“మరొక రాత్రి “ కావాలి ఈ కవిత్వం కోసం…!

రాజారామ్ తుమ్మచర్ల 

 

రాజారాం తుమ్మచర్ల

“ ఒక రాత్రి “ చాలడం లేదు…అనుభూతించడానికి

“మరొక రాత్రి “ కావాలి కోడూరి విజయ కుమార్ కవిత్వం కోసం..

నగరంలో ఒక ఉదయం తిరిగి అలసిపోయి ‘ ఒక సంభాషణ కోసం’ ‘అతడూ.. నేనూ.. ఒక సాయంత్రం’ బంగారు వాకిలి గుమ్మం ముందు అతిథిలా ఒక పరిచయస్తుడి గురించి, కొత్త స్నేహితురాలు గురించి వాళ్ళ ఇళ్ళలో  జరిగిన ఇటీవలి సంబరం గురించి మాట్లాడుకుండే మెలుకువలో యాకూబ్ విజయ్ కుమార్ ని పరిచయం చేసినట్టు జ్ఞాపకం. ఇంధ్రధనువుపై ఎగిరిన సీతాకోక చిలుక లా ,రాత్రులను వెలిగించే పద్యఋతువులా విజయ్ కవిత్వం ఏ తీరుగ నను దయ చూస్తుందా అనుకుంటున్న సమయంలో రహస్యంగా సంజాయిషీ యివ్వకుండా వచ్చి వాలింది ..ఒక రాత్రి నా ఇంట్లో. పుస్తకం తెరిచి తెరువగానే కనిపించిన వాక్యాలివి .

“ తాము దయతో పండించే

తిండి గింజల్ని తిని

వెర్రి పరుగులు తీసే ఈ నగరం

కాసింతయిన కరుణ చూపిస్తుందని కదా

ఈ మట్టి పాదాలు ఇక్కడి దాకా ప్రయాణించింది “

ఏ మట్టి పాదాలు ..మీద  నగరమంతా మోకరిల్లింది ?.ఎందుకు తిండి గింజల్ని ప్రసాదించండి అని అసహన హారన్ లు మ్రోగిస్తున్నారు  ఈ నగరమంతా.. నగరం రాకాసి బాహువులతో పొలానని అనకొండలా మింగేయ బోతున్నది ఎందుకని ..?ఇదంతా మనకి అర్థం కావాలంటే. విజయ కుమార్ రాసిన” నగరంలో ఒక ఉదయం”

కవిత చదువాల్సిందే. నగర కలుషిత “వాతావరణం “ లో “ అక్వేరియంలో బంగారు చేప “ను రక్షించడానికి ఒక

యుద్ధ “అనంతరం “ “ఒకరాత్రి.. మరొకరాత్రి “ అయిన లెక్కచేయకుండా కవిత్వ కరవాలాన్ని దూస్తున్న కవి కోడూరి విజయ కుమార్ . “ “ డాక్టర్ .రామనాథంని .. చంపేశారు స్కూలుకి సెలవని తెలిసిన రోజున నా జ్వరానికీ తీయటి మందులిచ్చిన డాక్టర్ని ఎందుకు చంపారో” అని తెలియక ఏడ్చిన చిన్నపిల్లాడు విజయ కుమార్ ఆ రోజు. కానీ ఈ రోజు “ దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది ఏదో ఎరుక కలిగిన కవి.తన నేల మరోక పోరాటా నికి సిద్ధమయ్యాక కార్యాలయ రణరంగాలకన్నా “ టీ బల్ల దగ్గరే సంభాషణ ప్రారంభిద్దాం “అని ఆహ్వానించిన కవి  విజయ కుమార్. తనది అయిన నేల కోసం స్వప్నించిన మరొక పూవు వికసించకనే నేల రాలిపోవడాన్ని సహించలేక కరిగిపోయే కవిత్వంరాసిన కరుణార్ధ్ర కవి విజయ్ కుమార్.

విజయ కుమార్ “ ఒకరాత్రి మరొక రాత్రి “ కవితా సంపుటిలో ముప్పై ఆరు కవితలున్నాయి.’ జీవితం భయపెట్టిన గడ్డు కాలం ‘ఇప్పుడు లేకపోయినా అలాంటి స్థితిలో వున్న సామాజిక, కౌటుంబిక ,వైయుక్తిక అనుభవాల తాత్విక సారాన్ని అక్షరాల్లో అందంగా పట్టి బంధించి అతి చిక్కని సాంద్రతా సహిత కవిత్వాన్ని ఈ సంపుటిలో అందించాడు.

IMAG0549_1

విజయ్ కవిత్వంలో నగరపు జీవితపు రొద వుంది. ఆ రొదలో గగ్గోలు పొందే జీవితం వుంది. చావు భయం చుట్టుకున్న దుఃఖం వుంది. లోపల సుడులు తిరిగే బాధ వుంది. పురా జీవితాన్వేషణ , ఆ జీవిత కష్ట సుఖాల చింతన వుంది.అంత కన్నా నిరంతరంగా సంభవించే సామాజిక సం‍క్షోభ సన్నివేశాలను ఒడుపుగా కళ్ళ ముందువుంచే జీవత్వం వుంది.తునిగిపోతున్న కుటుంబ సంబధాల అతికింపు పట్ల అపేక్ష వుంది. నెమలీక వంటి జ్ఞాపకాల సుగంధం వుంది. బంతిపూల , సన్నజాజుల ,పారిజాతాల సహజ సౌకుమార్య లాలిత్య  స్త్రీత్వం విజయ కుమార్ కవిత్వంలో వుంది కాబట్టే  ఈయన పద్యాన్ని ప్రేమతో హత్తుకోవాలనిపిస్తుంది.

“ కనుల అంచులు తాకే నిదుర పడవకై

ఇలా మెలుకువ తీరాన యెదురు చూడవలసిందే

యిక, ఈ రాత్రి నదిని భారంగా ఈదవలసిందే “ ( ఒకరాత్రి మరొక రాత్రి )

ఒకరాత్రి ..కాదు మరొక రాత్రి కాదు..ఏడేడు రాత్రులు అలా రెండు చేతుల నడుమ ముఖాన్ని కప్పుకొని ..దాటుకోవడమే కదా అని మరణ  చింతన ఒక చేతనతో చెబుతాడు.

రాత్రిని  నది చేసి నిద్రని పడవ చేసి మెలుకువని తీరంచేసి  గాయపరిచిన మాటల ముక్కల మధ్య ,పుస్తకాలతో కొంచెం  జీవితాన్ని మరచిపోయి ,విషాద గీతాల అలల మీద జీవితం నుంచి పారిపోయేటప్పుడు జీవ యాత్ర సుఖంగా సాగదని ,చివరకు జీవితం గాయాల గానంతోనే మిగులుతుందనే ఎరుకను తెలుపుతాడు ఈ కవి. ఎప్పటికి వెళ్ళలేవనే సత్యం దేహంలో ఒక కన్నీటి బిందువుగా నిలిచిపోతుందంటూ..ప్రకృతి లోని పావురాల కువకువలు ,వేసవిలో కురిసిన వాన చినుకులు ,చంద మామ,  ఇవన్నీ మాయ అని భ్రమని అంటూ..ఏడు కట్ల సవారీ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తూ..ఒక తాత్వికతని రేకెత్తిస్తూ మరణ ఊరేగింపు కూడా ఏ వైభవం లేకుండా కనీసం ఆ మరణానికి విలపించే రెండు కళ్ళు కూడా లేని ఏకాకి తనంతో వెళ్ళపోవల్సిన అనివార్యతను చాల గొప్పగా చెబుతాడు ఈ కవి.  ఎందుకీ ఈ మరణ చింతన ?ఇక ఎప్పటికి వెనక్కి వెళ్ళ లేనన్న సత్యమేదో హృదిని తొలిచిందా?అదేది కాదు ఈ కవి ఒక జీవిత వాస్తవిక సత్యాన్ని చెప్పాలని అనుకోవడమే. క్షణికమైన సుఖాలలో ఓలలాడించే యాంత్రిక సాధనాల వేటలో శరీరాన్ని పరుగులు పెట్టించిన మానవ జీవిత ఆఖరు దశను ఇలా చెబుతాడు విజయ కుమార్.

‘ నీ శరీరమొక మరమ్మత్తులకు వొచ్చిన వాహనం

ఒకప్పుడు రింగులు ,వాచీలతో ఊరేగిన చేతులకు

దొరకని నరాల కొసం గుచ్చినసిరంజి గాయాలు

రంగు రంగుల వస్త్రాల కప్పుకొని ,పౌడర్లు అద్దుకొని

తిరిగిన నీ దేహ నావని అల్లుకొని ప్లాస్టిక్ పైపుల లతలు

నీ తల్లి దండ్రులు జ్ఞాపకం వొస్తారు

వయో భారంతో శుష్కించిన దేహాలకు

ఆసరా ఇమ్మని ప్రాధేయపడిన వాళ్ళ కళ్ళు గుర్తుకొస్తాయి “ ( దేహ యానం )

అదే మనిషి పుటినప్పటినుంచి ముసలి తనం వచ్చే దశకు చేరుకునే వరకు పొందే స్థితిని  ఇలా రాస్తాడు ఈ విజయ కుమార్.

“నూనూగు మీసాలు మొలిచిన నాడు

ఈ శరీరానికే కదా రంగు రంగుల దుస్తులు చుట్టి

పౌడర్లు ,సుగంధ ద్రవ్యాలు అద్ది

వన్నెల సీతా కోకలకై పడిగాపులు గాసింది

వలచిన సీతాకోక ఒకటి చెప్పా పెట్టక ఎగిరిపోయినప్పుడు

గుబురు గడ్డం పెంచి ,మధువు తాగి, సిగరెట్లు పీల్చి

ఈ దేహాన్ని కదా నువ్వు గాయపరిచింది

వయసు పైబడినపుడు ఈ తోలు తిత్తికే గదా

రంగులు వేసి వయసుని దాచచేయాలని ఆరాటపడింది “

ఆ సుదూర విశ్వవీధులలోని  మనిషి ఆదిమ స్థావరానికీ చేరుకోవడం వరకు జరిగే దేహయానం గురించి, అట్లాంటి వ్యక్తికి వచ్చే చివరి రోజు వరకువున్న స్థితికి కవి చేసిన కవితాత్మక వ్యాఖ్యానం ఈ కవిత. దేహమే ఈ భూమ్మీదకు మనల్ని మోసుకొచ్చే పడవ అని ఊహించే పోలికనే చెప్పిన ఈ కవిత ఆరంభం నుండి ముగింపు వరకు ఈ కవి ఏ జ్ఞాపకాలను మిగుల్చుకొకుండా వెళ్ళిపోయే వాళ్ళ దయనీయతను ,రాజ్యాలను జయించే అలెగ్జాండర్ అయినా దేహయాత్ర కు కాలం చెల్లిపోయిన తరువాత ఆసుపత్రి భాషే వింటాడని కన్ను తెరుచుకొని ఆలోచించేవిధంగా చెబుతాడు.

వచన కవిత్వం రాసే వాళ్ళు మరీ ముఖ్యంగా ఇటీవలి కవులు సాధారణ సంభాషణ శైలిలోనే వాక్య విన్యాసాన్ని ఎక్కువగా వాడుతున్నారు.చదువరులను కానీ ,పాత్రలని కానీ సంభోధిస్తూ రాసే సంభాషణ శైలి వచన కవిత్వానికి బాగా నప్పుతుందని కొందరి అభిప్రాయం.

“ఒక రాత్రి మరొక రాత్రి “ లో కూడా ఈ కవి తన కవితల్ని పాత్రల్ని సంభోదిస్తునో ,చదువరులను సంభోదిస్తునో రాశాడు. “రాత్రులను వెలిగించే పద్యాల ఋతువు “ ఇలా మొదలవుతుంది.

“ఒరేయ్ నాయనా .. ఇది ఇలాగే వుంటుందిరా

పగలు నిలకడ వుండదు రాత్రి వుండదు

ప్రేమ దీపం చుట్టూ తిరిగి తిరిగీ

మసై పోయిన శలభాల కథలకు అంతముండదు “

పాత్రను సంభోధిస్తూ అత్యద్భుత ప్రేమను పరామర్శిస్తూ రాసిన కవిత ఇది.ప్రేమకు బలయిపోయిన అతన్ని ఉద్దేశించి సంభోధిస్తూ రాసిన కవిత.ఆకాశంలో నక్షత్రం లాంటి ప్రేయసి కాంతిని వాగ్దానం చేసిన అంటే ప్రేమను ఇవ్వకుండా పోతే ఆమె పోయిన ఆమె జ్ఞాపకాలు పోవు కదా అని ఈ కవి చెబుతాడు.ఒక్కొక్క రాత్రిని ఒక్కొక్క పద్యం చేసి ఆ పద్యాల హారాన్ని కానుకగా పంపు.ఎప్పుడో ఓసారి ఆ కానుకను చూడక పోదు.పోగొట్టుకున్నది తానే అని బాధ పడితే ఓదార్చి,ప్రేమలు పద్యాలు మాత్రమే పెడతాయేమో కానీ బువ్వలు మాత్రం రూకలే పెడతాయని చెబుతూ, నాలొ అలివికాని ప్రేమవుందని నీకే తెలియ చేసిన నీ ప్రేయసికి కృతజ్ఞతలు చెప్పమంటాడు ఈ కవి.అలవి కానీ ప్రేమ వుంటే మరో ఒప్రేమ నక్షత్రం ఒడిలో వాలుతుందని నాలుగు పాదాల్లో గొప్పగా చెప్పాడు.ఆ నక్షత్రాన్ని లాలనగా దగ్గరగా తీసుకొని యుగయుగాల ప్రేమని పంచు అని అంటాడు.

ఎదురుగా వున్న తెల్ల కాగితం నువ్వు దూకితే మింగేసే లోతైన బావి అవుతుందని ,వేళ్ళ నడుమ వున్న పెన్ను లోపల వున్న బాధని పెకిలించే ఖడ్గం అవుతుందని చెబుతూ  అప్పుడు నువ్వు భాషను నేర్చుకొని  ఒక్కొక్క వాక్యాన్నే నిర్మిస్తు పద్యం రాస్తే నీ లాంటి వాడు ఆ పద్యాన్ని హత్తుకుంటే నీవు తిరిగి జన్మిస్తావని అంటు బాధవల్ల పద్యం పుడుతుందని ఆ పద్యమే కవిని పున్ర్జీవితున్న చేస్తుందని పరోక్షంగా ప్రస్తావిస్తాడు. “పగలే కాదు ..రాత్రి కూడా వొకటి వుందన్న చేదు నిజం రాత్రయ్యాకే గుర్తుకొస్తుంది “-అని అనటంలో జీవితంలో సుఖం వున్నప్పుడు కష్టాలు కూడా వుంటాయన్న నిజాన్ని ధ్వనితో చెబుతాడు.

స్త్రీ పురుషుల మధ్య ముఖ్యంగా మూడుకాళ్ళ ముదిమి వయసులో వుండాల్సిన సంబంధాన్ని, ఆ  భార్యలైన స్త్రీలతో భర్తలకు  వుండాల్సిన అనుబంధ సంబంధాన్ని  అద్భుతంగా  చెప్పిన కవిత “ఏ తీరుగ నను ..” అనేది. “యౌవ్వనంలోనైనా, ముదిమిలోనైనా ఒకపాటొ ,పద్యమో ,తోడులేని బతుకు ఎంత దుర్భర్మో కదా ! “అంటూ  “ జీవితాలని బలిగోరిన పురుషులు ,జీవితాంతం పరాన్న జీవులుగా బతికే పురుషులు ,ఒక శ్రావ్యమైన పాటకూ అందమైన పద్యానికీ నోచుకోని పురుషులు ,స్త్రీల వలె జీవితాన్ని కళగా జీవించడం తెలియని పురుషులు “ అంటూ  సాయంకాలాలు పాటలలో మునిగిపోయే స్త్రీల కన్నా పురుషుల జీవితం దుర్భరమని ఒక జీవిత సాదృశ్యాలతో స్త్రీల జీవన వైషిష్ట్యాన్ని గొప్పగా నిరూపిస్తాడు.

“సూర్యుడి కన్నా ముందు నిన్ను నిద్రలేపి ఇక ఆరోజు మొదలయ్యే పరుగు” పెడుతూ గడియారపు రెండు ముళ్ళ మధ్య చిక్కుకొన్న క్రమం తప్పని దిన చర్య  ఎవరికైనా తప్పదని అంత మాత్రానా అందరి తల్లి తండ్రులు లాగానే నిన్ను వారు పెంచారని చెబుతూ ..జీవిత ఆనంద రహస్యాన్ని  తెలుసుకోమని ఇలా చెబుతాడు.

“ఒక భాగవత శ్లోకాన్ని నెమరువేసుకుంటునో

రాత్రి ఆరుబయట వెన్నెల్లో రేడియోలో ముఖేష్ పాట వింటునో

మైమరచి పోయిన నీ తండ్రి రూపం

పగలంతా ఇంటి పనితో అలసిపోయినా

కళ్ళ నిండా కాటుకతో, కాసంత బొట్టు తో

నిండుగా ముస్తాబయ్యే నీ తల్లి రూపం

రెండు కళ్ళు లేకున్నా కంచికి వెళ్ళిన కథలని

నీకు వినిపించి మురిపించిన అమ్మమ్మ రూపం

అన్నీ ఒక్క సారి జ్ఞాపకం తెచ్చుకొని చూడు

ఒక రహస్యమేదో వాళ్ళు నీకు చెప్పినట్టున్నారు “

అంటూ కాంక్రీటు నిర్మాణపు నగరపు విసుగులోంచి బయటపడే గొప్ప ఆత్మ విశ్వాసాన్నిపొందే రహస్యాన్ని కుటుంబ సంబంధాల నుంచే పొందవచ్చనే స్పృహనిస్తాడు.

“ఆమె సమయాలు “ అనే కవిత భార్య పట్ల భర్తకుండాల్సిన బాధ్యాతాయుతమైన ప్రేమను పూల పోలికలతో సౌకుమార్యంగా చెప్పిన కవిత. “ఇటివల సంబరం “ అనే కవిత తన యింటి టెర్రస్ మీదకి కువకువ రాగాలతో కుశలం అడుగుతూ వొయారంగా వాలిన అనుకోని అందమైన అతిథులైన పావురాలకు చేతిలోని గిన్నె లోని గింజెలతో విందు చేస్తున్న తన బిడ్డ చేస్తున్న ఆ పనిని  అపురూప దృశ్యంగా కవిత్వం చేశాడు. ఏ ఆడబిడ్డయినా తన తండ్రిని “ నువ్వు అబ్బాయి పుట్టాలని కొరుకున్నావా నాన్న ? అని అడిగితే ఏం చెబుతాడు ? అవునని అనగలడా? కానీ అవునని చెబుతూ .

. నిజమే కొన్ని బలహీన  క్షణాలలో

నా అనాది మగ దురహంకారాల మైకంలో

అబ్బాయి పుట్టాలనే కోరుకున్నానేమో?

తన తప్పును ఒప్పుకొంటూ ..” కానీ నా బంగారు తల్లీ..! నాలో జీవం నింపి నన్నొక మనిషిని చేసింది స్త్రీలేనని ఎలా మరచిపోగలను “ అని పశ్చాతాపం ప్రకటించడ ప్రకటిస్తూ. “ నా లోలోపలి లాలిత్యాన్ని రక్షించింది స్త్రీలేనని “.స్త్రీల పట్లగల తన కృతజ్ఞతను ప్రకటిస్తాడు.కానీ ఈ నాటి సమాజంలో కట్నాల విలువ కట్టే విఫణి వీధులు, నిర్లజ్జగా దొర్లే యాసిడ్ సీసాలు  వున్న స్థితుల్లో నువ్వు అబ్బాయివైపుడితే బాగుంటుందన్న ఒక సామాజిక వికృత స్వరూపాన్ని ,ఆ సమాజం స్త్రీల పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను అద్భుత ధ్వనితో సూచించాడు. ఇది గొప్ప కవిత్వ లక్షణం.

ఈ కవి   నిరుపమాన భావుకతతో పాటు గొప్ప సామాజిక బాధ్యతను గూడా  కలిగివున్నాడు.”ఎన్నికల ఋతువు “  “నగరంలో ఒక ఉదయం “ ఇలాంటివి కవి సామాజిక దృక్పథాన్ని చూపెడతాయి.నగరం లో రైతులు చేస్తున్న ధర్నాలతో రాస్తారోకోలతో కూడళ్ళలో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన నగర ప్రజలు “ పనీ పాటా లేని పల్లె పొద్దున్నే నగరంలోకి జొరబడి విలువైన నగర సమయాన్ని ధ్వంసిస్తుంది “-అని అంటున్నప్పుడు ఈ కవి “ పొలమూ.. విత్తనాలు..ఎరువులూ, ఆకాశం దయతో కురిసే వర్షమూ తప్ప, మరోలోకం , లేని వాళ్ళు కదా తమలోకం విడిచి ఈ నగర మాయాలోకంలోకి యిట్లా బాధల మూటలతో వాళ్ళు మాత్రం యిష్టంగా వస్తారా? “-అని అంటాడు.అంతే కాదు ఆ రైతులను “ఈ నిర్లజ్జ నగరం తన రాకాసి బాహువులు సాపి మిగిలిన మీపొలాలని  కూడా అనకొండ లా మింగివేయబోతుందని “ హెచ్చరిస్తాడు. ఏదో ఒకనాడు ఈ నగరం తిండి గింజల కోసం రైతుల కాళ్ళ మీద పడి మొక్కే కాలం వొస్తుందని ధైర్యమైన ఆశనిస్తాడు.

హైద్రాబాద్ నగరంలో సంభవించిన పేలుళ్ళ పై రాసిన ఉన్నత కవిత”  అతడూ.. నేను.. ఒక సాయంకాలం “ అనేది. “ విధ్వంసంతో మళ్ళీ కొన్ని దేహాలనైతే ధ్వంసం చేసాడు కానీ మా ఇద్దరి నడుమ విశ్వాసాన్ని స్పృశించలేక ఓడ్పోయాడు “. అనే వాక్యంతో చెదరని హిందూ మహమ్మదీయ మైత్రిని సూచించాడు.ఇలా ఎన్నో ఉత్తమ కవితల సమాహారంగా వుండిన ఈ సంపుటిని పరిచయం చేయడానికి “ఒక రాత్రి చాలదని అనుభూతించి రాయడానికి మరో రాత్రి కూడా కావాలని అంటున్నా.

తప్పించుక తిరుగుతావు లోకం నుండి ఈ కవిత్వం చదివితే.చదువకపోతే లోకమే నీ నుండి.. దూరంగా పోతుందంటున్నా.కొన్ని మాటలు లుంగలు చుట్టుకు పోయి ఈ కవిత్వం గురించి ఇంక రాయలేక ఎవరితో ఇంకా పంచుకోలేక గొంతులో లోపల చిక్కుకున్న మాటల్ని ఇక రాయలేక.. పాఠకులు సీరియస్ గా చదువాల్సిన కవిత్వం విజయకుమార్ దని అభినందిస్తున్నా.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

“ తాము దయతో పండించే

తిండి గింజల్ని తిని

వెర్రి పరుగులు తీసే ఈ నగరం

కాసింతయిన కరుణ చూపిస్తుందని కదా

ఈ మట్టి పాదాలు ఇక్కడి దాకా ప్రయాణించింది “

 

ఏ మట్టి పాదాలు ..మీద నగరమంతా మోకరిల్లింది ?.ఎందుకు తిండి గింజల్ని ప్రసాదించండి అని అసహన హారన్ లు మ్రోగిస్తున్నారు  ఈ నగరమంతా.. నగరం రాకాసి బాహువులతో పొలానని అనకొండలా మింగేయ బోతున్నది ఎందుకని ..?ఇదంతా మనకి అర్థం కావాలంటే. విజయ కుమార్ రాసిన” నగరంలో ఒక ఉదయం”

కవిత చదువాల్సిందే. నగర కలుషిత “వాతావరణం “ లో “ అక్వేరియంలో బంగారు చేప “ను రక్షించడానికి ఒక

యుద్ధ “అనంతరం “ “ఒకరాత్రి.. మరొకరాత్రి “ అయిన లెక్కచేయకుండా కవిత్వ కరవాలాన్ని దూస్తున్న కవి కోడూరి విజయ కుమార్ . “ “ డాక్టర్ .రామనాథంని .. చంపేశారు స్కూలుకి సెలవని తెలిసిన రోజున నా జ్వరా

నికీ తీయటి మందులిచ్చిన డాక్టర్ని ఎందుకు చంపారో తెలియక ఏడ్చిన” కవి విజయ కుమార్ ఆ రోజు.కానీ

ఈ రోజు “ దగా పడిన జాతికి అంతిమంగా విముక్తి కలిగించేది ఏదో ఎరుక కలిగిన కవి.తన నేల మరోక పోరాటా నికి సిద్ధమయ్యాక కార్యాలయ రణరంగాలకన్నా “ టీ బల్ల దగ్గరే సంభాషణ ప్రారంభిద్దాం “అని ఆహ్వానించిన కవి  విజయ కుమార్. తనది అయిన నేల కోసం స్వప్నించిన మరొక పూవు వికసించకనే నేల రాలిపోవడాన్ని సహించలేక కరిగిపోయే కవిత్వంరాసిన కరుణామూర్తి కవి విజయ్ కుమార్.

నగరంలో ఒక ఉదయం తిరిగి అలసిపోయి ఒక సంభాషణ కోసం అతడూ.. నేనూ.. ఒక సాయంత్రం బంగారు వాకిలి గుమ్మం ముందు అతిథిలా ఒక పరిచయస్తుడి గురించి ,కొత్త స్నేహితురాలు గురించి వాళ్ళ ఇళ్ళలో  జరిగిన ఇటీవలి సంబరం గురించి మాట్లాడుకుండే మెలుకువలో యాకూబ్ విజయ్ కుమార్ ని పరిచయం చేసి

నట్టు జ్ఞాపకం. ఇంధ్రధనువుపై ఎగిరిన సీతాకోక చిలుక లా ,రాత్రులను వెలిగించే పద్యఋతువులా విజయ్ కవిత్వం ఏ తీరుగ నను దయ చూస్తుందా అనుకుంటున్న సమయంలో రహస్యంగా సంజాయిషీ యివ్వకుండా వచ్చి వాలింది ..ఒక రాత్రి నా ఇంట్లో.