంటాడా?

ఇలా పాడడూ..

http://www.youtube.com/watch?v=dP3eONVT–g

 

***

 ఎన్నాళ్ళ నుండో తాను ఎదురుచూస్తున్న ప్రేమాభిమానాలను తనకు ప్రియమైన అబ్బాయి కళ్ళల్లో హఠాత్తుగా చూసిన ఓ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. చెల్లెల్లి పెళ్ళి అయిపోగానే ఇక తన పెళ్ళేనని సంబరపడుతూ చెప్తాడా అబ్బాయి. తన కలవరపాటుకి చామంతి పువ్వు సాయం చేసుకుని ఆ అమ్మాయి పాడే పాటే “ఆత్మీయులు” చిత్రంలో ‘నారాయణరెడ్డి’ రచించిన “ఓ చామంతీ ఏమిటే ఈ వింత..” గీతం. ‘రాజేశ్వరరావు’ గారి స్వరాలతో ముస్తాబైన ఈ పాట ఇక్కడ వినవచ్చు:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1659

 

 ***

 “చింత పువ్వు ఎరుపు… చిలక ముక్కు ఎరుపు

చేయి చేయి కలుపు లేత వలపు తెలుపు.. రాణీ..” అంటాడు అబ్బాయి

“మల్లె మొగ్గ తెలుపు మంచి మనసు తెలుపు

చేయీ చేయీ కలుపు నిండు వలపు తెలుపు.. రాజా…” అంటుంది అమ్మాయి,

“ఇంటి గౌరవం” చిత్రంలో అలా చింతపువ్వునీ, మల్లె మొగ్గనీ తలుచుకుంటారు మరో ప్రేమికుల జంట. ఈ ‘ఆరుద్ర’ రచనని ఇక్కడ వినవచ్చు:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2353

 

***

 ప్రేయసిని గులాబీపువుతో పోల్చుతూ, స్త్రీలు గులాబీలంత నాజూకు వారనీ; తుమ్మెదలా దగ్గరకు వచ్చే మగవారిని నమ్మరాదని, మగవారి నైజాన్ని గుర్తించి మలగాలని అన్యాపదేశంగా పాడే పాట ఇది. గాయకుడు అవ్యక్తంగా తన ప్రేమను కూడా తెలుపుతున్నట్లుండే “ఓహో గులాబి బాలా అందాల ప్రేమ మాలా..” పి.బి.శ్రీనివాస్ హిట్ సాంగ్స్ లో ఒకటి. “మంచిమనిషి” చిత్రంలోని ఈ పాట ఇక్కడ చూడచ్చు …

http://www.youtube.com/watch?v=X0yrSorugWo

 

***

 bhanumathi_03

ప్రేయసి ప్రియులతోనే కాదు వసివాడని పూలను వసివాడని పసిహృదయాలతో కూడా పోల్చారు సినీకవులు. కల్లాకపటం ఎరుగని పిల్లలను దేవుడితో పోలుస్తూ పిలలూ దేవుడూ చల్లనివారన్నారు ఒక కవి. పకపక నవ్వుతూ ఇల్లంతా తిరుగుతూ, ఇల్లు పికి పందిరేసేలా అల్లరి చేస్తూ పరుగులెట్టే పిల్లలవల్లనే ఇంటికి అందం. అలా సందడిగా తిరిగే పిల్లలను “సన్నజాజితీవెలోయ్ సంపంగి పువ్వులోయ్..”  అంటూ అందమైన పువ్వులతో పోల్చారు ‘మల్లాది’.  ‘పెండ్యాల నాగేశ్వర రావు’ స్వరపరిచిన “అనురాగం” చిత్రం లోని ఈ సరదా పాట భానుమతి గళంలో ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/player4/?id=191897&mode=100&rand=0.05453325994312763

 

 

***

“చిన్నారి పొన్నారి పువ్వు.. విరబూసి విరబూసి నవ్వు

మన ఇంటి పొదరింటి పువ్వు.. నిను జూసి ననుజూసి నవ్వు”

 

అంటూ తమ ముంగిట అడుగుబెట్టబోయే నూతన అతిథి గురించిన ఈ పాట “నాదీ ఆడజన్మే” చిత్రంలోది. ‘దాశరథి’ రచనలో ‘ఆర్.సుదర్శనం’ స్వరపరిచిన ఈ గీతాన్ని ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/player4/?id=193567&mode=100&rand=0.23990890616551042

 

***

 “సిన్నారి నవ్వు.. సిట్టి తామర పువ్వు..

సెరువంత సీకటినీ సుక్కంత ఎలుగు

సుక్కంత ఎలుగేమో సూరీడు కావాల

సిన్నారి సిరునవ్వు బతుకంత పండాలా..”

అని ‘ఇంద్రగంటి శ్రీకాంత శర్మ’గారొక పాట రాసారు “కృష్ణావతారం” సినిమా కోసం. ఈ పాట కూడా నాకు చాలా ఇష్టం. ‘కె.వి.మహాదేవన్’ సంగీతాన్ని అందించగా, బాలు, శైలు ఈ పాటను అద్భుతంగా పాడారు. మెల్లగా, చల్లని తెమ్మెరలా ఉండే ఈ పాట మళ్ళీ మళ్ళీ పెట్టుకుని ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనేలా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి. ఈ పాటను ఇక్కడ వినవచ్చు:

http://www.raaga.com/player4/?id=193134&mode=100&rand=0.27093348116613925

 

 ***

 మరోసారి మరో నేపథ్యంతో, మరికొన్ని మధురగీతాలతో కలుద్దామే మరి…

 

–  తృష్ణ

 

 

 

 

 

చివరికి కవులమ్మ ఏం చేసింది?

rajiమొగుడుపెళ్ళాలన్నంక కొట్టుకుంటరు, తిట్టుకుంటరు…”, “మొగోడన్నంక సవాలక్ష తప్పులు చేస్తడు. ఆడదే సర్దుకుపోవాలి”,  అని పెద్దమనుషులు తలా ఒక మాటా అన్నా నోరు మెదపదు కవులమ్మ. కానీ ఒకాయన  “లోకంల నువ్వొక్కదానివే ఆడిదానివి కాదు. అందరు నీ లెక్క వుంటే లోకం బాగుపడినట్టే. నన్ను వదిలిపెట్టి పోయిన్నాడే సచ్చినట్టు అని మాట్లడ్తవంట. ఆ బొట్టెందుకు పెట్టుకున్నావమ్మా..” అనేసరికీ కవులమ్మ కోపం కట్టలు తెంచుకుంటుంది. అంతదాకా కవులమ్మ మౌనాన్నే తప్ప కోపాన్ని చూడని కొడుకులు,కోడండ్లు బదులియ్యలేక ఉండిపోతారు. కవులమ్మ పెద్దమనుషులకు, కొడుకులకు ఏం సమాధానం చెప్పింది? ఏం నిర్ణయం తీసుకుంది? తెలవాలంటే తాయమ్మ కరుణగారి రాసిన “కవులమ్మ ఆడిదేనా?” కథానిక చదవాల్సినదే!

అరవై ఏండ్లకు దగ్గర వయసు ఉన్న కమలమ్మను అంతా ‘కవులమ్మా’ అంటారు. ఎముకలకి చర్మం ఉన్నట్టుగా సన్నగా ఉంటుంది కవులమ్మ. శుభ్రమైన చీర, నుదుటన పెద్ద కుంకుమ బొట్టు ఉంటుంది. చేతికి నాలుగైదు రంగుల మట్టి గాజులు, ముక్కుకు ముక్కుపుల్ల తప్ప మరే ఆభరణాలూ ఆమె వంటిపై కనబడవు. తప్పదనుకుంటే తప్ప మాట్టాడదామె. కొత్తవారు ఆమె మూగదనే అనుకుంటారు. ముఖంలో ఏ భావము కనబడనీయక నిర్వికారంగా పనులు చేసుకుంటూ వెళ్పోయే ఆమెకు స్పందనలు కలుగవా? అనుకుంటారందరూ. “మనిషికిక ఎంత పొగరు.. ఊ… అని కూడా అనదు” అని కోడళ్ళిద్దరూ  ఆడిపోసుకున్నా పలుకదామె!ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు కవులమ్మకి. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి పంపి, ఓ ఇంటి అక్కాచెల్లెళ్ళతో కొడుకులకు కూడా పెళ్ళిళ్ళు చేసింది. ఎంతో కష్టపడి కట్టుకున్న తొమ్మిది గదుల సొంత ఇంట్లో, ఓ మూలనున్న బావి దగ్గర గది అమెకు మిగిల్చారు కొడుకులు. ఇంటెడు మంది బట్టలు, అంట్ల పని అమెదే. క్షణం తీరుబడిగా కూర్చోదు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న శ్రమజీవి ఆమె.

ఒకనాటి ఉదయాన ఎండలో బావి దగ్గర గిన్నెలు తోముతున్న ఆమెకు గేటు తెరుచుకు వస్తున్న ఆడబిడ్డ రంగమ్మ కనబడుతుంది. ఏనాడూ బంధువులను ఇంటికి పిలువని కొడుకులు రంగమ్మనెందుకు పిలిచారో అర్థం చేసుకోవటానికి ఎక్కువసేపు పట్టదామెకు. కన్నీళ్ళు ముసిరిన ఆమె కళ్ళల్లో ఎన్నో పాత సంగతులు కదలాడతాయి. హృదయం భారమయ్యే గాథ ఆమెది. తల్లిని ఉంచుకుని, ఆమె కూతుర్ని(కమలమ్మని) వయోబేధం లేకుండా పెళ్ళాడి, జీవితాంతం అనుమానంతో దారేపోయే ప్రతివాడితో..చివరికి కన్న తండ్రితో కూడా ఆమెకు సంబంధం అంటగట్టి, ఆమెను మాటలతో హింసించి, గుద్దులు గుద్దీ, చావబాది, చివరికు అరవై ఐదేళ్ళ వయసులో మళ్ళీ పెళ్ళి చేసుకు వెళ్ళిపోయిన  దుర్మార్గుడు ఆమె భర్త. ముసలివయసులో కంటి చూపు పోయాకా ఇప్పుడు సేవలకోసం మళ్ళీ ఇల్లు చేరిన అతడిని క్షమించి మంచాన పడిఉన్న అతనికి కవులమ్మ సపర్యలు చేయగలదా?

పదునైదు రోజుల క్రితం వచ్చిన తండ్రిని బావి దగ్గరి గదిలోనే ఉంచుతారు కొడుకులు. ఆ గది దరిదాపులకు కూడా వెళ్లకుండా ఇంటి వసారాలోనే నిద్రపోయి రోజులు గడుపుకుంటుంటుంది కవులమ్మ. తండ్రి దుర్మార్గుడైనా అతడ్ని భరించాల్సిన బాధ్యత తల్లిదేనంటారు కొడుకులు. ఆ సంగతి తేల్చటానికి ఊళ్ళోని నలుగురు పెద్దమనుషులనూ, తండ్రి తరఫు బంధువుల్లో మిగిలిన ఒకే ఒక మేనత్తనూ పంచాయితీకి పిలుస్తారు. “సాకల్దాన్ని పెట్టుకోకపొయినర్రా..ముసిల్దానితో ఇంకా గంపెడు పని చేయిస్తున్నరు”, “గుండెకాయ కాడ గుండన్న లేదాయె. ఆనాడు మెడలో బంతిపూల మాల, చెవులకు జుంకాలు, ముక్కుని ఇంత ఇంత పెద్ద బేసర్లు, చేతులకు దండకడాలు, నడుముకి వడ్డాణం పెట్టుకుని పార్వద్దేవి లెక్కవుండేది. ఆడపిల్లల పెండిళ్లకు పెట్టగా వున్నాటిని మీరు ఒలుసుకుంటిరి. అషద అయ్యి మీ మావ చేపిచ్చినవన్నా కవాయే. ఆమె తల్లిగారు పెట్టినయి. ఆడికీ ఎవరన్నా అడిగినా ‘ముసల్దాన్ని నాకెందుకు నగలు’ అని అంటదిగని, మీ మీదకి మాట రానీయదు” అంటూ రంగమ్మ వదిన తరఫున మాటాడ్డం చూసి పళ్ళు నూరుకుంటారు కవులమ్మ కోడండ్లు.

“తాయమ్మ” అనే తన ప్రసిధ్ధ కథనే ఇంటిపేరుగా మార్చుకున్న రచయిత్రి కరుణ  కథలో వాడిన భాష సంఘటనలను, కథలోని వాస్తవికతను తాజాగా ఉంచుతుంది. యుగాలు మారినా, సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా ఎందరో స్త్రీల దుస్థితి ఈవిధంగానే ఉందన్న సత్యాన్ని ఈ కథ తెలుపుతుంది. కవులమ్మ లాంటి స్త్రీలు చాలామంది ఉంటారు. ఆమె భర్త చేతిలో పడరాని పాట్లు పడింది. కానీ సమస్యలనేవి భర్త వల్లనే రానక్కర్లేదు.. అత్తగారు, ఆడబిడ్డ, పిల్లలు, సమాజం… ఇలా ఎవరివల్లనైనా సమస్య రావచ్చు. అయితే, పరువు-ప్రతిష్ఠ, జరుగుబాటు ఎలా?.. మొదలైన ప్రశ్నలు, భయాలు వీడి కవులమ్మలా నిలబడి ధైర్యంగా  సమస్యను ఎదుర్కునేంతటి తెగువ ఎందరు స్త్రీలు చూపెట్టగలరన్నది ప్రశ్న! కథలో కవులమ్మ చెప్పిన చివరి మాటలు మనల్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఆలోచింపజేస్తాయి. ఉత్తేజపరుస్తాయి. కథని మళ్ళీ మళ్ళీ చదివేలా చేస్తాయి. ఆత్మగౌరవార్థం ఆమె చూపే తెగువకూ, ధైర్యానికీ మనసు సలాము చేస్తుంది. ఉన్నతమైన ఆమె వ్యక్తిత్వం మరెందరికో మార్గదర్శకం కాగలదనిపిస్తుంది.

ఈ కథ “మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ” ప్రచురించిన “కథావార్షిక 2004” కథా సంకలనం లోనిది.

కవులమ్మ ఆడిదేనా?

ఉదయం తొమ్మిది కావస్తుంది. మార్చి నెలే అయినా ఎండ విపరీతంగా కొడుతుంది. ఆ ఎండలోనే కూసుని బాయిమీద గిన్నెలు తోముతుంది కవులమ్మ. గిన్నెలు తోమీ తోమీ కవులమ్మ అరచేతిలోని గీతలు అరిగిపోయినయని అంటుంటరు.

కవులమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. అందరి పెండ్లిళ్లు అయినవి. కొడుకులిద్దరు అక్కచెల్లెల్లనే చేసుకున్నరు. కొడుకులకు ఒక్కొక్కరికి ఒక్కో పోర్షన్‌ చొప్పున మూడు మూడు గదులు వచ్చినవి. మధ్యలో కవులమ్మ కొరకే వున్న పోర్షన్‌ను వాళ్ల వాళ్ల గదుల్లోకి తిరగడానికి వదిలిపెట్టి చివరిగది మూడోదాన్ని వంటింటిగా మార్చారు.  తిండిమాత్రం ఇద్దరు కొడుకులు పొత్తులనే తింటరు. గదులన్నింటిని కలుపుతూ బారుగా ముందర వసారా. వసారాలోంచి మధ్య పోర్షన్‌లోంచి వెళితే మూడో గదిలో వంటిల్లు. ఒకమూలకు ఇల్లు వుంటే చుట్టూ కాంపౌండ్‌ వాల్‌. ఇంకో మూలకు బాయి. బాయికి ఒక పక్కన మరోగది. ఇంటిముందరి వేపు గేటు.

ఈ ఇంటి కొరకు కవులమ్మ ఎంత కష్టపడిరదో. అప్పట్లో సిమెంటు వాడకం అప్పుడప్పుడే మొలయింది. నీళ్లు కొట్టడానికి ఇంకొక మనిషిని పెడితే డబ్బులు అయిపోతయని తొమ్మిది గదులకు తనొక్కతే నీళ్లు కొట్టేది. అలాంటిది కొడుకులు పెళ్లిళ్లయి కోడండ్లు ఇంట్లకొచ్చిన తర్వాత కవులమ్మకు ఆ బాయిపక్కన ఒక రూము కట్టించారు. తనను ఆరోజు, బాయిపక్కన రూంలోకి పొమ్మన్నరోజు కవులమ్మ ఎంత బాధపడిరదో. తన రెక్కల కష్టంతో కట్టుకున్న ఇల్లు. ఇయ్యాళ తనది కాకుంట పొయింది. అయినా నేనేడకన్నా పోతున్ననా నా ఇంట్లనే ఇంకో అర్రల వుంటున్న కద. సచ్చిన్నాడు ఏమన్న మీదేసుకుని పోయేదుందా అని తనకు తనే సముదాయించుకుంది.

గిన్నెలు తోముతున్న కవులమ్మ గేటు చప్పుడైతే తలతిప్పి చూసింది. ఆడబిడ్డ రంగమ్మ ఒక చేతిల సంచి ఇంకో చేతిల కర్ర పట్టుకుని గేటు తీసుకుని లోపలకు రావడం కనిపించింది. గిన్నెలు తోమడం ఆపి, చేతులు కడుక్కుని కొంగుతో చెయ్యి తుడుచుకుంటూ ఆడిబిడ్డకు ఎదురుబోయి చెయ్‌సంచి అందుకుని ‘‘బాగున్నవా వదినా’’ అని మందలించింది.
‘‘ఆ… బానే వున్న వదిన’’ అని, ‘‘నీ ఒంట్ల ఎట్లుంటుంది’’ అడిగింది రంగమ్మ.

‘‘ఇగో… ఇట్ల వున్న’’ అంటూ బాయిదగ్గరికి తీసుకుపొయ్యి బకెట్ల నీళ్లు చెంబుతో ముంచి ఆడిబిడ్డకు ఇచ్చింది.

రంగమ్మ కాళ్లు, చేతులు, మొఖం కడుక్కుంది. అప్పటికే కవులమ్మకొడుకులు, కోడండ్లు ఇంట్ల నుంచి బయటికి వచ్చారు. పలకరించుకుంటూ రంగమ్మను ఇంట్లోకి తీసుకుపోయారు. కవులమ్మ మళ్లా గిన్నెల దగ్గరికి పొయింది.

ఏనాడో మేనత్తలను పిలవడం బందు పెట్టుకున్నరు. కవులమ్మ ఆడబిడ్డలు అందరూ చనిపోంగ ఈమె ఒక్కతీ వుంది. కాటికి కాళ్లు జూపుకుంది. యేడికీ పోదు. తనకంటే చిన్న అయినా కవులమ్మ తన అన్న భార్య కాబట్టి వదినా అని పిలుస్తది రంగమ్మ. తనకంటే వయసులో పెద్దది కాబట్టి కవులమ్మ రంగమ్మను వదినా అని పిలుస్తుంది.

‘‘కూర్చో అక్కా’’ అంటూ  కుర్చీ జరిపాడు కవులమ్మ పెద్దకొడుకు ఆనంద్‌.
(తెలంగాణలో మేనత్తను ‘అక్క’ అని పిలుస్తారు)

‘‘అక్కకు చల్లటి నీళ్లు తెచ్చియ్యి’’ అని భార్య సుశీలకు చెప్పాడు చిన్నకొడుకు నరహరి.
‘‘టైం తొమ్మిది కాట్లేదుగనిఎండలు జమాయించి కొడ్తున్నయేవిరా అప్పుడే’’ అంది రంగమ్మ మొఖం తుడుచుకుంట.
‘‘అవును పెద్దమ్మ ఈ ఎండలకు నువ్వు వస్తవో, రావో అనుకుంటున్నం’’ పెద్ద కోడలు భాగ్య.
‘‘రావద్దనే అనుకున్న. కండ్లు కూడా ఇన్నాటిలెక్క సరిగ కనిపిస్తలెవ్వు. ఇంతకు ముందులెక్క నడక చాతగాట్లే. కని, అన్నను కూడా చూసినట్టు వుంటదని బయలుదేరిన’’
‘‘ఇదిగో పెద్దమ్మ’’ అంటూ గ్లాసుతో నీళ్లు ఇచ్చింది సుశీల.

గ్లాసు పట్టుకుని ‘‘అమ్మో! ఇంత సల్లటియి నేను తాగలేనమ్మ. ప్రిజ్‌ల నీళ్లు అలవాటు లెవ్వు’’ అంది రంగమ్మ.

‘‘ముసలి ముండ మనిషిని ఆడించుకుంటది’’ తిట్టుకుంటూ లోపలికి వెళ్లి బిందెలో నీళ్లు తెచ్చి ఇచ్చింది. తన పని తనే చేసుకోదు. అలాంటిది ఈ ముసలిదానికి ఒకటికి రెండుసార్లు తిరగాలంటే సుశీలకు కడుపుమండిపొయింది.

రంగమ్మకు రెండుపక్కల, ముందర కుర్చీలు జరుపుకుని కూచున్నరు కవులమ్మకొడుకులు, కోడండ్లు. ముచ్చట ఎప్పుడెప్పుడు మొదలు పెడ్దామా అన్నట్టుగా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటున్నరు.

‘‘అవున్‌రా, నాయిన ఏడిరా’’ అడిగింది రంగమ్మ.
‘‘బాయి పక్కన వున్న రూంలో వున్నడు’’
‘‘మీ అమ్మకు కట్టిన అర్రలనారా’’
‘‘ఆ అండ్లనే’’
‘‘మరి మీయమ్మ యాడుంటుందిరా?’’
‘‘ఈ వసారాలోనే పడుకుంటుంది.’’
‘ముసల్దానికి వివరాలన్ని కావాలి’ అనుకుంటూ మాట మార్చడానికి ‘‘ఏమన్న తిన్నవా అక్కా’’ అనడిగిండు కవులమ్మ పెద్దకొడుకు.
‘‘యాడరా? పొద్దున బస్సు ఎక్కిచ్చిండు మీ బావ. ఇగో… బస్సుదిగి, రిక్షా పక్కి ఈడికొచ్చిన’’
‘‘అమ్మా ! అక్కకు టిఫిన్‌ పెడ్దువుగానీ రా ’’ కేకేసాడు చిన్నకొడుకు.
‘‘మీరు తిన్నారురా ?’’ రంగమ్మ.
‘‘ఆ… అయింది పెద్దమ్మ’’ కోడలు.

ఇంకొక రెండు గిన్నెలుంటే అవి కూడా కడిగి తీసుకుని పోదామని గబగబా కడుగుతుంది కవులమ్మ.

కవులమ్మ అసలు పేరు కమలమ్మ. వాడుకలో కవులమ్మ అయింది.  మనిషి అరవై ఏండ్లకు దగ్గర పడింది. ఎముకల మీద చర్మం వున్నట్టుగా వుంటది. ముతక చీరైనా శుభ్రంగా వుంటది. మొఖానికి పెద్ద కుంకుమ బొట్టు. పగిలిపోగా మిగిలిన ఓ… నాలుగైదు రకరకాల రంగుల గాజులు చేతులకు వుంటాయి. కాళ్లకు మెట్టెలుండవు. మెడలో వెలిసిపోయిన నూలు తాడు ఒకటి వుంటది. ముక్కుకు ముక్కుపుల్లతప్ప వీసమెత్తు బంగారం వుండదు  ఒంటిమీద.

కవులమ్మ చిన్నతనంలో బాగా అల్లరి చేసేదట. తండ్రికి చిన్నబిడ్డ కవులమ్మ అంటే ఎక్కడలేని ప్రేమ. చిన్నబిడ్డ ఎదురొస్తే శుభం కలుగుతదని నమ్మకం. ఊరికి జమీందారైనా బిడ్డ ఎంత చెప్తే ఆ తండ్రికి అంత. తను ఎక్కడికి వెళ్లినా తనతోపాటు చిన్నబిడ్డ కవులమ్మ వెంట వుండాల్సిందే. అలాంటి కవులమ్మ పెళ్లయిన తర్వాత మాట్లాడ్డం తగ్గిస్తూ తగ్గిస్తూ వచ్చి, ఇప్పుడు ఎప్పుడో ఓసారి తప్పదు అనుకుంటేనే మాట్లాడ్తది ఎవరితోనైనా.

కొత్తగా చూసినవాళ్ళు మూగదేమో అనుకుంటరు. చాలామంది కవులమ్మను చూసి ఈమెకు ఏమైనా స్పందనలు కలుగుతాయా? అనుకుంటారు. ఆమె నవ్వగా చూసినవాళ్లను వేళ్లమీద లెక్క పెట్టొచ్చు. మనిషి అలా నిర్వికారంగా పనులు చేసుకుంటూ పోతది.

‘‘చూడు పెద్దమ్మ. మనిషికి ఎంత పొగరు. ఊఁ… అని కూడా అనదు’’ పెద్దకోడలు. మరిది కేకవేసినా పలకలేదని.
‘‘ఇందాక నువ్వు బాగున్నవా వొదినా అని పలకరిస్తే. ‘ఇగో గిట్ల వున్న’ అని ఎంత పెడసరంగా అంటుంది చూడు పెద్దమ్మ’’ చిన్నకోడలు.
‘‘మీయత్త ఇయ్యాల్నే కాదే, ఎన్నడైన అట్లనే వుంది’’ రంగమ్మ.
కవులమ్మ గిన్నెలన్నీ టబ్‌లో పెట్టుకుని వసారాలోంచి వంటింట్లోకి పొయింది.

టిఫిన్‌ కొరకు ఉప్మా వేయిస్తుండగా పంత వద్దనుకున్నా ఏవేవో రకరకాల ఆలోచనలు. రవ్వ వేయించి పక్కన పెట్టింది. ఉల్లిగడ్డలు కోస్తుండగా రంగమ్మ ఎందుకొచ్చిందో అర్ధమైంది. కన్నీళ్లు టపటపా రాలాయి. ఉల్లిగడ్డ ఘాటుకో లేక మనసులోని బాధకో. ఈనాటికి నా బతుకు ఇట్లా అయింది అనుకుంది.

ఉల్లిగడ్డలు పొయ్యిమీద వేసి, ఉడికినాక నీళ్లు పోసి మూతపెట్టి అక్కడే నిలబడిరది. ఏనాటివో కండ్లల్ల మెదిలనయి.

రోజులెక్కనే కోడి కూయంగనే మెలుకువ వచ్చి చూసింది. పక్కన మనిషి లేడు. బుడ్డోడు నిద్రపోతుండు. లేచి కూచుని వెంట్రుకలను వేళ్లతో వెనక్కు దువ్వుకుని పుచ్చడ వేసుకుని పక్కబట్టలు మడతపెట్టి ముందరి తలుపు తియ్యబోయింది. ఎంతకీ రాలేదు. దొడ్డికి ఆగేటట్టు లేదు. రెండు, మూడుసార్లు కొట్టింది. అయినా అవతలి నుంచి సప్పుడు లేదు. తలుపు దగ్గరే కూలబడిరది కడుపును బిగపట్టుకుని.

ఈ ముదునష్టపు ముండాకొడుకు నా గండాన పడ్డడు. ఏనాడు చేసుకున్న పాపమో. నాకీ జన్మల ఈడు దొరికిండు. కళ్లమ్మట పటపట నీళ్లు కారినయి. నోట్ల నుంచి సప్పుడు వచ్చిందంటే వాడు విన్నడంటే ఇంకేమన్న వుందా ? ‘పొద్దున్నేఎవడు సావాలని ఏడుస్తున్నవే లంజె’ అని తన్నులు గుద్దులు తప్పవు. ఆ తన్నులు తలుసుకుని గబగబా కండ్లు పైటకొంగుతో తుడుచుకుంది.

బయటి నుండి తాళం తీసిన చప్పుడు కొద్దిగా వినిపించడంతో లేచి పక్కకు జరగబోయింది. ఈ లోపలే  రెండు తలుపులు ఒక్కసారిగా బార్లా తెరిచిండు. మోకాళ్ల వరకు లేచిన కవులమ్మను కొట్టుకుని తలుపురెక్క ఆగిపోయింది.

‘‘రంకులంజె, మొగుడు అటుపోంగనే మిండని కొరకు చూస్తున్నానే తలుపు సందుల నుంచి’’ అని కవులమ్మకు అవకాశం ఇవ్వకుండా ఎక్కడపడితే అక్కడ అందిన చోటల్లా గుద్దుతుండు. కవులమ్మకు దొడ్డికి ఆగుతలేదు. తన్నులూ ఆగుతలేవు. తన్నులు తింటూనే ఏడుస్తూ ‘‘దొడ్డికి పోదామని వచ్చిన’’ చెప్పింది.

‘‘లంజెముండవి దొంగేడుపులు చూడు’’ అని కూచున్న కవులమ్మ డొక్కలో మళ్లో రెండు తన్నులు తన్ని పక్కకు జరిగిండు.

కవులమ్మ చెంబుల నీళ్లు తీసుకుని ఆదరా బాదరాగా దొడ్డి దగ్గరికి పొయింది. వెనకాలే వచ్చి దొడ్డి తాళం తీసిండు. కవులమ్మ దొడ్లోకి వెళ్లగానే మళ్లా బయటి నుంచి తాళం వేసిండు ఎప్పటిలెక్కనే.

వెంటనే సప్పుడు గాకుండ తాళాన్ని తీసి, తలుపులు తెరుచుకుని దొడ్లోకి వచ్చిండు. దొడ్డికి కడుక్కుంటున్నదల్లా మనిషిని చూసి గబుక్కున లేచి నిలబడింది కవులమ్మ. పాణం చివుక్కుమంది. ‘ఈడు మనిషా, పసురమా ? ఈని బుద్ధి పాడుగాను. తల్లికడుపున ఎట్లబుట్టిండో ఈ బాడుకావ్‌’ అనుకుని గబాగబా బయటికి వచ్చింది. ఒకసారి దొడ్డంతా కలెదిరిగి వచ్చి మళ్లా తాళం వేసిండు.

‘‘అమ్మా, ఇంకా కాలేదా?ఎంతసేపూ’’ చిన్నకొడుకు కోపం, అసహనంతో కేకవేసాడు.
కొడుకు కేకతో ఈ లోకంలోకి వచ్చిన కవులమ్మ గబగబా మరుగుతున్న నీళ్లలో రవ్వపోసి కలిపింది. కొడుకు కేకకు బదులుగా కవులమ్మ నుండి ఎపటువంటి సమాధానం లేదు.
‘‘చూడు పెద్దమ్మ, ఏ ఒక్కదానికి బదులియ్యదు. ఏం జూసుకుని మీ వదినకు ఇంత పొగరో అర్ధంకాదు’’ అక్కసునంతా వెళ్లగక్కుతూ పెద్దకోడలు.
‘‘ఏవే, ఇప్పుడే కదనే వంటింట్లకు పొయ్యింది. అప్పుడే అయ్యిందా అని అడిగితే ఎట్లనే’’ అంది రంగమ్మ.
‘వదినను ఇంత మాట అననిస్తలేదు ముసలిముండ’ తిట్టుకున్నరు మనసులో.
‘‘నాయిన ఒంట్ల బాగుంటున్నాదిరా’’ అని మళ్లీ రంగమ్మే అడిగింది.
‘‘కండ్లు పూర్తిగా పొయినయి పెద్దమ్మా’’ అంది చిన్నకోడలు సుశీల ` మనసులో రంగమ్మ మీదఎంత కోపం వస్తున్నా పైకి మామూలుగా మాట్లాడుతూ.
‘‘చేసిన పాపం వూకనే పోతాదే? ఆపైనున్న పరమాత్ముడు అన్నీ చూస్తనే వుంటడు’’ అని రెండు చేతులు ఎత్తి కనిపించని దేవుడికీ దండం పెట్టుకుంది రంగమ్మ.

అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నరు. ఆనంద్‌, నరహరి బయటికి నడిచారు.
‘‘ఏందనా! ఈ ముసల్ది ఇట్ల మాట్లాడ్తుంది. ఇంతకు ముందు ఈ ముసల్దానికి, అమ్మకు అస్సలు పడకపోయేది’’
‘‘ఏమోరా, పిలిపించనయితే పిలిపించినం’’
‘’చూస్తుంటే మనకే అడ్డం తిరిగేటట్టు కనిపిస్తుంది’’
‘‘నువ్వన్నట్టే అడ్డం తిరుగతదేమో. చూద్దాం. పిలిపించినంగదా. వాపస్‌ పంపించలేం’’
‘‘ఏంది పెద్దమ్మా. నువ్వు కూడా అట్లనే మాట్లాడ్తవు’’ పెద్దకోడలు.
‘‘నేనేందే అనేది. మీ మావ గురించి అందరూ అనుకుంటున్నదే’’ రంగమ్మ
‘‘మీ అన్న అని కూడా చూడకుండా, పరమాత్ముడు చూస్తుండు అంటవు పెద్దమ్మ’’ చిన్నకోడలు.
‘‘అన్న అయితేందీ, ఎవరైతేందీ. సీతమ్మ కష్టాలు పెట్టిండు. ఉన్నమాట అన్న. ముసల్దాని మీద అనుమానంతోటి మమ్ముల గూడ గడపదొక్కనిచ్చినాడే. ఇగో, పిల్లలు కొంచెం పెద్దగయినంక మమ్ముల రానిచ్చిండు. అరిగోస పెట్టిండు ముసల్దాన్ని’’ అంది రంగమ్మ.

వాళ్లు అట్లా మాట్లాడుకుంటుండగానే కవులమ్మ వచ్చి, ‘‘ఇగో వదినా’’ అంటూ ఉప్మా ప్లేటు చేతికి అందించి, నీళ్ల గ్లాసు కింద పెట్టింది.
‘‘నువ్వు తిన్నవా వొదినా’’ ప్లేటు తీసుకుంటూ అంది రంగమ్మ.
‘‘తిన్లే వదిన. ఇంక బట్టలు గిన వున్నయ్‌’’ కవులమ్మ.
‘‘బట్టలు తర్వాత వుతుకొచ్చు. ఇంత ముద్ద కడుపులబడితే చాతనయితదిగా’’ ముద్ద కళ్లకు అద్దుకుని నోట్లో పెట్టుకుంటూ అంది రంగమ్మ.
‘‘తిని వుతికితే కడుపుల ముద్ద నోట్ల కొస్తది వదిన’’ అని, ‘‘ఛాయ్‌ పెట్టుకొస్త తింటుండు’’ అని లోపలికి పొయింది కవులమ్మ. ఆనంద్‌, నరహరి వచ్చి కూచున్నరు.

‘‘ఏవిరా, సాకల్దాన్ని పెట్టుకోకపొయిన్రురా. ముసల్దానితో ఇంకా గంపెడు పని చేయిస్తున్నరు’’ టిఫిన్‌ తింటూ రంగమ్మ. కోడండ్లు ఇద్దరు పండ్లు కొరుక్కున్నరు లోపల.
‘‘సాకలోళ్లు యాడున్నరక్కా. పని మనిషిని పెట్టుకుంటే అయిదు వందలన్నా అడుగుతరు’’
‘‘అంత సంపాయిస్తున్నరు. మీకు అయిదు వందలో లెక్కనారా? మీయమ్మ వుసురు తాకుద్దిరా’’ అది ప్లేటు కిందపెడుతూ రంగమ్మ. పెళ్లాలవేపు చూసారు. ‘ముసల్లంజె’ నెమ్మదిగా తిట్టింది సుశీల.
‘‘ఏందే సుశీలా, ఏమో అంటున్నవు. సరిగా యిన్పిస్తలేదు’’
‘‘ఆ… ఏంలే పెద్దమ్మా’’ అని ‘‘గొంతు బాగానే గుర్తు పట్టినవ్‌ పెద్దమ్మా’’ సుశీల.
‘‘గొంతుల కేందే బానే గుర్తుపడ్తగని. మాటలే సరిగ యిన్పించవు’’ అని, అల్లుండ్లను వుద్దేశించి ‘‘మీ నాయినకు పెట్టినార్రా టిపినూ’’ అంది రంగమ్మ.
‘‘ఆ… తిన్నడు’’ పెద్దకొడుకు ఆనంద్‌.
ఇందాకట్నుంచి ఎలా మొదలుపెట్టాలా అని ఎదురుచూస్తున్న సందర్భం రావడంతో ‘‘వచ్చి పదైదు రోజులాయె. మొఖంగూడ జూస్తలేదు పెద్దమ్మ’’ పెద్దకోడలు.
‘‘ఇట్లాంటి ఆడిదాన్ని యాడజూల్లేదు పెద్దమ్మ’’ చిన్నకోడలు.
‘‘అందరు ఈమె లెక్కనే వుంటే లోకం బాగుపడినట్టే’’ చిన్న కొడుకు.
‘‘ఇంత కఠినాత్మురాలిని నేనేడ జూడలేదక్కా’’ పెద్దకొడుకు.
ఛాయ్‌ కొరకు పొయ్యిమీద పాలు పెట్టి, పొంగుతయేమో అని పాలలోకి చూస్తూ నిలబడిరది కవులమ్మ. ఎన్నడు మనసులోకి రావద్దని అణచుకున్న ఆలోచనలు ఈ రోజు ముసురుకుంటున్నయి.

చిన్నోడు తల్లిని చూని నవ్వుతూ కాళ్లూ చేతులు ఆడిస్తుండు. ఏవో ఆలోచనల్లో వున్న కవులమ్మ కొడుకు నవ్వును చూడగానే వాన్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తను కూడా నవ్వుతూ వాన్ని ఆడిస్తుంది.
మామూలుగానైతే చీకటిపడే టైముకు ఇంటికి వస్తడు. ఆరోజు ముందే వచ్చిండు. చప్పుడు రావద్దని ఎప్పుడూ తలుపు సందుల్లో నూనె పోస్తుంటడు. తాళం తీసిన చప్పుడుగానీ, తలుపుతీసిన చప్పుడుగానీ కాలేదు. తలుపు తీయడంతోనే ఎపదురుగ్గా మూడో అర్రల నవ్వుకుంట కొడుకును ఆడిస్తున్న కవులమ్మ కనిపించింది. చెప్పులు గబగబా విడిచి, మందుల సంచి కిందపడేసి వచ్చి కవులమ్మను గుద్దుతున్నడు, తంతున్నడు. పసిబిడ్డకు దెబ్బలు తగలకుంట వళ్లో పట్టుకుని వంగికూసుంది. ‘‘లంజె, నేను పోంగనే మిండడు వచ్చినట్టున్నడు. లంజెదాని మిడిసిపాటు సూడు నవ్వుతుంది’’ అని తిట్టుడు, కొట్టుడు.

కవులమ్మ ఒక్కటనలే రెండనలే. అక్కడి నుండి లేవలేదు. తను లేస్తే చంటోడి మీద దెబ్బలు పడ్తయేమో అని భయం.
‘‘లంజెది ఏ మిండనికి గన్నదో వీన్ని’’ గుద్దుకుంటనే. కవులమ్మ ఏమీ మాట్లాడకపోయినా కోపం పెరుగుతది ` ఒక్కమాటను లెక్కచేయదని. మాట్లాడితే ఇంకో రెండు గుద్దులు గుద్దడానికి అవకాశం వుండేది.

కోపంగా తలతిప్పి అసహ్యంతో భర్తవేపు చూసింది. వీడొక పసరం (పశువు) అనుకుంది. ఆ చూపును భరించలేకపోయిండు. ‘‘ఏందే లంజదానా, అట్ల సూస్తవు’’ అంటూ వంటింట్లోకి ఉరకి కత్తిపీట పట్టుకుని ‘‘ఎవనికి పుట్టిండో వీడు. నా కండ్ల ముందల వుండొద్దు’’ అంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంట వస్తుండు.

కవులమ్మ ఒక్క వుదుటున కొడుకుని పత్తుకుని అవతలి అర్రలకు ఉరికిపొయ్యి తలుపేసుకుంది.

పాలు బుస్సున పొంగడంతో ఆలోచనల్లో నుంచి బయటపడింది. కొడుకులు, కోడండ్లు మాట్లాడే మాటలు వంటింట్లోకి వినిపిస్తున్నయి. వాళ్ల తిట్లు, పత్తిపొడుపులు, యేటిపోటీల మాటలు ఈ పదైదు రోజులుగా వింటూనే వుంది. వాళ్ల గొంతులు వినడానికి కూడా ఇష్టపడట్లేదు కవులమ్మ. ‘‘టిఫిన్‌ తిన్నవా వదినా?’’ వంటింట్లో నుండే కేకవేసింది కవులమ్మ.

‘‘ఆ… తీస్కరా వదినా’’ అని గ్లాసులోని నీళ్లు తాగి, మూతి తడుచుకుంటూ నెమ్మదిగా గ్లాసు కింద పెట్టింది రంగమ్మ.
ఛాయ్‌ గ్లాసు ఇచ్చి వెళుతుంటే ‘‘ఇంత ముద్ద తినుపో ఒదినా’’ మళ్లీ అంది రంగమ్మ.
‘‘తర్వాత తింటలే వదినా’’ అని బకెట్‌ నిండా నానబెట్టిన బట్టలు ఉతకడానికి బాయి దగ్గరికి పొయింది కవులమ్మ.

‘‘వంటిల్లంతా ఆమె చేతులనే పెడ్తున్నం. మేమేమన్నా తినొద్దంటున్నమా పెద్దమ్మా’’ అని పెద్దకోడలు అంటుండంగానే,
‘‘ఎవరన్న చూస్తే కొడుకులు అన్నం కూడా సరిగా పెడ్తలేరమ్మ ముసల్దానికి అనుకునేటట్టు మాట్లాడుతుంది చూడక్కా’’ చిన్న కొడుకు అన్నాడు.
‘వంటిల్లంతా చేతుల పెడ్తున్నరంట. మీ అసుమంటి కొడుకులు, కోడండ్లు అందరికి వుంటే లోకం బాగుపడినట్టే. తల్లులు ఉరిబెట్టుకుని సావాల్సిందే. మీ పెండ్లాలను కూసోబెట్టి ముసల్దానితోటి కన్నకష్టం చేయించుకుంటున్నరు బుక్కెడు బువ్వకోసం’ మనసులో అనుకుని, ‘‘మీయమ్మ అట్లని ఎవరితో చెప్పలేదురా. అయినా మీ అమ్మను యేడకన్న పోనిస్తిరారా’’ అని ‘‘చెప్తనేవుండె గదరా తిని వుతికితే నోట్లకొస్తదని’’ అంది రంగమ్మ.
‘దీన్ని ఎందుకన్నా పిలిస్తిమా’ అనుకున్నరు కసిగా మనసులో.
‘‘మేమేమన్నా కాళ్లూ చేతులు కట్టేసినమా పెద్దమ్మా అట్ల మాట్లాడ్తవు. ఆమెనే ఎక్కడికీ పోదుగానీ…’’దీర్ఘాలు తీసింది సుశీల.
‘‘ఎట్ల పోతదే? గుండెకాయకాడ గుండన్న లేదాయె. ఆనాడు మెడల బంతిపూల హారం, చెవులకు జుంకాలు, ముక్కుకు ఇంతింత పెద్ద బేసర్లు, చేతులకు దండకడాలు, నడుముకు వడ్డాణం పెట్టుకుని పార్వద్దేవిలెక్క వుండేది. ఆడపిల్లల పెండ్లిళ్లకు పెట్టగా వున్నాటిని మీరు ఒలుసుకుంటిరి. అషడ, అయ్యి మీ మావ చేపిచ్చినవన్నా కావాయే. ఆమె తల్లిగారు పెట్టినయి. ఏ సుట్టమింటికి పోయినా, పక్కమింటికి పోయినా అడుగుతరని మీ అత్త భయం. ఆడికీ, ఎవరన్నా అడిగినా ‘ముసల్దాన్ని నాకెందుకు నగలు’ అని అంటదిగని మీ మీదికి మాటరానీయదు’’ అంది రంగమ్మ.

‘‘ఏవండీ, టైం పది దాటింది. ఇంకా పెద్ద మనుషులు రావట్లేరు’’ ముసల్దానితో ఏం మాట్లాడినా లాభం లేదనుకుని, మాట మార్చడానికి సుశీల మొగుడితో అంది.
‘‘ఏమో. నేనదే చూస్తున్న తొమ్మిది గంటల వరకు రావాలె’’ చిన్నకొడుకు.
‘‘పెద్దమనుషుల పిలిచి పంచాతి పెడుతున్నార్రా’’ అడిగింది రంగమ్మ. అప్పటివరకు తననొక్కదాన్నె పిలిచి మాట్లాడిపిస్తరేమో అనుకుంటుంది.
‘‘లేకపోతే, మేం చెప్తే వినే మనిషా? ఆమె’’ పెద్దకొడుకు.
ఆ ముసల్ది ప్రతీదీ అడగడం, ఈయన చెప్పడం బాగానే వుంది అని విసుగ్గా ‘‘ఏవండీ, కిరణ్‌గాన్ని పంపించండి’’ అంది పెద్దకోడలు.
‘‘అరేయ్‌, కిరణ్‌’’ ఇంట్లో నుండే కేకేసాడు.
‘‘ఆ… వస్తున్నా డాడీ’’ అని మళ్లీ ఆటలో మునిగిపోయిండు వాడు. ఆదివారం కావడంతో పిల్లలందరూ ఇంటి దగ్గరే వున్నరు. ఈరోజే ఆడుకోవడానికి బయటకు వదిలారు. హాలిడే అయినా గేటు లోపలే ఆడుకోవాలి ఆడుకుంటే. లేదంటే టీవీ ముందర కూచోవాలి. క్రికెట్‌ ఆడుదామంటే మనుషులూ సరిపోరు. పిల్లలు నలుగురే. అందులో చిన్నదానికి సరిగా పరిగెత్తడమే రాదు. గేటు లోపల ప్లేసూ సరిపోదు. ఈ రోజు బయటకు విడవడంతో స్వేచ్ఛ లభించినట్టుగా వుంది పిల్లలకు.

వాడు రాకపోవడంతో ‘‘అరేయ్‌, కిశోర్‌గా’’ గేటు దగ్గరికి వచ్చి గట్టిగా పిలిచాడు కవులమ్మ చిన్నకొడుకు.
‘‘ఏం… డాడీ…’’ అంటూ దగ్గరికి వచ్చాడు.
‘‘కిరణన్న, నువ్వూ వెళ్లి రాఘవులు తాతని, లింగయ్య తాతని, నర్సయ్య తాతనూ పిలుచుకురండి’’
‘‘సరే డాడీ’’
‘‘ఏయ్‌ పింకీ చెల్లెను తీసుకుని ఇంట్లోకి రావే’’ అని లోపలకి వెళ్లిపోయాడు.
బాయి దగ్గర బట్టలుతుకుతున్న కవులమ్మ వింది. ‘అయితె పెద్దమనుషుల్లో పెడుతుండ్రన్నమాట. పెట్టుకోనియ్యి’ అనుకుంది. అట్లా అనుకుందిగానీ ఎందుకో అంతులేని దుఃఖం పొంగుకొచ్చింది. బట్టలను బలంకొద్దీ నేలకేసి బాదటం మొదలుపెట్టింది. కళ్లమ్మట నీళ్లు కారిపోతున్నయి. ఇంత బతుకు బతికింది. ఏనాడూ నలుగురి ఎదుటపడలే. ఈ ముసలితనాన నల్గుర్ల నిలబెడ్తున్నరు నా కడుపున బుట్టిన కొడుకులు. ఏ జన్మల ఏ పాపం చేసుకున్ననో ఈ మొగుడు, ఇటువంటి కొడుకులు నాపాలపడ్డరు. ఈ ఆడిజన్మ ఎందుకిచ్చినవ్‌ భగవంతుడా. ఎన్నో భరించింది తను. ఈనాడు ఈ అవమానాన్ని భరించలేకపోతుంది. అయ్యో భగవంతుడా! నేనీ దుఃఖాన్ని భరించలేను స్వామీ…

అంత దుఃఖంలో ఉన్నపళాన తను మళ్లీ చిన్నపిల్లయితే ఎంత బాగుండు. ఏ కష్టమూ తెలియని, ఏ బాధలూ తెలియని ఆ చిన్నతనం మళ్లా వస్తే అనిపించింది. తన తండ్రితోపాటు గుర్రం మీద పోతూ, తండ్రి ముచ్చట చెప్తుంటే సంతోషంతో కేరింతలు కొట్టాలనిపించింది. తనకు చిన్నతనంలో బాగా గుర్తున్న సంఘటన అది. తండ్రి తనను ముందర కూచోబెట్టుకుని, ఒక చేత్తో తనని పట్టుకుని జనాలు కలిసి దండం పెడ్తుంటే వాళ్లను పలకరించడం కోసం గుర్రం ఆపడం, గుర్రం అడుగులేస్తుంటే దాని శరీరంతోపాటు తనూ వూగడం. అలా వూగుతూ వుంటే తనకు ప్రపంచాన్ని జయించినట్టుగా ఎంత సంతోషంగా వుండేదో ఆనాడు. ఏనాడైతే వీనితో పెళ్లయిందో ఆనాటితో తన నవ్వు మాయమైపోయింది. తను నవ్వి ఎన్నాళ్లయిందో. తను నవ్వు మర్చిపోయిందేమో. తన తండ్రి సచ్చి ఏ లోకాన వుండో. ఇప్పుడు నన్ను చూసి ఏమనుకుంటుండో. తన దగ్గరికన్నా పిలిపించుకుంటలేడు నన్ను  అనుకుంది.

దుఃఖం పొర్లిపొర్లి వచ్చింది. కొంగు నోట్లో కుక్కుకుంది. కడుపుల దుఃఖాన్ని తమాయించుకోడానికి బట్టలను దమీ దిమీ బాదుతా వుంది. కవులమ్మకు ఎందుకోగానీ ఇతర్ల ముందు తను ఏడవడం ఇష్టం వుండదు.

‘‘నాయినమ్మా కాళ్లు కడగవా’’ చెల్లెను పట్టుకుని ఐదేండ్ల పింకి నిలబడ్డది.
కళ్లు తుడుచుకుని, ముక్కుల నీళ్లు చీది మనమరాళ్ల కాళ్లు కడిగింది. అయినా కండ్ల నుంచి నీళ్లు కారుతనే వున్నయి.
‘‘నాయినమ్మ, ఏత్తున్నావెందుకు’’ అడిగింది చిన్నది.
మనమరాలినిఎత్తుకుని ముద్దు పెట్టుకుంది. ‘‘లేదమ్మా సబ్బునీళ్లు కంట్లపడ్డయి’’ అని కింద విడిచి పెడితే పిల్లలు ఇంట్లోకి వెళ్లారు.
‘‘మమ్మీ’’ అంటూ పిల్లలిద్దరూ ఎవరి తల్లి దగ్గరికి   వాళ్లు పోయారు. ఎత్తుకుని ముద్దు పెట్టుకుని వళ్లో కూచోపెట్టుకుంది చిన్నదాన్ని సుశీల.
తెల్లగా ముగ్గుబుట్టోదిగా వున్న జుట్టుతో పొట్టిగ, తెల్లగ, ముడతలుపడ్డ శరీరంతో రెప్పలు టపటప కొట్టుకుంటూ కుర్చీలో కూచున్న ముసలమ్మవేపు కొద్దిసేపు చూసి ‘‘ఎవరు మమ్మీ, ఈమే’’ అంది పింకి.
‘‘అమ్మమ్మ నాన్నా. నువ్వు చిన్నగా వున్నప్పుడు వచ్చింది’’ అని భాగ్య కూతురుకు చెప్పింది.
‘‘ఎవరే భాగ్యమ్మ? నీ బిడ్డనా’’ అడిగింది రంగమ్మ.
‘‘అవును పెద్దమ్మ’’
‘‘ఎన్నో ఏడో దానికి’’
‘‘ఆరో ఏడు’’
‘‘ఏం పేరే? బుజ్జిపేరు’’
‘‘పింకీ’’ అంది పింకీ రంగమ్మనే చూస్తూ.
‘‘అదేం పేరురా, కుక్కపిల్లకు లెక్క’’
‘‘లేదక్క, ముద్దుగా అట్లా పిలుస్తాం. అసలు పేరు ఉష’’ పెద్దకొడుకు.
‘‘ఉసనా… ఏం పేర్లో ఏమో నాయినా’’
అబ్బ! ఈ ముసల్దాన్ని ఎందుకు పిలిచామా తలపట్టుకున్నారు. ‘‘తొందరగా పంచాయితీ అయితే వెంటనే బస్సు ఎక్కించి రావచ్చు’’
‘‘అమ్మో! ఈ ముసల్దా అక్కా పొయ్యేది. నేనియ్యాళ పోలేనమ్మా అంటది. ఏదన్న చీరకొని, బస్సు ఛార్జీలు ఇస్తేగానీ రేపైనా కదలదు’’. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ గుసగుసగా మాట్లాడుకుంటున్నరు.
‘‘ఎవరెవరిని పిలుస్తున్నర్రా’’ అడిగింది రంగమ్మ. చెప్పాడు నరహరి.
‘‘అన్నను మందలించి వస్త. తీస్కపోతావురా నరహరీ’’ అంది రంగమ్మ.
ఈ ముసల్దానికి కడుపుల ఇంత పడితేగానీ అన్న గుర్తుకు రాలేదు. తిట్టుకున్నరు కోడండ్లు.
‘‘పా… అక్కా’’ అని లేచిండు నరహరి. వాళ్లు బయటికి రావడమూ, రూమువేపు పోవడమూ చూసిన కవులమ్మ బట్టలు గబగబా ఆరేసి ఇంట్లోకి వెళ్లింది.
‘‘ఎవరూ’’ కట్టె పట్టుకుని మంచంలో కూచున్న మనిషి దర్వాజ వేపు చూస్తూ కండ్లు మిటకరిస్తూ అడిగిండు.
‘‘బాగున్నవా అన్నా’’ అంటూ లోపలికి పొయింది రంగమ్మ. నరహరి రంగమ్మను వదిలి ఇంట్లోకి పొయ్యిండు.
‘‘నువ్వా రంగమ్మా. బాగున్నవా? ఎప్పుడొచ్చినవు’’
‘‘ఆ బానే వున్నన్న. ఇందాకనే వచ్చిన’’ తడుముకుంటు అన్న పక్కనే మంచం మీద కూచుంది.
‘‘పిల్లలు, మనుమలు, మనుమరాండ్లు బాగున్నరా’’
‘‘ఆళ్లకేందన్న, బానే వున్నరు. ఎవరి సంసారాలు ఆళ్లయి’’
‘‘కవులి బాయి దగ్గరనే వుందా’’ గుసగుసగా అడిగిండు ముసలోడు.
‘‘ఏమో అన్న. నాకు కండ్లు మసకలు. సరిగా కనిపించవు’’ అని ‘‘భాగ్యమ్మ… ఓ భాగ్యమ్మా’’ అని కేకేసింది రంగమ్మ.
‘‘ఏమైంది రంగమ్మా’’ ముసలాయన.
‘‘చీకటితోటి బస్సెక్కినన్న. వచ్చిన కాన్నుంచి మాటలయినవి. కడుపుల నొప్పి లేస్తుంది’’ రంగమ్మ.
‘‘ఈ ముసల్దాన్ని పనిలేక పిలిపించిండ్రు’’ అని విసుక్కుంటూ వెళ్లి ‘‘ఏంది పెద్దమ్మ? పిలిచినవు’’ అంది దర్వాజ బయటే నిలబడి.
‘‘దొడ్డికొస్తుందే’’ రంగమ్మ.
‘‘రా’’ అని బయటే నిలబడి పిలిచింది.
కవులమ్మ వంటింట్లోకి వెళ్లి, బియ్యం కడుగుదామని డబ్బా దగ్గరికి పొయ్యింది. ఎన్ని కడగాల్నో ఎవరెవరెవరు వస్తరో తెలియదు. కోడండ్లు ఇంకా చెప్పలేదు. అందుకని బీరకాయలు ముందేసుకుని కూచుంది. తనని ఆలోచనలు వదిలేటట్టులేవు.

తెల్లారే లోపల్నే ముగ్గువెయ్యాలి. అందుకే కవులమ్మ వాకిలి వూడ్చి, ముగ్గు వేస్తుంది. కవులమ్మ ముగ్గు వేస్తున్నంతసేపు పండ్లపుల్లతో పండ్లు తోముకుంటూ అక్కడే నిలబడ్డడు. కవులమ్మకు రోజూ ఇదో నరకం. తను ముగ్గు వేసేటప్పుడు పొరపాటున ఎవరన్న మొగమనిషి అటునుండి పొయిండూ అంటే ‘‘లంజె మిండడు పొద్దున్నె సూడడానికి వచ్చిండా’’ అని గుద్దులు. వీని బుద్ధి తెలుసు గనక ఆ బజారున ఉదయంపూట ఎవరూ పోరు.

కవులమ్మ ముగ్గువేసి లోపలికి రాంగనే పాటకికి (గేటుకు) తాళం వేసి, కవులమ్మ వెనకాలే వచ్చిండు. పిలగాడు లేచి ఏడుస్తా వున్నడు. పాపం. పెద్దోడు వాని పక్కనే వున్నడు వాన్ని వూకిస్తూ. తమ్ముడు ఏడుస్తుండడంతో వానికి ఏంతోచక వాడూ ఏడుస్తుండు. వానికి రెండో ఏడు పడేనాటికి వీడు పుట్టిండు. కవులమ్మకు గబుక్కున వురికి కొడుకుని అందుకోవాలనిపించింది. అట్లా ఉరకిందంటే ఏమన్న వుందా? గబగబా నడిస్తేనే తన్నులు తప్పవు. మనసులో పంత ఆతృతగా వున్నా ముగ్గుబుట్టని గూట్లె పెట్టి పొయ్యి, కొడుకుని వొళ్లోకి తీసుకుని పాలిచ్చింది.

‘‘ఇందాకట్నుంచి పిలుస్తున్నమ్మ’’ అన్నడు వాడు వచ్చీరాని మాటలతో.
‘‘మా నాయినే’’ అని ముద్దు పెట్టుకుని ‘‘నాకు ఇన్పించలేదు నాన్నా’’ అంది. ఆలస్యం అయితే తిడతడని కొడుకుని పండుకోబెట్టి ‘‘తమ్మున్ని చూస్తుండు నాయిన’’ అని చెప్పి వెళ్లి గిన్నెలు కడిగి, పొయ్యి అంటించింది. అన్నం కొంచెం పలుకయినా, కొంచెం మెత్తగయినా, కూరలో కొంచెం ఉప్పు పక్కువయినా, తక్కువయినా తన్నులు గుద్దులు తప్పవు. వళ్లు దగ్గర పెట్టుకుని తొందర తొందరగా వంట చేసింది. అన్నం తింటున్నంతసేపు ఎదురుగా నిలబడి ఏది కావలిస్తే అది అడగకుండానే చూసి వేసింది. సద్దిల అన్నం గట్టి సంచిలో పెట్టి బల్లెపీట మీద పెట్టింది.

కొన్ని వేర్లు, నూరిన మందు పొడులు, చూర్ణాలు, కొన్ని గుళికలున్న సీసాలు అంతకు ముందే వున్న మందుల సంచీలో వేసుకుని, సద్ది సంచి తీసుకుని బయటికి పొయ్యిండు. కవులమ్మ కొడుకు దగ్గరికి పొయ్యింది. బయటి నుంచి తలుపుకు తాళం వేసి, పాటకికి కూడా తాళం వేసుకుని వైద్యం చేయడానికి పక్కవూరికి పొయ్యిండు.

సంటిపిల్లతల్లి కావడంతో బాగ ఆకలి అయితుంటే కొడుకును అడ్డాలమీద పండుకోబెట్టుకుని పాలిస్తూ అన్నం తింటుంది. పెద్దోనికి తట్లె అన్నం పెట్టింది. వాడు కూడా తింటుండు.
పొయినట్టు పొయ్యి తలుపు సప్పుడు కాకుంట తాళం తీసుకుని లోపలికి వచ్చిండు. వచ్చేసరికి గబగబా అన్నం తింటూ కవులమ్మ కనిపించింది.  అంతే ‘‘లంజె, మొగడు ఎప్పుడెప్పుడు బయటపడతడా అని ఎదురుచూస్తది. దొంగ కుక్కలెక్కఎట్ల తింటుందో చూడు’’ అని అన్నం తింటున్నదాన్ని అట్లనే వంగబెట్టి గుద్దడం మొదలుపెట్టిండు.
కవులమ్మ తన్నులు తినడంతప్ప ఎదురు చెప్పడం ఏనాడో మానేసింది. చిన్నోడు బిక్కమొఖం వేసుకుని ఏడుస్తుండు. వాడు అచ్చం అతని పోలికే. నోట్ల నుంచి ఊడిపడ్డట్టు వుంటడు. ఏడుస్తున్న వాన్ని ఒక్కటి వేసిండు.
కవులమ్మ ఇదే సందని లేద్దామని కొడుకుని గట్టిగ పట్టుకుని లేస్తుంది. ‘‘లంజె, నేను ఈడ మాట్లాడుతుంటె ఏడికి పోతున్నవ్‌’’ అంటూ చేతిల వున్న పిలగాన్ని గుంజుకోబోయిండు. కవులమ్మ కొడుకుని గట్టిగ పట్టుకుని గుంజుకోవడానికి ఆయితి కానియ్యకుండ గోడకు మొఖం చేసి బిగదీసుకుని నిలబడింది.

‘‘ఏందొదినా గోడకు ఆనుకుని నిలబడ్డవు’’ అంటూ కర్ర పొడుసుకుంట రంగమ్మ వంటింట్లకు వచ్చింది. రంగమ్మ పలకరింపుతో తిరిగి చూసింది. చేతిల బీరకాయ వుంది. మళ్లీ వచ్చి కూచుని కూరగాయలు కోస్తూ, ‘నాయినా నన్నెందుకు గన్నవే’ అనుకుంది మనసులో. ఇంకా అందులో నుండి తేరుకోలేదు.

‘‘ఏందొదిన బీరకాయ పట్టుకుని గోడకు మొఖం పెట్టి నిలబడ్డవు’’ అంది రంగమ్మ. అయినా కవులమ్మ సమాధానం చెప్పలేదు. అసలు వినలేదు కవులమ్మ.
కవులమ్మ ఏమీ మాట్లాడకపోయేసరికి ‘పాపం, ఈ వయసులో నల్గుర్ల నిలబెడుతున్నరు కొడుకులు. పంత బాధపడుతుందో మనసులో’ అనుకుని ‘‘అన్నం తిన్నవా వదినా’’ అని కొంచెం గట్టిగా మళ్లీ పలకరించింది రంగమ్మ.

‘‘ఆ… ఆ… తినలే వదిన. వంట అయితే తింట’’ అంటూ లేచి వంటింట్లో అటక మీది సామాన్లు తీయడానికి వున్న స్టూలును రంగమ్మవేపు తెచ్చి పెట్టింది కూచొమ్మని.
స్టూలు మీద కూసుంట ‘‘రెండు పూటలే తిండి తిని కొడుకులకు మిగులుస్తున్నవా వొదినా’’ అంది రంగమ్మ.

‘‘చాన్నాళ్ల నుండి అలవాటయిందొదిన’’ అంది కూరగాయలు కోసుకుంట.
‘‘పెద్దమ్మా, ఈడున్నవా? రాఘవులు పెదనాయినోళ్లు వచ్చిండ్రు’’ అంటూ పెద్దకోడలు వచ్చింది.
‘‘వస్తున్న పావే’’ అని ‘‘మళ్ల జల్మల పుడ్తె ఆడపుట్టుక పుట్టొద్దొదినా’’ అని లేచింది రంగమ్మ.
కవులమ్మ మారుమాట్లాడలే.

‘‘ఏమయ్యా రాఘవులు, సీసాలెత్తి తాగుతున్నరు. మీ అల్లుళ్లు రాంగనే బానే మర్యాద చేస్తున్నట్టుంది’’ గోడ పట్టుకుని నెమ్మదిగా వస్తూ అంది రంగమ్మ.
‘‘కూల్‌డ్రిరక్స్‌ అక్క మందు గాదు’’  రంగమ్మకు ఎదురువెళ్లి చెయ్యి అందిస్తూ అన్నడు పెద్దకొడుకు.
‘‘ఊకనే అన్నలేరా. మందైతే వాసనరాదూ’’ అంది రంగమ్మ.

బాగున్నవా అక్కా, బాగున్నవా వదినా అలి పలకరించారు వచ్చిన పెద్దమనుషులు.
కుర్చీలో కూలబడుతూ ‘‘ఆ.. బానే వున్ననయ్య ఇప్పటికీ. ముందు ముందు ఎట్లుంటదో. ఆ పరమాత్ముని దయ’’ రంగమ్మ.

కవులమ్మ కూరగాయలు కోసి, పొయ్యిమీద వేసింది. కూర కలియబెడుతూ నిలబడింది. ఎన్నడూ గతాన్ని గుర్తు చేసుకోదు కవులమ్మ. గతం అంటే అతనే కాబట్టి అతను తన వూహలో కూడా రాకుండా చూసుకునేది. అలాంటిది ఇయ్యాళ ఎడతెగని జ్ఞాపకాలు.

పెద్దోడు ఆనందు పదో తరగతిల చేరిండు. చేరిన రెండో రోజే ఒకటే జరం, వాంతులు. జిస్టి గిన తగిలిందేమో అని జిస్టి తీసింది. అయినా తగ్గలేదు. పదిరోజులాయె మంచంపట్టి, ఏ మందులు వాడినా జరం తగ్గుతలేదు. ఏం తింటలేడు. తాగుతలేడు. ఒకటే వాంతులు. మంచం మీద పడుకున్న కొడుకును లేపి, తలను తనకు ఆనించుకుని సల్లపోసి అన్నం పిసికి పడేసి, గుజ్జును తాపుతుంది. చిన్నోడు, ఇద్దరు ఆడపిల్లలు బడికి పొయిండ్రు. మధ్యాహ్నం అన్నానికి ఇంక రాలేదు.

పిల్లలు పెద్దగయిన కాన్నుంచి తలుపులకు తాళాలేసుడు బందు పెట్టిండు. కొట్టుడు కూడా తగ్గింది. పిల్లలు కూడా ఎదురు తిరుగుతుండ్రు. కానీ ఊర్లనే వైద్యం చేస్తుండు. ఏ వూరుకీ పోతలేడు.
ఒచ్చుడు ఒచ్చుడే చెప్పులు యిడిసి సుట్టు చూస్తుండు ` ఏమన్న దొరుకుతదా అని. కవులమ్మ గుండెల రాయిపడింది. కని, ఆనందు సల్ల తాగుతుండని మంచంమీద కూసుని అట్లనే తాపుతుంది.

ఆ అర్రల చేతికి ఏం దొరకలే. కవులమ్మ రెక్కపట్టి గుంజిండు పండ్లు కొరుక్కుంట. ఆనందు అట్లనే పల్లెల్కల దబీమని పడ్డడు. కవులమ్మ చేతిల పల్లెం కింద పడింది.
‘‘రంకు లంజె. ఎన్నాండ్ల సంది మరిగినవే’’ అని సిగెంటికలు పట్టి వంగబెట్టి గుద్దుతుండు. ఇడిపించుకో ఆయితి గాట్లేదు.
తండ్రి తల్లిని కొడ్తుంటే అప్పుడప్పుడు చూస్తనే వుండు. ఒకటి రెండుసార్లు తండ్రితో గొడవ కూడా అయింది. కని, ఇప్పుడు ఎందుకు కొడుతున్నడో ఏం అర్ధం కాలే. ఆనికి మొన్ననే పద్నాలుగు వెళ్లి పదిహేను పడ్డయి.

‘‘నీతీ, జాతీలేని ముండాకొడుకువి నువ్వు. నీ లెక్క అందరనుకోకు’’ తన్నులు తింటూనే విపరీతమైన కోపంతో అంది కవులమ్మ.
‘‘హమ్మా లంజె.. ఎదురు తిరగనేర్చినవా. ఆన్ని చూసుకునేనా నీకింత పొగరుబట్టిందీ’’
తుపుక్కున మొఖంమీద ఊసింది కవులమ్మ. బండబూతులు తిడుతూ తన కసి తీరిందాంక కొట్టి బయటపడ్డడు.
పిల్లలు బడి నుండి ఇంక రాలేదు. ఆయన బయటపడంగనే ‘‘కొడుకా, నేను అమ్మమ్మోళ్లింటికి పోతున్నరా. తమ్మున్ని, చెల్లెల్లను జర కనిపెట్టుకునుండు నాయిన’’ అని చెప్పి తల్లిగారింటికి పోయింది.

చీకటి పడుతుండగా ఇంటికొచ్చిండు. పిల్లలు ఏడ్చుకుంట కూసున్నరు. విషయం అర్ధమైంది. అమ్మో ఎదురుతిరగ నేర్చింది. ఊకున్నమంటే ఏకు మేకైతది. బిడ్డ పోనియ్యి, ఎన్ని రోజులు పోతదో. చూస్త అనుకున్నడు.
ఇరవై ఏండ్లకు మళ్లా ఈ వూరు మొఖం చూస్తుంది తను. తల్లి సచ్చిపొయ్యి రెండు మూడేండ్లాయె. తల్లి సచ్చినప్పుడూ పంపియ్యలేదు. తనూ పోతానని అడగలేదు. ఏమో, తల్లి శవాన్ని కూడా చూడాలనిపించలేదు తనకి. పెద్దమనిషి అయ్యి ఇంట్లకు రాంగనే కవులమ్మను తన ఇంటికి తీసుకొచ్చుకుండు. తను ఏనాడైతే ఆనింట్లకి పొయ్యిందో, మళ్లా ఈనాడే తల్లిగారింట్ల కాలు పెడ్తుంది.

వైద్యం చేయడానికి ఆ వూరికి వచ్చేటోడు. కవులమ్మోళ్లకు దూరం సుట్టం కూడా. కవులమ్మోళ్ల ఇంట్లనే వుండి వైద్యం చేసేటోడు. పొద్దున వచ్చేటోడు. సాయంత్రానికి వెళ్లిపోయేటోడు. ఆయన చెయ్యి పడితె రోగం మాయమైతదని జనం నమ్మకం. మంచి వైద్యుడు. అట్లా కవులమ్మకు ఐదేండ్లునన్నప్పుడు పెండ్లి అయింది. ఆయనకి ముప్పై యేండ్లు దాటే వుంటయి అప్పటికి.

కవులమ్మను పెళ్లి చేసుకునేనాటికి ఆయనకి పెళ్లి అయ్యి భార్య సచ్చిపోయింది. నీళ్లు చేదడానికి పొయ్యి కాలుజారి బాయిలపడ్డదని ఈన చెప్పిండు. ఆడు పెట్టే బాధలకే బాయిల దుంకిందని జనం అనుకున్నరు. ఓ పిలగాడు కూడా వుండె. తల్లి సచ్చినంక పాలిచ్చేటోళ్లు, సాకేటోళ్లు లేక పిలగాడుకూడా సచ్చిపోయిండు.
రెండు నెల్లాయె. మూడు నెల్లాయె. తీసుకపోను రాట్లేడు. కవులమ్మ తండ్రి తోలొస్తనన్నడు. కవులమ్మ పోనంది. పిల్లలున్నరని సముదాయించి కవులమ్మను యెంటబెట్టుకుని అల్లుని గడప తొక్కిండు పొద్దున పదిగంటలకల్లా. అంతకుముందు బిడ్డను పండగకు తోలియ్యమని ఒకసారి, తొలిసారి ‘నీళ్లు’ పోసుకుందని తోలుకపోవడానికోసారి వచ్చిండు. కని, తోలలే. అత్తనే పిలిపించుకుండు. కవులమ్మ తండ్రి మళ్లా ఈ ఇంట్ల అడుగు పెట్టడం ఇదే.

అల్లుడు ఇంట్లనే వుండు. తండ్రి వెనకాలే కవులమ్మ వచ్చింది. ముందల అర్రల బల్లెపీట మీద కూసుని చూర్ణాలు పొట్లం కడుతుండు. వీళ్లు వచ్చింది గమనించి కూడా వీళ్లవేపు సూల్లె. అల్లుడు పలకరిస్తడేమోనని కొద్దిసేపు చూసిండు. పలకరించకపోయేసరి ‘ఆడపిల్ల తండ్రిని తనకు తప్పదుగా’ అనుకుండు. బల్లెపీట మీద తనూ ఓ పక్కకు కూసుండు. ఇంట్లకు పొమ్మని బిడ్డకు సైగ చేసిండు. కవులమ్మ సంచి పట్టుకుని ఇంట్లకు పోతుంటె, నా ఇంట్ల వుండొద్దని గొడవ పెట్టుకుండు. ఎంత బతిమిలాడినా, సముదాయించినా వినకపోయేసరికి కవులమ్మ తండ్రి కూడా కోపానికి వచ్చిండు. మాటా మాటా పెరిగింది.

‘‘నీకు, దానికి ఏ సంబంధం లేకపోతే నీ ఇంటికి వచ్చిన్నాడే తీసుకొచ్చి తోలిపోయేటోడివి. తీసుకపోయ్యి నువ్వే వుంచుకో’’ అన్నడు కవులమ్మ మొగుడు కవులమ్మతండ్రిని.
నలుగురికి చెప్పినోడు తప్పితే, ఇంకొకరితో ఎన్నడూ మాట పడలేదు. అట్లాండిది అల్లుడు గడ్డితిన్నలెక్క మాట్లాడుతుంటే తట్టుకోలేకపొయిండు.

‘‘తూ. నీ బతుకు పాడుగాను. మనిషి జన్మ ఎత్తగానే సరిపోదు. ఇంత బుద్ధిజ్ఞానం వుండాలి. పా. ఏ పెద్దమనిషి దగ్గరికి పోదామంటవో పా. నీ గురించి తెల్వనిది ఎవనికో.’’ విపరీతమైన కోపంతో వూగిపోతూ ఇక మాటలు రాక ఆగిపొయిండు కవులమ్మతండ్రి.

కవులమ్మతండ్రి ఎన్నడు కూడా బిడ్డను ఎన్ని కష్టాలు పెట్టినా,ఎందుకు ఇట్ల చేస్తున్నవు అని అడిగి ఎరగడు. అట్లాంటిది అల్లుడు ఇయ్యాళ అంతమాట అనేసరికి మనిషి కోపంతో వణికిపోయిండు. పెద్దమనుషుల్ల పెడితె తనమీద ఊస్తరని తెలుసు కవులమ్మమొగనికి. అందుకె సప్పుడు చెయ్యలె.

ఎట్ల తిట్టాలి వీన్ని. గొడ్డుకైతె ఒక దెబ్బేసి చెప్పొచ్చు. మనిషికి అయితె ఓ మాట చెప్పొచ్చు. వీడు ఆ రెండు కాదాయెనె. కవులమ్మ తను ఈ లోకంలో వుందో లేదో కూడ తెల్వదు. చేతిల సంచి పట్టుకుని, గోడకు ఆనుకుని ఎటో చూస్తూ అట్లనే నిలబడ్డది. కవులమ్మతండ్రికి ఒక్క క్షణం అక్కడ వుండబుద్ధికాలేదు. లేచిండు. గోడకు ఆనుకుని నిలబడ్డ కవులమ్మ దగ్గరికి పొయ్యి రెండుకాళ్లు పట్టుకుండు.
‘‘నాయినా’’ అని పక్కకు జరిగింది కవులమ్మ గోడుగోడున ఏడుసుకుంట.

‘‘భూదేవికున్నంత ఓపిక ఎట్లొచ్చింది బిడ్డ నీకు. ఎట్ల భరిస్తున్నవమ్మ ఈ నరకాన్ని’’ అని భుజం మీద కండువాతోటి కండ్లు తుడుసుకుని ‘‘పిల్లలు జాగ్రత్తమ్మ’’ అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుంట చెప్పులేసుకుని వెళ్లిపోయిండు కవులమ్మతండ్రి.

పిల్లలు బడినుంచి వచ్చేవరకు కవులమ్మకు సోయేలేదు. మొగడు ఎప్పుడు బయటపడ్డడో తెల్వదు.
పెద్దమనుషులు కూల్‌డ్రిరక్స్‌ తాగుడు, సరదా కబుర్లు అయిపోయినయి. ‘‘మరి మీ అమ్మను కూడా పిలవండిరా’’ అన్నడు పెద్దమనిషి.
‘‘అమ్మా’’ కేకేసిండు చిన్నకొడుకు.
యాంత్రికంగా కూర కలియబెడుతున్నదల్లా ఆలోచనల్లోంచి బయటపడి ఒకసారి కేక వినవచ్చినవేపు చూసింది. తల్లి పలకదని ఆ కొడుకులకు తెలుసు.
‘‘మీ నాయన్ని కూడా పిలిస్తరా’’ పెద్దమనుషులు.
‘‘ఆయన్ని పిలిస్తె ఈమె అస్సలు రాదు’’ పెద్దకొడుకు.
స్టౌ సిమ్‌లో పెట్టి వచ్చి దర్వాజకు ఆనుకుని నిలబడింది కవులమ్మ ‘‘కూసో అక్కా’’ అన్నడు ఒక పెద్దమనిషి.
‘‘పర్వాలేదు’’ అని అట్లనే నిలబడింది.
వ్హూ… వ్హూ… అని కొంచెం దగ్గి గొంతు సవరించుకుండు పెద్దమనిషి.
‘‘నాయిన వచ్చిఎన్ని రోజులైతుందిరా’’ తెలిసినా తెలియనట్టే అడిగిండు రాఘవులు అనే పెద్దమనిషి.
‘‘పదైదు రోజులయితుంది మావా’’ పెద్దకొడుకు.
‘‘ఒదినా, నువ్వు మాకంటె పెద్దదానివి. నీకు తెల్వందేముంది. ముసలోని ఆంకల్ల పోతలేవట’’ పెద్దమనిషి.
కవులమ్మ తల నేలకేసి అట్లనే నిలబడిరది. ఒక్కటనలే. రె,డనలే. తల్లి అలా మౌనంగా వుండడంతో కొడుకులకు ఇంకా కోపం పెరుగుతుంది. ఎంత మొత్తుకున్నా అట్లనే సడీ సప్పుడు చెయ్యదు. అసలు చెప్తున్నది వింటుందో లేదో తెలియదు. తను ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తది.

‘‘మొకమన్న జూస్తలే పెదనాయిన’’ చిన్నకొడుకు పెదనాయిన వరుసైన పెద్దమనిషితో.
‘‘మొఖం జూడకపోతే పాయె. ఎడం చేత్తో పచ్చి మంచినీళ్లన్న ఇస్తలేదే మావ’’ పెద్దకోడలు.
‘‘ఈమె మొగని సంగతి ఈమెకె పట్టిలేకపోతే మాకేం గర్జు పట్టిందా?’’ చిన్నకోడలు.
‘‘ఎంత మొత్తుకున్న ఇట్లనే సప్పుడు చెయ్యదు పెదనాయిన’’ పెద్దకొడుకు.
‘‘ఇగో ఆకరికి పోరగాండ్లు పొయ్యి టిఫిన్‌ ఇచ్చొస్తున్నరు’’ పెద్దకోడలు.
‘‘మీకేమయ్యిందే? మీరు ఇచ్చి రావచ్చు గదనె’’ అంది రంగమ్మ.
‘‘మాకేం కర్మ. ఏదో ఇక మాకు తప్పదు కాబట్టి ఇంట్ల వుంచుకుంటున్నం’’ చిన్నకోడలు.
‘‘ఆమెకు పట్టి లేకున్నా రేపు కొడుకులననరా? సూడమ్మ తండ్రికి ఇంత కూడన్న యేస్తలేరని’’ చిన్నకొడుకు.
‘‘మేం వుద్యోగాలకి పోతే ఇంట్ల వుండేది కోడండ్లే గద. ముసలోన్ని ఉచ్చకు గూడ తీస్కపోవాల్నాయె. ఆయన పిలిస్తె ఎవరు పోతరు. చేసుకున్న తనే దగ్గరికి పోదాయె. మొన్నోసారి ముసలోడు పిలిచి పిలిచి రూముల మూత్రం పోసుకునె’’ పెద్దకొడుకు.
‘‘ఇంత మొండిముండని యాడ సూడలే’’ కసినంతా వెళ్లగక్కింది చిన్నకోడలు.
‘‘ఆ…. ఆ… భాగ్యమ్మ. అట్లనకు. నీకంటె పెద్దది’’ పెద్దమనిషి.
‘‘ఏం పెద్దది మావ. ఆడు వుచ్చపోస్తె, ఇగో ఈ కొడుకులు వుద్యోగాల నుంచి వచ్చినాక బట్టలు మార్చిరి. రూమంతా కంపు కంపు. రూము కడగదాయె. ఆఖరికి నేను, సుశీల పొయ్యి కడిగితిమి’’ పెద్దకోడలు.
‘‘ముసలోని అంటు సొంటు పడదాయె’’ చిన్నకొడుకు.
‘‘ఇగో పెదనాయిన ఇట్ల ఎన్ని అన్నా మూగి దయ్యం లెక్క నిలబడ్తది’’ అంది చిన్నకోడలు.
అందరూ అంటున్నవి వింటూ కవులమ్మ అట్లనే నిలబడిరది.
‘‘కాదొదినా మొగుడు పెళ్లాలన్నాంక కొట్టుకుంటరు తిట్టుకుంటరు. మళ్లా కలిసుంటరు’’ పెద్దమనిషి మాట పూర్తికాకముందే, తలయెత్తి ఒకసారి అంటున్న పెద్దమనిషివేపు చూసింది కవులమ్మ ` వాడు మొగుడా అన్నట్టుగా.
‘‘అదేమో మంచిగున్నన్ని రోజులు వాడుకునే. ఈ పదైదు ఏండ్లసంది వైద్యం చేస్తే వచ్చిన డబ్బులన్ని తీసుకునె. కండ్లు కనిపియ్యకపొయేసరికి ఒదిలేసిపాయె. మరి ఏం చేస్తం?’’
‘‘పెద్దదానివి పిల్లలు గలదానివి. ఫలానాయన పెండ్లంఎవరంటె నీ పేరు చెప్తరుగని, దాని పేరు చెప్తరా’’
‘‘మొగోడన్నంక సవాలక్ష తప్పులు చేస్తడు. ఆడదే సర్దుకుపోవాలి’’ అని పెద్దమనుషులు తలా ఓ మాట అన్నరు. అయినా కవులమ్మ సడీసప్పుడు చేయలేదు.
‘‘పెదనాయిన ఈమెనే తన్నులూ గుద్దులూ తిన్నట్టు చెప్తది. లోకంల ఎవరు తన్నులు తిననట్టు’’ పెద్దకోడలు.
‘‘వర్లి వర్లి వాడే పాయె, వండక తిని నేనే పోతిని’ అన్నట్టు వుంటది మావ. మనం ఎన్ని అన్నా బేఫికరుగ తింటది, వుంటది’’ చిన్నకోడలు. ఆగుమన్నట్టు కోడండ్లవేపు కండ్లతోనే సైగచేసి ‘‘ఇక జరిగినయన్ని జరిగిపోయినయి. పాతవి తవ్వుకుంట కూసుంటె ఎట్లక్క’’ పెద్దమనిషి.
‘‘ఆళ్లా కోడండ్లేనాయె. ఉచ్చకు, దొడ్డికి తీస్కపోలేరు. నీ కొడుకులా వుద్యోగస్తులు. నీ కడుపుల ఎన్నన్నా వుండనియ్యి నువ్వే చూసుకోవాలి’’ తేల్చి చెప్పాడు పెద్దమనిషి.
కవులమ్మ చప్పుడు చెయ్యలేదు.
‘‘మరి ఇక మేం పోతమురా’’ అన్నరు పెద్దమనుషులు కొద్దిసేపు చూసి.
‘‘అయ్యో అప్పుడే పోతున్నరు. పంచాతి తెగకముందే’’ అన్నరు కొడుకులు, కోడండ్లు కంగారుగా.
‘‘సప్పుడు చేస్తలేదు. ఒప్పుకున్నట్టేగా’’ పెద్దమనుషులు.
‘‘అట్లగాదు ఈమె సప్పుడు చేస్తలేదంటె చెయ్యదని అర్ధం’’ కోడండ్లు.
‘‘పంచాయితీ తెగ్గొట్టి పోండి’’ కొడుకులు.
‘‘ఏం వదినా సప్పుడు చెయ్యవు’’ లేచినవాళ్లు కూచుంటూ.
అయినా కవులమ్మ నుండి సమాధానం లేదు.
‘‘ఏం రంగమ్మ, నువ్వేమంటవు?’’ పెద్దమనుషులు.
‘‘నేను అనేదేముంది అన్నా, ఒదిన ఏమన్న చిన్నపిల్లా’’ రంగమ్మ.
పెద్దమనుషులకు కోపం వచ్చింది కవులమ్మ మీద. బుజ్జగించినట్టు మాట్లాడితే నెత్తిమీద ఎక్కి కూసుంటుంది. ఉలకదు పలకదు.
‘‘లోకంల నువ్వొక్కదానివె ఆడిదానివి కాదు. అందరు నీ లెక్క వుంటే లోకం బాగుపడినట్టే. నన్ను వదిలిపెట్టి పోయిన్నాడే సచ్చినట్టు అని మాట్లాడ్తవంట. ఆ బొట్టెందుకు పెట్టుకున్నవమ్మ?’’ అని కాళ్లవేపు చూసాడు. మెట్టెలు లేవు. ముక్కుపుల్ల తప్ప పుస్తెతో సహా వీసమెత్తు బంగారం కవులమ్మ ఒంటిమీద లేదని తెలుసు.
కడుపుల కోపం ఎగదన్నుకొచ్చింది. అయినా ఆ మాటలన్న పెద్దమనిషి వేపోసారి చూసి సప్పుడు చెయ్యకుండ నిలబడ్డది కవులమ్మ.
‘‘నువ్వు ఇట్ల నీ మొండితనంతో వుంటే మా ఇంట్ల వుండాల్సిన అవసరం లేదు. మేం మాత్రం నీకెందుకు పెట్టాలి’’ కొడుకు.
అంతే నన్నట్టు కోడండ్లు చూసిండ్రు.
తలతిప్పి రివ్వున కొడుకు మొఖంలోకి సూటిగా చూసింది కవులమ్మ. కోపం కట్టలు తెంచుకుంది.

‘‘ఏంరా లబ్డి కొడ్కా. లెస్స మాట్లాడుతున్నవేందిరా? ఏమోలే అంటె అన్నరు. నా కడుపున పుట్టిన పిల్లలేగా అనుకున్న. వూకుంటావుంటె అలుసైనాదిరా? నాకేమన్న కూసబెట్టి తిండి పెత్తున్నార్రా? ఈ ఇంట్ల వుండొద్దు అంటున్నవు బోషిడీకె. తండ్రిమీద అంత ప్రేమున్నోళ్లు చెయ్యుండ్రి. మీ పెళ్లాలతోటి చేయించుండ్రి.
‘‘పెండ్లామన్నాక మొగుడు ఎన్నన్నా జెయ్యాల్నా? మీరేపాటి జేస్తున్నరే? పొద్దున లేస్తె గుద్ద కదలకుంట కూసుంటరు. మీకు, మీ పిల్లల కాన్నుంచి అందరికి కూసున్నకాడికి టిఫిన్‌లు, ఛాయ్‌లు తెచ్చియ్యాలి. మీరు మీ మొగుండ్లకు ఏపాటి జేస్తున్నరే ? గురివింద గింజ గుద్దకింది నలుపురెగదంట. సూర్యుని మొఖాన మన్ను బోస్తే తిరిగొచ్చి ఆళ్ల మొఖానే పడ్తదితియ్‌ అనుకున్న. ఊకుంటావుంటె నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నరు బద్మాష్‌ ముండలారా. నాకేమన్న పుణ్యానికి తిండి పెడుతున్నారే మీరు?

‘‘ఇంట్ల నుంచి పల్లగొడతరంట, ఇంట్లనుంచి. ఎవనిదిరా ఈ ఇల్లు? నీ     మామోళ్లు కట్నం కింద ఇచ్చినారురా? ఏమె లంజలాలా మీ తల్లిగారింటి నుంచి మూడగట్టుకొచ్చి నాకు పెడ్తున్నారే. నా ఇంట్ల వుండుకుంట, నా రెక్కల కష్టంతోటి వండి పెడ్తుంటె బుక్కెడు బువ్వ యేస్తున్నరు. కట్టుకోటానికి ఇంత బట్ట ఇస్తున్నరు. లెస్స మాట్లాడుతున్నరేమే’’ తననే ఇంట్ల నుంచి వెళ్లమనేసరికి తట్టుకోలేకపోయింది కవులమ్మ. తను ఎంత కష్టపడిరది ఈ ఇంటికొరకు.

కవులమ్మ మౌనమేతప్ప కోపాన్ని చూడని కొడుకులు, కోడండ్లు బదులియ్యలేకపోయిండ్రు.
‘‘ఈ ఇల్లూ… నీ తల్లిగారు కట్టించింది గాదు. ముసలాయన కట్టినది. ఈ ఇంట్ల నువ్వున్నప్పుడు ముసలోనికి చెయ్యాల్సిందే’’ పెద్దమనిషి ఖచ్చితంగా తేల్చి చెప్పిండు.
‘‘బహు జెప్పొచ్చినవ్‌ లేవయ్యా. మీరెవరసలు? నా ఇంటికొచ్చి నన్నడానికి. ఎవరయా మీరు? ఆడు కన్న కష్టాలు పెట్టిన్నాడు కానరారైతిరి? అరవైఐదేండ్లు గుద్దకిందికి ఒచ్చినంక ఎదిగిన బిడ్డల పెండ్లి చెయ్యకుంట మళ్ల పెండ్లి చేసుకుండు. ‘ఇది తప్పన్నా’ అని చెప్పడానికి ఆనాడు ఎవరు రాకపోతిరి? అయినోనివి కానోనివి కాళ్లు పట్టుకుని ఆడపిల్లల పెండ్లిళ్లు చేసిన్నాడు కానరారైతిరి? ఇయ్యాల ఊపుకుంట పెద్దమనుషులమని బయలుదేరిండ్రు.
‘‘ఈ ముదునష్టపు ముండాకొడుకు గురించి తెల్వనిది ఎవరికీ? ఒక్కనాడన్న మాట్లాడకపోతిరి? మా అమ్మనుంచుకుని ఈ లంజకొడుకు, మూడేండ్ల పోరిని ముప్పైయేండ్ల ఈ బాడుకావ్‌ నన్ను జేసుకుండు. ఓ ఇరుగమ్మ తెల్వదు ఓ పొరుగమ్మ తెల్వదు. ఓ సుట్టం తెల్వదు, ఓ పక్కం తెల్వదు. కన్నతండ్రి ఇంటికొస్తె అనరాని మాటలన్నడు ఈ కుక్కల్నాకొడుకు. నెత్తిత్తు నేలరాలినకాన్నుంచి ఏనాడన్న కడుపునిండ నవ్వి పరిగితినా? తిని పరిగితినా? కనిపించినోనితోనల్లా రంకు గట్టె. ఆఖరికి కొడుకులతో కూడానాయె. ఏ మొగోడు రాకపాయె ఆనాడు తప్పని జెప్పడానికి.

‘‘ఈ పెద్దమనిషి బొట్టు దియ్యమని లెస్స మాట్లాడ్తుండు. ఆ లంగనాకొడుకు పెట్టిందా ఈ బొట్టు? ఆడు పెట్టిన మట్టెలు, కట్టిన పుస్తెలు ఆడు మళ్ల పెండ్లి జేసుకున్ననాడే తీసిన. నన్ను ఎన్ని తిప్పలు పెట్టినా నలుగురు పోరగాండ్లు వున్నరని మానానికి, మర్యాదకి భయపడి పడివున్న. బొట్టుదియ్యమని మాలావు జెప్పవొచ్చిండు. బొట్టు తియ్యాలంట, బొట్టు.
‘‘అసలు మీరు నా గడప పందుకు తొక్కిండ్రు? ముందు బయటికి నడువుండ్రి’’ ఆవేశం పట్టలేకపోతుంది కవులమ్మ.
‘‘వాళ్లెందుకు పోతరు? మేం పిలిస్తె వచ్చిండ్రు. ఇది మా ఇల్లు. మా నాయిన గట్టింది. నాయినకు చేసేదానివైతె వుండు లేకపోతే పో’’ కొడుకులు.
‘‘అంతకంటె మా బాగ్యం ఏముందిరా? ఆని కడుపున పుట్టిన మీకు ఇంక వేరే బుద్ధులెట్ల ఒస్తయిరా? నా పాణం పోయినా ఆని మొఖం చూసేది లేదు. మీ ఇంట్ల జేసే కష్టం యాడ జేసుకున్నా బతుకుత. రెక్కలాడినంత కాలం జేసుకు బతుకుత. కాల్జెయ్యి ఆడన్నాడు ఏమన్న ఇంత మందు యేసుక సస్త’’ అంటూ వసారలోనే ఓ మూలకున్న తన బట్టలు మూటగట్టుకుని గేటు తీసుకుని బయటకు నడిచింది కవులమ్మ.

(‘అరుణతార’ ఆగస్టు 2004, ‘కథావార్షిక’ 2004)