బాపూ గారూ- నేనూ అతి క్లుప్తంగా

మా ఇంట్లో బాపూ గారు -1996

మా ఇంట్లో బాపూ గారు -1996

ఆయన నిర్యాణం వార్త వినగానే ముందుగా కళ్ళ ముందు మెదిలింది ఆయన నవ్వే. అది ఎక్కడా కల్మషం లేకుండా అత్యంత సహజమైన ఆహ్లాద కరమైన, విశాలమైన నవ్వు. విశాలం అని ఎందుకు అంటున్నాను అంటే ….ఆ బూరి బుగ్గలకి ఇవతలి నుండి అవతలి దాకా పూర్తిగా, హాయిగా నవ్వడం, నవ్వించడం ఆయన స్వభావం. ఆయనతో నా పరిచయం కేవలం ముఫై సంవత్సరాల పైనే. వ్యక్తిగతంగా కలుసుకుని ఆయన తో పూర్తిగా గడిపిన రోజులు మహా అయితే 30 ఉంటాయేమో. ఫోన్ లో మాట్లాడినది సుమారు 60 గంటల పైగానే. ఇక ఉత్తర ప్రత్యుత్తరాలు పరవా లేదు.

తన గురించి “గొట్టాం గాణ్ణి” అనుకునే ఏకైక కారణ జన్ముడు, కేవలం తెలుగు జాతి జాతకం బావుండి తెలుగు వాడిగా పుట్టి “పద్మశ్రీ “ బిరుదుతో సద్దుకున్న అసల, సిసలు “భారత రత్న” బాపు గారు. ఆయన ఎంత “సింపుల్” మనిషి అంటే ఆయనకి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు అని తెలిసి ఫోన్ చేసి “గురువు గారూ…మీకు ధన్య వాదాలే కానీ మీకు ఇలాంటివి చాలా చిన్న గుర్తింపులే కదా.” అని అప్రస్తుత ప్రసంగం లాంటిది చేశాను.

దానికి నవ్వేసి “అలా అనకండి. ఇది కూడా చాలా ఉపయోగం. ఎందుకంటే మొన్నటి దాకా స్వామి దర్శనం చేసుకోవాలంటే పదేసి గంటలు లైన్ లో నుంచో వలసి వచ్చేది. ఇప్పుడు వాళ్ళే వచ్చి, నాకు ప్రత్యేక దర్శనం చేయించారు” అన్నారు.

“కానీ…అదేమిటో, నాకూ, రమణ గారికీ ఒకటే దండ వేశారు. అదేదో గజమాలట. ఈ సభల్లో అన్ని పువ్వులు ఎందుకు వేస్ట్ చేస్తారో?” అని కూడా అనగానే “అవును సుమా” అని నాకు అనిపించి ఆ తరువాత ఆయన వచ్చిన మా సభ కి పువ్వులు బదులు పుస్తకాలు బహుమతిగా ఇచ్చాను. ఆయన భలే సంతోషించి…”తెలివైన వాడివే” అన్నారు.

అదే సభ లో మేము తొలి అంశంగా మేము ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న చాలా జిల్లాల నుంచి ఎంపిక చేసిన “ఉపాధ్యాయుల సత్కారం” అనే కార్యక్రమం తలపెట్టి, అ విషయం ఆ సభ ప్రధాన అతిథులైన బాపు-రమణ లకి తెలియజేశాను. వెనువెంటనే బాపు గారి దగ్గర నుంచి ఎప్పటి లాగానే క్లుప్తంగా ఒక ఇ-మెయిల్ వచ్చింది. అందులో ఒకే ఒక్క మాట….”అద్భుతం”…ఆ తరువాత ఫోన్ లో ఆ ఆలోచన ఎంత బావుందో ఆయనా, రమణ గారూ వివరంగా చెప్పారు.

అదే సభలో రమణ గారి కథ – బాపు గారి బొమ్మ తొలి సారి గా ప్రచురణ కి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా మేము నిర్వహించిన బాపు-రమణ ల మైత్రీ షష్టి పూర్తి సందర్భంగా మరొక తమాషా జరిగింది. “మీ సన్మానం సందర్భంగా నారాయణ రెడ్డి గారు, మరి కొందరు మాట్లాడతారు” అని నేను ఇంకా ఆ సన్మాన కార్యక్రమం ఎలా జరుగుతుందో చెప్తూ ఉండగా “వాళ్ళంతా మమ్మల్ని పొగుడు తారా?” అని అడిగారు బాపు గారు.

నేను సమాధానం చెప్పే లోగానే “ఒకటే కండిషన్. మా గురించి ఎవరైనా మాట్లాడుతుంటే నేను చస్తే స్టేజ్ మీద కూచోను. ఎందుకంటే వాళ్ళ మైక్ స్టేజ్ ముందు ఉంటుంది. మా కుర్చీలు వెనకాల ఉంటాయి. అంచేత వాళ్ళ వాగుడు అంతా ఆడియన్స్ కే కానీ నాకు వినపడి చావదు. వాడు తిడుతున్నాడో, పొగుడుతున్నాడో తెలిసి చావదు. అంచేత నేను నేనూ, రమణ గారూ కింద కూచుని ఆ వాగుడు వింటాం. అందరి స్పీచ్ లూ అయ్యాక అప్పుడు మమ్మల్ని స్టేజ్ మీదకి పిలు” అన్నారు.

“సరే, సార్.” అని ఆ మాట సి. నారాయణ రెడ్డి గారితో చెప్పాను. ఆయనకి భలే కోపం వచ్చింది.

“బాపుకేం తెలుసూ..వాళ్ళు ఆడియన్స్ లో కూచుని . స్టేజ్ ఖాళీగా ఉంటే నాకు అవమానం. పైగా అది సంతాప సభ అవుతుంది కానీ , సన్మాన సభ ఎలా అవుతుందీ” అని కోప్పడ్డారు.

నేను ఏం చెయ్యాలో తెలియక, ఇద్దరికీ నచ్చ చెప్పా లేక మొత్తానికి “నేను మిమ్మల్ని ఇద్దరినీ ఒకే సారి వేదిక మీదకి ఆహ్వానిస్తాను. ఆ తర్వాత మీరు, మీరూ చూసుకోండి” అని అలాగే చేశాను. ఆఖరి క్షణంలో నారాయణ రెడ్డి గారు ఎంత బతిమాలినా, బాపు-రమణలు ముందుగా స్టేజ్ మీదకి రాకుండా అన్ని ప్రసంగాలూ అయ్యాకే వేదిక మీదకి వచ్చారు. చికాకులో ఉన్నా, ఆ రోజు బాపు-రమణ ల మీద సి. నారాయణ రెడ్డి గారు అద్భుతంగా ప్రసంగించారు.

డిశంబర్ 31, 2006 – జనవరి 1, 2007 తారీకులలో “మొట్ట మొదటి ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” జరిగిన ఆ మహా సభలో నా కథల పుస్తకాన్ని బాపు-రమణ లో ఆహ్వానించారు. ఆ నాటి ఫోటో ఒకటి, 1996 లో బాపు గారు మా ఇంట్లో వారం రోజుల పైగా ఉన్నప్పటి ఫోటో ఒకటి, ఆయన కేవలం నా ఫోటో చూసి వేసి నాకు బహుకరించిన ఒక కేరి కేచర్ ఇందుతో జత పరుస్తున్నాను.

మరొక సారి ఏమయిందంటే…బాపు గారిని మా హ్యూస్టన్ లో ఉన్న నాసా అంతరిక్ష కేంద్రం చూడ్డానికి తీసుకెళ్ళాను. అది ఆయనకీ చాలా నచ్చింది. అక్కడ విజిటర్స్ పుస్తకంలో “ఇందులో తెలుగులో సంతకం పెడితే అదేదో తురకం అనుకుని నన్ను జైల్లో పెడతారా” అని అడిగి, నవ్వేసి ఇంగ్లీషులోనే పొడి సంతకం పెట్టారు.

మరొక సారి అమెరికా ఆహ్వానిస్తే “వద్దు లెండి. మీ అమెరికా ఎయిర్ పోర్ట్ లో బట్టలు విప్పేసి మగాళ్ళ ముందు నగ్నంగా నుంచోడానికి అంత దూరం ఎందుకూ? మా ఇండియాయే బెటరు” అన్నారు. “పోనీ ఆడ సెక్యూరిటీ వాళ్ళని ఏర్పాటు చేస్తాను లెండి” అనగానే అరగంట సేపు నవ్వారు బాపు గారు. నేను అమెరికాలో “శ్రీ రామరాజ్యం” విడుదల ఆట చూసి, హాలు నుంచి బయటకి రాగానే ఆనందం పట్ట లేక బాపు గారికి ఫోన్ చేశాను.

మాములుగా క్లుప్తంగా మాట్లాడే బాపు గారు మహానందపడి ఎన్నడూ లేనిది అనేక విషయాల మీద …ముఖ్యంగా రమణ గారు లేని లోటు గురించి …గంట సేపు మాట్లాడారు.

ఎంతో “సెన్సిటివ్” మనిషి అయిన బాపు గారు, తనకే ఏదైనా విషయం బాధిస్తే, దానిని కార్టూన్ రూపంలో వెలిబుచ్చే వారు. ఉదాహరణకి మొట్టమొదటి సారి ఒక జాతీయ సంఘం అమెరికా పిలిచినప్పుడు ఆయనకి చాలా అవమానం జరిగింది..అని ఆయన చెప్పకుండా చెప్పిన మాటలు. అప్పుడు ఆయన చేత ఆ కన్వెన్షన్ సెంటర్ లో “స్త్రీల మరుగు దొడ్డి” లాంటి సైన్ బోర్డులు బాపు గారు అమెరికాలో మొట్టమొదటి సారి అడుగు పెట్టగానే రాయించారుట. అప్పటి నుంచీ బాపు గారికి అమెరికా రావడం అంటే ఎలర్జీ యే. ఆయన అమెరికా అనుభావాల మీద కొన్ని కార్టూన్ లు వేసి మా బోటి గాళ్ళకి చూపించారు బాపు గారు. అవి చూస్తే ఆయన ఎంత బాధ పడ్డారో తెలుస్తుంది.

అలాగా లూయీ మాలే అనే ఫ్రెంచ్ దర్శకుడు “మహాభారత” అనే సినిమాని ..పాండవులు, కౌరవులు. కృష్ణుడు ఐదు వేల ఏళ్ల క్రితం ఆటవిక జాతుల కుటుంబ కలహంగా, అందులో పాత్రధారులని అసహజమైన రీతిలో చిత్రీకరిస్తూ తీసిన చిత్రం బాపు గారిని చాలా బాధ పెట్టింది. అందులో భీష్ముడి పాత్ర ఒక సౌత్ ఆఫ్రికా నల్ల వాడి చేతా, ఇతర పాత్రలు ఇతర దేశాల నటుల చేతా వేయించి మొత్తానికి హిందువుల మనోభావాలని దెబ్బతినేటట్టుగా ఆ సినిమా ఉంది. దానికి స్పందనగా బాపు గారు ఒక కార్టూన్ లో జంధ్యము, బొట్టు, పిలకా ఉన్న ఒక బ్రాహ్మణుడి ని శిలువ మీద క్రీస్తు గానూ, మిగిలిన పాత్రలని, నల్ల జాతి మొదలైన వారి లా చిత్రీకరించి “ఇది చూస్తే క్రైస్తవ మతస్తులు ఏమనుకుంటారో?” అని అనుమాన పడుతూ ఆ కార్టూన్ పంపించారు. ఆయనకీ అర్థం అవని మరొక విషయం అమెరికాలో విరాళాల మీద ఆధారపడి సాంస్కృతిక కార్యక్రమాలు చెయ్యడం. “నన్ను ఏదో జూలో కోతిని కూచో బెట్టి అందరి చేతా డబ్బులు వేయించినట్టు, మీరు విరాళాలు అడుక్కుని నన్ను పిలవడం ఎందుకూ, ఏదో యాయవారం బ్రాహ్మడికి దక్షిణ పారేసినట్టు నాకు మీ దాన ధర్మాలు ఎందుకూ?” అనే వారు ఎప్పుడు అమెరికా రమ్మని పిలిచినా.

Bapu & Chitten Raju
ఇలా బాపు గారి గురించి వ్యక్తిగతంగా నాకు తెలిసినవి చెప్పుకుంటూ పోవాలంటే చాలా విషయాలే ఉన్నాయి. కానీ మనసు బాగా లేదు. నేను, ఆ మాట కొస్తే తెలుగు వారు ఎంతో అదృష్ట వంతులు. రమణ గారి సాయుజ్యంలో ఇప్పుడు బాపు గారు మళ్ళీ స్వాంతన పొందుతున్నారు. ఆయన జ్జాపకాలు నన్ను ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటాయి. అంత కంటే ఆయనకి ఇవ్వగలిగిన నివాళి ఇంకేమీ లేదు.

-వంగూరి చిట్టెన్ రాజు

ఆరుద్ర రైలు కాస్త లేటుగా అందుకున్నా…

arudra1

       శ్రీ శ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు.

   మరీ లేత వయసులో– అంటే టీనేజీ అని నా ఉద్దేశం- శ్రీశ్రీని ప్రత్యక్షంగా కలిసి వున్న అనుభవం కూడా దీనికి కారణమయి వుంటుంది! అయితే, ఆంధ్రజ్యోతి లో చేరిన కొత్తలో మంచి వచనం రాయడం ఎలాగా అని తెగ మథనపడే రోజుల్లో శ్రీశ్రీ వచనం, మరీ ముఖ్యంగా శ్రీశ్రీ వ్యాసాలు, నాకు పెద్ద ఆకర్షణ. అలా శ్రీశ్రీని వొక కవిగా కంటే గొప్ప వచన రచయితగా సొంతంగా డిస్కవర్ చేస్తున్న కాలం అది. ‘నువ్వు నీలాగే రాయ్” అని నండూరి అనే వారు. అయినా, ఏదో తాపత్రయం!

అలాంటి 1986 రోజుల్లో ఒక తెల్లారుజామున బెజవాడ బందర్ రోడ్డులో వేంకటేశ్వర స్వామి వీధిలో వున్నమా వొంటరి గది – ఈ ఇరుకు గదిలో నేనూ, రుద్రాభట్ల కిషన్ చాలా ఏళ్ళు ఒకే మంచం ఒకే కంచంగా బతికాం. ఆ గది తలుపు తట్టారెవరో! తలుపు తీస్తే ఎదురుగా వొక అపరిచిత వ్యక్తి.

అతను నన్ను పరిచయం చేసుకొని, “సార్, ఆరుద్ర గారు కబురు చేశారు. ఇవాళ మీకు వీలు కుదిరితే రమ్మన్నారు.” అన్నాడు.

ఆరుద్రగారు వూళ్ళో వున్న సంగతి నాకు తెలుసు కానీ, నా పొగరు వల్ల (పొగరు అనే కంటే శ్రీ శ్రీ పట్ల వున్న ప్రేమలోని “విగరు” వల్ల అనుకోవచ్చు) ఆ విషయం నేను అంతగా పట్టించుకోలేదు.

“సరే, వస్తాను”

“ఇప్పుడు వెంటబెట్టుకొని రమ్మన్నారండి” అన్నాడతను కదలకుండా.

నేను అంత తేలికగా కదిలే ఘటం కాదని అతనికి తెలీదల్లే వుంది. అప్పట్లో నాదయిన ఒక చచ్చు/నచ్చు క్రమశిక్షణ నాకుండేది. పొద్దున లేవగానే బందరు రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్ళి గాంధీనగర్ పక్కన ఎప్పుడూ వొకే టిఫిన్ సెంటరులో ఎప్పుడూ అదే ఇడ్లీ వడ సాంబారు లాగించి, ఎప్పుడూ అదే దారిలో వున్న ప్రబోధ బుక్ సెంటరులో మధ్యాన్నం దాకా పుస్తకాలు చదువుతూ కూర్చోడం అప్పటి అలవాటు. (అప్పుడంతా మధ్యాన్నమో, రాత్రి డ్యూటీలో వుండేవి కనుక, పుస్తకం కొనడం అంటే నెల జీతంలో సగమో, మూడు వంతులో “ధార” పోయడమే కనుక, ఆ క్రైస్తవ దుకాణం నాకు మంచి ఆశ్రమం అయ్యింది). మూడు నాలుగు గంటల చదువు తరవాత, విశ్వేశ్వర రావు గారి మెస్ (అవును, ఇప్పటి ‘శ్రీశ్రీ’ విశ్వేశ్వర రావే!) లో మధ్యాన్న భోజనం! బ్రహ్మాదులు వచ్చినా ఆ రొటీన్ మారేది కాదు.

‘నేనొస్తాను, మీరు పదండి” అని అతన్ని అప్పటికప్పుడు పంపించేసి, తరవాత నిదానంగా నేను నా డొక్కు ర్యాలే సైకిలెక్కి ఆరుద్ర దిగిన హోటల్ చేరుకున్నా.

వెళ్ళేసరికి ఆరుద్ర అప్పటికే రెడీగా వున్నారు, “రండి…మీరొస్తే కలిసి టిఫిన్ చెయ్యొచ్చని కూర్చున్నా” అంటూ కింద రెస్టారంట్ కి దారి తీశారు.

ఆరుద్ర గారు నాకంటే తాపీ మేస్త్రీ! చాలా తాపీగా పనులు చేసే మనిషిలా కనిపించారు మొదటి పరిచయంలోనే. ఆయన కదలికలూ, మాట తీరు చూసి, “మీరు కూడా తాపీ ధర్మారావు గారేనా?” అన్నాను సరదాగా. అసలు అంత నెమ్మదిగా వొక్కో వాక్యం తూచినట్టుగా మాట్లాడ్డం సాధ్యమా అని ప్రతిసారీ అనిపిస్తుంది ఆయన మాటలు వింటూ వుంటే!

దానికి ఆయన పెద్దగా నవ్వేసి, “అవును అందరం ఆ తాపీ తానులో గుడ్డలమే కదా!” అన్నారు, అదీ తాపీగానే! “నేనెక్కాల్సిన రైలు ఎప్పుడూ జీవిత కాలం లేటు” అని ఆయన ఎందుకు అంత అథారిటీగా అనగలిగారో అప్పుడే అర్ధమవడం మొదలయ్యింది.

“మీ గడ్డం ఇన్స్పిరేషను కూడా ఆయనేనా?”

“లేదు, లేదు. కేవలం నా బద్దకం వల్ల, తీరిక లేక, వదిలేశాను గడ్డం!” అన్నారాయన.

టిఫినీ కార్యక్రమాలు అయ్యాక, ఆయన నెమ్మదిగా విషయంలోకి వచ్చారు.

‘నేను ఒక సంకలనం పని మీద మీ కోసం కబురు చేశాను. ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్ళు నాకు అప్పజెప్పిన పని. వాళ్లకేమీ కాలం పట్టింపు లేదు. కానీ, నాకు వుంది. ఈ సంకలనంలో 1975 తరవాత కవిత్వం ఎక్కువ వుండాలి అనుకుంటున్నా.”

“అవును, 75 తరవాతే బాగుంటుంది. కనీసం అంతకు ముందు వచ్చిన కవిత్వం అంతా ఏదో వొక విధంగా సంకలనాలకి ఎక్కింది. పైగా, 75 తరవాత చాలా కొత్త తరం వచ్చింది.” అన్నాను నేను.

“ఇంకో మాట ఏమిటంటే, ఈ సంకలనం వచ్చేనాటికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. కనీసం 75 ని ఒక కొండగుర్తుగా గుర్తిస్తే మనం సాహిత్యాన్ని చూసే దృష్టి మారుతుంది. కానీ, ఇటీవలి రాస్తున్న వాళ్ళ గురించి నాకు ఆట్టే తెలియదు. అక్కడ మీ సాయం కావాలి. మనం ఇద్దరం కూర్చొని వొక జాబితా తయారు చేసి, వాళ్లందరినీ కలిసి సంప్రదిద్దాం.” అన్నారాయన.

‘నండూరి గారు, శ్రీకాంత శర్మగారు ఇంతకు ముందు “మహా సంకల్పం” చేశారు. వారిని అడిగితే బాగుంటుందేమో?!’ అన్నాను నేను.

“వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళే మీ పేరు చెప్పారు.” అన్నారు ఆరుద్ర.

ఆ తరవాత చాలా సేపు మా చర్చ అప్పుడు కొత్తగా రాస్తున్న వాళ్ళూ, వాళ్ళ కవిత్వాల చుట్టూ తిరిగింది. కానీ, చాలా సేపటి కబుర్ల తరవాత నాకు అర్ధం అయ్యిందేమిటంటే, సమకాలీన కవిత్వాన్ని ఆయన చాలా శ్రద్ధగా చదువుతున్నారని! నన్ను అడగడం కేవలం క్రాస్ చెక్ చేసుకోవడం కోసం మాత్రమేనని!

మేము అలా చర్చిస్తూ వుండగానే, అక్కడికి నండూరి, పురాణం గార్లు కూడా వచ్చారు. ఇక నేను నిష్క్రమించడం మంచిదని అనుకుంటూ, లేవడానికి ప్రయత్నిస్తూ, “నేను మళ్ళీ కలుస్తాను” అనబోతుండగా, నండూరి గారు “ఏం పర్లేదు, వుండవోయ్, కాసేపు!” అన్నారు.

Arudra

కానీ, ఆ కాసేపటి తరవాత ఆరుద్ర గారు “అఫ్సర్ గారూ, నేను వొక రెండు రోజులు ఈ చుట్టు పక్కల గుంటూరు, తెనాలి, బందరూ అన్నీ తిరిగి, కొత్త రచయితల్నీ, కవుల్ని కలుద్దామని అనుకుంటున్నా. మీరొస్తే బాగుంటుంది.” అన్నారు. నేను నండూరి గారి వైపు తిరిగాను, ప్రశ్నార్థకంగా.

“పరవా లేదు, వెళ్ళు. ఈ వారం సాహిత్య పేజీ ఇచ్చి వెళ్ళు, సరిపోతుంది” అన్నారాయన. ఆంధ్రజ్యోతి సాహిత్య వేదికని నిండు సాహిత్య పేజీగా మార్చిన కాలం అది. చాలా కొత్త శీర్షికల వల్ల సాహిత్య వేదిక అందరినీ ఆకట్టుకుంటున్న కాలం కూడా – రచనలు, లే ఔట్ విషయంలో ఇద్దరం చాలా శ్రద్ధ పెట్టేవాళ్లం. ప్రతి అక్షరం పట్టి పట్టి చదివే వాళ్ళం. కానీ, రచనల ఎంపిక విషయంలో నాకు పూర్తి స్వేచ్చ వుండేది. నేను వెంటనే ఆఫీస్ కి వెళ్ళి, ఆ సాయంత్రానికల్లా పేజీ ముస్తాబు చేసి, ఇచ్చి, హోటల్ కి వచ్చి, మళ్ళీ ఆరుద్రగారిని కలిశాను.

2

సాయంత్రం అయిదు గంటలకి మేము బెజవాడ నించి కారులో బయలు దేరాం. ఆ రెండు రోజుల ప్రయాణాలు నేను మరచిపోలేనివి. పూటకి ఒక ఊళ్ళో దిగడం, అక్కడి కవులూ, రచయితలతో మాట్లాడ్డం…! వెళ్ళిన వూళ్లలో కొద్ది సెపే వున్నాం కానీ, వొక వూరి నించి ఇంకో వూరికి ప్రయాణం మా ఇద్దరి మధ్య చాలా కబుర్లకూ, కథలకీ అవకాశం ఇచ్చింది.

ఆరుద్రని నేను నా చిరకాల స్థిర నిశ్చిత పూర్వ అభిప్రాయాల నించి కాకుండా, ప్రత్యక్షంగా చూడడం మంచిదే అయ్యింది. ఆరుద్రగారికి వున్న అనేక ఆసక్తుల్లో స్థల పురాణం వొకటి. దారిన కనిపించే ప్రతి వూరి కథా పురాణం ఆయనకి తెలిసినట్టే అనిపించింది, ఆయన చెబుతూ వుంటే! అలాగే, దాదాపు ప్రతి వూరు సాహిత్య చరిత్ర ఆయన కి కొట్టిన పిండి. అక్కడి రచయితలూ, వారి జీవన విశేషాలూ చెప్తూ వుంటే, ఇంత చరిత్ర దృష్టి వుండడం సాధ్యమా అని ఆశ్చర్యపోవడం మినహా నేను చేయగలిగిందేమీ లేదు. ప్రాంతీయ, స్థానిక చరిత్రల గురించి ఇప్పుడు ఇంత కంఠ శోష పెట్టినా, అసలు ఆ చరిత్రల్ని తవ్వి తీయగల శక్తి మనకి వుందా అనిపిస్తోంది నాకు! అసలు మన జాతి (అది “ఆంధ్రా” అయినా, “తెలంగాణ” అయినా, “రాయలసీమ’ అయినా) సాంస్కృతిక చరిత్ర గురించి అంత దీక్షగా పనిచెయ్యగలిగే అంకిత భావం మనకుందా అని!

అవన్నీ పక్కన పెట్టి, మా మధ్య జరిగిన కొన్ని సాహిత్య కబుర్లు మాత్రమే ఇప్పుడు చెప్తాను.

శ్రీశ్రీ గురించి మొదలయిన కబుర్లు ఆరుద్ర తొలినాళ్ళ దాకా వెళ్ళాయి. నాలో చాలా కాలంగా నలుగుతున్న ప్రశ్నల్ని బయటికి రువ్వే అదను దొరికింది. “ఇదే అదను…” అనుకుంటూ వొక్కోకటీ నెమ్మదిగా సంధించడం మొదలెట్టాను. ఆయన తాపీగా సమాధానాలివ్వడం మొదలెట్టారు.

‘మొదట్లో మీరు డిటెక్టివ్ నవలలు రాశారు, అవి ఎందుకూ?”

“డిటెక్టివ్ నవలలే కాదు, ఇంకా చాలా రకాలు రాసి, ఒక విధంగా చెప్పాలంటే, పారేశాం. మీ శ్రీశ్రీ కూడా డిటెక్టివ్ నవలలూ, కథలూ రాశాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మేం చేసిన పని ఏమిటో మీకు అర్థమవుతుంది. మేము అసలు పాఠకులు అంటూ కొత్తగా ఒక వర్గం తయారవుతున్న కాలంలో చేసిన రచనలు అవి. ఆధునికత వచ్చింది. పత్రికలు వస్తున్నాయి. అప్పుడప్పుడే కొత్త పాఠకులు తయారవుతున్నారు. ఎవరీ పాఠకులు? కాస్తో కూస్తో ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళే కాదు, తెలుగులో పత్రికలకు, రాత సాహిత్యానికీ అలవాటు పడుతున్న వాళ్ళు. మధ్యతరగతి వాళ్ళు. ఇంకా కమ్యూనిస్టు భావజాలం ప్రవేశించని కాలం అది. పాఠకుడికి వామపక్ష స్వభావమో, ఇంకోటో అంటూ ఏర్పడని కాలం అది. వాళ్ళకి చదివే ఆసక్తి పెంచడం వొక్కటే అప్పట్లో మా పని. దాని కోసం కొన్ని పనులు పని కట్టుకుని చేశాం. ఇంగ్లీషులో డిటెక్టివ్ కథలు వున్నాయా, సరే, అయితే, తెలుగులో కూడా అవి వుండి తీరాలి. ఇంగ్లీషులో స్కేచెస్ వున్నాయా, సరే, అయితే, తెలుగులో కూడా అవి మనం రాసి తీరాలి. ఇలా అన్న మాట! అందులో సాహిత్యం వుందా లేదా అన్నది అప్పట్లో ముఖ్యం కాదు. అవి కొత్త పాఠకుల చేత చదివిస్తున్నామా లేదా అన్నది మా తాపత్రయం. ఇవన్నీ దాదాపూ అనుకోని చేశాం మేం!”

నిజమే, అచ్చు సంస్కృతి అప్పుడప్పుడే విస్తరిస్తున్న కాలంలో వాళ్ళు పడ్డ కష్టాలేమిటో నిజంగానే ఇంకా మనకి తెలియదు, శ్రీ శ్రీ “అనంతం”లో, శ్రీపాద “అనుభవాలూ జ్నాపకాల”లో కొన్ని ఉదాహరణలు తప్ప –

కానీ, ఆరుద్ర ఆ డిటెక్టివ్ తరహా వచనంలోంచి సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం దాకా తెలుగు వచనాన్ని తీసుకువెళ్లడం చాలా పెద్ద మలుపు. అది కేవలం సాహిత్య చరిత్ర కాదనీ, మొత్తంగా సాంస్కృతిక చరిత్ర నిర్మాణమే అనీ నా అభిప్రాయం.

బెజవాడ ప్రెస్ క్లబ్ లో ఆరుద్ర సభ అఫ్సర్ అధ్యక్షతన...

బెజవాడ ప్రెస్ క్లబ్ లో ఆరుద్ర సభ అఫ్సర్ అధ్యక్షతన…

అనేక రకాల పనులు చేస్తూ కూడా సమగ్రాంధ్ర సాహిత్యం మీద పని చెయ్యడం ఎలా సాధ్యపడిందని అడిగాను. “ఏమీ లేదు. కొంచెం బండగా అంత కంటే మొండిగా కూర్చొని తెల్లారే లేచి రాయడం మొదలుపెట్టాను. లేకపోతే, ఎక్కడ అవుతుంది, ఆ సినిమాల గోలలో, నానా రకాల వ్యాపకాలలో? కానీ, అలాంటి పనుల్లో రాయడం కంటే కూడా పరిశోధనకి ఎక్కువ సమయం కావాలి. సరే, ఆ పుస్తకం నా జీవితకాలం రచన అనుకున్నాను కాబట్టి అదే కాస్తో కూస్తో మిగిలే రచన అనుకున్నాను కాబట్టి దీక్షగా రాశాను.” అన్నారు ఆరుద్ర. ఆ రచన పరిశోధనకి ఆయన పడిన కష్టాలు, అన్నిటికీ మించి కొన్ని నిర్ధారణలకు రావడానికి ఆయన పడిన సంఘర్షణని చక్కగా పూసగుచ్చినట్టు చెప్పారు. ఇప్పుడు “పూసగుచ్చినట్టు” అంటే గుర్తొచ్చింది, ఆ మాట ఆరుద్ర మాట్లాడే శైలికి చక్కగా సరిపోతుంది నిజానికి.

సాంస్కృతిక చరిత్ర నాకు మొదటి నించీ చాలా ఆసక్తికరమయిన రంగం. ఆ విషయం మీద ఆయన ఆలోచనలూ, పరిశోధనా పద్ధతి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో కొన్ని సంభాషణలు అటు తీసుకువెళ్లాను.

అప్పుడు ఆయన అన్న వొక మాట మా చర్చనీ వేరే దారి పట్టించింది . “మన చరిత్రలో విదేశీ చరిత్రల్లో మాదిరిగా సాంస్కృతిక చరిత్రని గాని, సాహిత్య కళా చరిత్రల్ని కానీ సామాజిక రాజకీయ చరిత్రల నుంచి విడిగా చూడడం సాధ్యం కాదు. ఉదాహరణకి ఇంగ్లీషులో రొమాంటిక్ ఉద్యమం వుందనుకోండి, అక్కడ మీరు వర్డ్స్ వర్తు, కీట్సు, షెల్లీని విడదీసి వాళ్ళ సాంస్కృతికతని చూడవచ్చు” అన్నారు.

ఠక్కున కౌంటర్లు ఇవ్వడం నాకు పుట్టుకతో అబ్బిన విద్య కాబట్టి, వెంటనే నేను దానికి కౌంటరు కొట్టేశాను.

“అది నిజం కాదేమో! ఏ సాంస్కృతిక చరిత్ర అయినా సమాజంతోనో, రాజకీయాలతోనో ముడిపడి వుంటుంది. వర్డ్స్ వర్తుని, కీట్సుని కూడా వాటికి విడిగా అధ్యయనం చేయలేం అనుకుంటా. వర్డ్స్ వర్తు చాలా స్పష్టంగానే తన రాజకీయాలు చెప్తాడు. కీట్సు చెప్పకపోవచ్చు, కానీ అలా చెప్పకపోవడం కూడా రాజకీయమే. కీట్సులోని నైరాశ్యానికి కేవలం అతని వ్యక్తిత్వమే కారణం కాదు, అతని చుట్టూ వున్న రాజకీయాలు, సమాజం సమానంగా కారణం” అన్నాను.

“ఆ…కావచ్చు. కానీ స్పష్టంగా చెప్పే రాజకీయాలకూ, చెప్పని రాజకీయాలకూ తేడా వుంటుంది” అన్నారాయన అంత తేలికగా నన్ను కాదనలేక, అవునని కూడా అనలేక.

“తెలుగు వాళ్ళం మనం షెల్లీని, కీట్సుని కొన్ని చరణాలుగా (stanzas) మాత్రమే చదువుతాం. ఆ మేరకే అర్ధం చేసుకుంటాం, అందుకే మనం మన కృష్ణ శాస్త్రి గారిని ఆంధ్రా షెల్లీ అని అమాయకంగా పేరు పెట్టుకున్నాం. నిజానికి కృష్ణ శాస్త్రి గారికీ, షెల్లీకి ఏ విషయంలోనూ పోలిక లేదు. షెల్లీకి వున్న స్పష్టత కృష్ణ శాస్త్రి గారికి లేదు, ఎందుకంటే, కృష్ణశాస్త్రి గారికి విషాదం అంటే అదేదో వేరే లోకం నుంచి ఉత్పత్తి అయిన వస్తువు.” అన్నాను నేను.

“ఇదేదో నాకు కొత్త సంగతి. కాస్త ఆలోచించనివ్వండి నన్ను- కృష్ణ శాస్త్రి గారి గురించి మీరు చెప్పింది నిజమే!” అన్నారాయన నేను వొక పట్టాన ఆ విషయం వదిలేట్టు లేదని అర్థమయినట్టుగా- “మీరు ఇంగ్లీషు కవిత్వమూ తెలుగు కవిత్వం మధ్య పోలికలు చూపిస్తూ మంచి వ్యాసాలు రాయాలి” అని ఆ పూట ఆయన మంచి సలహా ఇచ్చారు కానీ, అది మంచి సలహా కాబట్టి నేను వినలేదు!

ఆ ప్రయాణాల సందర్భంగా ఆరుద్ర గారు తన రాత క్రమశిక్షణ గురించి చెప్పిన చాలా విషయాలు నాకు నచ్చాయి. అంత క్రమశిక్షణ శ్రీశ్రీ కి వుంటే ఎంత బాగుండేది అనుకున్నా. ఆ విషయమే ఆయన్ని అడిగా.

“శ్రీ శ్రీ యవ్వనంలో వున్నప్పుడు బాగా క్రమశిక్షణగానే వున్నాడు. అందుకే చూడండి, ఎన్ని అనువాదాలు చేశాడో! అతని వచనం చాలా గొప్పది. కానీ, వొక్క సారిగా ‘మహాకవి’ అన్న ముద్ర పడ్డాక అతను ఆ వచనం జోలికి వెళ్ళలేదు. ఎంతో శక్తి వుండి కూడా ఏమీ చేయకుండా వుండి పోయాడు. రాజకీయ పర్యటనలు అతని సమయాన్ని బాగా తిన్నాయనుకోండి. నాకు రాజకీయాల మీద అంత ఆసక్తి లేదని అనను గాని, అలా తిరగడం మీద ఆసక్తి లేదు. నేను ఏమన్నా తిరిగితే ఇదిగో ఇలా సాహిత్యం పనులు పెట్టుకొనే తిరుగుతాను”

నిజమే! కానీ, శ్రీశ్రీకి అలాంటి తిరుగుళ్ళు వుండబట్టే, కొత్త తరంలోనూ అతని కవిత్వం బతికింది. అది కాదనలేని సత్యం. శ్రీశ్రీ గురించి ఆయన ఇంకా చాలా వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడారు కానీ, వాటిలో సగం విషయాల మీద నాకు ఆసక్తి లేదు, అవి నిజమని కూడా నాకు నమ్మకం లేదు! కాబట్టి, ఇక్కడ చెప్పడమూ లేదు.

మొత్తం మీద ఈ ప్రయాణం తరవాత ఆరుద్ర వ్యక్తిత్వంలోని కొత్త కోణాలు నాకు చాలా దగ్గిరగా అర్థమయ్యాయి. ఆయన మీద అంత అయిష్టం వుండక్కరలేదు అని కూడా అర్థమయింది. అప్పటి నించి ఆరుద్ర రచనల్ని తిరిగి ఇంకో సారి చదవడం మొదలెట్టాను, ఈ సారి నాకు తెలిసిన వ్యక్తిత్వపు వెలుగులో!

చాలా ఆశ్చర్యంగా వుంటుంది. జీవితం ఎప్పుడూ వొక ప్లాట్ ఫారం లాగానో, రైలు ప్రయాణమో అనుకుంటే, కొన్ని సార్లు మనం ఎక్కాల్సిన రైళ్లు మనం చూస్తూండగానే వెళ్లిపోతాయి. వొక్కో సారి అదృష్టం బాగుంటే, మనం ఎక్కిన కోచ్ లోనే మనకి బాగా ఇష్టమయి ఎన్నాళ్లుగానో కలవాలని ఎదురుచూస్తున్న వ్యక్తిని కలవవచ్చు. కాస్త మాట్లాడుకునే అవకాశమూ దక్కవచ్చు.

ఆ రెండు రోజుల ప్రయాణాల తరవాత ఆరుద్ర అనే రైలు నేను కాస్త లేటుగా ఎక్కానని అనిపించింది. కానీ, అది జీవిత కాలం లేటు కానందుకు ఇప్పటికీ సంతోషంగా వుంటుంది.

ఆ తరవాత ఆయన కన్ను మూసినప్పుడు మా ఎడిటర్ యంవీయార్ శాస్త్రి గారు ఆంధ్రభూమిలో ఆయన్ని గురించి ప్రత్యేక సంపాదకీయం రాయించారు. అది ఆరుద్రగారికి నేనిచ్చిన చివరి అక్షర నివాళి.

(‘ఆవకాయ’ వెబ్ పత్రిక సౌజన్యంతో- ఆగస్టు 31 ఆరుద్ర పుట్టిన రోజు కోసం )

The Controversial Bard: U. R. Anantha Murthy

Nandana Reddi

Nandana Reddy

 

Udupi Rajagopalacharya Ananthamurthy or Ananthu as I affectionately called him was one of the Bards of Indian polity. Not unlike William Shakespeare, the Bard of Avon, he commented on events, ridiculed fundamentalism and mocked authority. From his deeply embedded Socialist convictions he examined modern times through the lens of Democracy. He questioned all things and analysed all motives in the belief that it would lead to a deepening of democracy. On January 26, 2014 he said; “…everything is politics. In a democracy, one has to constantly respond…it is not about what is right in the eternal sense. We’ll have to do some things that are right at the moment. But that is politics and we’ll have to do what is right.” He believed that the role of a watch dog was not a duty that can be abdicated by anyone irrespective of who they were.

 

Our paths first crossed in 1967. I was 15 and though my parents were not in politics they had many friends in the Socialist Party that shared their political beliefs, but also their love for art, music and literature. One day over lunch at our home Shantaveri Gopal Gowda, a long time friend of Ananthamurthy’s and the one who introduced him to Lohia Socialism and shared his passion for Kannada literature, told the story of Ananthamurthy’s novel, Samskara to Dr. Lohia and Madhu Limaye. He said that Ananthu was a Lohia follower [though he had never met Lohia in person]. My parents Sneha and Pattabhi were struck by the story and decided to make it into a film. Dr. Lohia encouraged them and with the help of many talented friends the film was made[1] and Ananthu became a part of the ‘Family Pattabhic’.

 

Interestingly ‘Samskara’ the novel was inspired by a film. When Ananthamurthy was in England he went to see “The Seventh Seal” by the celebrated Swedish Director Ingmar Bergman with his teacher Malcolm Bradbury. Thought it didn’t have subtitles he ‘experienced’ the film and could relate to the plague, the atmosphere of death and the indecision of the Protagonist. There had been a plague in his hometown and he remembered how the upper casts were treated by the doctor while the Dalits were not.

 

Ananthu was intrigued by the fact that time was so linear in the West while in India they ran spirally like an archaeological site where the layers of time were sandwiched together as Ananthu said; “You in England or Europe in order to create the medieval ages, you have to go back to a library and collect all information. But the medieval times are already there in me. They are there in my mother. I can see and feel the 18th century in my mother and the 10th century in my grandmother. Different times in Europe are simultaneously present in India. As we walk the road, we are simultaneously walking the different times[2].

 

Malcolm Bradbury challenged Ananthu to write and apparently the novel ‘Samskara’ was written as my father said; “in four furious days, synchronising with the four day time lapse in the novel. A very great part of the novel reads like a film script. The details and mannerism of the Brahmins are so graphic and visual possibly, due to the influence of the film on the novel. Besides these superficial similarities the novel is brilliantly original.[3]” He wrote it in 1965.

 

The book created a literary sensation in Karnataka and when the film was banned by the Censor Board it sparked a major political controversy. It was finally released in 1970 and won the National Award for Best Film and several International Awards including the Bronze Leopard at Locarno. A. K. Ramanajan Professor of linguistics at the University of Chicago saw the film and said; “If I had seen this film in Chicago, I would have danced in the streets with joy!” In 1976 he translated Samskara into English and began using it as course material. The film was path breaking and ushered in the parallel cinema movement in South India and took Ananthu to the International Stage.

 

Interestingly the controversy around the book was after its publication while the controversy generated by the film died out after its release. My father felt that this had something to do with the treatment of the story in the film. “One major departure of the film from the novel is the later half. In the novel the burning of Narayanappa’s body, takes place halfway through. In a way, the story ends half way through the novel” wrote my father in his paper ‘Literature and Film’. He said; “The interest in the novel is sustained by Praneshacharya meeting Putta and undergoing experiences the exact opposite of his earlier experiences. His previous religious ritualistic Brahminical world is contrasted with the amoral physical world of the Non-Brahmins, with its cock fights, prostitutes and sensual entertainment. The novel’s interest is further sustained by the devise of dramatic irony and black humour where the Brahmins prepare for an elaborate funeral for a non-existing body, which has already been spirited away by the Muslims.” He felt that this will not work in the film. “Both the novel and the film start with the problem of the dead body. If the dead body is disposed of half way through the film as in the novel, the film will lose interest. In the novel, literary devices like dramatic irony could be made use of to keep interest. Not so in the film. The film starts with the conflict of to burn or not to burn the body of Narayanappa. The conflict is resolved in the very end when Praneshacharya returns back to the village to do the cremation. Thus the interest is sustained till the very end.

 

According to Sri A.K.Ramanujan who translated Samskara into English, Samskara is a novel of decadent Hinduism. This is exemplified by the Madhva Brahmin Community’s concern with materialism and greed and their internecine quarrels. Even Praneshacharya, though inspired by noble motives, is forever in the grip of indecision and scarcely shows any leadership. The dead body is a symbol of decadent Hinduism and the Brahmin community is unable even to dispose of it, where as the Muslims cart it away in a jiffy and cremate it. When we made the film, we had no doubt that the Muslims stealing the body and burning it should totally be omitted. There arose a big literary controversy when the book was released. We did not want that to become a communal controversy when the film is released, besides the censors would have certainly objected to it. We tried to tone down the literary controversy that the novel was anti Madhva by ennobling the character of Praneshacharya in the film. Praneshacharya in the book discusses his inner feelings of guilt of doing secretly what Narayanappa did brazenly, but he is unable to tell anyone. In the film by his open confession to Putta, his stature rises immeasurably. The film has a positive ending and Praneshacharya redeems himself by his open confession of his guilt and his new determination to act; that is to cremate the dead body.

 

Strangely ‘Samskara’ has several associations with the lives of both Ananthu and my father. It brought them together, not only on the artistic plane but politically as well. They were both writers with strong political moorings in socialism. They were good friends. When my father was alive they would visit eachother at least once a month to discuss their latest ideas or work. Invariably, the personal intertwined with the intellectual as they both drew heavily from their life experiences. They had much in common and yet were very different beings. Their life in a way mimicked their art – or was it the other way around?

 

Ananthamurthy is considered one of the pioneers of the ‘Navya (new) movement’ in Kannada literature that began with his novel ‘Samskara’ that was a scathing attack on decadent Hinduism and critic of Brahmanism, its superstitions and hypocrisies. My father is considered the father of modern Telugu Poetry as he rebelled against the sweet, rhythmic poetry of Tagore under whom he studied at Shantiniketan and wrote instead about the squalor and filth of Calcutta city.

ANANTHAMURTHY

They both fell in love and married Christians – Ananthu made that a political statement; while my father never did. We, even as their children, were never conscious of the fact that our parents not belonging to the same religion was a daring and courageous step to take in those times. Marrying the person you loved was just the right thing to do!

 

Ananthu who was born on 21 December, 1932 in the village of Melige, in Tirthahalli taluk in Shimoga District, grew up in an orthodox Madhava Brahmin family as the grandson of a priest. His schooling began in a traditional Sanskrit school before he went to the University of Mysore and to Birmingham, England, for a doctorate in English on a Commonwealth Scholarship where he was awarded a doctorate in 1966 for his dissertation on ‘Politics and Fiction in the 1930’s’.

 

The amalgam between politics and his literary expression began early and as he grew older developed into a literary activism very few writers have achieved in history. In a TV interview he stated that “We should not be politically correct – then we are NOT correct. If there are enough people who can swim against the tide, then democracy is safe. Hence political correctness which places all value on the majority is a wrong thing. Even one voice is enough, because ideas have a way of living… We should be able to say whatever is unpleasant…[4]

 

Ananthu was greatly influenced by Lohia’s writings and that was another thread that bound us. Just before Indira Gandhi promulgated a State of Emergency, we saw a lot of Ananthu. My father and mother were shooting ‘Chanda Marutha’ [Wild Wind], an uncanny prediction of things to come. Then my mother passed away after eight months in jail. Ananthamurthy wrote her obituary in which he said; “It is hard to believe that Snehalata is dead at the age of forty-four. She will remain a vivid memory for ….. people from all walks of life: socialist leaders and intellectuals, theatre artists from India and abroad, writers and above all many young people still searching for a meaning and purpose in life. She ….. could never tolerate injustice and ugliness. …..she is one of the martyrs of our age. By her manner of life and death she has redeemed us who have had to live in a state of sin, because of our quietism and indifference in the face of evil.

 

This was perhaps a turning point in Ananthu’s life. The Emergency strengthened his convictions and he became the most vocal secular, socialist voice Karnataka has seen in recent years. Ananthamurthy was greatly influenced by Mahatma Gandhi and Shakespeare during his childhood, which shaped his political and social conscience. He was also a close associate of stalwarts of socialist movement, like Jayaprakash Narayan, Madhu Limaye and Shanthaveri Gopala Gowda.

 

After the Emergency during the Chickmagalur elections where I campaigned against Mrs. Gandhi, Ananthu had been campaigning too and when I was beaten by the police and lay in a semiconscious state he visited me. He was the person who accompanied me back home from the hospital to Bangalore at night shining a torch on my face so the crowds that had gathered could see me.

 

In 2013, he made a statement that in the Mahabharata it is described how the Brahmin community used to eat beef, but this was claimed as baseless by several prominent people like the Pejavar Mutta Swamijee and the Vishwesha Thirtha Swami, Udupi. The Pejavar Mutta also requested Ananthamurthy to reconsider his statement, as it hurt sentiments of a caste, but Ananthamurthy ignored his request.

 

He set off another controversy when he denounced the politics of Gopalkrishna Adiga even though he considered him to be one of the leading poets. He believed that being left of centre was better than being right of centre and that it was important to say these things out loud.

 

Many people create controversies, some unknowingly, some to stay in the news and most out of stupidity, not so in Ananthu’s case. These were not just spontaneous acts based on emotion, not principled responses to situations – even though that may have been the original motivation – but well thought out calculated and sculpted political interventions designed to cause ripples of controversy and debate. This also ensured that the space for democratic dissent remained intact.

 

The controversies reached a new height during the recent elections, when he said he does not want to live in an India where Modi rules. In a telephonic interview with CNN-IBN from his hospital bed in Bangalore, he said; “I won’t live in a country ruled by Narendra Modi. When I was young, I used to criticise Prime Minister Nehru. But, his supporters never attacked us. They always respected our views. Modi supporters are now behaving like Fascists. They are behaving like the Fascists in Germany during Hitler. I don’t want to see a man like Modi in the chair, where once a man like Nehru sat and ruled. I am too old and unwell. If Modi becomes the PM, it will be a big shock to me. I won’t live[5].”

 

Ananthu was gracious enough to attend a screening of Samskara just three weeks before he passed away. He came and spent two hours interacting with Tom Cowan the Australian cinematographer of Samskara, the audience and the press. On the dais he whispered to me about Modi. He was concerned that Modi would bring about a “shift in our civilization.” He said; “I have a feeling that we are slowly losing our democratic rights or civil rights, but much more than that when there is a bully we become cowards.” I added that we were already in a state of emergency, but only this time, Modi did not have to promulgate it – he was doing it through the brute force of his election mandate.

 

That was the last time we met. He was his charming and affectionate self though one could see the strain his illness was having on him. I spoke to him a couple of times after, inviting him to lunch at home, but he could not make it as he was in hospital that day undergoing dialysis.

 

During the last months he often joked about his illness and the extreme cleanliness it imposed on him and those around and compared it to the ‘Madi’ or cleanliness he had to observe in his orthodox Brahmin home as a child where he could not touch anything without washing and bathing

 

The day he died, I went to visit him in hospital with another close friend Dr. Ratna, not knowing that a few hours later he would be no more. He was on a ventilator, but looked so peaceful and serene. We did not want to disturb him so we spent time with Ester, the children and grand children. The doctor’s prognosis was positive, so we left with the hope that he would recover as he had done so many times before. After all he was a fighter!

 

By the time I reached home we got the news that he was no more. He had threatened to leave India if Modi came to power and some members of the Sangh Parivar had bought him a ticket to Pakisthan. Ananthu then recanted his statement and said; “That was too much to say because I can’t live anywhere except India.” Ananthu decided his own departure – not by an Emirates flight, but his own.

 

I said my goodbyes to Ananthu in the privacy of his home the evening he died. I did not want to share that moment with the large crowds that would be part of the State Honours. Ester was inconsolable and I was at a loss for words. What can you say to a partner of more than 50 years, one who cared and watched over him? Despite her own ailments she guarded and protected Ananthu zealously. She was his strength and foundation. Ananthu could not have done what he did without her. Though this was rarely recognized, Ester is the reason for the person Ananthamurthy is.

 

Many were surprised that his last rights were performed according to religious convention. Though Ananthu broke all traditions, his fascination for the spiritual was deeply imbedded and perhaps his inner strength came from this. My father was the same and this was not a contradiction, but an intellectual rejection of the negative aspects of organised religion while pursuing the search for a greater truth.

 

Now Ananthu is in good company – my father and mother, Lankesh, Lohia, Gopal Gowda, Madhu Limaye, Karanth and Ramanujan and many others with whom I am sure he is debating our predicament here in this world.

 

Farewell my dear friend and God speed. May your journey to the other world be safe and adventurous and your search of answers exciting. May the mysteries of the universe unfold and your explorations take on another dimension. We thank you for your legacy – we who remain, will try and keep it alive by taking the struggle forward.

 

[1]T. Pattabhi Rama Reddy /”What Life Has Taught Me” – Deccan Herald November 13 1993
[2] The Inner World of U. R. Ananthamurthy/An interview by Arvind Radhakrishnan, Editor-in-Chief of The Bangalore Review (TBR) and Sudeep Reguna, Executive Editor of TBR/link
[3] T. Pattabhi Rama Reddy/ “Literature and Film”/ Paper presented at the International Seminar on Indian literature and film, September 24-26, 1992 and published in Abhinandana Gandham.

 

 

[4] Interview with Girish Nikam, anchor and senior journalist, in the programme To the Point for Rajya Sabha TV

[5]Telephonic interview with CNN-IBN

 

About Nandana Reddy:

Daughter of Pattabhi, well-known Telugu poet. Pattabhi was also well-known for making the film”samskara.”

Also, Nandana is one of the founders of the Concerned for Working Children (CWC) and is now the Director Development, while heading the consultancy wing Dhruva. She was the Chairperson of the International Working Group on Child Labour (IWGCL).

తెలుస్తూనే ఉంది

 Rekha

నాకు తెలుస్తోంది

నా వీపు తాకుతున్న ఆ కళ్ళు
తడిబారి ఉన్నాయని,

ఒక్క అడుగు వెనక్కి వేసినా ,
ఆమె కన్నీటి సరస్సులో నా మునక తప్పదని

ఒక్కసారి, ఇంకొక్కసారి అనుకొని
లెక్కలేనన్ని సార్లు చూపుల తడిమి తడిమి
నా రూపుని తన కంటి పాపపై చెక్కుకొని
తనివి తీరక చివరికి,
కన్నీరై కరుగుతోందని తెలుస్తోంది

వేల వేల భావగీతాలు పంచుకున్న తర్వాత
వీడ్కోలుకు ముందు ఇరువురం స్తబ్దుగా మిగిలిన
ఆ కొన్ని క్షణాల్లోనే ఉంది ఆర్ద్రత అంతా
ఆ కాసిన్ని నిరక్షర కవనాలలోనే ఉంది వేదనంతా
ఆమె నన్ను ఆపకుండా ఎలా ఉంటుంది ?
ప్రాణం పోతుంటే పోరాడని వారు ఎవరుంటారు?

మరోసారి, ఎన్నోసారో మరి
ఆ చేయి నొక్కి ధైర్యాన్ని ఇస్తున్నానో, తీసుకుంటున్నానో
తెలియని శూన్యావస్థలో వెనుదిరిగాను

ఆఖరి కరచాలనంలో
వేళ్ళ చివరనుంచి జారిపోతున్న ప్రాణాన్ని పట్టుకొని,
విడవలేక, విడవలేక మళ్ళీ పట్టుకొని
చివరికి, ఓ సాలీడు తన గూడు లో నుంచి
జర్రున జారిపోయినట్టు వెనుదిరిగాను

నాకు తెలుస్తూనే ఉంది

పెనుగాలికి రాలిన పొగడ పూలను
భద్రంగా మాల గుచ్చుకుంటుందని,
ఈ దూరాన్ని కుదిపి కుదిపి గాయం చేసుకొని
దాచుకుంటుందని తెలుస్తోంది

చేయగలిగిందేమీ లేదు,
తల వంచుకొని ఈ వీధి మలుపు తిరగడం తప్ప

నిజానికి
ఆమె కళ్ళెత్తి చూసినప్పుడు విరిసే ఓ కాంతి పుంజంలో
నన్నూ నా జీవితాన్ని ఒక్క క్షణం చూసుకుంటే చాలు అనుకొని వచ్చాను

ఇదేంటి? ఈ వెలుగు శాశ్వతం కాలేదని నిరాశతో వెనుదిరుగుతున్నాను

రాక రాక ఆమె వాకిలికొచ్చి పొందానా?
మరోసారి నన్ను నేను పోగొట్టుకున్నానా?

– రేఖా జ్యోతి

అడగవలసిన వరం

MythiliScaled

అనగనగా ఒక పెద్ద తోట. తోట నిండా రంగురంగుల పూలమొక్కలూ నీడ ఇచ్చే పళ్ళ చెట్లూ – చల్లటి జలయంత్రాలు, కలువలు విచ్చే కొలనులు. తోట మధ్యలో చక్కటివిశాలమైన ఇల్లు. అందులో ఒక ఫెయిరీ ఉండేది. చాలా దయ గలది, సరదాగానూ ఉండేది. అప్పటి పద్ధతి ప్రకారం చుట్టు పక్కల రాజ్యాలనుంచి రాకుమారులనీ రాకుమార్తెలనీ వాళ్ళు ఇంకా బాగా చిన్నవాళ్ళుగా ఉండగానే ఆమె దగ్గరికి పంపించేవారు. వాళ్ళందరికీ తన పక్కన ఉండటమే ఎంతో బావుండేది. హాయిగా ఆడుకుంటూ చదువుకుంటూ వాళ్ళు పెరిగి పెద్దయేవారు. బయటి ప్రపంచం లోకి వాళ్ళు వెళ్ళే ముందర ఆ ఫెయిరీ ఒక్కొక్కరికీ వాళ్ళు అడిగినవరాన్ని ఇచ్చేది.

వాళ్ళలో సిల్వియా అనే రాకుమారి మంచి చురుకైన పిల్ల. పైకి చెప్పకపోయినా ఫెయిరీకి మనసులో సిల్వియా అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. సిల్వియా వాళ్ళ రాజ్యానికి వెళ్ళే సమయం వచ్చింది. ఈ లోపు , ఇదివరకు తనతో ఉండి వెళ్ళిన రాకుమార్తెలు కొందరు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఫెయిరీకి అనిపించింది. ఆమె సిల్వియా తో అంది-” ఐరిస్ అని ఒక రాకుమారి ఉంది. తన దగ్గర రెండు నెలలు ఉండు. నిన్ను ఆమె బాగా చూసుకుంటుంది. ఆ తర్వాత వెనక్కి వచ్చి తన గురించి ఏమనిపించిందో నాకు చెప్పు ”

సిల్వియా కి వెళ్ళటం ఏమంత ఇష్టం లేదు , కానీ ఫెయిరీ అడిగింది కదా అని ఒప్పుకుంది. రెండు నెలలు గడిచాక ఫెయిరీ ఒక సీతాకోకచిలకల రథాన్ని ఐరిస్ రాజ్యానికి పంపింది. సిల్వియా ” అమ్మయ్య ” అనుకుని అందులోకి దూకి వచ్చేసింది. ఫెయిరీ అడిగింది ” ఇప్పుడు చెప్పు మరి, ఏమనుకుంటున్నావు నువ్వు ? ”

” ఐరిస్ రాకుమారికి మిరుమిట్లుగొలిపే అందాన్ని మీరు వరంగా ఇచ్చారు. తను మీ గురించి మంచిగానే చెబుతూ ఉంటుంది కానీ అంత అందం మీ వల్లనే వచ్చిందని ఎక్కడా ఎవరికీ చెప్పనే చెప్పదు. ముందు ఆమెని చూసి నాకూ కళ్ళు చెదిరిపోయాయి . కానీ – అందంగా కనిపిస్తే చాలు, ఇంకేమీ చేయక్కర్లేదని అనుకుంటోందని అర్థమైంది. సంగీతం, పుస్తకాలు , స్నేహితులు – ఎవరూ అక్కర్లేదు, తనని తను అద్దం లో చూసుకుంటూ రోజంతా గడిపేస్తుంది. పాపం ! నేను అక్కడ ఉండగానే ఆమెకి తీవ్రంగా జబ్బు చేసింది. పూర్తిగా కోలుకుంది గానీ ఇదివరకటి అందం లేదు. తనని తనే అసహ్యించుకునేంత దిగులుపడిపోయింది. దయచేసి తన అందాన్ని తిరిగి ఇప్పించమని మీకు నన్ను చెప్పమంది. నాకూ నిజంగా అది అవసరమేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే అందంగా ఉన్నప్పుడు తన ప్రవర్తన బాగానే అనిపించేది. మనసుని , తెలివిని అసలు ఉపయోగించటం ఇన్నాళ్ళూ మానేసింది కదా, ఆమె లోపాలు ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపించి – ఎవరూ భరించలేకపోతున్నారు . తనకి ఇదంతా అర్థమైనట్లే ఉంది. అందుకే మీ సహాయం అడుగుతోంది. మళ్ళీ తనని ఇదివరకులా చేసేయచ్చు కదా ”

ఫెయిరీ అంది ” అనుకుంటూనే ఉన్నాను ఇలా అవుతుందని. కాని ఏమీ చేయలేనమ్మా, నా వరం ఒక్కసారే పనిచేస్తుంది ”

కొంతకాలం సిల్వియాకి తోటలో, ఇంట్లో ,సంతోషంగా గడిచిపోయింది. అప్పుడు మళ్ళీ ఫెయిరీ సిల్వియాని డాఫ్నె అనే ఇంకొక రాకుమారి దగ్గరికి సీతాకోకచిలకల రథం మీద పంపించింది . వెళ్ళి ఎన్నో రోజులు కాకముందే సిల్వియా వెనక్కి వచ్చేస్తానని కబురు చేసింది. అటుగా ఎగురుతున్న ఒక తూనీగని బ్రతిమాలి చెప్పి పంపింది. ఫెయిరీకి జాలేసి సరే , రమ్మంది. ” అబ్బబ్బా..ఎలాంటి చోటికి పంపారండీ నన్నూ ” అని నసపెట్టింది సిల్వియా.

” ఏం? ఎందుకు అలా ? డాఫ్నె కి నేను మాటకారితనాన్ని వరంగా ఇచ్చానని జ్ఞాపకం. అవునా ?”

2the_fairies_vale

” అవునండీ, అవును. ఆమె బాగా మాట్లాడుతుంది, ఆ మాటయితే నిజమే. భాషని నేర్పుగా ఉపయోగిస్తుంది. మరి , ఆ మాటలు కాసేపైనా ఆపితేనా ? ముందర వినటానికి బాగానే ఉంటుంది కాని వినీ వినీ అలిసిపోతాం . అందరినీ ఒకచోట చేర్చి రోజుకి నాలుగుసార్లు ఉపన్యాసాలు ఇస్తుంది ఒక్కోసారీ రెండు గంటలు. రాకుమారి కాబట్టి అప్పటికి దొరికిపోయినవాళ్ళంతా కిమ్మనకుండా వింటూ ఉంటారు ఆ సమావేశాలు అవుతూనే మళ్ళీ ఏదో ఒకదాని గురించి చెప్పటం మొదలు. చెప్పేందుకు అసలేమీ లేనప్పుడూ అంతే. అక్కడనుంచి వచ్చేస్తుంటే ఎంత హాయిగా ఉందో చెప్పలేను అసలు ! ”

సిల్వియా చిరాకు కి ఫెయిరీకి నవ్వొచ్చింది. కొద్ది రోజులు కోలుకోనిచ్చి మళ్ళీ పంపింది. ఈ సారి సింథియా అనే రాకుమారి దగ్గరికి. మూడు నెలలు అక్కడ ఉండి ఈసారి కొంచెం నయంగానే తిరిగి వచ్చింది సిల్వియా. ఆ రాకుమారికి ఎవరినైనా సరే ఆనందంగా ఉంచగల వరాన్ని ఫెయిరీ ఇచ్చి ఉంది.

సిల్వియా ఇలా అంది ” ముందు నేను అనుకున్నానూ, ఆమె చాలా సంతోషంగా ఉందని. ఏవైపుకి వెళ్ళినా తనని అంతా ఇష్టపడుతున్నారు. తనకేం కావాలంటే అది ఇస్తున్నారు. నాకూ అలాంటి వరమే మీరు ఇస్తే బావుంటుందనుకున్నాను కూడా ” ఫెయిరీ అడిగింది ” ఇప్పుడు నీ మనసు మార్చుకున్నావా ఏమిటి ?”

సిల్వియా ” అవునండీ. సింథియా తో ఉండే కొద్దీ తను నిజానికి అంత సంతోషంగా లేదేమోననిపించింది. అందరినీ మెప్పించాలని ప్రయత్నించటం లో నిజాయితీగా ఉండటం మర్చిపోయినట్లుంది. తన ప్రవర్తన నిజమో అబద్ధమో తనకే తెలియదనుకుంటాను. అవతలి వాళ్ళు ఎలా ఉన్నా, ఎలాంటివాళ్ళైనా ఒకేలాగా ఉంటుంది. తనని నిజంగా ప్రేమించినవాళ్ళకి నిరుత్సాహంగా ఉంటోంది ” అని జవాబు ఇచ్చింది.

uh51577157-1

ఫెయిరీ అంది ” బాగా కనిపెట్టావు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో ”
తనకేం కావాలని అడగాలో సిల్వియా ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. వాళ్ళ సొంత రాజ్యానికి తనూ త్వరలో వెళ్ళిపోవాలి.

చివరిసారిగా ఫిలిడా రాకుమారి దగ్గరికి పంపింది ఫెయిరీ. సిల్వియా అభిప్రాయం గురించి కుతూహలంగా ఎదురు చూసింది. అది ఇలా ఉంది .

” ఫిలిడా నన్ను ఆప్యాయంగా పలకరించింది. . తనకి మీరు అందరినీ నవ్వించగల శక్తిని ఇచ్చారు కదా. నాకూ ఆ హాస్యం తెగ నచ్చేసింది. ఆమెతో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. అంతకన్న ఇంకేం కావాలీ అనిపించింది. కానీ అందరినీ సంతోషపెట్టగలగటం లాగే ఇది కూడా పూర్తిగా తృప్తి ఇవ్వదని తోచింది. అస్తమానమూ హాస్యం ఉట్టిపడేలా మాట్లాడటం అయ్యే పని కాదు . అందుకేనో ఏమో, .ఫిలిడా ఒక్కోసారి ఎవరైనా ఏడుస్తున్నా బాధపడుతున్నా కూడా వాళ్ళని వెటకారం చేసి పక్కవాళ్ళని నవ్వించటానికి చూస్తుంది. తప్పు కదండీ ! ”

ఫెయిరీ సిల్వియా చెప్పింది నిజమేనని ఒప్పుకుంది. ఆమెని బాగా పెంచానని మనసులో సంతోషించింది.

చివరికి సిల్వియా తనకి కావలసిన వరాన్ని అడిగే రోజు వచ్చింది. స్నేహితులూ స్నేహితురాళ్ళూ అంతా గుమిగూడారు. ఏం కోరుకుంటావూ అని ఫెయిరీ ప్రశ్న వేసింది.
సిల్వియా ఒక్క క్షణం ఆలోచించి అడిగింది- ” ప్రశాంతమైన హృదయం ! ” .

” అలాగే, ఇచ్చాను. ” అంది ఫెయిరీ.

అది నిజంగా అపురూపమైన వరం. సిల్వియాకి తృప్తినీ సుఖాన్నీ తెచ్చిపెట్టింది. చిన్న చిన్న కష్టాలు అందరికిలాగే తనకీ వచ్చాయి. కాని వాటినుంచి త్వరగా తేరుకోగలిగేది. తనతో ఉన్నవాళ్ళకి కూడా తేలికగా, శాంతంగా అనిపించేది. తగిన రాకుమారుడిని పెళ్ళాడి సిల్వియా చాలా కాలం నిశ్చింతగా జీవించింది.

 

 French fairy tale , by the Comte de Caylus (1692–1765).
సేకరణ- Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

చరిత్రకు ‘హిందూత్వ’ చెద

 

sangisetti- bharath bhushan photo

మొన్న పంద్రాగస్టు నాడు గోలకొండ కోటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ జాతీయ జెండా ఎగరవేస్తే బిజెపికి ఎక్కడి లేని కోపమొచ్చింది. జాతీయ జెండాను అక్కడ 17సెప్టెంబర్ నాడు ఎగరెయ్యాలని ఉచిత సలహాలు కూడా ఇచ్చిండ్రు. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచ వ్యాప్తంగా తెలిసిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తే దానికి కూడా బిజెపితో పాటు కాంగ్రెస్ పార్టీలు కూడా మతం రంగు పూయడానికి ప్రయత్నించాయి. ఆఖరికి సానియాను ఏడిపిస్తేగాని వీళ్ల కండ్లు సల్లబడలేదు. హైదరాబాద్ని భారత ప్రభుత్వం ‘ఆక్కుపై’ చేసుకున్న 17 సెప్టెంబర్ విద్రోహ దినాన్ని ‘పండుగ రోజు’గా ప్రకటించాలని హిందూత్వ వాదులు పిలుపునిస్తున్నారు. 1948లో జరిగిన పోలీసు చర్యలో రెండు లక్షలకు పైగా ముస్లింలు ఊచకోతకు గురైన సంఘటనను ‘పండుగ’గా జరుపుకోవాలనడంలోనే వారి మానసిక స్థితి తెలియ వస్తుంది. వీళ్లంతా వచ్చే బల్దియా ఎన్నికల్లో లబ్ధిపొందే ఉద్దేశ్యంతో ప్రతిదానికి మతం రంగు పూస్తున్నారు.

అలాగే, రేపు జూబ్లిహిల్స్లోని కాసుబ్రహ్మానందరెడ్డి పార్క్ పేరుని ‘అసఫ్జాహీ’పార్కుగా మార్చే ఏర్పాటు జరుగుతోంది. నిజానికి చిరాన్ప్యాలెస్ పేరిట ఈ ప్రాంతం ఎప్పటి నుంచో ప్రఖ్యాతి. అయితే ఈ పార్కుకి 1969లో 369 మంది ఉద్యమకారుల్ని పొట్టనబెట్టుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి పేరు పెట్టడమంటేనే తెలంగాణను అవమానించడం. అట్లాంటిది ఈ ‘అసఫ్జాహీ’ పేరుపై అప్పుడే నిరసనలు షురువైనయి. హైదరాబాద్ గంగా`జమున తెహజీబ్కు, లౌకిక భావనలను అణచివేసేందుకు మతోన్మాద శక్తులు ఏకమవుతున్నాయి. ఇలాంటి దశలో హైదరాబాద్ అసలు చరిత్రను అందరూ తెలుసుకోవాల్సిన అవసరముంది.

నిప్పులాంటి నిఖార్సయిన చరిత్రకు సైతం మతతత్వవాదులు చెదలు పట్టిస్తున్నారు. చరిత్రలో పరిఢవిల్లిన మతసామరస్యతకు మసి బూస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకొని ప్రచారం చేస్తున్న ‘హింసోన్మాదులు’ హైదరాబాద్, తెలంగాణ ‘తెహజీబ్’ని సరిగా అర్థం చేసుకోలేదనే చెప్పవచ్చు. కుతుబ్షాహీల కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు చెదురుముదురుగా ఒకటీ అరా జరిగిన సంఘటనలనే భూతద్దంలో పెట్టి చూపిస్తూ కావాలనే ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడుతున్నారు. మతం రంగు పూస్తున్నరు. నిజానికి 450 ఏండ్ల ముస్లింల పాలనలో పరిఢవిల్లిన మత సామరస్యతను, పరమత సహనాన్ని లౌకిక ధృక్కోణంతో వెలుగులోకి తేవాల్సిన అవసరముంది. ఈ దిశలో ఇంతవరకు కృషి జరుగలేదు. కుతుబ్షాహీలు, అసఫ్జాహీల పాలన, కతుబ్షాహీల తెలుగు రాణుల స్మృతి, రాజులు తెలుగు సాహిత్యాన్ని పోషించడమే గాకుండా స్వయంగా తెలుగు కవిత్వాన్ని సృష్టించిన చరిత్ర రికార్డు కావాలి. మత విద్వేషాలకు దూరంగా ప్రజలందరినీ సమానంగా చూసిన గత వైభవానికి చిత్రికగట్టాలి.

కుతుబ్షాహీల కొలువులో అక్కన్న, మాదన్న సోదరులు కీలక భూమిక నిర్వహించారు. ఒకరు సైనికభారాన్ని వహించగా, మరొకరు ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు. అక్కన్న దేశభక్తిని శంకించడానికి వీలులేదు. డచ్ ఈస్టిండియా కంపెనీ వారు వ్యాపారం కోసం కొంత భూభాగాన్ని కోరినప్పుడు అక్కన్న మాట్లాడుతూ ‘‘ఇక్కడ పుట్టి పెరిగిన వారు మాత్రమే దేశ సౌభాగ్యం కోసం పాటుపడుతారు. హృదయపూర్వకంగా ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తారు. అంతేగాని వ్యాపార ఉద్దేశ్యాలతో విదేశాల నుంచి వచ్చిన వారు కాదు’’ అన్నాడు. తన దేశభక్తికి సాక్షిగా ‘డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ’ ఉద్యోగి మైఖేల్ జాంజూన్తో 1683లో అన్న మాటలివి. చివరికి అన్నదమ్ములిద్దరూ గోల్కొండ రాజ్యం కోసం కోటలోనే శత్రువుల చేతిలో ప్రాణాలర్పించారు. అంతటి త్యాగ నిరతి వారిది. అక్కన్న, మాదన్నలిద్దరూ గోల్కొండ రాజ్యంలో చాలా ప్రదేశాల్లో గుడులు నిర్మించారు. వాటి పోషణ కోసం భూములు కేటాయించారు.

సాక్షాత్తు గోల్కొండ కోటలోనే గుడిని కట్టించారు. ఆ గుడి ఇప్పటికీ పూజలందుకుంటోంది. తెలంగాణలో బోనాలు ఇప్పటికీ ఇక్కడనే ప్రారంభమవుతాయి. కూచిపూడి నాట్యాన్ని ప్రోత్సహించి సిద్ధేంధ్రయోగికి సకల వసతులతో కూడిన భూమిని సమకూర్చిందీ కుతబ్షాహీలే. ఇందులో అక్కన్న, మాదన్నల పాత్ర కూడా ఉన్నది. నిజానికి కుతుబ్షాహీల కొలువులో ‘సనదు’లను ఫార్సీలో రాయించే వారు. ఇవే విషయాలను తెలుగులో కూడా రాయించి ప్రకటించేవారు. అంటే తెలుగు భాషకు వారిచ్చిన గౌరవం అర్థమయితది.

సురవరం ప్రతాపరెడ్డి కుతుబ్షాహీల గురించి రాస్తూ ‘‘వారు స్వమతాభిమానులే గానీ బహమనీల వలె పరమతధ్వంసకులు కారు’’ అని పేర్కొన్నారు. దీనికి తగ్గట్టుగానే మొత్తం భారతదేశంలోనే ఉర్దూలో తొలి రచన వెలువడిన గోల్కొండ కోటలో నుంచే ముస్లింలు రాసిన తొలి తెలుగు సాహిత్యం వెలువడిరది. తెలుగు మండలములో తెలుగులోనే రాజ్య వ్యవహారాలను సాగించారు. మొహర్రం, విజయదశమి, కామదహనం, మృగశిర రోజుల్లో ప్రజలందరూ కలిసి వేడుకలు జరుపుకునేవారు. ఇప్పటికీ తెలంగాణలో మొహర్రం పండుగను మతాలకతీతంగా జరుపుకుంటారు. ఈ పండుగలు జరుపుకునేందుకు కుతుబ్షాహీ ప్రభుత్వమే ఖర్చంతా భరించేది. తొలి అచ్చ తెలుగు కావ్యం ‘యయాతి చరిత్ర’ వీరి కాలంలోనే పొన్నగంటి తెలగన్న రచించారు. అలాగే కుతుబ్షాహీల ఆస్థానంలోని అద్దంకి గంగాధర కవి, సారంగు తమ్మయ మొదలైన వారంతా తెలుగు సాహిత్యంలో ఒక గుర్తింపుని తెచ్చుకున్నవారే!

కుతుబ్షాహీ రాజులు వివక్ష పాటించకుండా అన్ని మతాల వారికి ప్రభుత్వోద్యోగాల్లో ప్రాతినిధ్యాన్ని కల్పించారు. ఏ యితర ముస్లిం రాజ్యంలోనూ లేని మత స్వాతంత్య్రాన్ని హిందువులు కుతుబ్షాహీల పాలనలో అనుభవించారు. అయితే ఈ విషయాలేవి చరిత్ర పుటల్లోకి, పాఠ్యపుస్తకాల్లోకి ఎక్కలేదు. పర్షియన్, ఉర్దూ, తెలుగు భాషా సాహిత్యాలు సమానంగా ఆదరించబడ్డాయి. తారామతి, ప్రేమావతి మొదలైన హిందూ స్త్రీల ప్రతిభకు ఆదరణ దక్కింది. భాగామతి పేరిట హైదరాబాద్ నగరమే నిర్మితమయింది.

హిందూ`ముస్లిం సఖ్యతకు అత్యంత ప్రాధాన్యత నిచ్చిన కులీకుతుబ్షా హైదరాబాద్ నగరాన్ని నిర్మింపజేయడమే గాకుండా తెలుగులో కవిత్వం కూడా అల్లిండు. ఇంతవరకెవ్వరూ ఈ విషయానికి తగిన ప్రాధాన్యతనిచ్చి చర్చించలేదు. దసరా పండుగ గురించి ఆయన ఇలా వర్ణించారు.

‘‘అందాల దసరా ఆనందముతో వచ్చినది
వనమంతా వెన్నెలమయమయినది
అందాల మనసులో బుల్ బుల్ పిట్టల పాటలు
అందాలొలుకబోసె
అంగనల పాటల వలె ఉన్నవి’’

అని కవిత్వీకరించిండు. ఇదే తెలుగులో ముస్లింలు రచించిన మొట్టమొదటి సాహిత్యం. రాజులే తెలుగును ఆదరించడమే గాకుండా స్వయంగా కవిత లల్లారు. ప్రజల్ని కన్నబిడ్డల వలె చూసుకున్నారు. కొంతమంది హిందూత్వ వాదులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాల్సిన ఘటనలకు కావాలనే స్థానం దక్కకుండా చేసిండ్రు. తవ్వినా కొద్దీ ఆనాటి వెలుగులు ఎన్నో కొత్త పుంతల్ని సంతరించుకుంటున్నాయి. ఇంత వరకూ తెలుగు సాహిత్యంలో కుతుబ్షాహీల సేవ గురించి సరైన పరిశోధన జరగలేదంటే విశ్వ విద్యాలయాల్లో ఉన్న వారి మేధో పరిధి, భావజాలం రెండూ తెలియ వస్తున్నవి.

కుతుబ్షాహీల అనంతరం అసఫ్జాహీలు కూడా ఇదే ఒరవడిని కొనసాగించారు. 1944`48లో మాత్రమే కొన్ని చోట్ల వివిధ కారణాల వల్ల మతపరమైన అలజడి చెలరేగింది. మొత్తం 225 సంవత్సరాల అసఫ్జాహీల పాలనలో కేవలం ఒకటి రెండు సంఘటనల ఆధారంగా ముస్లింల పాలన అంతా హిందూ వ్యతిరేక పాలన అని ఈనాడు కొంత మంది తీర్పులిస్తున్నారు. దీనిలో ఆరెస్సెస్ వాదులు మొదలు కమ్యూనిస్టుల వరకు చాలా మంది ఉన్నారు. ఈ విషయాన్ని గతంలో చాలా సార్లు చర్చకు పెట్టడం జరిగింది. నిజానికి ఏడో నిజామ్ మీర్ ఉస్మానలీఖాన్ తాను చేయాల్సి ఉండి చేయలేక పోయిన పనులకు ఆయనను జవాబుదారీగా నిలుపుతూనే అంతకుముందు జరిగిన అభివృద్ధి పనుల క్రెడిట్ ఆయనకు దక్కేలా చూడాల్సిన అవసరముంది.

నిజామ్ల పాలనలో తెలంగాణలోని వనపర్తి, గద్వాల, దోమకొండ, పాపన్నపేట, దుబ్బాక, రాజపేట ఇలా అనేక సంస్థానాలు హిందువుల పాలనలో ఉండేవి. వీటిలో వేటిని కూడా నిజామ్లు స్వాధీనం చేసుకోలేదు. పైపెచ్చు వీరికి కొన్ని విషయాల్లో ‘స్వయం పాలన’ అధికారాలు కూడా కట్టబెట్టారు. జాగీర్దార్లు, జమీందార్లు, దేశ్ముఖ్లు, దేశ్పాండ్యాలు 95 శాతం హిందువులే. వీరి వల్ల నిజాం ఖజానాకు నష్టం కలుగుతుండటంతో సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్యంలో సంస్కరణలకు పునాదులు వేసిండు. దొరలు, దేశ్ముఖ్ల గుత్తాధిపత్యంలో ఉన్న కార్యకలాపాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకువచ్చారు. నిజామ్ల పాలనలో కూడా మత సహనం పరిఢవిల్లిందని చెప్పడానికి సాక్ష్యం కిర్క్ పాట్రిక్`ఖైరున్నీసాల వివాహం.

ఇప్పటి కోఠీలోని మహిళా కళాశాల, ఒకప్పటి బ్రిటీష్ రెసిడెన్సీని రెండువందల ఏండ్ల క్రితమే నిర్మించిన హైదరాబాద్లో బ్రిటీష్ రెసిడెంట్ జేమ్స్ అషిల్లిస్ కిర్క్ పాట్రిక్ నిజాం ఖాందాన్కు చెందిన ఖైరున్నీసా బేగమ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీనికి బ్రిటీష్ ప్రభుత్వాధికారుల నుంచి నిరసన వచ్చింది కానీ హైదరాబాద్లోని నిజాం ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇదీ ఇక్కడి వాతావరణం.

నిజాం పాలనలో మొదటి నుంచీ హిందువులకు స్థానం ఉండేది. కాయస్థులు అధికారంలో రెవెన్యూ పదవుల్ని నిర్వహించే వారు. అలాగే చందూలాల్, కిషన్ పర్షాద్ తదితరులందరూ నిజాం ప్రధానులుగా వ్యవహరించారు. పక్కా ఆర్య సమాజీయుడైన కేశవరావు కోరట్కర్ని హైకోర్టు న్యాయమూర్తిగా నియమించిన ఘనత నిజాం ప్రభుత్వానిది. భద్రాచలం, యాదగిరిగుట్ట, సీతారామ్బాగ్, రaాం సింగ్ టెంపుల్ (గుడి మల్కాపూర్) మొదలైన మందిరాలకు ప్రత్యేక వేడుకల సందర్భాల్లో రాజ లాంఛనాలతో పట్టుబట్టల్ని నిజాం ప్రభుత్వం పంపించేది. అంతేగాదు తమ రాజ్యంలోనిది కాకపోయినప్పటికీ తిరుపతి వెంకటేశ్వర మందిరానికి నిజాం ప్రభుత్వం నుంచి గ్రాంట్లు అందేవి. పూర్తిగా హిందూమతానికి సంబంధించిన మందిరాలైన అజంతా గుహల మరమ్మత్తుకు, అభివృద్ధికి గాను నిజాం ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది. హజ్కు వెళ్లే ముస్లిములతో సమానంగా కాశీయాత్ర చేసే వారి కోసం ప్రభుత్వమే ఖర్చులు భరించింది. కాశీలో బ్రాహ్మణులకు దానం చేసే రూపాయి దగ్గరి నుంచి అన్ని ఖర్చుల్ని నిజాం ప్రభుత్వమే భరించింది.

1908లో మూసీ నదికి వరదలు వచ్చి మూసీ తీర ప్రాంతమంతా కొట్టుకుపోయి అంతా అస్తవ్యస్తం కావడంతో గంగమ్మ తల్లిని శాంతింప చేయాలని పండితులు ఆరో నిజామ్ మహబూబ్ అలీఖాన్కు సలహా ఇచ్చారు. దాంతో ఆయన పసుపు బట్టలు ధరించి, ధూప దీప నైవేద్యాలతో మూసీ నదిలోకి తర్పణం చేశాడంటే పరమత సహనం, వారి నమ్మకాలకు అనుగుణంగా ఎలా నడుచుకున్నాడో అర్థమవుతుంది. అలాగే ఏడో నిజాం ఉస్మానలీఖాన్ పాలనలో హైకోర్టు కడుతున్నప్పుడు అప్పటికే అక్కడున్న ‘మాతాకా మందిర్’ అడ్డుగా ఉన్నది దాన్ని తొలగించి విశాలంగా కట్టడానికి ఏర్పాట్లు చేస్తూ ఇంజనీర్లు ఉస్మానలీఖాన్కు ప్రతిపాదనలు పంపారు. దాన్ని ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ ‘‘మనం కట్టేది న్యాయాలయం. దాన్ని అన్యాయపు పునాదులపై నిర్మించ కూడదు’’ అని మందిరానికి తగినంత చోటు వదిలి పెట్టి హైకోర్టుని నిర్మించారు. ఇప్పటికీ ఈ ఆలయం హైకోర్టు ఆవరణలో పూజలందుకుంటుంది.

అలాగే ఉస్మానలీఖాన్ పాలనలో మహాభారతం పుస్తక ప్రచురణ కోసం పూణేలోని పరిశోధనాలయానికి, బనారస్ విశ్వవిద్యాలయానికి నిజాం తన సర్ఫేఖాస్ నుంచి, ప్రభుత్వ ఖాతాల నుంచి విరివిగా విరాళాలు ఇవ్వడం జరిగింది. వాస్తవాలు ఇలా ఉంటే హిందూత్వ వాదులు, కమ్యూనిస్టులు నిజాంని కేవలం మతతత్వవాదిగానే చూస్తున్నారు. నిజాం పాలనలో బ్రిటీష్ వారు హద్దు మీరి జోక్యం చేసుకోవడం వల్ల రెవెన్యూ, పోలీస్, ఎక్సయిజ్ మిగతా ప్రాధాన్య శాఖలన్నింటికీ బ్రిటీష్ సంతతి వారే అధికారులుగా నియమితులయ్యేవారు. వారు చెప్పిందే వేదంగా సాగేది. ట్రెంచ్, టస్కర్ లాంటి వారు ఆంధ్ర మహాసభలకు అనుమతులివ్వకుండా అడ్డుకునేవారు. వీటన్నింటికి ఒక్క నిజామ్నే దోషీగా నిలబెట్టాలని, ఆయన్ని రజాకార్ల ప్రతినిధిగా చూడాలనడం సబబు కాదు. అందరితో పాటు 1944`48 సంవత్సరాల మధ్య కాలంలో జరగకూడని సంఘటనలకు, జరిగిన సంఘటనలకు నిజామ్ని బాధ్యుడ్ని చేస్తూనే ఆ కాలంలో జరిగిన సంఘటనల్ని సంయమనంతో, ఇతర అంశాలతో సమన్వయం చేస్తూ అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. 1944 ప్రాంతంలో హైదరాబాద్లో, 1927లోనే ‘మజ్లిస్’ని స్థాపించిన బహదూర్ యార్జంగ్ అల్లుళ్లు దూళ్పేట్లో జరిగిన మత కలహాల్లో మరణించారు. ఈ సమయంలో బహదూర్ యార్జంగ్ ప్రదర్శించచిన సంయమనాన్ని సరోజిని నాయుడు తన కవితల్లో నిక్షిప్తం చేసింది. మొత్తం తెలంగాణలో ఇలాంటి రెండు మూడు మత కలహాల సంఘటనలు జరిగాయి. ఈ కాలంలో అటు మజ్లిస్, మరొక వైపు ఆర్య సమాజ్, ఇంకోవైపు దళితులు, రజకార్లు తమ కార్యకలాపాలను నిర్వహించారు.

బీసీల్లో సంగెం సీతారామయ్య యాదవ్, వనమాల (హకీం) నారాయణదాసు, ధావత్ జనార్ధన్, చిరాగు వీరన్న గౌడ్, కే.రాములు, బొజ్జం నర్సింలు తదితరులు ఇక్కడి ప్రజల అభుయన్నతి కోసం కృషి చేసిండ్రు. వీరికి ప్రభుత్వం మతంతో సంబంధం లేకుండా ప్రోత్సాహాన్నిచ్చింది. వారు ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చే సమస్యలను సామరస్యంగా పరిష్కరించింది.

నిజాం పాలనలో ఆది హిందువులు అని పేరున్నప్పటికీ మాల, మాదిగలను ఏనాడు హిందువుల్లో భాగంగా జనాభా లెక్కల్లో చూపలేదు. అంతేగాకుండా సమాజంలో వెనుకబడ్డ ఈ ప్రజల కోసం నిజాం ప్రభుత్వం ప్రత్యేకమైన నిధిని కేటాయించింది. పష్తక్వామ్ పాఠశాలల పేరిట కొన్ని వందల పాఠశాలలను తెలుగు మీడియంలో దళితుల కోసం ప్రత్యేకంగా 1930కి ముందే ప్రారంభించింది.

భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.ఎస్.వెంకట్రావు, శ్యామ్సుందర్ లాంటి దళిత నాయకుల సలహా సంప్రదింపులకు అనుగుణంగా వారి అభ్యున్నతికి ప్రణాళికలు సిద్ధం చేసిండ్రు. బి.ఎస్.వెంకట్రావు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ అంబేద్కర్ స్థాపించిన విద్యాలయాలకు విరివిగా గ్రాంట్లు మంజూరు చేసిండు. ఆర్య సమాజ్ `మజ్లిస్ల మధ్యన ఘర్షణ వాతావరణం తీవ్రం కావడంతో దళితులు గ్రామాల్లోని దొరలు, భూస్వాములు, దేశ్ముఖ్లు, దేశ్పాండ్యాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిండ్రు. ఇలా ఉద్యమం చేసిన వారిలో పీసరి వీరన్న అనే దళిత నాయకుడు ముఖ్యుడు. ఈయన హైదరాబాద్లో గాంధీని బహిరంగ సభలో నిలదీసిండు. ‘హరిజనులు’ అనే పదం వాడకం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిండు. వేదిక మీద ఉన్న గాంధీ వీరన్నను సంతృప్తి పరిచే ఉద్దేశ్యంతో ఒక పండుని చేతిలో పెట్టగా ఆయన దాన్ని తిరస్కరిస్తూ మేము కష్టపడి పనిచేసి తింటాము. మీలాగా ఒకరి నుండి ఆయాచితంగా వచ్చింది త్ణీసుకోము అని తిరస్కరిస్తూ దళితుల ఆత్మగౌరవ బావుటాని ఎగరేసిండు. ఈయన ఆ తర్వాత వరంగల్లో ‘అల్లమ ప్రభువు’ పేరిట వరంగల్లో ‘‘అల్లా’’కు మందిరాన్ని నిర్మించి, నడిపించిండు. దీని కొనసాగింపుగా దేశ్ముఖ్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గౌరవంగా బతికేందుకై కొంతమంది దళితులు ‘ముస్లిం’ మతాన్ని స్వీకరించిండ్రు. అప్పటి వరకు వీరిని వేధించిన దొరలు ముస్లిములుగా మారిన వీరిని గౌరవంగా చూడడంతో అది మరికొందరికి ఆదర్శంగా మారింది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ విలీన సమయంలో కొంతమంది ముస్లింలు ఖాసిం రజ్వీ నేతృత్వంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. ఇలా ఉద్యమించిన రజాకార్లలో కేవలం ముస్లింలే గాకుండా మతం మార్చుకున్న తెలుగు ముస్లింలు, నిజాం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న దొరలు, దేశ్ముఖ్లు, జాగీర్దార్లు, జమిందార్ల దగ్గర పనిచేస్తున్న కింది కులాల వాళ్లు ముఖ్యంగా దళితులు, తెనుగోళ్లు ఉన్నారు. అంటే రజాకార్లు కేవలం ముస్లింలు మాత్రమే కారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రజాకార్లను సాకుగా చూపించి హైదరాబాద్కు మతం రంగు పూయాలని బయటి వారు, హిందూత్వ వాదులు ప్రయత్నం చేస్తున్నారు. సహజీవనంతో గడిపిన కాలాన్ని విస్మరించి కేవలం ఒకటి రెండు సంఘటనల ఆధారంగా మొత్తం చరిత్రకు నెత్తురు అంటిస్తున్నారు.

బంగారు తెలంగాణ నిర్మించు కోవాలంటే ముందుగా లౌకిక పునాదుల్ని ఏర్పర్చాల్సి ఉంటుంది. తెలంగాణ వాదం ముసుగులో కొత్తగా ఆరెస్సెస్స్ దాని అనుబంధ సంస్థలు పెద్ద ఎత్తున హనుమాన్ జయంతులు, వేసవి శిక్షణ శిబిరాల పేరిట ఎక్కడి కక్కడ ప్రజల్ని మత పరంగా విడదీస్తోంది. ఇప్పుడు కేంద్రంలో కూడా బిజేపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరికి మరింత ఊతం అందే అవకాశం ఉంది. అందుకే గతంలో కన్నా ఇప్పుడు మరింత జాగరూకతతో ‘హైదరాబాద్ ఇమేజ్’ని కాపాడు కోవాల్సిన అవసరముంది. లౌకిక భావనలను, చారిత్రక వాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా మతోన్మాదులకు చెక్ పెట్టవచ్చు.

– సంగిశెట్టి శ్రీనివాస్

ప్రతి పాఠంలో చేరా ముద్ర !

10534397_326754877475156_564669077665495274_n

అప్పటి అకడమిక్ స్టాఫ్ కాలేజీ, ఒకప్పటి భాషా శాస్త్ర విభాగం. లింగ్విస్టిక్ డిపార్ట్మెంట్. అన్నయ్య ఎం.ఏ. లింగ్విస్టిక్స్ చదువుతున్న రోజులు. నేను పదవ తరగతిలో ఉన్నాను. అన్నయ్య తన డిపార్ట్మెంట్కు తీసుకుపోయాడు. అప్పటివరకూ పల్లెటూర్లో చదువుకున్న నాకు ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ చూడడమే ఒక గొప్ప అనుభూతి. మొదటిసారిగా యూనివర్శిటీ క్యాంపస్ను చూడడం, మొట్టమొదటి పరిచయం చేకూరి రామారావుగారితో. ఆయనను మొదట చూడగానే భయమేసింది. ఇంత పెద్ద యూనివర్శిటీలో పెద్ద టీచరంట అనుకున్నాను. ఆయన గంభీరమైన రూపం వెనక చిన్న చిర్నవ్వు. అంతే, ఆ మొదటి పరిచయం తర్వాత మళ్ళీ పెద్దగా చూసింది లేదు.

మళ్ళీ నేను ఎం.ఏలో పరీక్షలకు చదవడానికి పుస్తకాలు లేవు. అప్ప్పుడు అన్నయ్య చెప్పాడు. చేకూరి రామారావు గారి దగ్గర మంచి లైబ్రరీ ఉంటుంది వెళ్ళమని, అప్పటికే వాళ్ళమ్మాయి సంధ్య ఆంధ్ర మహిళా సభ కాలేజీలో నాకు ఫ్రెండ్. ఆ పరిచయంతో, కొంచెం బెరుకు బెరుకుగా భయం భయంగా, ఆరాధన సినిమా థియేటర్ వెనక ఉన్న యూనివర్శిటీ క్వార్టర్స్కు వెళ్ళాను. ‘‘ఆ ఏం అన్నారు’’ పుస్తకాలు కావాలి అన్నాను. ‘‘ఇక్కడే కూచుని చదువుకో సరేనా’’ అన్నారు.

అప్పటికే సంధ్యతో ఉన్న పరిచయంతో వాళ్ళింట్లో చనువుగా తిరిగేదాన్ని. పొద్దంతా నేనూ, సంధ్య చదువుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గడిపేవాళ్ళం. వాళ్ళింట్లో తినేదాన్ని. పుస్తకాల గురించో, పుస్తకంలోని విషయాల గురించో మాట్లాడాలంటే భయమనిపించేది. ఆయన బీరువాల నిండా పుస్తకాలు చూసి, అమ్మో ఏం మాట్లాడితే ఏమంటారో అని భయమేసింది.

అట్లా ఎం.ఏ. అయిపోయింది. ఆ తర్వాత ఎం.ఫిల్., పి.హెచ్డి. చేసేటప్పుడు, అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని. పెద్దగా సాహిత్యం గురించో, పుస్తకాల గురించో మాట్లాడేదాన్ని కాదు. ఊరికే గుర్తుపట్టినట్టు ఒక నవ్వు నవ్వేవారు.

ఆ తర్వాత అప్పుడప్పుడూ సభల్లో కనిపించేవారు. దాదాపు 15 ఏండ్ల తర్వాత, నేను మొదటిసారి ఓపెన్ యూనివర్శిటీలో అడుగుపెట్టినప్పుడు అంటే 2007లో ఆయన గురించి నాకు తెలిసింది. సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సులువైన తెలుగు పాఠాలను ఆయనే రూపకల్పన చేసారని అర్థమైంది. మేము ఎం.ఏ తెలుగు పుస్తకాలు తయారుచేస్తున్న క్రమంలో చేకూరి రామారావు గారికి ఈ మెటీరియల్ ఇచ్చి రావాలమ్మా అని రమణగారు పంపించారు. అప్పటికే ఆయన ఆరోగ్యం అంత బాగాలేదు. అయినా ఓపికగా నేనిచ్చిన మెటీరియల్ అంతా చదవడానికి ఒక వారం రోజుల టైమ్ అడిగారు. ఆ తర్వాత ఆయన అన్న టైముకి మెటీరియల్ తిరిగి ఇచ్చారు. అంతేకాదు, ఆరోజు భాష గురించి, వాక్యాల గురించి, పెద్దాయన తనకున్న అభిప్రాయాలను నాతో చెప్పారు. అంత నాతో మాట్లాడటం చాలా బాగా అనిపించింది. పైగా ఓపెన్ యూనివర్శిటీ సిలబస్ ఎంత సరళంగా ఉండాలి అన్న విషయాన్ని కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా వివరించారు.

ఆరోజు తర్వాత నుంచి ప్రతిసారీ మా యూనివర్శిటీ పుస్తకాలు తిరగేస్తున్నప్పుడల్లా చేకూరి రామారావుగారి వాక్యమో, వారి పేరో కనిపిస్తూనే వుంటుంది. ఆయన చనిపోయే ముందురోజు పరిష్కృత పాఠ్య ప్రణాళికా బృందంలో ఆయన పేరు రాస్తుంటే రమణగారు గుర్తొచ్చారు. చేకూరి రామారావుగారు మన పుస్తకాలకు ఎప్పుడూ గౌరవ సభ్యుడే అంటుండేవారు. ఇప్పుడు కొత్తగా వచ్చే పుస్తకాలలో వారి జతన చేకూరి రామారావుగారు కూడా చేరారని బాధగా ఉంది.

ప్రాథమిక విద్య కూడా లేని వారి కోసం ఏర్పరచిన అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఒక కొత్త దృష్టి కోణాన్ని తెలుగంటే పద్యాలు కాదు, తెలుగంటే ఒక భాషా శాస్త్రమని, దాన్ని ఎంత సులువుగా అందజేస్తే అంత ఉపయోగమనే దూరదృష్టితో కొత్త విషయాలను రూపకల్పన చేసిన ఉన్నత వ్యక్తి చేకూరి రామారావు గారు. వారు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చేసిన సేవలు మరపురానివని వారిని స్మరిస్తూ వారికిదే నా నివాళి.

వ్యక్తిగత పరిచయమా, సాహిత్య పరిచయమా, కుటుంబ పరిచయమా ` ఏ పరిచయమైనా ఆయనతో మాట్లాడిన సందర్భాలు అతి కొద్ది అయినా, నామీద వారి ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. ప్రతి పుస్తకంలో, ప్రతి పాఠంలో వారి ముద్ర కనిపిస్తూనే ఉంటుంది.

` డా॥ ఎన్. రజని

rajani

చిత్రరచన: రాజు

మెటఫర్ కోసం “అనంత” అన్వేషణ!

unnamed

“గుడ్డినమ్మకంతో సమస్యల్లా ఒక్కటె-అది మతాన్ని నాశనం చేస్తుంది”–అనంతమూర్తి.

గుడ్డినమ్మకాన్ని మతాన్నుంచి వేరుచేయగలగవారెవ్వరు
ఇలాంటి వారెవ్వరో తప్ప…..

ఎవరింతలా చెప్పగలరు? ఎవరింతలా తెగించి మరీ, ధైర్యంగా మతాన్ని నిర్వచిస్తారు?
ఇది అనంతమూర్తి అనకపోతే ఏమయ్యేదొ కానీ తీరా ఆయన అన్నాక ఇక అక్కడ ఆగి వినాల్సిందే.

“ఒక్కసారి ఆలోచించి చూడండి, గీతాంశరేఖలన్నీ ఓ మాటపై నిలబడే ఉన్నట్టున్నాయి, అదే మాటపై నిలబడదామా
లేక ఓ మతాన్నేదొ నమ్ముకుని బయటపడదామా?”
అని అనంతమూర్తి అనరు. బదులుగా ఇలా అంటారు.

“జీవితాన్ని, మతాన్ని కలిపి చూడకండి
విడదీసి చూసే శక్తే మీకుంటే మీరందరూ ఓ గొప్ప మతవాదులవుతారు
నాలా, బ్రాహ్మణీకాన్నీ వదిలేసుకుని మరీ బతుకుతున్న వ్యక్తిలా”

షిమోగా జిల్లాలోని తీర్థహల్లి సనాతన బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన అనంతమూర్తి సంప్రదాయ సంస్కృత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి మైసూర్ విశ్వవిద్యాలయంలోనే మాస్టర్స్ చేసి అక్కడె కొన్నాళ్ళు అధ్యాపకుడిగా పనిచేసి తర్వాత బర్మింగ్‌‌హామ్ యూనివర్శిటీనుంచి “Politics and Fiction in the 1930s” పై డాక్టరేట్ తీసుకుని మన దేశానికి తిరిగొచ్చారు.

1987 నుంచి 1991 వరకూ కొట్టాయం మహత్మా గాంధీ విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేసి తనకంటూ ఓ ముద్రవేసుకున్నారు. ఆయన ఎక్కడున్నా ఓ కొత్త ఒరవడికి నాంది పలకగడమే ఈయన ప్రత్యేకత. అదే అనంతమూర్తి.

2012 లో మొట్టమొదటి కులపతిగా (First Chancellor) కర్నాటక విశ్వవిద్యాలయానికి నియమింపబడ్డారు. 1993 లో సాహిత్య అకాడెమీకీ అధ్యక్షుడిగానూ ఎన్నికయ్యారు. మనదేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకే కాక విదేశాల్లోని గొప్ప యూనివర్శిటీలకి పనిచేసారు అనంతమూర్తి. 1990 లో సోవియట్ రష్యా, హంగేరి, ఫ్రాన్స్, జర్మనీ సందర్శించి అక్కడ ప్రసంగించారు. 1994 లో కేంద్రప్రభుత్వం నుంచి జ్ఞాన్‌‌పీఠ్ అవార్డ్, నాలుగేళ్ళ తర్వాత పద్మభూషణ్ అందుకున్నారు.

ఎనభైఏళ్లకు పైగా ఎంతనిర్భీతిగా జీవించారో అదే దృక్పథం అతని రచనల్లోనూ కన్పడ్డం వింతకాకపోయినా అది అతనికి అభిమానులనీ విమర్శకులనీ సమానసంఖ్య లోనే సంపాదించిపెట్టింది. ఐతే వివేకాన్ని ప్రశ్నించడానికి ఏమాత్రం జంకని అనంతమూర్తి అత్యంత వివాదాస్పద వ్యక్తిగా, రచయితగా కూడా ప్రసిధ్ధి.

తన రచనల్లో ఎక్కువగా కన్నడ బ్రాహ్మణులు ఎదుర్కునే సమకాలీన సమస్యల గురించీనూ, వారు తమ కట్టుబాట్లను వదిలి బయటికి రాలేకపోవటం గురించీ రాసుకున్నారు. ఈ క్రమంలో వచ్చిందే ఆయన ప్రముఖ నవల “సంస్కార”. ఇందులో ప్రధాన ప్రాత్ర పోషించింది తన సమకాలీనుడు మరో ప్రముఖ కవి లంకేష్. ఈ నవలని సిన్మాగా రూపొందించాక అనంతమూర్తి పామరజనుల్లోకి మరింత పదునుగా చొచ్చుకుపోయారు. అయితే తర్వాత కాలంలో లంకేష్ కీ ఈయనకీ విభేదాలు పొడసూపడంతో ఇద్దరూ దూరమయ్యారు.

“సంస్కార” నవల పూర్తిగా బ్రహ్మణ చాందసవాద ఆచారవ్యవహారాలపై ఓ తిరుగుబాటు బావుటా. జీవితాంతమూ బ్రాహ్మణ ఆచారవ్యవహారలకి దూరంగా ఉంటూ హఠాత్తుగా మరణించిన ఓ యువకుడి పార్ధీవదేహానికి అంతిమక్రియలు ఎవరు చెయ్యాలన్నదే నవల ప్రధాన అంశం. చివరికి అతనికి సహచరిగా ఉంటూవచ్చిన ఓ వేశ్య అతనికి దహన సంస్కారాలు నిర్వహిస్తుంది.

అనంతమూర్తి 1980

అనంతమూర్తి 1980

అప్పట్లో (1970) ఆ సిన్మాని విడుదల చేయడానికి సెన్సార్ బోర్డూ, ప్రభుత్వమూ భయపడ్డ మాట వాస్తవమే. కానీ తర్వాత విడుదలై National Film Award for Best Feature Film పొందటం యాదృచ్చికం కానేకాదు.

అనంతమూర్తి ఎక్కడ ఉన్నా అక్కడ విభేదాలుండేవి. ఆయనకి తనకంటూ కొన్ని నిర్ధిష్ట అభిప్రాయాలున్నా “మాట” విషయంలో తొందరపాటో లేక విపరీతమైన అభిజ్ఞానమో కానీ తనకంటూ ఓ ముద్ర లేకుండా అక్కడ ఉండనంటారు. అది రాను రాను ఎక్కువై ఆఖరికి అతని ఉనికికె భంగమైంది. అతని అనుచరులందరూ దూరమయ్యారు. అతనే తానొక ఉనికికోసం ఆదుర్దాపడాల్సిన పరిస్థితినీ తెచ్చుకున్నారు.

ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఆయన చెంతకు చేరాయి. అందులో ప్రముఖంగా దేవెగౌడ (అదె, మన భారతదేశ పాత ప్రధాని) కూడా ఈయనకి పార్టీ(జనతాదళ్) టికెట్ ఇచ్చి లోక్‌సభకి నిలబెట్టారు. అయినా ఓడిపొయారు అనంతమూర్తి. మళ్ళీ పోటిచేసారు, మళ్ళీ ఓడిపోయారు. ఇక్కడ ఈయన ఓటమికి ప్రధానకారణం ఆయనకి మతమంటే ఖచ్చితమైన అభిప్రాయమూ లేదని అతని విమర్శకులంటారు. భారతదేశ రాజకీయాలూ, మతమూ నాణానికి రెండు పార్శ్వాల్లాంటివన్న విషయం అర్ధంకావటానికి అనంతమూర్తికి రెండు ఎన్నికల అనుభవం అవసరమయింది.

ఈయన తన జీవితపు చరమాంకంలో పలు మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలకి ఆద్యుడయ్యాడు. దాంతో ఆయన్ని సాహితీ పరంగా అభిమానించిన వారూ ఆయన్ని దూరంపెట్టడాన్ని ఓ “సంస్కారంగా” వ్యక్తపరిచారు. విగ్రహారాధన పై ఇతని అభిప్రాయాలూ, వ్యాఖ్యలూ హిందువులని బాధించాయని అంటారు.
అయితే అనంతమూర్తిని నాస్తికుడనో హేతువాదనో అనడానికీ వీలులేదు. ఈయన ఉపనిషత్తులని అర్దం చేసుకున్నట్లుగా ఇతని విమర్శకులూ చదవలేకపోయారన్నది నిర్వివాదాంశం. మతానికి వ్యతిరేకుడు కాదు కానీ మతం ముసుగులో జరుగుతున్న అకృత్యాలనే ‘అనంతంగా’ అసహ్యించుకునే వ్యక్తిత్వం.

ఏది ఏమైనా అనంతమూర్తి ఓ మేధావి, ఓ జ్ఞాని. ఈయన రచనలని చదవాల్సిందే. ఈయన ఫిలాసఫీనీ అర్ధం చేసుకోవాల్సిన ప్రయత్నం చెయ్యాల్సిందే. అతని రచనల గురించి అతని మాటల్లోనే “writers use devices to hook readers. For me the writing process begins with a metaphor. I look for one everyday”

“Among the contemporaries UR Murthy was perhaps India’s biggest intellectual, not just a writer. He was very modern in his thinking and at the same time, he is deeply rooted in his culture”
-Adoor Gopalakrishnan, Eminent Film-maker based in Thiruvananthapuram, Kerala

 -శ్రీనివాస్ వాసుదేవ్

10603336_10202364645617595_2039969616780245559_n

 

 

అనంతమూర్తి అనిర్దిష్ట యాత్ర

Krish.psd

‘ముందు నిరాకారం, తర్వాత నిరాకారం. అపూర్వమైన అనుభవాన్ని అనుగ్రహం చేసి అదృశ్యమైందా పవిత్ర ముహూర్తం. ఆ క్షణం అనుభవానికి వస్తే ఆ అనుభవం మళ్లీ కావాలనిపిస్తుంది..’ అనుకుంటాడు వేదాంత శిరోమణి, పండితుడు ప్రాణేశాచార్యులు. ఆ అనుభవం ఏమిటి? ఆ అనుభవం ముందు సమస్త ఆచారాలు, సాంప్రదాయాలూ, మడులూ, నిష్టలూ, పూజలూ, పునస్కారాలు గాలిలో కొట్టుకుపోతాయి. మనిషిని మనిషిగా గుర్తింపచేసే అనుభవం అది. ఆ అనుభవం తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది?

‘మత్స్యగంధిని గర్భవతి చేసి వ్యాసమహర్షికి జననమిచ్చిన ఆ పరాశరుడు నాకు మాదిరిగానే ఇలా వ్యాకులపడ్డాడా? లేక వాళ్లంతా ఈ జీవితమే ఒక మోక్ష సన్యాస మార్గమనీ, భగవన్నిర్దిష్టమనీ సమన్వయించుకుని, అన్యోన్య విరుద్దసంఘర్షణలకు అతీతమై, ప్రకృతి కాంత సృష్టించి సమర్పించిన వివిధ సంవిధాలకూ తలయొగ్గి నివసించి, చివరకు నిరాకారమైన ఈ అనంత విశ్వంలోకి లీనమై పోయారా? నదులు సముద్రంలో విలీనమైనట్లు?’ అని తనను తాను ప్రశ్నించుకుంటాడు ప్రాణేశాచార్యులు చంద్రితో అనుభవం తర్వాత.

ఆ అనుభవం ఏమిటి? తడి నేలనుంచి నీలంగా విష్ణుక్రాంత పుష్పాలలో నుంచి సుగంధాలు విరజిమ్ముతున్నై. వాటితో పాటు స్త్రీ వంటి నుంచి పడుతున్న చెమట బిందువుల పరిమళమూ కలిసిపోతున్నది. ఆశీర్వాదానికి సాచిన చేయి విరబోసిన ఆమె జుట్టును నిమరసాగింది. ఆశీర్వాద మంత్రం ఆయన కుత్తుకలోనే ఇమిడిపోయింది. ..

అనంతమూర్తి సంస్కార నవలలో వివరించిన అనుభవం ఇది.అనుకోకుండా జరిగిన ఒక స్పర్శ అతడిలో సంస్కారాన్ని తట్టిలేపింది. అతడిని మార్చివేసింది. ఒక్క స్పర్శ అతడి ఆధిపత్యాన్ని విధ్వంసం చేసింది. ఒక్క కలయిక అతడిని బయటిప్రపంచం మట్టిమనుషులతో మమేకం చేస్తుంది. ఒక్క అనుభవం అతడిని తక్కువజాతి వారిని కలిసి కాఫీ తాగేందుకు ప్రోత్సహిస్తుంది. ఈ అనుభవం శాస్త్రాలకు అతీతమా? లేక శాస్త్రాలు వాటిని నిషేధించాయా? లేదు.. లేదు.. బ్రాహ్మణత్వం నిలుపుకోవడానికి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు చదవాలి కంఠోపాఠంగా.. వాటిని అర్థం చేసుకోకుండా.. అందులో ఇంగితమై ఉన్న ప్రేమోద్రేకాల స్వభావం తెలుసుకోకుండా. దాని సంకేతాలకు అనుగుణంగా వ్యవహరించకుండా.. తన జ్ఞానంలోనే దాగి ఉన్నదొక నిప్పురవ్వ..

ఆ అనుభవం తర్వాత ప్రాణేశాచార్యులకు మళ్లీ బాల్యంలోకి ప్రవేశించినట్లనిపించింది. అగ్రహారంలో శవం కుళ్లిన వాసనతో మురుగుపడ్డ ఆయన ముక్కుకు పచ్చగడ్డి వాసన ఎంతో సుఖం కలిగించింది. మట్టి కప్పుకున్న గరిక వ్రేళ్లు ఆయనను ఆనందాబుధిలో ముంచివేశాయి.

ananthamurthy-630

అనంతమూర్తి రచనలు చదివినప్పుడల్లా మన చుట్టూ ఉన్న సమాజం, మనం నిర్మించుకున్న నియమనిబంధనలు, మన పిచ్చుక గూళ్లూ, మన కృత్తిమ మందహాసాలు, రక్తం ప్రసరించని మన కరచాలనాలు, మన ఇంట్లో వ్రేళ్లాడుతున్న పటాలు అన్నీ గాలిలో తేలిపోతున్నట్లు కనిపిస్తాయి. అవన్నీ నీవైపు చూస్తూ పరిహాసం చేస్తాయి. మర్యాదలు విధ్వంసమవుతాయి. మనకు తెలియకుండానే మన పాదాలు వెనుతిరుగుతాయి. మూసుకున్న మన మెదడు కిటికీలు తెరుచుకుంటాయి. మనకు తెలియకుండానే మనం ప్రశ్నించడం మొదలుపెడతాం.

‘సంస్కార’ నవలలో నారాయణప్ప అనే ఒక బ్రాహ్మణుడి ఒక శవం తగలబడడానికి ఎదురు చూస్తుంది. ఎందుకంటే అది బ్రాహ్మణ్యాన్ని వదిలిపెట్టినా, బ్రాహ్మణత్వాన్ని వదలని శవం. బ్రాహ్మణత్వం  వదిలి, సుఖలోలుడై, సుఖంలోనే విముక్తిని కోరుకున్న వాడికి బ్రాహ్మణ్యం ఏమిటి? అయినప్పటికీ అతడు బ్రాహ్మణుడుగానే మరణించాడు. కనుక అతడి శవాన్ని ఇంకో బ్రాహ్మణుడే ముట్టుకోగలుగుతాడు. ముట్టుకుంటే దోషపరిహారానికి ప్రాయశ్చిత్తమేమేమిటి?

ananta3

ఆ బ్రాహ్మణ శవం చేసిన పాపమేమిటి? అందరూ పూజచేసుకునే సాలిగ్రామాన్ని ఎత్తి ఏట్లో పారేశాడు. తురక వాళ్లతో తాగితందనాలాడాడు. కుందాపురం నుంచి కుందనపు బొమ్మలాంటి ఒక తక్కువకులం స్త్రీని తెచ్చిపెట్టుకున్నాడు. ఆమె చంద్రి. ఆమెను చూస్తే ఒక బ్రాహ్మణుడికి రవివర్మ చిత్రంలో ఉన్న మత్స్యగంధి సిగ్గుతో వక్షోజాలను కప్పుకుంటున్నట్లుగా అనిపించింది. ఈ బంగారపుతునకను ఎవరు తీసుకురారు? వాత్సాయన కామసూత్రాల్లో వర్ణించినట్లుగా సున్నితమై, సునిశితమైన వర్చస్సు. భీత హరిణేక్షణల నయనాల వంటి కళ్లు. సంభోగ క్రీడలో మనిషిని సంపూర్ణంగా ముంచి తేల్చగల ప్రభావం ఉన్నది ఆమె శరీరంలో. నారాయణప్ప ఆమెకోసం సాలగ్రామాన్ని ఏట్లో విసిరిపారేశారంటే, మద్యమాంసాలు భుజించాడంటే ఆశర్యం ఏమున్నది? తురకరాజు కూతురు లవంగిని పెళ్లి చేసుకుని జగన్నాథపండితుడు ఆ మ్లేచ్ఛ కన్య వక్షోవైభవాన్ని వర్ణించలేదా?

అనంతమూర్తి బ్రాహ్మణ్యంతో క్రీడిస్తాడు. బ్రాహ్మణ్యాన్ని ప్రశ్నిస్తాడు. నారాయణప్ప శవానికి కర్మకాండలు జరిపేందుకు వెనుకాడిన బ్రాహ్మణులు, వారి గృహిణులు అతడు ఉంచుకున్న చంద్రి నగలకోసం తహతహలాడిన వైనాన్నివర్ణిస్తాడు.బ్రాహ్మణ్యానికి అవతల సాధారణ మనుషుల జీవితాల్లో జీవన సౌందర్యాన్ని చిత్రిస్తాడు. చివరకు బ్రాహ్మణ్యాన్నే అస్తిత్వ పరీక్షలో పడవేస్తాడు. మానవ విలువలు ముఖ్యమా? ఆచార వ్యవహారాలు ముఖ్యమా అన్న చర్చ అనంతమూర్తి సంస్కార లో లేవనెత్తుతాడు. చంద్రి, పద్మావతి, పుట్టప్పలో ఉన్న సంస్కారం తోటి బ్రాహ్మణుల్లో లేదని నిరూపిస్తాడు.

ఇదంతా ప్రశ్నించడం వల్లే వచ్చింది. సంశయాత్మా వినశ్యతి.. (సంశయించేవాడు నశిస్తాడు)అని, శ్రద్దావన్ లభతే జ్ఞానం (విశ్వాసం వల్లే విజ్ఞానం లభిస్తుంది) మన శాస్త్రాలు చెబుతాయి. కాని సంశయించకపోతే నిష్కృతి లేదని, గుడ్డి విశ్వాసం వల్ల ఉన్న విజ్ఞానం నశిస్తుందని అనంతమూర్తి చెబుతారు. అంధ విశ్వాసంతో కొనసాగించే సంస్కృతి మనుగడ సాధించగలదా ? అని ఆయన ప్రశ్నించారు. తన రచనల్లో సాంప్రదాయ హిందూ సమాజంపై సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులను ఆయన నిశితంగా గమనించారు. వాటి వల్ల కుటుంబాల్లో వచ్చిన అంతస్సంఘర్షణను చిత్రించారు. సంప్రదాయాన్ని వ్యతిరేకించిన బుద్దుడు, బసవన్న, అల్లమప్రభులను అనంత మూర్తి ఆరాధించారు. తన నవ్యవాదం అన్ని ఆధునిక వాదాల మాదిరి కాదని, నెహ్రూ కాలపు ఆదర్శ సిద్దాంతాలు పటాపంచలై ఉద్భవించిన వాదమని ఆయన ఒక చోట చెప్పారు.

ఆయన ‘భారతీపుర’ నవల కూడా ఆధునిక భావాలు ఉన్న జగన్నాథుడనే ఒక బ్రాహ్మణుడు ఇంగ్లండ్‌లో చదువుకుని తన సమాజంలో కి వచ్చి అక్కడ భావాలపై ఆధిపత్యం వహిస్తున్న ఆలయవ్యవస్థను గమనిస్తాడు. సమాజంలో నిమ్మజాతీయులైన హోలెయారులు ఆలయంలో ప్రవేశిస్తే రక్తం కక్కుకుని చచ్చిపోతారన్న ప్రచారాన్ని ఆయన ఢీకొంటారు.’సమాజంలో మీరు అధికంగా ఉన్నారు. మీరు తిరగబడాలి..’ అని వారిని ప్రేరేపిస్తాడు. ‘నేను హోలెయారును ఆలయంలోకి తీసుకువెళ్లాలి. శతాబ్ధాలుగా సాగుతున్న సాంప్రదాయాల్ని ఒక్క అడుగుతో మార్చేయాలి. మంజునాథను బ్రద్దలు చేయాలి. హోలెయారు ఒక్క కొత్త అడుగు వేస్తే మనమందరం చచ్చిపోయి కొత్తగా జన్మిస్తాం.. ‘అని జగన్నాథుడు పిలుపునిస్తారు. హోలెయారును మందిరంలోకి ప్రవేశించేలా చేయనంతవరకూ తాను మనిషిని కానని గుర్తిస్తాడు. అనంతమూర్తి ‘ఘట శ్రాద్ద,’ ‘సూర్యన కుదురే’, ‘అక్కయ్య’, ‘మౌని’ తో పాటు అనేక క థలు వ్యవస్థలోని మూర్ఖత్వాలను ప్రశ్నిస్తాయి. దళితులనే కాదు, స్త్రీలను కూడా ఆయన అణగారిన వర్గంగా భావించారు. వార్ని ప్రశ్నించమని ఆయన ప్రేరేపిస్తారు. విలియం బ్లేక్, కీట్స్ కవితలంటే ఆయన కెంతో ఇష్టం. ఆయన కవితలు వాన వెలిసిన తర్వాత నేల పరిమళాన్ని గుర్తు చేస్తాయి.

ananta2

అనంతమూర్తి వ్యక్తిత్వంలోనే తిరుగుబాటు ఉన్నది. ఆయన దేన్నీ ప్రశ్నించకుండా అంగీకరించలేరు. అందుకే ఆయన సాంప్రదాయాన్ని ప్రశ్నించారు. ఆచారాల్ని ప్రశ్నించారు. సమాజంలో రుగ్మతల్ని ప్రశ్నించారు. పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్నారు. ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి తనను తాను ప్రశ్నించుకున్నందువల్లే ఆయన హిందూత్వను ఒక రాజకీయ తాత్విక దృక్పథంగా అంగీకరించలేకపోయారు. ఆక్రమంలో ఆయన బిజెపిని కూడా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ను అభిమానించారు. నరేంద్రమోదీ ప్రధాని అయితే ఈ దేశం నుంచి వెళ్లిపోతానని సంచలనాత్మక ప్రకటన కూడా చేశారు. ఆయన ఈ దేశం పయనిస్తున్న దారిని వ్యతిరేకించారు కాని పలాయనవాదం చిత్తగించే ఉద్దేశం ఆయనకు లేదు.

అనంతమూర్తి పారిపోయే వ్యక్తి కాదు. ప్రశ్నించే వ్యక్తి. ప్రశ్నించే క్రమంలో ప్రతిఘటించే వ్యక్తి. జీవితాంతం ఆయన ప్రతిఘటిస్తూనే రచనలు చేశారు. కొత్త విలువల్ని సృష్టించారు. మానవ సంబంధాల్ని ప్రేమించారు. సామాజిక కార్యకర్తగా మారారు. ఆయనొక ప్రజ్వలిస్తున్న ప్రవాహం.సాహిత్యం రాజకీయాలకు అతీతమైనదా? కానే కాదంటారు. అనంతమూర్తి. ‘నాకు రాజకీయాలతో సంబంధం లేదు..’ అని చేసే ప్రకటనకూడా రాజకీయమైనదేనని ఆయన అభిప్రాయం. ‘నీలో నీవు తరచి చూసుకోకపోతే మంచి రచయితవు కాలేవు’.. అని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు.

అనంతమూర్తి ఒక సామాజిక జీవితానుభవం. వేల వేల చెట్లు కూలిపోతున్న చప్పుడు ఆయన రచనల్లో ప్రతిధ్వనిస్తుంది. చంద్రి కౌగిలిలో ప్రాణేశాచార్యుడు పునీతుడైనట్లే, అనంతమూర్తి రచనలు చదివితే మనం వేనవేల వ్యవస్థల దుర్మార్గాల చితిమంటల్ని విన్నట్లవుతుంది. అనంతమూర్తి నిర్దిష్ట యాత్ర చేశాడని చెప్పలేం. బ్రాహ్మణత్వం చనిపోయినా బ్రాహ్మణుడు చనిపోలేడు కదా.. అనంతమూర్తి అంత్యక్రియలను ఆయన బంధువులు స్మార్త బ్రాహ్మణ ఆచారాల ప్రకారమే చేశారు.

 ~~

వర్మ ప్రయోగం మసాలా సినిమాకి షాక్!

samvedana logo copy(1)
వర్మకు అభినందనలు.

సత్య, సర్కార్‌ తీసిన మనిషి ఐస్‌క్రీమ్ లాంటి సినిమాలు తీస్తున్నందుకు కాదు. సినిమా రంగాన్ని ప్రజాస్వామీకరించే దిశగా ఆలోచిస్తున్నందుకు. అతనొక సినిమా పిచ్చోడు. ఆయన సినిమాల మీద మనకు ఎలాంటి అభిప్రాయాలైనా ఉండొచ్చు. కానీ సినిమా ద్వారా వచ్చే పేరును సంపదను మాత్రమే కాకుండా సినిమాను కూడా ప్రేమించేవాళ్లు అవసరం. వర్మ సినిమాను వ్యాపారంగా మాత్రమే చూడకుండా అదే జీవితంగా ఎంచుకున్నవాడు. సినిమాను దానిద్వారా సంపాదించిన పేరును అడ్డుపెట్టుకుని సర్కారీ భూములు కొట్టేసి అందులో చట్టవిరుద్ధమైన స్టుడియో ఫ్లోర్లు, సినిమా ధియేటర్టు కట్టే బాపతు కాదు. అతను ఇప్పుడు చేపట్టిన ప్రయోగం సినిమా రంగాన్ని ప్రజాస్వామీకరించడానికి అవసరమైనది.

చిన్న సినిమా నిర్మాతలు అనే పదం తరచూ వింటూ ఉంటాం. వాళ్లు ఇందిరాపార్కు దగ్గరో, ఫిల్మ్‌క్లబ్‌ దగ్గరో మరొకచోటో ఆందోళన చేయడం వగైరా చూస్తూ ఉంటాం. వారి మాటల్లో ఆ నలుగురూ అనే పదం కసికసిగా వినిపిస్తూ ఉంటుంది. స్టార్ల బలం లేకుండా సినిమా తీసే చాలామందికి ఆ నలుగురు సినిమా రిలీజ్‌ కాకుండా అడ్డుపడే సైంధవులు. ఆ నలుగురిపై ఎందుకంత మంట? వందలకొద్దీ థియేటర్లను చేతిలో పెట్టుకుని వారి పుత్రపౌత్రమిత్ర సినిమాలు మాత్రమే ఆడిస్తూ తమకు థియేటర్ ఇవ్వడం లేదనేది తరచుగా వినిపించే ఆరోపణ. సాధారణంగా సినిమా తయారీ ఆఖరి అంకంలో నిర్మాతకు సినిమా చూపించే దశలు రెండు ఉంటాయని చెపుతారు. ఒకటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్‌. ముఖ్యంగా ‘లాబ్స్‌’లో డబ్బాలు ఆగిపోతుంటాయి. ఎవరికివ్వాల్సిన డబ్బులు వారికిస్తే గానీ అక్కడినుంచి డబ్బాలు బయటపడవు. అనుకున్న బడ్జెట్‌ కంటే డబుల్‌ చేశాడని దర్శకుడిని, అనుకోకుండా చేయిచ్చాడని ఫైనాన్సియర్‌ను తిట్టుకుంటూ ఉంటారు. అపుడపుడు పెద్ద పెద్ద నిర్మాతలు సైతం హుస్సేన్‌ సాగర్లో దూకి దాన్ని మురికి చేస్తూ ఉంటారు. ఏవో తిప్పలు పడి అక్కడినుంచి డబ్బాలు బయటకు తేగలిగినా ఆ తర్వాత అసలైన ఆఖరి అంకం మొదలవుతుంది. థియేటర్స్‌ ఎవరివ్వాలి? అన్ని థియేటర్లలో బాబుగార్ల సినిమాలే ఆడుతుంటాయి. చిన్నసినిమా మొకం చూసే వారుండరు. ఇక్కడ డిస్ర్టిబ్యూటర్స్ అనే వ్యవస్థ ఉంటుంది. అదొక పద్మవ్యూహం.

ఇలా ఆరోపించే చిన్ననిర్మాతల్లో అన్ని రకాల చిన్న వారుంటారు. ఒంటిపై స్పృహ గానీ పట్టింపుగాని లేని ఇద్దరు వ్యాంప్‌ పాత్రలు, సినిమా పిచ్చి ఉన్న ఒక అబ్బాయి-అమ్మాయి అందుబాటులో ఉంటే బంజారాహిల్స్‌లో ఒక గెస్ట్‌ హౌస్‌ను నాలుగు రోజులు అద్దెకు తీసుకుని బెడ్‌మీద రెండు రోజుల్లో పొర్లుడు పందాలు పెట్టి ఏదో ఒక వంకర పేరుతో జనం మీదకు వదలాలనుకునే సాఫ్ట్‌ పోర్న్‌ నిర్మాతల దగ్గర్నుంచి ప్రపంచ సినిమాను అధ్యయనం చేసి మనమెందుకు ఇలా ఉన్నాం అని మధనపడి నేను సైతం అనే శలభాల దాకా చాలా షేడ్స్‌తో ఉంటారు. మధ్యలో కుర్రకారును వల్గర్గా కాకుండా మామూలుగా అర్థం చేసుకోలేని మారుతి వేషాలు కూడా ఉంటాయి. ఏదో ఒక గడ్డితిని ఏదో ఒక చెత్త చూపించి నాలుగు పరకలు సంపాదించాలనుకునేవారుంటారు. పెన్ను బుగ్గన పెట్టుకుని అది అరిగిపోయే దాకా ఆలోచించేవారుంటారు. ఎవరి తిప్పలు ఏమైనా కానీ సినిమా అంటే నిజంగా ప్రేమ- అభినివేశం ఉన్న వారు బయటకు రాకుండా ఈ డిస్ర్టిబ్యూషన్‌ సిస్టమ్ అడ్డుకుంటోంది.

rgv

సినిమా మేకింగ్‌లో ఇప్పటికే చాలా మంచి మార్పులొచ్చాయి. స్విట్జర్లాండ్‌ను స్వీడన్‌ను కాకుండా కథను నమ్ముకుని, స్టార్లను కాకుండా యాక్టర్లను నమ్ముకుని సినిమా తీయాలనుకుంటే ఇవాళ కోట్లు కుమ్మరించనక్కర్లేదు. చాలా రంగాల్లో టెక్నాలజీ తెస్తున్న సానుకూల మార్పు ఇక్కడా తెచ్చింది. డిజిటల్‌ డెక్నాలజీ, నాన్‌ లీనియర్‌ ఎడిటింగ్‌ వంటివి సినిమా మేకింగ్‌ను సులభం చేశాయి. ఇవాళ అది బాబుగార్లకు మాత్రమే సాధ్యమైన విద్య కాదు. ఈ పద్ధతిని చాలామంది ఫాలో అవుతున్నారు. తెలుగులో ‘వెండిమబ్బులు’ తేలిపోయాయి కదా అని తొలిరోజుల్లో తేలికగా మాట్లాడిన వారు ఆ తర్వాత డిజిటల్‌ బాట పట్టక తప్పలేదు. కమల్‌ హాసన్‌ ముంబై ఎక్స్‌ప్రెస్‌ ప్రయోగం చేసినపుడు, ఆనక రెడ్‌ కెమెరా వాడినపుడు ఇదేం పైత్యం అన్నవారు తర్వాత ఆ బాట పట్టక తప్పలేదు. ఇవాళ రెడ్‌ కెమెరాకు ఎంత ఢిమాండ్‌ పెరిగిందో చెప్పనక్లర్లేదు. కమల్‌, వర్మ లాంటివారు దీర్ఘదర్శులు.

ఇవాళ హిందీ సినిమాలో కశ్వప్‌లు, బెనర్జీలు, నంబియార్లు వంటి కొత్త తరం అంతా డిజిటలే వాడుతున్నారు. నాలుగు నిమిషాల రీల్‌కు వేల రూపాయలు పోసే బదులు గంటలకొద్దీ నామ్‌కే వాస్తే ఖర్చుతో సినిమా తీసే డిజిటల్‌ను ఎవరైనా అనుసరించకుండా ఎలా ఉంటారు. సినిమా రంగంలో ఇంకా ఫ్యూడల్‌ ఆలోచనలు సంప్రదాయలు బలంగా ఉండడం వల్ల సినిమా థియేటర్లు ఇంకా పూర్తిస్థాయిలో డిజిటలైజ్‌ కాకపోవడం వల్ల రివర్స్‌ టెక్‌లైన్‌ అవసరమవుతోంది కానీ అది కూడా పోతుంది త్వరలోనే. డిజిటట్‌ టెక్నాలజీ సినిమా రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తుందని, ఓ స్కూల్‌ టీచర్‌- ట్రక్కు డ్రైవర్‌ సినిమా తీసే రోజు ఐదేళ్లలో రాగలదని 2001లో శేఖర్‌కపూర్‌ ఆశించారు. సినిమా మేకింగ్‌ ఫైనాన్సియర్‌ల ధృతరాష్ర్ట కౌగిలినుంచి బయటపడి సృజనాత్మకత రెక్కవిప్పుకునే రోజు వస్తుందని ఆశించాడు. ఆయన కోరుకున్న స్థాయిలో కోరుకున్నంత త్వరగా కాకపోయినా ఇపుడా ప్రాసెస్‌ అయితే జరుగుతోంది. హిందీలో మంచి మార్పులే వస్తున్నాయి.

మేకింగ్‌ ఓకె. కానీ రిలీజ్‌ ఎక్కడా? మన ల్యాప్‌టాప్లో వేసుకుని ఫ్రెండ్స్‌కి చూపించుకుని వారు ఆహా ఓహో అంటే మురిసిపోవడమే. థియేటర్లు ఇచ్చే దిక్కెవరు? ఇక్కడే వర్మ మంచి ప్రయోగానికి పూనుకున్నారు. నిర్మాతకు-థియేటర్లకు మధ్య డిస్ర్టిబ్యూషన్ అనే వ్యవస్థను సింపుల్‌గా తీసేశారు. నేరుగా సినిమాను వేలంపాటలో పెట్టారు. థియేటర్ల వారు నేరుగా పాట పాడుకోవచ్చు. మధ్యలో ఆ ఉడ్డానలుగురో నలుగురో ఎవరూ ఉండరు. ఇపుడు అనుమానంగానే చూడొచ్చు. వర్మ ఏం పీకెన్‌ అని వ్యంగ్యంగా అనుకోవచ్చు. జూద లక్షణం ఉన్న రంగంలో ప్రయోగాలను అనుమానంగానే చూస్తారు. కానీ భవిష్యత్తు అలా ఉండదు. సినిమాను ఆ ఉడ్డా నలుగురికే ఎందుకు ప్రీవ్యూలో చూపాలి. థియేటర్ల వారు వస్తారు. చూసుకుంటారు. గిట్టుబాటవుతుందనుకుంటే పాటలో పాల్గొంటారు. నీ సినిమాలో సరుకు ఉందనుకుంటే అమ్ముడు పోతుందనుకుంటే కొంటారు. లేదంటే లేదు. మార్కెట్‌కు అడ్డుపడుతున్న ఫ్యూడల్‌ పద్థతిని తొలగించే ప్రయోగం ఇది. అసలు పూర్తిగా మార్కెట్‌నే ధిక్కరించే తిరుగుబాటుదారుల సంగతి వేరే. మళయాళంలో జాన్‌ అబ్రహాం ఆరంభించిన రాడికల్‌ ప్రయోగం ఆయనతోనే అంతమైపోయింది.

సినిమారంగం కొద్దిమంది కౌగిట్లోనే బందీ అయి ఉన్నది. వారు చూపిందే సినిమాగా ఉన్నది. మిగిలిన వారు అడుగుపెట్టాలంటే అనేక అడ్డుగోడలున్నాయి. ఈ అడ్డుగోడలు బద్దలు కొడితే కానీ కొత్త నీరు రాదు. ఏ రంగమైనా ప్రజాస్వామికీకరణ కావాలంటే కొత్త నీరు అవసరం. కొత్త ఆలోచనలు అవసరం. కేవలం డబ్బు మూటలున్నోళ్లకే అది పరిమితం కావడం ఎంత మాత్రం ఆరోగ్యకరమైనది కాదు. కాబట్టి ఆ రకంగా ఇది అవసరమైన మార్పు. మేము సైతం సినిమా రంగంలోకి రావచ్చు, మా ఆలోచనలను పంచుకోవచ్చు అనే ధైర్యం కల్పిస్తే ఆరోగ్యకరమైన వారు సినిమా రంగంలోకి వస్తారు. తమతో పాటు మార్పు తీసుకు వస్తారు. డిజిటల్‌ టెక్నాలజీతో పాటు మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌ కూడా వచ్చాక హిందీ సినిమాలో వచ్చిన మంచి మార్పులను చూస్తున్నాం. ఎన్ని మార్పులు! ఎన్ని ప్రయోగాలు! అక్కడ ఎందుకు సాధ్యమైంది? వాళ్లది విస్తృతమైన మార్కెట్‌. బిక్లాస్, సిక్లాస్‌లో ఆడకపోయినా అర్బన్‌ పీపుల్‌ మల్టీప్లెక్స్‌లో చూసినా వాళ్ల డబ్బులు వారికొచ్చే పరిస్థితి ఏర్పడింది. అటువంటి ధైర్యాన్ని మల్టిప్లెక్స్లులు కల్పించాయి. తెలుగులో మల్టీప్లెక్స్‌ మార్కెట్‌ అంతలేదు. మల్టీప్లెక్స్ ఆడియెన్స్తో పాటు చిన్న పట్నాల వాళ్లను కూడా కాస్తో కూస్తో ఆకర్షించే ఎలిమెంట్స్‌ కలిపి తెలివిగా తీస్తే నాన్‌ మసాలా సినిమాకు తెలుగులోనూ చోటుందని ఇటీవలే ఉయ్యాల జంపాల, ఊహలు గుసగుసలాడే లాంటి సినిమాలు నిరూపించాయి.

డిస్ర్టిబ్యూషన్‌ వ్యవస్థలో ఫ్యూడల్‌ అడ్డుగోడలు తొలగిస్తే అంతకంటే మంచి సినిమానే మనం ఆశించవచ్చు. వర్మ ప్రయత్నం ఆ దిశగా ముందడుగు అని భావించొచ్చు.

 

జి ఎస్‌ రామ్మోహన్‌

చిన్న విషయాలు కూడా పెద్ద బాధ్యతే!

myspace

నా అమెరికా ప్రయాణాలు-2

కొత్తగా జర్నలిజంలోకి వచ్చినవాళ్ళకి, లేదా కొత్తగా ఓ ‘బీట్’ వచ్చిన రిపోర్టర్ కి వార్తా ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. అన్నీ వార్తగా మలచదగ్గ అంశంగా  కనిపిస్తాయి. ఇక్కడినుంచి వెళ్ళిన వాళ్ళకి సరిగ్గా అలానే కనిపిస్తుంది — ముఖ్యంగా అమెరికా వ్యతిరేక క్యాంపు నుంచి వెళ్ళేవాళ్ళకి.

అమెరికా ఓ అసంబంధ అంశాల పుట్ట. ఎవ్వరైనా బతకదగ్గ మార్గాలుంటాయి. Dignity of labour వుంటుంది. నిన్న ఓ కంపెనీకి సీయీఓగా పనిచేసే ఆయన ఏదైనా రిటైల్ స్టోర్ లో హెల్పర్ గా దర్శనమివ్వొచ్చు మీకు. ఏదైనా టెక్నాలజీ కంపెనీకీలకమైన పదవిలో వున్న మహిళ అప్పటిదాకా తను చేసిన పనికి అస్సలే సంబంధంలేని, తక్కువ డబ్బులు వచ్చే పనిలో చేరవచ్చు. పిల్లల చదువులో సాయం చెయ్యడానికి చేస్తున్న వుద్యోగం నుంచి విరామం తీసుకునే లేదా పిల్లల కాలేజీల్లోనే చేరే తల్లిదండ్రుల్నీచూస్తాం.
కానీ, పిల్లల్ని అలా రాత్రికి రాత్రికి వదిలేసి వెళ్లిపోయే వాళ్ళనీ చూస్తాం. ఎక్కువసార్లు తల్లికే, ఆమె రెండు మూడు సార్లు పెళ్లి చేసుకున్నా సరే, ఆ బాధ్యత పడుతుంది. అన్ని పెళ్లిళ్ల ద్వారా కలిగిన పిల్లల బాధ్యత కూడా ఆమెదే.
పిల్లల నుంచి, ఆపదలో వున్న వారినించి వచ్చే ఫోన్లు విని నిమిషాల్లో వాలిపోయే పోలీసులూ వుంటారు. ఒకసారి, న్యూయార్కు హోటల్ లోంచి బయటకు ఫోన్ చేసినపుడు పొరపాటున 911 (హోటల్ బయటకు 9, లోకల్ నంబర్ కి 1, మళ్ళీ అనవసరంగా 1) డయల్ చేశాను. తప్పు తెలుసుకుని, నంబర్ కరెక్ట్ గా డయల్ చేసి ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా, ఈ లోపల డోర్ బెల్ మోగింది. ఎవరా, అని చూస్తే పోలీసులు! నేను చేసిన పొరపాటును చెప్పినా కూడా, రూమ్ లోకి వచ్చి చూసి “Are you sure? Are you okay?” అని తరచి తరచి అడిగిగాని వెళ్లలేదు.
కానీ, వాళ్ళు నిన్ను అనుక్షణం వెన్నాడుతున్నారని తెలుసు. నిన్నే కాదు అమెరికాలో, ప్రపంచంలోని అన్నీ దేశాల్లోని వాళ్ళనీ – రాత్రీ, పగలూ, ఆఫీసుల్లోనూ, పార్కుల్లోనూ, పార్కుల బయటా – నీడలా వెంటాడుతూ వుంటారనీ, గమనిస్తూ వుంటారని తెలుస్తూనే వుంటుంది. మనమొక పొటెన్షియల్ శత్రువుగా కనిపిస్తుంటామనీ కూడా మనకి తెలుసు.

చాలా దూరాలు కూడా నేను కొంచెం లగేజీతోనే వెళ్ళడం నాకిష్టం. సుఖంగా వుంటుంది బరువు లేకపోతే. ఓసారి దాదాపు కేబిన్ లగేజికి  (విమానంలోకి తీసుకెళ్లగలిగే బరువు) సరిపోయే బేక్ పేక్, చిన్న బేగ్ తో బయలుదేరా. ఓ ఫ్రెండ్ వారించాడు. ఇలా అయితే, విమానాశ్రయంనుంచే పంపించే అవకాశం వుందని.

అన్న్తట్టుగానే, ఇమ్మిగ్రేషన్ అధికారి: “నీ లాగేజి వివరాలు చెప్పు. చెకిన్ (మనతో కాక విడిగా వచ్చే లగేజీ) చేశావా,” అని.

ఇక ప్రకృతి వనరుల్ని వృధా చెయ్యొద్దు, పర్వావరణాన్ని రక్షించడాని మూడో ప్రపంచదేశాలకి పొద్దున్న లేస్తే పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చే అమెరికా, భూమికి చేసే నష్టం అంతా ఇంతా కాదు. అమెరికా కొన్ని చోట్ల పొగమంచు సమస్య వుంటుంది. ఇక్కడ లాగే. దానివల్ల డ్రైవింగ్ కష్టమై ప్రమాదాలు జరుగుతాయి.  అందువల్ల మనమైతే అవసరమైన లైట్లు రాత్రిపూట వేసుకుంటాం. కానీ, చాలాచోట్ల కార్లు, బస్సులు పగటిపూట, ఎండ దగదగ కొడుతున్నపుడు కూడా లైట్లతోనే తిరుగుతాయి. ఓ ఫ్రెండ్ చెప్పేడు, మరిచిపోతామేమోనని, డీఫాల్ట్ గానే వెలిగిపోతాయి లైట్లని.
వాహనాల ప్రస్తావన వచ్చింది కాబట్టి తప్పని సరిగా మాట్లాడుకోవాల్సింది ప్రజా రవాణా (public transport) గురించి. అమెరికాలో ప్రజా రవాణా మృగ్యం. నువ్వెక్కడికైనా వెళ్లాలంటే నీకో కారుండాలి. లేదా, కారుండే వాళ్ళు నీకు తెలిసుండాలి.
“ఓ రోజు ఫ్రీ పెట్టుకున్నా. అలా తిరిగొద్దామని” అని ఓ ఫ్రెండ్ తో అన్నాను. ఏ శాన్ ఫ్రాన్సికోలోనో, న్యూయార్క్ లోనో సాధ్యం అవుతుంది అలా తిరిగడానికి కారో, డబ్బో లేకపోతే ఎక్కడికీ వెళ్లలేవు,” అన్నాడు. (అలా, ఒంటరిగా తిరగగలిగే వూళ్లలో కూడా కొన్ని చోట్లకే వెళ్లగళం. పట్టపగలే నిన్ను స్టాక్ చెయ్యగలిగే వీధులు చాలానే వుంటాయి.)

ఏవో శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ లాటి ఒకటి రెండు నగరాలు మినహాయిస్తే, చాలా నగరాల్లో ప్రజా రవాణా సౌలభ్యం వుండదు. క్యాబ్లు మన పర్సులకి అందుబాటులో వుండవు. ప్రతి ఒక్క కుటుంబం తప్పనిసరిగా ఒక కారు (చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ కూడా అవసరపడతాయి) వుండి తీరాలి. అది ఆటోమొబైల్ రంగం, ఇంకా ఆ రంగానికి అనుబంధంగా వుండే పరిశ్రమలు ప్రజారవాణాని హరించి వేశాయి. ప్రభుత్వం ప్రజారవాణా నుంచి ఎన్నడో వైదొలిగిపోయింది. దగ్గరి దగ్గరి వూర్లకి వెళ్లడానికి, ఇంకా (ప్రజా రవాణా వున్నచోట్ల) last mile connectivity సొంత వాహనం లేకపోతే వెళ్ళడం దుస్సాధ్యం.

ఇక్కడిలాగ, ఎవరు కనపడితే వాళ్ళని ఎడ్రస్ అడగలేం కూడా. ఎందుకంటే, చాలా మందికి తెలీదు. (ప్రధాన రహదార్లు, వీధులు వదిలేస్తే.) కానీ, ఎడ్రస్ లు ఎంత సైంటిఫిక్ గా వుంటాయంటే కొంచెం కాళ్లలో పిక్క బలం వుంటే, ఓపిక వుంటే చాలావరకు మేనేజ్ చెయ్యొచ్చు. ఓ మంచి పేకేజ్ వున్న ఫోన్ చేతిలో వుంటే చాలా ఉపశమనం ఎడ్రస్ లు పట్టుకోవడంలో.

ఈసారి అమెరికా చదువులగురించి, చదువుపట్ల వాళ్ళకున్న జిజ్ఞాస, శ్రధ్ధగురించి…..

గమనిక: ముందు చెప్పినట్టుగానే, ఇక్కడి నా అభిప్రాయాలన్నీ highly subjective. నాకొద్ది exposure పరిమితులకి లోబడి.

 

ఎగిరే పావురమా! -7

egire-pavuramaa-7

సమాచారం దాఖలు చేసి, ఉమమ్మ అందించిన కాగితాలు తీసుకుని నర్సు చేతికిచ్చారు డాక్టరుగారు.

“గాయత్రిది జబ్బు కాదు. ఆమె స్థితిని అంగవైకల్యంగా పరిగణిస్తారు.
ఆసుపత్రి చేయగలిగిందల్లా సులువైన పద్ధతిలో, కనీసం ఒక కాలైనా మోకాలు వరకు తీసేసి కుత్రిమ కాలు అమర్చవచ్చు. దానికైనా గాయత్రికి పద్దెనిమిదేళ్ళు నిండితేనే మంచిది,” అని ఓ క్షణమాగారు ఆయన.

“ఇకపోతే, గాయత్రి మూగతనం పోయి మాట వస్తుందా? అని నిర్ధారించేవి మాత్రం, కొన్ని సున్నితమైన ‘స్వరపేటిక పరీక్షలు’. ప్రభుత్వాసుపత్రిలో అవి కుదరకపోవచ్చు. ఆ విషయంగా, ఇక్కడి పెద్ద డాక్టర్ గారు మిమ్మల్ని గుంటూరు లేదా హైదరాబాదులోని నిపుణల వద్దకు వెళ్ళమని సూచనలిస్తారు. ఎంతో సమయం, వ్యయం అవ్వొచ్చు,” అంటూ తాతకి నెమ్మదిగా వివరించారాయన.
అందరం శ్రద్ధగా వింటున్నాము.

క్షణమాగి మా వంక సూటిగా చూసారాయన.
“పోతే గాయత్రికి వినికిడితో పాటు మిగతా ప్రమేయాలన్నీ మామూలుగా ఉన్నాయి. బాగానే చదువుకుంటుందని కూడా తెలిసింది. కాబట్టి, సరయిన పద్ధతిలో వైద్యం అందితే ఆమె స్థితి మెరుగవుతుందనే ఆశించవచ్చు, ఆశిద్దాము,” అన్నారు డాక్టర్ గారు.

తాత ఉమమ్మ వంక చూసాడు.
“అయితే మీరు ఏమంటున్నారో దయచేసి మాకు అర్ధమయ్యేలా చెప్పండి. ‘క్రచ్చస్’, అదే ‘ఊతకర్రలు’ వాడమంటున్నారు, మరి తరువాత జరపవలసిన పరీక్షలవీ ఎప్పుడు? ఎక్కడ?” అని ఆగింది ఉమమ్మ.

“చూడండి ఉమాగారు, నేను ఇక్కడ ట్రైనింగ్ లో ఉన్న డాక్టర్ని. ముందు ‘ఊతకర్రల’ కి నర్సుని అవసరమైన వివరాలు, కొలతలు తీసుకోనివ్వండి. ఈ ఆసుపత్రి అనుబంధ సంస్థ ‘శ్రీ సత్య శారద చారిటీ’’ నుండి వారంలోగా గాయత్రికి వాడుకోడానికి ‘ఊతకర్రలు’ మీ చిరునామాకే వస్తాయి.

ఇకపోతే, గాయత్రి విషయమంతా దాఖలు చేసి మా పెద్ద డాక్టరుగారికి పంపిస్తాను. మీరు మళ్ళీ కొంత ఆగి, ఇక్కడ ఆసుపత్రిలో ఆయన్ని కలవచ్చు,” అని ముగించాడాయన.

ఆయన వద్ద సెలవు తీసుకొని, నర్సుకి కావలసిన కొలతలు, వివరాలిచ్చి బయటపడ్డాము.
**
తాత కూడా తన విషయంగా వైద్యుడిని చూశాడు. ఆయన ఆరోగ్యం బాగా పాడయిందని, ఎక్సురే తీసి, రక్తపరీక్షలు చేసారు. కడుపులో ఆమ్లత ఎక్కువుగా ఉందని, దాంతో కడుపులో వ్రణాల ఉదృత వల్ల కూడా బాగా కడుపు నొప్పి, మంట, వాంతులు తరుచుగా అవ్వొచ్చని చెప్పారు.
ఆమ్లతకి వెంటనే చికిత్సతో పాటు శ్రద్ధగా మందులు వాడకం, మంచి ఆహారం, విశ్రాంతి అవసరమని చెప్పారు. జాగ్రత్తలు చెప్పి మందులు రాసిచ్చారు.
అవి తీసుకొని ఇంటిదారి పట్టాము.
**
తాత దిగులుగా కనబడ్డాడు. కారులో తలా ఒక మాట మాట్లాడుతుంటే తాత మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
చంద్రం పిన్ని తాతకి మంచినీళ్ళ చెంబు అందించింది. నీళ్ళు తాగి మరచెంబు నాకందించాడు.

”గాయత్రి విషయంలో డాక్టరుగారు చేసే సాయం ఏదైనా మంచిదే, ఉమమ్మా. అయినా నా ప్రయత్నంగా మాత్రం పూజారయ్య చెప్పిన వికలాంగుల సంస్థని కూడా కలుస్తానమ్మా,” అని ఆమెతో అంటూ ఇంకాస్త ముందుకెళ్ళాక, పనుందని కారు దిగిపోయాడు తాత.

కాసేపటికి మమ్మల్ని కూడా కొట్టాం కాడ దింపేసి కారు ఉమమ్మ ఇంటి వైపు మళ్ళింది.
**
కొట్టాం చేరాక, పిన్నిచ్చిన గంజి తాగి, పుస్తకం చదువుతూ కూచున్నాను.
టీ కాచి తెచ్చుకొని, పక్కనే కూచుంది పిన్ని.

“మా కొట్టాంకెళ్ళి కాసేపట్లో మళ్ళీ నీ ముందుంటా. మీకు ఈ పూటకి కాస్త పప్పు, రొట్టెలు కూడా తెస్తా. ఈ లోగా అవసరం వస్తే పొయ్యికవతల కట్టిన గంట మోగించు,” అని మరి కాసేపటికి పిన్ని తమ కొట్టాంకి వెళ్ళింది.
**
సాయంత్రం చీకటి పడుతుండగా తాత రిక్షాలో దిగాడు. రిక్షాబ్బాయి సాయంతో లోనికొచ్చాడు. తాత ముఖం మీద, బట్టల మీద రక్తపు మరకలు చూసి భయపడిపోయాను.
తాతని పట్టుకు కుదుపుతూ ఆదుర్దాగా ఏమయిందని అడిగాను. వకీలు ఇంటినుండి రిక్షాలో వస్తున్న తాతకి విపరీతంగా దగ్గు మొదలయ్యిందంట. ఆ వెంటనే రక్తం కక్కుకున్నాడంట.
రిక్షాబ్బాయి సాయం చేసి మెల్లగా ఇంటికి చేర్చాడంట.

తాత ముఖం కడుక్కొని, బట్టలు మార్చి వచ్చేలోగానే పిన్నొచ్చింది. ఆమెని చూడగానే ఆపుకోలేక బిగ్గరగా ఏడ్చేసాను. తాత పడక పక్కనే కూచున్న నా కాడికి వచ్చి నన్ను దగ్గరికి తీసుకొంది.

అంతలో స్నానాల గది నుండి బయటపడి, కాళ్ళీడ్చుకుంటూ వచ్చి తన నులక మంచం మీద కూచున్నాడు తాత. సత్తువ లేకుండా అయిపోయిన తాతని చూసి మేమిద్దరం దిగాలు పడ్డాము.

కాస్తాగి పిన్ని వంక చూసాడు తాత. “పోతే చంద్రమ్మా, వికలాంగుల సంస్థ యజమాన్ని కలిసి గాయత్రి కోసం అర్జీ పెట్టాను. వకీలుని కలిసి పొలం విషయం మాట్లాడి, లంచాలకంటూ ముందస్తు డబ్బులు నా కాడ లేవని వివరించాను. చూడాలి దేవునిదయ. నా చేతుల్లో ఇకేమీ లేదమ్మా,” అంటూ మంచం మీద తొంగున్నాడు తాత.

తాత చెప్పింది ఒపిగ్గానే విన్నది పిన్ని.
”ఏదేమైనా విశ్రాంతి లేకుండా వొళ్ళు పాడయ్యేటంతగా అలిసిపోడం మంచిది కాదన్నా నీకు. ఇలా రక్తం కక్కుకోడం, నీరసం వచ్చి పడిపోడం డెబ్బైయేళ్ళ వయసులో ఏ రకంగా నీకు, నీ గాయత్రికి మంచిదో సెప్పు,” కోపంగా మాటలంటూనే పోయింది చంద్రం పిన్ని.

పిన్ని చెప్పేదంతా వింటూ కిక్కురు మనకుండా పడుకుండి పోయాడు తాత.
**
మరసటి రోజు పావుగంట ముందే నేను గుడికెళ్ళాను.

నన్ను చూస్తూనే గబగబా పరిగెత్తుకొనొచ్చింది కమలమ్మ.
“అబ్బో పిల్లా, వచ్చేశావా? ఒకే ఒక్కరోజు పువ్వుల్లాంటి నీ నవ్వులు సూడకపోతే పొద్దు పోలేదనుకో. నీ తానంలో నేను కూకుంటే గుడికోచ్చే నీ అభిమానులకి నచ్చలేదనుకో.
మా గాయత్రి ఎప్పుడొస్తుంది? అని ఒకటే గోల. నీ అందం అసుమంటిది మరి. నీ అవిటితనం పోతే అసలు నీ లెవెలే మారిపోతాదిలే,” గంటలా గణగణా మోగింది కమలమ్మ గొంతు.
నవ్వేసి ఊర్కున్నాను. పూజసామాను సర్దుతూ నాతో మళ్ళీ మాట కలిపింది కమలమ్మ. ఈ సారి నా విషయంలో డాక్టర్లు ఏమన్నారనడిగింది. తాతెందుకు రాలేదని అడిగింది.

‘నాకు ఇంకా వైద్య పరీక్షలు ఉంటాయని, తాతకి వొంట్లో బాగోక రాలేదని’ తెలియజెప్పాను.
నేను చెప్పిన వివరాలు చాల్లేదామెకి.
“మీ తాత కనపడ్డప్పుడు అడిగి తెలుసుకుంటాను. నీకేం తెలుస్తాదిలే? చిన్నపిల్లవి,” అంటూ కాస్త విసురగా అవతలకి వెళ్ళబోయింది.

వెళుతున్న ఆమెని చేయి పట్టి ఆపాను.
‘నిన్నటి రోజున పావురాళ్ళు వచ్చాయా? గింజలేసావా?’ అని సైగలతో అడిగాను.

“ఆ ఆ, ఎందుకు వేయను? బాగానే ఒకటికి రెండు మార్లు వచ్చి గింజలు మెక్కి, కావలసినంత గోల చేసి మరీ వెళ్ళాయిలేమ్మా,” రుసరుసమంటూ కదిలిందామె.
**
గుడిలో మధ్యాహ్నం రద్దీ తగ్గాక నా కాడ చేరింది కమలమ్మ. నా కిష్టమైన బెల్లం పాయసం అంటూ గ్లాసు అందించింది.

“మా గోవిందు, ఊరికి కాస్త దూరంగా విశాలమైన పాక కిరాయికి తీసుకున్నాడు. ఇన్నాళ్ళు ఎవరితోనో కలిసి సత్రంలోలా ఉండేవాడుగా!. ఇప్పుడు వాడి సొంత పాకలో కాస్త అదీ ఇదీ సర్ది, వాడికిష్టమైంది వండి పెడదామని, ఆదివారాలు మధ్యాహ్నాలు కాసేపు ఎళ్ళొస్తున్నా. నాకు కొడుకైనా, తమ్ముడైనా వాడేగా,” అని వివరించింది.

‘ఊ’ కొడుతూ వింటున్నాను. పాయసం బాగుందని సైగ చేసాను.
కబుర్లు చెబుతూనే ఉంది కమలమ్మ.
“ఈడ నుండి విశ్రాంతి కావాలంటే, హాయిగా గోవిందు పాకకి పోవడమే,” అన్నది మళ్ళీ సంబరంగా కమలమ్మ.
**
ఒక్కింత ఓపిగ్గానే ఉందంటూ ఖాయిలా పడి లేచిన మూడోరోజు చీకటితో నా రిక్షా వెనకాలే నడుస్తూ పనికొచ్చాడు తాత.
పూజసామాను సర్దుతున్న తాతతో మాట కలపాలని ఆత్రుతగా వచ్చింది కమలమ్మ.

“అయితే అన్నా, మరి డాక్టరు ఏమన్నాడు? మా గాయత్రికి మాట, నడక ఎప్పుడొస్తాయన్నాడు? మాకు తెలిసిన ఒకమ్మాయికి ఇలాగే ఉండేది. పట్నం డాక్టర్లు వైద్యం చేసి ఇప్పుడు చకచకా నడిపిస్తున్నారు. మన గాయత్రి లాగానే అప్సరసనుకో.
ఇక కాలు బాగయిన రెండేళ్ళకి ఓ గొప్పింటి కుర్రాడు ప్రేమించి పెళ్ళి కూడా చేసుకున్నాడు సత్యమన్నా. నిజ్జంగా, అమ్మతోడు,” అంది తల మీద చెయ్యెట్టుకొని నవ్వుతూ కమలమ్మ.
తాత కిమ్మనలేదు.
తన మాట చెప్పుకుంటూ పోయిందే గాని తాతకి నోరు విప్పి మాట్లాడే సందు ఇవ్వదుగా కమలమ్మ.
నాకేమో ఆ అమ్మాయికి వైద్యం చేసిన డాక్టర్లు ఎవరని కనుక్కుంటే బాగుండుననిపించింది.
egire-pavurama-7-revised
**
మధ్యాహ్నం పొంగలి ప్రసాదం తిని తాత కూరల బడ్డీ వైపు వెళ్ళగానే కమలమ్మ నా కాడికొచ్చి కూచుంది.
నడకొచ్చిన ఆ చుట్టాలమ్మాయి గురించి ఎలాగైనా అడగాలని అనుకుంటుండగా, ఆమే అందుకుంది.

“నే చెప్పేది నిజమేనే తల్లీ, నీకిప్పుడు పదిహేనేళ్ళు కదా! ఐదేళ్ల వయసు నుండి ఈడ ఇలా కొలువు చేస్తివి కదా! నీ హుండీ డబ్బే బోలెడంత కూడుకొనుంటుంది మీ తాత కాడ.
ఆ డబ్బు పెట్టి వైద్యం చేయిస్తే పోలా?
ఎంచక్కా మా చుట్టాలమ్మాయి లాగా బాగయిపోయి ఎవరినో ఎందుకు?
నీకు తెలిసిన నా తమ్ముణ్ణి పెళ్ళి చేసుకోవచ్చు,” క్షణమాగి నా వంక చూసింది…
ఏమంటుందో అర్ధం అవ్వలేదు నాకు…

“సవితితల్లి కొడుకన్న మాటేగాని, నా బిడ్డ లాంటోడేగా గోవిందు. కాస్త రంగు తక్కువేమో గాని బాగుంటాడు వాడు. ఆటో కూడా చేతికొచ్చేస్తే, రాజాలా సంపాదిస్తాడు.
వాడు ఒప్పుకోవాలే గాని, మంచి మొగుడౌతాడు నా తమ్ముడు,” నోటికొచ్చింది అంటూనే ఉంది కమలమ్మ.

నా తల గిర్రున తిరిగినట్టయింది. నా కాళ్ళ వైద్యం నుంచి పెళ్ళి వరకు వెళ్ళిపోయిన కమలమ్మ మాటల్లో నిజం ఉందా అనిపించింది.

ఆలోచనలో పడ్డాను.
‘అసలీ బుర్రలేని పెళ్లి మాటలేంటి? పిన్నికి, తాతకి అందుకే నచ్చదేమో కమలమ్మ తీరు’ అనుకుంటుండగా ……
“ఏమోలే, నువ్వా నోరులేని దానివి. ఇలాంటి ఇషయాలు మీ తాతతో, ఎలాగైనా నువ్వే తేల్చుకోవాలి. నిన్ను చూస్తే చానా కష్టంగా ఉంది. వైద్యం చేయిస్తే మాములు మనిషయ్యి చక్రం తిప్పగలవు నువ్వు,” అంది కమలమ్మ మళ్ళీ బిగ్గరగా నవ్వుతూ.

ఆమె మాటలకి ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ ఏదో ఒకటి ఇట్టాగే మాట్లాడుతుంది.

“అయ్యో నీతో మాటల్లో పడి మరిచేపొయ్యా. ఇయ్యాళ ఆదివారం కదా. ఈ సమయానికి మా తమ్ముడు వచ్చుంటాడు. వాడి పాక వరకు ఎళ్ళి గుడి తెరిచేలోగా, నాలుగింటికంతా వచ్చేస్తానే,” అంటూ రిక్షా ఆగే చోటు – గుడి వెనక్కి పరుగు తీసింది కమలమ్మ.
**
బయట సన్నగా తుప్పర పడుతుంది. ఇంకా తెల్లారలేదు. ఈ మధ్యనే నా కోసం తాత వేసిన కొత్త పరుపు మీద బాగా నిద్ర పడుతుంది. అయినా చీకటితో లేచి కూచున్నాను.
పరీక్షల భయం పట్టుకుంది. నాలుగు రోజుల్లో మాష్టారు పెట్టబోయే పరీక్షలు మునపటికన్నా మెరుగ్గా రాయాలంది ఉమమ్మ.

చదువుతూ ఆలస్యంగా తొంగోడంతో బద్ధకంగా ఉంది.
తాత లేచాడో లేదో తెలీలేదు.. పడక మీదనుండి లేవబోయాను….

కొట్టాం తలుపు తెరిచిన చప్పుడయింది. చూస్తే, చేతిలో ఎర్ర మందార పువ్వులతో, పిన్ని లోనికి వచ్చింది….

“లేరా గాయత్రి, ఇవాళ ‘అట్లతద్ది’. త్వరగా లేచి స్నానం చేసి తయారవ్వు. తాత కుట్టించిన కొత్త పరికిణీ వోణీ వేసుకో. నీ తలదువ్వి రెండు జడలు వేద్దామని వచ్చాను.
నీ జుట్టు పెద్దపని కదా. టైం పడుతుంది,” అంటూ నా ఎదురుగా చతికిల పడింది పిన్ని.
రాములు వెళ్లిపోయాక పండగలప్పుడు తప్పనిసరిగా నాకు రెండు జడలు వేస్తుందామె.
**
పొద్దున్నే, గుడికి రిక్షా అల్లంత దూరముండగానే సంతోషంగా ఎదురొచ్చింది కమలమ్మ. నాకు చేయందిస్తూ “ఈ రోజు ‘అట్లతద్ది’ ఆడపిల్లల పండుగ. పిండి రుబ్బి అట్లు వేయలేను గాని మధ్యానం బయట హోటలు నుండి మనకి అట్లు తెప్పిస్తాను గోవిందుతో,” అంది సంబరంగా కమలమ్మ.
ఒక్కోసారి కమలమ్మ చేసే హడావిడి తలనొప్పిగా ఉంటుంది నాకు.

(ఇంకా ఉంది)

అవును కదా గుల్జారే లేకపోతే –

M_Id_419679_Gulzar

అవును కదా గుల్జారే లేకపోతే –

సంతోషానికి పర్యాయ పదమేదో  తెలిసేది కాదు.
కన్నీటికి వుప్పుతనం వుందనీ  తెలిసేదే కాదు.
ప్రేమకి స్పర్శ వుంటుందనీ  తెలిసేది కాదు.
కోల్పోవటానికి వునికొకటి వుంటుందని తెలిసేది కాదు.

రహస్య స్థావరాల్లో మెలుకువే ఆయువని  తెలిసేది కాదు.

అవును ఆ ‘పూలతోటే ‘ లేకపోతే హృదయం అత్యంత భావరహిత పేదరికాన్ని చవిచూసేదేమో  బహుశా!!!
ఆ ‘మకరంద హృదయమే’ లేకపోతే –
మంచువాలుల్లో పాటల పూలవనాన్ని  విరగబూయించేదెవ్వరు.
ఆకాశాన్న వేలవేల అక్షర తారకల్ని  వెలిగించెదెవ్వరు.
నదీమ ప్రవాహంలో పదాల పడవల తెరచాపల్ని రెపరెపలాడించెదెవ్వరు.
నగర వీధుల్లో రణరణధ్వనులని జలపాతపు సవ్వడిలో నాట్యం చెయించెదెవ్వరు.
పురాత సైధీల్యపు నిశబ్ధంలోంచి రెండు ప్రేమల గొంతుని వెలిగించెదెవ్వరు.
అవును ఆ ‘పరాగ రేణువే’ లేకపోతే నిదురలేని రాత్రులల్లో భగ్న  ప్రేమికులకు ఆలపించేందుకు పాటలు మిగిలేవి కాదు కదా!!!
ఆ ‘శీతాకోకచిలుకే’ లేకపోతే –
ఆకుపచ్చని తోటల గాలినిండా శతసహస్ర రంగుల్ని మరెవ్వరు వెదచల్లేవారు.
అడివి దారుల్లో పేరు తెలియని పువ్వుల సోయగాన్ని వేరెవ్వరు పోల్చుకునేవారు.
లోయల వాలుల్లో మొలిచే గరిక పచ్చదనాన్ని చెవి వొగ్గి వినేదెవ్వరు.
మైదానాల సువిశాల మట్టి దారుల్లోని స్వేచ్చా సుగంధాన్నిశ్వాసించేదెవ్వరు.   
యెడారి చురచుర యెండమావుల్లో అసలుసిసలు వోయాసిస్సుని పట్టించెదెవరు.
గుల్జార్!!!
నువ్వే లేకపోతే పాట వొకే శిఖరం మీద నిలిచి వుండేది. పాటని మహాన్నత సంగీత శిఖరాలని అధిరోహింప చేసావ్.
అరవై వసంతాలుగా మా కవిత్వదాహం తీరుస్తున్న సజల నేత్రాలకవికి యెనభైవ పుట్టినరోజున వేలవేల రంగురంగుల తులీఫ్ పూల శుభాకాంక్షలు.!!!

-కుప్పిలి పద్మ.

Kuppili Padma Photo

మా అమ్మమ్మ కథని ప్రపంచానికి చెప్పడం అంతే!

brightfuture009-VJ

ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ ప్రశంస పొందిన అనువాద నవల “నారాయణీయం” మూల రచయిత వినయ్ జల్లాతో – అనువాదకుడు కొల్లూరి సోమ శంకర్ జరిపిన ఈమెయిల్ ఇంటర్వ్యూ…

***

హాయ్ వినయ్ గారు,

మీ మొట్టమొదటి నవల “Warp and Weft“ని తెలుగులో ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకులకు అందుబాటులోకి తెచ్చినందుకు ముందుగా అభినందనలు. ఈ పుస్తకాన్ని అనువదించే అవకాశం నాకు కల్పించినందుకు వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

ఇప్పుడు కాసేపు మీ రచనల గురించి, కెరీర్ గురించి, వ్యక్తిగత, వృత్తిపరమైన సంగతులు మాట్లాడుకుందాం.

ప్ర: మీ బాల్యం గురించి, విద్యాభ్యాసం గురించి కాస్త చెబుతారా?

జ: గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన బెంగుళూరు నగరంలో నేను పుట్టి పెరిగాను. నాకు మూడేళ్ళ వయసులోనే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుంచే బహుశా నాకు ఏకాంతమంటే ఇష్టం పెరిగిందేమో. నాదైన లోకంలో ఉండడం – జీవితం గురించి, ఇతర విషయాల గురించి ఆలోచించడానికి మార్గం చూపిందేమో.

నాకు చిన్నప్పటి నుంచీ కూడా చదువంటే పెద్దగా ఆసక్తి లేదు. పరీక్షలు పాసవడం కోసమే తప్ప చదువుని ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. బడికెళ్ళే పిల్లాడిగా, నాకు చదువు తప్ప, మిగతావన్నీ ఎంతో కుతూహలాన్ని కలిగించేవి. నేను బాగా చదువుకుని పైకి రావాలనేది మా నాన్న కోరిక. ఆయన కోరిక (నాది కాదండోయ్) తీర్చేలా బిజినెస్ మానేజ్‌మెంట్‍లో డిగ్రీ పూర్తి చేయగలిగాను.

 

ప్ర: రచయితగా ప్రయత్నించాలన్న ఆలోచన మీకు ఏ వయసులో కలిగింది?

జ: ఇంటర్మీడియట్ పరీక్షలలో ఫెయిల్ అయ్యాక, నాకు బోలెడు సమయం దొరికింది. రకరకాల పనులు చేయడానికి ప్రయత్నించాను. ఓ రోజంతా సేల్స్‌మాన్‌గా పనిచేసాను, కొన్ని నెలలపాటు కంప్యూటర్ ప్ర్రోగ్రామింగ్ నేర్చుకున్నాను… అంతే కాదు, మా కుటుంబం నడిపే ‘పట్టు వస్త్రాల వ్యాపారం’లోకి ప్రవేశిద్దామని ఆలోచించాను. అయితే ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక నిర్వహించిన కాప్షన్ రైటింగ్ పోటీలో గెలవడంలో, నాలో ఓ రచయిత ఉన్నట్లు నాకు తెలిసింది. అప్పుడు నా వయసు సుమారుగా 18 ఏళ్ళు ఉండచ్చు.

ప్ర: “Warp and Weftకన్నా ముందు ఏవైనా రాసారా?

జ: డిగ్రీ చదువుతున్నప్పుడు, వ్యాసాలు, చిన్న కథలు (పిల్లలకీ, పెద్దలకీ) వ్రాయడం ప్రారంభించాను. నా కథలు దేశవ్యాప్తంగా ప్రచురితమయ్యే దినపత్రికలు (డెక్కన్ హెరాల్డ్, ఏసియన్ ఏజ్, టైమ్స్ ఆఫ్ ఇండియా), పత్రికలలోనూ (ఎలైవ్, పిసిఎం.. మొదలైనవి) ప్రచురితమయ్యాయి.

Cover5.5X8.5Size

ప్ర: “Warp and Weft” (నారాయణీయం) నవల ఇతివృత్తం ఎంచుకోడానికి మీకు ప్రేరణ కలిగించినదెవరు?

జ: ధర్మవరం గ్రామంలో మా అమ్మమ్మ గడిపిన జీవితంలోని ముచ్చట్లు వింటుంటే నాకెంతో ఆసక్తిగా ఉండేది. ఆ ఘటలనకు కథా రూపం కల్పించాను, కాస్త పరిశోధనతోనూ, తగినంత కల్పన జోడించి ఈ నవల రాసాను.

ప్ర: మీపై అత్యంత ప్రభావం చూపిన రచయిత ఎవరైనా ఉన్నారా?

జ: శ్రీ ఆర్. కె. నారాయణ్, ఆయన మాల్గుడి కథలు! ఆయన నిరాడంబరత్వం నిజంగా అద్భుతం. నా నవలను చదివితే, అది చాలా చోట్ల ఆయన రచనలను ప్రతిబింబిస్తుందని గ్రహిస్తారు.

ప్ర: ఎన్నేళ్ళ నుంచీ రచనలు కొనసాగిస్తున్నారు?

జ: గత 18ఏళ్ళకు పైగా..

ప్ర: మీరు ఏ తరహా రచనలు చేస్తారు?

జ: బ్లాగులు, కమ్యూనిటీల కోసం నాన్ ఫిక్షన్ ఆర్టికల్స్ రాస్తాను. పిల్లల కథలు రాస్తాను. త్వరలోనే నా రెండో నవల మొదలుపెట్టబోతున్నాను.

ప్ర: మీ రచనలలో ఎటువంటి సాంస్కృతిక విలువలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు?

జ: కంటికి కనబడే జీవితాన్ని ప్రతిబింబిస్తాయి నా రచనలు. సాధారణంగా, రచనలు చేయడం కథన పద్ధతిని మెరుగుపరుస్తుంది.

ప్ర: మీ రచనా వ్యాసంగం పట్ల మీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటుంటారు?

జ: మొదట్లో అయితే, ఏదో ఒక రోజు నేను రచయతనవుతానని- వారు కలలో కూడా ఊహించలేదు. 1996లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో ప్రచురితమైన నా ఆర్టికల్ చదివాక, నన్ను బాగా ప్రోత్సహించారు.

ప్ర: ఈ నవల రాయడంలో మీకున్న లక్ష్యాలు, ఉద్దేశాలు ఏమిటి? అవి నెరవేరాయని భావిస్తున్నారా?

జ: 2001లో ఈ నవల రాయడం మొదలు పెట్టినప్పుడు, నాకు ప్రత్యేకమైన లక్ష్యం అంటూ ఏదీ లేదు. నా ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది – మా అమ్మమ్మ కథని ప్రపంచానికి చెప్పడం అంతే. నా నవలకి ప్రపంచ వ్యాప్తంగా… ముఖ్యంగా.. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇండియాల లోని పాఠకుల నుంచి చక్కని ప్రతిస్పందన వచ్చింది. తొలి నవలా రచయితగా, దక్షిణ భారత దేశంతో నా అనుభవాలు అనే అంశాలపై బిబిసి రేడియో నన్ను రెండు సార్లు ఇంటర్వ్యూ చేసింది. ఈ నవల ఇంగ్లాండ్‌లో.. “Waterstone’s, WH Smith, Amazon, Blackwell” వంటి అన్ని ప్రముఖ పుస్తక సంస్థలలోనూ, ఇంకా అంతర్జాతీయంగా ఉన్న 70కి పైగా ఆన్‌లైన్ రిటైలర్ల వద్ద లభిస్తోంది.

warp-and-weft-full-cover

 

ప్ర: ఈ నవల కోసం పరిశోధన చేస్తున్నప్పుడు మీకు తారసపడ్డ వ్యక్తుల గురించి కాస్త చెబుతారా?

జ: ఈ నవలలోని పాత్రధారులను సృష్టించడం కోసం నేనెంతో మంది ఆసక్తికరమైన వ్యక్తులను కలిసాను. ముఖ్యంగా, ఈ నవలలోని ఇద్దరు ప్రధాన పాత్రలను పోలిన వ్యక్తులు ఉన్నారు. రామదాసు పాత్ర దాదాపుగా మా నాన్నగారిలానే ఆలోచిస్తుంది. శ్రీరాములు పాత్ర మా దూరపు బంధువుకి ప్రతిరూపం.. కాస్త నత్తితో సహా.

ప్ర: ఈ నవలలో ఏ భాగం రాయడం మీకు కష్టమనిపించింది?

జ: నా నవల చీరలు నేయడం గురించి, నేతగాళ్ళ జీవితాలను స్పృశిస్తూ సాగుతుంది.. సరైన సాంకేతిక పదాలను ఉపయోగించాల్సి రావడం ఒక్కోసారి ఇబ్బందిని కలిగించింది.

ప్ర: ఈ పుస్తకంలోని ఏ భాగం మీకు బాగా నచ్చింది?

జ: 1950లలో తిరుమల ఎలా ఉండేదో రాసిన అధ్యాయం, అప్పటి భక్తిప్రపత్తుల ప్రస్తావన గురించి రాయడాన్ని నేను బాగా ఆస్వాదించాను.

ప్ర: జీవితం ఇప్పుడున్న స్థాయికి ఎలా చేరారు?

జ: నా జీవితంలోని ప్రతీ దశలోనూ.. స్వర్గస్తురాలైన మా అమ్మ ఆశీర్వాదం ఉందని నేను నమ్ముతాను. అదే నాకు జీవితంలోని ప్రతీ దశలోనూ.. నాకో ఆశ్చర్యకరమైన, ఘనమైన విశేషాన్ని అందిస్తోందని భావిస్తాను.

ప్ర: ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి మీరేం చేసారు? ఏ పద్ధతి పాటించారు?

జ: అనుకున్నంత తేలికగా ఈ నవల ప్రచురితమవలేదు. 2001లో ఈ నవలని వన్-సైడెడ్ పేపర్ల మీద రాసాను. అప్పట్లో కంప్యూటర్ కొనుక్కునే స్థోమత నాకు లేదు. ఓ డోలాయమానమైన నిర్ణయం తీసుకుని, విలేఖరిగా బెంగుళూరులోని నా ఉద్యోగాన్ని వదిలేసాను. ఏడు నెలల వ్యవధిలో 2,50,000 పదాలు రాసాను.

ఈ పుస్తకాన్ని ప్రచురించడం కోసం 2001నాటి శీతాకాలంలో ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టాను. నా నవల చాలా నిరాదరణకి గురైంది. ప్రచురణకర్తలు ఉపేక్షించారు. ఎందరో పబ్లిషర్ల చుట్టూ తిరిగాను, ఏజంట్లను మార్చాను. అయినా ఫలితం లభించలేదు. చివరకి సెల్ఫ్-పబ్లిష్ చేసుకునేందుకు అమేజాన్ వాళ్ళని సంప్రదించాను. మొత్తానికి నా నవల వెలుగుచూసింది. భారతదేశంలో అంతగా పేరు పొందని ప్రాంతం గురించి అందరికీ చెప్పగలిగాను.
ప్ర: మీకూ మిగతా రచయితలకూ తేడా ఏమిటి? మీ విలక్షణత ఏమిటి?

జ: బిబిసి రేడియో వాళ్ళు కూడా నన్ను ఇదే ప్రశ్న అడిగారు. నా నవల చీరలు నేయడం గురించి, నేతగాళ్ళ జీవితం గురించి లోతుగా ప్రస్తావిస్తుంది. ముఖ్యంగా, తెలుగేతర ప్రాంతాలకి చెందినవారికి, తెలుగు వారసత్వం, సంస్కృతి గురించి చాల తక్కువ విషయాలు తెలుస్తాయి. ఈ నవలలో అవి చాలా స్పష్టంగా వ్యక్తమవుతాయి.

ప్ర: మీ మొదటి నవలని పబ్లిష్ చేసుకోడంలో మీరు ఎదురైన సవాళ్ళు ఏవి?

జ: నవల రాయడం ఒక ఎత్తైతే, దాన్ని ప్రచురింప జేసుకోగలడం మరొక ఎత్తు. నా కథని విశ్వసించే లిటరరీ ఏజంట్‌ని పట్టుకోగలగడం నాకు నిజంగానే సవాలైంది.

ప్ర: ఒక్కసారి వెనక్కిమళ్ళి, ఈ పుస్తకాన్ని మొదటి నుంచి రాయాల్సివస్తే, ఈ నవలలోని ఏ భాగాన్నైనా మారుస్తారా?

జ: నవలలోని ప్రధాన భాగాలు వేటినీ మార్చను… కానీ ముగింపుని మరికాస్త వాస్తవికంగా ఉండేట్లు రాస్తాను.

ప్ర: ఓ రచయితగా మీకు ఎదురైన తీవ్ర విమర్శ ఏది? అలాగే ఉత్తమ ప్రశంస ఏది?

జ: నిర్మాణాత్మక విమర్శలు చాలా వచ్చాయి. నేను వాటి నుంచి నేర్చుకుంటున్నాను. పోతే, నాకు లభించిన ఉత్తమ ప్రశంస శ్రీ ఆర్. కె. నారాయణ్ నుంచి. రాయడం మానద్దని ఆయన ప్రోత్సహించారు.

 

ప్ర: చివరగా, సారంగ పాఠకులకు ఏమైనా చెబుతారా?

జ: ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు, నా నవలను చదివి వారి స్పందనని నాకు తెలియజేయమని అడగడం తప్ప. నా వెబ్‌సైట్ www.vinayjalla.co.ukద్వారా నన్ను సంప్రదించవచ్చు.

ప్ర: ఈ ఇంటర్య్వూకి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు వినయ్ గారు. మీరు మరిన్ని రచనలు చేసి రచయితగా రాణించాలని కోరుకుంటున్నాను.

జ: థ్యాంక్యూ, సోమ శంకర్ గారు. నా ఈ ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చిన సారంగ వెబ్ పత్రిక ఎడిటర్లకి నా ధన్యవాదాలు. నమస్కారం.

 ముఖాముఖి: కొల్లూరి సోమశంకర్

 

ఆప్తవాక్యం

 

yandmuriఎవరైనాఒకరచయితతనపుస్తకానికిముందుమాటవ్రాయమంటే, కొంచెంకష్టంగానేఉంటుంది. వ్రాయటానికికాదు. ఆపుస్తకంమొత్తంచదవాలికదా. అందుకు (కొందరైతేచదవకుండానేవ్రాస్తారు. అదిమంచిపద్దతికాదు).

రచయితలబ్దప్రతిష్టుడైతేపర్వాలేదు. కొత్తవాడైతేమరీకష్టం. అందులోనూఅదిఅనువాదంఅయితేచదవటంమరింతరిస్కుతోకూడినవ్యవహారం.

ఇన్నిఅనుమానాలతోఈపుస్తకంచదవటంమొదలుపెట్టాను. మొదటిపేజీచదవగానేసందేహాలన్నీపటాపంచలైపోయినయ్. మొదటివాక్యమేఆకట్టుకుంది. ఇకఅక్కడినుంచీఆగలేదు.

ఆంగ్లరచయితతాలుకుఇదిమొదటిరచనోకాదోనాకుతెలీదు. సబ్జెక్టుమీదఎంతోగ్రిప్ఉంటేతప్పఈరచనసాధ్యంకాదు. కేవలంకథాంశమేకాదు. పాత్రపోషణ, నాటకీయత, క్లైమాక్స్అన్నీబాగాకుదిరాయి.

అనువాదకుడిగురిచిచెప్పకుండాముగిస్తేఅదిఅతడికిఅన్యాయంచెయ్యటమేఅవుతుంది. ఒక్కమాటలోచెప్పాలంటే: చెప్తేతప్పఇదిఅనువాదంఅనితెలీదు. అంతబాగావ్రాసాడు.

ఇద్దరికీఅభినందనలు.

యండమూరి వీరేంద్రనాథ్.

21-6-14

 

పన్నెండు రూపాల ప్రేమ!

Mythili
ఒకానొకప్పుడు ఫెయిరీల రాణిని ఎన్నుకోవటానికని పోటీ పెట్టారు. సుక్రాంటైన్, పరిడైమీ ఇని ఇద్దరు ఫెయిరీలు అన్ని విషయాలలో గొప్పవాళ్ళని తేలింది. వాళ్ళలో ఏ ఒక్కరిని రాణిగా చేసినా రెండోవారికి అన్యాయం జరిగేంత సమానం గా ఉన్నారు. అందుకని అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. చలికాలం లో మామిడి పళ్ళు కాయించటం, వానచినుకులకి మల్లెపూల వాసన తెప్పించటం…ఇలాంటి మామూలు ఇంద్రజాలాలు కాకుండా , ఇప్పటివరకూ లేని ప్రత్యేకమైన వింతని సృష్టించాలి. ఎవరి వింత ఎక్కువ విడ్డూరంగా ఉంటే వాళ్ళు రాణి అవుతారు. ఎంత కాలం పట్టినా సరే, చేసి చూపించాలి. ఈ లోపు నలుగురు ముసలి ఫెయిరీలు కలిసి రాజ్యం బాగోగులు చూసే ఏర్పాటు చేశారు.

సుక్రాంటైన్ ఒక రాజకుమారుడిని పెంచుతుంది. అతనికి ఎప్పుడూ ఎందులోనూ కుదురు అన్నదే ఉండకూడదు. పరిడైమీ ఒక రాజకుమారిని పెంచుతుంది. ఆమెను చూసిన ఎవరైనా సరే ప్రేమలో పడిపోవలసిందే. ఇవీ వాళ్ళు చేసి చూపాలనుకున్నవి. రాజకుమారిని చూసి ప్రేమలో పడని వారెవరైనా ఉంటే పరిడైమీ ఓడిపోయినట్లు. రాజకుమారుడికి కుదురు వచ్చిందా, సుక్రాంటైన్ ఓడిపోయినట్లు పరిడైమీ ఒక రాజూ రాణీ లతో పరిచయం పెంచుకుంది. రాజు బార్డండన్ చాలా మంచివాడు. తన ప్రజలని ఎంతో బాగా చూసుకునేవాడు. రాణి బాలనీస్ కూడా అంతే. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గొప్ప ఇష్టం. వాళ్ళకి చిన్న కూతురు ఉంది. తన బుగ్గ మీద చిట్టి రోజా పువ్వు లాంటి పుట్టుమచ్చ ఉండటం తో ఆ పాపని ‘ రోజానెల్లా ‘ అని పిలిచేవారు. తను ఎంత చురుకైనదంటే, ఎంత తెలివిగా మాట్లాడుతుందంటే రాజసభలో అందరికీ ఆమె మాటలు కంఠతా వచ్చేవి.

ఒక అర్ధరాత్రి రాణి ఉలిక్కిపడి నిద్ర లేచింది. తన చిట్టి పాప గులాబీపూలగుత్తి గా మారిపోయినట్లూ ఒక పక్షి దాన్ని తన్నుకుపోయినట్లూ ఆమెకి పీడకల వచ్చింది. వెళ్ళి చూస్తే రోజానెల్లా నిజంగానే మాయమైంది. ఎంత వెతికినా కనిపించనే లేదు.రాణి ని ఓదార్చటం ఎవరివల్లా కాలేదు. రాజు త్వరగా బయటపడే మనిషి కాదుగానీ ఆయనా దిగులుపడిపోయాడు. రాజధానిని వదిలి ఒక పల్లెటూళ్ళో ఉన్న ఇంటికి వెళ్ళారు ఇద్దరూ , కొంతకాలం ఉందామని.
ఒక చల్లటి సాయంకాలం చెట్లనీడలో కూర్చుని ఉన్నారు అక్కడ. ఆ ప్రదేశం పన్నెండు కోణాల నక్షత్రం ఆకారం లో ఉంది. ప్రతి కోణం లోనూ ఒక కాలిబాట.

ఒక్కొక్క బాట లోంచి ఒక యువతి, నవ్వు మొహంతో నడుచుకుంటూ వచ్చింది. ఒక్కొక్కరూ ఒక్కొక్క అల్లికబుట్ట తో వచ్చారు. ” రాణీ ! మీ పాప కనబడటం లేదు కదా, ఈ పాపను పెంచుకోండి ” అని వాటన్నిటినీ ఆమెకి ఇచ్చారు. మాయమైన రాజకుమారి వయసే ఉన్న పాపలు ఉన్నారు ఆ బుట్టలలో. చూడగానే ముందర రాణి రోజానెల్లా కోసం బెంగ పడింది. మెల్ల మెల్లగా ఆ పాపలు ఆమెకి ముద్దొచ్చారు. ఉయ్యాలలూ వాటిని ఊపేవాళ్ళూ , బోలెడన్ని బొమ్మలూ ఆడించేవాళ్ళూ , రుచి అయిన తినుబండారాలూ తినిపించేవాళ్ళూ ,ఎత్తుకు తిప్పేవాళ్ళూ ఇలా అన్నిటినీ , అందరినీ రాణి పురమాయించింది. ఆ హడావిడిలో ఆమె తన బాధ మరిచిపోయింది. ఆశ్చర్యకరంగా, ఈ పన్నెండు మంది పాపలకీ బుగ్గ మీద రోజా పూవు ఆకారంలో పుట్టుమచ్చ ఉంది. అందరూ ఒక చోట ఉన్నప్పుడు పెద్ద పూలగుత్తిలాగానే కనిపించేవారు. ఒక్కొక్కరికీ ఒక రంగు పేరు పెట్టుకుంది రాణి. వాళ్ళు అందరూ తెలివైనవారే.

అందరూ బాగా చదువుకునేవారు. అయితే అందరూ మంచిపిల్లలే కానీ ఒక్కొక్కరి తీరు ఒక్కొక్కలా ఉండేది. అదివరకు వాళ్ళని ” పాటలీ , ఇంద్రనీలా, శ్వేతా ” అని పిలుచుకునే రాణి ఇప్పుడు వాళ్ళు ఎదిగేకొద్దీ స్వభావాన్ని బట్టి ” ఆనందినీ, మధురిమా, సాంత్వనా ” ఇలా పిలవటం మొదలుపెట్టింది. అందరూ పెరిగి పెద్దయి సొగసైన అమ్మాయిలు అయారు. ఆ నోటా ఈనోటా వాళ్ళ కబుర్లు విని వాళ్ళని పెళ్ళాడేదుకు దేశదేశాలనుంచి రాకుమారులు వచ్చేవారు. అమ్మాయిలని కలుసుకుని పొగిడి ఒప్పించాలని చూసేవారు. వీళ్ళు మాత్రం ఎవరినీ ప్రేమించలేదు, వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటుండేవారు.

draft_lens18387266module152630148photo_1314117728andrew_lang_fairy_books.j
రాజు బార్డండన్ కి మేనత్త కొడుకు ఇంకొక రాజు ఉన్నాడు. ఆయనకి ఒక కొడుకు, అతని పేరు మిర్లిఫ్లోర్. రెండో ఫెయిరీ సుక్రాంటైన్ ఈ రాజకుమారుడిని కుదురు లేనివాడిగా చేయాలని నిర్ణయించుకుంది. అందం, ఆరోగ్యం, తెలివి తేటలు, మంచితనం అన్నీ అప్పటికే ఉన్న ఆ అబ్బాయిని చాలా చాలా ఆకర్షణీయమైనవాడిగా తయారుచేసింది. అతను కోపంగా ఉన్నా శాంతంగా ఉన్నా, అలంకరించుకున్నా సాదాసీదా గా ఉన్నా, గంభీరంగా ఉన్నా సరదాగా ఉన్నా – ఎప్పుడూ అందరినీ ఆకట్టుకోగలిగేవాడు. అతనికి అన్నీ ఉన్నాయి, కుదురు ఒకటి తప్ప. పద్దెనిమిదేళ్ళు నిండేసరికి రాజ్యం లోని అందరు అమ్మాయిలకీ అతను నచ్చటం, వాళ్ళు ఇతనికి మొహం మొత్తటం కూడా అయిపోయాయి. సరిగ్గా అప్పుడు బార్డండన్ రాజ్యానికి రమ్మని అతన్ని ఆహ్వానించారు.

ఒక్కసారిగా పన్నెండు మంది అపురూపమైన అమ్మాయిలు కనబడ్డారు. అతను ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. అందరూ అతనికి నచ్చేశారు, వాళ్ళందరికీ ఇతనూ అంతగానూ నచ్చాడు. అందరూ ఒకే చోట లేకపోతే అతనికి తోచేది కాదు. ఒకరి మాటలు విని నవ్వేవాడు, ఒకరితో తను ముచ్చట్లు చెప్పేవాడు . ఇంకొకరి తో కలిసి కవిత్వం చదివేవాడు, మరొకరితో మౌనంగా ఉండేవాడు. ఒకరితో సంగీతం , ఇంకొకరితోపువ్వులూ పిట్టలు , మరొకరితో ఆకాశం, నీటి మబ్బులు. . గుబులుగా అనిపిస్తే ఒకరు ఊరట, అల్లరి చేసేందుకు ఒకరు తోడు. తన జీవితంలో అతను మొదటిసారి ప్రేమలో పడ్డాడు. అయితే అది ఒక్కరితో కాదు, పన్నెండు మందితో. అతన్ని మార్చిన ఫెయిరీ సుక్రాంటైన్ అనుకుంది, ఇంతకన్న కుదురు లేకపోవటం ఏముంటుందని. పరిడైమీ మాత్రం ఒక్క మాటా మాట్లాడలేదు.

రాజకుమారుడు మిర్లిఫ్లోర్ వాళ్ళ నాన్న అతన్ని ఇంటికి రమ్మని ఎన్నో సార్లు కబురు చెశాడు. ఏవేవో పెళ్ళిసంబంధాల సంగతులు వచ్చిపడుతున్నా మిర్లిఫ్లోర్ తనని కట్టిపడేసిన ఈ పన్నెండుమంది మంత్రగత్తెలని వదిలి వెళ్ళనేలేకపోయాడు.

ఇంతలో ఒక పండగనాడు రాణి ఉద్యానవనం లో విందు ఏర్పాటు చేసింది. అతిథులంతా వచ్చారు. ఆ తోటలో యథాప్రకారం మిర్లిఫ్లోర్ తన సఖులందరితోనూ ఉన్నప్పుడు జుమ్మని తేనెటీగల శబ్దం వినిపించింది. పన్నెండుమంది అమ్మాయిలూ రోజా పూవులో ఏమో , భయపడి దూరంగా పరుగెత్తారు. తేనెటీగలు వెంటపడ్డాయి. చూస్తుండగానే అవి ఇంతింత పెద్దవై రోజా కన్యలని ఎత్తుకు వెళ్ళిపోయాయి. రెప్పపాటులో ఇదంతా జరిగిపోయింది. అంతా నిర్ఘాంత పోయారు.

మిర్లిఫ్లోర్ ముందు విపరీతంగా దుఃఖ పడ్డాడు, ఆ తర్వాత ఏమీ పట్టకుండా , ప్రపంచం లో లేనట్లుగా అయిపోయాడు. ఏదో ఒకటి అతన్ని కదిలించకపోతే అసలు బ్రతుకుతాడా అనిపించింది. ఫెయిరీ సుక్రాంటైన్ ఓదార్చే ప్రయత్నం ఎంతో చేసింది. సుందరులైన రాజకుమార్తెల చిత్తరువులు తెచ్చి చూపించింది. అతను చీదరించుకున్నాడు. ఫెయిరీకి ఏం చేయాలో తోచలేదు ఇంక.

ఒక రోజు పిచ్చివాడిలాగా అతను అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఉన్నట్లుండి పెద్ద కలకలం చెలరేగింది. సూర్యకాంతిలో తళతళ మెరుస్తూ స్ఫటికపు రథం ఒకటి పైనుంచి దిగి వస్తోంది. రెక్కలున్న చక్కటి అమ్మాయిలు ఆరుగురు రోజా రంగు పట్టుతాళ్ళతో ఆ రథాన్ని లాగుతున్నారు. ఇంకా ఎందరో అందగత్తెలు పొడుగాటి పూల హారాలు పట్టుకుని ఆ పైనంతా రంగుల పందిరి వేసేశారు. ఆ రథం లో ఫెయిరీ పరిడైమీ కూర్చుని ఉంది, ఆ పక్కనే ఒక అత్యంత సౌందర్యవతి అయిన రాజకుమారి ఉంది. సరాసరి రాణి బాలనీస్ మేడకి వెళ్ళారు వాళ్ళిద్దరూ, ఆ వెనకే అబ్బురపడే జనం అందరూ.

” మహారాణీ , ఇదిగో మీ అమ్మాయి రోజానెల్లా ” అంది పరిడైమీ.
ఊహించనిది జరిగిన సంతోషం లో రాణి మునిగిపోయింది. అంతలోనే అడిగింది-
” మరి నా పన్నెండు మంది బంగారు తల్లులూ ఏరీ ? ఇంక నాకు కనిపించరా ? ”
పరిడైమీ ఒకే మాట అంది ” త్వరలోనే వాళ్ళందరినీ నువ్వు మరచిపోతావు ”
ఆ అనటం నన్ను ఇంకేమీ అడగవద్దు అన్నట్లుంది. తన రథం ఎక్కి సుక్రాంటైన్ వెళ్ళిపోయింది.

image185
చిన్నప్పుడే తప్పిపోయిన రాజకుమారి తిరిగి వచ్చిందని మిర్లిఫ్లోర్ కి తెలిసింది. ఆమెను చూడాలనే ఆసక్తి ఏమీ అతనికి లేనే లేదు. తప్పనిసరిఅయి, మర్యాద కోసం, ఆమెని కలవటానికి వెళ్ళాడు. ఆమెతో అయిదు నిమిషాలు ఉండగానే అతనికి తాను పోగొట్టుకున్న పన్నెండుమంది లక్షణాలూ ఆమెలో కనిపించటం మొదలెట్టాయి . కాసేపట్లోనే ఒళ్ళు తెలియనంత సంతోషం లో కూరుకుపోయాడు. తనని పెళ్ళాడమని రాజకుమారిని అడిగాడు.

సరిగ్గా అప్పుడే పరిడైమీ ప్రత్యక్షమయింది. విజయగర్వం తో వెలిగిపోతోంది . తను పెంచిన రాజకుమారిని చూసిన ఎవరైనా సరే ప్రేమలో పడాలి, మిర్లిఫ్లోర్ అలాగే అయాడు. పరిడైమీ తను రోజానెల్లా ని ఎలా ఎత్తుకువెళ్ళిందీ, ఆమె ను పన్నెండుగా విడగొట్టి ఒక్కొక్కరితోనూ మిర్లిఫ్లోర్ ప్రేమలో పడేలా ఎలా చేసిందీ , కథ అంతా చెప్పుకొచ్చింది. పన్నెండుగురూ ఒకటి అయిన రోజానెల్లా ను ఇప్పుడు మిర్లిఫ్లోర్ ప్రేమిస్తున్నాడు, ఆమె పన్నెండు గుణాలకీ విడి విడిగా. అన్నీ ఆమె లోనే ఉన్నాయి కనుక అతనికి మరెవరూ అక్కర్లేదు. సుక్రాంటైన్ కుదురు లేకుండా చేద్దామనుకుంది, ఇతను ఈ రకంగా కుదురుగా అయిపోయాడు, ఆమె ఓడిపోయింది.

అయినా రోజానెల్లా ను ఇష్టపడకుండా సుక్రాంటైన్ ఉండలేకపోయింది. ఆ రాజకుమారి అంత అద్భుతమైనది. మిర్లిఫ్లోర్, రోజానెల్లా ల పెళ్ళివిందుకు సుక్రాంటైన్ హాజరైంది. అందమైన కానుక కూడా ఇచ్చింది. పన్నెండు రూపాలలో తను అతన్ని ప్రేమించిన ప్రేమనంతా రోజానెల్లా , మిర్లిఫ్లోర్ మీద కురిపిస్తూ ఉంది. వాళ్ళిద్దరూ సంతోషంగా , శాంతంగా చిరకాలం జీవించారు.

 

ఫ్రెంచ్ జానపద కథ [ by Comte de Caylus , early 17 th century ] సేకరణ – Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

లోగో: మహీ బెజవాడ

ఒక ‘తుఫాను తుమ్మెద’ పుట్టిన రోజు

పంద్రాగస్టు ప్రసిద్ధ కవి దేవిప్రియ పుట్టిన రోజు

index

మొదటి సారి ‘దేవిప్రియ’ పేరు విన్నపుడు కొత్తగా అన్పించింది.అమ్మాయి పేరు అనుకున్నాను కూడా.

కాదని తెలియడానికి ఎక్కువ కాలం పట్టలేదు.ఎప్పుడు ‘దేవిప్రియ’ను తొలిసారి చూసానో బాగా గుర్తుకు లేదు. బహుశా ‘ద్వారక’లోనేమో ! చూడగానే ఇతను పీరియడ్ వ్యక్తి కాబోలనుకున్నాను. కానీఆయనతో సంభాషణకు దిగాక తెల్సింది చాలా informal అని. చాలా సాదాసీదామనిషని. అంతేనా ! చాలా లోతున్న కవి అని కూడా. సోవియట్ పరిణామాల నేపథ్యంలోఆయన రాసిన ‘హిట్లర్ నవ్వు’ కవితను చదివాక నేను సీరియస్ గా చదవాల్సినకొద్దిమందిలో ఆయన ఒకరైనారు. చదివాను. పైపైన కాదు. నిమగ్నతతో చదివాను.అప్పుడు తెల్సింది – దేవిప్రియ కవిత్వం ఒక పాయగా కాక అనేక పాయలుగాసాగుతుందని. ఆయన range of poetry చాలా విశాలమైందని. వైవిధ్యంతోకూడుకున్నదని కూడా. ఏది రాసినా ఇష్టంగా రాసుకుంటాడని. తేటగానూవ్యక్తమవుతాడని.

నాకు దేవిప్రియ ఇష్టం కావడానికి కారణాలు చాలానే వున్నా, ప్రధానమైనది – ఆయన కవిత్వంలో వస్తువూ, కవితాకాంతీ ఏకకాలంలో తళుక్కుమనడం.మాటను ఔచిత్యంతో వాడడం ఆయన conscious పద్ధతి. ఎవరి ఛాయలోనో కాక తనదైనదారిలో నడుస్తాడు. ఈ ‘తనదైన’ శైలే అతని చేత చాలా ప్రయోగాలు చేయించింది.ఆయన పుస్తకాల పేర్లు నవ్యంగా వుంటాయి. ఇటీవలి ‘గాలి రంగు’ దానికి తాజాఉదాహరణ. ఏకకాలంలో పద్యాలు రాస్తారు. వచన కవిత్వం రాస్తారు. రన్నింగ్కామెంటరీ చెబుతారు. ఏదీ కృతకంగా వుండదు. తాజాగా, అతని ఇష్టంలా వుంటుంది.
ఆయనలో ఒక మూల ఏదో సినిమా కూడా కదుల్తూ వుంటుంది. ఇన్నిటికీ తనలో distinct ఏర్పరుచుకోగలరాయన. భిన్నతలాల్ని కలగాపులగం చేయడు !

ఇప్పుడున్న సాహిత్య వాతావరణంలో దేవిప్రియలాంటి సాహిత్యకారులఅవసరం ఎక్కువ వుంది. ఇంత చేసాను, అంత చేసాను అనే స్వోత్కర్షల బడాయిలేనివాళ్ళ అవసరం. ప్రేమతో, నిస్సవ్వడిగా పని చేసే వాళ్ళ అవసరం. కవిత్వమన్నాకకవిత్వం – రాసే దానికి వుండీ తీరాలని పలికే వాళ్ళ అవసరం. కొత్తసృజనకారుల్నీ, కొత్త తరాన్నీ ఉదారంగా ఆకాశానికెత్తేయకుండా objective గాjudge చేసేవాళ్ళ అవసరం. దేవిప్రియను కదిలించి చూడండి. ఈ అవసరపుప్రాధాన్యతను నిక్కచ్చిగా మాట్లాడ్డం మీరు చూస్తారు. మనకొక బాధ్యత వుందికదా అంటారాయన.

మూడేళ్ళ క్రితం అనుకుంటాను – దేవిప్రియతో కొన్ని గంటల పాటుసంభాషించాను, రెండు మూడు రోజుల space తో, ‘నవ్య’ పత్రిక కోసం జగన్నాథశర్మ అడిగితే మాట్లాడిన సందర్భం. ఎంత విస్తారంగా మాట్లాడారో, అంత
సారాంశంతో మాట్లాడారు. నిర్మొహమాటంగా మాట్లాడారు. సహజంగా, ఇష్టపూర్తిగామాట్లాడారు. దేవిప్రియ పూనుకోకపోతే శ్రీశ్రీ ‘అనంతం’ వచ్చి వుండేదా ? రన్నింగ్ కామెంటరీలుండేవా ? యుద్ధనౌక గద్దర్ వుండేదా ? ఉండకపోయేవేమో !
ఆయన్ని వింటూ వుంటే ఒక మనిషి కాక ఏకంగా కవితా హృదయమే మనముందు నిల్చునిభాషను సమకూర్చుకుని మాట్లాడినట్టుంటుంది. ఆగష్టు 15వ తేదీన జన్మించినదేవిప్రియ గొప్ప స్వేచ్ఛాప్రియుడు. తన ఉనికిని కవిత్వతీరమ్మీద
ముద్రించగల్గిన అరుదైన కవి ఆయన.

– దర్భశయనం శ్రీనివాసాచార్య

179590_168635736601358_1835500410_n

 

_____________________________-

నిబద్ధతలో నిమగ్నమైన ‘దేవుడు’

 

1970లలో వొక సంధికాలానికి సమాధానంగా బయలుదేరిన విప్లవోద్యమంవిలువైన  కవిత్వ వారసత్వాన్ని మిగుల్చుకుంది. కవిత్వ ప్రయోజనానికిస్పష్టమైన గిరి గీసింది. అభ్యుదయోద్యమంతో స్థిరపడిన లక్ష్యనిబద్ధతతొపాటునిమగ్నత అనే మరో ఆచరణాత్మకమైన పదం కవిత్వ విమర్శలో చేరింది. నిబద్ధతకీ, నిమగ్నతకీ మధ్య వొక వూగిసలాట ప్రారంభమైంది. కవికి నిబద్ధత వుంటే చాలదు, నిమగ్నత కూడ అవసరమేనన్న వాదం వొకవైపు సాగుతుండగా, మధ్యతరగతి కవుల్లోఆశయానికీ, ఆచరణకీ మధ్య అంతరం ఏర్పడింది. ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగాకనిపిస్తాయి. మొదటిది విప్లవోద్యమ ప్రత్యక్ష ప్రభావం. రెండవది ఆప్రభావాన్ని జీవితంలో అన్వయించుకోగలిగినా భౌతిక పరిస్థితులు లేక పరోక్షంగావిప్లవ భాగస్వామ్యం తీసుకోవడం శివారెడ్డి, దేవిప్రియలవంటి సీనియర్కవులనుంచి గుడిహాళం రఘునాధం, నందిని సిద్ధారెడ్డి దాకా ఈ విధంగా ఒకవర్గీకరణ కిందికి వస్తారు. అయితే  శివారెడ్డికీ, ఈ వరసలోని మిగిలిన కవులకీమరో తేడా వుంది. మిగిలిన కవులతో పోల్చినప్పుడు శివారెడ్డిలో అంతర్ముఖత్వంతక్కువ. వీళ్ళందరితో పోల్చినప్పుడు దేవిప్రియలో అంతర్ముఖత్వం ఎక్కువ. దీనికారణాలు ఆయా కవుల భౌతిక జీవన పరిస్థితుల్ని బట్టి వుంటాయి. వీళ్లందరి మీదపని చేస్తున్న ప్రభావాలు వొక్కటే. కాని వీళ్లలో వొక్కొక్కరిది వొక్కొక్కతరహా జీవితం.

దేవిప్రియ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ‘పొగాకు కంపెనీ సైరన్ మోత ‘ జీవితాన్ని శాసించే నేపథ్యంలో దేవిప్రియ పుట్టేరు. ‘ఒక గుడిసె కథ’ కవితలో దేవిప్రియ తన కవిత్వానికి ప్రాధమిక ముడిసరుకులేమిటో చెప్పారు. తనపంచేంద్రియాల ద్వారా సంపాదించుకునే జ్ఞానం కవితకి ఎప్పుడూ ప్రాధమికమైందే.ప్రేరణలు ప్రభావాలుగా స్థిరపడకముందు కవిలో నిక్షిప్తమైన భావసంపుటి అది.వ్యక్తి జీవన సారాన్ని సాంద్రతరం చేసేవి ఈ భావాలేనని ఫ్రాయిడ్ అంటాడు.దేవిప్రియ జీవన తాత్వికతని నిర్దేశించి చూపుడువేళ్లు ‘ఒక గుడిసె కథ’లోకనిపిస్తాయి.

“ఈ ‘గుడిసెలో’ నేనా ప్రపంచం వుదయించింది అని కవి అంటున్నప్పుడు ఆప్రపంచం కేవలం భౌతిక ప్రపంచం కాదు. కొత్త వ్యక్తిత్వాన్ని రూపుదిద్దేతాత్విక ప్రపంచం. ఈ కవితలో గతం మీద జాలి, ప్రేమ మాత్రమే కాదు వర్తమానంనుంచి భవిష్యత్తులోకి  సాధికారికంగా నడిచి వెళ్లగల ఆత్మస్థయిర్యం వుంది.

అయితే దేవిప్రియ ఆలోచనల మీద ముద్ర వేసిన పరోక్ష అనుభవాల ప్రస్తావన ‘పుట్టినరోజు గురించి’ అనే కవితలో వుంది.

నా పుట్టినరోజుదేముంది

ఒక కాడ్వెల్ తరువాత

ఒక శ్రీశ్రీ తరువాత

ఒక పాణిగ్రాహి తరువాత

ఒక చెరబండరాజు తరువాత

పుట్టినవాణ్ని నేను” అంటారు.

ఇక్కడ సూచించిన నాలుగు పేర్లు కేవలం   పేర్లు కాదు. ఈ వరస క్రమంలో ఒకచారిత్రక వికాసం వుంది. ఆధునిక కవిత్వంలో సామాజిక చైతన్యం ఎన్ని మలుపులుతిరిగిందో ఈ నాలుగు పాదాల్లో కనిపిస్తుంది.

ఈ రెండు కవితలు ముందు చదివితేగాని కవిగా దేవిప్రియ యేమిటో పూర్తిగాఅర్ధమయ్యే అవకాశం లేదు. ‘పైగంబరకవి’గా కన్ను తెరిచిన దేవిప్రియ ‘నీటిపుట్ట’లో ఏ వర్గం భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఈ కవితల్లోస్పష్టంగా కనిపిస్తుంది. “కవిత్వ నిత్య నిబద్ధం” అని ఆయన నమ్ముతారు. అందుకేచిరకాల స్వప్నాన్ని వాస్తవం చేసిన ” ‘శ్రామికస్వర్గం’ నరకంగామారుతున్నప్పుడు నిస్సంశయంగా నిరసన వ్యక్తం చేయగలిగారు.

తూర్పు యూరప్‌లో సంభవించిన పరిణామాలు ఏ సామ్యవాద కవికైనా ఆశనిపాతంవంటివే. గ్లాస్‌నొస్త్, పెర్రిస్త్రోయికాల ముసుగులో సోవియట్‌లో ప్రవేశించినపెట్టుబడిదారీ స్వభావం  ఇక సోషలిస్టు వ్యవస్థ స్వప్నప్రాయమేననిభయపెట్టింది. మనిషి ఆనందానికి ఏ వ్యవస్థ సరిపడ్తుందో తెలియని గందరగోళంయేర్పడింది. ‘ఏది నీ మానవాంశని పరిపూర్ణం చేస్తుందో నాకు అంతుబట్టడం లేదు’ అని వేదన వ్యక్తం చేస్తారు. “ఎర్రబల్బుల్లా వెలిగిన కళ్లలో కలర్ టీవీవర్ణబింబాలు కదలాడుతున్నప్పుడు, తరతరాల ధార్మిక దాస్యాన్ని ధిక్కరించినచేతుల్లో కోకాకోలాలు చెమ్మగిల్లుతున్నప్పుడు” సామ్యవాది హృదయ ప్రకంపనలుఇలాగే వుంటాయి.

ఇదే ధోరణిలో రాసిన మరొక అద్భుతమైన కవిత ‘హిట్లర్ నవ్వు’. ఇదిప్రజాస్వామ్య శిలలమీద ఎర్రపూలు రాలుతున్న రుతువు – అంటూ మొదలయ్యే ఈ  కవితలో దేవిప్రియ రాజకీయ భావాల తీవ్రత తెలుస్తుంది. ఒక శ్రీశ్రీ, ఒక చెరబండరాజు వారసత్వం నుంచి వచ్చిన కవి మాత్రమే ఈ భావాన్ని ఇంత బలంగా వ్యక్తంచెయ్యగలడు. ఈ రెండు సందర్భాల్లో కూడా దేవిప్రియ కవిత్వ సంవిధానంప్రత్యేకంగా గమనించాలి. ఇక్కడ కవి పదం మీద ఎక్కువ దృష్టి నిలుపుతాడు.సాధారణంగా  దేవిప్రియ కవితకి ఒక రూపపరిమితి వుంది. అలవాటుపడిన గేయ చందస్సులనడక ప్రతి కవితలో కనిపిస్తుంది. ‘హిట్లర్ నవ్వు’ ‘ఆదిరహస్యం మానవుడు’ కవితల్లో కూడా ఆ నడక వుందిగానీ, భావాల తీవ్రత దాన్ని అధిగమించింది. కవితలోకొసమెరుపులు ఇవ్వడం ‘రన్నింగ్ కామెంటరీ’ లక్షణం. ఆ లక్షణాన్ని మామూలుకవితలో కామిక్ రిలీఫ్‌గా మార్చుకుని నిర్మాణంలో ఒక సౌలభ్యం సమకూర్చారుదేవిప్రియ. దీనివల్ల ఆయన ఇతర ఆధునిక కవుల్ని బాధిస్తున్న నిర్మాణసంక్లిష్టత నుంచి బయటపడ్డారు.

గొప్ప ఉద్వేగాన్ని కూడా నింపాదిగా చెప్పడం దేవిప్రియ లక్షణం. కార్యకారణ  సంబంధాలు తెలిసి వుండడం వల్ల ఈ కవిలో అకారణమైన ఆవేశం నుంచి పదచిత్రాలుఅదేపనిగా రాలవు. ఆయన భావాన్ని ఒక పదచిత్రంతోనే చిత్రిక పడ్తాడు. తాత్వికసంకోచాలు లేనప్పుడు మాత్రమే కవిలో ఈ స్పష్టత సాధ్యపడుతుంది.

వైరుధ్యాల చిత్రీకరణలో దేవిప్రియ కవిత్వ వ్యక్తిత్వం  కనిపిస్తుంది.నిబద్ధత వుండి ఉద్యమాలలో నిమగ్నం కాలేక పోయాననే ఆవేదన చాలా సందర్భాల్లోవ్యక్తమవుతుంది. కాని ఇలాంటి అనేక రకాల వైరుధ్యాల పొరల్ని విప్పి చూసుకునేనిజాయితీ దేవిప్రియలో వుంది. నిజానికి నిబద్ధత విషయంలొ ఏమాత్రం తెలివివుపయోగించకుండానే ఎవరినైనా ఇట్టే మోసం చెయ్యవచ్చు. కాని లోపల నిజమైన కవిదేవులాడుతున్నవాడు కవిత్వంలో పగటి వేషం వెయ్యలేడు. ఉద్యమం గాలి అయినా సోకనికవులు కూడా ఒక ఫాషన్‌గా ఉద్యమ కవిత్వం రాస్తున్న ఈ కాలంలో ఒక కవి నిమగ్నతగురించి నిజాయితీగా కంఠం విప్పడం విడ్డూరంగానే కనిపించవచ్చు.

 

గార్డెన్ రెస్టారెంట్ చల్లగాలి

రుచిమరిగిన వాణ్ణి నేను

ఫ్యాను విసిరే చల్లగాలిలో

శరీరాన్ని ఆరేసుకోవడానికి

అలవాటు పడ్డవాణ్ని నేను

అయినా అడివీ

నువ్వంటే నాకిష్టం‘ (‘అమ్మచెట్టు’లో)

ఇక్కడ అడవి దేనికి సంకేతమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1970లలో ఒకవైపుఉద్యమం తీవ్రతని అందుకుంటున్నప్పుడు మరోవైపు మధ్యతరగతి జీవితంలోకి నయాసంపన్న లక్షణాలు ప్రవేశిస్తున్నాయి. ఆర్ధికంగా కొద్దికొద్దిగాస్థిరపడుతున్న ఈ వర్గంలో అసంతృప్తికి తగిన కారణాలు లేవు. సామాజిక చైతన్యంవున్న మధ్యతరగతి మేధావులలో ఈ స్థితిపై అసహనం వుంది. ‘అడవి’ కవితలోదేవిప్రియ ఈ స్థితిని బలంగా వ్యక్తం చేశారు. అంతేకాదు,

ఈ దేశాన్ని

ప్లాస్టిక్ తీగల విషపుష్పాల ఉద్యానవనాల నుంచి కాపాడడానికి,

ఏదో ఒకనాడు,

నేను నీ సాయమే కోరతాను..” అని వాగ్ధానం చేయగలిగారు..

1984లో దేవిప్రియ ఇలాంటిదే మరో కవిత రాశారు. ఇది దాదాపు ‘అడవి’కవితకుఒకరకమైన కొనసాగింపు. ఎనభయ్యో దశకం వచ్చేసరికి విప్లవోద్యమం మీద పెట్టుకున్నఆశలు అడియాసలయ్యాయి. గుత్తపెట్టుబడిదారీ మనస్తత్వాల ముందు గొప్ప ఆదర్శాలుకూడా వీగిపోతాయని తీవ్రవాద కమ్యూనిస్టులు కూడా మరోసారి నిరూపించారు.సిద్ధాంతాలను పణంపెట్టి ‘వ్యక్తి’వాద ముఠాలుగా చీలిపోయారు. దేవిప్రియఅన్నట్టు ‘వర్తమానానికి నిన్నటి గుణపాఠాల వర్తమానం అదేమిటో ఇంకా అందలేదు.నేను నడుస్తోన్న ఈ రోడ్డు నా కళ్లు యేరయ్యేదాక నా కాళ్ళు తెడ్లయ్యేదాకాముగిసేట్టు లేదు.’. ఎదురుచూపులు ఫలించకుండానే కళ్లముందు మళ్లీ చీకటిఅలుముకుంది. రాజకీయ, సామాజిక రంగాలలో ఏర్పడిన ఈ స్తబ్దతని కవి ‘అర్ధరాత్రినిశ్శబ్దంలోని అనిర్వచనీయ శబ్దం’గా అభివర్ణించారు. ఈ ‘నిశ్శబ్దశబ్దం’ తననిభయపెడుతుందనడంలో ఒక మానసిక అంతరాన్ని సూచించారు.

పుస్తకాల పిరమిడ్‌లో మరొక మమ్మీగా మారిపోతానేమోనన్న ఆందోళనవెలిబుచ్చారు. చివరికి ఒక ఆశ. దిగులు  తనని ఎంతగా ఆవరిస్తున్నా నిరీక్షణఆగిపోదన్న ధైర్యం. ఉద్యమంలో ఏర్పడిన అవరోధాలు తొలగిపోయి రేపటి చరిత్రనికొత్త రంగుల్లో రాయగలనన్న ధీమా. దేవిప్రియలో Negative element ఏ కోశానాలేదనడానికి ఈ కవిత ఒక్కటే చాలు నిదర్శనంగా.

(ఈ వ్యాసం పునర్ముద్రణ, దేవిప్రియ కవిత్వాన్ని మరో సారి తలచుకోవాలన్న ఆకాంక్షతో )

అఫ్సర్

 

సైకిలూ – మూడు కవిసమయాలు

varavara.psd-1

‘చలినెగళ్లు’ (1968) తో మొదలుపెట్టి ‘జీవనాడి’ (1972), ‘ఊరేగింపు’ (1974) ల నుంచి ఒక్కొక్క కవిత తీసుకుని నేపథ్యం చెపుతున్నాను గనుక నేను నా కవితా పరిణామక్రమాన్ని వివరిస్తున్నానని పాఠకులు గ్రహించే ఉంటారు. ఈ సారికి ఆ పద్ధతి నుంచి వైదొలగి ఒక్కసారే 2006లోకి మిమ్ములను తీసుకపోతాను. అయితే అది 1975 ఎమర్జెన్సీని కూడ జ్ఞాపకం చేస్తుంది.

2014 జూలై 27 ఆదివారం సాయంత్రం హైదరాబాదు ఆబిడ్స్ గోల్డెన్ త్రెషోల్డ్ లో ‘కవి సంగమం’ లో అఫ్సర్ తన కవిత్వం వినిపించాడు. అందులో మొదటి తన కవితా సంకలనం  రక్తస్పర్శ (2006) లోని సర్వేశ్వర్ దయాల్ మరణం గురించి కవిత చదవడంతో నా మనసు ఆ రోజుల్లోకి వెళిపోయింది.

images

సర్వేశ్వర్ దయాల్ సక్సేనా నా అభిమాన హిందీ కవి. ‘తోడేలు వెంటపడితే పరుగెత్తకు. నిలబడి ఒక అగ్గిపుల్ల గియ్. తోక ముడిచి వెళిపోతుంది….’, ‘నీ ఇంట్లో శవం కుళ్లి వాసనేస్తున్నదంటే ఇంకెంత మాత్రమూ అది నీ వ్యక్తిగత సమస్య కాదు’ వంటి ఆయన కవితాచరణాలు ఎనభైలలో తెలుగు కవివేనన్నంతగా ప్రచారం పొందాయి. 1982 జూలై 2న చెరబండరాజు చనిపోయాక ఆయనపై సర్వేశ్వర్ దయాల్ ఒక మంచి ఎలిజీ రాసాడు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత ఢిల్లీలో లెక్చరర్ గా పనిచేసిన సురా (సి వి సుబ్బారావు) ద్వారా ఆయనతో పరోక్ష పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కారణంగానే ఆయన 1983లో మేము ఢిల్లీలో తలపెట్టిన ఎ ఐ ఎల్ ఆర్ సి (ఆలిండియా లీగ్ ఫర్ రెవల్యూషనరీ కల్చర్ – అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి) ఆవిర్భావసభకు ఆహ్వానసంఘ అధ్యక్షుడుగా ఉండడానికి ఒప్పుకున్నాడు. అట్లా ఆయన ఇటు కెవిఆర్ తోనూ, నాతోనూ ఉత్తరప్రత్యుత్తరాల్లో ఉండేవాడు. తీరా, 1983 అక్టోబర్ లో ఆవిర్భావ సభలు జరగడానికన్న ముందే ఆయన ఆకస్మికంగా మరణించాడు. అఫ్సర్ కవిత సరిగ్గా ఆ మరణం గురించే. ఒకరాత్రి పుస్తకం చదువుతూ గుండెల మీద పరచుకుని ఆ కవి శాశ్వతనిద్రలోకి వెళిపోయాడు. ఆయనను మేము చూడనే లేకపోయాం.

AU_2012033006_34_53

సర్వేశ్వర దయాల్ సక్సేనా న్యూఢిల్లీ సాకేత్ లో జర్నలిస్టు ఎంక్లేవ్ లో ఉండేవాడు. ఆయన బాల్కనీ నుంచి ఎదురుగా మిలిటరీ కంటోన్మెంట్ పార్కు. ఆ పార్కుకి రోజూ సాయంత్రం ఒక యువకుడు ఎర్ర సైకిల్ పై వచ్చి చేతిలో ఏదో పొట్లం పట్టుకుని లోనికి పోయేవాడు. కాని ఎమర్జెన్సీలో ఒక సాయంత్రం తర్వాత ఆ యువకుడు కవికి కనిపించలేదు.

‘కొత్త ఢిల్లీలో

మిలిటరీ ఇనుపకంచె బయట

ఒక ఎర్ర సైకిలూ

ఇనుపముళ్లలో చిక్కుకపోయిన

ప్రియురాలికివ్వడానికి తెచ్చిన

గోరింటాకు

రోజూ అట్లా చూస్తూ ఉండే కవి

సర్వేశ్వర్ దయాల్ సక్సేనాకు

యవ్వనస్వప్నాలను

ఎమర్జెన్సీ ఏంచేసిందో

ఎవరూ చెప్పక్కర్లేకపోయింది.’

అయితే సృజనకు, విప్లవోద్యమానికి, సాహిత్యానికి ఎమర్జెన్సీ ఆరంభమూ కాదు, చివరా కాదు. 1968లో ‘ట్రిగ్గర్ మీద వేళ్లతో రా….’ అని పిలుపు ఇచ్చిన దగ్గర్నుంచీ ఇవ్వాటిదాకా మాకు అప్రకటిత ఎమర్జెన్సీయే. అది ‘తననెప్పుడూ నిరాశపరచని మిత్రుడు’ సైకిల్ నుంచి లోచన్ ను వేరుచేసి రెండువారాలు పాకాల క్యాంపులో పెట్టి జైలుకు పంపింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో విప్లవ విద్యార్థులు ఎర్ర జెండాలు అందించుకున్నట్లుగా ఒకరి నుంచి ఒకరు పోరాట వారసత్వంగా పొందిన సైకిల్ నుంచి ఆజాద్ ను, ప్రసాద్ ను, రజితను దూరం చేసి ‘ఎన్ కౌంటర్’ చేసింది.

 

2006 ఆగస్టులో సిపిఐ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ (చిన్నయ్య) తో పాటు ‘ఎన్ కౌంటర్’ అయిన ఏడుగురిలో రజిత ఒకరు. ఆ ఏడుగురూ చిత్రహింసల వల్ల ఎంత మాంసం ముద్దలయ్యారంటే ఆమె కాలివేళ్ల పోలికతో మాత్రమే ఆమె సోదరి ఆమెను గుర్తుపట్టగలిగింది. రజిత విద్యార్థి ఉద్యమంలోనే కాకుండా మహిళా ఉద్యమంలో కూడ ఎంతో క్రియాశీలంగా పనిచెసింది. సంక్షేమ పథకాలను రద్దు చేయాలని చంద్రబాబు నాయుడు 1996లో పూనుకున్నప్పుడు, 2000 లో హైదరాబాదులో వరదలు వచ్చినప్పుడు పోరాటంలోను, సహాయ కార్యక్రమాలలోను అప్పటికింకా విద్యార్థిగా ఉన్న కాశీం ను రజిత తన సైకిల్ పై ఎక్కించుకుని తిప్పేదని చెప్పాడు.

          వరవరరావు

ఆగస్ట్ 12, 2014

 

 

బార్సిలోనా అనుభవం : తనివి తీరలేదే!!

satyam mandapati ప్రపంచంలోనే ఎంతో అందమైన, ఆధునిక భవనాలు, కట్టడాలు ఎక్కడ వున్నాయి?

ఎంతో పేరు ప్రఖాతులులైన భవన నిర్మాణ శాస్త్ర శిల్పులు ఎక్కడ వున్నారు?

ప్రఖ్యాత వన నిర్మాణ శాస్త్ర నిపుణులు నిర్మించిన చక్కటి ఉద్యానవనాలు ఎక్కడ వున్నాయి?

బార్సిలోనాలోనా?

అవును…. బార్సిలోనాలోనే!

౦                           ౦                           ౦

ఈమధ్య మేము వెళ్ళిన యూరోపియన్ యాత్రలో నాకు బాగా నచ్చిన ప్రదేశాల్లో బార్సిలోనా ఒకటి.

స్పెయిన్ దేశానికి రాజధాని అయిన మెడ్రిడ్ నగరం బార్సిలోనా కన్నా పెద్దది. కాకపోతే బార్సిలోనా ఎంతో ఆధునిక నగరం. ముఖ్యంగా 1992లో ఇక్కడ వేసవి ఒలెంపిక్స్ జరిగినప్పుడు, నగరం మొత్తం కొత్త అందాలను సంతరించుకుని, కొత్త పెళ్లికూతురిలా తయారయింది. అప్పటినించీ ఆ అందాలు పెరిగాయే కానీ తరగలేదు.

బార్సిలోనా స్పెయిన్లోని కాటలోనియా ప్రాంతానికి రాజధాని. నగరం సైజు నలభై చదరపు మైళ్ళు. మెట్రో సైజు మూడు వందల పది చదరపు మైళ్ళు. నగర జనాభా 3.2 మిలియన్లు, మెట్రో జనాభా 5.3 మిలియన్లు. ఇది యూరోపియన్ యూనియన్లో ఆరవ పెద్ద నగరం. మెడిటెర్రేనియన్ సముద్రతీరంలో వుంది. రోమన్ సామ్రాజ్యంలో ఒక నగరమై, తర్వాత ఆనాటి ఆరగాన్ సామ్రాజ్యంలో చేరి, ఈనాటి స్పెయిన్ దేశంలో అంతర్భాగమైంది బార్సిలోనా.

బార్సిలోనాని మొదటగా హెర్క్యుల్కిస్ స్థాపించినట్టు చెబుతారు. కానీ చరిత్రకారులు దాన్ని అంగీకరించ లేదు. ఎందుకంటే హెర్క్యుల్కిస్ ఒక పురాణ కథలోని పాత్ర. పురాణం (Mythology) అంటేనే కాల్పనికమైనది. అందుకని అది నిజమని ఒప్పుకోరు. పూనిక్ యుద్ధంలో రోమన్లను తరిమేసిన హాన్నిబాల్ తండ్రి అయిన హామిల్కర్ బార్సా పేరున బార్సిలోనా అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.

barce3

బార్సిలోనా.. ఆ మాట కొస్తే యూరప్లో ఏ పెద్ద నగరమయినా సరే.. వెడదామనుకునే వాళ్లకి సలహాలు కొన్ని చెప్పాలని వుంది. యూరప్లో హోటళ్ళ ఖరీదులు చాల ఎక్కువ. ఇంటర్నెట్లో రకరకాల చోట్ల చూసి ముందే హోటల్ బుక్ చేసుకుంటే చౌక. ఆర్బిట్జ్, హోటల్.కాం, ఇలా చాల వున్నాయి. కొన్ని హోటళ్ళు లాస్ట్ మినిట్.కాంలో కూడా చాల చౌకగా దొరుకుతాయి. మాకు మంచి ఐదు నక్షత్రాలు హోటళ్ళలో డెభై శాతం తక్కువగా గదులు దొరికాయి. లేదా కొన్ని హాస్టళ్ళు, ఎపార్ట్మెంట్లు, ఇళ్ళు మొదలైనవి కూడా ప్రయత్నించి చూడండి. అంతేకాదు, ఏ వూళ్ళో అయినా, మనం చూడదలుచుకున్న ప్రదేశాలకు, కనీసం కొన్నిటికైనా దగ్గరగా వుండే హోటళ్ళు ఇంటర్నెట్లో మాపులతో సహా చూడవచ్చు. ఇక భోజనాల సంగతి చూస్తే, మీ హోటల్ లాబీలో క్లర్కుని అడిగితే ఎన్నో వివరాలు తెలుస్తాయి. మేము బార్సిలోనాలో రాత్రి ఎనిమిదింటికి హోటల్లో దిగి, అక్కడ లాబీ క్లర్కుని అడిగాము, దగ్గరలో ఇండియన్ రెస్టారెంట్లు ఏమైనా వున్నాయా అని. అతను నవ్వి మీకు ఎన్ని కావాలి అని అడిగాడు.

మా హోటల్ చుట్టూతా కనీసం నాలుగు ఇండియన్ రెస్టారెంట్లు వున్నాయి. చాల చోట్ల టాక్సీలు పెద్ద ఖరీదు కాదు. మీకు కొంచెం సమయం ఎక్కువగా వుంటే, కొంచెం చొరవ వుంటే బస్సులూ, ట్రాములూ కూడా బాగానే వుంటాయి. చాల నగరాల్లో టూరిస్టు బస్సులు.. హాపిన్-హాపౌట్ బస్సులు అంటారు, అవి ఎక్కితే వాళ్ళే వూరంతా తిప్పుతారు. మీకు నచ్చిన చోట దిగటం, అక్కడ అన్నీ చూసేసిన తర్వాత, మళ్ళీ అదే కంపెనీ వాళ్ళ బస్సు ఎక్కటం. అవన్నీ ఒకే దిశగా వెళ్లి మనం ఎక్కడ బయల్దేరామో అక్కడికే తిరిగి వస్తాయి. ఒకరోజు టిక్కెట్టు కానీ, రెండు రోజుల టిక్కెట్టు కానీ కొనుక్కుంటే, మీరు చూడాలనుకున్నవి చూడవచ్చు.

మేము అలాగే రెండురోజుల టిక్కెట్లు కొనుక్కుని, బార్సిలోనా అంతా తీరిగ్గా చూసాం.

barcelona1

బార్సిలోనాలో చూడవలసింది ఏమిటి అని ఎవరిని అడిగినా, మొట్టమొదట చెప్పేది అక్కడి ఆధునిక భవన

నిర్మాణ వైవిధ్యం. ఒక్కొక్క భవనం ఒక్కొక్క విధంగా నిర్మింపబడి, నగరానికి ఎంతో అందాన్నిస్తున్నది.

ఇంతకుముందు నేను చూసిన నగరాలలో షాంగ్హాయ్, దుబాయ్ లాటి నగరాలు ఎంతో బాగున్నాయి అనుకునేవాడిని. బార్సిలోనా చూశాక, నా అభిప్రాయం మారిపోయింది. బార్సిలోనాలోనే ఆ అందాలన్నీ కలబోసి వున్నాయనిపించింది. బార్సిలోనాలో భవనాలు అందంగా ఉండటమే కాదు, ఊరు ఎంతో శుభ్రంగా వుంటుంది. చక్కటి ప్లానింగుతో కట్టిన వీధులు, పార్కులు, నగరం. 1992లో వేసవి ఒలెంపిక్స్ కోసం చేసిన కృషితో, బార్సిలోనా స్వరూపమే పూర్తిగా మారిపోయిందిట.

barce2

ప్రపంచంలోని ఎన్నో దేశాలనించీ, భవన నిర్మాణ శాస్త్రం (Architectural Engineering) చదివినవారు, బార్సిలోనా వచ్చి అక్కడి కట్టడాలను పరిశీలించటం మామూలే! మరి దీనికి కారణం ఏమిటి అనేది ఒక ప్రశ్న!

ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భవన నిర్మాణ స్థపతులు, ఆంటోని గౌడి, లూయిస్ డోమినేక్ లాటి వారందరూ ఇక్కడివారే! వీరందరిలో కూడా ప్రముఖుడు ఆంటోని గౌడి (1852-1926). స్పానిష్ కాటలాన్ భవన నిర్మాణంలో పేరుగాంచినవాడు. ఆయన నిర్మించిన ‘సగ్రాడా ఫెమిలియ’, ‘మేగ్నం ఓపస్’ బార్సిలోనాలోనే వున్నాయి. పింగాణి, రంగురంగుల అద్దాలు, రకరకాల చెక్కలూ వాడటం గౌడి ప్రత్యేకత. ఆయన శిష్యులే ఈనాటి అధునాతన బార్సిలోనా నిర్మాణంలో ముఖ్యులు. గౌడి కట్టిన ‘కాసా బట్టిలో’ ఎంతో వైవిధ్యమైన కట్టడం. దాన్నే ఇప్పుడొక మ్యూసియంలా మార్చారు. ఈ మ్యూసియం పూర్తిగా చూడటానికి రెండు మూడు గంటలు పడుతుంది. దీనితోపాటు ఈయన డిజైన్ చేసిన కొన్ని ఇతర భవానాలు కూడా చూడటానికి చాల బావుంటాయి.

బార్సిలోనాలో చూడవలసిన వాటిలో ముఖ్యమైనవి, గొథిక్ క్వార్టర్స్. వంకర్లు తిరిగిన చిన్న చిన్న సందులు, అక్కడే ఎంతో షాపింగ్. మధ్యే మధ్యే బారులు తీరిన బారులు. నడిచి వెడుతుంటే బావుంటుంది.

చిత్రకళ మీద ఉత్సాహం వున్నవారికి, పికాసో మ్యూసియం ఎంతో బాగుంటుంది. ఎంత పెద్ద కళాహృదయం వుంటే అంత సమయం గడపవచ్చు ఇక్కడ. అలాగే కాటలూనియా నేషనల్ ఆర్ట్ మ్యూసియం.

barce4

లాస్ రామ్బ్లాస్ అనే రోడ్డు మీద అలా ఎంత దూరమైనా నడుచుకుంటూ పోవచ్చు. రాత్రి పూటయితే లైట్లతో ఇంకా బాగుంటుంది. ఇంకా పలేషియో గ్విల్, కాసా మిలా, కొలంబస్ మాన్యుమెంట్.. ఇలా చూడవలసినవి చాల వున్నాయి.

తర్వాత నాకు ఎంతో నచ్చినది ఒలెంపిక్ స్టేడియం, ఆ చుట్టుపక్కల వున్న ఒలెంపిక్ మాన్యుమెంట్స్. 1992లో వేసవి ఒలెంపిక్స్ జరిగింది ఇక్కడే.

 

ఆ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలు టీవీలో ప్రత్యక్షంగా చూసాను కనుక నాకు గుర్తున్న విషయం ఒకటి చెబుతాను. స్టేడియం మధ్యన నుంచుని ఒకే ఒక బాణం సంధించి, దానితో ఎంతో ఎత్తున, దూరంగా కట్టిన ఒలెంపిక్ అగ్నిహోత్రాన్ని వెలిగించిన ప్రఖ్యాత స్పానిష్ విలుకాడు ‘అంటోనియో రెబోయో’ నాకింకా గుర్తున్నాడు. అదిప్పుడు ప్రత్యక్షంగా చూసి అతని విలువిద్యా నైపుణ్యానికి అబ్బురపడ్డాను. అలాగే అక్కడ కట్టిన ఒలింపిక్ చిహ్నం కూడా ఎంతో అందంగా వుంటుంది.

– మందపాటి సత్యం

 

నామినీ ఏమిటీ పని?

10256494_783790284967578_2755423526937258553_nనామినికి  తను గొప్ప రచయితనని నమ్మకం. అది నిజం కూడా!

గోర్కీలాగా తెలుగులోరాయగల రచయిత ఎవరు? అని ఎవరయిన ప్రశ్నిస్తే  నూటికి డెభ్భైమందిసాహిత్య పాఠకులయిన సందేహం లేకుండా నామిని పేరు  చెపుతా  రు అది కూడా నిజమే! నామిని తాజా సృజన  ‘‘మూలింటామె’’ చదివిన తరువాత ఎవరికైనా  పైన వివరించినవన్నీ ప్రశంశలు కాదు అతిశయోక్తులు అనిపిస్తే  బహుశా తప్పే మీ  వుండకపోవచ్చు.

నామిని ఇంతకు  ముందుకు రాసిన పుస్తకాలన్నీ ఒక ఎత్తు, ఈ మూలింటామె ఒక్కటి ఒక ఎత్తు. పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు, మిట్టురోడి  కతలు, ఇస్కూలుపిల్లకాయల కతలు, ముని కన్నడి  సే ద్యం ఇవన్నీ నామిని  బాల్యం చుట్టూ, నామిని  నోస్టాల్జియా చుట్టూ తిరిగితే, మూలింటామె మాత్రం అందుకు  విరుద్ధంగాసమాజం మీద అందున సమకాలీన సమాజం మీద, ఒక పదునయిన వ్యాఖ్యానం  చేయడానికిప్రయత్నం చేసింది. అంటే నామిని  రచయితగా సమాజం తనను గుర్తించిన జానర్‌నుండి వేరే జానర్‌ లోకి ప్రవేశించాడ న్నమాట  మాట. ఒక ఉత్తమ శ్రేణికి చెందిన రచయిత సమాజంతో పాటు తనూ మారుతూ, రూపాన్నీ , సారాన్నీ  మార్చుకుంటూ, పదే పదే అంతర్‌ బాహిర్  రంగాలతో యుద్ధం చేయటాన్ని అభిలషించవలసిందే! అది సమాజానికి అవసరం కూడా !

కానీ ఆ పని సమర్ధవంతంగా చేయకపోతే, అప్పటిదాకా పేరుకు  ముందు వున్న విశేషణాలు అన్నీ కేవలం అవశేషాలుగా మారిపోయే ప్రమాదం వుంది. నామినికి ఇప్పుడా ప్రమాదం ఎదురయింది.

‘‘మూలింటామె’’ ఒక కథ కాదు. రెండు కథల సమాహారం. మొదటి భాగాన్ని మూలింటామె నడిపిస్తే  రెండవ భాగాన్ని మూలింటామె కోడలు పంది వసంత, లేదూ పందొసంత నడిపిస్తుంది.

మిట్టూరులో ఒక మూలమీద విశాలమయిన ఇంట్లో మూలింటామె వుంటుంది. మూల మీద ఇంట్లో వుంటుంది కనుక ఆమె మూలింటామె అయింది  కానీ ఆమె పేరు  కుంచమమ్మ.
మూలింటామెకు భర్త చిన్న వయసులోనే చనిపోతే, కొడుకునీ, కూతురునీ, రెండెకరాల పొలాన్నీ ఒంటి చేత్తో  సాకుతూ వస్తుంది. కొడుకుకి యుక్త వయసు వచ్చాక , మనవరాలు రూపావతిని ఇచ్చి పెళ్ళి చేస్తుంది. మూలింటామె, ఆమె కూతురు నడిపామే , మనవరాలు  రూపావతి, కొడుకు నారాయుడు  ఇదీ ఆ కుటుంబం. నారాయుడుతో  కాపురం చేసి ఇద్దరు పిల్లలను కన్నాక  రూపావతి, ఒకరోజు చెప్పా పెట్టకుండా ఒక అరవ మాదిగాయనతో వెళ్ళిపోతుంది. రూపావతి నే కొనమ్మి అనికూడా పిలుస్తారు.

కొనమ్మి వెళ్ళిపోయిందన్నవార్త  నడిపామేకి,, మూలింటామెకి తెలియడంతో నవల మొదలవుతుంది. మొదటి భాగమంత , రూపావతి కనపడకుండా కథను నడిపిస్తుంది.

ఊరుఊరంతా, రూపావతి కన్నతల్లి నడిపామే తో సహా, కొనమ్మిని నానా  మాటలు అంటున్నా అసహ్యించుకుంటున్నా  మూలింటామెకు మాత్రం మనవరాలు  మీద  ప్రేమ  తగ్గదు. ఆమె కోసం  తపన పడుతూ ఉంటుంది.

కొనమ్మి వెళ్లిపోయిన పది రోజులు  తిరగకుండానే,నడిపామే,, నడిపామే  పెద్దమ్మ ఎర్రక్క కలసి నారాయుడికి  కి రెండో పెళ్ళిచేస్తారు. నిండా ఇరవై ఏళ్లులేని పందొసంత మూలింటామె ఇంట్లోకి కోడలు రూపంలో అడుగుపెడుతుంది.

పందొసంత  అడుగు పెట్టాక కథ వేగాన్ని అందుకుంటుంది. వ్యవసాయం దండగని గ్రహించిన వసంత ఇంటిముందు కిరాణా  షాపు పెడుతుంది. అత్తింటింకి వచ్చీరాకుండానే  భర్తకు వరుసకు తమ్ముడయ్యే రంగ బిళ్ళతో సంబంధం పెట్టుకుంటుంది. ఆ సంబంధం నెల రోజులు కూడా నిలవదు. మూడు ట్రాక్టర్లున్న చంద్రారెడ్డితో సంబంధం పెట్టుకుంటుంది. చంద్రారెడ్డి  అండతో వడ్డీవ్యాపారం మొదలుపెడుతుంది. చిట్టీలు నడుపుతుంది.

విశాలమైన ఇంటిచుట్టూ ఉన్న చింత, సీమ చింత లాంటి చెట్లన్నీ అమ్మేస్తుంది. పనిలో పనిగా నారాయుడికి  కి సిగరెట్‌ త్రాగడం  నేర్పుతుంది. మందు కొట్టడం నేర్పుతుంది. ప్యాంట్‌ షర్టూ  వేసుకొని మోపెడ్‌ నడపడం నేర్పుతుంది.
అన్నింటినీ  మించి తన ప్రియుడిని   తమ్ముడు అనడం నేర్పుతుంది.

చివరకు నారాయుడికి  ఉన్న బండిని , ఎడ్లను, రెండేకరాలని  అమ్మేస్తుంది. రెండెకరాలు  కొనుక్కున్న వారికి  పొలం రిజిష్టరు చేయడానికి మూలింటామెను రమ్మంటే, మూలింటామె రానంటే  రానని  మొండి  కేస్తుంది.
మూలింటామెను బెదిరించడానికి ఆమె ఇష్టంగా పెంచుకొనే నాలుగు  పిల్లుల్లో రెండింటిని  చంపేసి  రిజిస్ట్రేషన్ కి  రాకపోతే  ఏం జరుగుతుందో అన్యాపదేశంగా చెప్తుంది. మూలింటామె విషపు ఆకుతిని చనిపోతే ఇంట్లోనుండి  శవం లేచీ లేవకుండానే రెండెకరాల  పొలం రిజిస్ట్రేషన్  చేసేస్తుంది.

Mulintame600

ఇది మూలింటామె కథ. ఈ కథ ద్వారా  నామిని  రెండు విషయాలను పదునుగా వ్యాఖ్యానించాలి  అనుకున్నాడు . ఒకటి సమాజంలో నీతి, నైతికత అనే రెండు బ్రహ్మ పదార్ధాలను  వర్ణం, వర్గం ఆధారంగా సమాజం ఆమోదించడమో, తిరస్కరించడమో
చేస్తుంది. రెండు అభివ ద్ధి అనే జగన్నాధ  రధ చక్రాల క్రింద అన్ని రకాల విలువలూ పడి  నలిగిపోయి నశించి పోతాయి . నిజానికి ఇవేమి కొత్త విషయాలు కావు.
ప్రపంచీకరణ దుష్పలితా లు భారత, మరీ ముఖ్యంగా తెలుగుదేశ గ్రామీణ సమాజాన్ని కబళించడం మొదలైన దగ్గర్నుండీ   ఎంతో మంది చెప్తువస్తున్నవే కానీనామిని  ఈ సబ్జెక్టును ఎన్నుకోవడమే కొత్త.

ఈ కథ 1984 లో జరుగుతుంది. మొదటి దశ ఆర్ధిక సంస్కరణలు భారతదేశంలో మొదలుకావడానికి కనీసం అర్థ దశాబ్దం ముందు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు నాయుడు  చెప్పడానికి కనీసం పదేళ్ళముందు. 2014 కళ్ళతో 1984 నాటి  సమాజాన్ని వ్యాఖ్యానించడం లోని కాలిక స్ప హ గురించి చెప్పుకోవలసింది ఏం ఉంటుంది?
కొనమ్మి అనే కమ్మ సామాజిక వర్గానికి  చెందిన స్త్రీ  కళాయి పోసుకొనే అరవ మాదిగ పురుషుడుతో వెళ్ళిపోతే మిన్నూ , మన్నూ  ఏకంచేసి గొడవ చేసిన సమాజమే,అదే సామాజిక వర్గానికి  చెందిన మరొక స్త్రీ , మరో బలమైన రెడ్డి  సామాజిక
వర్గానికి  చెందిన పురుషుడుతో సంబంధం పెట్టుకొని సరాసరి  ఇంటికే రప్పించుకుంటే కిక్కురుమనదు పైగా ఆ స్త్రీ కి అండగా నిలుస్తుంది.అటువంటి సమయంలో బాధ్యత గల రచయిత ఏం చేయాలి?

సమాజంలోని అవలక్షణాలను, దుర్నీతిని ఎండగడుతూనే సమాజానికి దిశా నిర్దేశం చేయాలి. మామూలు మనుషులు లాగా ఒక తప్పును మరొక తప్పుతో సరిచేయాలి. అనుకోకూడదు. కానీ నామిని  చేసింది అదే. పందొసంతను సమర్ధించడానికో, కొనమ్మిని విమర్శించడానికో, సమాజం యొక్క దుర్నీతిపైన యుద్ధం ప్రకటించి పొయెటిక్‌ జస్టిస్‌ సాధించడానికో  ఆ సమాజం మొత్తం కలుషితమైపోయిందని చెప్పి ఒక జీవం లేని నవ్వు నవ్వాడు.

జీవితంలో త్వర త్వరగా పైకి ఎదగడానికి అడ్డువచ్చిన ప్రతి దాన్నీ తొక్కేస్తూ వెళ్లిపోవడం అనే ఆధునికి జీవన వ్యాపార  సూత్రాన్ని  కరతలామలకం చేయడానికి పందొసంతను సృష్టించిన , నామినికి  ఆ పాత్ర పట్ల  ఉన్న  ప్రేమ  మిగతా పాత్రలకు అన్యాయం  చేసింది. సమర్ధుడైన రచయితకు ఇది తగదు.
చివరకు మిగిలేదిలో బుచ్చిబాబుకి కోమలి పట్ల, కాలాతీత వ్యక్తుల్లో పి. శ్రీదేవికి ఇందిర పట్ల రవ్వంత  ప్రేమ  ఎక్కువగా ఉంది అన్న విషయం. పాఠకుడికి తెలుస్తూనే ఉంటుంది. బుచ్చిబాబు కానీ, పి. శ్రీదేవి ,కానీ మిగత పాత్రలకు అన్యాయం చేయలేదు .

రచయిత ఒక ప్రపంచాన్ని  సృష్టించాక  పాత్రలను వాటి  మానాన  వాటిని ఎదగనిస్తే ,వాటి  సంతోషాలను, వాటి  దు:ఖాలనువాటిని  అనుభవించనిస్తె మంచి నవల పుడుతుంది.
రచయిత ఎప్పుడైతే తన పాత్రలను నియంత్రించడం మొదలుపెడతాడో  అప్పుడు అవి తమ సహజ సిద్దమైన పరిమళాన్ని కోల్పోతాయి . బుచ్చిబాబు దయానిధి, విశ్వనాధ ధర్మారావు , గోపీచంద్‌ అసమర్ధుడు ఇన్నాళ్ళు  బతికి వున్నారంటే  వారి  మీద ఆయా రచయితల నియంత్రణ లేదు.

ఇందులోని నారాయుడు  పాత్ర రచయిత నియంత్రణ ఉంటే ఎలా నిష్క్రియాపరంగా  తయారవుతాయో  తెలియజేయటానికి ఒక మంచి ఉదాహరణ. ప్రతి పాత్ర ప్రవర్తన  వెనుక ఉన్న కార్య కారణ సంబంధాలు తెలివైన పాఠకుడి  కి ఛాయా మాత్రంగానైన గోచరమౌతూఉండాలి.

అప్పుడు మాత్రమే ఆ పాత్రలను పాఠకుడు సానుకూల దృక్పధంతో  హృదయంలోకి తీసుకుంటాడు. అలా కానప్పుడు నవలలో పాత్ర అయితే  ఉంటుంది కానీ, అందులో ఆత్మ ఉండదు.
మొదటి భార్య కొనమ్మి అరవ మాదిగ ఆయనతో వెళ్ళిపోయినప్పుడు నారాయుడు  ప్రతి స్పందన మనకు తెలియదు. రెండో భార్య ప్రియున్ని ఇంట్లోకే తెచ్చిపెట్టుకుంటే అతని స్పందన  ఏంటో కూడా మనకు తెలియదు. నారాయుడి  మౌనానికి , నిష్క్రియా పరత్వానికి  ఏదో ఒక బలమైన కారణం ఉండాలి కదా. లేక పోతే మామూలు మనుషులు లాగే అతడి కి కోపం, దు:ఖం, నిస్ప హ లాంటి భావోద్వేగాలు ఎందుకు కలగలేదు. అనే సంశయం పాఠకుడి  ని వేధిస్తుంది. దురదృష్టం  ఏమిటంటే ఇక్కడ బలమైన కారణం రచయితే.

రచయిత దృష్టి  ఎంత సేపటికి  పందొసంత మీద ఉంది తప్పిస్తే  నారాయుడి  మీదకు మళ్ళలేదు. పందొసంత పాత్ర చదువుతుంటే నాకు  రావూరి  భరద్వాజ పాకుడు రాళ్ళు నవలలోని మంజరి గుర్తుకొచ్చింది. మంజరి కార్యస్థానం వేరు. పందొసంత కార్యస్థానం వేరు. చిత్రసీమలో తప్పనిసరి పరిస్థితులలో తన లక్ష్యాన్ని చేరడం కోసం అందరికి శరీరాన్ని  అప్పగించి అత్యున్నత స్థాయికి వెళ్ళి అధమ స్థాయికి పడి  పోతుంది మంజరి. కానీ, ఈ నవలలో పందొసంతకి శరీరాన్ని  రంగ బిళ్ళకి, చంద్రారెడ్డికి అప్పగించాల్సినంత  బలీయమైన కారణాలను పాఠకుడి  కి రేఖామాత్రంగానైనా నామని చెప్పలెదు. పాకుడు రాళ్ళూ నవలలో  భరద్వాజ చెప్పాడు కనుక మంజరి పట్ల పాఠకుడ కి సానుభూతో, సహానుభూతోకలుగుతుంది. పందొసంత విచ్చలవిడి  తనానికి , విశృంఖలత్వానికి ఉండవలసిన తాత్త్విక   భూమిక ఏదీ నవలలో కనిపించదు. పోనీ ఆతాత్త్విక  భూమిక గ్లోబలైజేషన్‌ అనుకోవాలనుకున్నా , ఈ కథ నడ చింది మొదటి దశ ఆర్ధిక సంస్కరణలు మొదలుకావడానికి దశాబ్దం ముందు. పాతికేళ్ల క్రితం ఆంధ్రదేశంలోని పల్లెటూళ్లు ఇప్పుడు కలుషితమైనంతగా అప్పుడైతే కాలేదు. కనుక పొయెటిక్‌ లిబర్టీ ఇక్కడ అస్సలు అన్వయించదు.

ఈ నవల అంత కామంతో నిండి  పోయిన చీకటి పాఠకుడి  ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దానికి తోడు రచయిత ధారాళంగా , యధేచ్ఛగావాడిన  బూతు, అశ్లీల పదజాలం కొంచెం కఠిన మైన మాటేమోకానీ, రోత కలిగిస్తుంది. ఈ బూతు వాడటం  ఏ శిల్ప సౌందర్యం కోసమో నాకయితే  అర్ధంకాలేదు. ఈ బూతు పురాణం  గురించి నామిని ఏమంటున్నాడో  చూడండి.
‘‘నా  పుస్తకంలో బూతులుంటాయనే మాట గురించి. కొన్ని కొన్ని పదాలను పట్టుకొని బూతులనేంత దుర్మార్గం  ఇంగొకటుండదు. నేను పల్లెటూరోడి  ని, యం.ఎస్సీ దాకా చదువుకున్న . మళ్ళా కతలు రాసేసిన  . అదే ఊళ్ళో వాళ్ళ  మింద. మా ఊళ్లో పి.జీ. చేసిన మా ఎత్తిరాజులు  బావ తమ్ముడు జయ చంద్ర నాయుడు  అని ఎకనమిక్స్‌ లెక్చరర్‌గా ఇప్పుడు ఉండాడు. మరేదస్తుడు. ఒక్క బూతు పదం మాట్లాడంగా ఎవరూ ఇనిండరు. నేను మా మేనత్త అయిన వాళ్ళమ్మను  జుట్టుకు ముడేసుకున్న గుడ్డ పీలికను  పెరికేసి ‘‘నువ్వు బోయే లంజా’’ అనే వాడిని . మా జయచంద్ర బావకు మా అమ్మ మేన మామ పెండ్లాం కదా. అత్తా , చిన్నత్తా  అని మరేదగా పిలిచేవోడు.
ఎమ్మేస్సీ చదవంగానే నేను ఊళ్లో ఆడోళ్ళందరి దగ్గర మరేదలు పొందుతా, వాళ్ళకు పిలుపుల్లో మరేదలిస్తా, వుండా ననుకోండి  , నేనేంది పుస్తకం  రాసేది  బొచ్చులో కొంచెం’’

ఇవి నా  మాటలు కావు. నామిని  ఆత్మకథ.  నామిని  నెం. 1 పుడింగి  అనే పుస్తకంలోవి. పుస్తకం నిండా బూతులురాయడానికి  చెప్పిన కారణమేమీ నాకు కన్విన్‌సింగ్‌గా లేదు. కొన్ని పదాలను పట్టుకొని బూతులనేంత దుర్మార్గం  ఇంగొకటుండదు అనే బుకాయింపు ఒకటి.
‘‘మొగోడన్నాక , మొగోడి  గా పుట్టినాక  మొగోడి  ఆటలే ఆడాల. మొగోడు తిరక్కపోతే, తిరక్కపోతే  ఏరిగే ఆడది కూడ ముడ్డినట్టా  పైకి లేపదు. నువ్వు తాగితే  చూడాలని, ఒక లంజని పెట్టుకుంటే చూడాలని ఉండాది. నువ్వియ్యాళకు ఒక లంజని పెట్టుకునేది కూడా నేర్వలేదని ఊరంత నవ్వుకుంటుండారు’’ ఇలాంటి మాటలు ఈ నవల నిండా కోకొల్లలు. వీటిని ఏవో కొన్ని మాటలు అని నామిని  అంటే నామినికో నమస్కారం.

ఈ పుస్తకాన్ని ఆంధ్రజ్యోతిలో సమీక్షిస్తూ జి.ఎస్‌.రామ్మోహన్  ‘‘నామిని మూలింటామెను కావ్య నాయిక  చేశారు. ధర్మారావు , ధయానిధి ప్రక్కన పీట వేసి కూర్చోబెట్టారు.’’ అని చెప్పారు. ధర్మారావు  అంటే నాకు  వేయి పడగలలోని ధర్మారావే  గుర్తుకొచ్చాడు . వేయి పడగలు నవల ఇలా ముగుస్తుంది.
చివరకు ఏమి మిగిలింది?
నీవు మిగిలితివి. నేను మిగిలితిని అంటూ చిన్న ధర్మారావు , చిన్న అరుంధతి వైపు చూస్తాడు.
విశ్వనాధ  ఎంత అభివ ద్ధి నిరోధకుడు అయినా కానీ , ఒక సంప్రదాయ వ్యవస్థను నిలబెట్టడం కోసం చిన్న ధర్మారావుని  నిలిపాడు.
మరి నామిని  ఏ విలువలను కాపాడటం కోసం మూలింటామెను చంపేశాడు ?
‘‘ఒక పుస్తకం చదివాక , మనలో మంచి రసాయన ఊరాల ’’ అని నామిని  తన ఆత్మ కథలో అన్నాడు . నాలో  అయితే ఈ పుస్తకం చదివాక  ఏ రసాయనము ఊరలేదు. కాముకత్వపుచీకటిలో దారీ తెన్నూ  కనపడక కూలపడి  పోయాను.
నామినీ  ఏమిటీ పని?

-వంశీకృష్ణ

 

 

మా పురపాలకోన్నత పాఠశాల – భలే రోజులూ – జ్జాపకాలూ

chitten raju

రామారావు పేట శివాలయం దగ్గర మ్యునిసిపల్ మిడిల్ స్కూల్ లో మూడో ఫారం పూర్తి అయ్యాక పాక లో నించి పక్కా సిమెంట్ బిల్దింగ్ లో జరిగే నాలుగో ఫారం లో ప్రవేశించగానే నాకు హిమాలయా పర్వతాలు ఎక్కిన ఫీలింగు వచ్చేసింది. ఎందుకంటే అంత వరకూ నేను “బెంచీ ఎక్కిన” పాపాన పోలేదు. ఒకటో క్లాసు నుంచీ మూడో ఫార్మ్ దాకా నెల మీదే కూచుని చదువుకున్నాను కానీ నాలుగో ఫారం లో స్కూలు బెంచీలు ఉండే క్లాసులో ప్రవేశించాను అన్నమాట. అందులోనూ మొదటి బెంచీలో మధ్య సీటులో మేష్టారికి సరిగ్గా ఎదురుగా కూచునే వాడినేమో, ఇంకా గర్వంగా ఉండేది. అది 1956-57 వ సంవత్సరం. నాకు ఆ సంవత్సరమే పురరపాలక సంఘం వారు మా గాంధీ నగరంలో హైస్కూల్ మొదలుపెట్టడానికి నిర్ణయించారు. అప్పుడు ముందు పార్కుకి ఉత్తరం వేపు ఉన్న ఖాళీ స్థలం లో ఒక పెద్ద పాక వేయించి అందులో ఎస్.ఎస్.ఎల్.సి క్లాసులు, తాత్కాలికంగా నాలుగో ఫార్మ్, ఐదో ఫార్మ్ క్లాసులు రామారావు పేట మిడిల్ స్కూల్ లోనూ నిర్వహించడం మొదలుపెట్టారు.

1958 లో ఇప్పుడున్న పెద్ద సిమెంటు భవనం కట్టి మొత్తం అన్ని క్లాసులూ గాంధీ నగరం ప్రాంగణానికి తరలించారు. నా హైస్కూల్ ప్రహసనంలో నాలుగో ఫార్మ్ మటుకు రామారావు పేట, మిడిల్ స్కూల్ ప్రాంగణం లోను తరువాత ఐదో ఫార్మ్, ఎస్.ఎస్.ఎల్.సి పార్కు వెనకాల గాంధీ నగరం ప్రాంగణం లోనూ మహదానందంగా చదువుకున్నాను. అవి భలే రోజులు. అంత కంటే భలే జ్జాపకాలు. 1959-60 లో ఆ స్కూల్ నుంచి S.S.L.C. పాస్ అయిన సుమారు ముఫై మంది మూడో బేచ్ లో నేను ఒకణ్ణి. నేను మా సెక్షన్ కి ఫస్ట్..కానీ మూడు మార్కుల తేడా తో స్కూల్ మొత్తానికి సెకండ్.
ఇక వివరాల్లోకి వెళ్తే, నా ఫోర్త్ ఫారం టీచర్లలో నాకు ఇంకా బాగా జ్ఞాపకం ఉన్న టీచర్లలో లంక వెంకటేశ్వర్లు గారు ఒకరు. ఆయన అప్పుడే టీచర్ గా చేరి, మాకు లెక్కలు చెప్పేవారు. ఆయనతో తమాషా ఏమిటంటే, ఒక లెక్కల సిధ్ధాంతం ప్రతిపాదించి, దానికి విలోమ సిధ్ధాంతం, ఉప పత్తి మొదలైన అంశాలు చెప్పి, మాకు ఒక లెక్క చెయ్యమని ఇచ్చేవారు. దానికి మేము పధ్ధతి ప్రకారం లెక్క పూర్తి చేసి ఆన్సరు రాసిన తరువాత, మా పేపర్లు దిద్దే వారు. పొరపాటున ఆ ఆన్సర్ కి మేము యూనిట్స్ రాయక పోయామో. అంతే సంగతులు. మార్క్లులు సున్నా. పైగా….”ఏరా, ఈ ఆన్సరు గాడిదలా, గుర్రాలా, నీలాగా కోతులా?…ఆ ఆన్సరు పాతిక 24.55 అంగుళాలు అనో, పౌనులు అనో, రాయక్కర్లేదూ, రాత్రి నేను ఇంటికె వెళ్ళాక కలగన మంటావా?” అని చెడామడా తిట్టే వారు. అయన లెక్కల పాఠాలు అద్భుతంగా చెప్పే వారు. అలాగే దీక్షితులు గారు సైన్స్ చెప్పేవారు. ఆయన పాపం చాలా దూరం నుంచి వచ్చేవారు.

ఆ రోజుల్లో మా ఇంట్లో అలవాటు ప్రకారం, మా తోటలో పండిన కూరగాయలన్నీ మా టీచర్లందరికీ మా అమ్మ ఒక్కొక్కరికీ ఒక్కొక్క సంచీ చొప్పున మా చేత పంపించేది. ప్రతీ వారం వంకాయలో, బెండ కాయలో, మొక్క జొన్నలో….అన్నీ మా నాన్న గారు స్వయంగా పండించినవే..లేక పోతే మా పొలం నుంచి మా పెద్దన్నయ్య పంపించినవో…అందరికీ ఇచ్చేవారు. ఒక వారం తాతబ్బాయి గారికి వంకాయలు ఇస్తే, దీక్షితులు గారికి బెండకాయలు ఇచ్చేది మా అమ్మ. ఒక సారి దీక్షితులు గారు “విత్తనాలు నాటడం ఎలా, వాటికి మొట్ట మొదటి ఆకు ఎలా వస్తుందీ, మూడో ఆకు కూడా వచ్చే దాకా దానికి పురుగు పట్టకుండా ఎలా జాగ్రత్త పడడం” అనే విషయాల మీద మాకు సైన్స్ పాఠం చెప్పి, దానికి ప్రాక్టికల్ మా తోటలో చేయించారు. అంటే, ఆయనే మా ఇంటికి వచ్చి, మా అమ్మతోటీ, నాన్నగారితోటీ మాట్లాడి, మా తోటలో ఒక పది చదరపు అడుగుల స్థలం అడిగి తీసుకున్నారు. మా చేత అది దున్నించి, కలుపు తీయించి, జపాను పధ్ధ్దతిలో బెండ విత్తనాలు నాటించి, వాటికి కాయలు కాసే దాకా సుమారు ఆర్నెల్లు మమ్మల్ని తోటపనిలో ఆసక్తి కలిగేలా చేశారు.

 

ఇవాళ, అమెరికాలో మా ఇంటి వెనకాల తోటలో బెండ కాయలు, దొండ కాయలు, అరటి కాయలు, కరివేపాకు, టొమేటోలు, కేబేజీ, కాలీ ఫ్లవరు, బచ్చలి, గోంగూర ..ఇలా ఏ కూర గాయలు నేను కష్టపడి పండించగా మా క్వీన్ విక్టోరియా మనసారా ఆరగించినా, మా స్నేహితులకి పంచి పెట్టినా ..అదంతా మా నాన్న గారు, అమ్మా, దీక్షితులి మేస్టారి చలవే. ఆయన్ని నేను 1958 తరువాత చూడ లేదు, కానీ ఆయన డొప్ప చెవులు నాకు ఇంకా గుర్తే!

School Entrance OK

ఇక నా నాలుగో ఫారం లో ఉండగానే తులసీ దేవి గారు, ఇ.వి. రామ్మోహన్ రావు గారు టీచర్లు గా చేరారు అని నాకు గుర్తు. నా ఐదో ఫారం లో తులసీ దేవి గారు మాకు సైన్స్ చెప్పగా, రామ్మోహన్ రావు గారు చరిత్ర చెప్పేవారు. రామారావు పేట స్కూల్ లో చిన్న సైన్స్ లాబ్ కూడా ఉండేది. అది దొర గారి హయాం లో ఉండేది. నాకు తెలిసీ తులసీ దేవి గారు చేరే దాకా ఆయనే స్కూల్ అంతటికీ పెద్ద సైన్స్ మేష్టారు. దొర గారు చాలా స్ట్రిక్ట్ గా ఉండే వారు కాబట్టి ఆయనంటే అందరికీ భయమే! తులసీ దేవి గారికి ఎందుకో తెలియదు కానీ, నేనంటే చాలా ఆప్యాయంగా ఉండే వారు.

నేను అమెరికా వచ్చాక ఒక సారి కాకినాడ వెళ్ళినప్పుడు….మా చెల్లెళ్ళు భానూ, పూర్ణా, ఉషారేవతీ ల తో తులసీ దేవి గారిని చూడ్డానికి వెళ్ళాను. అంటే, నాకు ఆవిడ సైన్స్ పాఠాలు చెప్పిన తరవాత సుమారు నలభై ఏళ్ళు దాటాక అనమాట. అప్పటికి ఆవిడ రిటైర్ అయిపోయారు. మమ్మల్ని చూడగానే ఆవిడ చాలా సంతోషించి, మా చెల్లెళ్ళతో “ఒక సారి ఏమయిందో తెలుసా. నేను మీ అన్నయ్య క్లాస్ కి మనం లోతైన నూతిలోంచి నీళ్ళు తోడుకోడానికి వాడే చేతి పంపు శాస్త్ర ప్రకారం ఎలా పని చేస్తుందో చెప్పాను. వారం తరువాత క్లాసులో తిరిగి చెప్పమని అందరినీ అడిగితే, మీ అన్నయ్య ఒక్కడే ఆ పంపులో ముషలకము, చిన్న గొట్టాంలో దాన్ని మనం పైకి లాగినప్పుడు కిందనున్న అక్కడి గాలి ఎలా శూన్యంగా మారి, ఆ శూన్యంలోకి నూతి నీళ్ళూ ఎలా చొచ్చుకుని వస్తాయో, మనం పంపు కొట్టిన కొద్దీ అదే పదే పదే మళ్ళీ ఎలా పునరావృతం అవుతుందో ఎక్కడా ఒక్క ఇంగ్లీషు మాట లేకుండా చెప్పాడు” అని అప్పటికి నలభై ఏళ్ళ క్రితం నాటి సంగతులు గుర్తు చేసుకుని, తన పాత విద్యార్ధిని కలుసుకున్నందుకు మహదానంద పడ్డారు.

ఈ నాటి విద్యార్ధులు ఎవరికైనా ఆ ముషలకము (పిస్టన్), శూన్య ప్రదేశమూ (వేక్యూమ్) లాంటి పదాలు తెలుసునో, తెలియదో నాకు అనుమానమే. కానీ అప్పటికీ, ఇప్పటికీ పంప్ అనే ఆంగ్ల పదానికి తెలుగు మాట లేదు అనే నేను అనుకుంటున్నాను. కానీ అప్పటి గొట్టాం ..అనగా సిలిండర్ ..అనే మాటని మటుకు “గొట్టాం గాడు” అని నా మీద ప్రయోగిస్తూ ఉంటారు నా గాఢ మిత్రులూ-గుఢ శత్రువులూ కొంతమంది. అన్నట్టు తులసీ దేవి గారి తమ్ముడు తులసీ దాసూ, నేనూ కాకినాడ ఇంజనీరింగ్ క్లాస్ మేట్స్. నాకు తెలిసీ, తులసీ దేవి గారు పెళ్ళి చేసుకో లేదు.
ఇక ఇ.వి.ఆర్ రామ్ మోహన రావు గారు చాలా విశిష్టమైన, విలక్షణమైన టీచరు. ఎందుకంటే, ఆయన పాఠాలు చెప్పే పధ్దతి తాతబ్బాయి గారిలాగా నీరసంగా ఇదెక్కడి గోలరా బాబూ, హాయిగా ఇంటికెళ్ళి పడుకోకుండా?” అనే పధ్ధతిలో కాకుండా యువ రక్తంతో ధాటీగా, హావభావాలతో. నవరసభరితంగా ఉండేది. అంతకంటే ముఖ్యంగా ఆయన షేక్స్ పియర్ ఇంగ్లీషు నాటకాలు వేసే వారు. నా ఐదో ఫారంలో స్కూలు వార్షికోత్సవాలలో జూలియస్ సీజర్ ని బ్రూటస్ మొదలైన రోమ్ సెనేట్ సభ్యులందరూ హత్య చేసినప్పుడు సీజర్ శవం ముందు ఆయన మార్క్ ఏంటొనీ ప్రసంగం అత్యద్భుతంగా నటించే వారు. అదే నాటకం నేను ఒక సారి న్యూయార్క్ బ్రాడ్వే లో చూసినా నాకు ఇప్పటికీ, అంటే సుమారు యాభై ఐదు సంవత్సరాల తరువాత మన ఇ.వి.ఆర్ గారి ఆ సీను మటుకు ఇంకా నా కళ్ళలో మెలుగుతూ ఉంటుంది. అప్పటికి ఆయనకి పెళ్ళి కాలేదు కానీ, మా క్లాస్ లోనే ఉన్న ఒక అమ్మాయి తో పెళ్ళి కుదిరింది అని చెప్పుకునే వారు. అంటే, తన శిష్యురాలినే ఆయన వివాహం చేసుకున్నారన మాట.
నా ఫోర్త్ ఫారం లో మాకు కృష్ణమాచార్యులు గారు తెలుగు చెప్పేవారు. ఆయన సాధారణంగా తెలుగు మేష్టారు అనగానే అందరికీ స్ఫురించే లాగానే… అనగా పంచె కట్టూ, కండువా, తిలకం బొట్టూ పెట్టుకుని ఉన్నప్పటికీ, అస్సలు చిరు బొజ్జ అయినా లేకుండా బాగా కసరత్తు చేసిన శరీరంతో బలంగా ఉండేవారు. బహుశా అందుకే నేమో ఆయన నిక్ నేమ్ “గునపం” గారు. చాలా శ్రావ్యంగా తెలుగు పద్యాలు చదివే వారు. ఐదో ఫార్మ్ లోకి రాగానే యజ్ఞేశ్వర శాస్త్రి గారు ఒక తెలుగు సెక్షనూ, కృష్ణమాచార్యులు గారు మరొక సెక్షనే కాక, ఒకరు డిటైల్డూ, మరొకరు నాన్-డిటైల్డు చెప్పేవారు. వారిద్దరూ, వేదుల సత్యనారాయణ గారూ, వర్మ గారూ నా బోటి వాళ్లకి ఇప్పటికీ తెలుగు భాష మీద అభిమానం, ప్రేమ ఉండడానికి ప్రధాన కారకులు. వారి ఆప్యాయతకీ, నేర్పిన తెలుగు పాఠాలకీ మా జన్మ అంతా ఋణపడే ఉంటాం.

వర్మ గారి వాక్కు, వర్చస్సు, పాఠాలూ చెప్పే విధానం మనస్సుకి హత్తుకిపోయేవి. ఉదాహరణకి ఆయన లెక్కలు చెప్తూ, పైథాగరస్ సిధ్ధాంతం చెప్తూ ఉంటే, ఆ పైథాగరస్ వచ్చి మా ముందు నుంచుని వివరిస్తున్నాడు అనే మాకు అనిపించేది. పైగా ఆయన ఖద్దరు పంచె కట్టుకునే వారు. లెక్కలే కాకుండా ఆయన ఏ సబ్జెక్ట్ అయినా చెప్పగలిగే వారు. గాంధీ నగరంలోనే, అచ్యుతాపురం గేట్ దగ్గర ఉండేవారు అని జ్ఞాపకం. ఇక నాలుగో ఫారం నుండి అన్ని తరగతులలోనూ హిందీ కంపల్ సరీగా ఉండేది. ఆ మూడేళ్ళూ మాకు సునందినీ దేవి గారు హిందీ చెప్పేవారు. ఆవిడ సన్నగా. పొడుగ్గా హుందాగా ఉండే వారు. హిందీలో హై అనే మాటని పొడిగా కాకుండా కొంచెం ముక్కుతో పలకాలి అని ఆవిడ మమ్మల్ని సరిదిద్దినప్పుడల్లా, అందరం ముక్కుతో “హై, హై” అనేసి నవ్వుకునే వాళ్ళం. ఆవిడ నిక్ నేమ్ “బలాక్”. హిందీలో బలాక్ అంటే అంటే కొంగ అని అర్థం ట. మరి ఆవిడ సన్నగా, పొడుగ్గా ఉంటారుగా, బహుశా అందుకే! నిజానికి హిందీ కంపల్ సరీ యే కానీ ఆరోజుల్లో చాలా మంది పిల్లలు హిందీ లో ప్రశ్నాపత్రాన్ని కొంత తిరిగి రాసేస్తే చాలు, పేస్ మార్కులు ఇచ్చేసే వారు. సమాధానాలు రాయక్కర లేదు. అది ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు కి ఆ ఖర్మ పట్టింది…అసలంటూ తెలుగు అనే పాఠ్యాంశం ఏ స్కూల్ లో ఇంకా ఉంటే, గింటే!
మా నాలుగో ఫారం పూర్తి అయ్యేదాకా రామారావు పేటలో సెకండరీ స్కూలు లేనే మేము చదువుకున్నాం. రోజూ పొద్దున్నే చద్దన్నం, కొత్తావకాయ తినేసి, పార్కు మీదుగా ఆచారి గారి ఆయుర్వేదం ఆసుపత్రి దాటుకుని, అక్కడ బట్టలు ఉతుక్కుంటూ అరుచుకుంటూ దెబ్బలాడుకుంటున్న చాకలి వాళ్ళ మధ్య నుంచీ, శివాలయం దగ్గర రోడ్డు మీద నుంఛే అరక్షణం దణ్ణం పెట్టేసుకుని స్కూలికి వెళ్ళిపోయే వాళ్ళం. 1957 లో అనుకుంటాను, ఒక రోజు మేము క్లాసు లో మా డవాలీ బంట్రోతు హెడ్మాస్టర్ గారి సర్క్యులర్ పట్టుకొచ్చాడు. సాధారణంగా ఏదైనా పరీక్షల ప్రకటనలో, లేక పోతే ఎవరో పెద్దాయన పోతే ఆ మర్నాడు శలవు అని చెప్పడానికో అలాంటి సర్క్యులర్ లు వచ్చేవి.

ఈ సారి ఎవరు పోయారో అనుకుని మేము పుస్తకాలు సద్దేసుకుంటూంటే “ఇక వచ్చే యేటి నుంచి ఐదో ఫారం క్లాసులు, ఆ తరువాత క్లాసులూ అన్నీ కొత్తగా పార్కు వెనకాల కడుతున్న హైస్కూల్ బిల్డింగులో జరుగుతాయి అనీ, ఆ విషయం మా తల్లి దండ్రులకి ముందే తెలియ జెయ్యవలసినదిగా హెడ్మాస్టర్ గారి హెచ్చరిక”…అని ఇంచుమించు ఆ హెచ్చరిక సారాంశం. “హమ్మయ్య, ఇక రోజూ పొద్దున్నే ఇంత దూరం నడవక్కర లేదు. ఇంకో పది నిముషాలు పడుకుని, పార్కు దాటేస్తే, స్కూల్ కి వచ్చేస్తాం” అని మాత్రమే నాకు అప్పుడు అర్థమైన విషయం.

సారాంశం ఏమిటంటే, ఇప్పటి హైస్కూల్ భవనంలో ఐదో, ఫారమూ, ఎస్సెస్సెల్సీ చదువుకున్న మొట్ట మొదటి విద్యార్ధులు సుమారు ముఫై మంది ఉండేవాళ్ళం. ముమ్మిడి సూర్యనారాయణ (అచ్యుతా పురం గేటు), నండూరి వెంకటేశ్వర్లు (దేవాలయం వీధి), రాట్నాల హరనాథ్ (స్టేషన్ రోడ్), ఏడిద ముని సామ్రాట్ (శంకరాభరణం సినీ నిర్మాత ఏడిద నాగేశ్వర రావు తమ్ముడు, అచ్యుతాపురం గేటు), పి.యస్.కె. సోమయాజులు ( మా ఇంటి పక్కనే పార్కు దగ్గర ఇల్లు), విన్నకోట గాడు (రెడ్ క్రాస్ రోడ్), ఆచారి (గాంధీ నగరం మార్క్టెట్ దగ్గర), రాయవరపు సత్యనారాయణ, అతని తమ్ముడు ఆదినారాయణ రావు (రామారావు పేట మూడు లైట్ల జంక్షన్) అప్పటి నా క్లాస్ మేట్స్ లో ఈ క్షణంలో నాకు జ్ఞాపకం వస్తున్న కొన్ని పేర్లు. వీళ్ళల్లో అందరికంటే పొడుగ్గా ఉంటాడు కాబట్టి నండూరి గాడు మా క్లాస్ మానిటర్ అయితే, పొట్టిగా ఉన్నా ఫస్ట్ మార్కులు వస్తాయి కాబట్టి నేను అసిస్టెంట్ మానిటర్ ని.

S.S.L.C. Certificate
ఇక ఎవరైనా నవ్వుతారేమో నాకు తెలియదు కానీ అప్పుడు మా క్లాస్ లో ఉన్న ఆరుగురి ఆడపిల్లల పేర్లూ ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకమే…ముఖ్యంగా అనంత లక్ష్మి (నిక్ నేమ్ పేపర్ షాట్..ఎల్విన్ పేట.), సుశీల, శ్రీ లక్ష్మి (అప్ప చెల్లెళ్ళు, నూకాలమ్మ గుడి) చాగంటి లక్ష్మి (గాంధీ నగరం), మరుద్వతి (శివాలయం దగ్గర), రమా గున్నేశ్వరి (శివాలయం వీధి), ర్యాలి సరళ. నేనూ, ఈ ఆడపిల్ల్లలూ రామారావు పేటలో చదువుకున్న మాధ్యమిక పాఠశాలలో మూడేళ్ళూ, ఆ తరువాత 1960 లో గాంధీ నగరం పురపాలకోన్నత పాఠశాల మొట్ట మొదటి బేచ్ లో ఎస్సెస్సెల్సీ పాస్ అయిన దగ్గరనుంచీ, ఇప్పటి దాకా..అంటే యాభై ఏళ్ళలో నేను వాళ్ళలో ఎవరినీ చూడ లేదు….ఒక్క సరళని తప్ప. అదైనా ఆ అమ్మాయి ఎక్కడో మా హాయ్ స్కూల్ మీద నేను వ్రాసున ఇదే మోస్తరు వ్యాసం చదివి, అమెరికా తన కొడుకు ని చూడ్డానికి వచ్చినప్పుడు నేను తనని గుర్తు పడతానో, లేదో అని అనుమానంగానే ఫోన్ లో పిలిచింది.

నా చిన్నప్పటి స్నేహితురాలు పిలవగానే నేను సహజంగానే ఎగిరి గంతులు వేశాను. ఆ తరువాత నేను హైదరాబాదులో 2013 అక్టోబర్ లో యువ సాహితీ సమ్మేళనం నిర్వహించినప్పుడు తనూ, వాళ్లాయనా వచ్చి, నాకు ఒక విలువైన బహుమతి ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు తన ఇంటి పేరు అడవి వారు. మిగిలిన వారు నన్ను ఎప్పుడైనా టీవీ లోనూ, పత్రికా వార్తలలోనూ చూసి ఉంటే, నా మొహం గుర్తుపట్టకపోయినా, నా పేరు మర్చిపోరు అనే అనుకుంటాను. పైగా మా ఎస్సెస్సెల్సీ అయిన తరువాత స్కూల్ పార్టీలో అందరం వీడ్కోలు పుచ్చుకుంటూ ఇచ్చిపుచ్చుకున్న ఆటోగ్రాఫ్ పుస్తకంలో వాళ్ళందరూ కూడ బలుక్కుని “మేము నిన్నెన్నడూ మరువము. మమ్ము నువ్వు కూడా మరువకుము” అని ఒకే వాక్యం వ్రాశారు. నేను స్కూల్ లో ఉండగా ఆరేళ్ళలో వాళ్ళతో కేవలం ఐదారు సార్లే మాట్లాడినా, మా అమ్మా, చెల్లెళ్ళూ వాళ్ళని మా ఇంట్లో పేరంటాలకీ పిలిచే వారు. ఆ రోజులే వేరు. స్పష్టంగా ఎందుకో తెలియకపోయినా అవి తెర చాటునుంచే వెయ్యి సార్లు ఆడపిల్లలని చూసే రోజులు.

ఇక మా రోజుల్లో అతి ముఖ్యమైన, చాలా మంది ఉపాధ్యాయుల కన్నా విభిన్నమైన వారు చక్రపాణి గారు. ఈయన నాకు అదో ఫారంలోనూ, ఎస్సెల్సీలోనూ చరిత్ర, ఇంగ్లీషు చెప్పారు. ఆయన చెప్పలేని సబ్జెక్టు లేదు. ఏదో మొక్కుబడికి క్లాస్ లో పాఠం చెప్పేసి, విద్యార్ధులని ఎవరిమానాన్న వాళ్ళని వదిలెయ్యకుండా, వాళ్ళు పరీక్షలకి ఎలా చదవాలీ అనే విషయంలో ప్రత్యేక శ్రధ్ధ పెట్టడం చక్రపాణి గారి ప్రత్యేకత. అందుకని ఆయన ప్రతీ రోజూ, మామూలు క్లాసు అయిపోయాక, అందరినీ తన ఇంటికి పిలిచి, సాంపుల్ ప్రశ్నా పత్రాలు ఇచ్చి శిక్షణ ఇచ్చే వారు. ముఖ్యంగా రాష్ట్రమంతటా ఒకే సారి అందరు విద్యార్ధులకీ జరిగే S.S.L.C పరీక్షలో మన స్కూల్ వాళ్ళు అందరూ నెగ్గాలనే పంతంతో ఉండేవారు. అంటే, కాకినాడ ప్రాంతంలో కాంపిటీషన్ పరీక్షలకి క్లాసుల్లోనే కాకుండా ప్రైవేటుగా శిక్షణ ఇచ్చే తొలి ఉపాధ్యాయులు గా ఆయన పేరు పొందారు.

Conduct Certificate

ఆ రోజుల్లో చాలా మంది టీచర్లు మామూలుగా వచ్చే జీతాలు సరిపోక పాపం ప్రెవేట్లు చెప్పినా, చక్రపాణి గారు ఆ పధ్ధ్దతిని మరొక స్థాయికి పెంచారు. అందుకే కాకినాడ లో ఉన్న అన్ని పాఠశాలల విద్యార్ధులూ ఆయన దగ్గరకి ట్యూషన్ కి వెళ్ళేవారు. అలాంటిదే మరొక ప్రవేటు స్కూల్ శివాలయం పక్కనే ఉండే “కుంటి మేష్టారి స్కూలు”. ఒక సారి మా నాన్న గారు చక్రపాణి గారిని “ఏమండీ మేష్టారూ, మా రాజా ని కూడా మీ దగ్గర ప్రెవేట్ కి చేర్చుకుంటారా?” అని అడిగితే ఆయన నవ్వేసి “ఆ వెధవే అందరికీ ప్రెవేటు చెప్పగలడు. వాడికి అక్కర లేదు. నాదంతా 40 శాతం లోపు వాళ్ళకి సహాయం చేద్దామనే” అని తిరస్కరించారు. అది చక్రపాణి గారి ఉన్నత సంస్కారం. అదే మరొకరైతే, ట్యూషన్ డబ్బు కోసం ఠకీమని ఒప్పేసుకునే వారు. అఫ్ కోర్స్, ఎందుకైనా మంచిదని మా నాన్న గారు అయోధ్యారామం అనే ప్రెవేటు మేష్టారి దగ్గర నన్నూ, మా తమ్ముణ్ణీ, చెల్లెళ్ళనీ ట్యూషన్ కి పెట్టారనుకొండి. అది వేరే విషయం. ఆయన ప్రెవేటు కన్నా శొంఠి పిక్కలకి ప్రఖ్యాతి.

గాంధీ నగరం స్కూల్ కి వచ్చిన తరువాత మాకు చాలా నచ్చిన మరొక టీచర్ నరసాయమ్మ గారు. ఆవిడ చరిత్ర, ఇంగ్లీషు చెప్పేవారు అని జ్ఞాపకం. అంతకంటే ముఖ్యంగా మంచి కథలు చెప్పేవారు. పైగా ఆవిడ భర్త గారు మా నాన్న గారి లాగానే లాయర్ గారు. పి,ఆర్. కాలేజ్ గోడలో గుండ్రంగా తిరిగే చిన్న గేటు దగ్గర రామారావు పేటలో మూడు లైట్ల జంక్షన్ రోడ్డు చివర ఉండేవారు. ఇప్పుడు ఆ గేటు లేదు. మా టీచర్లందరిలోకీ కొంచెం తమాషాగా ఉండేది మా డ్రిల్ మేస్టారు. ఆయన పేరు వెంకటేశ్వర రావు గారు అని జ్ఞాపకం. బహుశా ఈండ్రపాలెం..ఇప్పుడు ఇంద్రపాలెం అని షోగ్గా పిలవడం విన్నాను… నుంచి రోజూ సైకిల్ మీద మా ఇంటి మీద నుంచే స్కూల్ కి వెళ్ళేవారు. “ఒరేయ్, నువ్వు బ్రేమ్మల పిల్లాడివి. నాజూకు వెధవ్వి. నీకు ఇలాంటి ఆటలు పనికి రావు. ఆడితే చస్తావ్. కావాలంటే చదరంగంలో కూచో” అని నన్ను కబాడీ, కోకో లాంటి ఆటలు ఎక్కువ ఆడనిచ్చేవారు కాదు. ఉట్టి డ్రిల్ మాత్రం చేయింఛే వారు. అప్పుడు ముమ్ముడి సూర్యనారాయణ గాడు “పరవా లేదు సార్, నేనే వాడి తరఫున ఆడతాను..వాడు ఉట్టినే ఆటలో అరటి పండే” అని నన్ను కబాడీ టీములో వేయించే వాడు. వాడు పరిగెడుతుంటే నేను కూత కూసే వాణ్ణి. అలాంటి కూతలు ఇంకా కూస్తూనే ఉన్నానని మా క్వీన్ విక్టోరియా అప్పుడప్పుడు వాపోతూ ఉంటుంది.

గాంధీ నగరం స్కూల్లో హెడ్మాస్టారి రూము పక్కనే దొర గారి రూమూ, సైన్స్ పరిశోధన శాలా ఉండేవి. మా ఎస్.ఎస్.ఎల్.సీ లో దొర గారే మా సైన్స్ టీచరు. నా జీవితంలో ఆయన చెప్పినంత ఆసక్తి కరంగా అటు భౌతిక శాస్త్రం కానీ, రసాయన శాస్త్రం, బోటనీ, బయాలజీలు కానీ బోధించగలిగే మరొక ఉపాద్యాయులు ఉంటారని అనుకోను. పైగా ఆయన చండశాశనుడు. అర క్షణం ఆలస్యంగా వచ్చినా, క్లాస్ జరుగుతుండగా కిటికీలోంచి రోడ్డు మీద వెళ్తున్న బస్సు ని చూసినా, ప్రశ్నలకి తడబడుతూ సమాధానం చెప్పినా, హోమ్ వర్క్ చెయ్యకపోయినా, చేసిన హోమ్ వర్క్ లో నిర్లక్ష్యం కనిపించినా, అమ్మాయిల బెంచీకేసి అరక్షణం తలతిప్పినా, ..ఇలా ఒకటేమిటి….ఎప్పుడు, ఎక్కడ ఎలా క్రమ శిక్షణ కి లోపం వచ్చినా అయిందే మన పని. అలా అని, అయన ఎవరినీ కొట్టడం, ఘట్టిగా తిట్టడం ఉండేది కాదు.

ఏ విద్యార్ధి అయినా చిన్న తప్పు చేసినా దొరగారు చూశారేమో అనే భయం వెంటాడేది. అయినా, ఆయనంటే ఎంతో గౌరవంగా ఉండే వాళ్ళం. ఆయన పాఠాలంటే ప్రపంచం మర్చిపోయి వినేవాళ్ళం. నేను రెండేళ్ళ క్రితం మా స్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల తొలి సమావేశానికి హాజరయ్యాను. ఎవరో ఒకరిద్దరు నిర్వాహకులకి నేను తెలిసినప్పటికీ నా హోదా ఆటలో అరటిపండే. అప్పుడు నేను వేదిక మీద ఉన్న దొర గారికి భయం, భయంగా పాదాభివందనం చెయ్యగానే ఆయన నన్ను చూసి “ఏరా. రాజా ఎలా ఉన్నాడు రా?” అని అడిగారు. అది నాకు మహదానందాన్ని కలిగించింది ఎందుకంటే…నన్ను చూసి మా తమ్ముడు అనుకుని, యాభై ఏళ్ళ తరవాత కూడా వాణ్ణి గుర్తుపట్టి, వెను వెంటనే నా యోగక్షేమాలు దొర గారు అడిగారూ అంటే….నేనూ, మా తమ్ముడూ ఎంత అదృష్టవంతులమో కదా అనిపించింది. అదే సభలో ఇ,వి.ఆర్. రామ్ మోహన్ రావు గారూ, అలనాడు నా ఫోర్త్ ఫారం లో నా క్లాస్ మేట్ అయిన ఆయన అర్ధాంగినీ కూడా కలుసుకున్నాను. ఎక్కువ మాట్లాడే అవకాశం కలగ లేదు.

ఆ రోజుల్లో ప్రతీ క్లాస్ కీ విధిగా దొర గారూ, ఇ.వి.ఆర్ రామ్మోహన్ రావు గారూ, చక్రపాణి గారూ, ఇతర ఉపాధ్యాయుల నిర్వహణలో జరిగే వక్తృత్వ పోటీలూ, వ్యాస రచన పోటీలూ మొదలైనవి తలుచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఇవి ఏడాదికి కనీసం రెండు, మూడు సార్లు జరిగేవి. ప్రతీ పోటీకీ ఏదో ఒక సబ్జెక్ట్ ఇచ్చి, దాని మీద వాద. ప్రతివాద పోటీలు పెట్టే వారు. ఈ పోటీలు తెలుగు, ఇంగ్లీష్, హిందీలలో విడి విడిగా ఉండేవి. ఇక “కత్తి గొప్పదా, కలము గొప్పదా?”, లేక ’స్త్రీలకు విద్య అవసరమా, అనవసరమా?” లాంటి సాధారణమైన అంశాల నుండి, “సూయెజ్ కెనాల్ ఎవరి ఆధ్వర్యంలో ఉండాలీ?” లాంటి అలనాడు అంతర్జాతీయంగా అత్యంత కలకలం సృష్టిస్తున్న సమస్యల మీద చర్చావేదికలు మా ఉపాధ్యాయులు నిర్వహించే వారు. ఇలాంటి చర్చలు ఐక్యరాజ్య సమితి వేదికలు గా తీర్చి దిద్ది, ఒక్కొక్క విద్యార్ధీ ఒక్కొక్క దేశం తరఫున తమ వాదనలు వినిపించే వారు. అందులో నాది ఎప్పుడూ భారత దేశం తరఫున నెహ్రూ గారి పాత్రే!. అందు చేత నేను రోజూ పేపర్లు చదువుతూ, నెహ్రూ గారి ఉపన్యాసాలన్నీ కత్తిరించుకుని దాచుకుంటూ, రేడియోలో వార్తలు ఖచ్చితంగా వింటూ ఉండేవాణ్ణి. ఆ వార్తలు కూడా పార్కులో ప్రతీ సాయంత్రం ఆరు గంటలకి వచ్చినప్పుడు మొత్తం గాంధీ నగరం జనాభా అంతా అక్కడే ఉండే వారు.

మా స్కూల్ లో ఐక్యరాజ్య సమితి వేదిక పెట్టినప్పుడు నేను కాంగ్రెస్ టోపీ పెట్టుకుని, కోటు వేసుకుని, గులాబీ పువ్వు పెట్టుకుని మాట్లాడేవాడిని. ఇక రష్యా ప్రధాని కృశ్చెవ్, అమెరికా తరఫున ఐసెన్ హోవర్, యుగోస్లావియా ప్రెసిడెంట్ టిటో, ఈజిప్ట్ ప్రెసిడెంట్ గమాల్ అబ్దుల్ నాజర్ లాంటి అత్యంత ప్రతిభావంతుల పాత్రలు మిగిలిన విద్యార్ధులు వేసే వారు. ఆ నాటి ఆ అనుభవాలే ఈ నాడు నన్ను ఈ విధంగా తీర్చిదిద్దాయి అనడంలో అతిశయోక్తి లేదు. అప్పుడు నేను గెలుకున్న వెండి పతకాలు పాతిక పైగా ఇంకా నా దగ్గర అమెరికాలో ఉన్నాయి.

ముక్తాయింపు:

ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎంతయినా ఉంది కానీ, సుమారు నాలుగేళ్ల క్రితం నేను కాకినాడ వెళ్ళినప్పుడు, నేను చదువుకున్న మ్యునిసిపల్ హైస్కూల్ ఎలా ఉందో అని చూడడానికి వెళ్ళాను. గుమ్మంలో ఉండగానే ఒక దుండగీడులా ఉండే గుండు కుర్రాడు కనపడ్డాడు. పైన ఇంగ్లీషు లో ఉన్న బోర్డ్ చూసి అనుమానం వచ్చి “ఇది గాంధీనగరం పురపాలకోన్నత పాఠశాలే కదా?” అని పలకరించాను. “ఏమో సార్, దిస్ ఈజ్ Mahatma Gandhi Memorial High School, సార్” అన్నాడు. “ఓహో, మరి నువ్వేం చదువుతున్నావ్, అబ్బాయ్?” అని అడిగాను. ఆ కుర్రాడు నా మొహం చూసి “అయామ్ ఇన్ ఫోర్త్ ఫారం. సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్.” అని గర్వంగా గుండు తల ఎగరేశాడు.

నేను కొంచెం జుట్టు పీక్కుని “నేను తెలుగులో అడిగాను కదా. మరి నువ్వు ఇంగ్లీషులో సమాధానం చెప్పావేం?” అని అడిగాను. వాడు చిన్న నవ్వు నవ్వి “మీ మొహం ఎన్నారై మొహం సార్.” అని కిచ కిచలాడాడు. “ఒహో, ఆ రూట్లో వచ్చావా?” అని స్కూల్ లోపలికి అడుగుపెట్టాను. చుట్టూ చూడగానే నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. స్కూల్ గోడలన్నీ వెల, వెలబోతూ, నల్లటి వర్షం నీటి చారకలతో కళావిహీనంగా ఉంది. ఒక గదిలో పిల్లలు నేల మీద కూచుని చదువుకుంటున్నారు. ఎక్కడా స్కూల్ బల్లలు లేవు. మేష్టారి కోసం మాత్రం ఒక పాత కాలం కుర్చీ ఉంది. అదే గదిలో నేను నా ఎస్.ఎస్.ఎల్.సీ చదువుకున్నాను. అప్పుడు బల్లలూ, మంచి బ్లాక్ బోర్డూ, అన్నీ ఉండేవి. వెంటనే హెడ్మాస్టారి గదికి వెళ్ళి పరిచయం చేసుకుని పరిస్థితి తెలుసుకున్నాను. పదవ తరగతి ఎంట్రెన్స్ పరీక్షలకి బల్లలు లేక ఆయన తన స్వంత ఖర్చుతో అద్దెకు తీసుకునే పరిస్థితిలో స్కూల్ ఉంది అనీ, అన్నింటికీ కార్పొరేషన్ వారే బాధ్యత అనీ వివరించారు. వెంటనే కార్పొరేషన్ మేయర్ గారిని కలిశాను.

MGMh 2

“కేవలం ఉపాధ్యాయులకి జీతం ఇవ్వడానికి తప్ప, గోడలకి వెల్లవెయ్యడానికీ, బల్లలు కొనడానికీ, సైకిల్ స్టాండ్ కీ, ఆఖరికి ఆడపిల్లలకి టాయిలెట్ సౌకర్యానికీ కూడా బడ్జెట్ లేదు” అని మేయర్ గారు చేతులెత్తేశారు. అదే స్కూల్ లో చదువుకుని కార్పొరేషన్ లో కౌన్సిల్ మెంబర్లగా ఉన్న వారిదీ అదే డైలాగు. అసంకల్పిత చర్యగా “మేము ఎలాగో అలాగ డబ్బు సంపాదించి, మా పాఠశాలకి కనీస సౌకర్యాలు కలిగించడానికి మీరు సహాయం చెయ్యలేకపోయినా, అడ్డు పడకుండా ఉండండి” అని వారి హామీ పుచ్చుకున్నాను. కానీ ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఏమీ తోచ లేదు. కేవలం యాదృచ్చికంగా, దైవేఛ్చగా, ఇంచుమించు అదే సమయంలో మా స్కూల్ చూడగానే మరొక పూర్వ విద్యార్ధి, మా పక్కింటి వాడు, మా తమ్ముడి క్లాస్ మేట్ అయిన తురగా చంద్ర శేఖర్ కూడా అవే ఆలోచనలు వచ్చి నాలా బాధ పడి ఆగి పోకుండా వెంటనే కార్యాచరణకి దిగాడు. అతనితో చెయ్యి కలిపి అందరం కలిసి మా పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం స్థాపించాం.

హెడ్మాస్టారినీ, ఉపాధ్యాయులనీ, విద్యార్ధులనీ కలుసుకుని అర్జంటుగా కావలసిన సౌకర్యాల లిస్టు తయారు చేసుకుని, రెండేళ్ళలో, స్కూల్ బెంచీలు కొనడం, గోడలకి రంగులు వేయించడం, మంచి నీళ్ళ సదుపాయం, పిల్లల కాళ్ళకి చెప్పులు సప్లై మొదలైన మొదటి విడత పనులన్నీ పూర్తిచేశాం. నేను ఎక్కడో అమెరికాలో ఉన్న కారణం చేత కేవలం విరాళాలు పోగెయ్యడంలో సహాయం చెయ్యడం తప్ప, ఈ బృహత్కార్యం మా ట్రస్ట్ అధ్యక్షుడు చంద్ర శేఖరూ, సభ్యులు అబ్బూరి విఠల్, నరసింహా రావూ, రామకృష్ణ రాజూ, లక్ష్మణ రావూ (కార్పొరేటర్), బి.వి. రమణ (యెమెన్ దేశం) తదితరులూ హెడ్మాస్టార్ వేణుగోపాల రావు గారి సహకారంతో పూర్తి చేశారు. మేం అందరం డిశంబర్ 2012 లో మా ఉన్నత పాఠశాల డైమండ్ జూబిలీ సగర్వంగా జరుపుకుని, అప్పటి మా ఉపాధ్యాయులని గౌరవించుకున్నాం. అప్పటి కొన్ని ఫోటోలు ఇందుతో జత పరుస్తున్నాను. పూర్తి వివరాలూ, మా స్కూల్ వివరాలూ ఈ క్రింది వెబ్ లంకె లో చూడండి.
http://www.mgmh-alumni-trust.org/index.html
అలాగే నా ఎస్.ఎస్.ఎల్.సి. పట్టా కాపీ, ఆ రోజుల్లో ఇచ్చే కాండక్ట్ సర్టిఫికేట్ కూడా ఇందుతో జతపరుస్తున్నాను….ఎందుకంటే ….ఇవి అలనాటి తీపి గుర్తులు. కానీ
, ఈ కాండక్ట్ సర్టిఫికేట్ లో మొదటి మాటలు…అంటే..very fluent in speech, very rapid in speed of work, accurate observer, avove in ability అన్నవి చదవగలిగాను కానీ, ఆఖరి మాట ఇప్పటికీ చదవ లేక పోతున్నాను. బహుశా “బట్, టోటల్లీ యూస్ లెస్ ఫెలో” అని మా హెడ్ మాష్టారు అభిప్రాయపడ్డారేమో అని నా అనుమానం.
(ఈ వ్యాసం లో కొన్ని భాగాలు మా స్కూల్ వజ్రోత్సవ సందర్భంగా ఇది వరలో కౌముది లో వ్రాయడం జరిగింది)

-వంగూరి చిట్టెన్ రాజు,

హ్యూస్టన్, టెక్సస్ (అమెరికా)

ఫ్రిజ్ లో ప్రేమ

సచిన్ కుండెల్కర్

సచిన్ కుండెల్కర్

దృశ్యం-3

             (ప్రసన్న బద్దకంగా అటు ఇటు పొర్లుతుంటాడు. ఈల వేస్తాడు. ప్రక్కన ఓ పెద్ద గంగాళం. అందులోంచి ప్రేమ తింటుంటాడు. అతనికి ఏదో మంచి విషయం తడ్తుంది. లేచి కూర్చుని కాగితం వెదికి రాయడం మొదలుపెడతాడు. జేబులో నుండి తాళంచెవి తీసి కళ్ళముందు ఆడిస్తాడు. సంతోషపడి మళ్ళీ జేబులో పెట్టేసుకుంటాడు.)

             (ఇంతలో బయటనుండి అతి ప్రసన్న ఇంట్లోకొచ్చి పడతాడు. పాకుతూ ప్రసన్న దగ్గరికి వస్తాడు. రక్తసిక్తమయిన బట్టలు, ఒళ్ళంతా గీరుకుపోయి ఉంటుంది.)

 

ప్రసన్న: అతి ప్రసన్నా… నువ్వా?

 

అతిప్రసన్న: అవును ప్రసన్నా.. నేను. నేనే. ఉత్తరం చేరగానే పరుగున వచ్చేసాను. ఎలా ఉన్నావు మిత్రమా?

 

ప్రసన్న: నేను… నేను బాలేను… అతి ప్రసన్నా…

(అతడి దగ్గరికెళ్ళి ఏడుస్తుంటాడు)

 

అతిప్రసన్న: ఇన్నేళ్ళుగా ఎక్కడున్నావ్? నీ గురించి మాకెవరికీ ఏమీ తెలియలేదు. అసలేం చేసావ్ ప్రసన్నా?

 

ప్రసన్న: అతి ప్రసన్న… నీకెన్ని దెబ్బలు తగిలాయి… ఎంత రక్తం పోయిందో! నిన్నా కుక్క కరిచిందా ఏమిటీ? ఇలా రా… నా దగ్గర కూర్చో రా..

(ప్రసన్న అతి ప్రసన్నని నేలమీద కూర్చోబెడతాడు. తను రాసుకునే కాగితాలని ఉండగా చుట్టి మెల్లగా రక్తాన్ని తుడుస్తాడు.

 

అతిప్రసన్న: మీ ఇంటి నాలుగు ప్రక్కల్లో ఈ వీధి కుక్కలే వందలకొద్దీ. నీకు కుక్కలంటే భయం కదా రాజా, చిన్నప్పట్నుండీ? మరెలా.. ఇక్కడెలా బ్రతుకుతావురా ? ఈ ఇంటి నుండి బయట ఎలా పడతావ్ ?

 

ప్రసన్న: (ఆగకుండా కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంటాడు) గడిచిన ఎన్నో ఏళ్ళుగా నేనీ ఇంటి బయట అడుగుపెట్టింది లేదు. ఇక్కడికి ఎవరూ రారు. ఈ కుక్కలు రాత్రంతా ఒకదాంతో ఒకటి కొట్లాడుతుంటాయి. కరుచుకుంటాయి. నాకు నిద్రరాదు. ఎన్నేళ్ళగానో ఇంట్లో వాళ్ళెవరినీ నేను కలవలేదు. స్నేహితుల మొహం చూసి ఎరుగను.

 

అతిప్రసన్న: అయితే ప్రసన్నా, ఫోనయినా ఎందుకు చేయలేదు? నేనొచ్చేవాడిని కాదా నిన్ను తీసికెళ్ళడానికి ?

 

ప్రసన్న: నేనంతా సరిగ్గా చెప్పగలనా? నాకు విశ్వాసం కలగడం లేదు. కాస్త కాస్తగా చెపుతాను. ఈ మధ్య నాకు కేవలం రాయడం మాత్రమే తెలుసు. ఇరవైనాలుగు గంటలూ కాగితాల గుట్టముందు కూర్చుని రాస్తూ కూర్చుంటాను.

 

అతిప్రసన్న: (ఒక్కో ప్రతిని కళ్ళ దగ్గరగా తీసుకొని చూస్తాడు) రాగిరంగు… కుంకుమ పువ్వు రంగు.. పసుపు… వంకాయరంగు .. అన్ని రంగులూ రాస్తావు కదా నువ్వు? ఇదేంటో వేరుగా ఉంది. నీకు గుర్తుందా, కాలేజ్ లో ఉండగా రాత్రి రాత్రంతా జాగారం చేస్తూ ఏమేం రాసేవాడివో! అంతా ఆకాశంలా నీలమయం. ఓసారి ఏదో రాస్తూ కూర్చున్నావ్. మధ్యరాత్రి కాగితాలు అయిపోయాయి. నువ్వయితే టేబిల్, నేల, గోడలు, బట్టలు, అద్దం లాంటి వాటిమీద రాస్తూపోయావ్. నేను మరోరోజు నీ రూముకొచ్చి చూద్దును గదా, అంతా నీలమే.

friz

ప్రసన్న: మనుషుల ప్రవృత్తి మారుతుంది. దానంతటదే..

 

అతిప్రసన్న: ఇంత పెద్ద మార్పా?

(ప్రసన్న తలవంచుకొని తల ఊపుతాడు.)

 

అతిప్రసన్న: బయటికి పద. బయట బాగుంటుంది. గత అయిదారేళ్ళలో లోకం చాలా మారిపోయింది.

 

ప్రసన్న: అంటే, ఏమయింది? చెప్పు సరిగ్గా.

 

అతిప్రసన్న: ఒకలాగే… దానంతటదే జరిగింది.

 

ప్రసన్న: దాన్లో గొప్పదనమేముందని?

 

అతిప్రసన్న: అంతా దాగుడు మూతలాట. ఒకళ్ళు బయటికి వెళితే మరొకరు లోపలికెళతారు.

 

ప్రసన్న: మన కాలేజ్ ప్రక్కనుండే ఆ పెద్ద గడిలాంటి ఇల్లు.

 

అతిప్రసన్న: అది పడిపోయింది.

 

ప్రసన్న: ఇంటి ముందటి నది ?

 

అతిప్రసన్న: అది ఎండిపోయింది.

 

ప్రసన్న: మరేముంది అంటున్నావ్?

 

అతిప్రసన్న: మనుష్యులు! బయట మనుషులున్నారు ప్రసన్నా. వివిధ రకాలు. వేరు వేరు తరహాలలో. తమదైన పధ్ధతిలో బ్రతికేవాళ్ళు. ఇంకొకళ్ళని బ్రతకనిచ్చే వాళ్ళు. ఈ కుక్కలకన్న నయమైన వాళ్ళు. పద… ఉన్నపళంగా.. నేను తీసికెళ్తాను నిన్ని బయటికి.

 

ప్రసన్న: లేదు. అది సాధ్యం కాదు. ఇన్ని కుక్కలు ఇంటి చుట్టూ ఉండగా నేను కిటికీ నుండి బయటికి తొంగికూడా చూడలేను.

 

అతిప్రసన్న: మీ ఇంట్లోవాళ్ళకి నీ భాష అర్థమవుతుంది కదా?

 

ప్రసన్న: కావొచ్చు.

 

అతిప్రసన్న: ఏదేమైనా నీకు నేనున్నానని గుర్తుంటుంది కదా ?

 

(ప్రసన్న ఏడుస్తూ తల ఊపుతాడు.)

 

(అతిప్రసన్న అతడిని దగ్గరికి తీసుకుంటాడు.)

 

ప్రసన్న: చాలా రోజుల తర్వాత బాగాన్పించింది. అడక్కుండా చాలా దొరికింది.

 

అతిప్రసన్న: అడక్కుండా? ప్రేమ ఏమయినా ఇచ్చే వస్తువూ, అడిగే వస్తువా ఏమిటి ? ప్రేమ ఉంటుంది. అదో ప్రవాహం. ఒక వైపునుండి మరోవైపుకి దానంతటదే ప్రవహిస్తూ ఉంటుంది. ప్రేమనెవ్వరూ ఆపలేరు. నిలువ  ఉంచలేరు.

 

(ప్రసన్న నవ్వుతూ జేబులో నుండి తాళంచెవి తీస్తాడు. పడేస్తాడు. అంతలో సూర్య వచ్చి ఆ తాళం చెవిని మింగేస్తాడు. ప్రసన్న, అతిప్రసన్నల దృష్టికి రాదిది. సూర్య గప్ చుప్ గా పారిపోతాడు.)

 

అతిప్రసన్న: నువ్వు బయటపడే అవకాశం, గురివింద గింజంత అవకాశం వచ్చినా నన్ను పిలువు. ఫోన్ చెయ్. ఉత్తరం రాస్తూ కూర్చోకు. ఆ ఫోన్ ఎత్తి ఈ నెంబర్ నొక్కెయ్. నేనీ కాగితం మీద రాసి ఇక్కడ పెడ్తున్నాను. ఇది చూసుకో. ఈ నెంబర్ కలిపి ‘అతిప్రసన్న, వచ్చెయ్’ అను. నేను వెంటనే వచ్చేస్తాను.

 

ప్రసన్న: ఫోనులో నువ్వు నాకెంత కావాలో, ఎలా కావాలో తెలుస్తుందా నీకు? సమాచారం అంతా అందుతుందా?

 

అతిప్రసన్న: నీ పిలుపులో నాకంతా అందుతుంది. ఉత్తరం మాత్రం రాస్తూ కూర్చోకు.

 

ప్రసన్న: సరే.

( అతి ప్రసన్న గబుక్కున లేచి వెళ్ళిపోతాడు.)

( ప్రసన్న ఏడుస్తుంటాడు. కాగితాలని జరిపి అక్కడే నిద్రపోతాడు.)

( ప్రసన్న నిద్రపోతుండగానే పార్వతీబాయి వస్తుంది. చేతిలో పూలదండ. వెనకనుండి సూర్య పరిగెత్తుకుని వచ్చి ఆవిడ కాళ్ళు నాకడం మొదలెడుతుంది.)

 

పార్వతీబాయి: ఇవ్వు!

(సూర్య నోట్లో నుండి తాళంచెవి ఆవిడ ముందు పడేస్తాడు. ఆవిడ అత్యంత ఆనందంతో ఆ తాళం చెవిని తీసుకుంటుంది. ఆనందంతో చుట్టూ తిరుగుతూ పాట పాడుతుంటుంది.)

 

పార్వతీబాయి: ప్రేమలో పడేవాళ్ళూ…

ప్రేమలో పడేట్టు చేసేవాళ్ళూ..

ప్రేమలో మునిగితేలే వాళ్ళూ..

నా చేతిలో ఏముందో తెల్సా ?

తలక్రిందులుగా కాళ్ళు పైకిగా

భేటీ కార్డ్ అచ్చేసుకొనేవాళ్ళూ..

ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళూ..

సైటు కొట్టేవాళ్ళు…

నా చేతిలో ఏముందో తెల్సా ?

వేడిపాలపైన మెత్తమెత్తని మీగడ

కండోమ్ అమ్మేవాళ్ళూ…

ప్రసవం చేసేవాళ్ళూ…

అమ్మాయిని లేవదీసుకు వెళ్ళేవాళ్ళూ..

నా చేతిలో ఏముందో తెల్సా ?

సుధృడమైన కామధేను…

వీధి కుక్కల మేడం గార్లూ…

బద్దకించిన రచయితల్లారా..

నా చేతిలో ఏముందో తెల్సా ?

W , X మరియు Y

(కర్ణకఠోరంగా పకపకలుగా నవ్వుతుండగా దీపం ఆరిపోయింది.)

 

మూలం: సచిన్ కుండల్కర్

                                                                                                                                                                    అనువాదం: గూడూరు మనోజ

గూడూరు మనోజ

~

యుగకవి పాల్కురికి సోమనాథుడు

sangisetti- bharath bhushan photo

    ప్రథమాంధ్ర ప్రజాకవి పాల్కురికి సోమనాథుడు. ఇదే విషయాన్ని ప్రథమాంధ్ర కవి పాల్కురికి సోమనాథుడు అని డాక్టర్‌ సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉన్నదశలో 2012లో ఆంధ్రజ్యోతిలో చర్చకు పెట్టారు. దీనికి ప్రతిస్పందిస్తూ ముత్తేవి రవీంద్రనాథ్‌, రామినేని భాస్కరేంద్రరావులు అసలు పాల్కురికి తెలంగాణ వాడే కాదు, మరొకరు తొలికవి ఎందుకు గారు? అంటూ తెలంగాణ ఉద్యమం మీద అక్కసుతో బురద పూసే పనిచేసిండ్రు. ఈ చర్చలో నేనూ పాల్గొన్నాను. వారు చేసిన తప్పుడు వాదనలు సాక్ష్యాధారలతో తిప్పి కొట్టడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది. ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగువారితో సామరస్య పూర్వకంగా చర్చలు జరిపి, అక్కడి పండితులు ఇప్పటి వరకూ ప్రచారంలో పెట్టిన అసత్యాలు, అర్ధసత్యాలపై వెలుగుని ప్రసరించి వాస్తవాలను  అందరికీ తెలియజెప్పాలి. ఇప్పటి వరకూ పాల్కురికి సోమనాథుడి రచనలు, రచనలపై విశ్లేషణ, పరిశోధన దాదాపు పదివేల పేజీలకు పైగా అచ్చు రూపంలో వచ్చాయి. అయితే ఇవన్నీ అందరికీ అందుబాటులో లేవు. ప్రత్యక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రస్తుత సందర్భంలో సోమనాథుడి మూర్తిమత్వాన్ని తెలంగాణ సోయితో మరొక్కసారి స్మరించుకునేందుకు ఈ సదస్సు కచ్చితంగా ఒక మైలురాయిగా నిలబడుతుంది.
‘యుగకవి’ పాల్కురికి సోమనాథుడి గురించి బండారు తమ్మయ్య మొదలు వేన రెడ్డి వరకూ, ఇప్పటికీ ఏదో ఒక విశ్వవిద్యాలయంలో ఆయన రచనలపై పరిశోధన జరుగుతూనే ఉన్నది. ప్రతి పరిశోధనలోనూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ తెలుగు సాహితీ చరిత్రకారులు సోమనాథుడికి ‘యుగకవి’ హోదా ఇవ్వలేదు.  ఇందుకు ప్రధానంగా ఆయన బ్రాహ్మణాధిపత్యాన్ని, బ్రహ్మణత్వాన్ని, జపతపాలను త్యజించి సామాన్యుడికి గౌరవమివ్వడమే కారణం. తెలుగు సాహిత్యంలో భాష, విషయము, ఛందస్సు ఈ మూడిరటిలోనూ నూతన పంథాలో రచనలు చేసి ప్రజా క్షేత్రంలో తిరుగుబాటు జెండా ఎగురేసిండు. ఆయన సృష్టించిన నూతన ప్రజా ఒరవడి ఆయన తర్వాతి తరం కూడా కొనసాగించింది. ఆ పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది.
తెలుగు సాహిత్యంలో ఎన్నో ‘మొదళ్ళ’కు ఆయనే పునాది. దేశీ చంధస్సులో తొలి తెలుగు కావ్యంగా  ‘ద్విపద’గా బసవపురాణాన్ని రచించిండు. రాజులు, రారాజుల చరిత్రగాదు, మడివాలు మాచయ్యలు, బొంతల శంకరదాసుల జీవిత చరిత్రలే ఆయన కథా వస్తువులు. జాను తెనుగు, దేశీ చంధస్సులోనే గాదు తీసుకున్న వస్తువులోనూ నూతన ఒరవడి సృష్టించిన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ప్రగతిశీలి. అభ్యుదయవాది. శతక సాహిత్యానికి బ్రతుకుగా, ఉదాహరణ వాఙ్మయానికి దిక్సూచిగా, గద్యలకు కొలబద్దలుగా, వచనాలను అనిర్వచనీయాలుగా, జీవిత చరిత్రలను సామాజిక చరిత్రలుగా తీర్చిదిద్దిన అసలైన ఆధునికుడు. సామాన్యుడు కేంద్రంగా చరిత్రను తిరగరాసిన సంస్కరణాభిలాషి.
నన్నయాదుల కాలం నుండి బాగా వేళ్ళూనుకొని పోయిన వైదిక మతాన్ని తిరస్కరించిండు. అరూడ గద్యాది  రచనలు సంస్క ృత భాషా భూయిష్టమై కేవలం పండిత లోకంలో ఆదరణ పొందిన సాహిత్యాన్ని సామాన్యుడే మాన్యుడని తలంచి అందరికీ అందుబాటులోకి తెచ్చిన వాడు పాల్కురికి. సంస్క ృత వృత్తాలను వదిలి ‘ద్విపద’లో బసవ పురాణాన్ని రచించిండు. ద్విపదలో రచనలు చేసిన మొట్టమొదటి సాహితీవేత్త. ఈ ఛందస్సుకు ‘ద్విపద’ అని నామకరణం చేసింది కూడా పాల్కుర్కియే! ‘‘ఆంధ్రావళి నాలుకపై నాట్యమాడుతున్న ఈ ఛందస్సు వేదంలోని ‘‘ద్విపద’’వలె పవిత్రమైనది. ప్రాచీనమైనది సుమా అన్నట్టు ‘ద్విపదు’ అని విలక్షణమైన పేరు పెట్టినవాడు సోమన. కొందరపోహ పడుతున్నట్టు ఈ ద్విపదకు ప్రాకృతంలోని ద్విపదితోను, హిందీలోని దోహాతోను పొత్తు లేదు. ఇదిక స్వతంత్రమైన తెలుగు దేశీ ఛంధస్సు’’ అని నిడుదవోలు వెంకటరావు ‘సోమన సృష్టించిన ఛందస్సు’ అనే వ్యాసంలో నిరూపించిండు.  ప్రాచీన పురాణాలను వదిలి గురువు కేంద్రంగా రచనలు చేసిండు. సోమనాథుడి భాషతో పాటు, రచనా ప్రక్రియలు కూడా సామాన్య ప్రజలకు సులభంగా గ్రాహ్యమయ్యేటివే! ఈయన రచనలు తెలుగు జాతి తొలి విజ్ఞానసర్వస్వాలుగా చెప్పుకోవచ్చు. ఈయన తర్వాతి తరం వారయిన తిక్కన మొదలు అన్నమాచార్యతో పాటుగా 20వ శతాబ్దం వరకు కూడా కవులపై సోమనాథుడి ప్రభావముంది.
‘‘ఉరుతర గద్య పద్యోక్తులకంటె
కూర్చెద ద్విపదల కోర్కె దైవార
అరూఢగద్య పద్యాది ప్రబంధ
పూరిత సంస్కృత భూయిష్ఠ రచన
మానుగా సర్వ సామాన్యంబు గామి..’’ అంటూ జాను తెనుగు విశిష్ఠతను వివరించిండు. నన్నయ తెలుగు కవితలో ప్రవేశపెట్టిన మార్గ పద్దతిని నిరసిస్తూ దేశీ కవితా విధానాన్ని ఒక తిరుగుబాటు సాహిత్యంగా సోమనాథుడు సాహిత్యంలోకి తీసుకు వచ్చాడు. ‘‘అమల సువర్ణ శృంగ యుత కపిల గోశతంబు దానమిచ్చిన ఫలంబు భారత శ్రవణంబున గల్గునని తలంచి భారత శ్రవణాభిరతులైన రాజన్యులను మెప్పించుటకు గాక’ అంటూ భారతానికి తాయిలాలు ఇచ్చి ప్రచారంలో పెట్ట చూడడాన్ని పాల్కురికి నిరసించిండు. శైవ మతమును సామాన్యుడు పునాదిగా ప్రచారంలోకి తీసుకొచ్చిండు. అంతే కాదు త్రిపురుషా పూజా విధానాన్ని, జప హోమాదులతో కూడిన వైదిక మతమును’ తూలనాడి కులాలకు అతీతమైన వీరశైవ మతాన్ని ఆచరించి ప్రచారం చేసిండు. అనువాదాలైన భారతాన్ని వదిలి, నన్నయ నిరాకరించిన ద్విపదలోనే బసవ, పండితారాధ్యుల జీవితాలను చరిత్రలుగా రచించిండు. అంతే గాకుండా దేశీ రచనా ప్రక్రియలను కూడా చేపట్టిండు. అంతకు ముందు ఈ ప్రక్రియలు కేవలం చంధోగ్రంథాల్లో మాత్రమే ఉన్నాయి. వాటికి కావ్య గౌరవాన్ని ఈయన కల్పించిండు. ఉదాహరణములు, రగడ, సీసములు, శతకము, గద్యము, అష్టకములు మొదలైన వాటిలో రచనలు చేసిండు.

ఈ దేశీయ రచనా రీతులకు ఒక అస్తిత్వాన్ని కల్పించిన వాడు పాల్కురికి. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి దేశీ రచనలను చేయడమే గాకుండా దేశీయ సంప్రదాయాలను, భాషా, సాహిత్య, నాట్య, సంగీత, చారిత్రక, స్థానికాచార వ్యవహారాలు, జీవితాలను, సామాజిక పరిస్థితులను ఈయన రచనల్లో చోటు చేసుకున్నవి. శ్రీశైల వర్ణనలతో పాటుగా దేశీయుల ఆచార వ్యవహారాలు, శివరాత్రి జాగారము, పాటలు, పద్యాలు, గీతాలు, స్తవాలు మొదలగు సాహిత్య సామాగ్రిని, నాట్య భంగిమలను, నాటక ప్రదర్శన పద్ధతులను, భరత నాట్య ప్రయోగాలు, సంగీత శాస్త్రంలోని 108 రాగాలను తాళములు, మూర్ఛనలు, మద్దెళ్ళు గురించి తాను జీవించిన 1160`1240ల నాటి తెలుగు/కన్నడ సమాజాన్ని పాఠకుల ముందుంచాడు. ఆయన కాలంనాటి ఆటలు`పాటలు, విద్యలు`వినోదాలు, పత్తిరులు`పండ్లు, కొండలు, నదులు, మకుటములు, వస్త్రములు, వీణలు, రాగములు ఇలా ఒకటేమిటి అనేక విషయాల్ని తన రచనల్లో తెలిపిండు. ముఖ్యంగా పండితారాధ్య చరిత్రలో. సోమనాథుని కాలం నాటి సాంఘిక జీవనాన్ని తెలుసుకోవడానికి పండితారాధ్య చరిత్ర ఒక విజ్ఞానసర్వస్వం లాంటిదని తిమ్మావరa్జల కోదండరామయ్య తన ‘తెలుగుజాతి తొలి విజ్ఞాన సర్వస్వం’ అనే వ్యాసంలో చెప్పిండు.

‘‘తెలుగు కవులలో ఈయన వలె ప్రజలకు యింత సన్నిహితంగా వుండిన కవీ, తెలుగు ప్రజా జీవనమును యింత చక్కగా న కావ్యంలో ప్రదర్శించిన కవీయ యీయన ఒక్కడు మాత్రమే’’ అని కూడా తిమ్మావరa్జల అన్నడు. ఆనాటి ఆభరణాలైన ‘కంచు మట్టెలు, ఉంగరములు, వల్దయూరులు, నల్ల గాజులు, తగరపు కడియములు, పచ్చ గాజు పూసలు, సంకు పూసలు, నల్లపూసల బన్నసరము’ మొదలైన వాటి గురించి ఈయన రచనల ద్వారా తెలుస్తుంది. ‘రాగుంజు పోగుంజులాట, కుందెన గుడిగుడి గుంజంబులాట, అప్పల విందుల యాట, చప్పట్టు, సరిగుంజులాట, పేరబొంతల యాట, సిట్ల పొట్లాట, గోరంటాలాట, దాగుడు మూతలాట, దిగు దిగు దిక్కొనునాట’ అనే క్రీడా విశేషాలు ఆనాటి కాలంలో ఉండేవని పాల్కురికి రచనల ద్వారా తెలుస్తుంది. కేవలం ఆటలు తెలుసుకొనుట కాదు. ఇది ఆనాటి తెలుగు సమాజం నడిచి వచ్చిన దారిని పట్టిస్తుంది. చరిత్రను చిత్రిక గడుతుంది. ఈయన రచనలు తరచి తరచి చదివిన కొద్దీ ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ స్థానిక శూద్రకులాలకు చెందిన వారైన కుమ్మరి గండయ్య, బెజ్జ మహాదేవి, మడివాళ మాచయ్య, మాదర చెన్నయ్య, తదితర  జీవితాలను కథలుగా బసవపురాణంలో చెప్పిండు. తెలంగాణ ఆచార వ్యవహారాలే గాకుండా ఇప్పటికీ నిఘంటువుల్లోకి ఎక్కని ఎన్నో పదాలు ఈయన రచనల్లో కనిపిస్తాయి. పదాలు, పద బంధాలు, సామెతలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయంటే వాటి ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. సోమనాథుడు అవసాన దశలో రాసిన ‘పండితారాధ్య చరిత్ర’  తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వంగా పండితులు పేర్కొన్నారు.

రాజులకు, దేవుళ్ళకు పుస్తకాల్ని అంకితమియ్యడం తెలుగు సాహిత్యంలో కొత్తేమి కాదు. అయితే సోమనాథుడు శివభక్తుడైన గోడగి త్రిపురారికి తన అన ‘అనుభవసారము’ గ్రంథాన్ని అంకితమిచ్చాడు. బవవేశ్వరుడు ప్రచారం చేసిన శైవమతములో భక్తియే ప్రధానమైనది. జాతి, మత, లింగ వివక్షలు లేవు. వేదోక్త కర్మల నిరసన, శివోత్కర్ష, భక్తిచే భగవంతుని పలికించుట ఈ వీరశైవము లక్షణాలు. గురులింగ, జంగమ, ప్రసాదాదులు, విభూతి, రుద్రాక్షాది చిమ్నాలు ఈ మతముతో ముడి పడి ఉన్నాయి.
సోమనాథుడు ప్రచారం చేసిన వీరశైవము వేదకర్మలను నిరసించినదనేది ఒక పార్శ్వం. దానికి రెండో ముఖం స్త్రీ పురుషుల సమానత్వానికి, సర్వమానవ సౌభ్రాత్రమును కోరుకున్నది. నేటికీ స్త్రీ సమాన హక్కు ఇవ్వ నిరాకరింపబడుతుండగా, 900ల యేండ్ల క్రితమే సాహిత్యంలో సమానత్వాన్ని పాటించిన అభ్యుదయ వాది పాల్కుర్కి. పండితారాధ్య చరిత్ర పురాతన ప్రకరణములలో ‘గురుభక్తాండారి కథ’లో అజ్ఞాని అయిన గురుభక్తాండారికి వేశ్యచే శ్వేతుని కథ, మహహుణుని కథ చెప్పించి ‘హితలగు కాంతల బుద్ధులేవెంట హితము కాకేల యొండగున’ని నిరూపించినాడు. స్త్రీలకు పురుషులతో సమానంగా దీక్షాధికారములిచ్చి గౌరవించినాడు. నిమ్న జాతి భక్తులకు కావ్య గౌరవం కల్పించిన దార్శనికుడు పాల్కురికి. వీరశైవములో భక్తుల కష్టార్జితాలకు విలువెక్కువ. ప్రతి భక్తుడు ఏదో ఒక శారీరక శ్రమతో కూడిన పనిని చేయాల్సిందిగా సోమనాథుడు నిర్దేశించిండు. శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తించిండు. అందుకే మడివాలు మాచయ్య భక్తుల బట్టలుతకడం వృత్తిగా, శంకరదాసి బొంతలు కుట్టి జీవించే వృత్తిని స్వీకరించిండు.
ఈయన రచనలన్నీ గురువు కేంద్రంగా రాసినవే! అందుకే పాల్కురికి రచనల్లో బసవేశ్వరుడు, పండితారధ్యుడు ఇద్దరూ ప్రముఖంగా కనిపిస్తారు. వీరిలో ఒకరు వీరశైవాన్ని మరొకరు ఆరాధ్య మతాన్ని ప్రచారం చేసిండ్రు. సోమనాథుడు సంస్కృతాంధ్ర, కర్నాట భాషల్లో అనేక రచనలు చేసిండు. వీటిలో ‘బసవ పురాణం’, పండితారాధ్య చరిత్ర, అనుభవసారం, చతుర్వేద సార సూక్తులు, సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం, బసవ రగడ, గంగోత్పత్తి రగడ, శ్రీ బవసాధ్య రగడ, సద్గురు రగడ, చెన్న మల్లు సీసములు, నమస్కార గద్య, వృషాదిపశతకం, అక్షరాంక గద్య పద్యాలు, పంచప్రకార గద్య, అష్టకం, పంచక, బసవోదాహరణం, మల్లమదేవి పురాన: (అలభ్యం), మొదలైన రచనలున్నాయి. తొలి తెలుగు శతకం ‘వృషాధిప శతకము’ రచయిత కూడా ఈయనే. ‘బసవా, బసవా వృషాధిపా!’ అనే మకుటంతో 108 చంపక, ఉత్పలమాలలతో ఈ పుస్తకం రాయబడిరది. ఇందులో బసవుడి జీవితానికి సంబంధించిన ఘటనలు రికార్డయ్యాయి.  బసవన కేవలం మతాచార్యుడు, భక్తుడే కాదు, ఆర్థిక, సామాజిక, రాజకీయ జీవనాన్ని సంస్కరించిన సంఘ సంస్కర్తగా, భక్త శిఖామణిగా, వృషాధిపుని అవతారంగా పాల్కురికి రచనలు చేసిండు. నిజానికి వీరశైవ మత ప్రచారానికి సోమనాథుడు ఒక ఉద్యమకారుడిగా పనిచేశాడు. పాటల ద్వారా, రచనల ద్వారా, సభల ద్వారా, సంచారల ద్వారా మత ప్రచారం చేసిండు. సర్వస్వాన్ని శివుడికి, శివ భక్తులకు సమర్పించాలని ప్రచారం చేసిండు. నిజానికిది సామాజిక స్పృహకు పునాది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాట ముందు వరుసలో నిలిచింది. అయితే ఇందుకు ఆద్యుడు పాల్కుర్కియే! భక్తి ప్రచారానికి ప్రధాన వాహికగా పాటను/ గేయాన్ని ఎంచుకున్నాడు. ఇవి రగడ రూపంలో ఉన్న వీటికి యతి ప్రాస లక్షణాలున్నాయి. అక్షరాంక గద్యలో అ మొదలు క్ష వరకు మొత్తం 50 అక్షరాల్లో వనరుసగ నీ గద్యపాద ప్రథమాక్షరములు గూర్చి ఈ రచన చేసిండు. వీటిలో కొన్ని ఇప్పటికీ గ్రంథ రూపంలో రాలేదు. మరికొన్ని అలభ్యం.

index
యుగకవికి ఉండాల్సిన ప్రధాన లక్షణాల్లో తర్వాతి కాలం వారు కూడా అనుసరించగలిగిన మార్గాన్ని ఏర్పాటు చేయడం. ఈ పనిని పాల్కురికి సమర్ధవంతంగా నిర్వహించాడు. ఉదాహరణ, ద్విపదలు, వచనములు, వ్యాఖ్యానములు, శతక వాఙ్మయానికి ఆద్యుడైన పాల్కురికి వేసిన దారుల్లో తర్వాతి కవి పండితులు నడిచిండ్రు. భాష, భావన, రచన, విషయం అన్నింటిలోనూ ప్రత్యేకతను చాటుకుండు. పాల్కురికి ప్రభావం తిక్కన, రంగనాథరామాయణము రాసిన గోన బుద్ధారెడ్డి, గౌరన, చిన్నన రచనలపై ద్విపదల ప్రభావం, శ్రీనాథుడు కొంతమేరకు వస్తువులో, చంధస్సులో  పాల్కురికిని అనుసరించాడు. శ్రీనాథుడి హర విలాసానికి మూలం బసవపురాణమే! ధూర్జటి కాళహస్తి మహాత్మ్యము నందలి తిన్నని కథకు మూలం కూడా బసవ పురాణంలోనే ఉన్నది. హంసవింశతి, శుకసప్తతి రచయితలు కూడా పాల్కురికినే అనుసరించారు. ‘‘ఈతని (పాల్కురికి) సీసపద్యమలందుగల సొగసైన తూగు, సమత శ్రీనాథ పోతనల సీసపద్యముల చక్కని నడకకు దారి చూపినట్లు తోచు చున్నది. ‘మందార మకరంద’ యను సుప్రసిద్ధమైన పోతన సీసములో గనుపించు భావము, పోలిక సోమనాథుడివే.’’ అని వేటూరి ఆనందమూర్తి ‘తిక్కనాదులపై పాల్కురికి ప్రభావం అనే వ్యాసంలో తేల్చి చెప్పిండు. ప్రబంధకారులైన తెనాలి రామకృష్ణుడు, తాళ్ళపాక వారు, కృష్ణమాచార్యులకు మాతృకలు కూడా పాల్కురికి రచనలో ఉన్నాయనే విషయాన్ని సోదాహరణంగా ఆనందమూర్తిగారు వివరించారు.
ఈ దేశీ ప్రక్రియను తర్వాతి కాలంలో తాళ్ళపాక కవులు కూడా అనుసరించారు. వీరు మంజరీ ద్విపదలు, శతకములు, సీసములు, ఉదాహరణములు, రగడలు, గద్యలు మొదలైన ప్రక్రియల్లో రచనలు చేసిండ్రు. అంటే సోమనాథుడి రచనా ప్రభావం తర్వాతి తరం వారిపై ఎలా ఉండిరదో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు బ్రౌన్‌, కొమర్రాజు, నిడుదవోలు సుందరం పంతులు, వేటూరి ప్రభాకర శాస్త్రి, చిలుకూరి నారాయణరావు, బండారు తమ్మయ్య, నిడుదవోలు వెంకటరావు, నేలటూరి వేంకటరమణయ్య, శిష్టా రామకృష్ణశాస్త్రి, మల్లంపల్లి సోమశేఖరశర్మ, ఎమ్‌.ఆదిలక్ష్మి. వేనరెడ్డి, మహంతయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, తదితరులెందరో పాల్కురికి సోమనాథుడి ప్రతిభా పాఠవాలను పాఠకులకు తెలియజెప్పిండ్రు.
దక్షిణాదిలో ఒక వైపు రామానుజ మతం, వైష్ణవ మతం విజృంభిస్తున్న తరుణంలో దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నది వీరశైవం. సొంత ఆస్తి లేకుండా, ఉన్నదంతా శివభక్తులకు పంచాలనడమే గాకుండా, ప్రజల భాషకు కావ్య గౌరవం కల్పించిండు. అట్టడుగు వర్గాల ప్రజలే ఆయన రచనా వస్తువులు. కులాలకు అతీతంగా అందరిలో చైతన్యాన్ని ప్రోది చేసిన పాల్కురికి సోమనాథుడు తెలుగు సాహిత్యంలో తొలి కవి. ప్రజల పక్షాన నిలబడి అన్ని రకాల వివక్షలపై అక్షరాన్ని కరవాలంగా మలిచిండు. అలాంటి మహనీయుడి గురించి దేశ ప్రజలందరికీ తెలియాల్సిన అవసరముంది. అందుకుగాను ఆయన జీవిత చరిత్రను సాహిత్య అకాడెమీ/ జాతీయ బుక్‌ట్రస్ట్‌ ప్రచురించాలి. అలాగే ఆయన సమగ్ర రచనలు కూడా తెలంగాణ కల సాకారమైన సందర్భంగా పునర్ముద్రణ కావాలి. ఇంకా అలభ్యంగా ఉన్న రచనల్ని వెతికి పట్టుకోవాలి. తెలంగాణ జీవద్భాషకు అక్షర రూపమిచ్చిన ఆయన రచనల్లో ఇంకా నిఘంటువుల్లోకెక్కని పదాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని నిఘంటు రూపంలో తీసుకు రావాలి. తెలంగాణ సోయితో ఈ పనిచేయాల్సిన అవసరముంది.

-సంగిశెట్టి శ్రీనివాస్‌

కవిత్వపు తోటలో పాటల చెట్టుతో ఓ సాయంత్రం

gorat1

కవిత్వపు తోటలో విహరించడమే ఒక వరమైతే… అందులో పాటల చెట్టు ఎదురైతే.. అంతకన్నా అదృష్టం మరేముంటుంది. అదే ఈ సాయంత్రం. మరపురాని అనుభూతుల్ని మిగిల్చిన సాయంత్రం.

జీవితమనే ప్రయాణంలో ఎంతోమంది కలుస్తుంటారు. కొంతమంది కలయిక మనలో నూతన చైతన్యాన్ని, ఉత్సాహాన్ని, ఒక్కొక్కసారి గుర్తింపుని ఇస్తుంది. అలా ఎంతోమంది యువకవుల్లో చైతన్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతూ…. గుర్తింపు దిశగా అడుగులు వేయిస్తున్న మార్గదర్శి కవి యాకూబ్.

ప్రవహించే జ్ఞాపకాలతో ఎడతెగని ప్రయాణం చేస్తూ… సరిహద్దు రేఖల్ని దాటుకుంటూ కవిత్వలోకంలో విహరిస్తున్న విహంగం అతడు. తనతోపాటు ఎంతోమందిని తన దారిలో నడిపిస్తున్న కవిత్వప్రేమికుడు. జీవితపు అవతలి తీరాన్ని చూపిస్తున్న దిక్సూచి.

ఎన్నో నెలలుగా తన ఇంటికి ఆహ్వనిస్తున్నా… పని ఒత్తిడులతో వెళ్లలేని పరిస్థితి. ఆయన రమ్మనడం… నేను ఏదో ఒకరోజు వస్తాననడం పరిపాటిగా మారింది. ఇక ఈ రోజు ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకొని, ఫోన్ చేశా… అవతలివైపునుండి ‘నమస్తే అన్న’ అని తీయని పలకరింపు… సార్ మీరు నన్ను ‘అన్నా’ అనడమేంటి అని అడిగా… మా కవిత్వంకోసం ప్రతినెలా మీ వేదికను మాకిస్తున్నారు, నువు నాకు అన్నవి కాక మరేంటి అంటూ నవ్వులతో సమాధానం.

సార్ మీ ఇంటికి వస్తున్నా అనగానే.. అలాగే నాన్న.. తప్పకుండా.. అంటూ ఇంటి అడ్రస్ చెప్పారు. తెలియదు సార్ అంటే ఏంపర్లేదు.. చైతన్యపురి బస్టాప్ కి రా అక్కడినుండి నేను తీసుకెల్తాగా అన్నారు. మొదటిసారి తన ఇంటికి వెల్తున్నాకదా… ఇంకెవరైనా తోడుంటే బాగుండు అనిపించింది. మిత్రులు కట్టా శ్రీనివాసరావు గారు కూడా కలుస్తానన్నవిషయం గుర్తొచ్చి తనకి ఫోన్ చేయగా.. ఆయనా సై అన్నారు. హమ్మయ్య… ఒక పనైపోయింది అనిపించింది.

అప్పటికి సమయం 4.30ని.లు. నేను ఉన్నది అబిడ్స్. బస్ లో ప్రయాణం. ఆలస్యమవుతుందేమోనన్న టెన్షన్. మొదట కోఠికి వచ్చాను. అక్కడ చాలామంది జనం. 10ని.లు ఎదురుచూపు. ఆతర్వాత వచ్చిన హయత్ నగర్ బస్ ఎక్కాను. మండే ఎండలో, కిక్కిరిసిన బస్ లో శరీరం వేడెక్కుతున్నా… ఈ సాయంత్ర విశేషాన్ని ముందే పసిగట్టిందేమో… మనసు మాత్రం ఉల్లాసంగానే ఉంది.

5.30ని.లకు చైతన్యపురిలో దిగి, కట్టాగారికి ఫోన్ చేస్తే.. మరో 15ని.లు పడుతుందన్నారు.

5.45 అయింది. కాని రాలేదు. ఇంతలో యాకూబ్ గారినుండి ఫోన్. బస్టాప్ లో ఉన్నా అని చెప్పగానే.. 5 ని.లో బైక్ తో ప్రత్యక్షం. ఇద్దరం కల్సి ఇంటికి పయనమయ్యాం.

*****

ఇంటి ఆవరణలోకి ప్రవేశించగానే ఏదో కొత్త అనుభూతి. కవిత్వపు తోటలోకి విహారానికి వచ్చినట్లనిపించింది…. చల్లని పందిరిపై ఉన్న మల్లెతీగ తన కొమ్మలను పందిరంతా పరచుకొని, తన పూల సువాసనతో నాకు స్వాగతం పలికింది. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూనే గుమ్మం దగ్గరికి వెళ్లా…ఎదురుగా ఉన్న గోడకి ఒక పోస్టర్. దానిపై

‘‘గొప్పవారు కావడానికి డబ్బుకాదు ముఖ్యం

కష్టించి పనిచేసే తత్వం. ఉన్నత వ్యక్తిత్వం

ఈ రెండూ ఉంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి

ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే

విజయం పది అడుగులు ముందుకు వేస్తుంది’’

అన్న ఠాగూర్ మాటలు కనిపించాయి. ఆహా… ఎంత చక్కటి ప్రేరణ. గుమ్మంలోనే యాకూబ్ గారి స్పూర్తి తెలిసిపోతుంది. అందుకేనేమో యాకూబ్ గారి ఇంటికి యువకవులంతా దారులు కడతారు.

ఇంటిలోనికి అడుగుపెట్టగానే లోపల సాహిత్య వారధలు శిలాలోలిత గారు, కట్టా శ్రీనివాసరావు గారు, బేబి రక్షిత సుమలు నాకోసం ఎదురుచూపు. కుశల వివరాలు, టీ స్నాక్స్ తో 15 ని.లు గడిచింది. ఆ సమయంలో యాకూబ్ గారు తనకు వచ్చిన జ్ఞాపికలను చూపిస్తూ… వాటి నేపథ్యాన్ని వివరించారు.

6గం.లకు వికీపీడియాలో ఎడిటింగ్ ప్రారంభించాం. కట్టా శ్రీనివాసరావు గారికి లాప్ టాప్ అప్పగించి, వికీలో యాకూబ్, శిలాలోలిత గార్ల గురించిన వ్యాసాలను రాశాము.

సమయం 9 గం.లు. బయటిరూంలో ఎవరో వచ్చిన శబ్దం వినిపించింది. ఆ వ్యక్తి ఎవరో అని చూడగా… ఎదురుగా పాటల చెట్టు గోరటి వెంకన్నభోజనం చేస్తూ కనిపించారు. ఎంత అదృష్టం. ఇప్పటివరకు టి.విల్లో చూసిన ఆయన ఈరోజు నాముందు, నాకు దగ్గరగా ఉండడం. చిన్నప్పుడు ఆయన పాటలు విని, పుస్తకాల్లో రాసుకొని, పాడుకునేవాణ్ణి.

 

వికీపీడియా పని పూర్తిచేసి, కట్టా గారితోకల్సి హాల్లోకి వచ్చాను. యాకూబ్, వెంకన్నలుకబుర్లలో ఉన్నారు. అపుడు సమయం 9.30ని.లు. ఇంకా ఆలస్యమైతే బస్సులుఉండవన్న ఆందోళన ఒకవైపు, వెళ్లిపోతే ఈ వాతావరణాన్ని మిస్ అవుతానన్న ఆలోచనమరోవైపు. ఉండడానికే మనసు మొగ్గుచూపింది. అందరం కల్సి ఫోటోలు దిగాము.

యాకూబ్, వెంకన్నలుకల్సి కవిత్వాలు, చీమకుర్తి వారి పద్యాలు పాడుతున్నారు. వాళ్ల ప్రవాహానికి అడ్డుగా ‘సార్ లేటవుతుంది. ఇక వెల్తాను’ అన్నాను. ‘లేదు లేదు తిని వెళ్లాలి’ అని అమ్మగారి ఆర్డర్. ‘మొదటిసారి మా ఇంటికొచ్చావ్, భోజనం చేయకుండా వెల్తావా’ అని యాకూబ్ గారి ప్రశ్న.

క్షణాల్లో భోజనం ప్లేట్లతో మేం సిద్ధమవగా… తన గానంతో వెంకన్న సిద్ధం. మీకు అన్నంతోపాటు నా పాటల్నికూడా రుచిచూపిస్తా అంటూ మొదలుపెట్టాడు. ఇంతకుముందు తను రాసిన పాటలు పాడుతూ.. అందులో వచ్చిన పదాలతో అప్పటికప్పుడు ఆశుగా పాటలుపాడుతూ మమ్మల్ని గానలోకంలో విహరింపజేస్తున్నాడు.

ఆహ… ఆ అనుభూతే వేరు. వేడి వేడి అన్నంలో పప్పు, ఆవకాయ, నెయ్యి కలిపి తింటున్న రుచి ఒకవైపు… వెంకన్న గానం మరో వైపు. ఇంతకంటే స్వర్గం మరోటి ఉంటుందా అనిపించింది.

అపుడు లచ్చువమ్మా పాట పాడాలని యాకూబ్ గారు కోరగా…

‘‘పారే ఏటి అలలమీదా పండుటెన్నెల రాలినట్లు

ఊరే ఊటా సెలిమలోనా తేటనీరు తోలకినట్లు

వెండి మెరుపుల నవ్వునీదో లచ్చువమ్మో

నీవింత సక్కని రూపమేమో లచ్చువమ్మా……

మంచె ఎక్కి కేకబెడితే కంచిమేకలు సుట్టూ జేరును

నీ అల్లరిని ఆలేగదూడలు ఒళ్లేకొచ్చి ఒదిగిపోవును

పాలిపోయిన కందిసేనే లచ్చువమ్మో

నువు పాట పాడితే పూతబడుతది లచ్చువమ్మా….

కోడికూతకు ముందూలేసి పేడనీళ్ల కళ్లాపి జల్లి

ముచ్చటొలుకా ముగ్గూలేసే మునివేలి గోరుపైనా

ఆ పొద్దే ముద్ద గోరింటైతది లచ్చువమ్మో

పొడ ఎండ నీ మెడలారమైతది లచ్చువమ్మా…..

నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి

జాలిగల నీ చూపులకు తోడేళ్లు సాధు జీవులైతవి

దారిలో పల్లేరు ముళ్లే లచ్చువమ్మో

నువు కాలు మోపితే మల్లెలౌతవి లచ్చువమ్మా…..’’ అంటూ

లచ్చువమ్మ పాటను అందుకున్నాడు వెంకన్న. ఆయన పాడుతున్న తీరు చూస్తుంటే ఆ లచ్చువమ్మ నేపథ్యం మా కళ్లముందు కదలాడింది. చక్కని పదాలతో, అంతకంటే చక్కని పోలికలతో లచ్చువమ్మని వర్ణించడం అద్భుతం అనిపించింది. అలా మా భోజనం తృప్తిగా ముగిసింది.

ఇక మళ్లీ కచేరి. మేంఅందరం వెంకన్న చుట్టూ చేరి ఒక్కో పాటను అడుగుతున్నాము. తను కూర్చున్న సోఫాపై దరువులు వేస్తూ పాడుతున్నాడు. అది చూసిన యాకూబ్ చిన్న టేబుల్ తెచ్చాడు. అపుడు ఆ టేబుల్ పై దరువులు వేస్తూ…

 

‘‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల

నా తల్లీ బందీ అయిపోతుందో కనిపించని కుట్రల…….

 

కుమ్మరి వామిలో తుమ్మలు మొలిచెను

కమ్మరి కొలిమిలో దుమ్ము పేరెను

పెద్దబాడిస మొద్దు బారినది

సాలెల మగ్గం సడుగులిరిగినవి

చేతి వృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోనా

అయ్యో గ్రామ స్వరాజ్యం గంగలోనపాయే ఈ దేశంలోనా…

 

మడుగులన్ని అడుగంటి పోయినవి

బావులు సావుకు దగ్గరైనవి

వాగులు వంకలు ఎండిపోయినవి

చాకలి పొయ్యిలు కూలిపోయినవి

పెద్దబోరు పొద్దంతా నడుస్తుందో బలిసీన దొరలది

మరి పేద రైతు బావులెందుకెండే నా పల్లెల్లోనా…..’’ అంటూ గ్రామంలో కూలిపోతున్న బతుకుల గురించి చిన్నచిన్న పదాలతో కూడిన శబ్ధసౌందర్యం మరింత అందానిచ్చిన ఈ పాటను వింటున్నంతసేపు ఒక చక్కని అనుభూతిని కలిగించింది. యాకూబ్ గారితోపాటు మేం కూడా శృతి కలిపాం…

అలా అలా సాగుతున్న పాటల ప్రవాహంలో మధ్యమధ్యలో తమ అనుభవాలను, వాటిద్వారా వచ్చిన పాటల, కవిత్వాల గురించి గోరటి వెంకన్న, యాకూబ్ లు వివరించారు.

ఇతర రచయితలు, వారి సాహిత్యంపై కూడా తన ప్రసంగాన్ని వినిపించాడు వెంకన్న. ఏ రచయిత శైలి ఏవిధంగా ఉంటుందో వివరిస్తుంటే… ఇంతమందిని చదివాడా అని ఆశ్చర్యం వేసింది. అలా అలా తన ప్రవాహం ప్రవహిస్తునే ఉంది.

gorat2

కొంతసేపటితర్వాత తన ఎడతెగని ప్రయాణం పుస్తకంలో వెంకన్న గురించి రాసిన కవిత్వాన్ని,

‘‘అతడిరాకను ఇట్టే గుర్తుపట్టగలను…

దూరంనుంచే ముక్కుపుటాల్ని చేరుకునే

స్నేహగంధం నాకుముందే అతడిరాకను చేరవేస్తుంది

మనదగ్గరున్నదేదో మనమే విసిరేసి

తిరిగి దానికోసమే యుగాలుగా వెతుక్కుంటున్నట్లు

అతడి సమక్షాన్ని గుర్తుపట్టకుండా

అతడి కోసం ఎదురుచూస్తూ గడిపేస్తుంటాం

గుర్తుకొస్తూ మరపులోకి వేగంగా జారిపోయే

మాఊరి కొండల వెనుక దాచివుంచిన

నా బాల్యపు సంపాదనంతా తాను చూసివచ్చి

నాకే ఎరుక పరుస్తున్న అతడి రుషిత్వం అబ్బురపరుస్తుంది’’

శిలాలోలిత గారు స్నేహితుని గురించి రాసిన కవిత్వాన్ని యాకూబ్ గారు మా అందరికి వినిపించగా… యాకూబ్ గారి ఊరైన రొట్టమాకు రేవు, దాని చెరువు గట్టు గురించి వెంకన్న అప్పటికప్పుడు కవిత్వాన్ని అల్లి వినిపించాడు.

బేబి రక్షిత సుమ రాసిన కవిత్వాలను కూడా చూసి, ‘ఇంత చిన్నవయసులోనే ఎంతగా ఆలోచిస్తున్నావ్ తల్లీ’ అంటూ అభినందించారు.

సమయం 10.30ని.లు అవుతుండగా అందరం వాకిట్లోకి వచ్చాం. ముందుగా వెంకన్న గారు బయలుదేరగా… కట్టా గారు తర్వాత బయలుదేరారు. ఇక మిగిలింది నేనే. యాకూబ్ గారు నాకోసం బైక్ తీసారు. అమ్మగారి దగ్గర సెలవు తీసుకోని బయలుదేరాను.

ఎంతో ఆనందాన్ని, ఎన్నో అనుభూతుల్ని మిగిల్చిన ఈ సాయంత్రం… నాకెంతో అపురూపం.

-ప్రణయరాజ్ వంగరి

భయప్రాయం

index

 

 

కలం ఒంటి మీద

సిరా చెమట చుక్కలు గుచ్చుకుంటున్నాయి

గాలి బిగదీయకముందే

ఊపిరి ఆగిపోతున్నట్టయిపోతోంది

 

ఊగుతున్న నీడలేవో

నా మీద తూలిపడుతునట్టు

ఎన్నడూ చూడని రంగులేవో

నా ముందు చిందులేస్తున్నట్టు

ఎప్పుడూ ఊహించని ఉప్పెన యేదో

పక్కన యెక్కడో పొంచివున్నట్టు…

నేనకుంటున్నట్టు నా గుండె

కొట్టుకుంటున్నది నాలోపల కానట్టు,

నేననుకుంటున్నట్టు నేను ఇన్నాళ్ళు

వింటున్న అంతర్ స్వరం నాది కానట్టు,

నాలోంచి నన్నెవరో బయటికి నెట్టి

లోలోపల అంతా ఆక్రమించుకుంటున్నట్టు

నా కంటి రెప్పలు వేరెవరికో

కాపలా కాయడానికి వెళ్ళిపోయినట్టు

 

జీవనవేదన యేదో కొత్తగా

పుట్టి ఇన్సులిన్ సూదిలా చర్మంలోకి ఇంకుతున్నట్టు,

జంకెరగని నడక ఇప్పుడు

కొత్తగా తడబడుతున్నట్టు…

 

అవునేమో ఇది

మరొక మరణమేమో

అవునేమో ఇది

మరొక జననమేమో…!?

 

-దేవిప్రియ

***

(ఉ. 6.55 గం.లు, 27 మే, 2014)

జానపదంలో మెరిసిన మెరుపులు ​

unnamed-1

జానపద గీతాలు

మన తెలుగు జానపద బాణీల ప్రేరణతో ఎన్నో జానపద సినీగీతాలను తయారు చేసారు మన సినీ సంగీతకారులు. పాత నలుపు-తెలుపు చిత్రాలన్నింటిలో దాదాపు ఒక జానపద గీతం తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు ఐటెం సాంగ్ ఉన్నట్లన్నమాట :) సినిమా కథతో సంబంధం లేకపోయినా ఓ స్టేజ్ షో లాగనో, హాస్యనటుల పైనో లేదా నేరుగా నాయికానాయకుల పైనో ఈ జానపదగీతాలను చిత్రీకరించేవారు. ఇంపైన సంగీతసాహిత్యాలతో ఈనాటికీ చిందెయ్యాలనిపించేంతటి సమకాలీనత ఆ పాటలలో ఉంది. వీటిలో విశేషం ఏంటంటే సరదాగా ఉంటూనే ఏదో ఒక నీతిని తెల్పేలాగ లేదా ఒక విషయాన్నిగురించిన ఇరు పక్షాల చర్చల్లా కూడా కొన్ని సాహిత్యాలు ఉంటాయి. వినడానికి సరదాగా ఉండే అలాంటి కొన్ని సినీజానపద గీతాలను కొన్నింటి గురించి ఇవాళ చెప్పుకుందాం.

జానపద బాణీల్లో ఉన్న హిట్ సాంగ్స్ తలుచుకోవాలంటే మూగమనసులు చిత్రంలో “గోదారి గట్టుంది”, “గౌరమ్మా నీ మొగుడెవరమ్మా..”, రాజమకుటంలో “ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కల రేడు”, సాక్షి చిత్రంలో “అటు ఎన్నెల ఇటు ఎన్నెల”, పాండవ వనవాసం” లో సముద్రాల రాఘవాచార్య రచన “మోగలిరేకుల సిగదానా”, కలసి ఉంటే కలదు సుఖం లో “ముద్దబంతి పూపెట్టి”.. ఇలా బోలెడున్నాయి. “నాకూ స్వాతంత్య్రం వచ్చింది” చిత్రంలో గోపి రచించిన “ఎంకీ నే సూడలేనే ఎలుతురులో నీ రూపు ఎలిగిపోతుంటే” అనే పాట కూడా బాగుంటుంది కానీ లింక్ ఎక్కడా దొరకలేదు. ఇలా ఎంకి మీద “దాగుడుమూతలు” చిత్రంలో బి.సరోజాదేవి పాట ఒకటి బావుంటుంది. సాంఘిక చిత్రమే అయినా సందర్భానుసారంగా ఎంకి వేషంలో మురిపిస్తుంది సరోజాదేవి.

* ఎంకొచ్చిందోయ్ మావా…

* తోడికోడళ్ళు చిత్రంలో “టౌనుపక్కకెళ్ళద్దురా డింగరి” అనే జానపద బాణీ ఉంది. బస్తీకెళ్దాం, సొమ్ము చేసుకుందాం అని అబ్బాయి పాడితే, పట్నం మోజులో పడి మోసపోవద్దు అని అమ్మడు పాడుతుంది. చక్కని సందేశం, నీతి రెండూ ఉన్న పాట ఇది.

* “వెన్నెల రేయి చందమామ వెచ్చగనున్నది మావా

మనసేదోలాగున్నది నాకేదోలాగున్నది.. ”

అంటూ వయసులో ఉన్న యువతీయువకులు పరస్పరం చెప్పుకునే ఊసులే ఈ పాట. రంగుల రాట్నం చిత్రంలోని ఈ పాటకు సంగీతాన్ని సమకూర్చినది ఎస్. రాజేశ్వరరావు గారు, కొసరాజు సాహిత్యం. పాడినది బి.గోపాలం, ఎస్.జానకి. ఈ పాట చివర్లో వచ్చే డప్పు వాయిద్యం చాలా ఉత్సాహకరంగా ఉంటుంది.

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7057

* ఊ..హూ… ఊ… అంటూ ఓ మధురమైన హమ్మింగ్… తర్వాత,

“గట్టుకాడ ఎవరో… చెట్టునీడ ఎవరో

నల్ల కనుల నాగసొరము.. ఊదేరు ఎవరో”

అంటూ సాగే జానకి పాడిన ఈ పాట బంగారు పంజరం చిత్రంలోనిది. దేవులపల్లి సాహిత్యం.

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2089

ఈ జానపద గీతాల్లోని ఇంకో ప్రత్యేకత ఏంటంటే మొహమాటాలూ, దాపరికాలు లేకుండా ఉన్నదున్నట్లు మనసులో మాటలన్నీ చెప్పేసుకుంటున్నట్లుంటాయీ సాహిత్యాలు. సరదాగా ఒకరినొకరు వేళాకోళాలాడుకుంటూనే అభిమానాలూ తెలుపుకుంటారు జంటలు. అనురాగం చిత్రంలోని ఈ పాట అందుకో చక్కని ఉదాహరణ..

“శనగ సేలో నిలబడి చేయ్యిజాపే ఓ పూసలోళ్ళ రాజమ్మా..” అనే పాటను క్రింద లింక్ లో వినవచ్చు:

అలాంటిదే “భలే రంగడు” చిత్రంలో ఇంకో పాట ఉంది..

“మెరిసిపోయే ఎన్నెలాయే

పరుపులాంటి తిన్నెలాయే

నన్ను ఇడిసి ఏడ బోతివిరా… బంగారుసామీ

రేతిరంతా ఏమిసేతునురా – ”

అనే పి. సుశీల పాడిన ఈ పాటను క్రింద లింక్ లో వినవచ్చు:

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1225

* “వెలుగు నీడలు” చిత్రంలో “సరిగంచు చీరగట్టి బొమ్మంచు రైక తొడిగి ” అని ఓ స్టేజ్ సాంగ్ ఉంది. ఈ పాట సాహిత్యంలో “మింగ మెతులు లేదాయే..”, ఇంట్లో ఈగల మోత..” మొదలైన రెండు మూడు సామెతలు కూడా దొర్లుతాయి.

*ఇదే సినిమాలో హీరోహీరోయిన్లు నదిలో పడవ మీద వెళ్తుంటే, ఏటి గట్టు వెంబడే వెళ్టున్న పల్లెపడుచులు ఒకరినొకరు హుషారు చేసుకుంటూ పాడుకునే మరో గీతం ఉంది.

“ఓ రంగయో పూల రంగయో

ఓరచూపు చాలించి సాగిపోవయో

పొద్దువాలిపోతున్నదో..ఓఓయి.. ఇంత మొద్దు నడకనీకేల పోవోయి.. ”

* మంచి హుషారును తెప్పించే పాత పాటల్లో జమునారాణి పాడిన ఈ పాటను జత పరుచుకోవచ్చు. “ఎర వేసి.. హ… గురి చూసి.. పట్టాలి మావా..” అనే లైన్ భలే ఒడుపుగా పలుకుతారావిడ. బంగారు తిమ్మరాజు చిత్రం లోని ఈ పాటన్ ఉ ఇప్పటికీ టివి, స్టేజ్ షోస్ లో పాడుతూనే ఉన్నారు జమునారాణి.

“నాగమల్లి కోనలోన

నచ్చింది లేడికూన

ఎర వేసి గురి చూసి పట్టాలి మావా ” –

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7035

* జానపద బాణీ లానే కాక ఈ పాటలోని నీటిసూత్రాలు ఎంతో ఆకట్టుకుంటాయి ఈనాటికీ. మంచి మనసులు చిత్రంలో జమునారాణి, ఘంటసాల పాడారీ గీతాన్ని.

మావ మావ మావ

ఏమే ఏమే భామా…

* “రోజులు మారాయి” చిత్రంలో “పొలియో పొలి” అనే జానపద గీతం ఉంది. ఇది కాక బాగా పాపులర్ అయిన మరో పాట “ఏరువాకా సాగారో”. రైతన్న నైజాన్నీ, కృషినీ, దేశానికి చేసే సేవనూ మెచ్చుకుంటూ పాడే ఈ పాట సాహిత్యం ఎంతో బావుంటుంది. వహీదా రెహ్మాన్ హిందీ చిత్రాల్లో ఇంకా పాపులర్ అవ్వక మునుపు నటించిన నృత్యగీతం ఇది.

” కల్లాకపటం కాననివాడా

లోకంపోకడ తెలియని వాడా

ఏరువాకా సారారోరన్నో చిన్నన్నా

నీ కష్టమంతా తీరునురోరన్నో చిన్నన్నా..”

* “అదృష్టవంతులు” చిత్రంలోని “మొక్కజొన్న తోటలో ” పాటను మోస్ట్ పాపులర్ జానపద గీతం అనచ్చేమో! రేడియోలో చాలాసార్లు విన్నాకా ఓసారి టివిలో ఈ పాట చూసినప్పుడు బోలెడు ఆశ్చర్యపోయాను. ఇలాంటి పాటా ఇది అని?! నిజంగా ఏ పొలాల్లోనో, మంచె పక్కనో ఓ అమ్మాయి నిలబడి పాడుతుందేమో అనుకునేదాన్ని చిన్నప్పుడు. కానీ వినడానికి మాత్రం భలే సరదాగా హుషారుగా ఉంటుందీ పాట. కె.వెంకటరత్నంగారు రాసిన జానపద గీతం ఇది.

http://www.raaga.com/player5/?id=191693&mode=100&rand=0.06835282778691398

* “తల్లిదండ్రులు” చిత్రంలో “గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో ” అనే పాట ఉంది. పల్లెపడుచులందరూ చక్కగా గొబ్బిళ్ళు పెట్టుకుంటూ పాడుకునేలాంటి పాట. ఇది కూడా నెట్ లో ఎక్కడా దొరకకపోతే నా దగ్గర ఉన్నది క్రింద లింక్ లో అప్లోడ్ చేసాను.

“చెంచులక్ష్మి” చిత్రంలోని పాపులర్ సాంగ్ “చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?” నాకు చాలా ఇష్టమైన పాటల్లో ఒకటి. జిక్కీ, ఘంటసాల పాడిన ఈ పాటకు సంగీతం ఎస్.రాజేస్వరరావు.

మరికొన్ని జానపద బాణీల్లోని సినీగీతాలు వాటి క్రింద ఉన్న లింక్స్ లో వినవచ్చు:

* “అల్లుడొచ్చాడు” చిత్రంలో అది కూడా జానపద బాణీలోని పాటే అనుకోవచ్చు.

“అంతే నాకు చాలు తమలపాకు తొడిమే పదివేలు

నేనేదింక కోరేదికలేదు అందరివోలె అడిగేదాన్ని కాదు

కొందరివోలె కొసరేదాన్నికాదు

ఓ మావా..ఓహో బంగారి మావా…” అని టి.చలపతిరావు సంగీతంలో సుశీల పాటొకటి సరదాగా బావుంటుంది. . వినాలంటే క్రింద లింక్ లో మొదటి పాట:

http://tunes.desibantu.com/alludochchadu/

* “పట్నంలో సాలిబండ పేరైనా గోలకొండ

చూపించు సూపునిండా”

– అమాయకుడు

(క్రింద పేజ్ లోని లిస్ట్ లో నాలుగవ పాట)

http://www.sakhiyaa.com/amayakudu-1968-%E0%B0%85%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%95%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/

* ఎయిర సిన్నోడేయ్ రా – పూలరంగడు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1739

* చివరిగా… “నీతోటే ఉంటాను శేషగిరి బావా” – జమిందార్

గమ్యం దగ్గిరే అని చెప్పే చిత్రం “ఎంతెంతదూరం ..?”

poster_ed

వేణు నక్షత్రం గారి ఎంతెంత దూరం సినిమా చూసాను. ఇది చాల చక్కగా తీసిన సినిమా. ఈ సినిమా చూస్తున్నపుడు నాకు నా బాల్యం గుర్తుకొచ్చినది. నేను కూడా గ్రామీణ ప్రాంతములో తెలంగాణా ప్రాంతములో పుట్టి పెరిగాను. అవే గుడిసెలు అవే మిద్దెలు- వాటన్నిటి మధ్యలో పుట్టి పెరిగాను . దాని తరువాత ఈ పిల్లలు ఏ పరిస్థితులలో అక్కడ చదువుకుంటున్నారు, తల్లిదండ్రులు ఏ పరిస్థితులలో పిల్లలని పోషిస్తున్నారు, వాళ్ళకుండే అలవాట్లు ఏంటి ? వాళ్ళకుండే సాధకభాదకలేంటి? తరవాత భార్యా భర్తల మధ్య ఒక సంఘర్షణ ఒక విద్యార్థికి తల్లితండ్రులకి మధ్య సంఘర్షణ, తరువాత ఒక దొరకు ఒక పాలేరుకు మధ్య సంఘర్షణ . తరువాత బానిసత్వము దాని తరువాత ఈ దొరతనము అవ్వన్ని కూడా చాల చక్కగా దర్శకుడు వివరించారు.

పేదరికం అనేది చదువులో మార్కులు సంపాయించడంలో కాని లక్ష్యానికి ఎక్కడ కూడా అడ్డం కాదు, ఆ పట్టుదల అనేది ఉంటే ఏదైనా సాదించవచ్చు అనేది ఆ అబ్బాయి పాత్ర ద్వారా చూపించారు . తరువాత రెండవది తల్లి పాత్ర చాల చక్కగా చూపించారు దర్శకుడు. బాధ్యతరహితంగా తిరిగే ఒక తండ్రి వున్నప్పుడు , ఆ ఇంటి ఇల్లాలు బాధ్యతగ తన కొడుకు ను ఎలా చదివించు కోగలిగింది ?తరువాత తల్లికి తండ్రికి మధ్య ఎలాంటి సంఘర్షణ చక్కగా వివరించారు ఈ చిత్రంలో .

పేద వారిలో తండ్రి కొడుకుల బంధం, ఉన్నత చదువుల కోసం కొడుకు తండ్రి తో ఘర్షణ చాల అద్భుతంగా చిత్రీకరించారు. భూస్వాములు ఎలా బ్రతుకుతారు గ్రామీణ ప్రాంతాలలో, ఒక్కపుడు ఏవిదంగా బ్రతికేవారు తరువాత వాళ్ళు చేసుకునే పండగలు వారి పబ్బాలు అలాగే వాళ్ళకుండే ఆలోచనా విధానంఏంటి? అలాగే పాలేర్ల పిల్లలని ఏ విధంగా చూస్తారు , తెలంగాణా ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఈ సమాజాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు దర్శకులు . అందులో నటించిన నటీ నటులు చాల చక్కగా నటించారు, వాళ్ళు మన కళ్ళకు కట్టినట్టుగా మన గ్రామీణ సమాజాన్ని మన ముందుంచారు నిజం చెప్పాలంటే జీవించేసారు వాళ్ళ పాత్రలలో. ఒక పేద తండ్రి పాత్ర లో , మాభూమి, కొమరం భీమ్ , దాసీ లాంటి ఎన్నో ఆణిముత్యల్లాంటి చిత్రాల్లో నటించిన డాక్టర్ భూపాల్ రెడ్డి నటించాడు అనే కంటే జీవించాడు అని చెప్పొచ్చు. ప్రముఖ టీవీ సినీ నటి , నంది అవార్డు గ్రహీత మధుమణి చక్కగా తల్లి పాత్రలో ఒదిగి పోయారు . వీరిద్దరికి దీటుగా వూరి పెత్తందారు పాత్ర లో జి.ఎస్ నటన కూడా చెప్పో కో దగ్గది. ఇంకా కొన్ని ఒకటి , రెండు సన్నీ వేషాల్లో కన పడ్డ చిన్న పాత్రలు అయినా , మురళి గోదూర్, చాయ తమ పాత్రలకి చక్కగా సరి పోయారు .

ఈ సీక్వెన్స్ అఫ్ ఈవెంట్స్ కూడా ఎక్కడా బోర్ కొట్టినట్టుగా అనిపించదు చాల గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి క్షణం కూడా మనకి ఈ అబ్బాయి నిజంగా చదువు కుంటాడ చదువుకోడా అని ఈ భూస్వామి ఇతన్ని కొడతాడ లోకపోతే ఈ పిల్లవాడికి మార్కులు ఎక్కువగా వచ్చినయని భూస్వామి బిడ్డకి తక్కువ వచ్చినయని ఈ పిల్లవాడిని కానీ అతని తండ్రిని కానీ నిలతీస్తడా అన్న విషయాలన్నీ చాల చక్కగా వివరించారు దర్శకుడు . తండ్రికి కొడుకు మీద ఎంత కోపం ఉన్నా కూడా ఇంత పేదరికంలో కూడా ఎన్ని భాదలున్న కూడా పిల్లవాడు మంచి పనిచేసాడని పిల్లవాన్ని అక్కున చేరుచుకోవడం అనేది చాల బాగా చిత్రీకరించారు. చివరగా ఈ పేదరికంలో ఉన్న కూడా మద్యం అనేది ఎలా వీళ్ళని కబలిస్తుంది అనేది కూడా చక్కగా చూపించారు . మా చిన్నతనం నుంచి ఉన్న సమస్యలే ఇప్పటికి ఉన్నాయి కాకపోతే సమస్యలు ఇంకా ఎక్కువయినవి. పేదరికంతో పాటు మధ్యంపానం కూడా తోడయినది కాబట్టి బ్రతుకులన్ని బజారున పడుతున్నాయి , దీని గురించి కూడా చక్కగా వివరించారు

still3_ed

ముఖ్యంగా ఈ చిత్రానికి ప్రాణం డాక్టర్ పసునూరి రవీందర్ కథ, దాన్ని దృశ్య రూపకం లో మలచడం లో దర్శకుడు వందకు వంద శాతం న్యాయం చేయకలిగాడు అనటంలో ఏ సందేహం లేదు. శరత్ రెడ్డి కెమరా మ్యాజిక్ కూడా దీనికి తోడయ్యింది . ఇక పోతే ఈ చిత్రం మొదటి ఫ్రేమ్ నుండి చివరి వరకు , అందరిని ఎలాంటి ఆధునిక సంగీతపు పోకడలకు పోకుండా గ్రామీణ వాతావరణంలో విహరిస్తున్నట్టు గా ఒక అనుభూతికి లోనయ్యే చక్కటి సంగీతాన్ని విష్ణు కిశోర్ అందించగా , ఏ ఒక్క పది సెకండ్ల ఫ్రేమ్ కూడా మనకు అవసరం లేదు అనడానికి వీలు లేకుండా తన కత్తెరకు పని చెప్పాడు ఎడిటర్ అమర్ దీప్ నూతి .

సినిమా అంటే టీం వర్క్ , ఎవరిని ఎలా ఉపయోగించు కోవాలో అంత వరకే వుపయోగించు కొని ఒక చక్కటి చిత్రాన్ని అందించడం లో వేణు నక్షత్రం దర్శకునిగా వంద శాతం సక్సెస్ కాలిగాడు ఈ చిత్రంతో .
ఆయనకు మంచి ఫ్యూచర్ వుంది . కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించే ఒక కళ ఆయనకు అబ్బినట్టుగా వుంది అని నాకు అనిపిస్తుంది . రాబోయే రోజుల్లో ఇంకా మంచి సినిమాలు తీస్తారని నేను ఆశిస్తున్నాను .

Video:

Enthentha dooram Trailer:

-డాక్టర్ ప్రవీణ్ కుమార్

PraveenKumar-IPS.1jpg

మల్లీశ్వరి చూడలేని చేదు నిజం!

‘“ఒక ప్రాపంచిక దృక్పథం లేనప్పుడు మానవ వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా, స్వేఛ్ఛగా వ్యక్తం చేయటం సాధ్యం కాదు. అలాంటి ప్రాపంచిక దృక్పథాన్ని సాధించనంత వరకు నవల (సాహిత్యం) కొత్త జీవితాన్ని పొందలేదు”.

-రాల్స్ ఫాక్స్ “నవల- ప్రజలు” (తెలుగుసేత-వల్లంపాటి వెంకటసుబ్బయ్య)

సమాజ జీవితం పట్ల అనేకులకు అనేక రకాల అవగాహన ఉంటుంది. శాస్త్రవేత్తలు, సామాన్యులు, కళాకారులు తమ అవగాహనను అభివ్యక్తం చేయడంలో బేధాలుంటాయి. చూచిన దానిని చెప్పటంలోనూ తేడాలుంటాయి. అందుకనే మామూలు సంభాషణకన్నా, వార్తకన్నా, సాహిత్య రచన భిన్నంగా వుంటుంది. అందువల్ల రచయితలు సమాజాన్ని చూడటంలోనే దృష్టి బేధాన్ని దానివల్ల వాళ్ళ సాహిత్య సృష్టిలో వచ్చే భేదాలను రచయితల సాహిత్యాన్ని పరిశీలించే ముందు తెలుసుకోవాల్సి వుంటుంది.

రచయితలు సమాజంలో భాగస్వాములు, సమిష్టి మానవ జీవితంలో వాళ్ళ అనుభవాలు కూడా వుంటాయి. రచయితలు వాళ్ళ సొంత లేదా వాళ్ళకు పరిచయమైన జీవితాన్ని రచనకు వస్తువుగా తీసుకుంటారు. అందులోని మంచి చెడులను విశ్లేషిస్తారు. పాఠకులను చెడుకు వ్యతిరేకంగా, మంచికి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. చెడుకు చోటులేని ప్రత్యామ్నాయ సమాజాన్ని ప్రతిపాదిస్తారు. రచయితలు ఇంత పని చేయాలంటే ఒక దృక్పథం లేకుంటే సాధ్యం కాదు. సమాజ పరివర్తనలో రచయితలు క్రియాశీల సృజనాత్మక పాత్ర నిర్వహించడానికి వాళ్ళకు సహకరించేది వాళ్ళ ప్రాపంచిక దృక్పథమే. అయితే, అందరు రచయితల ప్రాపంచిక దృక్పథం ఒకటి కాకపోవచ్చు. అలానే అన్ని కాలాల ప్రాపంచిక దృక్పథమూ ఒకటి కాకపోవచ్చు. రచయిత నేపథ్యాన్ని బట్టి సమాజంలో ప్రచురంగా వుండే భావజాలాన్ని బట్టి రచయితల మీద సమాజ, ప్రభావాల్ని బట్టి ప్రాపంచిక దృక్పథం ఏర్పడుతుంది. రచయిత రచనకు పూనుకునే ముందు తన ప్రాపంచిక దృక్పథాన్ని నిర్ధారించుకొని రచన ప్రారంభిస్తాడు.

విమర్శకులు ఏ రచయితనైనా అధ్యయనం చేసేటప్పుడు మొదట ఆ రచయిత ప్రాపంచిక దృక్పథాన్ని పట్టుకుంటే తక్కిన సాహిత్యాంశాలు వాటంతట అవే విశదమైపోతాయి. విమర్శకులు ఈ పని చేయాలంటే విమర్శకులకే మొదట స్పష్టమైన ప్రాపంచిక దృక్పథం వుండాలి. ఆధునిక సాహిత్య రంగంలోనూ, సాహిత్య విమర్శరంగంలోనూ ఈ కారణంగానే ప్రాపంచిక దృక్పథం ప్రధానాంశంగా వుంది. అయితే అనేక మంది విమర్శకులు ఈ ప్రధానాంశాన్ని ఇంకా జీర్ణం చేసుకొకుండానే విమర్శ రాస్తున్నందువల్ల గందరగోళం రాజ్యమేలుతోంది. విమర్శకుడు తమ ప్రాపంచిక దృక్పథమేమిటో స్పష్టంగా, నిర్ధిష్టంగా ఏర్పడక ముందే తమ అజ్ఞానాన్ని దాచుకొని, అరకొర కొలమానాలతో విమర్శకు పూనుకుంటే, నమ్మకంలేని వాటిని గురించి బలంగా మాట్లాడే ప్రమాదం వుంది. పైగా సాహిత్య విమర్శ అభివృద్ధి చెందలేదనే అభిప్రాయం కలుగుతుంది.

రచయిత సామాజిక చలన సూత్రాలను స్పష్టం చేసే పనిని నెత్తికెత్తుకున్నాడు. సంస్కర్తగా, జాతీయవాదిగా, అభ్యుదయ, విప్లవవాదిగా దిగంబరుడిగా, దళిత, స్త్రీ, మైనారిటీవాదిగా, ఆర్థిక, సాంఘీక, రాజకీయ, సాంస్కృతిక జీవిత వ్యాఖ్యాతగా మారాడు. రచయితలు గుర్తింపబడని శాసనకర్త అని ఒక నాడు మాథ్యూఆర్నాల్డ్ అన్నాడు గానీ ఇవాళ రచయితలు గుర్తింపబడిన శాసన కర్తల్లో ఒకడయ్యాడు. రచయిత దృష్టికి, రచయితలుకాని వారి దృష్టికి తప్పకుండా తేడా వుంటుంది. ఒక ప్రకృతి దృశ్యాన్ని చూసిన, ఒక సామాజిక సంఘటనను చూసినా, ఒక సామాజిక పరిణామాన్ని పరిశీలించినా రచయిత దృష్టి నిశితంగా సృజనాత్మకంగా వుంటుంది. అయితే అందరి రచయితల దృష్టికోణం కూడా ఒకటే కాదు కనుక దృష్టి వైవిధ్యం కనిపించినా, దృష్టి వైచిత్రి మాత్రం అందరిలోనూ వుంటుంది. పారిశ్రామిక నాగరికత బలిసిపోయి మానవ సంబంధాలు కృత్రిమంగా తయారైన పాశ్చాత్య నాగరికత వల్ల ఎంతో మంది మానసికంగా ఆందోళన చెంది వుంటారు కానీ టి.ఎస్. ఇలియట్‍కు మాత్రమే అది ‘ఊసర క్షేత్రం’గా (waste land)గా కనిపించింది.

భారతీయ సామాజిక వ్యవస్థ, సంస్కృతులు విశ్వనాథ సత్యనారాయణకు వేయిపడగలుగా కనిపించాయి అదే వ్యవస్థ, అదే సంస్కృతి గుర్రం జాషువాకు నాల్గుపడగల నాగరాజుగా కనిపించాయి. విశ్వనాథ సత్యనారాయణ ’వేనరాజు నాటకానికి ప్రతిగా త్రిపురనేని రామస్వామి చౌదరి ’ఖూనీ’ నాటకం రాశారు. దృష్టి బేధమే ఇందుకు కారణం. సంప్రదాయవాదికి అమ్మ ’మాతృదేవోభవ’ అవుతుంది. స్త్రీవాదికి అమ్మ ’మండుతున్న పొయ్యిలా’ (విమల-వంటిల్లు) కనిపిస్తుంది. ఇంకాచెప్పాలంటే ’మసిగుడ్డ’గా(కుప్పిలి పద్మ) కనపడుతుంది. మరొకరి దృష్టికి ’త్రీ ఇన్ వన్‍గా’ (సి.సుజాత) కనపడుతుంది. అందువల్ల సాహిత్యాధ్యయనంలో రచయిత దృష్టి ప్రాపంచిక దృక్పథమంత ముఖ్యమైంది.

మామూలు మనిషి దృష్టి కన్నా రచయిత దృష్టి విశిష్టంగా వున్నప్పుడు రచయిత సృష్టి కూడా విశిష్టంగా వుంటుంది. మరి దాన్ని అందుకునే స్థాయి విమర్శకులకు కూడా అవసరం. మల్లీశ్వరి ఆ దృష్టి వైవిధ్యాన్నిఎంత బాగా అవగహన చేసుకుందో వర్తమాన కథకులైన గౌరు నాయుడు, అట్టాడ అప్పల నాయుడు కథల్ని తీసుకొని ఇద్దరినీ ఒకే గాట కట్టారు. గౌరునాయుడు ఆదర్శవాది, అప్పలనాయుడు విప్లవాచరణవాది. వాళ్ళిద్దరి కథా సాహిత్యాన్ని చదివిన సాధారణ పాఠకులకు సైతం ఇది అర్థమయ్యే విషయం. గౌరునాయుడికి గ్రామాలపట్ల, గ్రామీణప్రజలపట్ల, గ్రామీణవ్యవస్థపట్ల వర్తమానంలో చూస్తున్నదానిమీద వ్యతిరేకత వుంది. ఆవ్యతిరేకతతో ఒక ఆదర్శపూరిత గ్రామీణజీవనాన్ని ఆకాంక్షిస్తాడు. అదెలా సాధ్యమన్నది అతనికి పట్టని విషయం. ఇక సాధ్యాసాధ్యాల చర్చ వస్తే, అదే అతని కథలకు పరిమితి. సమాజాన్ని అర్థం చేసుకునే క్రమంలో కూడా ఆయనకు వర్గాతీత భావన వుంది. కానీ అప్పలనాయుడు సమాజాన్ని భౌతికవాద దృష్టితో చూస్తాడు. సామాజికంగా జరిగే చలనాలను, ఘటనలకు వర్గదృక్పథం వుందని అతని కథలు చెబుతాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే, మార్క్సిస్ట్ దృష్టికోణమతనిది.

దాదాపు అతను కథారచన ఆరంభించిన ’పువ్వులకొరడా’ కాలం నుండి ఇప్పటి ’సంధిగ్ధాకాశం, వికృతి’ కథల వరకు సామాజికంగా, ప్రాకృతికంగా జరిగే అనేక మార్పులను, సంఘటనలను ఉత్తరాంధ్ర స్థానిక జీవితాన్ని నిర్ధిష్టంగా చిత్రించినా కొంచెంకొంచెం తేడాలతో, అన్ని ప్రాంతాల జీవితానుభవాల వ్యక్తీకరణ రూపాన్ని తన కథల్లో చిత్రించారు. ’క్షతగాత్రగానం’ (వంశధార కథలు-21ఫిబ్రవరి1999) ’షా’ (ప్రజాసాహితి నవంబర్ 2005) ఉత్తరాంధ్ర సామాజిక, సాంస్కృతిక ఆర్థిక పరిణామాలనేకాక తెలుగు నేల నాలుగు చెరుగుల విస్తరిస్తున్న సామ్రాజ్యవాద సాంస్కృతిక ప్రతిరూపాలుగా అలరారుతున్న నగరాలు మొదలుకొని పల్లెసీమల వరకు ఈ విషవలయంలోనే చిక్కుకున్నాయని నమ్మడం ఎంత వాస్తవమో అట్టాడఅప్పలనాయుడి కథలకు సార్వజనీన లక్షణం వుండడం కూడా అంతే వాస్తవం.

560804_290376897745258_1563925822_n’క్షతగాత్రగానం’ కథ గురించి మల్లీశ్వరి ’పెద్ద రైతు నేపధ్యంలో రాసినప్పటికీ వ్యవసాయ రంగంలోని ఫ్యూడల్, అర్థఫ్యూడల్ దోపిడీకి, వర్తమానంలోని పెట్టుబడిదారీ దోపిడీకి మధ్యనున్న తేడాగా మార్పుల్ని అర్థం చేస్తున్న కథ’ అన్నారు. నిజానికింతే కాదు ఇంకా అప్పటికి(1998) యెరుకలోకే రాని కార్పొరేట్ వ్యవసాయీకరణ ప్రవేశాన్ని చింత్రించిన కథ ఇది. ఈ అంశాన్ని గ్రహిస్తే, అది పెద్ద రైతుల పక్షాన మాత్రమే చెప్పిన కథగా కనిపించదు. ఈకథలోని రైతు పెద్ద రైతు కాదు. భూమి కోసం పడరాని పాట్లు పడి, తాతల తరం పొట్టచేతబట్టుకొని పరాయి దేశానికి(బర్మా) వలసపోయి, సంపాదించిన భూమిని, industrialized transformation జరిగిన తరవాతి తరం హరించేస్తుంది. దానికి కారణాలుగా రచయిత సామాజిక ఆర్థిక రాజకీయ భూమికలను కథలో అనేకచోట్ల చూపిస్తారు.

ఉదాహరణకు “వ్యవసాయంలో….వ్యాపార పంటలొచ్చాయి. షుగర్, జూట్ మిల్లు లొచ్చేయి. ఆ పంటల మార్కెట్ యెగుడూ దిగుళ్ళతో అప్పుల్తో మిగిలేరు”…
“పడమర దోవలో యెవరిదో మోడ్రన్ రైస్ మిల్లోకటి-పరాయిదేశ చక్రవర్తి స్థాపించిన విజయస్తంభంలా కన్పిస్తోంది. తూర్పుదారిలో-కాఫీ,టీ దుకాణాలు! కొత్తవీధి గుండా ఆటో-బలసిన పెనుమృగంలా నిల్చిన శంకర్రాజు ఎరువుల గోడాంని దాటింది. వీధులు, రోజ్ గార్ నిధుల కంకర రోడ్డుతో విశాలమయినట్లున్నాయి. వీధి మలుపులో “స్నోవైట్” కాన్వెంట్- చిలుకలను బొధించిన పంజరంలా వుంది!ఆటో ఆగిపోయింది”.(పే.నెం.282 అట్టాడ అప్పలనయుడు సాహిత్యం మొదటి సంపుటం కథలు కొన్ని 2013)

ఒకరకంగా, విద్యాసాగర్ గారి పుస్తకంలో ప్రతిపాదించిన విషయాలను, మల్లీశ్వరి వ్యాసాంతంలో చెప్పిన ’జీవితాలను అర్థంచేసుకొని అక్షరబద్ధం చేసిన బాధ్యతాయుత రచయిత’కథగా దీన్ని ఉదహరించవచ్చు. గానీ మల్లీశ్వరి….ఇందులో వైరుధ్యాన్ని ఇటీవలి కథల్లో అప్పలనాయుడుగారు అధిగమిస్తూ వస్తున్నారన్నారు. ఇందులోగల వైరుధ్యమేమిటో, దాన్ని ఆయన ఏకథల్లో ఎలా అధిగమించారో చెప్పలేదు. క్షతగాత్రగానం-మారిన గ్రామీణ పరిస్థితులను 1999 నాటికే ఎత్తిపట్టి చూపించిన గొప్పకథ. కార్పొరేట్ వ్యవసాయీకరణ, యాంత్రీకరణ, హైటెక్నాలజీ, కొత్తతరం జీవన విధానం, వారి ఆలోచనలు…….కోటేశ్వరరావు, పురుషోత్తం, భుక్త, ప్రవీణ్, తాత….సుభద్ర, పాలేరు…..అందరి జీవితాల్లోంచి విధ్వంసాలనెన్నింటినో చింత్రించిన కథ. పర ప్రాంత పెట్టుబడి, దాని విశ్వరూపం, అది నిర్ధిష్ట ప్రాంతపు రాజకీయ, ఆర్థిక రంగాలనెలా శాసిస్తుందన్న వస్తువుతో వచ్చిన కథ. ’షా’కథను మల్లీశ్వరి అర్థం చేసుకున్నట్టు……’పెట్టుబడి దారులందు స్థానిక పెట్టుబడిదారులుమేలయా’ అని కథలో ఎక్కడా రచయిత చెప్పలేదు. కథ కూడా అలాంటి భావనలకు ఎక్కడా ఊతమియ్యదు. ఈమె అపార్థంచేసుకుందనడానికి…..ఈ రెండు కథలపై ఆమె చేసిన వ్యాఖ్యానాలే ఉదాహరణలు.

పెట్టుబడిదారుల మధ్య వైరుధ్యముంటుంది. స్థానిక స్థానికేతర వైరుధ్యమది. ఆవైరంలో స్థానికులు ఓడిపోతారు. పెట్టుబడిని ఓడించేది, జనసమూహమే తప్ప వేరొకరుకాదన్నది ఈ కథ సారాంశం. ‘షా’ కథ పేరే దాన్ని సూచిస్తుంది. చదరంగం ఆటలో బంటుల్తో రాజును ముట్టడించటాన్నే ‘షా’ అంటారు. ఈ కథలో ముట్టడికి నాయకత్వం వహిస్తున్న రైతుకూలీ సంఘం నాయకుడు రైతుకూలీ సంఘం డిమాండ్లను స్థానిక పెట్టుబడి దారుడుగా ఎదిగిన శంభునాయుడు విని శభాష్ అనుకుంటాడు. శంభునాయుడి తండ్రి వ్యవసాయకూలీ ఉద్యమకారులతో పాటూ గొంతు కలుపుతాడు. కథలో ఎక్కడా స్థానిక పెట్టుబడిదార్ల మద్దతుగా వాక్యంగానీ, సంఘటనగానీ లేదు. అయితే మల్లీశ్వరి పొరబాటు ఎక్కడపడుంటుందంటే శంభునాయుని వైన్ షాప్‍లో పనిచేసే సేల్స్‍మేన్ తన అంతరంగం నుంచి శంభునాయుడి ఎదుగుదలని, బతుకు అవకాశాల్ని పాఠకులకు ఇలా వినిపించారు. ‘ఇతగాడంటే మోతుబరోడు…..తండ్రిని కాలవ భూముల ఊరిలో దించి, యితగాని పట్నంలో దిగేడు’. అని శంభు నాయుడి స్థానాన్ని అంచనా కడతాడు.

స్థానికులు స్థాపించిన మోడరన్‍రైస్‍మిల్లును, శంకర్రాజు ఎరువుల గోడౌన్‍ని ‘బలిసిన మృగంలా, స్నోవైట్ కాన్వెంట్‍ను చిలుకలను బంధించిన పంజరంతోనూ అప్పలనాయుడు పోల్చడం జరిగింది. మరి స్థానికులేర్పాటు చేసిన ఇంత చిన్న పెట్టుబడులను కూడా బహుళజాతి పారిశ్రామిక పెట్టుబడులకు ఉపయోగించాల్సిన ఉపమానాలనే ఎందుకు వాడారు? ఈ ఉపమానాల వాడకాన్ని బట్టి స్థానిక, స్థానికేతర పెట్టుబడుల వ్యత్యాసాలను పాటించినట్లుగా అనిపిస్తుందా మల్లీశ్వరి.

కథ ముగింపులో కూడా, నదీ జలాల వినియోగానికి సంబంధించిన డిమాండ్‍ను రైతు కూలీ సంఘం పెడుతోంది తప్ప స్థానిక పెట్టుబడిదారుడు కాదు. అసలు కథంతా స్థానిక పెట్టుబడిదారుడు. పరప్రాంత పెట్టుబడి పోటీలో ఓడిపోవడాన్ని సహించలేక, ఎన్నెన్నో పన్నాగాలు పన్నుతాడు. అయినా వాళ్ళను ఎదిరించలేడు. వాళ్ళేదో ఎరగని ఆట ఆడుతున్నారనుకుంటాడు. ఆట కట్టించాలనుకుంటాడు కానీ కట్టించలేడు. కట్టించగలిగేది ప్రజాసమూహాలే అన్న పరిష్కారంతోనే ‘షా’ కథ ముగింపు ఉంది. ముగింపులో ఇంత స్పష్టంగా బోధపడుతుంటే, మల్లీశ్వరికెందుకు బోధపడలేదు చెప్మా!

‘కథంతటిలో కార్పొరేట్ పెట్టుబడి విశ్వరూపాన్ని చూపిన అప్పలనాయుడు దానిని ఎదిరించే మూలాలు స్థానికతలో వున్నాయని విశ్వసించారు. తమ ప్రాంతానికి చెందని ఏ పెట్టుబడినైనా వ్యతిరేకించటం కోసం స్థానికంగా వుండే అన్ని వర్గాలవారు కలిసి పనిచేయడాన్ని ఈ కథ ద్వారా ప్రతిపాదించారు.’ అని మల్లీశ్వరి అట్టాడచేసిన ప్రతిపాదనలుగా ప్రతిపాదించడం ఆమె అవగాహనాలేమిని తెలియజేస్తుంది. ఏదేశంలోనైనా, ఎప్పుడైనా, శ్రమజీవులే. పెట్టుబడిని, సామ్రాజ్యవాదాన్ని అడ్డుకుంటారు. ఓడిస్తారు. ఇది అనివార్యం.

అప్పలనాయుడు తన కథలో కిరణ్ పాత్రద్వారా ఈక్రమాన్ని చిత్రించారు తప్ప మల్లీశ్వరి ఆశించినట్లు, అర్థంచేసుకున్నట్లుగా, ఎదిరించే మూలాలు స్థానికతలో వున్నాయని చెప్పారె తప్ప, స్థానికవాద, ప్రాంతీయఉద్యమ ప్రబోధకంగా కథనం చేయలేదు. స్థానిక పెట్టుబడిని రక్షించుకోవాలి లేదా నిలుపుకోవాలనే ప్రయత్నం కథలో ఎక్కడా ప్రస్థావించలేదు. ఉద్యమించిన ప్రజలు శంభునాయున్నిగానీ, శంభునాయుని తండ్రినిగానీ పట్టించుకోలేదు. పెట్టుబడితో తమ పోరాటం తాము చేశారు. నాయకత్వ స్థానంలో నిలబడ్డారు. ప్రజలనాయకత్వాన్ని శంభునాయుడు మెచ్చుకుంటాడు, ఆశ్చర్యపోతాడు కూడా. అతని తండ్రికి మరోమార్గంలేక నాయకత్వం వెంట నడుస్తాడు. శంభునాయుడి తండ్రిది భూస్వామ్య మనస్తత్వం. తన రాజ్యంలో ప్రవేశించిన శత్రు సైన్యంలాగానే బహుళజాతి కంపెనీల వాహనాలను, వర్కర్స్ ను చూస్తాడు. మరి అతడు ప్రజాసంఘాల నాయకత్వంలోకి రావడానికి ప్రజా ఉద్యమాలపట్లగల మమేకత్వంతో కాదు.

స్వతహాగా భూస్వామికి స్థానిక ఉత్త్పత్తివనరులైన భూమి నదులపట్లగల ప్రేమతోనే. శంభు నాయుడు దూరమవుతున్న అతని మూలాల్ని గుర్తుచేస్తాడు. స్వతహాగా శంభునాయుడిది మోతుబర్ల కుటుంబం. అందుకే అతనిమూలాల్ని గుర్తుచేసే ఎరుకలో ఏమాయా మర్మం కనిపించలేదు. తననుతాను స్వఛ్చందంగానే ఆవిష్కరించుకుంటాడు. ఆ ఆవిష్కరణే శంభునాయుడ్ని తనతండ్రికి ప్రకృతి వనరులపట్లగల ప్రేమ అతన్ని ద్రవీభూతం చేస్తుంది. అతను తండ్రి ఆలోచనలపట్ల ఎప్పుడు? ఎందుకు? మూవ్ అవుతున్నాడు అన్న ప్రశ్న వేసుకుంటే, తన రాజకీయ జీవితానికి ముప్పు వాటిల్లిందనుకున్నప్పుడే శంభునాయుడు తండ్రిని గుర్తించగలుగుతున్నాడు, భూస్వామి మనస్తత్వం ,పెట్టుబడిదారీ మనస్తత్వాలలో కొద్దికొద్ది తేడాలున్నప్పటికి, ఇద్దరి లక్ష్యం ప్రజావ్యతిరేక పథాయే. అయితే, తమ ఉనికికే భంగం కలుగుతున్నప్పుడు శంభునాయుడు,అతని తండ్రిలాంటి వాళ్ళందరూ ప్రజాఉద్యమంలో కలవాల్సిన అనివార్యతను ‘షా’కథలో అట్టాడ అప్పలనాయుడు ఆవిష్కరించారు. అంతమాత్రంచేత అది ప్రజాపోరాటం కాకుండా పోదు. వీళ్ళందరూ తాత్కాలిక ప్రయోజనాల కోసం కలిసినంత మాత్రాన, అది సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం కాకుండాపోదు. అంతే తప్ప, ఒక ప్రాంతంలో వచ్చినంత మాత్రాన అది స్థానిక ఉద్యమం కాదు. ఏ ఉద్యమమైనా ఎక్కడో ఒకచోట మొదలుకాక తప్పదు. స్థానికత నుండే సార్వజనీనతను పొందుతుందనేది జగమెరిగిన సత్యం. ఇందుకు ఉదాహరణలు అవసరం లేదనుకుంటాను. మరి అట్టాడ అప్పలనాయుడి కథల్లో మల్లీశ్వరి అస్థిత్వవాదమెందుకు తెచ్చిందో అర్థంకాదు.

ఈమే స్వయంగా పాలపిట్టమాసపత్రిక, ఆగస్టు, 2013. సంచికలో అట్టాడ అప్పలనాయుడుతో చేసిన ఇంటర్వ్యూలో కూడా రచయితను అస్థిత్వవాదంపై వేసిన ప్రశ్నకు జవాబుగా అట్టాడ ఇచ్చిన సమాధానంలో ఆయన ప్రాంతీయ, వర్గ దృక్పథాల పట్ల తనకుగల అభిప్రాయాలను స్పష్టీకరించిన దాన్ని అక్షరబద్ధం చేసింది. వాళ్ళ మాటల్లోనే గమనిద్దాం!

“వర్గచైతన్యం నుంచి ప్రాంతీయ అస్థిత్వవాదిగా మీ పరిణామం కేవలం సాహిత్య సంబంధమైనదేనా?” అనే ప్రశ్నకు అట్టాడ జవాబుగా, “నిజానికి మీరన్నట్లు నేను కేవలం ప్రాంతీయ అస్థిత్వవాదిని కాను. ప్రాంతీయ ప్రజాపొరాటాలనేవి రూపంలో అస్థిత్వ ఉద్యమాలలాగా కనిపిస్తాయిగానీ సారంలో అవి సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు. అటువంటి ఉద్యమాలుగా అభివృద్ధి కాగలవు. ఆ భావనతోనే ప్రాంతీయ ఉద్యమాలను అర్థం చేసుకుంటాను. కనుక నిర్ధిష్ట ప్రాంతీయ పోరాటాలను అక్షరీకరిస్తున్నాను. వర్గచైతన్యానికి పోటీగానూ, ప్రత్యామ్నాయంగానూ ప్రాంతీయ అస్థిత్వాన్ని ఆహ్వానించటం లేదు. కాకపోతే వర్గ చైతన్యమనేది, నేడు అస్థిత్వ పోరాటాలను భూమికగా తీసుకొని అభివృద్ధి కావాలన్నది నాభావన.”

190291_290372241079057_1667688954_n

మల్లీశ్వరే స్వయంగా అట్టాడ అప్పలనాయుడి సమాధానాన్ని అక్షరాలా సాక్షీకరించింది. మరి ఈ సమాధానాన్ని ఎంతమాత్రం విని, రాసిందో లేక రాయించిందో కానీ మల్లీశ్వరి అట్టాడ అప్పలనాయుడ్ని ప్రాంతీయవాదిగా ముద్రవేసే విఫలయత్నం చేసింది.ఇలా తన అజ్ఞానాన్ని ‘వివిధ’ లాంటి ప్రతిష్టాత్మక సాహిత్య పేజీలో నలుగురితో పంచుకోవడమేకదా! దయచేసి ఇప్పుడైనా అప్పలనాయుడి ముఖచిత్రంతో వచ్చిన పాలపిట్ట ప్రత్యేక సంచికను మళ్ళీ మళ్ళీ చదువుకుంటే మంచిది.

విద్యాసాగర్ ‘పల్లెను మింగిన పెట్టుబడి’ గ్రామీణ పరిశోధన గ్రంధం ఆధారంగా వర్తమాన కథను పరిశీలించదలచి, గౌరునాయుడు, అప్పలనాయుడుల రెండు కథలను మాత్రమే గ్రహించి, (తిరుగుడు గుమ్మి, నీటిముల్లు, ఒకరాత్రి రెండు స్వప్నాలు-గౌరునాయుడు; మమకారం, ప్రత్యామ్నాయం, భద్రయ్య, యజ్ఞం తరువాత- అప్పలనాయుడు కథలిన్ని ఉండగా)ఒకటి రెండు కథల్లో రచయిత దృక్పథాన్ని పోల్చడం, అంచనా కట్టగలగడం అంత సరైన పద్ధతీ కాదు. సాధ్యంకాదు. మల్లీశ్వరి ఈ వ్యాసాన్ని విద్యాసాగర్ పుస్తకాన్ని సమీక్షగా చేసుకొని తన వ్యాసాంతంలో రచయితల బాధ్యత గురించి, గ్రామాలలో మారిన పరిస్థితులను అర్థంచేసుకోవడానికి రచయితలు తప్పక చదవాల్సిన గ్రంధంగా చెప్పింటే ప్రయోజనముండేది. విద్యాసాగర్ అభిప్రాయాలకు- అప్పలనాయుడు, గౌరునాయుడు కథలకు గల సహజాత వైవిధ్యాన్ని ఒక లోపంగా, పొరపాటుగా చెప్పడం వలన అటు విద్యాసాగర్ పుస్తకానికీ న్యాయం జరగలేదు. ఇటు ఈ ఇద్దరి రచయితల కథలకు న్యాయం జరగలేదు. ఎందుకంటే, విద్యాసాగర్ పల్లెల్లోకి ప్రవేశించిన పెట్టుబడి విశ్వరూపాన్ని క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా సేకరించిన గణాంకాలను ప్రచురించారు.

ఒకప్పటి పల్లెల్ని చూసిన అనుభవంలో నుంచి మాట్లాడుతున్న మేధో వ్యవసాయం చేసేవారికి, మారిన పల్లెల్ని చూడని వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ పరిశోధన గ్రంథం కళ్లు తెరిపిస్తుంది. అయినా, ఇది 2013సంవత్సరంలో వచ్చిన గ్రంథం. ఒక దశాబ్ధమున్నర ముందుగానే “క్షతగాత్రగానం”(1988) దానికి ఎనిమిది సంవత్సరాల తరువాత వచ్చిన ‘షా’ (2005)కథలు అప్పలనాయుడు రాశారు. విద్యాసాగర్ ప్రచురించిన గ్రామీణ ఆర్థికం ఈ పరిశోధన గ్రంథానికంటే ముందుగానే పల్లెల్లో అభివృద్ధిపేర కొనసాగుతున్న విధ్వంసాన్ని అట్టాడ తన కథల్లో చర్చనీయాంశం చేశారు. విద్యాసాగర్ పరిశోధించి ఆవిష్కరించిన సత్యాలను అట్టాడఅప్పలనాయుడు తన కథల్లో ఇంతకుముందే చిత్రీకరించారు. ఈ అంశాన్ని డా.మల్లీశ్వరి పరిశీలించలేకపోయారు. దృష్టిలోపమా? దృష్టికోణంలోనిలోపమా?.

– డా. కె. శ్రీదేవి

 అసోసియేట్ ప్రొఫెసర్

తెలుగు శాఖ

ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం .

నిజమైన చరిత్ర ‘బహుజన’ తెలంగాణాలో వుంది!

sangisetti- bharath bhushan photo
    షరతులు, మినహాయింపులు, ఆంక్షలతోనైతేనేమి ఎట్టకేలకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. ఇవ్వాళ భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిరది. తెలంగాణ ప్రజలు కోరుకుంది కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే కాదు ‘బంగారు తెలంగాణ’ కావాలని కోరుకుండ్రు. ఈ బంగారు తెలంగాణ కేవలం ‘బహుజన తెలంగాణ’ ఇంకా చెప్పాలంటే సామాజిక న్యాయం ద్వారానే సాధ్యమౌతుంది. సామాజిక న్యాయం అంటే సమాజంలోని అట్టడుగు వర్గానికి సైతం వారి జనాభా దామాషాలో చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం. ఒక్క ప్రాతినిధ్యమే కాదు అభివృద్ధిలో భాగస్వామ్యమూ కూడా కావాలి. 60 యేండ్ల తెలంగాణ పోరాటానికి  నిజమైన గుర్తింపు, గౌరవం, న్యాయం ‘బహుజన తెలంగాణ’తోనే సాధ్యమౌతుంది.

ప్రత్యేక తెలంగాణ న్యాయమైన డిమాండ్‌ అని చెబుతూ ఏ విధమైన సిద్ధాంతాలు, వాదనలు, ప్రాతిపదికలు, పోరాట ప్రతీకల్ని ముందుకు తీసుకొచ్చి, చారిత్రిక, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కవులు, రచయితలు, పరిశోధకులు, బుద్ధిజీవులు చైతన్యాన్ని కలిగించారో ఈనాడు ‘బహుజన తెలంగాణ’ కోసం కూడా అదే విధమైన ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరముంది. ఒక ప్రాంతంగా తెలంగాణ అస్తిత్వం ఖాయమైంది. ఇప్పుడు అస్తిత్వానంతర దశలో 90శాతంగా ఉన్న బహుజనులకు రాజ్యాధికారం ఎలా దక్కాలనే అంశంపై దృష్టి సారించాలి. న్యాయంగా, హక్కుగా దక్కాల్సిన వాటాని యాచించకుండా శాసించే స్థాయికి సమాజంలో అణచివేతకు గురైన వర్గాలు ఎదగాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణకు  సార్ధకతా వస్తూంది.
ఇప్పటికే తెలంగాణ పౌరుషం, పోరాట పటిమ, త్యాగాల చరిత్ర అంటే చాలు సమ్మక్క సారలమ్మ మొదలు, సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, మియాసాహెబ్‌, జంబన్న, తుర్రెబాజ్‌ఖాన్‌, బందగీ, కొమురం భీమ్‌, దొడ్డి కొమురయ్య, షోయెబుల్లాఖాన్‌, చాకలి ఐలమ్మలు, సదాలక్ష్మి, సంగెం లక్ష్మిబాయి తదితరులు రికార్డయ్యారు. వీరికి సరిసమానులైన బహుజన వీరులు, వీర వనితలు వందలు వేల సంఖ్యలో ఉన్నారు. వీరెవ్వరూ ఇంతవరకూ చరిత్ర పుటల్లో కెక్కలేదు. పాఠ్యపుస్తకాల్లో అసలే లేరు. వీరిని వెలుగులోకి తీసుకొచ్చి కొత్త చరిత్రను బహుజన దృక్కోణంతో తిరగరాయాలి. కొత్త రాష్ట్రంలో విద్యార్థులందరూ వీరి ఘనతను తెలుసుకోవాలి. ఈ పని ఇప్పుడు చేయనట్లయితే భవిష్యత్తులో మరింత కష్టతరమైతుంది. భౌగోళిక తెలంగాణ కోసం అగ్రవర్ణాలతో కలిసి బహుజనులు కొట్లాడిరడ్రు. ఇప్పుడు ‘సామాజిక తెలంగాణ’ కోసం అవసరమైతే అగ్రవర్ణాల వారితో సైతం తలపడాలి. ఇందుకోసం బహుజన సమాజాన్ని మరింతగా చైతన్య పర్చాల్సిన అవసరముంది.

ఈ బాధ్యత బుద్ధిజీవులు, ఉద్యమకారులపై మరింత ఎక్కువగా ఉంది. సమాజంలో అణచివేతకు గురైన అట్టడుగు వర్గాల వారి చరిత్రను, ఘనతను ఎలా వెలుగులోకి తేవాలో, తద్వారా ప్రజల్లో ఎంతటి ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుందో ఉత్తరప్రదేశ్‌లో మాయావతి అమల్లో చేసి చూపెట్టింది. తెలంగాణలో న్యాయంగానైతే పీడిత ప్రజల పక్షాన నిలబడుతామని చెబుతున్న ప్రభుత్వం విస్మరణకు గురైన బహుజన వీరుల్ని వెలుగులోకి తేవాలి. ఒక వేళ ప్రభుత్వం ఆ పని చేపట్టనట్లయితే బుద్ధిజీవులు అందుకోసం ముందుకు రావాలి. కేంద్ర, రాష్ట్ర పరిశోధక సంస్థలు ఈ విషయమై దృష్టి సారించాలి. పరిశోధన చేయించాలి. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందుకు తోడ్పడాలి. మాయావతి అధికారంలో ఉన్న కాలంలో 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న దళితుల చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి చరిత్రలో చిరస్మరణీయమైన స్థానాన్ని కల్పించింది.
ఉత్తరప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలో బహుజనసమాజ్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బహుజన చరిత్రకు గౌరవం దక్కింది. అప్పటి వరకు మరుగునపడ్డ మహనీయుల చరిత్రను వెలుగులోకి తేవడానికి ప్రభుత్వం నిధులు కేటాయించి మరీ పరిశోధన చేయించింది. వాటిని అందరికీి అందుబాటులోకి తెచ్చింది. వివక్షకు, విస్మరణకు గురైన వీరులను జ్ఞాపకం చేసుకునేలా ‘సామాజిక్‌ పరివర్తన్‌ కే లియే సంఘర్ష్‌ కర్నేవాలే మహాపురుషోంకా సమ్మాన్‌’ పేరిట మాయావతి ప్రభుత్వం పుస్తకం ప్రచురించింది. విస్తృత ప్రచారం కల్పించింది. జిల్లాలకు బహుజన యోధుల పేర్లు పెట్టడం తద్వారా ఆ వర్గాల వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడిరప జేసింది. అప్పటి వరకూ ఆదరణ లేకుండా పోయిన మహాత్మ బుద్ధ, మహర్షి వాల్మీకీ, ఏకలవ్య, కబీర్‌దాస్‌, అహల్యాబాయి హోల్కర్‌, ఛత్రపతి సాహూ మహరాజ్‌, జ్యోతి బాఫూలే, నారాయణగురు, పెరియార్‌ రామస్వామి, భాగ్యరెడ్డి వర్మ, అంబేద్కర్‌ల గురించి విరివిగా ప్రచారం జరిగింది. వారి రచనలన్నింటిని పునః ప్రచురించడమైంది.

1380399_10201616179779262_1021311603_n

1857 పోరాటంలో వీరాంగనలు పోషించిన పాత్రను కూడా ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. బుందేల్‌ఖండ్‌లో రాణీ లక్ష్మీబాయికి మారుగా యుద్ధం చేసిన బహుజన వనిత రaల్కారీ బాయితో పాటుగా స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న బహుజన పులి బిడ్డలు ఉదాదేవి, మహవీరి దేవి, అవంతీబాయి లోధీ, పన్నాధాయిల చరిత్ర బిఎస్పీ అధికారంలో ఉన్నప్పుడే వెలుగులోకి వచ్చాయి. బిఎస్పీ మొదట 1995 జూన్‌లో అధికారంలోకి వచ్చింది. అప్పటికే మండల్‌ కమీషన్‌ అమలుకు వ్యతిరేకంగా అగ్రవర్ణాలు చేసిన అలజడిని నిరసిస్తూ దళిత, బహుజనులు ఒక్కటై ఉద్యమం చేసిండ్రు. ఈ చైతన్యం తర్వాతి కాలంలో మాయావతి అధికారంలోకి రావడానికి తోడ్పడిరది. 1984 నుంచి బిఎస్పీ ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నప్పటికీ అధికారం దక్కించుకోవడానికి ఒక దశాబ్దం వేచి ఉండాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ కవులు, రచయితలూ పాటలు, కవిత్వం, వ్యాసాలు, రచనల ద్వారా తామూ చరిత్రకెక్కదగిన వారమే అని నిరూపించుకున్నారు. ప్రతి తాలూకా కేంద్రం నుంచి ఉత్తరప్రదేశ్‌లో దళితులకు సంబంధించిన చిన్న చిన్న పత్రికలు ప్రచురితమయ్యాయి. ఇవన్నీ దళిత అస్తిత్వ ఉద్యమానికి ఊతమిచ్చాయి. ఇదే తర్వాతి కాలంలో అధికారం అందుకోవడానికి సోపానమయ్యాయి. దాదాపు ఇవే పరిస్థితులు తెలంగాణలో ‘టీఆర్‌ఎస్‌’ అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాయి. వందలమంది బహుజన కవి, గాయకులు వేల పాటల్ని కైగట్టి పాడిరడ్రు. విస్మరణకు గురైన వీరుల్ని/వీర వనితల్ని వెలుగులోకి తెచ్చిండ్రు. సమాధి చేయబడ్డ ప్రతిభకు పట్టం కట్టిండ్రు.
1995 నుంచీ మరీ ముఖ్యంగా 2005 నుంచీ దళిత చైతన్యం`స్ఫూర్తి, చరిత్రకు సంబంధించిన సాహిత్యం ఇబ్బడి ముబ్బడిగా వెలుగులోకి వస్తోంది. పెద్ద ఎత్తున ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న దళితుల గురించి రచనలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న రాణీ లక్ష్మీబాయికి తోడ్పడిరది రaల్కారీబాయి. ఈమె బహుజన వనిత. ఇప్పటికీ తెలంగాణ మాదిరిగానే ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం చేస్తున్న బుందేల్‌ఖండ్‌లో జానపద గాయకులు ఆమె యశస్సును గానం చేస్తారు. మోహన్‌దాస నైమిశ్రాయ్‌ ఆమెపై హిందీలో పుస్తకం అచ్చేశాడు. తెలుగులో కూడా ఆమె జీవిత చరిత్రను హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ఇటీవల ప్రచురించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బద్రినారాయణ దళితుల ఔన్నత్యం, చరిత్రకు సంబంధించిన అనేక వ్యాసాలు, సోషల్‌సైంటిస్ట్‌, ఇపిడబ్ల్యూ లాంటి ప్రసిద్ధిగాంచిన పత్రికల్లో వెలువరించాడు. ఇటీవలే దళితోద్యమ చరిత్రను వెలువరించాడు.‘విమెన్‌ హీరోస్‌ అండ్‌ దళిత్‌ అస్సర్షన్‌ ఇన్‌ నార్త్‌ ఇండియా ` కల్చర్‌, ఐడెంటిటీ అండ్‌ పొలిటిక్స్‌’ పేరిట బద్రినారాయణ పుస్తకాన్ని 2006లో వెలువరించాడు.
సరిగ్గా ఇదే పద్దతిలో తెలంగాణలోని బహుజనుల జీవిత చరిత్రలు వెలుగులోకి రావాల్సిన అవసరముంది.    కాకతీయ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న వీర వనితలు సమ్మక్క, సారలమ్మలు, గోల్కొండ కోట మీద తిరుగుబాటు జెండా ఎగరేసిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న, పరాయి వారి పాలన పోవాలంటూ బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పోరాడిన వీరుడు తుర్రెబాజ్‌ఖాన్‌ల గురించి ‘ఈటన్‌’లాంటి విదేశీయులు పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చిన విషయాల్నయినా తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. చెరువులు తవ్వించి పేద ప్రజలకు పట్టెడన్నం పెట్టిన రాబిన్‌హుడ్‌లు పండుగ సాయన్న, మియా సాహెబ్‌ల గురించి ఇప్పటికీ పాలమూరు జిల్లాలో క్యాసెట్ల రూపంలో కథలు ప్రచారంలో ఉన్నాయి. అధికారులు వీరిని గజదొంగలు అని ముద్ర వేసినప్పటికీ వీరు ప్రజోపయోగమైన పనులు చేసి ప్రజల మన్ననలకు పాత్రులయ్యారు. చార్మినార్‌ కొమ్ములకు తాడేసి ఉయ్యాల ఊగుతానని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ప్రజా వీరుడు బండ్లోల్ల కురుమన్న ఈ గడ్డ బిడ్డలే అన్న సోయితో మెలగాలి.
నవచోళ చరిత్ర, మల్హణ చరిత్ర, శంకర దాసమయ్య, వీర సంగమయ్య దేవ చరిత్ర, శిష్యప్రబోధము అనే ద్విపద కావ్యాలను రాసిన కుమ్మరి కులానికి చెందిన పోశెట్టి లింగకవి, నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం, జనార్ధనాష్టకము తదితర గ్రంథాలను రచించిన నల్లగొండ జిల్లావాడు కందుకూరు రుద్రకవి, 1417లోనే ‘తెలంగాణ పురము’ అనే పదాన్ని మొదట శాసనాల్లో వేయించిన తెల్లాపూర్‌ (మెదక్‌ జిల్లా) పంచాణం వారి గురించి గానీ, ‘సీమంతిని విలాసం’ కావ్యాన్ని రాసిన ‘గాండ్ల’ తెలిక కులానికి చెందిన వరంగల్‌ జిల్లా మహేశ్వరం గ్రామానికి చెందిన సుంకరనేని ఫణికుండలుడు, ఈతని తమ్ముడు ‘విజయ విలాసం’ అనే కావ్యాన్ని, సుభద్రా పరిణయమనే యక్షగానాన్ని రాసిన సుంకరనేని రాజమౌళి, ఇబ్బడి ముబ్బడిగా తత్వాలు, కీర్తనలు రాసి, పాడి వందలాది మంది భక్తులకు మార్గదర్శనం చేసిన మాదిగాయిన దున్న ఇద్దాసులకు చరిత్రలో న్యాయమైన స్థానము దక్కలేదు. వీరే కాదు ఇంకా వేపూరి హనుమద్దాసు, గుజ్జరి యెల్లాదాసు, ఏలె ఎల్లయ్య, కైరం భూమాదాసు, మఠం మహంతయ్య, ఆయన భార్య మఠం మహంతమ్మ, గడ్డం రామదాసు, గవండ్ల రాజలింగకవి, కంసాలి సుబ్బకవి లాంటి అనేకమంది కవులకు తెలుగు సాహిత్య చరిత్రలో అనామకులుగా మిగిలారు. గోలకొండ కవుల సంచికలో ప్రతి కవీ ఏ కులానికి చెందిన వాడో విడిగా వివరంగా పేర్కొన్నారు. వారి గురించి లోతైన పరిశోధనలు జరిపినట్లయితే ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.
తెలంగాణ బహుజనుల్లో చైతన్యం తీసుకురావడానికి తమ జీవిత కాలం కృషి చేసిన ఎందరో మహానుభావుల గురించి తెలుసుకోవాల్సిన తరుణమిది. కల్లు డిపోల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ మొదలు, గౌడ విద్యార్థులు చదువుకునేందుకు 1925 ఆ ప్రాంతంలోనే లక్షల రూపాయలు వెచ్చించిన చైతన్య స్ఫూర్తి చిరాగు వీరన్న గౌడ్‌, ఆంధ్రమహాసభ మూడ్రోజుల పాటు నిజామాబాద్‌లో 1937లో సమావేశాలు నిర్వహించింది. ఇందులో దాదాపు వెయ్యిమంది వివిధ ప్రాంతాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఆంధ్రమహాసభ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే గాకుండా వచ్చిన వారందరికి ఆ మూడ్రోజులు ఎలాంటి లోటు రాకుండా భోజన వసతి కల్పించిన వారు నర్సాగౌడ్‌,  దేశంలోనే మొట్టమొదటి సారిగా డిచ్‌పల్లిలో కుష్టువ్యాధి చికిత్సా కేంద్రం ఏర్పాటుకు కారణం కూడా ఈయనే. నర్సాగౌడ్‌ వందేళ్లకు పూర్వమే 100ల ఎకరాల స్థలాన్ని అందుకోసం ఉచితంగా ఇచ్చిన వితరణశీలి. ఆంధ్రప్రాంతం నుంచి ఏ పండితుడు వచ్చినా తన ఇంట్లో అతిథి మర్యాదలు చేసిన దర్జీ నాంపల్లి గౌరీశంకరవర్మ. భారతదేశానికి ‘సింగర్‌’ కుట్టు మిషన్‌ని పరిచయం చేయడమే గాకుండా, తాను బాగా డబ్బు సంపాదించడమే గాకుండా, ధనాన్నంతా సాహిత్య, సాంస్కృతిక రంగానికి వెచ్చించాడు.

శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి ఎంతో సేవచేసిండు. హైదరాబాద్‌ నగరంలో వందేండ్లకు పూర్వమే పాఠశాలను స్థాపించి బహుజనుల కోసం కృషి చేసిన యదటి సత్యనారాయణ సాగర్‌, ఆవుశెట్టి మంగయ్య, యాదటి పుల్లయ్యలుకూడా సగర వంశస్థుల అభివృద్ధికి పాల్పడ్డారు. పిక్టోరియల్‌ హైదరాబాద్‌ రెండు సంపుటాలుగా వెలువరించి హైదరాబాద్‌ ఘనతను ప్రపంచానికి చాటిన మాజీ హైదరాబాద్‌ మేయర్‌ కృష్ణస్వామి ముదిరాజ్‌, ఇదే కులానికి చెందిన కేశవులు, బి.వెంకట్రావ్‌, బి.వెంకటస్వామి, బి. రంగయ్య, చింతల వెంకటనర్సయ్య, నవాడ ముత్తయ్య, కేవల్‌కిషన్‌ తదితరుల గురించి అందరికీ తెలియాలి. శ్యామరాజు, కామరాజు లాంటి భట్రాజు సోదరుల ప్రతిభ అందరికీ తెలియదు. 1920 నాటికే యాదవ సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగెం సీతారామయ్య యాదవ్‌, ఆంధ్రమహాసభలు ఎక్కడ జరిగినా ఆర్థికంగా ఆదుకున్న వారిలో ముందువరుసలో నిలిచేది పద్మశాలి వితరణశీలురు హకీం నారాయణదాస్‌, హకీం జనార్ధన్‌ దాస్‌. వీరిద్దరూ నిజాంకు రాజవైద్యులుగా పనిచేశారు. అలాగే గుంటుక నరసయ్య పంతులు, మాటేటి పాపయ్య ఆయన తనయుడు సికింద్రాబాద్‌ తొలి కమీషనర్‌ మాటేటి రామప్పలు కూడా తెలంగాణలో ప్రజా చైతన్యానికి దారులు వేసిండ్రు. నిజాం రాష్ట్రాంధ్ర ‘మున్నూరు కాపు మహాసభ’ను స్థాపించిన బొజ్జం నర్సింలు, సింగంశెట్టి బాబయ్య, శ్రీపతి రంగయ్య, గిరి పెంటయ్య తదితరులు సంఘాల్ని పెట్టడమే గాకుండా హాస్టల్స్‌ స్థాపించారు. పేద విద్యార్థుల కోసం పాఠశాలలు ఏర్పాటు చేసిండ్రు. గ్రంథాలయాల్ని కూడా స్థాపించిండ్రు.

1932లోనే విశ్వబ్రాహ్మణ మహాసభ నిర్వహించిన చింతపల్లి రాఘవాచార్యులు, కొల్లాపురం లక్ష్మినరసింహాచారి, ముమ్మడి లక్ష్మణాచారిల గురించి కనీస సమాచారం కూడా  అందుబాటులో లేదు. సమాజంలో అణచివేతకు గురైన ఆడబాపల గురించి పట్టించుకోవడమే గాకుండా సంఘసంస్కరణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహామనీషి సిద్దాబత్తుని శ్యామ్‌సుందర్‌. సికింద్రాబాద్‌లో పాఠశాలలు స్థాపించడమే గాకుండా, కళావంతుల సభలు పేరిట ఆడబాపల ఆత్మగౌరవం కోసం ఉద్యమం చేసిన ఉదాత్తుడు. దక్కన్‌ మానవసేవా సమితిని ఏర్పాటు చేసి జంతుబలికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టాడు. గ్రంథాలయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో ‘నాయి సభ’ను ఏర్పాటు చేసి తమ వర్గం వారి అభ్యున్నతికి ఆంధ్రమహాసభల్లో సైతం పాల్గొని గొంతుని వినిపించిన ‘జనపాల రఘురాం’ ఇంకా అనేకమంది బహుజనుల అభ్యున్నతికి అలనాటి తెలంగాణలో పోరాటాలు చేసిండ్రు.
తెలంగాణలో దళితోద్యమానికి పునాదులు వేసిన భాగ్యరెడ్డి వర్మతో పాటుగా హైదరాబాద్‌ అంబేద్కర్‌గా పేరు పొందిన బి.ఎస్‌. వెంకటరావు, గోలకొండ కవుల సంచికలో కవిత్వాన్ని వెలయించిన అరిగె రామస్వామి,  (ఈయన బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో పనిచేశారు), 1957లోనే అంబేద్కర్‌ విగ్రహాల ఏర్పాటుని ఉద్యమంగా చేపట్టిన శ్యామ్‌సుందర్‌, సుతారి బాబయ్య, సుబేదార్‌ సాయన్న, గుంటిమల్ల రామప్ప, బందెల చిత్తారయ్య, జె.ఎస్‌. ముత్తయ్య తదితరులు దళిత చైతన్యానికి ప్రతీకలు. వీరికన్నా ముందు వల్తాటి శేషయ్య, ఎం.ఎల్‌ ఆదయ్య, రాజారామ్‌ భోలే తదితరులు హైదరాబాద్‌లో పేద, దళిత విద్యార్థుల కోసం పాఠశాలల్ని ఏర్పాటు చేసిండ్రు. సభలు, సమావేశాలు, గ్రంథాలయోద్యమం, రాత్రి పాఠశాలల ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిండ్రు. 1952లో హైదరాబాద్‌ శాసనసభకు ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికల్లో  పోటీ చేసిన దళిత నాయకులందరికీ ఫైనాన్స్‌ చేసిన వితరణశీలి ముదిగొండ లక్ష్మయ్య. ఈయన కంపెనీలో తయారైన 555 బ్రాండ్‌ పాదరక్షల్ని దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడు పోయేవి. టి.వి. నారాయణ, టి.ఎన్‌.సదాలక్ష్మి, సుమిత్రాదేవి, ఈశ్వరీభాయి తదితరులు తర్వాతి కాలంలో దళితోద్యమానికి బాసటగా నిలిచారు. ఉర్దూలో మొదటి సారిగా రచనలు చేసిన నాట్యగత్తె, విదుషీమణి మహలఖాభాయి చాందా గురించి అమెరికా వారు పరిశోధన కోసం డబ్బులు వెచ్చించిండ్రు. ఎఫ్లూలో ఆమె తవ్వించిన బాయిని కాపాడ్డానికి ఆర్థిక సహాయం అందజేసిండ్రు. ఈమె ఉర్దూలో రాసిన కవిత్వాన్ని వెలుగులోకి తీసుకురావడమే గాకుండా ఆమె విశేషమైన నాట్య ప్రతిభను, నేటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడ్డ ఆమె జాగీరు గురించీ, మౌలాలిలోని ఆమె సమాధి గురించీ అందరికీ తెలియజెప్పాలి.
వహబీ ఉద్యమాన్ని దక్షిణాదికి తీసుకొచ్చిన మౌల్వీ విలాయత్‌ అలీ సలీం, దీనికి అండగా నిలిచిన స్వయాన నిజాం రాజు నాసిరుద్దౌలా తమ్ముడు ముబారిజ్‌ద్దౌలా, ముస్లిం మహిళల కోసం ( ఆమాట కొస్తే మొత్తం స్త్రీల కోసం) దేశంలోనే మొట్టమొదటి పాఠశాల స్థాపించిన షమ్సుల్‌ ఉమ్రా, బ్రిటీష్‌ వారికి తొత్తుగా వ్యవహరిస్తున్నాడని సాలార్జంగ్‌పై హత్యా ప్రయత్నం చేసిన సైనికుడు జహంగీర్‌ఖాన్‌, హైదరాబాద్‌ జర్నలిజానికి పితామహుడి లాంటి వారు మౌల్వీ మొహిబ్‌ హుసేన్‌, నిర్బంధ విద్యను, స్కాలర్‌షిప్‌లను ప్రతిపాదించిన సంస్కర్త ముల్లా అబ్దుల్‌ ఖయూం, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన అబిద్‌ హుసేని, సఫ్రాని, ముల్కీ ఉద్యమాన్ని 1919లోనే చేపట్టిన మౌల్వీ అబుల్‌ హసన్‌, సయ్యద్‌ అలీ, సయ్యద్‌ అబిద్‌ హుసేన్‌ తదితర ముస్లిం చైతన్య మూర్తుల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి చాలా ఉంది. ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొంటూనే ప్రజల కోసం పాటు పడ్డ వారి స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకం కావాలి. పఠాన్‌ యోధుడు తుర్రెబాజ్‌ఖాన్‌ గురించీ, ఆయనకు తోడ్పడ్డ మౌల్వీ అల్లాఉద్దీన్‌ గురించీ, బందగీ, షోయెబుల్లాఖాన్‌, మగ్దూం మొహియుద్దీన్‌లతో పాటు వందలాదిగా ఉన్న స్థానిక ఉర్దూ సాహిత్యకారుల ప్రతిభనూ అందరికీ తెలియజేయాలి.
కళా రంగాల్లో ఆర్టిస్టులు కాపు రాజయ్య మొదలు కంభాలపల్లి శేఖర్‌ వరకూ, చిందు ఎల్లమ్మ, ఒగ్గు కళాకారులు మిద్దెరాములు, కవి గాయకులు సుద్దాల హనుమంతు, రాజారామ్‌, బండి యాదగిరి, పెయింటర్‌, కవి, రచయిత మడిపడగ బలరామాచార్య, సాహితీవ్తే సామల సదాశివ, జానపద సాహిత్యానికి గౌరవం, గుర్తింపు కలిగించిన జాతీయ ప్రొఫెసర్‌ బిరుదురాజు రామరాజు తదితరులు తెలంగాణకు చేసిన కృషి చిరస్మరణీయమైనది. రాజకీయ రంగంలో 1952లో రాజకీయ దిగ్గజం మాడపాటి హనుమంతరావుని ఓడిరచిన పెండెం వాసుదేవ్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, బొమ్మగాని ధర్మభిక్షం, రావి నారాయణరెడ్డితో పాటుగా దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఆనాటి నల్లగొండ పార్లమెంటు సభ్యుడు సుంకం అచ్చాలు, ఎం.ఆర్‌.కృష్ణ, ఎమ్మెల్యేగా ఎన్నికైన బుట్టి రాజారాం, భాగ్యరెడ్డి వర్మ తనయుడు హైదరాబాద్‌ అసెంబ్లీ సభ్యుడు ఎం.బి. గౌతమ్‌లు తెలంగాణ సాయుధ పోరాటంలో తమ సత్తా చాటిన నల్లా నర్సింలు, ఉప్పల మల్సూర్‌, చీమ గురువయ్య, బిజ్జ వెంకన్న, అనుముల లింగయ్య, మధిర తిరపన్న, వడిశాల పిచ్చయ్య, ఆవుల పిచ్చయ్య తదితరులందరూ తెలంగాణ వికాసోద్యమానికి దారులు వేసిండ్రు. వీరితో పాటుగా దళితోద్యమ చరిత్రను రాయడమే గాకుండా స్వయంగా ఉద్యమాల్లో పాల్గొన్న పి.ఆర్‌. వెంకటస్వామి, రజాకార్ల చేతిలో హతుడైన బత్తిని మొగిలయ్య, వైద్య రంగంలో హైదరాబాద్‌ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన డాక్టర్‌ మల్లన్న, డాక్టర్‌ ముత్యాల గోవిందరాజులు నాయుడు, న్యాయ రంగ నిపుణుడు జస్టిస్‌ కొమ్రన్న, స్వాతంత్య్ర సమరయోదులు కోత్మీర్‌ ప్రేమ్‌రాజ్‌ యాదవ్‌, కాటం లక్ష్మినారాయణ ఇంకా కొన్ని వేల మంది గురించి విపులంగా చర్చించుకోవాలి. చరిత్రకెక్కించాలి.
గోండ్వానా రాష్ట్రపు అంకమ రాజులు మొదలు రాంజీ గోండు వరకూ చరిత్రలో స్థానంలేదు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న బహుజన, ఆదివాసీ, గిరిజన వీరుల సాహస చర్యల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీనికి పాక్షిక మినహాయింపు ‘మనకు తెలియని మన చరిత్ర’. బహుజనులు కాపాడిన కళలు పెంబర్తి ఇత్తడి పనులు, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట చీరలు, ఆదిలాబాదు రంజన్లు, నిర్మల్‌ బొమ్మలు, చేర్యాల నకాషీ పెయింటింగ్‌లు, జోగిపేట గొంగళ్లు ఇలా తెలంగాణలోని ప్రతి ఊరికీ చరిత్ర ఉంది. అది చారిత్రక కట్టడాలు కావొచ్చు, ఆలయాలు కావొచ్చు, వీరగల్లులు కావొచ్చు. ఈ చరిత్రను వెలుగులోకి తేవాలి.
తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించింది సబ్బండ వర్గాల వారు. సకల జనులు. జయశంకర్‌ సార్‌ మార్గదర్శనం, కొండాలక్ష్మణ్‌ బాపూజీ పోరాట స్ఫూర్తి, శ్రీకాంతాచారి, యాదయ్యల ఆత్మ బలిదానం ఇవన్నీ చరిత్రలో రికార్డు చేయాల్సిన సందర్భమిది. గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని రూపొందించిన ఎక్కాయాదగిరి, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసిన అందెశ్రీ, తెలంగాణ లోగోని తీర్చి దిద్దిన ఏలె లక్ష్మణ్‌లు బహుజన ఆలోచనల నుంచి వచ్చిన వారే!
ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్ర చాలా ఉంది. ఇవ్వాళ మళ్ళీ ఆదివాసీలను ఆగం చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మరో వైపు స్వయం పాలన కోసం కొట్లాడిన తెలంగాణ బిడ్డల ఆశలకు గండి వేస్తూ హైదరబాద్‌లో గవర్నర్‌ పాలన పేరిట ‘కేంద్ర పాలిత ప్రాంతం’ తద్వారా సీమాంధ్ర కబ్జాదారుల కొనసాగించేందుకు, పెట్టుబడిదారులకు పట్టం కట్టేందుకు మోడీ సర్కార్‌ యోచిస్తోంది. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తెలంగాణపై సవతితల్లి ప్రేమ చూపిస్తూ మన ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. ఇలాంటి సందర్భంలో గతంలో కన్నా ఎక్కువ సోయితో వ్యవహరించాల్సిన అవసరముంది. ఇన్నాళ్ళు ఇన్నేండ్లు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన తీరుని, గతకాలపు వీరుల్ని కూడా స్మరించుకోవాలి. ఈ పనిని బహుజనులు ప్రాధాన్యత క్రమంలో చేపట్టనట్లయితే ఉద్యమానికి దూరంగా ఉండి, రాళ్లేసిన వారు రాసే చరిత్రగా మారే ప్రమాదముంది. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే గాకుండా ‘మనము కూడా చరిత్రకెక్క దగిన వారమే’ అనే స్పృహతో తెలంగాణ చరిత్రను రికార్డు చేయాలి. అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌ మాదిరిగా పరిశోధనలు జరిపించి పోరాట వీరుల్ని వెలుగులోకి తీసుకు రావాలి. వెలుగులోకి తీసుకువచ్చిన వారి ప్రతిభ/చైతన్యాన్ని పదుగురికి తెలిసే విధంగా పాఠ్యాంశాలుగా చేర్చాలి. ఈ పని ఎంత ఆలస్యమైతే తెలంగాణ బహుజనులకు అంత నష్టం జరుగుతుంది. తెలంగాణ చరిత్రను బహుజన దృక్కోణంతో తిరగరాద్దాం.

    – సంగిశెట్టి శ్రీనివాస్‌

మా మాధ్యమిక పాఠశాల – ఈశ్వర పుస్తక భాండాగారం రోజులు …

chitten raju

 

 

 

 

 

కాకినాడ గాంధీ నగరానికి ఎల్విన్ పేటకీ సరిహద్దులో ఉన్న అప్పటి “ఆనంద పురం ఎలిమెంటరీ స్కూలు లో ఐదో క్లాసు పూర్తి చెయ్యగానే నన్ను రామారావుపేట లో ఉన్న మ్యునిసిపల్ మిడిల్ స్కూల్ లో చేర్పించారు మా నాన్న గారు. అప్పటికే మా సుబ్బన్నయ్య..అంటే నా పై వాడు పి.ఆర్. కాలేజియేట్ హైస్కూల్ లోనూ, మా అక్క మెక్లారిన్ హై స్కూల్ పక్కనే ఉన్న గర్ల్స్ హై స్కూల్ లోను చదువుకునే వారు. వాళ్లిద్దరూ రోజు బస్సులో స్కూల్ కి వెళ్ళే వారు. బహుశా ఆ అవస్త చూడ లేక అరగంటలో నడిచి వెళ్లి పోయే ఈ రామారావు పేట మిడిల్ స్కూల్లో నన్ను వేశారేమో నాకు తెలియదు కానీ మా ఇంట్లోంచి ఆ స్కూల్ కి  వెళ్ళిన వారిలో నేనే మొదటి వాడిని. నా తరువాత మా తమ్ముడు ఆంజీ (హనుమంత రావు), మా ముగ్గురు చెల్లెళ్ళూ (భాను, పూర్ణ, ఉష) అ స్కూల్లోనే , ఆ తరువాత గాంధీ నగరం మ్యునిసిపల్ హైస్కూల్ లోనూ చదువుకున్నారు. అంటే సుమారు ఇరవై ఏళ్ళు మా ఇంట్లోంచి ఎవరో ఒకరు ఈ రెండు పాఠశాలలలోనూ చదువుకున్నారు. నాకు తెలిసీ ఇది ఒక రికార్డే!

మా చిన్నప్పుడుఈ ఎల్కేజీ, పీకేజీ అంటూ “కేజీ” గోల, కేజీల కొద్దీ పుస్తకాల మోతా ఉండేది ఉండేది కాదు. ఐదో ఏట అక్షరాభ్యాసం అవగానే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా ప్రాధమికపాఠశాల అంటే ఎలిమెంటరీ స్కూల్, ఆ తరువాత పదో ఏట ఒకటో ఫార్మ్ లో ప్రవేశించి మూడో ఫార్మ్ దాకా మాధ్యమిక పాఠశాల అంటే మిడిల్ స్కూల్, ఆ తరువాత మూడేళ్ళు ఉన్నతపాఠశాల అంటే హై స్కూల్…నాలుగో ఫార్మ్ , ఐదో ఫార్మ్ & ఎస్.ఎస్.ఎల్.సి..అనగా సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ తో స్కూల్ చదువు పూర్తి అయేది.

1954-55 లో నేను రామారావు పేట లో శివాలయం రోడ్డు మీద ఉన్న ఈ మాధ్యమికపాఠశాల లో ఫస్ట్ ఫార్మ్ లో చేరాను. అప్పుడు ఆ స్కూల్లో మూడోఫార్మ్ దాకానే ఉండేది. నేను మూడో ఫారం లోకి వచ్చాక నాలుగో ఫార్మ్ పెట్టారు. ఒక్కొక్క ఫార్మ్ కీ “ఎ” సెక్షన్ అనీ “బీ” సెక్షన్ …విద్యార్థుల సంఖ్య ఇంకా ఎక్కువ గా ఉంటే “సీ” క్లాస్ అనీ సుమారు నలభై మంది ఉండే రెండు, మూడు సెక్షన్స్ ఉండేవి. ఎందుకో తెలియదు కానీ కాస్త తెలివైన వాళ్ళని “ఏ” క్లాస్ లో వేసే వారు. నేను ఎప్పుడూ “ఏ” క్లాస్ లోనే ఉండే వాడిని. అంచేత తెలివైన వాడిని అనే అనుకోవాలి. అదేం విచిత్రమో అందులో కూడా నేను మొదటి వాడిగానే ఉండే వాడిని. ఎందుకంటే ఎప్పుడు ఏ పరీక్ష పెట్టినా అందరి కంటే ఎక్కువ మార్కులు నాకే వచ్చేవి. అలా అని నేను ఎప్పుడూ “రుబ్బుడు” గాడిని..అంటే పుస్తకాల పురుగుని కాదు. ఎప్పుడూ గట్టిగా కష్టపడి చదివిన జ్జాపకం లేదు కానీ మేష్టారు చెప్పిన పాఠం శ్రద్ధగా వినడం, జ్జాపకం పెట్టుకోవడం మటుకు బాగా జ్జాపకం. ఇప్పటికీ నాకు ఎవరైనా”ప్రెవేటు” చెప్తుంటే వినడం ఇష్టం. ఎవరైనా దొరికితే “ప్రెవేటు” చెప్పడం అంతకన్నా ఇష్టం.

నా మూడవ ఫార్మ్ లో

అప్పుడు మా స్కూల్లో రెండు సిమెంటు బిల్డింగులు, వెనకాల ఒక పెద్ద పాక ఉండేవి. ఆ పాకలో ఒకటో ఫార్మ్, రెండో ఫార్మ్ తరగతులు, ఒక సిమెంట్ బిల్డింగులో మూడో ఫార్మ్, ఆ తరువాత నాలుగో ఫార్మ్ క్లాస్ రూములు ఉండేవి. రెండో సిమెంట్ బిల్డింగులో ప్రధానోపాధ్యుడి గారి ఆఫీసు, సైన్స్ లాబ్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ గది ఉండేవి. అప్పుడూ, ఆ తరువాత హైస్కూల్ కి వెళ్ళాకా కూడా ఆరేళ్ళ పాటూ మా హెడ్మాస్టర్ గారు ఒక్కరే.

ఆయన పేరు వి.ఎస్.ఆర్.కే.వి.వి.వి.యస్. సత్యనారాయణ గారు. ఆయన ఏదో మాట వరసకి ఇంగ్లీష్ లిటరేచర్ చెప్పేవారు కానీ హెడ్మాస్టారు పనులే ఎక్కువగా చేసే వారు. మాధ్యమిక తరగతులలో “పాక’లో పాఠాలు చెప్పిన వారిలో బాగా జ్జాపకం ఉన్న వారు తాతబ్బాయి గారు, జి. సత్యనారాయణ గారు. ఇందులో తాతబ్బాయి గారు చాలా తమాషాగా, కారు నలుపు మనిషి అయినా ఆయన తెల్లటి పంచె, లాల్చీలతో, కుర్చీలో కాళ్ళు రెండూ మడత పెట్టుకుని కూచుని ఒక దాని తరువాత ఒకటి గా నాలుగైదు సబ్జెక్టులు చెప్పే వారు. పొద్దుట ఎనిమిది గంటల నుంచి పన్నెండు దాకా నాలుగు పీరియడ్స్ అవగానే మేము గబా, గబా మధ్యాహ్నం భోజనానికి ఇంటికి పరిగెట్టే వాళ్ళం.

హడావుడిగా తిండి తినేసి మళ్ళీ ఒంటి గంట కల్లా క్లాసుకి చేరగానే ఆయన అప్పటికే సుష్టుగా భోజనం చేసి కుర్చీలో కునుకు తీస్తూ ఉండే వారు. అంచేత మధ్యాహ్నం క్లాసులన్నీ మందకొడి గానే జరిగేవి. ఆయన మాట్లాడేది తక్కువ. నాచేత, మిగిలిన తెలివైన కుర్రాళ్ళ చేత చదివించేసి, లెక్కలు చేయించేసి, తన కునుకు కంటిన్యూ చేసే పద్ధతి ఎక్కువ గా ఉండేది. ఎటొచ్చీ ఆయన చేతిలో ఒక బెత్తం, పక్కనే డ్రాయర్ బయటి లాగి పెట్టి ఉంచిన ఒక బల్ల ఉండేవి. ఆ నిద్రలో కూడా మా కుర్రాళ్ళలో ఎవరైనావెర్రి వేషాలు వేసినట్టు గమనించారా…ఇక అంతే సంగతులు. బెత్తం తో కొట్టడం చిన్న శిక్ష కానీ, కుర్రాళ్ళ చేతి వేళ్ళని కొసన లో పెట్టి ఠకీమని ఆ డ్రాయర్ మూసేస్తే ఆ బాధ నరక యాతనే! అందరమూ నెల మీదే కూచునే వాళ్ళం కాబట్టు బెంచీ ఎక్కే సదుపాయమూ, గోడ కుర్చీ వేసే ఏర్పాట్లూ ఉండేవి కాదు.

 

నా విషయానికి వస్తే ఆ క్లాసుకి నేనే మానిటర్ ని. అందుచేత ఎవడైనా అల్లరి చేస్తే ఆ వివరాలు తాతబ్బాయి గారికి మెలకువ రాగానే చెప్పవలసిన బాధ్యత నాదే. ఆ అల్లరి తీవ్రతని బట్టి ఆయన బెత్తమా, చేతివేళ్ళు చితికిపోవడమా అని నిర్ణయించే వారు. నేను “రాము మంచి బాలుడు” కాబట్టి ఆ రెండిటికీ ఎప్పుడూ నోచుకోక పోయినా, క్లాస్ మానిటర్ గా నా రిపోర్టింగ్ సరిగ్గా లేదు అని ఎవరైనా రిపోర్ట్ చేస్తే ఆ శిక్షలు నాకు పడే అవకాశం ఉండేది.

దేవుడి దయ వలన ఆ అవకాశాన్ని నేను ఎప్పుడూ ఉపయోగించుకో లేదు. ఇక సత్యనారాయణ గారు చరిత్ర పాఠాలు ఎంతో ఆసక్తికరంగా చెప్పే వారు. ఇప్పుడూ టక్ చేసుకుని దర్జాగా ఉండే వారు. ఒకటో ఫార్మ్ నుంచి మూడో ఫార్మ్ దాకా మాకు తెలుగు పాఠాలు ఎవరు నేర్పారో నాకు ఇప్పుడు ఖచ్చితంగా గుర్తు లేకపోవడం చాలా సిగ్గుగా ఉంది. బహుశా వేదుల సత్యనారాయణ గారే అయిఉండాలి. తెలుగులో నాకు ఇప్పటికీ పాండిత్యం అబ్బ లేదు కానీ మార్కులు బాగానే వచ్చేవి.

ఇక అన్ని క్లాసులూ బాహాటంగా ఉంటే ఆర్ట్స్ & క్రాఫ్ట్స్ క్లాసు మరొక ఎత్తు. దానికి చుట్టూ స్టీలు తడికలతో ఎవరూ దొంగతనం చెయ్యకుండా తాళం వేసే వీలు ఉండేది. ఆ క్లాస్ రూము లో డ్రాయింగ్ సామానులు ..అంటే కుంచెలూ, రంగు డబ్బాలూ, కుట్టు యంత్రాలు, బొమ్మలు చేసే రబ్బరు మొదలైనవి ఉండేవి. అన్నింటి కన్నా ముఖ్యంగా గాంధీ గారి రాట్నాలతో దూది నుంచి దారం వడికి, దాంతో మా చెడ్డీలు మేమే కుట్టుకోవడం నేర్పించే వారు. ఆ విద్య నాకు అబ్బ లేదు. ఎప్పుడు దారం తీసినా అది చిక్కు పడిపోయి నా మొహం లా ఉండేది. చెడ్డీ కాదు సరికదా, జేబు రుమాలు కూడా కుట్టుకోడానికి పనికొచ్చేది కాదు   అన్ని క్లాసులకీ కలిపి ఇవన్నీ నేర్పే ఒకే ఒక్క బక్క చిక్కిన మేష్టారు ఉండే వారు. ఆయన పేరు గుర్తు లేదు కానీ అందరూ ఆయన్ని “తకిలీ” మేష్టారు అనే పిలిచే వారు.

నేను మూడో ఫార్మ్ దాకా నేల మీదే కూచుని చదువుకున్నాను. క్లాస్ మేట్స్ పేర్లు గుర్తు లేవు కానీ లక్ష్మీ నారాయణ అని ఒక కుర్ర్రాడు, అతని చెల్లెలూ కూడా మా సెక్షన్ లోనే ఉండే వారు. విశేషం ఏమిటంటే అతనికి ఎప్పుడూ నా కంటే నాలుగైదు మార్కులు తక్కువే వచ్చేవి. ఎలాగైనా నన్ను మించిపోవాలని, మా ఇంటికి కంబైండ్ స్టడీస్ కి వచ్చే వాడు. కానీ మనం అసలు అంతగా చదివితేగా?

ఇది కాక మా స్కూల్ లో ఎ.సి.సి అనే విభాగం ఉండేది. అంటే అసోసియేటేడ్ కెడేట్ కోర్ అనమాట. ఇది హైస్కూల్ లో ఉండే ఎన్.సి.సి (నేషనల్ కేడేట్ కోర్) కి అనుబంధ సంస్థ. అందులో నేను కొంచెం హుషారుగా పాల్గొనే వాడిని. అది నిర్బంధమో కాదో నాకు గుర్తు లేదు కానీ నమ్మండి, నమ్మక పొండి, నాకు అలా ఆర్మీ వాళ్ళ లాగా, పెద్ద పోలీసు వాళ్ళ లాగా యునిఫారం వేసుకుని తిరగడం సరదాగా ఉండేది. ఎందుకంటే ఆ రోజుల్లో కాకినాడలో ఉన్న ఒకే ఒక్క కాన్వెంట్ స్కూల్లో తప్ప స్కూల్ యునిఫార్మ్స్ ఉండేవి కాదు. ఎవరికీ తోచిన చొక్క్కాలు, చెడ్డీలూ వాళ్ళు వేసేసుకోవడమే! మేము వేసుకునే బట్టలని బట్టి మా సోషల్ స్టేటస్ ..అప్పుడప్పుడు కులం తో సహా తెలిసిపోయేది.

సరిగ్గా అదే కారణానికి నేను కొన్నాళ్ళు ఆర్. ఎస్.ఎస్. లోకూడా చేరాను. ఎ.సి.సి. లో తుపాకీ పట్టుకోవడం నేర్పిస్తే వీళ్ళు కుస్తీలు, పెద్ద తాళ్ళతో పీట ముడి వెయ్యడాలు మొదలైన డిఫెన్స్ విద్యలు నేర్పే వారు. నాకు ఆ రెండూ రాలేదు. మా రోజుల్లోనే రైట్ టర్న్, మార్చ్ లాంటి ఇంగ్లీషు పదాలు పోయి బాయే ముడ్, పీచ్చే ముడ్, ఆగే బడ్ లాంటి హిందీ మాటలు వచ్చి వాటి మీద మా క్లాసు రౌడీలు చెప్పకూడని జోకులు వేసుకునే వారు. నేను బ్రాహ్మల అబ్బాయిని కాబట్టి నన్ను చూడగానే ఠపీమని నోరు నొక్కేసుకునే వారు . బహుశా ఈ రోజుల్లో దానికి ఆపోజిట్ ఏమో !

నేను మిడిల్ స్కూల్ లో ఉండగా ఉన్న ఒకే ఒక్క ఫోటో ఆ ఎ.సి.సి యూనిఫారం లో ఉన్నదే. అది ఇక్కడ జత పరుస్తున్నాను. రూపు రేఖలు మారిపోయిన ఆ స్కూల్ ముందు గుమ్మం ఫోటో కూడా ఒకటి జతపరుస్తున్నాను.

Ramarao peta school 1 ఓకే

మా మిడిల్ స్కూల్ ప్రాంగణం లోనే “ఈశ్వర పుస్తక భాండాగారం” అనే చిన్న అతి విశిష్టమైన బిల్డింగ్ ఉంది. నిజానికి దాని పవిత్రత, చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా దాన్ని “భవనం” అనాలి.  “శ్రీ వేణు గోపాల సంస్కృత ప్రచార సభ” అనే ఆ బిల్డింగ్ 1903 లో కట్టారు. రోజూ సాయంత్రం  అయ్యేటప్పటికల్లా అన్ని పేపర్లూ, పుస్తకాలూ చదవడానికి వచ్చే జనం తో ఆ హాలు నిండి పోయేది.

అక్కడ మా తాత గారి పుస్తకాలతో పాటు కొన్ని వందల అపురూపమైన తెలుగు పుస్తకాలు, తాళపత్ర గ్రంధాలు ఇంకా అందుబాటులో ఉన్నాయి. కానీ చదివే వాళ్ళే కరువై పోయారు. ఆ బిల్డింగ్ వెనకాల ..అంటే మా స్కూల్ గ్రౌండ్స్ వేపు ఒక చిన్న వేదిక ఉండేది. ఇంచుమించు ప్రతీ రోజూ ఆ వేదిక మీద ఏదో ఒక హరి కథో, బుర్ర కథ, పురాణ కాలక్షేపం, సాహిత్య ప్రసంగం మొదలైనవి జరుగుతూ ఉండేవి. పండగల రోజుల్లో రికార్డింగ్ డాన్సులు కేవలం రోడ్ల మధ్యలో వేసిన పందిళ్ళలో జరిగేవి.

నా రోజు వారీ రొటీన్ ఏమిటంటే సాయంత్రం స్కూల్ బెల్లు కొట్టగానే ఇంటికి పరిగెట్టి, క్రికెట్ బేటు, వికెట్లూ వగైరాలు పట్టుకుని పి. ఆర్. కాలేజీ గ్రౌండ్స్ కి వెళ్లి ఆడుకోవడం. ఆట అయి కొంచెం చీకటి పడే సమయానికి “సత్తెయ్య” గాడు అర నిముషం ఆలస్యం చెయ్యకుండా ఠంచనుగా పట్టుకొచ్చే వేరు శనక్కాయలు, ఐస్ క్రీం కడ్డీలు, ఒకటో, రెండో తినెయ్యడం. అక్కడ నుంచి ఈశ్వర పుస్తక భాండాగారం దగ్గర మా స్కూల్ ఇసక గ్రౌండ్స్ లో కూచుని ఈశ్వర పుస్తక భాండాగారం వారు ఏర్పాటు చేసిన పురాణ కాలక్షేపం తన్మయత్వంలో విని, తరించి, అది అయిపోగానే ఆ రోడ్డు మీదే ఉన్న శివాలయానికి వెళ్లి దణ్ణం పెట్టుకుని ఆచారి గారు పెట్టిన సాతాళించిన శనగలు ప్రసాదం తినేసి “ఆటలు, పాటలు, నాటికలూ” చాలించేసి ఇంటికెళ్ళి పోవడం.

మా రోజుల్లో “హోమ్ వర్క్” ఇచ్చేసి ఉపాధ్యాయులు చేతులు దులుపేసుకునే వారు కాదు. వాళ్ళు ఏం చెప్పినా క్లాసులోనే క్షుణ్ణంగా చెప్పే వారు. మేము ఏం నేర్చుకున్నా క్లాస్ లోనే నేర్చుకునే వాళ్ళం. టీవీలు లేవు. రేడియోల పాత్ర పరిమితమైనదే.   అందుకే ఆట, పాటలకీ, పై పుస్తకాలు చదువుకోడానికీ సమయం ఉండేది. పిల్లలం పిల్లలుగానే జీవించే వాళ్ళం. అది మా తరం చేసుకున్న అదృష్టం.

ఇక గతం నాస్తి అనుకుని ఎంతో విచారంగానే ప్రస్తుతానికి వస్తే, నేను ఇటీవల (ఫిబ్రవరి 2014) కాకినాడ వెళ్ళినప్పుడు రూపు రేఖలు మారిపోయిన మా స్కూలు, ఈ గ్రంధాలయాల లో కొన్ని గంటలు గడిపి, పెద్ద పోజు పెట్టి మా మాధ్యమిక పాఠశాల దగ్గరా ఈశ్వర పుస్తక భాండాగారం లోనూ ఫోటోలు తీయించుకున్నాను కానీ నా కంప్యూటర్ కి ఏదో వైరస్ మాయ రోగం ఆవహించి నేను తాళ పత్రాలు తిరగేస్తున్న ఒక్క ఫోటో తప్ప మిగిలిన ఫోటోలు అన్నీ గాలిలో కలిసిపోయాయి. అది ఇక్కడ జతపరుస్తున్నాను.

Eswara Pustaka Bhandagaram 2 ఓకే

ఇప్పటి దౌర్భాగ్యం చూడాలంటే అలనాడు మాకు సాంస్కృతిక భిక్ష పెట్టిన మా ఈశ్వర పుస్తక భాండాగారం ఈ నాడు ఎలా ఉందో ఇందుతో జత పరిచిన ఒక ఫోటో చూస్తే తెలుస్తుంది. ఆలనా, పాలనా లేక పోయినా, కార్పొరేషన్ వారు గాలికొదిలేసి, వారి రాజకీయాల గాలి మేడలు కట్టుకుంటున్నా, స్థానిక విద్యావేత్త, సాంస్కృతిక ప్రముఖురాలు అయిన డా. చిరంజీవినీ కుమారి గారి నాయకత్వంలో కొందరు ఆ గ్రంధాలయాన్ని ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. కృష్ణ కుమార్ అనే నాట్యాచార్యులు గారు ఆ హాలు లోనే కూచిపూడి నృత్యం నేర్పిస్తూనే ఉన్నారు.

ఈ ఫోటో చూడగానే విధి ఎంత విపరీతమైనదో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నూట పది సంవత్సరాల క్రితం ఈ స్థలం సమాజానికి విరాళంగా ఇచ్చి అక్కడ గ్రంధాలయం, సాంస్కృతిక వేదిక కట్టిన వారు ఈ నాటి కమ్యూనిస్ట్ రాజకీయ ప్రముఖులైన యేచూరి సీతారాం గారి పై తరం వారు. ఈ నాడు అదే కమ్యూనిస్ట్ పార్టీ వారు ఈ బిల్డింగ్ గోడల మీద రంగుల బొగ్గుతో తమ రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారు.

తాళపత్రాలు చూస్తున్న నాతో చిరంజీవినీ కుమారి గారు

తాళపత్రాలు చూస్తున్న నాతో చిరంజీవినీ కుమారి గారు

 

 

నేను తీసుకున్న ఫోటోలు హుష్ కాకీ అయిపోయాయి కాబట్టి ఈ వ్యాసం కోసం అడిగిన వెంటనే ఈ ఫోటోలు తీసి పంపించిన రామారావు పేట నివాసి, ఆత్మీయ మిత్రుడు అయిన యనమండ్ర సూర్యనారాయణ మూర్తికి పత్రికా ముఖంగా నా ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. నలుగురి సహకారంతో  ఆ గ్రంధాలయాన్ని కొంతైనా పునరుధ్ధరించే ప్రయత్నంలో ఉన్నాను. చూద్దాం ఎంత వరకూ చెయ్యగలమో?

ప్రకృతి ఒడిలో అందాల దీపం- కేనరీ ద్వీపం!

విహార యాత్రా స్పెషల్-1

 satyam mandapati

(ఇప్పుడు ప్రేమయాత్రలకి నా వయసు కుసింత ఎక్కువయినట్టుంది. అక్కడ ప్రత్యేకమైన విశేషాలు ఏమైనా వుంటే తప్ప తీర్ధయాత్రలకి మనసెప్పుడూ లేదు. అయినా ఎన్నో విహార యాత్రలు, మరెన్నో వినోద యాత్రలు, ఆఫీసు పని మీద చాల వ్యాపార యాత్రలు చేశాను. కొన్ని ఒంటరిగా ఏకో నారాయణా అనుకుంటూ, కొన్ని అర్దాంగితో కలిసి లాహిరి లాహిరిపాడుకుంటూ, కొన్ని కుటుంబ సభ్యుల సపరివార సమేతంగా, కొన్ని మిత్రులతో సరదాగా, కొన్ని ‘కొలీగుల’తో దేశవిదేశాలు(కాంపులకి వెళ్లారు అనేవాళ్ళు ఇండియాలో). మధ్యే మధ్యే రోమ్, అమృత్సర్, జెరూసేలంలాటి తీర్ధ/చారిత్రాత్మక యాత్రాలూ వున్నాయండోయ్!

లాగులు తొడుక్కునే ప్రతివాడూ ట్రావెలాగులు వ్రాస్తూనే వున్నాడు మళ్ళీ నేనెందుకు వ్రాయటం అనుకున్నాను ముందు. కానీ ‘ఎవరి లాగులూ, ట్రావెలాగులూ వాళ్ళవే కదా, మీరూ వ్రాయండి’ అన్నారు మిత్రులు. సరే అలాహే కానివ్వండి అని ‘విహార యాత్రా స్పెషల్’ అనే ఈ శీర్షిక “సారంగ” అంతర్జాల పత్రికలో వ్రాస్తున్నాను. పట్టు వదలని విక్రమార్కుడిలా నన్ను వ్రాయమని అడుగుతూ, ఆలస్యం చేసినందుకు నన్ను కుంచెం కోప్పడి, ఈ శీర్షిక వ్రాయించుకుంటున్న మిత్రులు అఫ్సర్ గారికి ధన్యవాదాలు. ప్రతి నెలా ఒక్కొక్క ప్రదేశం గురించి వ్రాద్దామనుకుంటున్నాను. వీటిలో చాల వరకూ నేను చూస్తున్న కొత్త ప్రదేశాల మీదా, కొన్ని నా పాత వ్యాసాలకు కొంచెం మెరుగుపెట్టి తిరగ వ్రాసీ, మీ ముందు వుంచుదామని నా ఈ ప్రయత్నం. మీకివి నచ్చినన్ని రోజులు, చదివి ఆనందించండి. నచ్చకపోతే వెంటనే చెప్పేయండి. ముఖమాటం లేదు. ఆపేద్దాం.

మీరు ఈ ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటుంటే, నా వ్యాసాలు వాటి గురించి మరి కొంచెం అవగాహనని పెంచుతాయని నా ఉద్దేశ్యం. ఇతర కారణాల వల్ల, ఆ ప్రదేశాలకి వెళ్ళొద్దులే అనుకుంటే ఏమీ ఫరవాలేదు, అక్కడికి వెళ్ళినంత సరదాగా ఈ వ్యాసాలు చదువుకోండి! సందర్భానుగుణంగా మీ కోసం కొన్ని ఫోటోలు కూడా జత చేస్తున్నాను మరి!)

౦                           ౦                           ౦

ఈమధ్య మేము ఐదు వారాలపాటు యూరప్ యాత్రకి వెళ్ళాము. స్పెయన్లో కేనరీ ద్వీపాలు, బార్సిలోనా; ఇటలీలో రోమ్, ఫ్లారెన్స్, పీసా, వెరోనా, వెన్నిస్; స్విట్జర్లాండులో ఎంగెల్బర్గ్, జెనీవా, లుజర్న్; ఇంగ్లాండులో లండన్ మొదలైన ప్రదేశాలు చూసివచ్చాం. వెళ్ళిన ప్రతి ప్రదేశంలోనూ ఆనాటి చరిత్రలో కానీ, ఈనాటి ఆధునిక జీవితంలో కానీ ఎంతో వైవిధ్యం వున్నదే!

మేము ముందు కానరీ ద్వీపాలకి ప్రయాణం కట్టాం. అమెరికాలోని ఆస్టిన్ నించీ లండనుకి వెళ్ళే విమానం లండన్ హీత్రో ఎయిర్ పోర్టుకి వెడుతుంది. అక్కడినించీ లండన్ గాట్విక్ ఎయిర్ పోర్టుకి వెళ్లి, టెనరిఫే ద్వీపానికి వెళ్ళే విమానం ఎక్కాం. అన్నట్టు మేము ఆస్టిన్ నించీ ఎక్కిన విమానం బోయింగ్ వారి సరికొత్త విమానం. ఎన్నాళ్ళ నించో ఎదురు చూస్తున్న 787 Dream Liner. ఈమధ్యనే నడపటం మొదలుపెట్టారు.

‘అది సరేనయ్యా.. ఎక్కడ వున్నాయి ఈ ద్వీపాలు.. ఏముంది అక్కడ.. ఏమిటి ఆ కథా.. కమామిషు..’ అని మీరు అనబోయే ముందుగా, ఇవిగో ఆ వివరాలు.

కెనేరియాస్ అనబడే ఈ కేనరీ ద్వీపాలు కెనడాలో లేవు. అవి స్పెయిన్ దేశానికి చెందినా, నిఝంగా స్పెయిన్ భూభాగంలోనూ లేవు. ఉత్తర ఆఫ్రికాకి కొంచెం ఉత్తరంగా, ఇంకొంచెం పడమటగా.. అంటే మొరాకో దేశానికి వాయువ్య మూలగా 62 మైళ్ళ దూరంలో, అట్లాంటిక్ మహా సముద్రంలో వున్నాయి.

ఇక్కడ ఏడు పెద్ద ద్వీపాలు, ఎన్నో చిన్న చిన్న ద్వీపాలు, ఇక్కడ వున్న అగ్ని పర్వతాలలోనించీ వచ్చిన లావా ప్రవహించటం వల్ల ఏర్పడ్డాయి. వీటిలో అన్నిటికన్నా పెద్ద ద్వీపం మేము వెళ్ళిన టెనరిఫే. దాని తర్వాత ఇంకా చిన్న ద్వీపాలలో చెప్పుకోదగ్గవి, ఫూర్తే వెంత్యురా, గ్రాన్ కెనేరియా, లా పాల్మ, లా గొమేర మొదలైనవి.

అసలు కేనరీ ద్వీపాలు అంటే అర్ధం, లాటిన్ భాషలో కుక్కలు వున్న ద్వీపాలు అని. ఆ రోజుల్లో అక్కడ ఎన్నో పెద్ద పెద్ద కుక్కలు వుండేవిట. అవి నిజంగా కుక్కల సంతతి కాదు, అవి సీల్ జాతికి చెందిన నీటి కుక్కలు అనీ, తర్వాత పరిణామ జీవనంలో అంతరించి పోయాయనీ ఒక కథ వుంది. మేము ఈ ప్రదేశాలన్నీ చూడక ముందే, వీటి గురించి కొంత చరిత్ర చదివాను. మహాకవి శ్రీశ్రీగారు అన్నట్టు, ‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం.. నరజాతి చరిత్ర సమస్తం, పరపీడన పరాయణత్వం.. నరజాతి చరిత్ర సమస్తం, పరస్పరాహరణద్యోగం..”… ఇంగ్లండు, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, రష్యా… ఏ దేశ చరిత్ర చూసినా అదే!

కేనరీ ద్వీపాల చరిత్ర కూడా అంతే! ఈ ద్వీపాలని ఎన్నో దేశాలు ఒకటి తర్వాత ఒకటి – రోమన్, మొరాకో, గ్రీక్, డచ్, స్పెయిన్ దేశాలతో సహా – ఆక్రమించుకున్నాయి. ప్రస్తుతం కేనరీ ద్వీపాలు స్పెయిన్ దేశం ఆధీనంలో వున్నాయి. 2900 చదరపు మైళ్ళ వైశాల్యంలో 2.1 మిలియన్ల జనాభా వుంది. వీరిలో 77 శాతం కెనేరియన్లు, 8.5 స్పెయిన్ భూభాగం నించి వచ్చినవారు, 14 శాతం విదేశీయులు, అంటే ముఖ్యంగా జర్మనీ, బ్రిటిష్, ఇటలీ, కొలంబియా, వెనిజువేలా, క్యూబా, మొరాకో మొదలైన దేశాల సంతతి. వీరిలో ఒక్క టెనరిఫే ద్వీపంలోనే 785 చదరపు మైళ్ళ వైశాల్యంలో తొమ్మిది లక్షల మంది వున్నారు.

టెనరిఫేలో రెండు ఎయిర్పోర్టులు వున్నాయి. బస్సు సౌకర్యం చాల బాగుంది. టాక్సీల అవసరం తక్కువే. కొన్ని చోట్లకి రైళ్ళు కూడా వున్నాయి.

టెనరిఫేకి రాజధాని శాంతా క్రూజ్. ఇక్కడ చెప్పుకునే ఇంకొక పెద్ద వూరు లా లగూన.

టెనరిఫేలో సముద్రం ఒడ్డునే వున్నాం మేము. మా బాల్కనీలో నించీ వంద గజాల దూరంలో సముద్రం, ఒకరోజు ప్రశాంతంగా నిద్రపోతూ, ఇంకొక రోజు గంభీరంగా గర్జిస్తూ కనిపిస్తూ వుంది. ఈ ద్వీపాలు అగ్నిపర్వతాల లావాతో ఆవిర్భవించాయి కనుక, చాల చోట్ల భూమి మీద నల్లటి రాళ్ళు, నల్లటి ఇసక కనిపిస్తుంది. బీచి ఒడ్డున, కొన్నిచోట్ల, బయట నించి ఎన్నో వేల టన్నుల తెల్లటి ఇసుక తెచ్చి పోశారు. అందుకే ఆ నలుపూ తెలుపుల ఇసుక అందం, ఆకాశంలోని నీలి రంగు, ఒడ్డున వున్న చెట్టూ చేమల ఆకుపచ్చ రంగు, సముద్రపు నీలి నీలి నీటి రంగులతో కలిసి చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా వుంటుంది.

వెయ్యి మాటల కన్నా ఒక్క చిత్రపటమే ఎక్కువ చెబుతుంది అనే నానుడి వుంది. అందుకని టెనరిఫే ద్వీపంలో ఎక్కువగా చెప్పుకునేవి ఇక్కడి అందాలే కనుక, ఈ వ్యాసంలో ఎక్కువ మాటల కన్నా ఫోటోలే మీకు సరైన అవగాహన ఇస్తాయని, అవే కొన్ని పెడుతున్నాను. చిత్తగించండి.

satyam1

 

satyam2

 

 

ఇక్కడ మేము చూసిన వాటిలో ముఖ్యమైనది, ‘టైడే’ అనే అగ్నిపర్వతం. ఇప్పటికీ అడపా దడపా బుస్సుమంటూ కాసిని నిప్పులు కక్కుతున్న పర్వతం. 18,990 హెక్టారుల భూవైశాల్యంతో 3718 మీటర్ల ఎత్తున, అంటే 12,198 అడుగుల ఎత్తున, టెనరిఫే ద్వీపం మధ్యలో వున్న చల్లటి చక్కటి పర్వతం! ఇది స్పెయిన్ పర్వత శ్రేణిలో అన్నిటికన్నా ఎత్తైన పర్వతం. రోమనులు పాలన కాలంలో అంత ఎత్తు వుండేది కాదు కానీ తర్వాత వరుసగా లావా వచ్చి, ‘టైడే’ ఎత్తు పెరిగిపోయింది. ఇప్పుడు అప్పుడప్పుడూ లావా కొంచెం కొంచెం వస్తున్నా, చివరిసారిగా పెద్ద ఎత్తున అగ్ని కురిపించినది 1798లో. అప్పుడే ఆ చుట్టుపక్కల లావా ప్రవాహం వల్ల మరి కొన్ని చిన్న ద్వీపాలు కూడా వెలిసాయి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం అక్కడ వున్న స్థానికులు ఈ పర్వతాన్ని ఒక దైవ సంబంధంగా భావించి పూజలూ కూడా చేసేవారుట!

satyam3

 

మేము వెళ్ళిన రోజున కొండ మీద కొంచెం సన్నగా మంచు పడుతున్నది. బాగా చలి, విపరీతమైన గాలి. అయినా కొంచెం వెచ్చటి దుస్తులు వేసుకుని, ఆ తెల్లటి నల్ల పర్వతం అందాలని చూస్తూ అలాగే చాలా సేపు నుంచున్నాం.

 

satyam4

ఈ పర్వత శ్రేణి మీదనే బాగా ఎత్తున ఒక అబ్జర్వేటరీ కూడా వుంది. అక్కడ ఎంతో నక్షత్ర శాస్త్ర పరిశోధన జరుగుతున్నది.

 

satyam6

ఇక్కడ చూడవలసిన ఇంకొక ప్రదేశం ‘మస్కా’ లోయ. కొండ మీద నించీ ఈ మస్కా లోయని చూస్తుంటే ఎంతో మనోహరంగా వుంటుంది.

ఒక పక్క నీలం రంగు సముద్రం, సముద్రపు అలలు ఒడ్డుకు తగిలి ఎగురుతూ మెరుస్తున్న తెల్లటి నురుగు, ఇంకొక పక్క ఆకుపచ్చని చెట్లతో నిండిన కొండలు, లోయలు. వాటి మధ్య ఎర్రని బంగాళా పెంకులతో కట్టిన రంగు రంగుల ఇళ్ళూ, వాటి పక్కనే నల్లటి తారు రోడ్లూ… ప్రకృతి కన్య విలాసంగా నాజూకు అందాలను సంతరించుకుని ముసిముసి నవ్వులు నవ్వుతున్నట్టుగా వుంది.

satyam5

ఇక్కడ ఇంకా చూడవలసిన ప్రదేశాల్లో రామచిలుకలు వున్న లోరో పార్క్, సియాం నీటి పార్క్, గరాచికో, చిరానానా మొదలైన చారిత్రాత్మక ప్రదేశాలు.. ఇలా ఎన్నో వున్నాయి. మీ ఓపిక, సరదా, గుఱ్ఱం స్వారీ, జేబులోని పచ్చనోట్లుని బట్టి, చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత!

ఇంకో విషయం కూడా చెప్పాలి. మిగతా పెద్ద పట్టణాలలో లాగా ఇక్కడ ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళు తక్కువ. ఎక్కువమంది మాట్లాడేది కెనేరియన్ స్పానిష్. స్పెయిన్ భూభాగంలో మాట్లాడే స్పానిష్ కొంచెం వేరేగా వుంటుంది. ఏ రాయయితేనేం పళ్ళు వూడగొట్టుకోవటానికి అని, మాకు ఏ స్పానిష్ అయినా ఒకటే.. అర్ధం కాదు కనుక. మేము టెక్ససులో మాట్లాడే స్పానిష్ కొంచెం (‘పొకీతో’) వాడదామని ప్రయత్నం చేసాను కానీ, అది వాళ్లకి అర్ధం కాలేదు.

శాకాహార భోజనం ఏమాత్రం దొరకదు. అక్కడక్కడా కొంచెం వివరంగా అడుగుదామనుకున్నా భాషా సమస్య వుండటం వల్ల అదింకా కష్టమయింది. ‘వెహిటేరియానో’ కావాలని అడిగినా, చికెన్, కొన్ని చోట్ల చేపలు వాళ్లకి శాకాహారాలే! శాకాహారాల కోసం మాలో మేమే కొంచెం హాహాకారాలు చేసుకున్నాం. మా ఆస్టిన్ నగరంలో దొరికే టెక్స్ మెక్స్ స్పానిష్ పదార్ధాలు – వెజ్జీ ఎంచిలాడ, బరీటో, వెజ్జీ కేసడీయా లాటివి వాళ్లకి అసలే తెలీదు.

చివరికి ఒక పెద్ద రెస్టారెంటులో, ఒక చిన్న వంకాయ ముక్క మీద కొంచెం ఛీజ్, దాని మీద కొంచెం పెరుగు పోసి, ఒక్కొక్క ముక్కకీ పది డాలర్లు తీసుకున్నాడు. నాలాటి శాకాహారులకి ఆపుల్ పళ్ళు, అరటిపళ్ళు లాటి సాత్విక భోజనం, బ్రెడ్డు, క్రెసాంట్లు, బిస్కత్తులు మొదలైనవి ఇక్కడ ఆరోగ్యానికి మంచివి. హిమక్రీములకి మాత్రం కొదువలేదు. వైనతేయులకి కావలసినంత వైన్. కెనేరియన్లు పూర్వజన్మలో సురాపానం చేసిన సురులై వుండాలి. స్వర్గం లాటి ఈ అందమైన ప్రదేశంలో, పులిసిన ద్రాక్ష రసం త్రాగుతూ జీవితం అనుభవిస్తున్నారు మరి!

సత్యం మందపాటి