-శివాజీ
~
చాలా మంది ఆర్టిస్టు లకి మల్లె చారిలోనూ పాత ప్రశ్నే వచ్చి పడింది… జనం మెచ్చినది మనం చేయవలెనా? మనం చేయునది జనం చూడవలేనా? అనే. కానీ మధ్యస్తంగా వుంటే పోలా ? అనే మరోప్రశ్న బిట్క్వశ్చన్లా వచ్చి పడిందతనికి. ఫలితంగా ‘ చారి చిత్రకళ’ అనేది చారి ‘ఇలస్ట్రేషన్ ‘ పనితో మొదలయింది.
పూర్వంనుంచీ గల డ్రాయింగుల పిచ్చి పాకానపడింది, అది మోహన్ ఆశ్రమంలో మొగ్గలు వేసింది. కొన్ని పత్రికలకు పని చేసి చూశాడు. ఇతని పాదాలకు పేద్ద చక్రాలు కలవని, వున్నచోట ఉండడనీ చక్కని పేరు పొందాడు. కథలకి, వ్యాసాలకి, అట్టమీది బొమ్మలకీ ఇతనినే వాడండి అనే పబ్లిసిటీ వచ్చేలోగానే చిత్రకళ అనే కేన్వాస్ పెయింటింగ్ లో శ్రద్ధ వహించాడు. అడపాదడపా గేలరీ గ్రూప్ షోల్లో చిన్నపాటి తడాఖా ప్రదర్శించాడు. నల్లటి రేఖలతో కళకళ లాడే రంగుల్లో బొమ్మల్ని వృద్ది చేశాడు…
తాజా కామెంట్లు