ఈ కార్పొరేట్ నేల మీద ఖదీర్ “డాక్టర్” గారు ఎవరి డాక్టర్?!

( ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవండి )

( రెండో భాగం )

khadeer book

మొదటిగా రచన ప్రయోజనం చూద్దాం. ఈ రచనకి పూనుకొన్నప్పుడు రచయిత ఆశించిన ప్రయోజనం ఏమిటి? సంపాదన వేటలో మనుషులు ఒత్తిళ్లకి లోనవుతున్నారనీ, అందువల్ల పిల్లలు సమాజానికి దూరమైపోతున్నారనే. దీనికి విరుగుడుగా రచయిత సూచించినది పిల్లల్ని కొంత ప్రజా జీవితానికి దగ్గరగా పెంచాలని. కానీ ఈ ప్రయోజనాన్ని ఈ కథ సాధించిందనీ, ఈ సందేశాన్ని బలంగా వినిపించగలిగిందనీ చెప్పలేం. కథని “రసవత్తరంగా” చెప్పాలనే ఉత్సాహమూ, రహస్య ఆకాంక్షలూ కథ ప్రయోజనాన్ని సున్నా చుట్టేశాయి. డాక్టరుగారి ప్రవర్తన వర్ణనా, నైటీలూ, పెదవులూ, ఆకర్షణా, కిసుక్కుమని నవ్వడాలూ, తనలో తనే మురిసిపోవడాలూ, వగైరాలకీ కథ నడకకీ ఏమీ సంబంధం లేదు. “ఏదో” “ఏదో” జరగబోతోందన్న ఉత్కంఠని పాఠకుల్లో లేవనెత్తి కథని చదివించే ప్రయత్నం కథ ప్రయోజనానికి సరిపడదు. ఇదంతా కథని “రసవత్తరంగా”నడిపి చివరికి కథారచన రచయిత ప్రతిష్టలో భాగమైపోతుంది. సంపాదన వేటకి ఫలితం ఒత్తిళ్లు అని గుర్తించిన కధ ఆ సంపాదన వేటకి మూలాల్ని గుర్తించలేక పోయింది. ఉత్పత్తి విధానం పెట్టుబడిదారీ విధానం కావడంతో ప్రజల ఆరోగ్యం కూడా “సరుకు”గా మారి వ్యాపార సూత్రాలకు లోబడి పోటీ, లాభం అనే అంశాలు మానవ జీవితాలకు నిర్ణాయక శక్తులుగా వున్నాయనీ కథ స్పష్టం చెయ్యగలిగి వుంటే ఆశించిన ప్రయోజనం నెరవేరేది. శ్రామికుల జీతాల్నీ, పని గంటల్నీ పోటీ నిర్ణయిస్తుందన్న మార్క్స్ వాక్యం (Pre -Capital formation అన్న నోట్సులో) ఒక్కటి చాలు కథని ప్రయోజనా పూర్వకంగా మలచడానికి. ఒక రచయిత తాను చూసిన విషయాన్ని కథగా రాసే ముందు చెయ్యవలసిన అధ్యయనం ప్రాముఖ్యాన్నీ, ఆ అధ్యయనం లేకపోతే కలిగే అనర్ధాన్నీ చెప్పటానికే ఇదంతా రాసాను. మనం చూసిందే రాయాలంటే సాహిత్యం అవసరం. ప్రయోజనం పెద్దగా వుండదు. మనం చూసిన విషయాలు అందరూ చూస్తున్నారు. కొందరు రోజూ చూస్తున్నారు. సమస్య ఏంటంటే చూస్తున్న దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఏం తెలుసుకోవాలి అనేదే.. ఆ సమస్యే సాహిత్య ప్రయోజనం. వాస్తవానికీ, వాస్తవికతకీ వున్న తేడా అదే. కనిపించింది చెప్పేవాడు వ్యాఖ్యాత. కనిపించనిది విప్పి చెప్పేవాడు రచయిత.

ఇంతకీ డాక్టరుగారి కష్టాలకి కారణాలేమిటి? అని ప్రశ్నించుకోవడం అవసరం.

కత్తి, కొడవలి, గొడ్డలి, గునపం రూపంలో వ్యవసాయంలో ప్రవేశించిన పెట్టుబడి వుత్పత్తిని పెంచి “మిగులు”ని తయారు చేసి వినిమయం, మారకం లేదా అమ్మకం, కొనుగోలు రూపంలో బజారుని తయారు చేసిన తర్వాత అది అక్కడితో ఆగదు. ఈ మిగులు బ్రహ్మరాక్షసి. దాని పెరుగుదలకి ఒక క్రమం, ఒక విధానం, ఒక పద్ధతి వున్నాయి. ఆ వివరాల్లోకి ప్రస్తుతం వెళ్ళకుండా అవసరం మేరకే మాట్లాడితే పెట్టుబడిదారీ తను పెరిగే క్రమంలో ఒక రకపు శ్రమ విభజనను ప్రవేశ పెడ్తుంది. అదే సమయంలో అది “నైపుణ్యాలకి” పెద్ద పీట వేసి కీర్తనలు పాడి, ఆ నైపుణ్యాలని “సరుకు”గా మార్చి, క్రమంగా మింగేస్తుంది.

వైద్యంలో దీన్ని చూస్తే డాక్టరుగారి తండ్రిలాంటి పరిమిత పరిజ్ఞానం గలవాళ్లు ఒక దశలో సరిపోతారు. వీళ్లు తమ బతుకుతెరువుకోసం ఒక మంగలి, ఒక చాకలి, కంసాలి, వడ్రంగి  వగైరా చేతి వృత్తుల వాళ్లలాగ గ్రామం మీద, సమాజం మీద ఆధారపడతారు. ఈ పరస్పర సహకారం ఇద్దరికీ అవసరంగా వుంటుంది. మార్కెట్ విస్తరించేకొద్దీ నైపుణ్యాలూ, శ్రమ విభజన పెరుగుతుంది. వైద్యంలో రకరకాల స్పెషలిస్టుల రాక ఇదే. ఆరోగ్యం అనే వుత్పత్తిని చెవుల,గుండెగా, ప్రసవంగా, ఎముకలుగా, వూపిరి తిత్తులుగా విడగొట్టి దానిలోని నిపుణుల్ని తయారు చేసింది. వ్యవసాయంలో నాగలి స్థానంలో ట్రాక్టరు వచ్చినట్టుగానే వైద్యంలోనూ రకరకాల యంత్రాలు రంగప్రవేశం చేసాయి. స్టెతస్కోపు, ధర్మామీటరుతో ఆగకుండా రకరకాల స్కానింగ్ మిషన్లు, మనిషి “చర్మం వొలిచి” లోపల ఏం వుందో చూపే యంత్రాలు వచ్చాయి. అయితే ఈ యంత్రాలు వుత్పత్తిదారుల చేతుల్లో వుండవు. డాక్టర్లూ, కంపౌండర్లూ,నర్సులూ.. వీటిని కొనలేరు.

ఈ పద్ధతిలో వ్యవసాయంలో భూమికి యజమానిగా వున్న రైతు అది పోగొట్టుకుంటాడు. వృత్తికారులు, చేనేత కావచ్చు. జాలర్లు కావచ్చు. తమ పనిముట్లు పనికిమాలి పోయాయని గుర్తించేలోపు రెండు చేతులు తప్ప ఏమీలేని కూలీలుగా మిగులుతారు. వ్యవసాయ కూలీలు, చాకలి, మంగలి, కుమ్మరి, వడ్రంగి, వైద్యుడు ఎవరైనా ఒక్కటే. వ్యక్తిగత యజమానిగా, ఒక చిన్న రైతులాగ, సొంత కార్ఖానా పెట్టుకున్న వడ్రంగి, కమ్మరిలాగా, వున్న మంగలి డాక్టరుగారి  తర్వాత దశ వ్యక్తిగత నైపుణ్యం వున్న డాక్టరుగారే. స్పెషలిస్టులే. అలాగే రైతులు, వృత్తికారులూ, కూలీలైపోయి గ్రామాన్ని, చిన్న సమాజాన్ని వదిలేసి పట్నం చేరినట్లే డాక్టరుగారూ చేరారు. ఆ మేరకు రైతుల పట్ల వుండే సాధారణ సానుభూతి వైద్యుల పట్లా నాకు వున్నది.

కానీ, మంగలి డాక్టరుగారిలాగ సొంత డిస్పెన్సరీ నడుపుకునే దశనుంచీ కార్పోరేట్ ఆసుపత్రుల్లో కూలీలుగా మారిపోయే దశలోనూ, ఆ తర్వాతా ఈ వైద్యులు ఎవరివైపు నిలబడ్డారు? అన్నది నా సానుభూతికి గీటురాయిగా నిలుస్తుంది.

కారణాలేమైనా, మన దేశంవరకూ తీసుకుంటే ప్రభుత్వం వైద్యాన్ని ఒక కంటి తుడుపుగానైనా నిర్వహిస్తున్నది. గ్రామాల్లో ఇప్పటికీ ప్రజలున్నారు. రోగాలు ఎక్కువగా గ్రామాల్లోనే వున్నాయి. మలేరియా, డయేరియాల్లా చిన్న చిన్న రోగాలకే చచ్చిపోతున్నవారి సంఖ్య తక్కువగా ఏమీ లేదు. ప్రభుత్వం ప్రకటించిన గ్రామాలు ఆర్ధిక గణాంకాలు(Rural Health Statistics) ప్రకారం చూస్తే మార్చి 2012 నాటికి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) 4 శాతం వాటిల్లో డాక్టర్లు లేరు. 36 శాతం వాటిల్లో లాబ్ టెక్నిషియన్లు లేరు. 23 శాతం వాటిల్లో మందులిచ్చే ఫార్మసిస్టు లేడు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సర్జన్లలో 75 శాతం, ప్రసూతి డాక్టర్లలో 65 శాతం, చిన్న పిల్లల డాక్టర్లలో 80 శాతం, సాధారణ ఫిజిషియన్లలో 80 శాతం కొరత వున్నది. మొత్తంగా చూస్తే అవసరమైన దాంట్లో కేవలం ముప్పై శాతం మాత్రమే వున్నారు. ప్రభుత్వం సాంక్షన్ చేసిన పోస్టుల్లో 52 శాతం సర్జన్ల పోస్టులూ, 40 శాతం ప్రసూతి డాక్టర్లూ, 53శాతం ఫిజిషియన్లూ, 43 శాతం చిన్న పిల్లల డాక్టర్ల పోష్టులు  ఖాళీగా వున్నాయి. మొత్తంగా చూస్తే శాంక్షన్ అయిన పోష్టుల్లో  43 శాతం పోష్టులు ఖాళీగా వున్నాయి.

వివరాలూ, గణాంకాలూ కావాలంటే టన్నులకొద్దీ ఇవ్వచ్చు కానీ మామూలుగా చూసినా గ్రామాల్లో వైద్యం లేదనీ, చిన్నరోగాలకి కూడా పనులు మానుకుని, కూలీ మానుకుని పట్టణాలకి పరిగెత్తి ఆసుపత్రుల వరండాల్లో గంటలగ్గంటలు పడిగాపులు పడాలని అందరికీ తెలిసిందే. గ్రామాల్లో రెండేళ్ళు పని చెయ్యాలన్న నిర్బంధం పెట్టినా డాక్టర్లు గ్రామాలకి రావడం లేదని ప్రకటించి, ప్రచారం చేసి ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటున్నది. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎటు పోతున్నారు?

ఉత్పత్తి సాధనాలు చేతిలో వుంచుకొని శ్రమని దోపిడీ చేస్తూ వుండే పెట్టుబడిదారుల వైపే ఉన్నారు. డాక్టరుగారు స్పష్టంగా చెప్పినట్టు సాఫిస్టికేటెడ్‌గా మోసం, వంచన చేస్తున్నవారి వైపే వున్నారు. “పేదల కారాగారం”లో వీరు పేదల వైపు లేరు. అందుకే నాకు వారిపై ఏమీ సానుభూతి లేదు. అన్నదాత, మహా పతివ్రత, వైద్యోనారాయణోహరీ లాంటి బిరుదుల వెంక వున్న అసలు ఉద్దేశ్యాల్ని గ్రహించగలిగిన వాళ్లు డాక్టరు పాత్రపై ఏమీ సానుభూతి  చూపించలేరు. మరో విషయం చూస్తే మరిన్ని యంత్రాలు ప్రవేశ పెట్టడం ద్వారా, ఎంతోమంది శ్రామికుల్ని బతుకుతెరువు నుంచి దూరం చేస్తోందనీ, అలా నిరుద్యోగులైపోయిన శ్రామికులు “పారిశ్రామిక సైన్యం”గా తయారై కూలీ మరింత తగ్గిపోవడానికీ, శ్రామికుల బతుకు మరింత దిగజారిపోవడానికీ కారణంవుతారనీ సిద్ధాంతం. కావలసినవాళ్లు సుళువుగా తెలియాలంటే మార్క్సు రాసుకున్న pre-capitalist economic formulate రాతలో చూడొచ్చు. ఆయన గ్రంధం కాపిటల్‌లో చదవొచ్చు.

ఇంతకీ ఈ క్రమంలో “పారిశ్రామిక సైన్యం” ఎవరని ఆలోచించాలి. మంగలి డాక్టరిలాగ, చిన్న రైతులాగ స్వంత యజమానులుగా ఉన్నప్పుడు వాళ్లతో కలిసి సమాజం మీద ఆధారపడి బతికే కొంతమంది ఉంటారు. వాళ్లు రైతు కూలీలు కావచ్చు. కథలోంచి చూస్తే కంపౌండర్లు, మందులిచ్చే ఫార్మసిస్టు, మంత్రసానిలాంటి నర్సు, ఆసుపత్రి శుభ్రం చేసే మనుషులు.. ఇలా  కనీసం ముగ్గురు నలుగురుంటారు. అది కొంచెం పెద్దది అయ్యి ఆసుపత్రిగా మారితే ఇంకొంచెం ఎక్కువమంది వుంటారు. వైద్యం నగరీకరణ అయ్యి, కేంద్రీకృతం అయిపోయిన  క్రమంలో వీళ్లంతా నిరుద్యోగులై పోయారు. ప్రభుత్వ రంగంలో చూస్తే ఇందాక మనం చెప్పుకున్న అంకెలు కేవలం డాక్టర్లకీ, కంపౌండర్లు, నర్సులు వగైరాల విషయంలో ఇవి చాలా దారుణంగా వున్నాయి.

ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయం ప్రకారం ప్రతి PHCలోనూ, డాక్టరు కాక పద్నాలుగుమంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో నలుగురు డాక్టర్లు కాక ఇరవై ఒక్క మంది సిబ్బంది ఉండాలి. వాస్తవంలో వీటిలో ఒకరిద్దరు కూడా ఉండరు. అంటే సిబ్బంది కొరత ఏ స్థాయిలో వున్నదో ఆలొచించుకోవచ్చు. డాక్టర్లు లేరనే సాకు చూపించి సిబ్బందిని నియోగించకుండా చేతులు దులిపేసుకుంటున్న ప్రభుత్వం ఎంత నిరుద్యోగం పెంచుతోంది? పారిశ్రామిక సైన్యం ఎంత పెరిగింది? దయచేసి వెతకండి. కథలో డాక్టరుగారికి వీరిపట్ల ఏ బాధ్యతా లేదు. వైద్యం “నోబెల్ ప్రొఫెషన్”గా ఇంక ఎంత మాత్రమూ లేదన్న బాధే తప్ప కనీసం తన చుట్టూ వున్న వాళ్లెలా వున్నారన్న స్పృహ లేదు. వెయ్యి చిన్న క్లినిక్‌లని మింగి, ఏనుగులా నిలబడ్డ కార్పొరేట్ ఆసుపత్రి, ఎకానమీస్ ఆఫ్ స్కేల్ పేరుతో వేలాదిమంది శ్రామికుల స్థానంలో యంత్రాల్ని, నలుగురు సిబ్బందినీ వుంచి తమ గుత్తాధిపత్యం వల్ల ధరలు విపరీతంగా పెంచి, మోసం, వంచన చేసి పేదల రక్తం పీలుస్తూ వుంటే డాక్టరు గారి వ్యక్తిగత దుఃఖాల పట్ల, ఆవిడ కొడుకు మొక్కలు పెంచుకోవడం పట్ల నాకేం సానుభూతి లేదు.

అయితే డాక్టర్లందరూ మనకి పనికి రాని వాళ్ళేనా? వాళ్లకీ మనకీ ఏం సంబంధం లేదా? అని ప్రశ్నించుకుంటే… వుత్పత్తిదారుడు (కథ విషయంలో డాక్టర్లు, కంపౌండర్లూ, నర్సులూ) వుత్పత్తి (కథలో ప్రజల ఆరోగ్యం) నుంచి వేరు పడే క్రమంలో వాస్తవానికి, డాక్టర్లు ఒక రకంగా పెటీ బూర్జువా (మధ్యవర్తులు)ల్లాంటివాళ్లు. పెట్టుబడి  పెరిగి పెరిగి గుత్త సంస్థలుగా మారే క్రమంలో (క్లినిక్ – నర్సింగ్ హోం – ఆసుపత్రి -మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్) ఈ పెటీ బూర్జువాలు నిస్సహాయులనీ అంటాడు ఒకాయన తన రాజ్యమూ -విప్లవమూ అనే  పుస్తకంలో. పెట్టుబడికి ఎదురొడ్డి పోరాడేది కార్మికులేనని స్పష్టం చేస్తాడు. మరి ఏ డాక్టర్లని మనం ఈ రకపు నిస్సహాయుల జాబితాలొ వేద్దాం. రకరకాల కారణాల వల్ల గ్రామాల్లో తమ ప్రాక్టీసు చేసుకుంటూనో, ప్రభుత్వ డాక్టర్లుగా పని చేస్తూనో వున్న వాళ్లని ఈ జాబితాలో వేస్తాం. అది బాగా ఉదారవాదమైనప్పటికీ ప్రస్తుతానికి ఉన్న స్థితిలో వీళ్లపట్ల మనం కొంత సానుభూతితో వుంటాం.

తమ సంపాదనని కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే డాక్టర్లని మనం గౌరవిస్తాం.

తప్పనిసరిగా, ఒక కొట్నీస్‌నో, ఒక రామనాధాన్నో అలాటి వాళ్లనో భుజాలకెత్తుకుంటాం.

విషయమేమిటంటే.

పోష్ కాలనీలో త్రీ బెడ్‌రూమ్  ఫ్లాట్‌లో వుండేవాళ్లని నేలమీద వుండే ప్రజలు కలుపుకుంటారా అని?

పెట్టుబడికి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పోరాడేది శ్రామిక వర్గమే కాబట్టి, అది తప్పనిసరి కాబట్టి.. ఆ శ్రామిక ప్రజలు తమ నేల మీదకి ఎవర్ని రానిస్తారు? ఎవర్ని కలుపుకుంటారు? అన్నది. తమను గురించి  పట్టించుకోని వాళ్లని వాళ్లెందుకు తమలో కలుపుకోవాలి? ఈ పెటీ బూర్జువాల ఖాళీ సమయాల్లో వాళ్లకి ఒక రిలాక్సేషన్ సోర్స్‌గా తామెందుకు వుండాలి? అనుకోవచ్చు.

ఇంతకీ ఈ కథ ఇలా ఎందుకు తయారైంది? అనేది దృక్పధాల సమస్య మాట్లాడుకుందాం. కొంచెం ఆగండి.

కథ చెప్పిన విధానాన్ని చూస్తే శిల్పంగా పిలవబడేది స్థిరము కాదు. జఢము కాదు. తీరుబాటు సమాజంలో సాహిత్యానికి వర్తించే సూత్రాలు ప్రతి క్షణమూ పెట్టుబడికి యంత్రభూతముల కోరలు తోమే సమాజంలో ఎంత మాత్రమూ నప్పవు. సమయం తక్కువైన సమాజంలో డాక్టరుగారి జీవితం నుంచి చూసినా సరే, ఏ విషయమైనా క్లుప్తంగా చెప్పడం తప్పనిసరి అవుతుంది. నలభై పేజీల కథ ఆ మేరకి ఏం సాధిస్తుందన్నది ప్రశ్నార్ధకమే. నాలుగు తరాల జీవిత చరిత్ర వివరంగా విస్తరించుకొన్నప్పటికీ పాఠకుడికి కొత్తగా అందిన తెలివిడి ఏమీ వుండదు. చిన్న కథలో రాయబడ్డ ప్రతీ వాక్యమూ మరో వాక్యానికీ, మరీ ముఖ్యంగా కథాంశంగా పిలవబడే ప్రధాన విషయానికి పెనవేసుకుని పొవాలి. కేంద్రాన్ని బలపరిచేదిగా వుండాలి. కథలో ఈ అంశం ఎంత మాత్రమూ కనబడదు. ప్రజల(జీవితం)తో సంబంధం పోగొట్టుకున్న మనవడి ముత్తాతకీ, తాతకీ ప్రజలతో సంబంధం లేదా? తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత సంబంధం తోటే వున్నారే! మరి ఆ జీవితాలన్నీ అంత వివరంగా ప్రస్తావించడం ఎందుకు? అదేం కాదు. ముత్తాత సంగీతము, తాత మొక్కల పెంపకం ఇలా కేవలం విశ్రాంతి అనేదే ప్రధాన విషయం. అంటే కథ నేలమీద కాకుండా పూర్తిగా గాలిలో పుట్టినట్టే. ఫ్యూడల్ సంస్కృతిలోముత్తాత, పెత్తందారీ సంస్కృతిలో తాత ఎంతో విశ్రాంతిగా బతికారనుకోవడం, కలలూ, ఆనందాలూ ఆస్వాదించారనీ రాయడం వాస్తవానికి ఎంత దగ్గరగా వున్నది? పైగా కథకి అక్షరాలుగా చెప్పబడే ఏకసూత్రత, అనుభూతి ఐక్యత ఎలా సాధించినట్టు? చదువుతున్నంత సేపూ పరస్పర విరుద్ధ భావాల్ని కలుగచేసే కథ శిల్పం పరంగా వుత్తమంగా వుందని అనలేం.

మూడవ భాగం

 

ఇంతకీ ఈ కథ ఎందుకిలా తయారైంది అని మనం ప్రశ్నించుకొంటే, చాలా మాట్లాడుకోవాలి గానీ క్లుప్తత కోసం మూడు విషయాలకి పరిమితం అవుదాం.

మొదటిగా రచన ప్రయోజనం చూద్దాం. ఈ రచనకి పూనుకొన్నప్పుడు రచయిత ఆశించిన ప్రయోజనం ఏమిటి? సంపాదన వేటలో మనుషులు ఒత్తిళ్లకి లోనవుతున్నారనీ, అందువల్ల  పిల్లలు సమాజానికి దూరమైపోతున్నారనే. దీనికి విరుగుడుగా  రచయిత సూచించినది పిల్లల్ని కొంత ప్రజా  జీవితానికి దగ్గరగా పెంచాలని. కానీ  ఈ ప్రయోజనాన్ని ఈ కథ సాధించిందనీ, ఈ సందేశాన్ని  బలంగా వినిపించగలిగిందనీ చెప్పలేం. కథని “రసవత్తరంగా” చెప్పాలనే ఉత్సాహమూ, రహస్య ఆకాంక్షలూ కథ ప్రయోజనాన్ని సున్నా చుట్టేశాయి. డాక్టరుగారి ప్రవర్తన వర్ణనా, నైటీలూ, పెదవులూ, ఆకర్షణా, కిసుక్కుమని నవ్వడాలూ, తనలో తనే మురిసిపోవడాలూ, వగైరాలకీ కథ నడకకీ ఏమీ సంబంధం లేదు. “ఏదో” “ఏదో” జరగబోతోందన్న ఉత్కంఠని పాఠకుల్లో లేవనెత్తి కథని చదివించే ప్రయత్నం కథ ప్రయోజనానికి సరిపడదు. ఇదంతా కథని “రసవత్తరంగా”నడిపి చివరికి కథారచన రచయిత ప్రతిష్టలో భాగమైపోతుంది. సంపాదన వేటకి ఫలితం ఒత్తిళ్లు అని గుర్తించిన కధ ఆ సంపాదన వేటకి మూలాల్ని గుర్తించలేక పోయింది. ఉత్పత్తి విధానం పెట్టుబడిదారీ విధానం కావడంతో ప్రజల ఆరోగ్యం కూడా “సరుకు”గా మారి వ్యాపార సూత్రాలకు లోబడి పోటీ, లాభం అనే అంశాలు మానవ జీవితాలకు నిర్ణాయక శక్తులుగా వున్నాయనీ కథ స్పష్టం చెయ్యగలిగి వుంటే ఆశించిన ప్రయోజనం నెరవేరేది. శ్రామికుల జీతాల్నీ, పని గంటల్నీ పోటీ నిర్ణయిస్తుందన్న మార్క్స్ వాక్యం (Pre -Capital formation  అన్న నోట్సులో) ఒక్కటి చాలు కథని ప్రయోజనా పూర్వకంగా మలచడానికి. ఒక రచయిత తాను చూసిన విషయాన్ని కథగా రాసే ముందు చెయ్యవలసిన  అధ్యయనం ప్రాముఖ్యాన్నీ, ఆ అధ్యయనం లేకపోతే కలిగే అనర్ధాన్నీ చెప్పటానికే ఇదంతా రాసాను. మనం చూసిందే రాయాలంటే  సాహిత్యం అవసరం.  ప్రయోజనం పెద్దగా వుండదు. మనం చూసిన విషయాలు అందరూ చూస్తున్నారు. కొందరు రోజూ చూస్తున్నారు. సమస్య ఏంటంటే  చూస్తున్న దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? ఏం తెలుసుకోవాలి అనేదే.. ఆ సమస్యే సాహిత్య ప్రయోజనం. వాస్తవానికీ, వాస్తవికతకీ వున్న తేడా అదే. కనిపించింది చెప్పేవాడు వ్యాఖ్యాత. కనిపించనిది విప్పి చెప్పేవాడు రచయిత.

ఒక వ్యక్తి ఎక్కడ నిలబడ్డాడూ  అన్నది అతని దృక్పధమనీ, తన దృక్పధాన్ని పాఠకుల్తో పంచుకోవడం ద్వారా వాళ్లని ప్రభావితం చేసే ప్రయత్నమే సాహిత్య ప్రక్రియ అనీ మనం అంగీకరిస్తే ఒక రచన ప్రతిఫలించిన సంస్కారం ద్వారా రచయిత దృక్పధాన్ని నిర్ణయించవచ్చు. ఈ కథ చదివిన తర్వాత పాఠకుల్లో కలిగే భావాలేమిటి? రచయిత ఆశయము, ప్రయత్నమూ ఏదైనా కావొచ్చు కానీ పాఠకుల్లో డాక్టరుగారి పట్లా, పిల్లవాడి  పట్లా ఒక రకమైన సానుభూతి కలుగుతూంది. అయ్యో ఎన్ని కష్టాలు పడుతున్నదిరా అనిపిస్తుంది. అలాగే పిల్లవాడి పట్ల కూడా.. దీనిలోని అపసవ్యత గురించి పైన మనం మాట్లాడుకున్నాం.

ముత్తాత సంగీతంలోనూ, తాత మొక్కల్లోనూ “ఆనందం”పొందారని రాయడం పెత్తందారీ సమాజాలకి లేని మంచి తనాన్ని ఆపాదిస్తుంది. అప్పటి మంగళ్ల వాయిద్యాన్ని “సంగీతం”గా ఎవరూ గుర్తించలేదు. అది పొట్టకూటికి చేసే మరో విద్యే. సా.పా.సా అని సాగతీసి పాడే “శాస్త్రీయ” సంగీతకారులకి “మేళం”గా పిలవబడే మంగళ్లకు  దొరికే గౌరవం,స్థానం ఒకేలా, పోనీ కనీసం కుడి ఎడమలుగా వున్నాయా?

గ్రామంలో వైద్యం చేసి పొట్ట పోసుకున్న తాత, నిచ్చెన మెట్ల  సమాజంలో పై మెట్టుకి ఎగబాకే ప్రయత్నమే చేశాడు గానీ, ప్రజల జీవితంలోని హెచ్చుతగ్గుల్ని సరిచేసే సంస్కారం ఏమీ ప్రయత్నించలేదు. “ముందుగా మీ వాడిలో ఏమైనా వుందేమో చూడండి” అన్న కథకుడు గానీ, తన తాత తండ్రుల సంగీత సాధనని వైనవైనాలుగా వర్ణించిన డాక్టరుగారు గానీ సంగీతం, విద్య వగైరా అనువంశికాలనీ, దైవదత్తాలనీ, పూర్వజన్మ సుకృతాలనీ ప్రచారం చేసే బ్రాహ్మణీయ భావజాలానికి భిన్నంగా ఆలోచించలేదు.

గతంలో  ప్రజలు విశ్రాంతిగా, కళాత్మకంగా జీవించేరు, ఆనందించేరు. ఇప్పటి స్పీడు( ఉసూరుమనిపిస్తుందండీ) దాన్ని దూరం చేసిందన్న భావం ఎవరికైనా కలిగే అవకాశం వున్నది. అది మనల్ని వ్యక్తిగతంలోకి, భూస్వామ్య,  పెత్తందారీ సంస్కృతి (దేవరా!) వైపూ, ఆ శిధిల సమాజం వైపూ ఆశగా చూసేటట్టు చేస్తే ఆ తప్పెవరిది?

కథ చెప్పిన విధానాన్ని చూస్తే శిల్పంగా పిలవబడేది స్థిరము కాదు. జఢము కాదు. తీరుబాటు సమాజంలో సాహిత్యానికి వర్తించే సూత్రాలు ప్రతి క్షణమూ  పెట్టుబడికి యంత్రభూతముల కోరలు తోమే సమాజంలో ఎంత మాత్రమూ నప్పవు. సమయం తక్కువైన సమాజంలో డాక్టరుగారి జీవితం నుంచి చూసినా సరే, ఏ విషయమైనా క్లుప్తంగా చెప్పడం తప్పనిసరి అవుతుంది. నలభై పేజీల కథ ఆ మేరకి ఏం సాధిస్తుందన్నది ప్రశ్నార్ధకమే. నాలుగు తరాల జీవిత చరిత్ర వివరంగా విస్తరించుకొన్నప్పటికీ  పాఠకుడికి కొత్తగా అందిన తెలివిడి ఏమీ వుండదు. చిన్న కథలో రాయబడ్డ ప్రతీ వాక్యమూ మరో వాక్యానికీ, మరీ ముఖ్యంగా కథాంశంగా పిలవబడే ప్రధాన విషయానికి పెనవేసుకుని పొవాలి. కేంద్రాన్ని బలపరిచేదిగా వుండాలి. కథలో ఈ అంశం ఎంత మాత్రమూ కనబడదు. ప్రజల(జీవితం)తో సంబంధం పోగొట్టుకున్న మనవడి ముత్తాతకీ, తాతకీ  ప్రజలతో సంబంధం లేదా? తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత సంబంధం తోటే వున్నారే! మరి ఆ జీవితాలన్నీ అంత వివరంగా ప్రస్తావించడం ఎందుకు? అదేం కాదు. ముత్తాత సంగీతము, తాత మొక్కల పెంపకం ఇలా కేవలం విశ్రాంతి అనేదే ప్రధాన విషయం. అంటే కథ నేలమీద కాకుండా పూర్తిగా గాలిలో పుట్టినట్టే. ఫ్యూడల్ సంస్కృతిలోముత్తాత, పెత్తందారీ సంస్కృతిలో  తాత ఎంతో విశ్రాంతిగా బతికారనుకోవడం, కలలూ, ఆనందాలూ ఆస్వాదించారనీ రాయడం వాస్తవానికి ఎంత దగ్గరగా వున్నది? పైగా కథకి  అక్షరాలుగా చెప్పబడే ఏకసూత్రత, అనుభూతి ఐక్యత ఎలా సాధించినట్టు?  చదువుతున్నంత సేపూ పరస్పర విరుద్ధ భావాల్ని కలుగచేసే కథ శిల్పం పరంగా  వుత్తమంగా వుందని అనలేం.

సంభాషణల రూపంలోనూ, మారే దృశ్యాలతోనూ, పరిపుష్టమైన పాత్రలతోనూ నడిచే కథ కళాత్మకతను సంతరించుకుంటుంది. డాక్టరుగారి అంతులేని వుపన్యాసంతోనూ, రకరకాలుగా ప్రవర్తించే  పాత్రలతోనూ సాగిన కథ కళావిలువలుగా పిలువబడే సౌష్టవానికి చాలా దూరంలోనే వుండిపోయింది.

పాత్రల చిత్రణ, కథా సంవిధానం, నాటకీయత వగైరా ఎన్నో విషయాలు గురించి మరోసారి ఎప్పుడైనా మాట్లాడదాం.

ఈ కథ కింద నిజంగా నేల వుందా?!

khadeer babu

khadeer babu

గతంలో మహమ్మద్ ఖదీర్‌బాబు కథల గురించి నేను రాసిన తర్వాత వునికీ, పేరూ చెప్పకుండానే ఒక మిత్రుడు ఫోను చేసి చాలా కోప్పడ్డారు.  తెలుగు భాషలో అన్ని నెగటివ్ పదాలు వున్నాయని అప్పుడే  తెలిసింది. ఒక మేధావి రచయిత గురించి నీకేం తెలుసని నువ్వు రాశావూ? అన్నది తాత్పర్యం. మరో మిత్రుడు మాట్లాడుతూ ఆంధ్రదేశంలో  ఆఖరి కథా రచయిత గురించి అవాకులూ, చెవాకులూ రాశావన్నారు. ఒక ప్రొఫెసర్ గారు ముఖస్తంగానే “నువ్వు ఓ ఫండమెంటలిస్టువి” అన్నారు.

చిన్నవయసులోనే (నాకంటే) ఇంత మంది గొప్ప అభిమానుల్ని సంపాదించుకొన్న రచయిత గురించి రాసే సమయంలో నా బద్ధకం ఇంత పని చేసిందని నాకు అర్ధం అయ్యింది. అందుకే ఆయన కథల్ని ఒక్కొక్కటీ చదవడం అవసరమనిపించింది. ముందుగా నేనెంచుకున్న కథ ” కింద నేల వుంది” అనేది. ఈ కథ ‘తెలుగునాడి’ జూన్, జులై 2005లో ప్రచురించబడి వుత్తమకథగా ఎన్నికైంది. వుత్తమోత్తమ కథగా ఎడిటర్ల ప్రశంసలందుకుంది. నలభై పేజీల కథని పరామర్శించేందుకు నాకోసం కొంచెం సమయం కేటాయించమని ముందుగా మనవి చేసుకుంటున్నాను.

లక్ష్మి అనే డాక్టరుగారు తన కొడుకు ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడం లేదనీ, చదువూ, ఎలక్ట్రానిక్ పరికరాల్తోనే వుండిపోతున్నాడని గ్రహించి బాధపడి సంగీతం నేర్పించాలనుకుని సహాయం కోసం కథకుడ్ని కలిసి తన జీవిత చరిత్ర చెప్పుకొని బాధ పడ్తోంది. చివర్లో ఆ కుర్రాడు మొక్కల పెంపకం మీద శ్రద్ధ చూపిస్తున్నాడని తెలిసి ఎంతో ఆనందపడ్తుంది.

అందుబాటులో వున్న పరికరాల సాయంతో ఒక్కొక్కటిగా విషయాలు చూద్దాం. ఖదీర్‌బాబు కథల్లో కొన్ని ప్రత్యేకతలుంటాయి. అవి పాఠకలోకాన్ని కొంత ఆకట్టుకొంటాయి. వాటిలో ఒకటి వాతావరణం. ఆయన కథలు శోకసముద్రంలో మునిగి తేలవు. పాత్రలు దుఃఖంలో కూరుకుపోయి కన్పించవు. న్యూ బాంబే టేలర్స్, ఖాదర్ లేడు, దావత్‌లాంటి కథల్లో కూడా విషాదం ఒక నేపధ్య శబ్దంగానే వుంటుంది కానీ ప్రధాన స్రవంతిగా వుండదు. పాఠకుల్లో అతి ఎక్కువ సంఖ్యగా వుండే ” తీరుబాటు శ్రేణుల”కి ఇది ఒక పెద్ద రిలీఫ్. ఆదివారం బద్ధకానికి ఈ వెసులుబాటు ఒక వెండి జలతారు. రైతులు, గ్రామీణ వృత్తికారులు, స్త్రీలు వగైరాల కన్నీటి కథలకి భిన్నంగా తమ చుట్టూ వున్న పట్టణం, నగర జీవితంలో సాగే కథలు చదవడం ఒక ఆత్మీయతని పెంచుతాయి. సరే విషయాల్లో కెళ్తే…

కథలోని పాత్రలు మూడు. మొదటిది.. ప్రధానంగా కన్పించే డాక్టరు పాత్ర. సాధారణంగా కథ రాసేటప్పుడు ఏదో ఒక పాత్ర పైన, ఆ పాత్ర చుట్టూ  వున్న పరిస్థితుల పైనో సానుభూతి కలిగించే విధంగా కథ రాస్తారు. మరీ సాధారణంగా ఆ పాత్ర ప్రధాన పాత్ర అయి వుంటుంది. కానీ ఈ కథలో రచయిత కానీ, కథకుడు గానీ అలాంటి ప్రయత్నమేమీ చెయ్యరు. ఈ పాత్రని చూస్తే.. పేజీలకు పేజీలు ఉపన్యాసంగా  సా… గిన ఆమె జీవిత చరిత్ర చూస్తే… ఆమె పరుగెడుతోంది. ఆ అలుపులో ఆయాసంతో తన మీద తనే జాలి పడుతోంది. తన కష్టాలు వినమంటోంది ??

“త్రీ బెడ్‌రూం ఫ్లాట్ అది. ఫైన్‌గా వుడ్‌వర్క్ చేసిన అల్మారాలు, డాంబికంగా కనిపించకపోవడమే ప్రత్యేకతగా కలిగిన ఖరీదైన వస్తువులు. కోడిగుడ్డు ఆకారంలో తెల్లగా మిలమిలా మెరిసిపోతున్న వాష్‌బేసిన్లు…: ఆ ఫ్లాట్ ఎక్కడ? నగరానికి దూరంగా కాదు. బషీర్‌బాగ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పోష్ అపార్టుమెంట్లు వున్న కాలనీలో. ఆమె తిరిగేది కారులో. మిగతావన్నీ షరా మామూలే. ఇంట్లో పనమ్మాయి. సెల్‌ఫోన్లు. వీటన్నింటితో పాటు ఆమె రోజూ వైన్ తాగుతోంది. ఆమెకి ఎంత అలవాటంటే ఇంట్లో కొత్తవాళ్లున్నా కూడా తాగకుండా వుండలేనంత. కొడుక్కి, ఒక్కగానొక్క కొడుక్కి, అన్నం తినిపించి కబుర్లు చెప్పడం కూడా మానేసి కూచుని తాగేంత. విపరీతమైన వేగంతో చాలా ఎక్కువ తాగేంత. అంతటి పక్కా తాగుబోతు ఆమె.

ఇక ఆమె ప్రవర్తన చూస్తే ఎంతో వెకిలిగా వుంటుంది. ముక్కూ మొహం తెలియని ఒక కథా రచయితని ఒక వర్షం కురుస్తున్న రాత్రి మొగుడు లేనప్పుడు ఇంటికి తీసుకొచ్చేస్తుంది. అతనితో రెండోసారి ఫోనులో మాట్లాడుతూ “ఆమెకామె మురిసిపోతూ” “కిసుక్కుమని నవ్వుతూ” మాయా జలతారు కప్పుతుంది. పెద్ద పరిచయం లేని మగాడి ఏకాంతంలో “నైటీలోకి మారి”పోతుంది.

ఇంత అవకతవకగా, ఇంత వెకిలిగా ప్రవర్తించే ఒక స్పెషలిస్టు, ఆడ డాక్టర్లు మన సమాజంలో అత్యంత చిన్న మైనార్టీగానే వుంటారని నేను నమ్ముతున్నాను. మరి ఆ నూటికో కోటికో ఒక్కరి గురించి రాసి లక్షలాది మంది చదివే పత్రికల్లో ప్రచురించడం ఎందుకు? రచయిత ప్రణాలిక, ఆశించిన ప్రయోజనం ఏమిటి? అని చూస్తే మనం రెండో పాత్రని చూడాలి.

డాక్టరుగారి కొడుకు, చిన్నూ. “అతనికి పన్నెండు ఉండొచ్చు. కానీ వేరేగా వున్నాడు. ఆ వయసుకే చాల పెద్దరికంతో కన్పిస్తున్నాడు. చనువు తీసుకుని ముట్టుకోవాలన్నా భయంగా అనిపించేంత”.  చిన్నూ “నలుగురిలో కలిసే రకం కాదండి” మాట్లాడటమే తగ్గించేశాడు. తన పక్కన ఇద్దరు మాట్లాడుకుంటున్నా పట్టించుకోడు. సెల్‌ఫోన్‌తోనే ఆడుకుంటాడు. విపరీతమైన చదువు. ఇంగ్లీషులోనే మాట్లాడతాడు. వాననీ, ప్రకృతినీ చూసే, ఆనందించే ఆసక్తే లేదు.  ఇవన్నీ సరేకానీ, ఎక్కువ చనువు లేని వాళ్ల ముందే తల్లితో వాళ్ల గురించి తప్పుగా మాట్లాడతాడు. అతను తల్లికే రంకు కడతాడు .. తల్లి మాటల్లోనే “కొత్తల్లో వాడు పదే పదే ఫోను చేస్తూ నా వేరెబౌట్స్ తెలుసుకుంటుంటే కన్శర్న్‌తో చేస్తున్నాడేమో అనుకునేదాన్ని. కాదు. నా మీద లైకింగ్ అన్నమాట. తల్లిని అనుమానించే కొడుకు. మీరు నమ్మరు. నా మగ స్నేహితులందరూ మా లాండ్‌లైన్‌కి చేయడమే మానేశారు. వీడు ఎత్తాడంటే అవతలి పక్షాన్ని ఏదో విధంగా అవమానించేవాడు”

“ఆ వయసు పిల్లల్లో ఉండాల్సిన అమాయకత్వం లేదు. హుషారు లేదు. ఎప్పుడు చూసినా నంబ్‌గా ఉంటాడు. విపరీతమైన చదువు. కంప్యూటర్లో గేమ్స్. నా మీద నిఘా. ఈ మూడు పనులే వాడు చేసేది” అంటుంది.

పిల్లాడి మాటలు చూద్దాం.

“రోజూ తాగుతున్నావ్. ఇవాళ ఇంకెవరినో తెచ్చిపెట్టుకుని తాగుతున్నావ్. నాన్నతో చెబుతాను ఉండు” అని వూరుకోడు.

“రాక్షసి, నాన్నను వదిలేసి ఇంకెవరితోనో… మర్యాదగా అతన్ని బయటకు పంపు లేకుంటే…”

అదీ విషయం. లావుగా, వూబగా పెరిగిన శరీరంతో చిన్నూ ఇంత వికృతంగా తయారయ్యాడు.

కథలోంచి చూస్తే ఇది కార్యకారణ సంబంధం. తల్లి అలా వుండబట్టే కొడుకు ఇలా తయారయ్యాడు. అయితే తల్లి అలా అవడానికి కారణాలేంటి? డాక్టరు మాటల ప్రకారం ఫ్రస్ట్రేషన్ (అశాంతి), రోజుకి పన్నెండు గంటలు పని చెయ్యడం, డిప్రెషన్, అవసరమైన వేళలో భర్త తోడు లేకపోవడం, పెద్దల్ని ఎదిరించి చేసుకున్న కులాంతర వివాహం వల్ల “కుటుంబం” లేని ఒంటరితనం, సొఫిస్టికేటెడ్‌గా మోసం చేయ్యడం, వంచన.. ఇదంతా ఎందుకంటే కెరీర్ కోసం. డబ్బు కోసం. అందుకోసం డాక్టరు అలా అయ్యింది. అందువల్ల కొడుకు ఇలా అయ్యేడు. వెరశి “ప్రాణం ఉసూరుమంటోందండి ఈ సొసైటీని చూస్తే. ఈ స్పీడు మంచిది కాదు” అందుకోసం మనుషులు మారాలి. ప్రజలతో కలిసి నేలమీద నడవాలి. సహజంగానూ, సంతృప్తితోనూ జీవిస్తే చిన్నూలు బాగుంటారు. అదీ కథ.

అయితే ఈ కథని మనం కథకుని మెదడులోంచి చూస్తాం. అతని ఆలోచనల్లోంచి చూస్తాం. కథకుడి పాత్రని చూస్తే అతనొక జర్నలిస్టు. కథా రచయిత. అయితే అతను రాసిన కథ ఎలాంటిదో, ఏ ప్రయోజనం ఆశించి రాస్తున్నాడో తెలీదు. కథారచన అతని ప్రతిష్టలో భాగమా? అతని ఆశయాల వ్యక్తీకరణా? అతని ఆచరణా మార్గమా? వివరాలు తెలీవు గానీ అతని వ్యక్తిత్వాన్ని అంచనా వెయ్యడానికి కొన్ని ఆధారాలు దొరుకుతాయి. నికార్సైన వెకిలిపాత్ర ఇది. ఒక మామూలు రచయితకి ఒక స్పెషలిస్టు డాక్టరు “పడిపోయినట్టు” అన్పించేలా మాట్లాడతాడు.

“మీ ఆవిడ ఎదుట నేరుగా చెప్పడం సిగ్గుగా అనిపించింది” అని కిసుక్కున నవ్వింది. అని తనలో తనే మురిసి పోతుందని రాయడం, తన ఎదురుగా నైటీలోకి మారిందని రాయడం కేవలం అతని రహస్య ఆకాంక్షలే కాకపోతే, ” ఆ రంగుల నైటీలో ఆకర్షణీయంగా వుంది” “తడిసిన పెదాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి” అని చెప్పడానికి కథకీ ఏమిటి సంబంధం? అతని మాటల్లోనే “నాకు ఆమె ముఖ్యం. ఆమె కోరినట్లుగా ఆమెతో కాసేపు మాటలు ముఖ్యం” దయచేసి ఒక్కొక్క పదం చదవండి. పైగా “ఆమె కథ తెలుసుకోవాలి. అందుకు ఈ ఒక్కరోజు ఏం జరిగినా భరించాలి” భరించి, తెలుసుకొని కథగా రాసి కీర్తి కొట్టెయ్యాలి. ఇక తన కళ్లముందున్న, తన తప్పేమీలేని చిన్నపిల్లవాడి పాత్రని కూడా సానుభూతితో వివరించకుండా “ఈ దెయ్యంగాడ్ని (వేరే మాట అనుకున్నాను)” అని చెప్పే ఈ రచయిత ఎలాంటి కథలు రాస్తాడో సుళువుగానే అర్ధం అవుతుంది. ఇతర్ల జీవితాల్లోకి తొంగి చూసే (వోయర్) స్త్రీని శరీర అంగాలుగా చూసే (ఎగ్జిబిషనిజం) కథకుడు నాకు వెకిలిగానే కన్పించాడు. అందుకే ఇతనికి ఎవరి పట్లా సానుభూతీ లేదు. సహాయం కోరి వచ్చిన స్త్రీకి ఏ విధమైన సహాయమూ చెయ్యడు.

కధంతా చదివిన తర్వాత మనకి అంతా గందరగోళం మిగుల్తుంది. ఇది సాహిత్య ప్రయోజనానికి భిన్నం. వ్యతిరేకం. కధో, కవితో, వ్యాసమో చదివిన తర్వాత పాఠకులకి కొత్త  తెలివిడి కలగాలి. అస్పష్టతలు విడిపోయి స్పష్ఠత పెరగాలి. ఈ కధలో అతి పెద్ద గందరగోళం డాక్టరుగారి జీవితం.. ఆవిడ దుఃఖానికి, విషాదానికి కారణం వ్యక్తిగత జీవితమా? సాంఘిక కట్టుబాట్లా? ఆర్ధిక సూత్రాలా? ఎక్కడా స్పష్టత లేదు. పిల్లాడు అలా తయారవ్వడానికి తల్లే కారణమా? ఆమె కాస్త బాధ్యతగా వుంటే సరేనా?

ఈ గందరగోళానికి కారణం సమస్యల్ని వ్యక్తుల వైపు నుంచి చూడడం. సమాజాన్ని నడిపించే శక్తుల పట్ల అవగాహన లేకపోవడం. పిల్లాడు లేదా తల్లి సంఘం నుంచి వేరు చెయ్యబడడానికి కారణాలు తెలియక పోవడం. పిల్లాడు సెల్‌ఫోన్‌తో ఆడుకోకుండా కుక్కల్నో, మొక్కలనో పెంచుకుంటే అంతా బాగున్నట్టేనా? అతను ‘జన జీవనస్రవంతి”లో కలిసిపోయినట్టేనా?

వాస్తవం చూస్తే ఈ కధలోని పిల్లాడు మనకు కనబడినట్టే  వుంటుంది. నిజమేగదా అనిపిస్తుంది. కానీ ఇక్కడే, సరిగ్గా ఇక్కడే రచయిత లేదా వ్యాఖ్యాత దృష్ఠికోణం అవసరం అవుతుంది. కనిపించే జీవితాన్ని సరైన దృక్పధంతో చూసి మన కళ్లముందు వుంచే ప్రయత్నం. దానికి కావలసిన అధ్యయనమూ, కృషీ రచయిత చెయ్యకపోతే ఇలాగే వ్యక్తుల పట్ల ద్వేషాన్ని, అసహనాన్నీ పెంచుకుంటూ పోతాం. అప్పుడు పాత్రలపట్ల, మనుషుల పట్ల కలగవలసిన కనీసపు సానుభూతిని కలిగించలేకపోతాం.

పెద్ద పెద్ద డాక్టర్ల, బాగా డబ్బున్నవాళ్ల పిల్లలే కాదు, దాదాపుగా అందరూ అలాగే వున్నారు. సెల్‌ఫోన్, టీ.వీ. ఇంటర్నెట్‌లు  ఆ ప్రత్యక్ష కారణాలుగా వున్నాయి. ఈ అంశం మీద రాసిన పాపినేని శివశంకర్‌గారి కథ మనం చదవొచ్చు. ఆటలు లేవని బాధ సహజమే. అయితే నగరీకరణ మనుషులు తిరిగే ప్రదేశాన్ని హరించి వేస్తోంది. నగరాల్లో మనిషి సగటున కేవలం మూడు నాలుగు అడుగుల జాగాలో గడుపుతున్నాడు. నిలువునా పాతేసినా చాలనంత. ఉమ్మడి స్థలాలు ‘సరుకుగా మారిపోయేక, కాంక్రీటు రోడ్ల మీద కబడ్డీ ఆడలేరు. ఏ క్రికెట్టో ఆడదామన్నా వున్న రోడ్లన్నీ కారు పార్కింకులకే సరిపోవడం లేదు. ఒకే ఆర్ధిక స్థాయి వున్న పిల్లలంతా ఒకే స్కూల్లో చదవడంతో, వాళ్లు నగరం నాలుగు మూలల్లో వుండడంతో వారి మధ్య ఆడుకునేంత సాన్నిహిత్యం ఏర్పడదు.

పోష్ ఏరియాల్లో “నేల మీద” వుండే జనం వుండలేరు. తల్లీ, తండ్రీ ఇద్దరూ కష్టపడకపోతే పొట్ట గడవదు. ఒంటరితనంలో గడీపే పిల్లలకి సెల్‌ఫోన్లు, కంప్యూటర్ గేమ్సు, టెలివిజనూ తప్పించి మనం ప్రత్యామ్నాయం ఏం చూపించగలం? ఇంట్లోకి కొత్త పిల్లలొస్తే ఏం పోతాయో అన్న భయంతో మనం పిల్లలకి స్నేహితుల్ని ఎలా చూపించగలం?

ఇక్కడ డాక్టర్లకి వచ్చే ఆదాయం కంటే వేరే చోట ఎక్కువ వస్తున్నప్పుడు పెళ్లాం పిల్లల్ని వదిలిపోవద్దంటూ మనం ఇచ్చే అధర్మ నినాదాలు ఏ మేరకి మనుషుల్ని పట్టి వుంచుతాయి? కూలీకైనా, సాఫ్ట్‌వేర్ కూలీకైనా, డాక్టరుకైనా సూత్రాలు తేడాగా లేనప్పుడు జీవితం తేడాగా ఎలా వుంటుందీ?

సమస్యల కుదుర్లోకి పోకుండా విడివిడిగా చూడ్డం మొదలుపెడితే ఆకుల్ని చూసి చెట్టుని వర్ణించినట్టుగా ఇలాగే గందరగోళంగానే వుంటుంది.

ఇంతకీ, ఈ పాత్రల్ని సానుభూతి రగిల్చే విధంగా, కన్నీటి ముద్దలుగా తయారుచేస్తే నాకు సరేనా? పిల్లాడు మొక్కల్నో, కుక్కల్నో పెంచడం కాకుండా మురికివాడలోని పిల్లల్తో కర్రాబిల్లా, కోతి కొమ్మచ్చి ఆడుకున్నట్లు రాస్తే నాకు సరేనా? అంటే కాదు.

ఈ పాత్రల పట్ల నాకు పెద్దగా సానుభూతి లేదు. అయితే నా కారణాలు నాకున్నాయి.

అవేంటో చెప్తాను. కొంచెం ఆగాలి.

—చిత్ర

-చిత్ర

ఈలాంటి కథల్ని పల్లకీకెక్కించి మనమేం సాధిస్తాం??

మరో వుత్తమ కధ చూద్దాం. స్వాతి మాసపత్రిక మే 2012 లో  వి.రాజారామ్మోహనరావుగారు “ఉన్నంతలో” అనే కథ రాశారు.

భర్తకి జబ్బు చేస్తే ముక్కూమొహం తెలీని రామారావుని సాయం కోరుతుంది అరుంధతి. హాస్పిటల్‌లో చేర్పించి ఖర్చంతా భరిస్తాడు రామారావు. ఆ అప్పు తీర్చలేని అరుంధతి రామారావుతో సంబంధం ఏర్పరచుకొంటుంది. అరుంధతి భర్త మంగరాజు మంచానికే పరిమితమైపోడంతో ఆ సంబంధం కొనసాగుతుంది. తమ మధ్య అడ్డంగా మంగరాజు వద్దని వృద్ధాశ్రమంలో చేర్పించి, ఖర్చంతా తనే భరిస్తానన్న రామారావు ప్రతిపాదనని తిరస్కరిస్తుంది అరుంధతి. కథ చదివిన తర్వాత మనకు కలిగే ఆలోచన్లేంటి?

“రాజుకి ఆరునెలలుగా బాగోలేదు ఇల్లు కదలలేకపోతున్నాడు” అని స్వయంగా రాసిన రచయిత “అంత డబ్బు ఖర్చవుతుందని అని అరుంధతి అనుకోలేదు” అని తనే స్వయంగా చెప్పడం విశ్వసనీయంగా లేదు. అరుంధతికి నలభై రెండేళ్లు. అంతే కాదు. “ప్యాకింగ్ మెటీరియల్ తయారుచేసే ఓ ఫాక్టరీలో చిన్న ఉద్యోగం చేస్తూ, అనారోగ్య భర్తని పోషిస్తూ కాలం గడుపుతోంది అరుంధతి” అని రచయిత చెప్తారు. వాస్తవ దృష్టితో చూస్తే దాదాపు ఒంటి చేత్తో సంసారం నడుపుకు వస్తున్న  స్త్రీలకు కొంత “లోకజ్ఞానం” వుంటుంది. నలభయ్యేళ్ళ వయసు ఎంతో కొంత “తెలివిడి” తెచ్చే వుండాలి. అటువంటి స్త్రీ  ఏ రకమైన గత పరిచయం లేని ఒక పురుషుడు తన కుటుంబంపై అంత ఖర్చు పెడుతున్నప్పుడు వచ్చే పరిణామాల్ని ఊహించలేదని నమ్మలేం. అలా చూసినపుడు విధిలేక పరిస్థితులకు తలొగ్గే స్త్రీల పట్ల కలిగే సహజ సానుభూతి కలగదు. ఆ పాత్రపై ఒక సానుకూల దృక్పధమూ కలగదు. పాఠకులకు ఇది వాస్తవం కంటే కల్పన అనే నమ్మకమే ఎక్కువ కలుగుతుంది.

మరో విషయం చూస్తే అరుంధతి వుండేది ఒక రకం “వాడ”లో ” మీ యింటి ఎదురు సందులో వుంటాం” అని స్వయంగా ఆమే చెప్పింది. సందుల్లో వుండేది బీదజనమే. సాధారణంగా బీదవాడల్లో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఇరుగుపొరుగు జనం మూగుతారు. సహాయం చెయ్యలేకపోవచ్చు, డబ్బు ఇవ్వలేకపోవచ్చు కానీ అక్కడ ఒక రకం అలికిడి, కొంత హడావిడి కలగడం వుంటుంది. అటువంటిది అరుంధతి ఒంటరిగా వెతుక్కుంటూ రామారావు ఇంటికి రావడం కూడా కల్పనకి దగ్గరగా వుంటుంది.

వాస్తవంలో మనం ఆశించేదీ, అబ్బురపడేదీ ఈ వుమ్మడి తత్వం గురించే.. మధ్య తరగతిలో లేనిదీ అదే.

“నెలకి అరుంధతికి ఇంటికి పదివేల రూపాయలు ఖర్చవుతున్నాయి. అది అతనికి ఎంత మాత్రం భారం కాదు” అని రచయిత స్వయంగా రాస్తారు. తర్వాత “మరో పదివేలు ఖర్చు అవుతాయి” అని స్వయంగా రామారావు అంటాడు. ఒకరి కోసం నెలకి ఇరవై వేలు ఖర్చు పెట్టగలిగిన  “లోలోపల  సుప్తచైతన్యం లోని ఎడారిలాంటి ఒంటరితనాన్ని” భరించిన రామారావు, “భార్య తర్వాత మరే స్త్రీ పట్లా ఆసక్తి చూపించలేదు” అని నమ్మడం కష్టమే. ఇది వాస్తవంకంటే కల్పనకే బాగా దగ్గరగా వుంటుంది.

మంగరాజు కోసం డబ్బూ, సమయం ఖర్చుపెట్టగలగడం, రికామిగా వుంటూ డబ్బు సంపాదించగలిగే వున్నత వర్గ మనుషులకే సాధ్యం.  కింది వర్గానికి చెందిన అరుంధతిని సుళువుగానే సమాజం భాషలోని “నీతి” కోల్పోయే దానిలా చిత్రీకరించి, వున్నతవర్గానికి చెందిన రామారావుని జాలి, సానుభూతి, దయ వగైరా “గొప్ప” గుణాలున్న వ్యక్తిగా చిత్రీకరించడం కల్పన కాదంటే నమ్మడం అస్సలు సాధ్యం కాదు.

కథ చదువుతూ పోయేకొద్దీ ఇది రచయిత ఆలోచనల్లోంచీ, కల్పనా శక్తిలోంచీ పుట్టిన కథే అన్నది బలపడుతూనే వుంటుంది. ఇక ఈ కథకి పాఠకులు(Takers) ఎవరు అని ఆలోచిస్తే..

ఏ వృత్తిలో, ఏ వ్యాపకంలో చూసినా పనిగంటలు పెరిగిపోయాయి. జానెడు పొట్ట కోసం తెగ బారెడు పని చేస్తూ నిరంతరం భయంతో, అభద్రతతో బతికేలా మనుషుల్ని తయారు చేస్తున్నది పెట్టుబడీదారీ. వాళ్లకి సాహిత్యాల్తో, కళల్తో పని లేదు. వుండదు. మొదట్నించీ కాల్పనిక సాహిత్యానికి ప్రధాన పోషకులైన జానెడు తీరుబాటున్న మధ్యతరగతి స్త్రీలోకం అదృశ్యమైపోతూ వున్నది. దాదాపు ప్రతి స్త్రీ, తన పొట్ట కోసం, సంసారం కోసం, బండెడు చాకిరీ చెయ్యక తప్పటం లేదు. అందుకే కాల్పనిక సాహిత్య పాఠకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ పూర్తి కాల్పనిక, వ్యూహా చాతుర్యం మీద ఆధారపడ్డ ఇలాంటి కథల్ని కీర్తించి, భుజాలకెత్తుకోడం కల్పనకి తులసి నీళ్లు పోయడమే. సంస్కారాన్ని వున్నతీకరించడం సాహిత్యం ఇచ్చే ప్రయోజనం అనుకుంటే ఆ ప్రయోజనానికి ఈ కథ విలోమంగా వుంటుంది. పాత్రకి అరుంధతి అని పేరు పెట్టడం. ఏం చేసైనా సరే భర్తని కాపాడుకోవాలన్న సుమతి, సక్కుబాయిల్ని ఆదర్శంగా తీసుకొచ్చి చూపించే ప్రయత్నమూ, చుట్టూ వున్న వాస్తవానికి పూర్తి విరుద్ధం. పాత్రివ్రత్యం రాచరిక, భూస్వామ్య సమాజాల విలువ.

పోనీ కల్పనగా తీసుకున్న కథలో పెద్ద గొప్ప, ప్రత్యేకత కనబడకపోవడం బహుశః నా లోపమేనేమో? భర్త ఆరోగ్యాన్నీ, గౌరవాన్నీ, ప్రాణాల్నీ కాపాడ్డానికి తన శీలం (క్షమించాలి) పణంగా పెట్టడం ఎన్నోసార్లు చదువుకున్న పౌరాణిక వారసత్వమే. కథనం మామూలు వచనమే. పాత్రచిత్రణలో కూడా ఏకసూత్రత కనబడక ఒకే పాత్రపై విరుద్ధ భావాలు కలగడం కళావిలువల దృష్ట్యా ఓటమే. “ఏ అరమరికలు లేకుండా” మాట్లాడుకున్న రామారావు, అరుంధతిల మధ్య సంభాషణ గోరంత కూడా చెప్పకుండా మనిషి మారిపొయినట్లు చెప్పటం కథలో “టెంపో”ని పోషించదు. రామారావు భార్య ఎందుకు వెళ్లిపోయిందో చెప్పకుండా “అన్ని సౌకర్యాలు వుండి, ఏ ఇబ్బంది లేకపోయినా అదనపు సౌఖ్యమని తన భార్య ఎవరితోనో వెళ్ళిపోయింది” అనుకుంటాడు.

వెళ్ళిపోయే స్త్రీ పాత్ర  ఒకటి, సుళువుగా లొంగిపోయే స్త్రీ పాత్ర ఒకటి సృష్టించి, రిపీట్ , సృష్టించి వారి మధ్య ఒక దయామయుడైన పురుష పాత్రని ప్రతిష్టించి ఏ స్త్రీ పాఠకుల్ని గెల్చుకుందామనుకున్నారో అర్ధం కాదు. వారికేం చెప్పదల్చుకున్నారు? వెళ్లిపోవద్దా? భర్త కోసం ఏమైనా చెయ్యకూడదా? తన పాఠకుల పట్ల తనకే సరైన అవగాహన లేకపోయిన కథ ఏం సాధిస్తుంది?

ఈలాంటి కథల్ని పల్లకీకకెక్కించి మనమేం సాధిస్తాం??

–చిత్ర

లెక్కల చిక్కు “రుణం”

మరో వుత్తమ కథ చూద్దాం. ఇదో అప్పు కథ. విలువల కథ. వంశగౌరవాల కధ. పరువు-ప్రతిష్టల కథ.

సారధి అనే కథకుడు తను పని చేస్తున్న ఒక ప్రభుత్వరంగ సంస్థ తను ప్రభుత్వం దగ్గర తీసుకున్న అప్పుని తీర్చగలిగే స్థితిలో వుండి కూడా  వాయిదాకోసం ప్రయత్నించడం గురించి ఆవేదన చెందిన కథ. తను చిన్నప్పుడు బూట్లు ఎరువు తీసుకుని అవి పాడైపోతే వాటి ఖరీదు కట్టి ఇవ్వలేక పడ్డ ఆవేదన కథ. ఆ మిత్రుడు  మాధవరావుని కలిసి, దాదాపు ముప్పయ్యేళ్ల తర్వాత, క్షమాపణ కోరి తన “విలువల్ని” కాపాడుకున్న కథ. క్షమాపణ తర్వాత సారధి “మనస్సు ఉతికిన బట్టలా తేలిక అయ్యింది” అనుకుంటాడు. వెంటనే “కుటుంబాల నుండి, వంశాలనుండి,  వాటికంటూ ఒక ధారలాంటిది ఉంటుంది” అంటాడు. “విలువలు మారుతూనే ఉంటాయి. అయితే మారకూడని విలువలు కూడా వుంటాయి” అంటాడు. కథ చదివిన తర్వాత మనకొక ప్రశ్న వస్తుంది. ఎన్ని కష్టాలైనా పడి అప్పు తీర్చి తీరాలన్నది ఎలా “మారకూడని విలువ” అవుతుంది? దీనికి సమాధానం దొరకాలంటే మనం “అప్పు” పునాదిని పరిశీలించాలి. అప్పుకి మూలం అసమానత.  అవసరానికి మించిన డబ్బు, కేవలం మారక మాధ్యమం(Exchange Medium) ఒక చోట, అవసరాలకి సరిపోని ఆదాయం ఒక చోట వుండడం వల్ల అప్పు ఒక అవసరంగా వచ్చి ఆయుధంగా తయారౌతుంది.

జీవనోపాధికి అవసరమైన భూమి కొద్దిమంది చేతుల్లో వుండిపోవడంతో ఎంతోమంది కూలీలుగా, బీదవారుగా మిగిలిపోయేరు, కనీస అవసరాల కోసం వారు ఆదాయం చాలక, అప్పుపై ఆధారపడ్డారు. వాడకం సరుకుల వ్యాపారంతో పాటు మారకం సరుకు వ్యాపారం కూడా మొదలైంది. మొదటి దాంట్లో మిగులు ని “లాభం” అంటే రెండో దాంట్లో మిగులుని “వడ్డీ” అన్నారు. సాధారణంగా, అప్పులు తీసుకొనేది బీదవారు కాబట్టి వారి దగ్గర గోళ్లూడగొట్టి వసూలు చేసుకోవడం అవసరమైంది. దండోపాయం ప్రతీసారి కష్టమూ, ఖర్చూ  కాబట్టి

భేదోపాయంగా, అప్పు తీర్చి తీరాలన్న దాన్ని ఒక ఆదర్శంగా, విలువగా ప్రచారం చేసారు. ఈ “విలువ” పూర్తిగా “మిగులు” వున్న శ్రేణులకి, మధ్య తరహా శ్రేణికి వుపయోగపడేదే. భూస్వామ్య సమాజంలో అది ఒక నీతి. ఒక విలువ. ఒక ఆదర్శం. పతిభక్తి, రాజభక్తి, వర్ణాశ్రమ ధర్మం, కుల కట్టుబాటు వగైరా ఎన్నో విషయాల్లాగే ఇదీ ఒక భేదోపాయం.

వ్యవసాయం మీద ఎక్కువమంది ఆధారపడినప్పుడు సమాజం చిన్న సమూహాలుగా (గ్రామాలుగా) వుంటుంది. అక్కడ భూస్వామ్య సమాజపు నీతులు, ఆదర్శాలు, విలువలు చలామణి అవుతాయి. ఎన్ని కష్టాలు పడి అప్పు తీరిస్తే అంత నీతిమంతుడుగా,  పరువుగలవాడుగా సాగే ప్రచారం. చిన్న సమూహంలో ఈ విషయాన్ని మరింత ఘనీభవింప చేసి సంఘ భయాన్ని సృష్టిస్తుంది. సారధి తండ్రి కూడా ఆ సమాజంలోనే  జీవించారు. ఆ విలువల మధ్యనే పెరిగేడు అందుకే షావుకారుకి మళ్లీ నోటు రాశాడు. అప్పు తీర్చేడు. మనం కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే సారధి తండ్రితో పాటు చాలామంది అలా నోట్లు రాసి ఇచ్చే వుంటారు. షావుకార్లు సారధి తండ్రితో పాటు ఇంకా ఎంతో మందికి  అప్పులిచ్చే వుంటారు. అది వాళ్ల వృత్తి. వాళ్లలో మిగిలిన వాళ్లు కూడా నోట్లు ఇచ్చే వుంటారు. లేకపోయి ఉంటే, ఆ చిన్న సమూహంలో కొంత అల్లరి,అలజడి. ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగే వుండాలి. షావుకార్లు అంత తొందరగా వూరుకోరు. అగ్నిప్రమాదం జరిగినపుడు కేవలం సారధి తండ్రి నోటు ఒక్కటే కాలిపోవడం అనేది మనం నమ్మగలిగే విషయం కాదు. దీన్నేదో చాలా గొప్ప విషయంగా”కుటుంబాలు, వంశాలు” అని రాయడం కొంత ఆదర్శరీకరణే. పౌరాణిక పద్ధతే. దీంట్లో వంశాలు, కుటుంబాలు, గౌరవాలు ఏమీ లేవు. కొన్ని కుటుంబాలు , వంశాలు నీతి గలవనీ గొప్పవనీ కొన్ని కావనీ అర్దం వచ్చేలా రాయడం అంటే వర్ణ వర్గ వ్యవస్ఠని సమర్ధించడమే.

60ల్లో  శ్రీకాకుళంలోని గిరిజన ప్రాంతాల్లో అప్పులు తీర్చ  వద్దంటూ కమ్యూనిస్టు పార్టీ ప్రచారం చేసింది. పార్టీని అనుసరించిన గిరిజనులందరూ సొండీల, శావుకార్ల అప్పుని తీర్చారు. పార్టీ ప్రచారం  కంటే సంఘభయం ఎక్కువ పని చేసింది. ఈ రోజుకి కూడా అడవులు, కొండల్లో వుండే గిరిజనులు అప్పులు తప్పక తీరుస్తారు. “మళ్లీ ఇస్తాడు కదా షావుకారు” అనేది వాళ్ల సమాధానం. ఇప్పటికి కూడా, వ్యాపార సమాజపు నియమాలు పూర్తిగా ఎక్కని కొన్ని శ్రేణులు, స్త్రీలు, కూలీవారు, వగైరాలు అప్పులు తప్పక తీరుస్తారన్నది డ్వాక్రా అప్పులు, ఇందిరమ్మ ఇళ్ల అప్పులు చరిత్ర చదివిన వారికి స్పష్టమౌతుంది. సారధి పని చేసే ప్రభుత్వరంగ సంస్ధకి ఈ నీతి వర్తించదు. ఈ సూత్రాలు పనికి రావు. అదొక వ్యాపార సంస్థ. పెట్టుబడిదారీ సమాజ సూత్రాలు వేరు. అక్కడ లాభం ఒక్కటే ప్రధానం.  మిగతావేవీ వర్తించవు. కథలో చూస్తే ప్రభుత్వం ఇచ్చినది వడ్డీలేని అప్పు. ఈ డబ్బు సంస్థలో వున్నంత కాలం దాన్ని మదుపుల్లో పెట్టడానికి(Investments) వాడుకోవచ్చు. ఎక్కువ సరుకు (Stock) వుంచి డీలర్లపై రుద్ది అమ్మకాలు పెంచి లాభం గడించొచ్చు. అరువులు ఎక్కువ ఇచ్చి (Debtors) దానిపై వడ్డీ రాబట్టవచ్చు. ధర (Pricing) తమ అదుపులో వుంచుకోవచ్చు. సరఫరాదార్లకి  తక్షణమే ఇస్తామని చెప్పి (Creditors) బేరాలాడి  ధర తగ్గించుకోవచ్చు. స్థిర, చరాస్థులు (కార్మికులకి ఇళ్ళు కట్టడం, బస్సులు కొని రవాణా సౌకర్యం ఏర్పరచడం) కొని జీతాల బిల్లుల్లో కొంత మిగల్చవచ్చు. యంత్రాలు  వగైరా కొనేటప్పుడు DPGలు, LCలు వగైరా కాకుండా నేరుగా నగదు ఇచ్చి బాంకు ఖర్చులు మిగుల్చుకోవచ్చు. ధరలు తగ్గించుకోవచ్చు. ఏదీ కాకుంటే వుద్యోగులకే రకరకాల అప్పులిచ్చి వడ్డీతో సహా జీతాల్లో కోసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా వాడుకునే ప్రతి చర్యా సంస్థ లాభాల్ని పెంచేవే. అందుకే సంస్థ పెద్దలు అప్పు చెల్లింపుని  వీలైనంత కాలం  పొడిగించడానికి ప్రయత్నించడం ఎలా తప్పు అవుతుందీ?. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే కథకుడు మాట్లాడుతున్నది ఒక ప్రభుత్వరంగ సంస్థ గురించి. వాటిల్లో వచ్చిన “లాభం” అంతా తిరిగి ప్రభుత్వానికే బదిలీ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య తేడా అదే. లాభాలు తిరిగి ప్రభుత్వ పరం కావడమే. నేను చెప్పినవి అస్థి అప్పుల పట్టీ (balance sheet) మీది కనీసపు విషయాలు. నా అవగాహన అంతే. లోతుల్లోకెళ్లి చెప్పగలిగే వాళ్లెంతోమంది వున్నారు. MBAలూ, CA లూ చదివిన వాళ్లు. ఇది అర్ధం చేసుకోలేని సారధి పాతకాలం తూకపు రాళ్లతో విషయాన్ని చూసి వేదన చెందుతాడు.

“ప్రైవేటు రంగానికి ఇచ్చిన రాయితీలు లేదా రుణ మాఫీలతో పోలిస్తే మనలాంటి పబ్లిక్ సెక్టారు పొందేది లెక్కించ దగిందేం కాదు” అన్న సీ.ఎఫ్.ఓ మాటలు సారధికి అర్ధం కాలేదు. అతని ఆలోచనలూ, ఫైనాన్స్ రంగ సూత్రాలకు వ్యతిరేకం. సంతోష్‌కి అతను, నిరాసక్తంగా చెప్పిన కారణాలు. “కొత్త వేతన ఒప్పందం వల్ల  పెరిగే వేజ్ బిల్లు, ఈ ఆర్ధిక సంవత్సరంలో మొదలయ్యే శివరామపూర్ ప్రాజెక్టుకు మూలధన అవసరాలు, వచ్చే రెండు, మూడు సంవత్సరాలలో మూతబడబోయే ప్రాజెక్టులవల్ల తగ్గే రాబడి” ఇవేవీ సూత్రాలకి సరిపోవు. వేజ్ బిల్లు లాభనష్టాల ఖాతా వ్యవహారం. అప్పు ఆస్థి అప్పుల వ్యవహారం. కరెంటు బిల్లులు. మొబైల్ బిల్లులు, ఆదాయం (జీతం)లోంచి కడతాం. కొత్త ప్రాజెక్టుకి మూలధనం, ప్రభుత్వంనుంచో లేదా ప్రజలనుంచో తెస్తాం(shares). మూడు సంవత్సరాల తర్వాత రాబడి తగ్గుతుంది కాబట్టి ఈ అప్పు వాయిదా కూడా అప్పుడే కడతాం అనడం హాస్యస్పదం. మూడేళ్లలో నేను రిటైర్ అవుతాను. నా జీతంలోంచి కట్టలేను. పెన్షన్లోంచి కడతాను. కాబట్టి EMIలు అప్పటినుంచి ఇవ్వండి అని బాంకువాళ్లని అడిగి చూడండి. అప్పు వాయిదా కట్టేది నగదు రాబడుల్నించి. అది కేవలం అమ్మకాలు, లాభాలే కానక్కరలేదు. ఇందాక మనం అనుకున్న అనేక మార్గాలున్నాయి. “ఫండ్స్ ఫ్లో స్టేట్‌మెంట్‌లో చూపించాం” అన్న సారధి  సరిగ్గా ఆలోచించలేదు. సారధి తయారు చేసిన నోట్‌ని సి.ఎం.ఓ తప్పక మార్చి వుంటాడు. క్లుప్తంగానే చెప్పాను. అవసరం అనుకుంటే చర్చిద్దాం.

ఈ సారధి ఆలోచనల్ని “మానవ సంబంధాలకుండే ఆర్ధిక కోణాన్ని కార్పోరేట్ వాతావరణానికి అన్వయించి  చెప్పటం వల్ల మేధను తాకే కథగా రూపొందింది” అని ప్రశంసించడం బృహదాశీర్వచనం. సంస్థకీ,  ప్రభుత్వానికీ మానవ సంబంధాలుండవు. సారధి ఆలోచనల్లో మేధస్సూ లేదు.

ఇంతకీ కథలో ముఖ్యవిషయం. వ్యవసాయ రుణాల మాఫీ. “రెండేళ్ళ క్రితం స్థోమత వుండి అప్పు, వడ్డీ కట్టకుండా, మాఫీతో లాభం పొందినోళ్ళు ఎందరో. ఇదిగో వీడే రెండు లక్షల దాకా మిగుల్చుకున్నాడు” అన్న మాధవరావు తండ్రి మాటలో వున్నది. అవి వాస్తవానికి రచయిత మాటలే. రచయిత ఆవేదనా అదే. 2008లో ప్రభుత్వం వ్యవసాయ రుణాల మాఫీ ప్రకటించినపుడు గోలగా ఒక ప్రచారం జరిగింది. అప్పులు ఎగ్గొట్టే అలవాటుని ఇది తీసుకొచ్చిందనీ, దేశ సంపదనంతా దోచి పెట్టుతున్నారనీ పత్రికలూ, టీవీలూ వగైరా అంతా గగ్గోలుగా చెప్పిన విషయాలు రెండు. దేశంలో కౌలు రైతులు ఎక్కువ వుండడం, కౌలు రికార్డు కాకపోవడం వల్ల  ఈ ౠణమాఫీ కేవలం భూముల యజమాన్లకే సాయపడిందనీ,  నిజంగా వ్యవసాయం చేసిన కౌలు రైతులకి ఏం దక్కలేదనీ. రెండోది రుణం రద్దు వల్ల పెద్ద రైతులకే  లాభం జరిగిందనీ, అర్హత లేనివాళ్లు రద్దు వల్ల లాభపడ్డారనీ. ప్రచారం చేసేవాళ్లు వ్యూహాత్మకంగా చిన్న రైతుల్ని తోడు తెచ్చుకుని వాళ్లకేం దక్కలేదని చెప్పారు.

[su_note] మొదటి దాని గురించి కథలో ఏమి లేదు కాబట్టి రెండు వాక్యాల్లో ముగిద్దాం. కౌలు రైతులు ప్రధానంగా వ్యవసాయ  ఎంట్రప్రెనూర్ లు వాళ్లు చేసేది వ్యవసాయ నిర్వహణ (organisation) పొలంలోకి దిగకుండా, భూమి(Land) కౌలుకు తీసుకొని కూలీల్తో, అవకాశం వున్నచోట యంత్రాల్తో పని చేయించి (Labour), పెట్టుబడి (Capital)  పెట్టి వ్యవసాయం నిర్వహిస్తారు. (Organisation). కూలీల విషయంలో వీళ్లు యజమాని కంటే ఎక్కువ ఘోరంగానే ప్రవర్తిస్తారు. కారణం లాభాపేక్ష. తొందరతొందరగా ఎక్కువెక్కువ లాభం సంపాదించాలన్న ఆకాంక్ష. ఎరువులు కుమ్ముతారు. కూలీల్ని పిండుతారు. పురుగుల మందు విషాన్ని చల్లుతారు. పర్యావరణాన్ని , ప్రజల్ని నాశనం చేసి లాభాలు దండుకుంటారు. ఇదంతా పెట్టుబడిదారీ వ్యవహారం. ఆ సూత్రాలే వీరికీ వర్తిస్తాయి. ఇక కథలో వున్నదీ, రెండోదీ అర్హత లేనివాళ్లు స్థోమత వున్నవాళ్లు రుణం రద్దు పొందారన్నది. నిజంగా ఇది ఆలోచించవలసిన అంశమే. చర్చించవలసినదే. అయితే రచయిత పొసగని అంశాల మధ్య కత్తు గట్టి కథ రాయడం వల్ల కథా శిల్పం, ప్రయోజనం రెండూ దెబ్బతిన్నాయి. విషయమేమిటంటే 2008లో రుణమాఫీ పెద్దలకి పూర్తిగా దోచిపెట్టలేదు. బోల్డు ఆంక్షలు పెట్టింది, రద్దు మొత్తాన్ని ఒక లక్షరూపాయలకు కుదించింది. ఆసక్తి వున్నవాళ్లు రిజర్వు బ్యాంకు సర్కులర్ RB1/2007-08/373 Dt. 19/6/2008 చూడవచ్చు.[/su_note]

నిజమే నష్టాలన్నీ ప్రజల పరం చేసి లాభాలు వ్యక్తుల పరం చెయ్యడం పెట్టుబడిదారీ మనుగడకి అవసరం. వాళ్ల ప్రతినిధిగా వున్న ప్రభుత్వం అదే చేస్తుంది. అమెరికాలో ఫ్రెడ్డీ, ఫానీ, లేమాన్ బ్రదర్స్ లాంటి ఎన్నో సంస్థలు కూలిపోతే, పెద్ద పాక్ఖేజీలు ప్రకటించి వాళ్ల కొమ్ము కాసింది ప్రభుత్వం. కోట్ల కోట్ల డాలర్లతో విదేశీ కంపెనీలు కొన్న కింగ్‌ఫిషర్ కంపెనీ యజమాని, ఎయిర్‌లైన్స్ వుద్యోగులు జీతాలడగితే ‘నా దగ్గర డబ్బుల్లేవ్’ అని నిస్సిగ్గుగా  ప్రకటించి విదేశాల్లో విలాసంగా గడిపేడు. మోడీ, గోయెంకాల్లాంటి ఎన్నో కంపెనీలు అప్పులు ఎగ్గొట్టి వుద్యోగుల జీతాలు ఎగ్గొట్టి BIFR వెనక ఆశ్రయం తీసుకున్నాయి. మన డెక్కన్ క్రానికల్ కథ చూడండి. కనీసం రోజుకొక్క కంపెనీ కథ వస్తుంది పేపర్లో. చాలా చిన్న అక్షరాల్తో. అప్పులు ఎగ్గొట్టడం, దివాలా తియ్యడం పెట్టుబడిదారీలో ఒక సూత్రం. ఒక విధానం

అర్హత లేని స్థోమత వున్న రైతులు రుణం రద్దు వాడుకోకూడదన్న ఆదర్శ ప్రకటన ఎవరి నుద్ధేశించి చేస్తున్నాడు రచయిత. ఆదర్శాల వల్ల, నీతిబోధల వల్ల, ఈ కథలు ఏనాటికీ చదవని పెట్టుబడిదార్లు “ఆత్మప్రబోధం” చేసుకుంటారా?రుణం రద్దు లేకపోయి వుంటే ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు వగైరా వ్యవసాయాధారిత వ్యాపారం ఎంత దెబ్బ తిని వుండేది. బాంకుల డబ్బు ఆగిపోతే వాళ్లు రుణాలివ్వకపోతే కన్స్యూమర్ వస్తువులు ఇనుము, సిమెంటు, గృహనిర్మాణ రంగ పరిశ్రమలు, కార్లు, రకరకాల వాహనాలు తయారు చేసే కంపెనీలూ ఏమై పోతాయి?

ఈ కథ పేరు రుణం.

రచయిత శ్రీ ముళ్లపూడి సుబ్బారావు.

ప్రచురణ: ఆదివారం ఆంధ్రజ్యోతి, 8 మే.2011

 

[su_box title=” Banks wrote off over Rs 1 lakh cr in last 13 yrs: Chakrabarty (BUSINESS LINE, BUSINESS STANDARD 19.11.13)”]

RBI Deputy Governor K.C. Chakrabarty has said banks have written off a whopping Rs 1 trillion in the past 13 years and criticised the lenders because as much as 95% of these write—offs were for large borrowers. He said that over 95% of such write—offs have been observed in the case of big accounts and expressed anguish that public discourse focuses only on the government’s agri debt waiver scheme of 2008. “We only talk about the debt waiver of the agricultural borrowers, we don’t say big players and of this (Rs 1 lakh Cr) 95% are all big borrowers and it has been written off,” he said. Chakrabarty was particularly critical of the system of a “technical write-off” by the lenders, saying he does not understand the system. [/su_box]

 

—చిత్ర

అస్పష్ట మహారణ్యంలో పాఠకుల్ని వదిలేసిన “ద్రోహ వృక్షం” కథ !

drohavruksham

‘ద్రోహావృక్షం’అనే కథ చూద్దాం. కథంతా ప్రతీకలతో,సంకేతాలతో నడుస్తుంది. ఒక భావనా ప్రపంచంలో, కల్పనా చాతుర్యంతో కథని నడపడం ఊహా? వ్యూహమా? అనే ప్రశ్న మనకి వస్తుంది. ప్రధానంగా ఇది ద్రోహం కథ. మరి ద్రోహులెవరు? కథలో వాక్యాలు చూద్దాం.

“ఇది నమ్మకద్రోహం నుంచి పుట్టిన అందం. నా జుట్టు చూశావా? ఎర్రటి  రంగులో మిలమిలలాడుతూ” అంటాడు కథలో పాత్ర కొండయ్య. తనని తాను ద్రోహిగా ప్రకటించుకొన్న కొండయ్య ఎవరికి ప్రతీక? కథలో చూద్దాం. “ఊరికి ఆ చివరన వాళ్ళ యిళ్ళు. ఈ చివరన మా ఇళ్ళు” అంటాడు మరో  పాత్ర సంగీతరావు. ఇద్దరి ఇళ్ళూ వూరికి చివర్లలోనే వున్నాయి కాబట్టి ఇద్దరూ మాల – మాదిగ కులాలకి ప్రతీక అనిపిస్తుంది. “రెండు కులాల మధ్యా” అని సంగీత అంటాడు. మరి ఈ ఇద్దర్లో కొండయ్య మాదిగ కులానికి ప్రతీక.మరి మాదిగలు మాలలకి ఎలా ద్రోహం చేశారు? కథలోంచి చూస్తే, గతంలో వాళ్ళిద్దరూ కలిసి ఎదురు కొండ ఎక్కుతారు చాలా కష్టమైన పని అది. కొండ ఎక్కాక “మేము జయించిన రాజ్యాలుగా తోచాయి” అంటాడు సంగీత. రిజర్వేషన్లను సాధించడానికి ఇది సంకేతం.. కథలోనే “రిజర్వేషన్లు, వర్గీకరణ, సభ, నిరసన, దళిత నాయకులు” అని వుంటుంది. అంటే రిజర్వేషన్ల విషయంలో కొండయ్య ద్రోహిగా మారి విభజన కోరాడని అర్ధం అవుతుంది. ద్రోహం చేసీ, మోసం చేసీ, కొందర్ని బలి ఇచ్చి కొండయ్య ఏం సాధించలేదని సంగీత అనుకుంటాడు. కథలో వాక్యాలు చూద్దాం. “ఎన్నిసార్లు గాలాన్ని పైకి లాగినా,అది ఖాళీగానే వుంటుంది. చేపలకట్లా తిండి వేయడానికే అతను అక్కడ కూర్చున్నట్లుగా ఉంది” చేపలు, చెరువు, సమాజానికీ, వేరే కులాలకీ ప్రతీకలు. ఎందుకు కొండయ్య ఏమీ సాధించలేదు? “ప్రాజెక్టువాళ్లు పెట్టిన స్కూలు, ఇప్పుడందులో దళితవాడల్లోని పిల్లలే చదువుతున్నారు. ఒకళ్ళిద్దరు చెంచుల పిల్లలు.” అని వున్నది కథలో. అంటే ప్రభుత్వ పాఠశాలలు దళితులకే పరిమితమయిపోవడం. రిజర్వేషన్లవల్ల ఏమీ వుపయోగం లేకపోవడం.. ఇక్కడ మనం ఆగి అసలు రిజర్వేషన్ల విషయం చూస్తే…

వ్యవసాయక సమాజంలో భూమి మీద యాజమాన్యం ఆధిపత్యం, వుత్పత్తి ప్రక్రియ (వ్యవసాయం)లో భాగం ఆధారంగానే కులాలు ఏర్పడ్డాయనిమనం స్థూలంగా అంగీకరిస్తాం. కులాల మధ్య వృత్యాసాలూ అలాగే ఏర్పడ్డాయి. గ్రామాల్లో నివాసాలు అంతే. వ్యవసాయంలో పెట్టుబడి ప్రవేశంతోనూ, “విద్య” స్థానంలో “చదువు” ప్రవేశంతోనూ వలసలు ప్రారంభమై నగరీకరణ పెరిగింది. “వృత్తి స్థానంలో “వుద్యోగాలు” ప్రవేశించి మనుష్యులు మనుగడ  కోసం సమాజం మీద కాకుండా  ప్రభుత్వం మీద ఆధారపడ్డం మొదలైంది.

కొండయ్య, సంగీతలు కలిసి ఎన్నికొండలెక్కేరోగానీ, అంబేద్కర్ మహాశయుడు ప్రపంచం ముక్కు మీద గుద్ది విషయాన్ని చెప్పడంతో అధికార గణాలు (అగ్రకులాలు) రిజర్వేషన్లు తీసుకొచ్చేయి. అయితే వ్యవసాయంలో ప్రవేశించిన పెట్టుబడి అంతరాల్ని అంతం చెయ్యలేదు. నగరీకరణ క్రమంలో చదువు కూడా కులాల అమరిక క్రమంలోనే వుపయోగపడిందనీ, ఫలితంగానే వుద్యోగాలు అనబడే జీవనోపాధి మార్గంలో అగ్రకులాలవారూ, ధనికులూ పైస్థాయిల్లోనూ, అదే క్రమంలో మిగతా కులాలవారూ కుదురుకున్నారనీ సామాజిక శాస్త్రవేత్తల అధ్యయనం ఋజువు చెస్తోంది.  అది ఆర్ధిక సూత్రం. అది చరిత్ర. దీనిలో భాగంగానే షెడ్యూల్డు కులాలనే వాటిలోనూ తారతమ్యాలు పెరిగాయి. రిజర్వేషన్లవల్ల మాలకులస్థులే ఎక్కువ ప్రయోజనం పొందరన్నది మాదిగ కులస్థుల భావన. స్థూలంగా ఆ భావం నుంచే వర్గీకరణ ఒక అంశంగా ముందుకొచ్చి ఆందోళనరూపం తీసుకొన్నది. తారతమ్యాల పెరుగుదలకీ జీవన మార్గాలు మూసుకుపోవడానికి కారణం భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థలు. అది వదిలిపెట్టి కులాలు, ఒకరినొకరు ద్రోహులుగా లెక్కకట్టి మాట్లాడ్డం సరైనది కాదు. రిజర్వేషన్లు వుండే ప్రభుత్వ రంగం కుంచించుకుపోవడం గురించి, యంత్రాలు ప్రభుత్వ వుద్యోగుల్ని తగ్గించి వేయడం గురించి,  అంతరిస్తున్న వృత్తులు, కొత్త జీవనమార్గాల్ని కల్పించలేకపోవడం గురించి భూమితో సహా సహజ, వుమ్మడి వనరుల్ని, వుత్పత్తి సాధనాల్ని స్వంతం చేసుకున్న పెట్టుబడి మానవశ్రమ (జీవనమార్గం)ని దూరం చేసెయ్యడం గురించిమాట్లాడకుండా కులాలమధ్య వుండే వైరుధ్యాల్ని “వాళ్లని నమ్మవద్దు, వాళ్ల పొడ కూడ మన మీద పడకూడదు” అనీ, రెండు కులాల మధ్య పెద్ద పెద్ద కొట్లాటలే జరిగేయి. హత్యకేసులు, కోర్టు వాయిదాలు..” అని రాయడం ఒకళ్ల ఇళ్లు ఒకళ్లు కాల్చుకున్నారనీ, రాళ్లు విసురుకుంటున్నారనీ వాళ్ల మధ్య వైరుధ్యాన్ని వూహాశక్తి ప్రయోగించి వైషమ్యాల స్థాయికి తీసుకెళ్లి రాయడం వాస్తవ విరుద్ధం.ఇళ్ళు తగలబెట్టించేదీ, హత్యలు చేసేది రాజ్యం, ధనికవర్గం, మాలలు ఈ రోజుకి కూడా రాజ్యంలో భాగస్వాములు కాలేదు. అది పూర్తిగా వక్రీకరించి “అయ్యే ఎస్సో ఏదో రాసినట్టున్నావు” అని సంగీతరావు(మాల)ని రాజ్యానికి ప్రతినిధిగా చేసి  కొండయ్య మాట్లాడటం అవాస్తవం మాత్రమే కాదు. అన్యవర్గ ప్రయోజనం కూడా. మాదిగలు వేరే బడి (కులసంఘం) పెట్టుకోవడం గురించి, వాడు  నా ముఖ్యమైన శత్రువు అని రాసి ఏ వర్గం ఆలోచనా ధోరణిని మోసుకొస్తున్నాడు రచయిత. వర్గం అన్నానా? అవును . కొండయ్య మాదిగలకే ప్రతీక కాదు. కమ్యూనిస్టులకి కూడా . కథలో చూస్తే.

“ఎర్రగా భయం గొలిపేలా వుంది జుట్టు” అంటాడు సంగీతరావు కథ ప్రారంభంలోనే” తురాయి మొగ్గ, మోదుగ చెట్లు, గద్దర్, నవంబర్ నెల” అంటాడు.

“నా జుట్టు చూసావా?ఎర్రని రంగులో మిలమిలలాడుతూ” అంటాడు కొండయ్య.

“ఎర్రటి గుండ్రటి మొహం అతనికి” అంటాడు సంగీతరావు కథలో.

“చర్చల కల, తుపాకులు, గెరిల్లా యుద్ధ తంత్రం” అని వున్నది ఇంకాకథలో ” ఈ రంగు పూలను చూసి మోసపోకు. దీని అందాలను  చూసి మోహపడకు. ఇది నమ్మకద్రోహం నుంచి పుట్టిన అందం” అంటాడు కొండయ్య.  బహుశా జూడా రక్తం నాలోనూ పారుతుందేమో” అంటాడు కొండయ్య.

అంటే కమ్యూనిస్టులు ద్రోహులనా? ఎదురు కొండ విప్లవానికి, జయించిన రాజ్యం అంటే ఒక గొప్ప, అధర్శ సమాజానికి సంకేతమైతే, కమ్యూనిస్టులు ద్రోహులని కొండయ్య ద్వారా రచయిత అభిప్రాయ పడ్డట్టు అనుకోవాలి. పైవి రెండూ కలిపితే కమ్యూనిస్టుల్లోని మాదిగలు, లేదా మాదిగలకోసంకమ్యూనిస్టులు మాలలకి లేదా ప్రజలకి ద్రోహం, మోసం చేశారన్న అర్ధం వస్తుంది. అయితే కథలో ఇంకెక్కడా ఈ భావాన్ని ఖండించే వాక్యాలు లేవు కాబట్టి కమ్యూనిస్టులు ఏ విధంగా, ఎవరికి ద్రోహం చేశారో చెప్పవలసిన అవసరం వున్నది.

జూడాస్ గురించీ, బైబిలు గురించీ ఒక కథ చెప్తాడు కొండయ్య. అయితే కొత్త నిబంధన గ్రంధంలో ఎర్ర పొలం గురించి వున్నది కానీ కథలో రాసినట్టు “మరుసటి రోజు చెట్టు మొత్తం వెలిగిపోయి, “దాని కొమ్మల నిండా ఎర్రటి పూలు పూసాయి” అని ఎక్కడ వున్నది అనుమానాస్పదం. పైవన్నీ చదవగానే మనకి హిట్లర్ వుదంతం గుర్తొస్తుంది. హిట్లర్ కూడా జాతి వ్యతిరేక ఆవేశానికి లోనయ్యాడా అనిపిస్తుంది.

Half of all German Banks were Jewish owned, Stock Brokers were Jews.  Half of Newspapers were Jewish” అని చరిత్రకారుడు RALF GEROGE REUTHరాసింది నిజమే కావచ్చు. కానీ హిట్లర్ ఆ సగాన్నీ వాస్తవంగానే చూశారుగాని విశ్లేషణాత్మకంగా చూడనేలేదు. తన చుట్టూ వున్న జర్మన్ ప్రజల కష్టాల్నీ, వారి బీదరికాన్ని చూసిన  హిట్లర్ దానికి కారణం తనని హాస్టల్ నుంచి వెళ్లగొట్టిన యూదులే కారణం అనుకున్నాడు అనిపిస్తుంది. ఆ జాతి ద్వేషంలోంచే అతను

“The personification of the devil as the symbol of all evil assumes the living shape of the Jew”

అన్నాడు. మరింత విషాదం ఏమిటంటే వ్యతిరేకులు కూడా గౌరవించే కార్ల్ మార్క్స్‌ని గొప్ప ఆర్ధికవేత్తగా, సిద్ధాంతకర్తగా కాక ఒక యూదుగానే చూశారు. లెనిన్‌ని అలాగే చూశారు. అందుకే…

“Death to Marxism” అన్నాడు.

“THE HEAVIEST BLOW WHICHEVER STRUCK HUMANITY WAS CHRISTIANITY. BOLSHEVISM IS CHIRISTIANITY’S ILLEGITIMATE CHILD . BOTH ARE INVENTIONS OF THE JEW.” అనే తీవ్ర  తప్పిదం చేశాడు. యూదుల్లో అత్యధికులు కమ్యూనిస్టులుగా వుండడానికి కారణం బీదరికం, దోపిడి అని గుర్తించలేక లక్షలాదిమందిని చంపించేడు. వర్గానికీ, జాతికీ, కులానికీ వున్న పరిధులూ, ప్రమేయాల పట్ల స్పష్టత లేనప్పుడు జరిగే ప్రమాదాలివి.

విషయానికొస్తే షెడ్యూల్డు కులాల్లో మాల, మాదిగలే కాక వేరే కులాలు బోలెడన్ని వున్నాయి. తరతరాలుగా ఎంతో అవమానకరమైన పనులు చేసి బతికిన, బతుకుతున్న ఎన్నో కులాలున్నాయి (పాకీ, రెల్లి, చచ్చర,) అవన్నీ వదిలేసి వర్గీకరణ మాల – మాదిగల సమస్యగా ముందుకు రావడం మనం విశ్లేషించుకోవాలి. ఈ విషయం గురించి కథలో ఏమీలేదు.

కథలో వున్న “చర్చల కల ముగిసి, మళ్ళీ అడవిలోని పొదలకు తుపాకులు మొలుస్తున్నాయని హెచ్చరికలిచ్చారు” అన్న వాక్యంలోంచి చూస్తే రియాజ్ మరణం వెనక ద్రోహం వున్నదని “ఐదు హంసలు” నవలా రచయిత భావిస్తున్నారా  అనిపిస్తుంది.

ఇన్నిరకాల భావాలు కలిగేటట్టుగా అస్పష్టంగా, పరస్పర విరుద్ధ వాక్యాలతో కథ రాయడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?

“కప్పి చెప్పడం” అనే దాన్ని ఇంతగా సాగదీసి అస్పష్ట అరణ్యంలో పాఠకుల్ని వదిలెయ్యడం ఎందుకో?

రచయితకు  వుద్ధేశాలు అంటగట్టడం నా ఆశయం కాదు. కాని ఒక కథ ఎలాటి భావాలు కలుగజేసే అవకాశం వున్నదో తెలుసుకోవాలి. ఈ భావాలకు కారణం ప్రయోగం కోసం కధా ? కథ కోసం ప్రయోగమా?  అని ప్రశ్నించుకుని రచయితే తెల్చుకోవాలి.

విషయం కోసం కథ రాస్తే  స్పష్టత, కథ కోసం విషయం తీసుకొస్తే విస్తృతీ తీసుకొస్తే నిడివీ ఉంటాయన్న విషయాన్ని “ఆవు – పులి మరి కొన్ని కథలు” “క్రానికల్స్ ఆఫ్ లవ్” కథలు నిరూపిస్తాయి.

ఈ కథ రచయిత డాక్టర్ వి. చంద్రశేఖర్‌రావు. ఈ కథ వార్త ఆదివారం 2004 డిసెంబరు 26 లో ప్రచురించబడింది.

( సి. ప్రసాద వర్మ కు కృతజ్ఞతలు)

–చిత్ర

ఆలోచన లోపించిన ప్రతిమ కథ “కంకాళం”

2004 డిసెంబర్ “అరుణతార”లో వి.ప్రతిమ “కంకాళం” అనే కథ రాశారు. ఇది వుత్తమకథగా కూడా ఎన్నికైంది.

మహిళలు రాస్తున్న కథలు అత్తగారి పెత్తనాల్తో, నడుము చూసి సొల్లు కార్చే మగాళ్లతో, పురుషాధిక్యత లాంటి బరువైన పదాల్తో నిండిపోతున్న సందర్భంలో, ఒక మహిళ ఆర్ధిక, రాజకీయ విషయాలపై కథ రాయడం అభినందనీయం. పంచరంగుల ముద్రణామోహానికీ, లక్షల పాఠకులనే గ్లామర్‌కి లోనవ్వకుండా ‘అరుణతార’ లాంటి పత్రికని ఎన్నుకోవడం మరింత మంచి విషయం.

కథ “పో” చెప్పినట్టు అనుభూతి, ఐక్యత పద్ధతిలోనే సాగుతుంది. ఇక్కడ అనుభూతి రాఘవయ్య మరణం పట్ల సానుభూతి. రాఘవయ్య మరణాన్ని నాటకీయం చెయ్యలేదు. కథ కలిగించే అనుభూతిని “మామ్” చెప్పిన నాటకీయ అనుభూతి అనలేం. కథ మొత్తం చెప్పి మీ సమయం వృధా చెయ్యకుండా అవసరం అయిన మేరకే చూద్దాం.

కథలో సంఘటన రాఘవయ్య మరణం. రాఘవయ్య రైతు. పదెకరాల రైతు. మరణానికి కారణం ఏమిటన్న ఆలోచన చేస్తే చెరుకు ఫాక్టరీ మూతపడిపోవడం. రాఘవయ్య డబ్బులు రాకపోవడం.. దానికి కథలో చాలా కారణాలు చెప్తారు.

చంద్రశేఖర్ అనే పాత్ర ఫ్యాక్టరీలో ఒక కెమిస్టు, మాటల్లోంచి చూస్తే పాఠకులకి నిజము అనిపిస్తుంది. బ్రెజిల్ అనే దేశంలో పెట్రోల్‌లో పావలా వాటా “ఇథనాల్” కలుపుతారనీ, ఆ ఇథనాల్ చెరుకునుంచి తీస్తారనీ, అందువల్ల చెరుకు రైతులూ, ఫ్యాక్టరీలూ, పర్యావరణం, దేశమూ అన్నీ బావున్నాయనే అనిపిస్తుంది. అదొక ఆదర్శంగా, ఆచరణీయంగా అనిపిస్తుంది. మన దేశం అలా చెయ్యకుండా మేధావుల్ని బయటిదేశాలకి తోలేస్తోందనీ, చంద్రశేఖర్ ఇచ్చిన ఎన్నో విలువైన సూచనల్ని బుట్టదాఖలు చేశారని చదివి ధర్మాగ్రహము వస్తుంది. మనం కూడా బ్రెజిల్ లాగా రైతుల, రాఘవయ్యల మరణాల్ని ఆపుకోవాలనీ, ఫ్యాక్టరీల్నీ, దానిలోని వుద్యోగుల్నీ కాపాడుకోవాలన్న ఆవేశమూ కలుగుతుంది. కథ ముగుస్తుంది. అక్కడ ఆగి మనం కొంచెం ఆలోచిస్తే..

బ్రెజిల్‌లో భూమి చాలా సారవంతమైనది. అపారమైన నీటి వనరులూ, అమెజాన్ అడవులతో వుండేది. కేవలం చెరుకు కాదు. కాఫీకి ఎప్పటినుందో ప్రసిద్ధం. సోయా, పాలు, మాంసం ఇలా వ్యవసాయాధారిత పరిశ్రమలే ఆ దేశం వెన్నెముక. అయితే ఆ సౌభాగ్యం ప్రజలకి లేదు. అక్కడ భూమి రైతుల చెతుల్లో లేదు. ఎస్టేట్లుగా వున్నది. పెద్ద పెద్ద కంపెనీల చేతుల్లో వున్నది. బిగ్‌లాండ్ బ్రెజిల్ లాంటి ఎన్నో కంపెనీలు అక్కడి భూమిని ఆక్రమించి వున్నాయి. పల్లెల్లోని భూముల్లో 47 శాతం భూములు ఒకే ఒక్క శాతం హౌస్ హోల్డ్స్(House Holds) చేతుల్లో వున్నాయి. సుమారు కోటీ, ఇరవై లక్షల ఇళ్లకి సెంటు భూమి లేదు. ఎనభై శాతం చిన్న రైతుల చేతుల్లో కేవలం 18శాతం భూమి వున్నది. పెద్ద పెద్ద ఎస్టేట్లలో 166 మిలియన్ హెక్టార్ల భూమి వాడకంలో లేకుందా వున్నది. చెరుకు పండించదగ్గ భూమి 320 మిలియన్ హెక్టార్లుంటే అందులో కేవలం 5శాతం మాత్రమే వుపయోగించబడున్నదని నిపుణులు అంచణా వేస్తున్నారు. కారణం   చట్టాలు. ప్రజల వద్ద పెట్టుబడి లేకపోవడం.

ఈ కారణాల వల్ల అసమానతలు తీవ్రంగా పెరిగాయి. ప్రజల్లోని అసమానతల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో వున్న దేశం బ్రెజిల్. దేశంలోని ధనికులు, జనాభాలో కేవలం పది  శాతం మంది. దేశ సంవత్సరాదాయంలో 48 శాతం తీసుకొంటున్నారు. అట్టడుగువాళ్లు జనాభాలో 20 శాతం మందికి దేశ సంవత్సరాదాయంలో రెండు శాతం మాత్రమే దక్కుతోంది. రెండున్నర కోట్లమంది దారిద్ర్యపు రేఖకంటే ఎంతో అట్టడుగున బతుకుతూ వుంటే ఐదుకోట్లమంది ఒక్క పూటే తిని బతుకుతున్నారు. చెరుకుతోటల్లో కూలీలు కేవలం రెండు డాలర్ల రోజు కూలీ కోసం 15-16 గంటలు పని చేస్తున్నారు. ఇంత సారవంతమైన భూమిలోణూ పండించేది కేవలం వ్యాపార పంటలే. 1990లో బ్రెజిల్ 1 బిలియన్ డాలర్ల విలువైన ఆహార ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటే 2002 నాటికి అది 10 బిలియన్ల డాలర్లకు ఎగబాకింది. ప్రపంచంలోనే పంచదార వుత్పత్తిలో మొదటి స్థానంలో వున్న బ్రెజిల్‌లో పంచదార వుత్పత్తి చేసేది సహకార మిల్లులూ కాదు. రైతుసంఘాలూ కాదు. కోసాన్(Cosan loD) అనే కంపెనీ “VHP రకం పంచదారని కనిపెట్టింది. ఆ కంపెనీ 12 మిల్లుల్తో, 30 రిఫైనరీల్తో అతి పెద్ద కంపెనీ.  ఇంకా సావో మార్టినో, ఆక్వార్ గునానీలాంటి ఎన్నో కంపెనీలున్నాయి. ఈ ఫాక్టరీల్లో కూలీలకిచ్చే జీతాలు ఒక్క పూట తిండికి చాలవు.

ఇథనాల్ వుత్పత్తిలో అమెరికా తర్వాతి స్థానంలో వున్న బ్రెజిల్‌లో కొయిమెక్స్ అనేది అతి పెద్ద కంపెనీ. ఈ కంపెనీల టర్నోవర్లూ, లాభాలూ చూస్తే మనకి కళ్లు తిరుగుతాయి. ఈ కంపెనీల పుట్టుకా, పెరుగుదలా క్రమంలో వేలాది రాఘవయ్యలు పోయేరు. కోట్లాది మంది రోడ్డున పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల్ని బానిసలుగా మార్చి వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఈ బానిసత్వాన్ని కనిపెట్టి వదిలించడానికి ఒక రకం పోలీసుశాఖ అక్కడ పని చేస్తోంది. ఎన్నో స్వచ్చంద సంస్థలు పని చేస్తున్నాయి. ఆందోళనలు రేగుతూనే వున్నాయి.

బ్రెజిల్  ఒక నూతన సామ్రాజ్యవాద దేశంగా మారిపోయిందనీ, చైనా, ఇండియాల సరసన చేరిందనీ ఎన్వర్  హోక్సా లాంటి వాళ్ల సాక్ష్యాధారాలతో నిరూపిస్తూ పుస్తకాలు రాశారు. బ్రిక్(BRIC) సంఘణ కాకతాళీయం కాదు. బొలీవియా, మొజాంబిక్, ఇథోపియా దురాశగా నాశనం చేస్తున్నారని శాస్త్రజ్ఞులూ, ఆలోచనాపరులూ గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడి అంటేనే విధ్వంసం, విద్రోహం. ప్రకృతినీ, మానవ శ్రమనీ నిర్లజ్జగా, క్రూరంగా, దురాశగా దోచుకోకుండా పెట్టుబడి ఎలా పెరుగుతుంది? ఇక్కడ ఆగుదాం.

కథలో రెండో కారణం పంచదారని మనం దిగుమతి చేసుకోవడం. పంచదారని మనం OGL కింద దిగుమతి చేసుకుంటున్నాం. వ్యవసాయం మీద ఆధారపడ్డ వుత్పత్తులు ఒక పరస్పరాంగీకారం లేకపోతే, ఇక్కడ మనకి పంట పోయి అవసరం అయినపుడు అడ్డగోలు ధర పెట్టవలసి రావచ్చు. ప్రపంచంలోనే పంచదార వినియోగంలో మనది మొదటి స్థానం. 1995 – 96 నుంచి 2010 – 11 వరకు పదిహేనేళ్ళ కాలంలో 2004 – 05లో (800MT) 2009 – 10 లో (2500MT) రెండేళ్ళు మాత్రమే మనం దిగుమతి చేసుకున్నాం. ఈ కాలంలో మన  దిగుమతులకంటే ఎగుమతులు చాలా చాలా ఎక్కువ. సరే అంకెలు వదిలేస్తే ఈ డిమాండు ఎవరిది? ఎవరికోసం?ఈ కోరిక, పంచదార దిగుమతి చేసుకోకూడదన్నది.  పంచదార మిల్లుల యజమాన్లది. NFCSF అధ్యక్షుడు కల్లప్ప అవడే పంచదారపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 30 శాతం వరకూ పెంచాలంటున్నాడు. దాని కార్యదర్శి వినయ్ కుమార్ మనం పంచదార  దిగుమతి ఆపాలన్నాడు.

ISMAకి చెందిన అవినాష్ వర్మ పంచదార కంట్రోల్ అంటే లెవీ ఎత్తేయమన్నాడు. పంచదార పరిశ్రమ మనదేశ రాజకీయాల్ని శాసించగలంత శక్తిమంతం. శరద్ పవార్ చిన్నకొండ గుర్తే. మొత్తానికి వీళ్లు లెవీ తీయించేసుకోగలిగారు. దిగుమతి కూడా ఆపేస్తే ఇక ఇంత పెద్ద మార్కెట్లో ధరల ఇష్టారాజ్యం చలాయించవచ్చన్న దురాశ వీళ్లది. తమ కష్టాలకి కారణం కూలీవాడని చూపించి చెరుకు నరికే యంత్రాన్ని పట్టుకొచ్చేరు. ఒక్కొక్కటే కోటి రూపాయలు చేసే మిషన్లు. 2011 -12లో 87 వాడారనీ వాటి కొనుగోలు కోసం ప్రభుత్వం ఏభై కోట్లు సబ్సిడీ ఇచ్చిందనీ, గతేడాది మొత్తం చెరుకులో 8 శాతం నరికిన యంత్రాలపై ఈసారి 25 శాతం నరకాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ కూలీలు రోడ్డున పడుతున్నారనీ నందా కసబే రాశాడు. నిజమే. కూలీవాళ్లనీ, వుద్యోగస్థుల్నీ తీసి పారెయ్యడానికి ఎంత ఖర్చైనా పెడుతుంది ప్రభుత్వం ఇంతకీ ఫాక్టరీ వాళ్లు రాఘవయ్యకు డబ్బులు ఎందుకివ్వలేదు.? చక్కెర కర్మాగారాలు రైతులకీ, కూలీలకీ ఇవ్వవలసిన డబ్బులు వాయిదా వెయ్యడం, ఎగ్గొట్టడం సర్వసామాన్యం. చెరుకే కాదు. వ్యాపారం మీద ఆధారపడ్డ ఏ వ్యవసాయ వుత్పత్తికైనా అదే పరిస్థితి. వరి కావచ్చు. శనగ కావచ్చు. గోగు కావచ్చు. మొక్కజొన్న కావచ్చు. గ్రామాల్లో షావుకార్లూ, రైస్ మిల్లర్లూ వగైరాలూ ఇలాగే పెరిగారు.

పంటల్లో మిగులు ప్రారంభం అయిననాడే పెట్టుబడికి విత్తనాలు పడతాయన్నది ప్రాధమిక సూత్రం. మిగులున్న రైతులు షావుకార్లకి అరువులిస్తారు. అప్పులిస్తారు. ఆ డబ్బుతో సరుకు కొని, దాచి బాకీలు వాయిదా వేసి, ఎగ్గొట్టి, సరుకు ధర పెరిగినప్పుడు లేదా కృత్రిమంగా పెంచి సరుకు అమ్మి లాభాలు తీస్తారు షావుకార్లు. దీన్నే స్పెక్యులేషన్ అని అంటాం. భారతీయ పారిశ్రామిక పెట్టుబడికి మూలం  ఈ స్పెక్యులేషన్ లాభాలే. బొంబాయి, కలకత్తాల్లోణి మార్వారీ, పార్సీ పెట్టుబడిదార్ల చరిత్ర చదివితే స్పెక్యులేషనూ, నల్లమందు వ్యాపారము, వడ్డీ వ్యాపారమూ వాళ్ల మూలాలని తెలుస్తుంది. జె.డి.బిర్లా చరిత్ర దొరుకుతుంది షాపుల్లో.

ఈ విషయం కథలో స్పష్టంగా చెప్పకుండా పంట తగ్గడం, ధర లేకపోవడం, సరుకు పేరుకు పోవడం, ఎం.డీ మారిపోవడం అని ఏవేవో సంబంధం లేని కారణాలు చూపించడం పెట్టుబడిని వెనకేసుకురావడమే.  అర్ధసత్య, అసత్య ప్రకటనే. ఫ్యాక్టరీ దివాళా తీయడానికి కారణం పర్చేసింగ్ ఆఫీసర్లు, మేనేజరూ చేసిన అవినీతి అని చెప్పడం మరో పెట్టుబడిదారీ వ్యూహం.. అమిత ధనార్జన, అత్యంత లాభాలు మాత్రమే ఏకైక నీతిగా, ఆదర్శంగా బతికే పెట్టుబడి అందరికంటే ఎక్కువగా అవినీతి గురించి మాట్లాడుతుంది. అవినీతి ఫలితాలను చిలువలు వలువలుగా  వర్ణిస్తుంది కానీ వాటికి కారకులుగా గుమస్తాలనీ, కానిస్టేబుల్నీ, అర్ధరూపాయి లంచం అడిగిన బంట్రోతునీ చూపించి లైసెన్సు రాజ్యం పోవాలని కేకలు పెడుతుంది. అమెరికా ఎంతో ఎక్కువగా మానవ హక్కులు గురించి మాట్లాడ్డం చూస్తున్నాం. వరి వేసినప్పుడు బావున్నాయనీ, పెళ్ళిళ్ళు, చదువులు చేసాడనీ, శనగ, చెరకు వేసి చెడిపోయాడని రాయడం నిర్ధిష్టంగా కొంత సరైందేమో కానీ సాధారణంగా పూర్తిగా తప్పు. వరి రైతులు కుదేలైపోవడం కొన్ని వేల రచయితలు కథలు కథలుగా రాశారు. వ్యాపారంలోకి వెళ్లాక ఆహారం అని లేదు. వినిమయాన్ని మించిన మిగులుకి వ్యాపార సూత్రాలు వర్తిస్తాయి.

ఇథనాల్ వుత్పత్తి చేస్తే ఫాక్టరీలు బావుంటాయనీ, రైతులకు డబ్బులిచ్చేస్తాయనీ, కొత్త ఇథనాల్ మిల్లులొస్తాయనీ. గ్రామాలు  జవజవాలడతాయనీ రాయడం కేవలం పెట్టుబడికి పనికొచ్చే ప్రచారమే అవుతుంది. నా అంచనాకి కథలోనే దాఖలాలున్నాయి. కథ ప్రారంభంలోనే కర్మాగారం. గత వైభవాన్నీ, వర్తమాన దైన్యాన్నీ ఎంతో మమకారంతో వల్లిస్తారు. బోర్డులో అక్షరాలు రాలిపోవడాన్ని సహానుభూతితో రాస్తూ ఫాక్టరీ మీద జాలి పుట్టించే ప్రయత్నం చేస్తారు. లక్షా ఎనభై వేల టన్నులు గానుగాడిందనీ,  ప్రభుత్వ అవార్డు పొందిందనీ ఫాక్టరీని కీర్తిస్తారు. వుత్పత్తినీ, వుత్పత్తి సాధనాల్నీ ప్రేమించడం, కీర్తించడం పెట్టుబడిదారీ దృక్పథంలో భాగం. పాడైపోయిన రోడ్లనీ, పెరుగుతున్న పిచ్చి మొక్కల్నీ, పాకుతున్న పాముల్నీ వర్ణించిన రచయిత కూలీల, రైతుకూలీల జీవితాల్లోకి తొంగి చూడకపోవడం దృక్పధంలో భాగమే.

వ్యాపారం  లేకపోతే, దెబ్బతింటే వ్యవసాయం చచ్చిపోతుందని చెప్తూ, ఇథనాల్ వ్యాపారం కూడా చెయ్యాలని చెప్పడం, పరాకాష్టగా శీధిల వ్యాపారం స్థావరంలోనే వ్యవసాయాన్ని (రాఘవయ్యని) చంపడం దృక్పధానికి చెందినదే. అయ్యో! ఫాక్టరీ బావుంటే రాఘవయ్య బతుకునే అన్పించేలా కథ రాయడం పెట్టుబడికి ఎత్తిన హారతే.

రాఘవయ్య పదెకరాల (ధనిక) రైతు కావడం యాదృచ్చికం కాదు. ధనిక రైతులు పెటి బూర్జువా దృక్పధంతోనే వుంటారు. పెట్టుబడి తన విశాల ప్రాంగణంలోకి రైతుల్నీ, పెట్టి బూర్జువాల్ని రానిస్తుందని చెప్పొచ్చు. వారి ప్రయోజనాలు, మనుగడా పరస్పరాశ్రితాలు. కానీ కూలీవాణ్ని, మానవశ్రమని తమ పొలిమేరల్లోకి రానియ్యకుండానే గేటు ముందు సాయుధ రక్షకుల్ని కాపలా వుంచుతుంది. అదో అనివార్య, నిరంతర ఘర్షణ.

ప్రభుత్వం చేతకానిదనీ, సీరియస్‌గా లేదనీ రాయడం కూడ ఆ దృక్పధంలోంచి పుట్టిందే. చేతకాని ప్రభుత్వాలు వుండవు. ప్రభుత్వం అంటేనే రాజ్యం. రాజీ పడలేని వర్గ(దోచేవాళ్లూ, దోచబడేవాళ్లూ) వైరుధ్యాల ఫలితంగానే రాజ్యం వుంటుందని ఎంగెల్స్ తన రచనల్లో ఓపికగా స్పష్టం చేశాడు. వర్గసమాజంలో రాజ్యాన్నీ, ప్రభుత్వ రంగ వ్యాపారాన్నీ (సహకార మిల్లులు) గొప్పగా, మంచివిగా చూడ్డం అంతిమంగా పెట్టుబడిదారీకే లాభం. “వర్గ వైరుధ్యాలను అదుపులో వుంచవలసిన అవసరం నుండి రాజ్యం పుట్టింది. రెండు వర్గాల ఘర్షణలోంచి పుట్టింది కాబట్టి అది అప్పటికి ఆర్ధికంగా శక్తివంతమైన వర్గం యొక్క పరికరంగా వుంటుంది” అని ఎంగెల్స్ రాశాడు. చరిత్ర రోజుకొక్కసారి ఈ వాక్యాన్ని రుజువు చేస్తున్నది. దీన్నిగురించి పాఠకుల్లో స్పృహ కలిగించకుండా, సీడీసీ చైర్మన్ రఘునాధరెడ్డి మంచివాడని రాయడం, చక్కెర ఫాక్టరీ ప్రస్తుతం ఎండీ మారిపోతే అంతా బావుంటుంది అని రాయడం . వాళ్ల దోపిడీ, ఆ దోఫిడీ సూత్రాల పట్ల ఎరుక కలిగించే ప్రయత్నం చెయ్యకుండా, మేనేజరు ఆస్తులు పెరిగిపోవడాన్నీ, వాళ్ల అవినీతిని రాయడం కూడా దృక్పధానికి సంబంధించిన విషయమే. అవినీతి విషయమే. కానీ దోపిడీ ఇంకా పెద్ద, ప్రధాన, అసలు విషయం. దృక్పధం ప్రయోజనాన్నీ, ప్రయోజనం వస్తువునే నిర్ణయిస్తుందన్నట్లు ఈ దృక్పధంలోంచి పుట్టిన కథకి సహజంగానే బ్రెజిల్ ఒక వుదాహరణ, ఆదర్శం అయ్యింది. ఇందాక “పో’ గురించి అన్నాను. “పో” అమెరికన్. అమెరికన్ పుట్టుకే పెట్టుబడిలో జరిగింది. వస్తువు శిల్పాన్ని ఎన్నుకుంటుందంటే అదే. దృక్పధానికీ, వస్తువుకీ, శిల్పానికీ సహజ ఐక్యత కథలో కుదిరింది.

దృక్పధం రచయిత వ్యక్తిగత రుగ్మత కాదు. ఏ వ్యవస్థలోని వ్యక్తులూ ఆ దృక్పధంలోనే వుండడం సహజం. ట్రాట్‌స్కీ అన్నట్లు సమాజ స్వభావం రచయిత వర్గ స్వభావాన్ని నిర్దేశిస్తుంది. కొంచెం అధ్యయనం, కొంచెం పరిశీలన, కొంచెం ఆలోచన రచయితల్ని సరైన మార్గంలో పెడతాయి.

నేను చెప్పినవన్నీ మామూలు విషయాలు. పేపర్లో విషయాలు. నాది ప్రాధమిక జ్ఞానం. నాది వానాకాలం చదువు. కానీ కనీసం ఈ చిన్న విషయాలు సంపాదకులు రచయితతో చర్చించి వుంటే పాఠకులకి ఒక మంచి కథ దొరికి వుండేది.

 

 

 

 

 

తిరోగమన పాఠం ‘ఉత్తమ కథ’ లక్షణమా?

 

 కథకి పెద్ద పీట వేయాలన్నది సారంగ వార పత్రిక లక్ష్యాల్లో ఒకటి. అందులో భాగంగానే ప్రతి వారం కథకి సంబంధించిన   ఏదో ఒక శీర్షిక వుండాలన్నది సారంగ ప్రయత్నం. ఇప్పటికే చిరపరిచితమయిన ఉమా మహేశ్వర రావు శీర్షిక ‘కథా సమయం’తో పాటు మరో కొత్త కథా శీర్షిక ఈ వారం నించి మొదలవుతుంది.

 ‘చిత్ర’ కలం పేరుతో కథాభిమానులకు పరిచితమయిన వీవీయస్ రామారావు గారు ఈ నెల నించి ‘కథాచిత్రం’ శీర్షిక ద్వారా ‘సారంగ’ పాఠకులను పలకరించబోతున్నారు. కథని ఒక లోతయిన ఆలోచనా ప్రక్రియగా చూడడం ఆయన విమర్శ మార్గం. ఒక కథ చదివాక పాఠకుడిలో ఎలాంటి ప్రశ్నలు రేకెత్తవచ్చు అన్న ఆలోచనతో కథని భిన్న కోణాల నుంచి చూసుకునే దృష్టి రచయితలకు ఏర్పాడాల్సిన అవసరం వుందని చిత్ర అంటారు.

*

2003 ఇండియా టుడే మార్చి 18 – 25 సంచికలో చోరగుడి జాన్‌సన్‌గారు ‘మట్టి పక్షులు’ అనే కథ రాశారు. ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఉత్తమ కథగా ఎన్నికైంది. రచయిత దీన్ని కథ అన్నారు కాబట్టి సంపాదకులు సరే అన్నారు కాబట్టి అలాగే కానిద్దాం. వాళ్లని అక్కడే వదిలేద్దాం.

దీంట్లో పాత్రలు రెండు. ఇద్దరూ దళితులే “అంజయ్య పుట్టిన ఏడాదికే తండ్రి చనిపోయాడు. తల్లి ఊర్లో రైతుల ఇళ్లల్లో చాకిరీ చేసి కొడుకుని పెంచింది.” అంజయ్య టీచరయ్యాడు. మరో టీచరమ్మని పెళ్లాడాడు. ఇద్దరు కొడుకుల్నీ, కూతుర్నీ ఇంజనీర్లని చేసేడు. పెద్ద కొడుక్కి మంచి వుద్యోగం రాలేదనీ, మరీ లో పే ఆఫర్ చేస్తున్నారనీ “దిగుల్తో, ఆలోచనల్లో వున్నాడు. చలికాలం అర్ధరాత్రి రైల్వే స్టేషన్లో అతనికి డానియెల్ కలుస్తాడు. సిగరెట్లు కాలుస్తూ పెద్ద వుపన్యాసం యిస్తాడు. చివరికి అంజయ్యకు మనసులో అనిపించింది. “తన కుటుంబంలో మరొక తరం తన వృత్తిలోనే ఉండి  ఉండాల్సిందని”

అదండీ విషయం. అంతా చదివేక అజ్ఞానానికి హద్దు లేదనిపిస్తే మన తప్పు కాదు. వెనక్కి వెనక్కి పరిగెట్టమని  చెప్పే ఈ కథ వుత్తమకధ కావడానికి కారణాలు  వెతికి తీరాలి.

ఇంతకీ అంజయ్య బాధేమిటి? ఎందుకు? ఈ ఆలోచనలు? ఏమిటి దుఃఖం  అని చూస్తే కొడుక్కి పెద్ద జీతంతో గొప్ప వుద్యోగం- ముతగ్గా చెప్పాలంటే కాలు మీద కాలు వేసుకుని అజమాయిషీ చేసే అవకాశం రాలేదని. వ్యవస్థా యంత్రాంగంలో చోటు దక్కలేదని.. సరే ఆశ తప్పు కాదు. ఆలోచన సరిగ్గా వుండాలి. కథ మొదట్లోనే పోరాట క్షేత్రంలో అసమానతలు వున్నాయా?” అని ఆలోచించిన అంజయ్య “ఎక్కడో ఏదో మతలబుంది. పట్టుకోవడానికి ప్రయత్నించాలి”  అన్న అంజయ్య, మనలో ఆసక్తి రేకెత్తించిన, అంజయ్య చివరికిలా దిగజారిపోవడానికి డానియెల్ వుపదేశమే కారణం అయితే గురువుగార్ని పుఠం పెట్టవలసిందే. ఈ డానియెల్ అనే వ్యక్తిదంతా అజ్ఞాన ప్రదర్శన. అచారిత్రకం, అవాస్తవం. తిరోగామి  ఆలోచనావిధానం. ఇతను ఈ దోపిడీ వ్యవస్థకి నమ్మిన బంటు. జీతం బత్తెం లేని నౌకరు.

చరిత్ర చూస్తే అరవై డెబ్బైలనాటికి మన దేశంలో భూస్వామ్య వ్యవస్థకి కీళ్లు కదిలిపోయాయి. పెట్టుబడిదారీ ఈడేరింది. ఫలితంగా అసమానతలు తీవ్రమయ్యాయి. కులవ్యవస్థకి, కులవివక్షకి అవి జోడయ్యాయి. మరోవైపున అవే పెట్టుబడిదారీ విస్తరణకు అడ్డంకయ్యాయి. ఆ సమయంలో అంబేద్కర్ ధర్మమా అని రిజర్వేషన్లు ఒక చిన్న మార్గం కావడంతో కొద్దిమంది చదువు సాయంతో ఒక స్థాయికి చేరుకున్నారు. భద్ర జీవితానికి, అజమాయిషీకి అలవాటు పడ్డ వీళ్లు క్రమంగా ప్రభువులకీ, వారి అవసరాలకీ, ఆలోచనలకీ దాసులుగా మారేరు.(మాంచెస్టర్ సిండ్రోం) ప్రభువుని మించిన ప్రభుభక్తి ప్రదర్శిస్తారు. ఇది సూత్రం ఇది చరిత్ర. ప్రతి సమూహం నుంచీ కొంతమంది విధేయుల్ని తయారుచేసుకోడం వ్యవస్థ కొనసాగింపుకి  అవసరమే. ట్రేడ్ యూనియన్లు, దళితులు, స్త్రీలు, మైనారిటీలు ఇలా విడగొట్టి తాయిలాలిచ్చి తన వాళ్లుగా చేసుకోడం వ్యాపారసూత్రం. అందుకే డానియల్ పదే పదే దళితుల్ని తప్పు పడతాడు. ఎద్దేవా చేస్తాడు. దళితులు వగైరాలో చేసే కనీసపు పోరాటాలు కూడా ఆయన్ని బెంబేలెత్తిస్తాయి. మధ్యతరగతిగా మారిన మిధ్యామేధావులు కులాంతరీకరణ చెందే క్రమంలో వర్గాంతరీకరణ చెందారు. చర్చిల్లో కూడా రకరకాల వివక్షల్ని మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. డానియల్ తన శబ్దాతిసార ప్రకోపంలో ఏమన్నాడో చూద్దాం.
“చదువయిపోయిన ఏడాదికే నీకు గవర్నమెంటు వుద్యోగం దొరకటం నీకున్న అర్హతని బట్టి వచ్చిందే కానీ అది ఏ ఒక్కరి ఆయాచిత ధర్మం కాదు” అనడం పరిపూర్ణమైన అబద్ధం.
డానియల్‌కి తన షావుకారు సిఫార్సు వల్ల వుద్యోగం వచ్చింది. అలా సిఫార్సులు లేని అసంఖ్యాక దళితులు మట్టిలోనే మిగిలేరు.

ఇతర కులాల  స్తోమత కలిగినవాళ్లతో “మనం పోల్చుకోవటం మొదటి తప్పు” అని అంతరాల్నీ, కులవివక్షనీ మహాగట్టిగా బలపరుస్తాడు. ఈ పేరా అంతా చదువుతుంటే మనకి విశ్వనాధవారు గుర్తొస్తారు. ఇద్దరి భావాల్లోనూ, తత్వంలోనూ ఏ మాత్రం తేడా కనబడదు. ఆయనది సంస్కృతవేదం. డానియల్‌ది ఇంగ్లీషువేదం.

“మంచిని సవ్య దృక్పధంతో చూడలేకపోవడం రెండో తప్పు” అని తప్పంతా దళితుల పైకి, బలహీనులపైకి నెట్టేసి, వ్యవస్థ అంతా మంచిదని ప్రకటిస్తారు ఈ విస్సన్నగారు!!
“ఏమి సృష్టించుకుంటావు అనేది నీ నైపుణ్యానికి సంబంధించిన విషయం” అని మేనేజ్‌మెంట్ గురూ పాత్రలోకి దూరి గంభీరమైన ప్రకటన చేస్తారు. చరిత్ర పట్ల, సూత్రాల పట్ల అత్యంత కనీసపు అవగాహన లేని  వాగాడంబరం. ఏ నైపుణ్యం వుందని, అంజయ్య పేపర్లో చూసి కాపీ కొట్టి పరీక్షలు పాసైన దుర్గాప్రసాద్ ఇంజనీరింగు కాలేజీకి యజమాని అయ్యాడు?ఇంజనీరు కావాలనుకున్న అంజయ్య ఆలోచనలు అడివూళ్లో అలా అయ్యవారుగా తెల్లవారేయి” అని రచయిత స్పష్టంగా రాశాడే! భాష భావాల రూపం అనుకుంటే “సృష్టి” “నైపుణ్యం” ఎవరి భావాలివి? ఎవరికి పనికొస్తాయి??

మధ్యలో మంచి హాస్యమూ వుంది. “దేశానికి స్వాతంత్ర్యం కోసం త్యాగాలు చేసి, పోరాటాలు చేసిన వేలాది కుటుంబాలు స్వాతంత్ర్యం వచ్చాక సహజంగానే తొలి పంక్తిలో అధికార విందుకు సిద్ధమయ్యాయి” అయ్యా! అదీ సంగతి! 2003లో చిన్న పిల్లాడైనా నమ్ముతాడా ఈ విషయం? బొబ్బిలి, భోపాల్, తిరుచ్చి వగైరా జమిందార్లు త్యాగాలు చేసేరు. వాళ్ల పొలాలు పండించి కుప్పలు పోసిన దళితులు ద్రోహులుగా మిగిలేరు! దగాకోరు మాటలు , మోసకారి వుపన్యాసాలు! ఎందుకంటున్నాడు అలా? వినండి.. వాళ్ల క్లెయింని నువ్వూ, నేనూ కాదనగలమా? అంతిమ ఫలాల దగ్గర నా వాటాకు ఇన్ని రావాలీ అంటే నీకు ఇవ్వడానికి ఎవడూ ఒప్పుకోడు” అని స్పష్టం చేశాడు. రిజర్వేషన్లు అడగొద్దని మహోపదేశం చేస్తున్నాడు. అదంతా తప్పని తేల్చేసేడు. బూట్లు తుడిచిన బ్రాహ్మణ పిల్లల్ని మించిపోయేడు. అక్కడితో ఆగుతాడా? “గాంధీజీలో మనకు కావల్సిన మంచిని తీసుకోవడానికి మనకు అభ్యంతరం ఎందుకు వుండాలి?” అని దళితుల్ని గుడ్లు వురిమాడు.

అబ్బా!! సరే! పైగా మన ఏకవాక్య ఎజెండా రాజ్యాధికారం” అంటూ ఏకంగా అంబేద్కర్‌నే తప్పు పట్టే స్థాయికి ఎదిగిపోయేడు (దళితులకి రాజ్యాధికారం అన్నది అంబేద్కర్ వాక్యం) ఇంకా అంటాడు ” ఏ అద్భుతమో  జరిగి నిజంగానే మన దోసిళ్లలోకి వచ్చి పడితే అది చేజారిపోకుండా పట్టుకోగలిగిన బాహుబలం మనకుందా?” అని దళితుల్ని కించపరుస్తూనే ప్రభువుల పంచన చేరమని ప్రబోధిస్తాడు. నిరంతరం శ్రమ చేసిన బాహువుల్లో బలం లేకుండా ఎందు కుందని మాత్రం ఆలోచించడు.
“ఉన్న ఊళ్లో వునికి ప్రశ్నార్ధకమైతే దానికి అడివి జవాబు ఎలా అవుతుంది? మన మానవ వనరు అంతా యాంటీ ఎస్టాబ్లిష్‌మెంటు దృక్పధం అలవర్చుకుంటూ పోతే సవ్య దిశలో యోచించడానికి మనకి మిగిలే  సమూహాలేవి? అన్న డానియల్ ప్రభు వర్గాల ప్రధాన ప్రచారక పదవికి ఎంతైనా అర్హుడే. ముస్లీంలంతా టెర్రరిస్టులు. దళితులు నక్సలైట్లు. ఆహా! ఏమి జ్ఞానం!!!

దళితుల్ని నిందిస్తున్న డానియల్ కారణాలు వెదకడు. ప్రభుత్వంతో ప్రజలు ఘర్షణ పడుతున్నారంటే వాళ్లు కోపంగా వున్నారని. బాధల్లో వున్నారని అర్ధం. ప్రభుత్వాలతో ప్రజలు పడే ఘర్షణే చరిత్ర. ఆక్రమంలో ఎవరు ఎటు వున్నారనేది చాలా ముఖ్యం అవుతుంది. డానియల్ వఱడు కాదు. వీర బొబ్బిలీ కాదు. అదొక డాన్ జువాన్. మేకల మందలో తోడేలు. “గ్రామీణ  కూలీలు విశాల భూభాగాలకు తరలిపోతే అది వారి ప్రతిఘటనా శక్తిని తగ్గిస్తుంది. పట్టణాల్లో కేంద్రీకరించబడ్డ కూలీలకు పోరాట శక్తి పెరుగుతుంది”అని మహాశయుడు అన్నాడు. మరి గ్రామాల్లోనే వుండిపొమ్మని దళితులకి బోధించడం అంటే వ్యవస్థ కొనసాగింపుకి కొమ్ము కాయడమే. దళితులకీ, కూలీలకీ డానియల్ ఇస్తున్న సందేశం ఏమిటి? మట్టిని కాల్చి ఇటుకలమ్ముకొమ్మనీ, తేనేపెట్టెలు పెట్టి అమ్ముకొమ్మనీ, పాలు పెరుగు అమ్ముకోమనీ, ఆకుకూరలు ఆమ్ముకొమ్మనీ.

ఓహో డానియల్ మహర్షీ! మనువుని మించిన మహాగురువు. వేదాన్ని మించిన మహామేధ! పొలాలన్నీ కంపెనీల చేతుల్లో వుంటే ఎవరి పొలాల్లో మట్టి తీసి ఎక్కడ కాల్చాలి? ఏ చెట్లకి తేనె పెట్టెలు పెట్టాలి? గేదెల్ని ఎక్కడ మేపాలి? ఆకుకూరలు ఏ రైతుల పొలాల్లో పండించాలి? “ఎంట్రప్రెన్యూర్”  ప్రావీణ్యత ఎలా చూపించాలి? చిల్లర వర్తకంలో చొరబడుతున్న లక్షల కోట్ల డాలర్‌ల విదేశీ పెట్టుబడికి పోటీగా వీళ్లని నిలబెట్టడం ఎందుకు? వరద వుదృతిలో పిల్ల చేపలూ, పిత్తపరిగెలూ కొట్టుకుపోతాయి. పెట్టుబడిదారీ పెరిగే కొద్దీ చిన్నచిన్నవైపోయిన కమతాలు గుత్తపెట్టుబడి  పుట్టుకతో కార్పోరేట్ భూఖండాలుగా మారిపోయిన విషయాన్ని ఎంగెల్స్, లెనిన్‌లు పదెపదే ప్రస్తావించారు.మన వర్తమానం మరోసారి అది రుజువు   చేసింది.
రాసుకుంటూ పోతే ప్రతి వాక్యాన్ని ఖండఖండాలు చేయాలి. మీ సమయం వృధా. విషయానికొస్తే నిరుద్యోగం పెరిగిపోవడం ఒక చారిత్రక విషాదం. ఇంజనీర్లకే కాదు కూలీల్లోనూ భయంకరంగా పెరిగింది. కారణం పెట్టుబడిదారీ విధానం కొంతకాలం ప్రభుత్వ రంగ సంస్థల పేరుతో స్టేట్ కాపిటలిజం నడిచి వ్యక్తి పెట్టుబడిని పెంచింది. అంజయ్యలూ, డానియల్‌లూ తయారయ్యేరు. ఇప్పుడు డిజిన్వెస్ట్‌మెంట్ తారకమంత్రమైంది. ఈ క్రమంలో అత్యధికంగా నష్టపోతున్నది దళితులు, ఆదివాసీలు, ఇతర బలహీనవర్గాలు. దీన్ని “ప్రభుత్వ పాత్ర అయిపోయింది” అని డానియల్ సమర్ధించడం ప్రజల్ని తప్పుదోవ  పట్టించడమే.

2003లో వుపన్యాసమిస్తూ దళితుల్ని, ఇంకా గ్రామాల్లోనే వుండమని చెప్పడం అచారిత్రకం. ప్రజావ్యతిరేకం. ఆర్ధిక సూత్రాలకు పొసగని ఆలోచన ఇది.

ఒక రంగంలో వచ్చిన పెట్టుబడిదారీ విధానం అన్ని రంగాలకీ వ్యాపిస్తుందనీ, గ్రామీణ పరిశ్రమలు కనుమరుగౌతాయని, మిగిలిన ఒకటీ రెండూ కూడా అమానుషమైన పరిస్థితుల్లో స్త్రీలూ, చిన్న పిల్లలూ లాంటి చవక శ్రమపై ఆధారపడి హీనమైన దోపిడీ చేసి చివరగా వూపిరాడక చస్తాయని మహాశయుడు స్పష్టం చేశాడు.

సరే ఆయనతో డానియల్‌కి పేచీ వుండొచ్చు.

సోషల్ మేష్టారుగా పాతికేళ్లు పైన పని చేసి భూపోరాటాలకి సానుభూతి చూపించిన వుపాద్యాయ సంఘం నాయకులైన అంజయ్య, కనీసం ప్లానింగ్ కమీషన్, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ నమూనా సర్వేలు రాసినవి గానీ, టన్నులకొద్దీ వచ్చిన ప్రభుత్వపు రిపోర్టులు కానీ కనీసం తిరగేసి వుంటే గ్రామాల్లోనే వుండిపోవాలన్న ఆలోచనకి రాడు. ఇంతకీ డానియల్ ఒక్కడే కాదు. అంజయ్యా దొంగే.
“జిల్లా నాయకత్వ పదవి రాగానే జిల్లా కేంద్రానికి దగ్గరగా బదిలీ” చేయించుకుని రిలాక్స్ అయినవాడు ఏం సేవలు చేసి వుంటాడో ఊహించడం కష్టం కాదు.

 (కవర్ పెయింటింగ్ : ఎస్వీ రామశాస్త్రి )