Archives for May 2014

భూమి స్వప్నాన్ని శ్వాసించిన తెలంగాణ కవిత్వం

10177289_10203107554362740_688223332954052141_n

నిజాయితీగా చెప్పాలంటే, తెలంగాణ కవిత్వం గురించి నాలుగు మాటలు సాధికారికంగా వ్రాసే శక్తి నాకు లేదు. జూన్ 2 వ తేదీన, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ‘తెలంగాణ రాష్ట్రం’ ఏర్పడబోయే సందర్భంగా, జూన్ 1 వ తేదీ రాత్రి 9 గంటల నుండి రాష్ట్ర ఆవిర్భావ ఘడియల వరకు కొనసాగేలా తెలంగాణ కవి గానం ఒకటి, మిత్రులు హైదరాబాద్ సారస్వత పరిషత్ హాలులో ఏర్పాటు చేస్తున్నారు. ఒక కవిత్వ విద్యార్థిగా, తెలంగాణ లోని వరంగల్ అనే ఊరిలో పుట్టి పెరిగిన వాడిగా, తెలంగాణ కవిత్వం నన్నెలా చుట్టుముట్టిందో, తెలంగాణ కవిత్వాన్ని నేనెట్లా అర్థం చేసుకున్నానో క్లుప్తంగా చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నం ఈ వ్యాసం!    

హైదరాబాద్ రాష్ట్రంలో సజీవంగా వున్న తెలుగు కవిత్వం ఊసు లేకుండా వెలువడిన ‘వైతాళికులు’ సంకలనానికి జవాబుగా సురవరం ప్రతాప రెడ్డి వెలువరించిన ‘గోల్కొండ కవులు’ కాలం నుండి, ‘ఇప్పుడు తెలుగు కవిత్వం అంటే తెలంగాణా కవిత్వమే’ అన్న కాలం దాకా ‘తెలంగాణా కవిత్వం’ చేసిన ప్రయాణం అబ్బుర పరుస్తుంది. మరి, ఆ శక్తి తెలంగాణ కవిత్వానికి ఎవరిచ్చారు? నిస్సందేహంగా, తెలంగాణ జీవితమే తెలంగాణ కవిత్వానికి ఆ శక్తిని ఇచ్చింది. తరాలుగా కొనసాగుతోన్న తెలంగాణ తండ్లాట తెలంగాణ కవిత్వానికి ఆ ఆత్మను ప్రసాదించింది.

కొన్ని వందల ఏళ్ళ పాటు సాంస్కృతిక, ఆర్ధిక దోపిడీకి గురయిన తెలంగాణ, తనను తాను విముక్తం చేసుకోవడం కోసం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సాయుధ పోరాటంలోకి దిగింది. ప్రజా ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ఎక్కడ మొదలైనా పాటే వాటి మొదటి ఆయుధం. తమ శ్రమనీ, తమ శ్రమని దోచుకునే వాళ్ళ మోసాలనీ మరిచిపోయెందుకు సామాన్యులు పాటనే ఆసరా చేసుకున్నారు. తెలంగాణ కవులు కూడా పాటనే ఆశ్రయించారు. ‘బండెనక బండి కట్టి’ అని ఆగ్రహించినా, ‘పల్లెటూరి పిల్లగాడా’ అని దుఃఖించినా, పాటే తెలంగాణ కవిత్వ మాధ్యమం అయింది.

వచన కవిత, కథ, నవల లాంటి సాహితీ ప్రక్రియలు ఐరోపీయ దేశాల నుండి దిగుమతి చేసుకున్నవి. బ్రిటిష్ పాలన లో వున్న కారణంగా, ఇంగ్లీష్ చదువుకూ, సాహిత్యానికీ చేరువైన అప్పటి మదరాసు రాష్ట్రం లోని తెలుగు సాహిత్య సృజనకారులు ఆ ప్రక్రియలలోకి సహజంగానే ప్రవేశించగలిగారు. అయితే, ఉర్దూ చదువు, అది కూడా కొన్ని ఉన్నత వర్గాలకే పరిమితమైన సమాజం లాంటి పరిమితులు ఉన్నప్పటికీ తెలంగాణ కూడా ఆ సాహితీ ప్రక్రియలలోకి ప్రవేశించింది.

 

//2//

సుదీర్ఘ కాలం పీడనకు గురి కావడం వలన, తెలంగాణ జీవితం లో సహజంగా వున్న ‘సామూహికత’ లక్షణం వలన, తాము స్వీకరించిన ఆధునిక సాహితీ ప్రక్రియలలో కూడా ప్రజా పోరాటాలని ప్రధాన వస్తువుగా చేసుకుని, తమ ప్రజల భాషలో వ్యక్తీకరించారు తెలంగాణ కవులు. పీడితులెప్పుడూ స్పష్టంగానే మాట్లాడతారు. అందుకే, మాటలకు అనవసరమైన పూతలు పూసి, మెరుపులు అద్ది ఆ మాటల వెనుక దాక్కోవడం లాంటి శుద్ధ కళా నైపుణ్యాలు తెలంగాణ కవులు ఔపోసన పట్టలేక పోయారు. అందుకే, పాటలో ధ్వనించే స్పష్టత తెలంగాణా కవితలోనూ ధ్వనిస్తుంది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కవి పలికింది అందుకే!

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, భారత దేశ స్వాతంత్ర్యం, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణం తదనంతరం తెలంగాణ కవి, కవిత్వ భాషకు సంబంధించి, కవిత్వ వ్యక్తీకరణలకు సంబంధించి కొత్త పరీక్షలను ఎదుర్కొన్న కాలం. స్వాతంత్ర్యమైతే వొచ్చింది గానీ, ఊళ్ళల్లో ఇంకా కొనసాగుతోన్న దొరల పెత్తనం, అప్పుడప్పుడే యూనివర్సిటీ చదువులు చదువుతున్న తెలంగాణా కవిని ఆందోళనకు గురి చేసింది. అందుకే, 1969 లో ఉధృతంగా వొచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గణనీయమైన స్థాయిలో కవిత్వాన్ని సృష్టించలేక పోయింది. దాదాపు అదే కాలంలో తెలంగాణ లోకి అడుగిడిన నక్సలైటు ఉద్యమాలు, దానికి ముందే ఆవహించిన శ్రీ శ్రీ కవిత్వం, తెలంగాణ కవిని విప్లవ కవిత్వం వైపు నడిపించాయి.

దరిదాపు 80 ల వరకూ, ‘తెలంగాణ కవి అంటే విప్లవ కవి’ అన్నంతగా తెలుగు సాహిత్యం లో ఒక ముద్ర పడి పోయింది. ఇక్కడ గమనించ వలసిన అంశం ఏమిటంటే, ఈ కాలంలో కూడా తెలంగాణ కవులు, దొరల పెత్తనం కింద, పోలీసు క్యాంపుల కింద నలిగిపోయే తన ఊళ్ళ గురించే కవిత్వం రాసారు. ఆ కవిత్వం కూడా, ఏ అర్థం లేని / అవసరం లేని రూపకాల చాటునో కప్పి పెట్టకుండా సాగింది. తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా, ఇట్లాంటి విప్లవ కవిత్వం రాయడం ద్వారా తమను తాము ప్రజా ఉద్యమాలలో మమేకమైన వాళ్ళుగా చూసుకున్నారు తెలంగాణ కవులు!

ఎనభైలలో వొచ్చిన స్త్రీ, దళిత వాదాలు, ‘అందరూ కలిసి చేసే పోరాటం లోనే అందరి విముక్తి ‘ అన్న విశ్వాసం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించి, అస్తిత్వ ఉద్యమాలను మొదలు పెట్టాయి. కాస్త అటూ ఇటూగా అదే సమయంలో, తెలంగాణ లోని కొందరు బుద్ది జీవులు, ‘తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు – అది వెనుకకు నెట్ట బడిన ప్రాంతం’ అన్న స్పృహను తెలంగాణ సమాజంలోకి ప్రవేశపెట్టారు. తదనంతర కాలంలో, ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష’ రాజకీయ రూపం తీసుకుని, తెలంగాణ తెలుగు భాషకు జరుగుతోన్న అవమానం, సంస్కృతి పట్ల అవహేళన, వనరుల దోపిడీ మొదలైన అనేక అంశాలను ఆధారాల సహితంగా చర్చకు పెట్టడం మొదలు పెట్టడం ప్రారంభించారు.

 

//3//

ఇట్లా మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత, తెలంగాణ కవిత్వం గొప్ప సౌందర్యంతో వెలిగిపోయింది. తెలంగాణ కవిత్వం, ఎట్లాంటి శషభిషలూ లేకుండా తన జీవ భాషతో పలికింది. సరళం గానే ఉంటూ, గంభీరమైన అంశాలను స్పృశించింది. దాపునే నది పారుతున్నా, ఫ్లోరోసిస్ బారిన పడుతోన్న తన ఊళ్ళ దుఃఖాన్ని పలికింది. వందల ఏళ్ళు పదిలంగా దాచుకున్న తన భాష ని గేలి చేయడాన్ని సవాలు చేస్తూ పలికింది. తనకే ప్రత్యేకమైన తన పండగల సౌందర్యాన్ని పలికింది. మొత్తంగా, తెలంగాణ కవిత్వం తెలంగాణ జీవితాన్ని ఆవాహన చేసుకున్నది.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా పాటే ఆకాశంలోని సూర్యుడిలా వెలిగిపోయినా, పాట వెలుగు స్పృశించ లేని వేదనని తెలంగాణ కవిత్వం స్పృశించింది. ‘మత్తడి’, ‘పొక్కిలి’, ‘మునుం’ లాంటి బృహత్ సంకలనాలు ఇందుకు దాఖలా ! ఇదే సమయంలో ఒక వైపు తెలంగాణ ఆకాంక్షకు మద్దతు తెలుపుతూనే, రేపటి తెలంగాణ లో తమ అస్తిత్వాన్ని నిలిపుకోవాలనుకునే తెలంగాణ దళిత, బహుజన, ముస్లిం ల ఆకాంక్షని కూడా తెలంగాణ కవిత్వం వ్యక్తం చేసింది. బహుశా, ఈ కాలంలో వెలువడిన తెలంగాణ కవిత్వాన్ని కొంతమేర ఆఫ్రికన్ కవిత్వంతో పోల్చి చూడవోచ్చునేమో!

ముఖ్యంగా, 2009 లో ప్రకటన చేసి, కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళిన తరువాత పెరిగిపోయిన యువకుల ఆత్మహత్యల నేపథ్యంలో వెలువడిన తెలంగాణ కవిత్వం ప్రత్యేకమైనది. వాళ్ళ ఆత్మ త్యాగాలను చూసి దుఃఖించింది. అట్లాంటి యువకులకు ధైర్యం చెప్పింది. వికృత క్రీడలతో తెలంగాణ ప్రకటనలతో ఆడుకున్న రాజకీయాల పట్ల ఆగ్రహం ప్రకటించింది.

ఆగ్రహానికి, దూషణకి సంబంధించి, 2009 ముందు వరకూ దాదాపుగా పరోక్ష ప్రస్తావనలకే పరిమితమైన తెలంగాణ కవిత్వం, ఆ తదనంతర కాలంలో ప్రత్యక్ష ప్రస్తావనలలోకి దిగింది. ఈ కాలంలో వెలువడిన ఒకానొక సంకలనానికి పేరు ‘క్విట్ తెలంగాణ’ !

ఇక ఇప్పుడు తెలంగాణ వొచ్చింది. తెలంగాణ ప్రకటించిన రోజున తెలంగాణ కవులు గొప్ప ఉత్సవ సంరంభంతో కవిత్వం రాసారు. నెరవేరిన తమ ప్రజల ఆకాంక్షలని, అమరులైన యువకుల త్యాగాలను శ్లాఘిస్తూ కవిత్వం చెప్పారు. ఇక ఇక్కడి నుండి తెలంగాణ కవిత్వం ప్రయాణం ఎటువైపు?

చరిత్రని చూస్తే అర్థమయే విషయం – తెలంగాణ కవులు ఎప్పుడూ తమ భూమి పుత్రుల వైపే వున్నారు. తమ భూమి స్వప్నాన్నే తమ కవిత్వంలో శ్వాసించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ కవులు, స్టేట్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతీ కాలంలోనూ ‘యాంటీ-స్టేట్’ గానే వున్నారు. తెలంగాణ ఉద్యమాల వారసత్వంగా వొచ్చిన ఆ జీవ లక్షణం కొనసాగుతుందనే అనుకుంటున్నాను. అదే సమయంలో, తెలంగాణ కవిత్వం, కొంగొత్త రూపాలతో వెలువడుతూ ముందుకు సాగుతుందనీ ఆశ పడుతున్నాను –

 

-కోడూరి విజయ కుమార్

vijay

ఎండమావి

Mamata K.
ఎర్రమట్టి కాలిబాట
పక్కన గడ్డిపూలతో ఎకసెక్కాలాడుతోంది
పిల్ల గాలి
నన్ను
ఒంటరి బాటసారిని అనుకున్నట్టుంది
అప్పుడప్పుడు వచ్చి కమ్ముకుంటోంది
అనునయంగా
తెలీని భాషలో పాడుతోంది
కమ్మని కబుర్లు.
కరకరమంటూ హెచ్చరికలు పంపుతున్నాయి
బూట్లకింద నలుగుతున్న ఒకటో రెండో గులకరాళ్ళు.
ఉవ్వెత్తున ఎగసి
అబ్బురపరచే విన్యాసాలు చేసి
అల్లంత దూరంలో వాలి
నిక్కి చూస్తున్నాయి
గుంపులు గుంపులుగా నల్ల పిట్టలు.
కీచురాళ్ళతో కలిసి చేస్తున్న సంగీత సాధన
మాని
రెక్కలు ముడుచుకు కూర్చున్నాయి జిట్టలు.
unnamed
దూరంగా మలుపులో
తెల్లపూలతో నిండుగా ఓ చెట్టు.
బొండు మల్లెలు
అని ఆశగా పరిగెత్తి చూస్తే
ఒంటి రేకుల జపనీస్ చెర్రీ పూలు.
సగం ప్రపంచానికావల సొంత ఊరిని
తానుకూడా
గుండెల్లో గుక్కపట్టినట్టుంది
ఆ చెట్టు
మెత్తగా
ఇన్ని పూరేకులను రాల్చింది.
ఎన్నోఏళ్ల్లప్పుడు
విమానమెక్కిస్తూ “మళ్ళెప్పుడు జూచ్చనో నిన్ను”
అంటున్న అవ్వ కళ్లల్లో పొంగిన కన్నీళ్ళు
ఇక ఆగక
నా బుగ్గలపై రాలాయి జలజలా.
– కె. మమత

ఈ వేసవిరాత్రి , ఈ ప్రయాణం

48575043_123_011
గాలికి ఉక్కబోసి
తాటిచెట్టు తలల్ని తిడుతూ
చిరుమేఘం దారితప్పి
చుక్కలమధ్య దిగులుగా
నిరాశాబూదిలో
కిటికీ పక్కన శరీరం
నిద్రకు మెలుకువకు నడుమ వేలాడుతూ
అద్దంమీది ఊదారంగు బొమ్మలతో
ఆత్మనిశ్శబ్ద సంభాషణ
ఈ వేసవి రాత్రి ప్రయాణం
మెదడు పొరల్ని కదుపుతూ
sail_boat_painting_continued_by_texas_artist_lauri_seascapes__landscapes__9f924def2b33877fec7b334ae7231482
దాహమేసిన రాత్రి
నీటికలల్నితాగుతూ
వెర్రెత్తిన పడవ
తానే సముద్రమౌతూ
ఈ వేసవి రాత్రి ,ఈ ప్రయాణం
 ఇంద్రియాల పలవరింత
ఈ వేసవిరాత్రి , ఈ ప్రయాణం
గుర్తుకొస్తున్న మొదటి స్పర్శలోని ఆపేక్ష
కాలిమువ్వలకు గుండెచప్పుళ్ళను జతచేసినట్టు
ధ్యానంలోని గొంగలికి రెక్కల చలనం ప్రసాదించినట్టు
నింగిలోని నీటిచుక్కకు హరివింటి వొంపుల్ని సవరించినట్టు
రంగుల స్వప్నాల్ని బతుకుపటంపై సాకారం చేసినట్టు
ప్రయాణమే తానైనట్టు
గమ్యంలో ఎదురుచూపే తానైనట్టు
ఈ వేసవిరాత్రి , ఈ ప్రయాణం.
–  బొలిమేరు ప్రసాద్ 

సావిరహే…సామజవర గమనా!

10425613_4332254161644_1397115634_n-మృత్యుంజయ్

mruthyujay

చిన్న గది…మనసు ఆకాశం!

drushya drushyam 34

చిన్న చిన్నవే.
గూడు కట్టుకున్న పదాలే.
కానీ, గొప్ప అర్థాలు.

‘ఖాన’ అంటే ఇల్లు.
‘ఖబూతర్’ అంటే పావురం.
‘కబూతర్ ఖాన’ అంటే భాగ్యనగరం.
అవును మరి. పావురాల కోసం ఇండ్లను నిర్మించిన మనసున్న మారాజుల నగరం ఇది.

నిజంగానే ఇంకొక పదం ఉన్నది.
తెలంగాణలో ‘పావుఁరం‘ అన్న పదమూ ఉన్నది.
దానర్థం ప్రేమ, అభిమానం. అంతకన్నా ఎక్కువ పలికే అనురాగం.
అందుకే మాటల్లో ‘పావుఁరం‘ గల మనిషి’ అని ఎంతో ఇదిగా చెప్పుకుంటాం!
అటువంటి తరీఖా గల మనుషులు నిర్మించిన నగరం హైదరాబాద్, అందులోని ఈ ‘ఖబూతర్ ఖాన’ ఈ వారం.

+++

అబిడ్సులో ఒకానొక ఉదయం…. పావురాల కువకువల మధ్య గడిపితే ఈ దృశ్యం ఒకటి నచ్చింది నాకు, క్లిక్ మనిపించాను.
ఎన్నో తీశాను. చాలా బాగా ఉన్నయి. కానీ, ఇందులో ఒకే ఒక పావురం హాయిగా స్వేచ్ఛగా ఎగురుతుంటే మిగతావి ఇంట్లో ఉండటం ఉన్నది చూడండి.
ఇదొక అద్భుతమైన సన్నివేశం…’మన ఇల్లు మన ఇష్టం’ అన్నప్పుడు ఇట్లా పోయి అట్లా రావడం…ఇష్టానుసారం.గా ఎగరడం..ఎంత హాయి.
ఏదో ఒక హాయి. అంతకన్నా ఎక్కువే అది.
స్వేచ్ఛ, శాంతి.. ఇవి రెండూ ఉన్నందువల్లే కాబోలు ఈ చిత్రం నాకు మహా ఇష్టం

నిజానికి ఇలాంటి ఖబూతర్ ఖానాలు పట్నంలో చాలా ఉన్నయి.
మీరు చూస్తున్నది గోకుల్ చాట్ వెనకాల ఉన్న ఖబూతర్ ఖాన.

నిజానికి కొన్ని వందల పావురాలు నివాసం ఉండటానికి కట్టించిన చిన్న మినార్ వంటిది ఇది.
దానికింద విశాలంగా వదిలిన స్థలం. దూరంగా నిలబడి చూడటమూ ఒక ముచ్చట. దగ్గరకొస్తే సవ్వడి…అదొక వినముచ్చట.

చిన్న చిన్న గదులు.
ప్రేమకు చిహ్నం అన్నట్టుగా గుండె గదుల వంటి అరలు.
మంచి మంచి రంగులు. అందులో కువకువ మంటూ పావురాలు. హాయిగా సేద తీరుతూ సరాగాలు.
వాటికి ఇష్టమొచ్చినప్పుడు స్వేచ్ఛగా ఎగురుతుంటాయి.

ఇక రాత్రుల్లు. నిద్రిస్తయి.
తెల్లవారంగనే రెక్కల్ని టపటప లాడించుకుంటూ ఎటో ఎగిరిపోతై.
ఒకటి లేనప్పుడు ఇంకొకటి వస్తది. అట్లా పదులు, వందలుంటయి.
ఆరామ్ సే అవి అక్కడ ‘మా ఇల్లు.. మా ఇష్టం’  అన్నట్టు దర్పం ఒలికిస్తూ ఉంటే ఒకటి తుర్రుమని ఇలా ఎగురుతుంటది.
అందుకే ఇది బాగ్యనగరం. ఒక ప్రతీక.

ప్రతి నిమిషానికి ఒకసారి అవన్నీ చప్పున లేస్తయి. ఆ చప్పుడు వినాలి.
మళ్లీ అన్నీ ఒక్కపరి వాలుతై. ఆ సద్దుమణగడమూ సవ్వడి. అదీ వినాలి.

ఒక గంటసేపైనా ఉంటేగానీ వాటి శబ్దం..నిశ్శబ్దం…
గీతమూ సంగీతమూ అందలి సరిగమలు…వాటి ఒరవడీ అర్థం కాదు.

+++

మరి పదం. అది పావుఁరం.
1942లో నిర్మితమైన ఈ ఖబూతర్ ఖాన జన జీవన పా(వురానికి సుతారమైన నిదర్శనం.
ఇంకొకటి పాతబస్తీల ఉన్నది. అది హుస్సైనీ ఆలంలో…చార్మినార్ కు  కొద్ది దూరంలోనే.
రెండొందల ఏండ్ల కిందట కట్టించింది అది. అందులో 135 అరలున్నయి.
దాన్ని సిద్ది ఇబ్రహీం అనే పెద్ద మనిషి కట్టించిండట.

ఇట్లా ప్రతి ఇంటికి ఒక చరిత్ర ఉన్నది.
ఆ ఇంటి దగ్గర నివసించే పక్షులకు ఆహారం, వసతి కూడా ఏర్పాటు చేసిన మనుషులున్నరు.
అక్కడే లక్ష్మీనారాయణ గుడి దగ్గర ఇంకొకటి ఉన్నది.
నేనైతే ఈ మూడింటినీ ఛాయాచిత్రాలుగా పదిల పర్చాను.
ఇంకొన్ని కూడా ఉన్నయి.
వెతకాలి. చూడాలి. చిత్రీకరించి వదలాలి.

అయితే, ఈ చిత్రాన్ని లేదా ఈ పావురాలను ఈ వారం వదలడంలో ఒక విశేషం ఉన్నది.
అదే దృశ్యాదృశ్యం.

+++

ముఖ్యంగా ఈ దృశ్యంలో దిగువన ఒక పావురం ఎగురెళ్లుతున్నది చూడండి.
అది నివేదిత.
అవును. ఆ ఎగిరే పావురాయికి మన మనసులో ఉన్నది నివేదించుకుంటే అది తప్పక నెరవేరుతందట!
ఇదొక విశ్వాసం. మరి నేను నిజంగానే నివేదించుకుంటున్నాను.

నా నగరం ఒక ప్రేమ నగరం. సుతారమైన అపురూపమైన విశ్వాసాల కూడలి.
తరతరాలుగా మనిషిని, పక్షిని, చెట్టును, పుట్టను కలుపుకుని జీవిస్తున్న ఆత్మగల్ల నగరం.
ఇదిప్పుడు స్వేచ్ఛ పొందుతున్నది. పావురాయి అవుతున్నది. ఇది నిలబడాలి. ఈ ఇల్లు సుఖ శాంతులతో వర్థిల్లాలి.
ముఖ్యంగా అశాంతికి గురికావద్దు, ఎవరివల్ల కూడా.
అంతే! అవును మరి. ఒక రాష్ట్రంగా తెలంగాణతో పాటు, రాజధానిగా హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఏర్పడటం అన్నది నిజంగానే పా(వురం.
ఉద్యమం తర్వాతి సన్నివేశ కదంబం. ఒక స్వేచ్ఛాదృశ్యం.
ఖబూతర్ ఖానా.

అది తిరగి తమదే అవుతున్నప్పుడు ఆ భూమిపుత్రుల మానసం ఎలాగుంటుంది?
ఈ చిత్రం మాదిరే ఉంటుంది.

మరి అభినందనలు.
కృతజ్ఞతలు.

 

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

జూన్ 1న వంగూరి ఫౌండేషన్ అవార్డుల సభ

2011 VFA new logo

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు గత మార్చ్ , 2014 లో నిర్వహించిన 19 వ ఉగాది ఉత్తమ రచనల పోటీలో బహుమతి పొందిన వారిలో భారత దేశం నుంచి విజేతలైన వారి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మీకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం.

 

తేదీ: జూన్ 1, 2014 (ఆదివారం)

సమయం: సాయంత్రం: 6 గంటలకు

వేదిక: శ్రీ కళా సుబ్బారావు వేదిక,  శ్రీ త్యాగరాజ గాన సభ ప్రాంగణం, చిక్కడ్ పల్లి, హైదరాబాదు.

ప్రధానాంశం: విజేతలకు నగదు (సుమారు  35 వేల రూపాయలు), ప్రశంసాపత్రాల బహూకరణ.

ప్రత్యేక ఆకర్షణ :  విజేతలచే బహుమతి పొందిన తమ రచనల స్వీయ రచనా పఠనం.

 

ఆహ్వానిత 19 వ ఉగాది ఉత్తమ రచన విజేతలు (ప్రధాన విభాగం, నా “మొట్టమొదటి రచన” విభాగం, యువతరం విభాగం) :

గంధం యాజ్ఞ్యవల్క్య శర్మ, (నరసరావు పేట), భరత్ భూషణ్ రెడ్డి (హైదరాబాద్), టి. నవీన్ (హైదరాబాద్) భండారు విజయ (హైదరాబాద్), బి. మెర్సీ మార్గరెట్  (హైదరాబాద్), కుడికాల “సరోజనార్ధన్” వంశీధర్,(హనుమకొండ), కామేష్ పూళ్ళ (యానాం), చెన్నూరునరేంద్రనాథ్ (కలకత్తా) ,శివ్వాలా గోవింద రావు,కర్రి రఘునాథ శంకర్ (యలమంచిలి), మల్లిపూడిరవిచంద్ర (హైదరాబాద్), ప్రసూన రవీంద్రన్ (శేరిలింగంపల్లి) గొర్లెహరీష్ (కాకినాడ), దోర్నాదుల సిద్ధార్థ (పలమనేరు), మోహిత కౌండిన్య ( హైదరాబాద్),S. V. కృష్ణ జయంతి (హైదరాబాద్),  నగేష్బీరేడ్డి (రామగిరి)

 

అత్యధికంగా యువతీ యువకులే “సాహిత్య” విజేతలుగా ఈ సభలో పాల్గొంటున్న ఈ పురస్కార ప్రదానోత్సవానికి మీరు సకుటుంబ సమేతంగా వచ్చి, విజేతల రచనలని వారి గొంతుకలలోనే విని ఆనందించమని తెలుగు సాహిత్యాభిమానులందరినీ కోరుతున్నాం.

మరి కొన్ని వివరాలకు మా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వంశీ రామరాజు గారికి ఫోన్ చేసి సంప్రదించండి. ఆయన ఫోన్ నెంబర్ 98490 23842.  (హైదరాబాదు)

 

భవదీయుడు,

వంగూరి చిట్టెన్ రాజు

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

హ్యూస్టన్, హైదరాబాద్

Phone: 832 594 9054

E-mail: vangurifoundation@gmail.com

www.vangurifoundation.blogspot. com

జాగీరు

Kadha-Saranga-2-300x268

ఇంజనీరింగ్‌లో చేరిన ఆదిత్య మొదటిరోజు కాలేజ్‌కెళ్లి ఇంటికొచ్చిండు.

ఆదిత్య కంటే అతని తండ్రి నారాయణరెడ్డికే ఆనందం ఎక్కువుంది. మంచికాలేజీలో సీటు దొరుకడమే అందుకుకారణం. నారాయణరెడ్డి కొడుకును చూసి మురిసిపోతున్నడు.

‘‘ఏం సార్‌ ఎలా ఉంది కాలేజ్‌?’’అని ప్రేమతోనే అడిగిండు కొడుకును.
‘‘కాలేజ్‌ మస్తున్నది డ్యాడీ . కానీ….’’అని ఆగిపోయిండు.

ఆ మాటకు నారాయణరెడ్డికి ఒకింత షాక్‌ అయింది. ‘‘ఏమైందిరా చెప్పు…, ర్యాగింగ్‌ ప్రాబ్లెమ్‌గిట్ల ఉన్నదా??’’ అని అడిగిండు.
‘‘అదికాదు డ్యాడీ…నా సెల్‌ బాగా ఓల్డ్‌ అయ్యింది. మార్కెట్‌ల చాలా మాడల్స్‌ వచ్చినై. పైగా మా కాలేజ్‌ల ఎవ్వల చేతిలో చూసిన థర్టీథౌజండ్‌ ఎబో మాడల్సే ఉన్నయి…’’అంటూ ఒకింత నారాజైతూనే చెప్పిండు.

ఆ మాటకు నారాయణరెడ్డి ఇగ వీని ఖర్చులమోత మొదటిరోజే మొదలైంది అనుకున్నడు.
‘‘సరెతియ్‌ కొందాం ఓ వారం రోజులు ఆగరాదు’’ అన్నడు
ఇంకేముంది ఆదిత్యముఖంలో ఆనందం వెల్లివిరిసింది.

దేనికీ ఒప్పుకోని తండ్రీ ఇట్లా తన కోరికను మన్నించినందుకు ఆదిత్య ఫుల్‌ హ్యాప్పీగ ఉన్నడు…కొత్తమురిపం కదా నారాయణరెడ్డి కూడా  బైక్‌, సెల్లు, కంప్యూటర్‌లే కాదు పాకెట్‌ మనీకి కూడా కాదనకుండా ఇస్తున్నడు.

వారమైంది. కొత్తఫోన్‌ ఆదిత్య పాకెట్లోకి వచ్చింది. వారం రోజుల్లోనే కొత్తకాలేజీలో ఆదిత్యకు తన క్లాస్‌మెట్స్‌లో వినయ్‌తో పరిచయం కాస్త పెరిగింది. మిగితా వాళ్లకంటే ఇద్దరి మధ్య స్నేహకుసుమాలు విరబూశాయి. ఆదిత్యకంటే వినయ్‌కి టెక్నాలజీతో పరిచయమెక్కువ. ఇంజనీరింగ్‌లో చేరడం కంటే ముందునుండే పుస్తకాల ఖర్చుల కోసం హార్డ్‌వేర్‌ నేర్చుకున్నడు. దాంతో ఎలాంటి కంప్యూటర్‌ రిపేర్‌లైనా, సెల్‌ఫోన్‌ అప్లికేషన్స్‌ అయినా క్షణాల మీద చేస్తడు వినయ్‌.
దాంతో కొత్తఫోన్‌ కొన్న ఆదిత్యకు కూడా అప్లికేషన్స్‌ డౌన్‌లోడ్‌లు, అప్‌డేట్‌లు అన్నీ నేర్పించాడు.

అట్లా వినయ్‌ ఆదిత్యవాళ్లింటికి తరుచూ వచ్చిపోతుండటంతో వినయ్‌కి ఆదిత్య వాళ్ల ఫ్యామిలీతో మరింత పరిచయాలు పెరిగిపోయాయి. మాడ్రన్‌ టెక్నాలజీతో వినయ్‌ ఆటాడుకునే తీరు నచ్చి, నారాయణరెడ్డి చాలాసార్లు సర్‌ప్రైజ్‌ అయ్యేటోడు. ఈ జనరేషన్‌కు అసలైన హీరో  వినయే అనిపించేది. తనకొడుకు కూడా అలా ఉంటే బాగుండనుకున్నడు.
అట్లా ఆదిత్యకు వినయ్‌ అన్ని విషయాల్లో మాంచి సపోర్ట్‌ అయ్యిండు.

ఇక ఆదిత్యకు తెల్లారిలేస్తే చాలు, సెల్‌ఫోనే ప్రపంచమైంది. 3జీ ఇంటర్నెట్‌, డౌన్‌లోడిరగ్స్‌, మూవీస్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌లే ఆదిత్య ప్రపంచంగా మారినయి.
సబ్జక్ట్‌ కు సంబంధించిన ప్రాక్టికల్స్‌ కోసం పాత కంప్యూటర్‌ అటుకెక్కించి, కొత్త దానికి ఆర్డర్‌ చేసిండు ఆదిత్య. కొత్త కంప్యూటర్‌ కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు కూడా వినయే నీళ్లు తాగినంత ఈజీగా ఇన్‌స్టాల్‌ చేశాడు.

ఇక నారాయణ రెడ్డికి తన కొడుకు బిజీ చూస్తే ముచ్చటేస్తున్నది. ఏ అమెరికాలోనో సెటిల్‌ అయ్యే లక్షణాలన్ని ఇట్లనే ఉంటయని, కొడుకు బదులు తను ఫారిన్‌ కలలు కనడం మొదలుపెట్టిండు…

 ***

‘‘ఏం రెడ్డిసాబ్‌… నీ కొడుక్కు జబర్దస్త్‌ కాలేజీల ఇంజనీరింగ్‌ సీటు దొరికిందట కదా మరి పార్టీలేదా…?!’’ అని తను పనిచేసే బ్యాంకులో కొలిగ్స్‌ నారాయణరెడ్డిని రోజూ అడుగుతున్నరు.

దాంతో నారాయణరెడ్డి ముసిముసిగా నవ్వుకుంటూ దిల్‌ఖుష్‌ అయితున్నడు. కానీ, తనకు రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే రాజేశంతో తాగుడంటేనే ఇష్టం.
రాజేశ్వర్రావు తనకు గత పదిపదిహేను ఏళ్ల నుండి ‘గ్లాస్‌మేట్‌’!
ఇద్దరు ఉండేది ఒక్క ఏరియల్నే. జాబ్‌ చేసిది కూడా 60కిలోమీటర్ల దూరమే అయినా, ఇద్దరు కలిసే వెళ్తరు. కలిసే వస్తరు.
అట్లా ఇద్దరి మాటలల్ల ఎన్ని ఫుల్‌బాటిల్లు ఒడిసినయో లెక్కేలేదు. అందుకే ఈ ఆనందాన్ని కూడా తనతోనే షేర్‌ చేసుకోవాలనుకున్నడు.
అట్లా ఓసాయంకాలం కనకదుర్గ బార్‌లో రెండు రౌండ్లయిన తర్వాత రాజేశ్వర్రావు నోరిప్పిండు.
‘‘మీ బ్యాంకోల్లందరు దొంగలు…’’మొఖం మీదే అనేసిండు రాజేశం.
ఆ మాటకు నారాయణరెడ్డికి దావత్‌ ఇస్తున్న ఆనందం ఆవిరైంది.
అప్పటిదాక ఉన్న మూడ్‌ మొత్తం మారింది.

నారాయణరెడ్డికి కోపం కట్టలు తెగింది. కానీ, రాజేశ్వర్రావుతో ఉన్న సాన్నిహిత్యం, దోస్తానా ఇప్పటిది కాదు. ఇట్లా తిట్టుకునుడు ఇద్దరికీ అలవాటే!
కౌంటర్‌ ఇయ్యకుంటే మనసొప్పదు. వెంటనే నోరిప్పిండు నారాయణరెడ్డి.

‘‘అబ్బో మీ రెవెన్యూ డిపార్ట్‌మెంటోల్లు సొక్కంపూసలా…?? మొత్తం భూములన్నీ గుత్తజేసి అమ్ముకుంటున్నది మీరు కాదా,మా బ్యాంకోల్లన్నా లెక్కలు చూపియ్యాలె, మీదేమున్నది. బారా కూనీ మాఫ్‌ అన్నట్టేనాయె మీ తంతంగమంత! ఎవలకు తెలువది’’అని గట్టిగనే అన్నడు.
పెగ్గు మీద పెగ్గు పోస్తున్న కొద్ది ఇద్దరి మధ్యల మాటలయుద్ధం మరింత పదునెక్కుతున్నది.

ఇద్దరూ ఇట్లా గీసులాడుకుంటూ సర్కారు కొలువులు చేయబట్టి దగ్గరదగ్గర ఇరవయేండ్లయితంది. రాజేశం నారాయణరెడ్డికంటే ఐదారేండ్లు పెద్దోడు. అందుకే ఎన్ని మాటలన్నా తెల్లారిందంటే అన్నీ మరిచి కాకతీయప్యాసింజర్‌ల కలిసిపోయేటోల్లు.
నారాయణరెడ్డి మాటలకు రాజేశం మరింత రెచ్చిపోయిండు. తన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ తెలివి చూపించాలనుకున్నడు. తన ఆఫీసులో భూమి లేకుండా పట్టాకాగితాలు పుట్టిచ్చె తనకు ఇదేం పెద్ద లెక్కకాదనుకున్నడు.
‘‘మీ దొంగలెక్కల గురించి నాకు చెప్తానావా? లెక్కలదేమున్నది గాయిదు లెక్కలు! పైసలు పారేస్తే బచ్చెడు కాయితాలస్తయి. ఇగ మీ లెక్కల దోఖా అంతా యింతనా…’’ అని గాలిదీసినట్టే అన్నడు రాజేశం.

‘‘ఇగో రాజన్న, మర్యాదగ చెప్తున్నా నువ్‌ నా డిపార్ట్‌మెంట్‌ను అను, నన్ను అంటే మాత్రం మర్యాద దక్కది’’ జెర కోపంగనే చెప్పిండు నారాయణ రెడ్డి.
రాజేశం మాత్రం నారాయణరెడ్డి మాటలను, వార్నింగ్‌లను లెక్కే చేస్తలేడు.
గ్లాసుల పోసిన మందు ఒక్కటే ట్రిప్పుల కతం చేసి గుడాలు నోట్లేసుకొని, కాళ్లు ఊపుకుంటూ నములుకుంట నారాయణ రెడ్డిని మరింత ఇరుకుల పెట్టిండు.
‘‘ఇగో నారాయణరెడ్డి మీ రెడ్లంత ఇంతే, బడబడ మాట్లాడి అవుతలోల్లను బెదరగొడదామనుకుంటరు గానీ, రుజువులున్నయా, సాచ్చాలున్నయా అని అడుగుడు మాత్రం తెల్వది’’ రాజేషం సింపుల్‌గనే అనేసిండు.
కులం జోలి తియ్యంగనె నారాయణరెడ్డికి కోపం బుస్సున పొంగుకొచ్చింది. ఇగ ఊకునేదే లేదన్నట్టు లేసిండు.
‘‘మీ వెలుమోల్లకుండే ఎత్తులు జిత్తులు మాకేడ ఉంటయే, ఏదున్న మొఖం మీద అంటం. మా రెడ్డోల్లను ఎందుకంటవుగని, నీదగ్గర బ్యాంకులు దొంగలనెటందుకు రుజువులు ఏమున్నయో తీసుకరారాదు, నేను కూడా రెవెన్యూ డిపార్ట్‌మెంటోల్లు ఈ దేశాన్ని ఎట్లా ముంచుతున్నరో ఆధారాలతో ప్రూవ్‌ చేస్త!’’ అనుకొచ్చిండు.
వీళ్ల లల్లి మెల్లమెల్లగ ముదురుతున్నది. బార్‌ల కూసున్నోళ్లకు ఇంక జెరసేపాగితే, ఏదో పెద్దయుద్ధమే జరుగటట్టున్నదని అర్థమైనట్టున్నది. అయినా తాగుడు ముచ్చట, ఎవల బాటిల్ల మీద వాళ్ల సోయి ఉన్నది తప్ప, ఎవడెక్కడ పోతే మాకెందుకన్నట్టు తాగుడు మీద పడ్డరు.
చివరకి వెలమ, రెడ్ల కొట్లాటగా మారింది.
వీళ్ల మధ్యల మూడో మనిషి లేడు. లేకుంటే చిలికి చిలికి గాలివాన ఎటు దారితీసేదో!
ఈ సారి రాజేశం సుడిగాలిలా లేసిండు.

‘‘నా దగ్గర ఆధారాలున్నయి. లేకుంట ఎట్ల మాట్లాడుతగని, నిన్ననే మా ఆఫీసుకు ఓ ముసల్ది పట్టా కాగితం పనిమీదొచ్చింది. పట్టాకాగితానికి పదివేలు కావాలంటే మాట మీద మాట మాట్లాడుకుంట మీ బ్యాంకుల డిపాజిట్‌ చేసిన పైసలు ఆగం చేసిన్రని నెత్తినోరు మొత్తుకున్నది. నాకు ఎంటనే నువ్‌ గుర్తొచ్చినవ్‌. ఎప్పుడు చూసినా మా రెవెన్యూ డిపార్ట్‌మెంటోల్లను గురించి చెడమడ తిడ్తవ్‌ కదా, ఇప్పుడు చెప్పు ఆ ముసల్దాని పైసలు ఎవలు ఆగం చేసిన్రో’’రాజేశం ఇక నారాయణ రెడ్డి ఆటకట్టినంటే అన్నంత ధీమగ సవాల్‌ ఇసిరిండు.

నారాయణరెడ్డికి ఏం చెప్పాల్నో సమజ్‌గాలె. ‘‘ఇగో రాజన్న నీ మీదున్న రెస్పెక్ట్‌ పోగొట్టుకోకు. ఏదో ఒక్క ముసల్దానికి అట్లా జరిగిందని, మొత్తం డిపార్ట్‌మెంట్‌ను అంటే మంచిది కాదు, అయినా బ్యాంకుల అట్లెందుకైతున్నదో నీకు తెల్సా…??’’ ఇజ్జత్‌ పోవద్దని కవర్‌చేసిండు నారాయణరెడ్డి.
‘‘ఏ నువ్‌ ఎన్నైన చెప్పు బ్యాంకోల్లందరు బట్టేబాజ్‌లు’’ రాజేశం ఫైనల్‌ స్టేట్‌మెంట్‌లాగ చెప్పేసిండు.
ఇగ తప్పదన్నట్టు నారాయణ రెడ్డి ఆ మాటకు గట్టి సమాధానం చెప్పాలనుకున్నడు.
‘‘ఇగో రాజేషన్నా ఇయ్యాల బిల్లు కట్టేది నేను, నా దావత్‌కొచ్చి నన్నే మాటలనుడు నీకు భావ్యం కాదు. మూడంత ఖరాబ్‌ చేసినవ్‌…’’అన్నడు.
రాజేశం నేనేమన్న తక్కువ తిన్ననా…‘‘నీ పైసలు ఎవనికి కావాలె? నా దగ్గరకూడా మస్తు పైసలున్నయి. అని ప్యాంటు జేబులకెల్లి ఐదువందల నోట్లకట్ట తీసిండు. మీ రెడ్డోల్లు మా వెలుమల కిందనే ఉండాలె’’ అన్నడు రాజేశం.
నారాయణరెడ్డికి తలకాయ తీసేసినట్టైంది.
‘‘అరే నువ్‌ కులం జోలెందుకు తీస్తవ్‌ రాజన్న, నీకు తెల్వది మా బ్యాంకుల ఎందుకట్ల అవకతవకలు జరుగుతున్నయో నీకెరికేనా…??’’అన్నడు నారాయణరెడ్డి.
ఇగ రాజేశంకు మస్తు దిల్‌ఖుష్‌ అయింది.
‘‘అది గట్ల తొవ్వకు రా, నేను చెప్పిన కదా మీ బ్యాంకోల్లు ఎట్లా బతుకనేర్చిన్రో..’’అని మళ్లక్కసారి అన్నడు. నారాయణరెడ్డికి బీపీ పెరిగిపోయింది.
ఎంతతాగినా రాజేశం మాటలకు కిక్కు దొరుకుత లేదు.
ఇగ లాభం లేదనుకున్నడు. అసలు ముచ్చట బయటపెట్టాలనుకున్నడు.
‘‘అసలు మా బ్యాంకుల అట్ల అకౌంట్లల్ల మనీ ఎందుకు గల్లంతైతున్నదో నీకు తెల్వదు. నువ్‌ చెప్తాంటే ఇంటలేవ్‌. మా బ్రాంచి ఈ మధ్యనే కంప్యూటరైజ్డ్‌ అయ్యింది. మా స్టాఫ్‌లనేమో రిజర్వేషన్లతోటి జాబ్‌లు కొట్టిన ఎస్సీఎస్టీ కొడుకులే ఎక్కువుండే. వాళ్లకేమో సదువు రాదాయే, ఇగ కంప్యూటర్‌ ఏడికెళ్లివస్తదే. అందుకే మా బ్యాంకుకు చెడ్డపేరొస్తున్నదే. మనలాగ అక్కడ తెలివున్న అప్పర్‌ కాస్టోల్లు, ఓపెన్‌ల జాబులు కొట్టినోళ్లు ఉంటే ఇట్లా మచ్చలచ్చేదే కాదే’’అన్నడు నారాయణరెడ్డి.
‘‘అదేంది కులం జోలి వద్దన్నవ్‌ మల్లనువ్‌ గా ముచ్చటెట్ల తీస్తున్నవ్‌ నారాయణరెడ్డి…??’’ అన్నడు రాజేశం.
‘‘అరే నువ్‌ మల్ల వఖీలు ప్రశ్నలేస్తవేందే రాజన్న, మన మధ్యల కులమొద్దే! నువ్వా వెలుమ పుటుక పుట్టినవ్‌, నేను రెడ్డి పుటుక పుట్టిన. మనం దొరలం. పటేండ్లం. ఇగ కులం జోలి మన మధ్యలెందుకే. ఇంకో విషయం కూడా ఇను, మా ఆఫీసుల ఎవ్వడెవ్వడో నన్ను పార్టీ అడిగినా నేను నీతోనే ఎందుకు కూసున్న చెప్పే, కులం లేని కొడుకులు మనతో కూసోని తాగుడేందనే కదా…’’అని శాంతింప చెయ్యాలనుకున్నడు.
రాజేశంకు నారాయణరెడ్డి దిల్‌దార్‌తనం నచ్చి మల్లో కోటరుకు ఆర్డరిచ్చిండు.
రెండు గ్లాసులల్ల పోసిండు.
అయితే ‘‘మాలమాదిగ కొడుకులే అవినీతికి కారణమంటవ్‌’’ అన్నడు రాజేశం.
హమ్మయ్య రాజేశం జర దారికొచ్చిండనుకొని నారాయణరెడ్డి లోలోపల్నే సంతోషిండు. ‘‘ఔ రాజన్న నువ్వే చెప్పరాదే, అటెండర్లుగా ఉండాల్సిన కొడుకులు ఆఫీసర్లయి మన మీద పెత్తనం చేసుడేందే’’ అని టాపిక్‌ మొత్తం కులం మీదికి డైవర్ట్‌చేసిండు. రాజేశం కూడా ఒకింత వాస్తవమే అనుకున్నడు.
అసలే రాజేశ్వర్రావు తండ్రి ఎనుకట ఊళ్లె దొరగ ఉండే. కిందికులాలోల్లకు తెలివొచ్చి తిరుగబడ్డంక ఆయన హవా మొత్తం పోయింది. ఇగ రాజేశం ఈ సంగతి తెలుసుకొని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో కొలువుకు ఆ రోజుల్లోనే లంచాలు పోసి దక్కించుకున్నడు.
నారాయణరెడ్డికి, రాజేశానికి పొంతన కుదిరే పాయింట్‌ ఏదన్నా ఉందంటే అది కిందికులాల మీద దుమ్మెత్తిపోసే ముచ్చట మాత్రమే! అందుకే, ఇక చాలాసేపు తమ అనుభవాలను ఒక్కోటి తవ్వుకొని కుప్పపోసి, ఎస్సీఎస్టీబీసీలందరూ చవటదద్దమ్మలని, పొట్టచీల్చితే అక్షరం ముక్కరాని గాయిదకొడుకులని కసిదీరా తిట్టుకొని…చివరికి అగ్రవర్ణాలు జిందాబాద్‌ అనుకొని, బిల్లుకట్టేసి తూగుతూ…తూలుతూ ఇంటిదారి పట్టారు.

***

నారాయణరెడ్డి ఇంట్ల బోర్‌ మోటరు ఖరాబ్‌ అయ్యింది. తన ఇంటికి ఎలక్ట్రిషియన్‌ పనులన్ని చూసిన నరేందర్‌కు ఫోన్‌ చేస్తే ‘‘ కొత్త అపార్ట్‌మెంట్‌ ల ఎలక్ట్రిషియన్‌ వర్క్‌ మొత్తం కాంట్రాక్ట్‌ పట్టిన. ఓ రెండురోజులాగి వస్త రెడ్డి సాబ్‌, జెర ఏమనుకోకు వశపడని పని ఉన్నదిక్కడ, ఓపెనింగ్‌ డేట్‌ దగ్గరికొచ్చింది’’ అన్నడు.

రెండు రోజులైనా నరేందర్‌ రాలే, నారాయణరెడ్డి ఇంట్ల నీటికి కరువొచ్చి ఇల్లంతా కరువుదేశం లెక్క తయారైంది. శనివారం అయ్యేసరికి మధ్యాహ్నమే బ్యాంకు క్లోజయ్యింది. సాయంత్రమే ఆఫీసు నుండి ఇంటికి చేరిండు నారాయణరెడ్డి. పైగా ఇవాళ కలిసి తాగడానికి రాజేశం కూడా కనిపించలేదు. తెల్లారితే ఆదివారం కదా, రేపు ఫోన్‌చేసి కలిసి తాగొచ్చనుకొని ‘డ్రిరక్‌ హాలిడే’ ప్రకటించుకున్నడు.

ఆఫీసు నుండి నారాయణరెడ్డి ఇంటికి చేరుకునేసరికి, ఆనంద్‌, వినయ్‌లు హాల్‌లో కూర్చొని క్రికెట్‌ చూస్తున్నరు.
వినయ్‌…నారాయణ్‌రెడ్డిని చూసి, సోఫాలో నుండి లేచి…‘‘నమస్తే అంకుల్‌’’ అంటూ విష్‌ చేశాడు. నారాయణరెడ్డికి వినయ్‌ వినయం చూస్తే లోలోపలే సంతోషమేసింది. టెక్నాలజీ పరంగా ఎంత నాలెడ్జ్‌ ఉన్నా ఒదిగిఉండే వినయ్‌ తీరు చూస్తే నారాయణరెడ్డికి ఏదో సంతృప్తి.
నారాయణరెడ్డి భుజానికున్న బ్యాగు టేబుల్‌ మీద పెట్టి లోపలిగదిలోకి పోయిండు.
‘‘మోటరు బాగుచెయ్యడానికి ఆ ఎలక్ట్రిషియన్‌ నరేందర్‌గాన్ని రమ్మన్న , ఇయ్యాల వస్త అన్నడు. వచ్చిండా… మోటరు బాగుచేసిండా…’’అని అడిగిండు.

నారాయణరెడ్డి రావడంతో తగ్గిన టీవీ వ్యాల్యూమ్‌, మోటరు బాగుకాని కోపానికి మ్యూట్‌లోకి మారింది.
ఆ కోపం వీళ్ల మీదికి ఎక్కడ మళ్లుతదోనని కామెంట్రీ పీకనొక్కి, సైలెంట్‌గా ఆదిత్య వినయ్‌లు మ్యాచ్‌ చూస్తున్నరు.
‘‘ఏడొచ్చిండు వాడు రానేలేదాయే…నీళ్లు లేక హౌజులున్న నీళ్లే ముంచుకునుడాయె’’అన్నది భార్య లలిత.
ఇగ నారాయణరెడ్డికి కోపం ముంచుకొచ్చింది.
‘‘వానియమ్మ లేకి కులంల్నా చెప్పు….మాల,మాదిగ నా కొడుకులే ఇంత! నా మాటే వానికి లెక్కయితలేదు. నడుమంత్రపు సిరికి ఆగుతండా వాడు…వాడు ఇటుదిక్కు రానియ్‌ వాని సంగతి చెప్తా’’ అని చెడామడ తిట్టుడు షురూ చేసిండు.

నారాయణరెడ్డి ఇల్లుకంటుకున్నప్పటి నుండి అన్ని ఎలక్ట్రికల్‌ పనులు చేసింది ఎలక్ట్రిషియన్‌ నరేందరే! దాంతో నరేందర్‌ కులమే కాదు, పుట్టుపూర్ణమంతా తెలుసుకున్నడు. ఇప్పుడు చిన్న పని ఉన్నదంటే రానంటాడా, వాడు అపార్ట్‌మెంట్‌ పనులు చేయించేస్థాయికి ఎట్లా ఎదుగుతడు అనే ఓర్వలేనితనం కూడా ఆ కోపంలో అంతర్లీనంగా ప్రతిధ్వనిస్తోంది. అందుకే నోటికొచ్చిన బూతులన్నీ తిట్టుకుంటూ నారాయణరెడ్డి బెడ్‌రూమ్‌లో నుండి బాత్‌రూమ్‌లోకి వెళ్లి హౌజ్‌లనీళ్లతో కాళ్లు,చేతులు మొఖం కడుక్కొని టవల్‌తోతూడ్చుకుంటూ నరేందర్‌ని ఒక్కడ్నే కాదు, రాజేశంతో తాగిన ముచ్చట్లల్ల కిందికులాల గురించి మాట్లాడుకున్నదంతా యాదికొచ్చి మరింత రెచ్చిపోయి తిట్టుకుంటూ హాల్‌లోకి వచ్చిండు.
అప్పటికే వినయ్‌ వెళ్లిపోయిండు.

టీవీ బందై ఉన్నది. ఆదిత్య డల్‌గ కూర్చున్నడు. ఏమైందన్నట్టు చూసిండు నారాయణరెడ్డి.
అట్లా కులం పేరుతో ఇష్టమొచ్చినట్టుగా తిడితే ఎట్లా, వినయ్‌ విని హర్ట్‌ అయి వెళ్లిపోయాడు తెల్సా అన్నడు.
వినయ్‌ ఎందుకు వెళ్లిపోయిండు? వినయ్‌దేకులం?? అడిగిండు.
కానీ, ఆదిత్య కొంతసేపటి వరకు నోరుమెదుపలేదు.
అసలు తప్పంతా తనదే అనుకున్నాడు. ఆదిత్యతో వినయ్‌ ఇంటికొచ్చిన కొత్తలోనే వినయ్‌దే కులం అని తెలుసుకోవాలనుకున్నాడు. కానీ, వినయ్‌కి ఉన్న టెక్నాలజీ నాలెడ్జ్‌ చూసి ఖచ్చితంగా తమలాగే పైకులమే అయ్యింటదని ఇన్ని రోజులు నమ్మాడు నారాయణరెడ్డి.
ఆదిత్యమాత్రం రేపటి నుండి వినయ్‌కి ఎలా మొహం చూపించాలో తెలియడం లేదు.
నారాయణరెడ్డికి మాత్రం మనసంతా ఏదోలా ఉంది.
తెలివి ఒకరి జాగీరు(సొత్తు) కాదని తెలిసిసొచ్చింది !

Pasunoori Ravinder 1-డా.పసునూరి రవీందర్‌

ఏడు పదుల “నయాగరా”… నవ కవిత్వ నగారా!

 

అది మార్చి 1944 అప్పటికే ఒకటో రెండో కవితలు మినహా మొత్తం మహా ప్రస్థాన గీతాల రచన శ్రీశ్రీ పూర్తి చేశారు. చలం గారి ముందు మాటలూ వచ్చి చేరాయి. అయినా , 1950 దాకా ,‘మహా ప్రస్థానం’ ఒక సంపుటంగా వెలువడే అవకాశాలు సానుకూల పడలేదు. ఆ గీతాలన్నీ ఎన్నో ఏళ్లుగా ఎందరో కవుల  నోళ్ల ద్వారా , సభల్లో గానం చేయడమూ, అవి బహుళ ప్రాచుర్యాన్ని పొందడమూ జరుగుతూ వస్తోంది.

చూడబోతే  యుద్ధపు రోజులు , సామ్రాజ్య పంజరాలు బద్దలయ్యేలా సామాన్యుల సాహసాలు నమోదవుతున్నాయి. దగ్గరలోనే తెలంగాణ కూడా వ్యతిరేక పవనాలకు ఊతమిచ్చి ప్రతిఘటన తల దాల్చింది. అటు సోమసుందర్ , ఆరుద్ర,, కుందుర్తి వంటి కవులు జన గళాలకు తమ అక్షర నివాళులిచ్చిన , కొత్త నమ్మకాలు వెలార్చిన దశాబ్దం అది. 1948, 49 వత్సరాలలో కానీ ఈ కావ్య దుందుభులు మోగలేదు వజ్రాయుధాలుగా ,‘తెలంగాణా’ లుగా.

కవులు రాజుల ఏనుగులేక్కే కాలం కాదిది. ప్రజలు రాజుల్ని సింహాసనాల మీంచీ ఏనుగుల మీంచి కిందికి దింపే కాలం. అది కవుల చేతుల్లో అక్షరాల కరవాలం . మరీ ముఖ్యంగా ముగ్గురు అభ్యుదయ కవుల యవ్వనాల నయాగరా హోరెత్తిన దశాబ్దం అది. అది మార్చ్ 1944, బెల్లం కొండ రామదాసు, కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం ల మూడు ముళ్లు తొమ్మిది కవితల ‘నయాగరా’ కవితల సంపుటి వెలువడిన నెల. ఈ నవ కవితల నవ్య ధార నగారాకు, ఇది సప్తతి పూర్తి నగారా మొగుతున్న వత్సరం(1944-2014).

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు

ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు

అభ్యుదయ కవితా యుగం లో అచ్చైన తొలి కావ్యంగా దీని విశిష్టత ఎనలేనిది. ఈ కవులు ప్రగతి శీల భావ దురంధరులు. కోస్తా జిల్లాల యువకులు. వామ పక్ష జన ప్రయోజనాభిలాషులు. రోజూ యుద్ధ మృగంతో తల పడుతున్న ప్రపంచం లో . సామాన్యుల ముందర ఉన్నది ఒక్కటే ఆశ, ప్రజానుకూల శక్తులు గెలవాలి. నియంతలు, సైన్యాధికారోన్మాదులు . నర హంతలు ఓటమి పాలవ్వాలి. దేశాదేశాలను మెల్లగా యుద్ధపు ఊబిలోనికి లాక్కుపోతున్న ప్రపంచ పరిస్థితుల కాలంలోనే ఈ ‘నయాగరా’ ప్రపంచాగ్నికి సమిధగా వెలువడింది. ఈ కవితలు కొద్ది సంఖ్యలో వున్నా, వీటి చైతన్య స్థాయి గొప్పది. అది ప్రజల పక్షాన నిలిచింది.

ఎర్నస్ట్ టాలర్

ఎర్నస్ట్ టాలర్

అందుకే ఏ చిరు కవితల పొత్తం అంకితం ఇచ్చారు వీరు ఒక జన్మతః యూదుడైన , జర్మన్ నాటకకర్త , వారం రోజుల పాటు బవేరియా సోషలిస్ట్ రిపబ్లిక్ కు అధ్యక్షుడిగా పని చేసిన ఎరన్స్ టాలర్ కు , అతని పంక్తులనే ఊటంకిస్తూ.

“ఎప్పుడు మనం ప్రేమలో బతుకుతాము

ఎప్పుడు మనం ఇష్టమొచ్చిన పని చేయ గల్గుతాము

ఎప్పుడు విముక్తి???”

యుద్ధ పిశాచి దురంతాలకు లోనయి ఉన్న యావత్ ప్రపంచమూ, సామ్రాజ్య వాదుల పెచ్చుమీరిన దోపిడీ పరిపాలనలో ఉన్న ఎన్నో బడుగు దేశాలూ, బహుశా ఇదే ప్రశ్న తో పడే పడే సతమవుతున్న కాలం అది . అందుకే తెలుగులో తొలి అభ్యుదయ కవిత్వ సంపుటి ఇదే ప్రశ్నలు వేసింది. మొదటి మూడు కవితలు ‘నా గీతం’,’ఈ రోజున’. ‘చెరసాల’, బెల్లం కొండ రామ దాసు గీతాలు. వీటిని ఆయన రెండు నెలల ముందే అంటే జనవరి 1944 లోనే రాశారు. వీటిలో అంతర్జాతీయ స్పృహ, గుచ్చెత్తి చూపే అభివ్యక్తి , అచంచలమైన ప్రజాపేక్ష విశ్వాసం మెండుగా ఉన్నాయి.

మధ్య లోని మూడు కవితలు కుందుర్తి ఆంజనేయులు రాసినవి ‘మన్యంలో’,(ఏప్రిల్, 1943),‘జయిస్తుంది’, (అక్టోబర్ , 1941),‘తర్వాత’,(సెప్టెంబర్. 1942) లో రాయబడ్డాయి. వీటిలో మన్యం లో కవిత , విశాఖ మన్యం వీరోచిత పోరాట కారుడు అల్లూరి సీతారామరాజు గురించిన కదన కధనం. బహుశా అల్లూరికి అక్షర తర్పణాలు ఇచ్చిన అభ్యుదయ కవులలో కుందుర్తి ముందు వరుస లో వుంటారు. అల్లూరి బలిదానం(07/05/1924), తర్వాత పందొమ్మిదేళ్ళకు వెలుగులోకి వచ్చిన కవిత ఇది. కుందుర్తి అల్లూరి పై అంగార మాల రచిస్తే , ఏల్చూరి సుబ్రహ్మణ్యం తన మూడు కవితలలో ఇంకాస్త భిన్నంగా కనిపిస్తాడు.

ఈయన ‘ఠాకూర్ చంద్ర సింగ్” (జూలై, 1943), “ప్రజాశక్తి’, (జూన్, 1941),‘విజయ ముద్ర’(మార్చి, 1941) కవితలను నయాగరాకు అందించాడు. కవితల్లో ఎక్కడా ‘నయాగరా’ పదాన్ని ఈయన ముందు కవులిద్దరివలే వాడలేదు. బెల్లం కొండ రామదాసు ‘నా గీతం’ లో ,‘జగత్తునొక నయాగరా జల ధారలుగా వర్షించిన నా గీతం’, అని రాయగా , కుందుర్తి ‘గబ గబ గబ గబ నయాగరా జల పాతం లా నడిచే విప్లవ సైన్యం జయిస్తుంది’ అంటారు తన గీతం ‘జయిస్తుంది’ లో.

Kundurti anjaneyalu

1938 కి ముందే అత్యధిక శాతం శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థాన గీతాలు , భావావేశ సంపన్నతకు ప్రతిబింబాలై , ఒక తాత్విక స్థాయి నుంచి ప్రజా పక్షం వహిస్తాయి. తక్షణ సందర్భాలు, కవితా వస్తువు కావల్సిన అవసరం శ్రీశ్రీ కి జూన్ 22, 1941, దాకా కలగ లేదు. అప్పుడే ‘గర్జించు రష్యా ‘ గీతం చండ ప్రచండంగా వెలువడింది. ఇంచుమించు యుద్ధకాలపు నీడలే నల్లగా వ్యాపించిన ప్రపంచం గురించి, ప్రగతి అనివార్యత గురించి, శ్రీశ్రీ ని ఆరాధించే , అభిమానించే ముగ్గురు తెలుగు కవులముప్పేట హారం ఈ కవిత్వ నయాగరా!

భాషా పరంగా , ఒకింత మోతాదు ఎక్కువగా అలంకారిక గ్రాంధికమా అన్పించే నడక బిగి , ఏల్చూరి సుబ్రహ్మణ్యం రచనల్లో విరివిగా కన్పిస్తుంది. ‘సముద్ధర్త’,‘రూక్షోజ్వాల రుధిర దీప్తి’. ‘తమసా గర్భ ధళన హేతి’,’‘సుప్తోధృత జీవ శక్తి’ అంటూ మొదలైనా ఏల్చూరి విశ్వాసం తిరుగులేనిది. ‘వొస్తున్నది ప్రజా శక్తి’ అంటూ సాగే ఈ నయాగరా గీతం, యుద్ధాన్ని నిలదీస్తుందిలా ,‘హత్యకు హారతులిచ్చే , అగ్నికి దాహం పెంచే చీకటి కాటుక దిద్దిన యుద్ధం’. వామ పక్ష శక్తుల విజయాన్ని విశ్వసనీయంగా ప్రకటిస్తుంది. ‘ఎగిరే ఎగిరే ఎర్రటి జెండా , కరకరలాడే కొడవలి పదునూ, లోహం వంచిన సమ్మెట పెట్టూ, వైప్లవ్యపు వైతాళికులై నినదించెను నిప్పుల గొంతుక!’. ఈ ఏల్చూరి గీతం , అదే కాలం లో వెలువడిన మఖ్దూం మొహియుద్దీన్ కవిత ,‘వస్తున్నది , వస్తున్నది సామ్యవాద మహా నౌక , యువకుల బలిదానాలను అందుకుంటూ వస్తున్నది’ ను బలంగా మన మనసుల్లో మెరిపిస్తుంది.

Bellamkonda ramadasu

‘నా గీతం’ అనే బెల్లం కొండ రామదాసు గీతం, అంతర్జాతీయ సంఘర్షణామయ ప్రపంచ గందరగోళం లో, ఒక ప్రజల చేతి ఆయుధం ‘ నా గీతం’ అంటూ బెల్లం కొండ దర్శించేది , బహురూపాలైన జన ప్రతిఘటనను. 1944 లో రాస్తున్నాడేమో, యూరప్ నగరాల బాంబు మోతలు తన కవితల్లో సాకారమౌతాయి. “గత సాంఘిక నరబలి నగరం పై బాంబులు దూకించిన నా గీతం”, అంటూ వర్గ రహిత సంఘ స్వర్గానికి పూల నిచ్చెనలు వేసిందట, నరహంతలకు చెరసాలలకు , ఊరి తీర్పులకు , నిరంకుశ నియంతలకు తల కొరువులు పెట్టిందట’ అని కవన వ్యాఖ్యానం చేస్తూ జీవితాన్ని విహంగం చేసిందట’ అని నయాగరా అంతా నవ మోహన విహంగం అవుతాడు ఈ కవి కుమారుడు.

ఉన్నవి తొమ్మిది కవితలే . రాసింది ముగ్గురే . అయినా ఇదొక ప్రయాణానికి పచ్చ జెండా. ప్రపంచ విప్లవ శక్తుల గుర్తింపు, దేశదేశాల రూపు రేఖలు మారి పోనున్న మహత్తర సందర్భాలు , వాటిలో అతలాకుతలమయే మానవుడి పాత్ర , ఇవన్నీ వీటిలో సముచితంగా , సమున్నతంగా ప్రస్తావితం కావడం , ఈ నవ కవితల నయా గరాకు కొత్త వడిని, వరవడినీ తెచ్చి పెట్టింది. అల్లూరి గురించి కుందుర్తి రాయగా , దండి ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొన్న 18 గర్వాల్ దళ నాయకుడు ‘ఠాకూర్ చంద్ర సింగ్ ‘ కు ప్రశంసగా తన గీతం అదే పేరుతో రాశారు ఏల్చూరి .

యుద్ధ కల్లోల దశాబ్దాలలో కవిత్వ రచనా చేస్తున్నా, తమ జీవన సౌకుమార్యతలను కోల్పోని ఈ ముగ్గురు నయాగరా త్రేతాగ్నులు (ఇది ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారి మాట ), ఈ సంపుటిని అనిశెట్టి సుబ్బారావు (మరొక ప్రముఖ తెలుగు అభ్యుదయ కవి), లక్ష్మిల వివాహ సందర్భంగా ‘అని-ల’ కు అంకితం ఇచ్చారు.

ఇంకా ముందుగా ప్రస్తావించబడ్డ ఎరన్స్ టాలర్, దేశాలు వేరైనా ఫ్రెంచ్ వారయినా ఫ్రెంచ్ వారూ జెర్మన్ వారూ సోదరులే అని చెప్పడం తో పాటు , ఆనాటి హిట్లర్ ఆధిపత్య దేశంలో హీరోలను, హీరోయిజాలను తిరస్కరిస్తూ, “అసలు ఉదాత్త నాయకులనే భావనే అన్నిటికన్నా అతి తెలివి తక్కువ ఆలోచన” అన్నందుకు ఏళ్ల తరబడి చెరసాలల్లో బతికాడు. జెర్మనీలోని ఫాసిజపు ముష్కర మూకలు, నాజీల స్నేహాన్ని నిలదీస్తూ , యూరప్ అంతా ఉపన్యాసాలు ఇచ్చాడు. 1939 లో ఒక హోటల్ గదిలో ఉరిపోసుకు చనిపోవడం వెనుక వివాదాస్పద కధనాలు వున్నాయి.

ఇలా డెబ్భైయ్యేళ్ళకు వచ్చిన ‘నయాగరా’ ఒక సంఘటనల సమాహారం. జాతీయంగా , అంతర్జాతీయంగా , ప్రాంతీయంగా 1940లకు అటూ , ఇత్తూ గల సామాజిక పరిణామాలకు దర్పణంగా నిలుస్తూ దార్శనిక సంపన్నతను నిండుగా కలిగున్న మైలు రాయి ఈ కవిత్వ సంపుటి. ఏడు దశాబ్దాలు నిండిన ‘నయాగరా’, తెలుగు ఆధునిక కవిత్వం లో శిఖరమూ, జల పాతమూ కూడా .

రామతీర్థ

ramateertha

తెలంగాణా కేవలం ఒక “ఫుట్ నోట్” కాదు!

sangisetti- bharath bhushan photo
60 యేండ్ల ఎడతెగని పోరాట ఫలితం ‘తెలంగాణ’. వలసాంధ్ర బానిస సంకెళ్ళ నుంచి విముక్తి కోసం తెగించి కొట్లాడిన బిడ్డలందరికీ వందనాలు. తెలంగాణను దోసుకుందెవరో? దోపిడీ చేసిందెవరో? అభివృద్ధి నిరోధకులెవరో? అహంకారంతో మెలిగిందెవరో? ఆత్మగౌరవాన్ని దెబ్బతీసెందెవరో? అందరికీ తెలిసిన విషయమే!

ప్రత్యేక తెలంగాణ కల సాకారమైన ప్రస్తుత సందర్భంలో భవిష్యత్తెలంగాణను ఎలా నిర్మించుకోవాలో? భౌగోళిక తెలంగాణను ‘బంగారు తెలంగాణ’గా  ఎలా మార్చుకుందాం  అనే అంశంపై దృష్టిని సారించాలి. ఇన్నేండ్లు, ఇన్నాళ్లు మనకు హక్కుగా దక్కాల్సిన వాటాను ఆధిపత్యవాదులు ఎలా కాజేసిండ్రో చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడది ముగిసిన అధ్యాయం. ప్రస్తుతం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలి. అందుకోసం పునాదుల నుంచి వినిర్మాణం జరగాలి. సకల ఆధిపత్యాలను ధిక్కరించే ‘తెలంగాణ’ను నిర్మించుకోవాలి. సాహిత్యంలో సైతం ఈ ఆధిపత్యాన్ని ధిక్కరిద్దాం. కొత్త ప్రతీకలను నిర్మించుకుందాం. విస్మరణకు, వివక్షకు, వక్రీకరణకు గురైన విషయాల్ని ఇకనైనా వెలుగులోకి తెద్దాం. వాటికి చిత్రిక గడుదాం. ఈ వెలుగులో తెలంగాణ సాహిత్య/సామాజిక/సాంస్కృతిక చరిత్రను తిరగ రాద్దాం. ఇన్ని సంవత్సరాలు ఉటంకింపులకు, పాదసూచికలు, బ్రాకెట్ల మధ్యలో నిలిచిన అంశాల్ని చర్చకు పెట్టాల్సిన అవసరముంది.
ఆధిపత్యాల నిర్మూలనలో (వినిర్మాణ) తెలంగాణలోని బుద్ధిజీవులందరూ తమ వంతు కృషి చేసిండ్రు. టాంక్‌బండ్‌పై తమవి కాని విగ్రహాలను తొలగించడంలోనూ అంతే
బాధ్యతతో తెలంగాణ బిడ్డలు పాలుపంచుకుండ్రు. కోడి పందాల స్థానంలో తెలంగాణ బతుకమ్మలను ఆడినం. తెలంగాణ వంటలు వండుకున్నం, ఆటలు ఆడుకున్నం, పాటలు
పాడుకున్నం, ధూంధాంలు ఆదినం. ఇదంతా ఉద్యమంలో భాగంగా, ఎవరికి తోచిన విధంగా వారు, సీమాంధ్ర ఆధిపత్యాలను కూల్చడానికి, స్వీయ అస్తిత్వాన్ని చాటడానికి
ఉద్యమకారులు చేసిన పోరాట రూపాలు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో పనిచేయడం కుదరదు. అందుకే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణవాదులు
చేసిన మంచిపనులన్నింటిని జూన్‌ రెండు నుంచి ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీలు, అకాడెమీలు, సంస్థలు,
గ్రూపులు, వ్యక్తులు తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాల్ని చిరస్మరణీయంగా తీర్చి దిద్దాలి. చరిత్రలో నిలబెట్టాలి.

vaikuntam-16x12in
గత అరవైయేండ్లుగా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ‘పద్మ’ అవార్డులన్నీ సీమాంధ్ర వందిమాగధులకే ఎక్కువగా దక్కాయి. వారు మాత్రమే సాహిత్యకారులు,
వారు మాత్రమే సకల కళా పారంగతులుగా వెలిగి పోయారు. 60 యేండ్ల పాటు తెలంగాణ బతుకుల్ని చిత్రాలుగా మలిచిన సిద్దిపేట కాపు రాజయ్య, కొండపల్లి
శేషగిరిరావు, పి.టి.రెడ్డి, ప్రపంచం గొడవను ‘నా గొడవ’గా చేసిన కాళోజి నారాయణరావు, సంగీత, సాహిత్య రంగాల్లో తెలంగాణ ప్రజ్ఞను ప్రపంచ వ్యాప్తం
జేసిన సామల సదాశివ, పాండవ కళాకారిణి తీజ్‌రీ భాయికి ఏమాత్రం తీసిపోని చిందు ఎల్లమ్మ, తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ,
తెలంగాణ సిద్ధాంత కర్త కొత్తపల్లి జయశంకర్‌ సార్‌, తెలంగాణ భాషకు పట్టం కట్టిన పాకాల యశోదారెడ్డి, జానపదాల్ని జ్ఞానపదులకు తెలియజెప్పిన
బిరుదురాజు రామరాజు, బహుభాషా కోవిదుడు, రాజకీయ పండితుడు పి.వి.నరసింహారావు, తెలుగు`ఉర్దూ భాషల వారధి హీరాలాల్‌ మోరియా, తెలంగాణ
ప్రతిభను, సాహిత్యాన్ని, గౌరవాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన పరిశోధకులు గడియారం రామకృష్ణశర్మ, బి.ఎన్‌.శాస్త్రి, 1969 ఉద్యమాన్ని చట్టసభల్లోనూ,
బహిరంగ సభల్లోనూ నడిపించిన ధీర వనితలు టి.ఎన్‌.సదాలక్ష్మి, ఈశ్వరీభాయి, సాయుధ పోరాటంలో సమరం జేసిన భీమిరెడ్డి నరసింహారెడ్డి, బొమ్మగాని
ధర్మభిక్షం, నల్లా నరసింహులు, సాయుధ పోరాట కాలం నుంచి కిరణ్‌కుమార్‌ రెడ్డి కాలం వరకు నిరంతర ప్రతిపక్షంగా నిలిచిన బండ్రు నరసింహులు లాంటి
ఎందరో మహానుభావులకు న్యాయంగా దక్కాల్సిన గౌరవం దక్కలేదు.

తెలంగాణ ఉద్యమ కాలంలో చనిపోయిన వీరి కీర్తి, ఘనత అందరికీ తెలియలేదు. తెలంగాణ ఉద్యమ సందర్బంలో చనిపోయిన వారికే ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందంటే ఇక
అంతకుముందు చనిపోయిన వారికీ, ప్రస్తుతం బతికున్న వారికి కూడా ఎలాంటి గుర్తింపు దక్కలేదు. భారత ప్రభుత్వం తరపున ఇచ్చే పద్మ అవార్డుల్లో ఒక్క
కాళోజి నారాయణరావుని మినహాయిస్తే మిగతా ఎవరికీ దక్కలేదు. ఇక్కడ పేర్నొన్న అందరూ ‘పద్మ’అవార్డులకు అర్హులు. రేపటి తెలంగాణలో ఇలాంటి అన్యాయం
జరక్కుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇక్కడి భూమి పుత్రులకు న్యాయంగా దక్కాల్సిన గౌరవానికి ఎక్కడా భంగం కలుగకుండా చూడాలి.
1990లకు ముందే దాటుకున్న తరానికి కూడా భవిష్యత్తులో గౌరవం దక్కాలి. తెలంగాణ సాహిత్యంలో ‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి, ఉద్యమాలకు
ఊపిరులూదిన రావి నారాయణరెడ్డి, గ్రంథాలయోద్యమానికి పునాదులు వేసిన రాజా నాయని వెంకటరంగారావు, సురవరం ప్రతాపరెడ్డి, గుంటక నరసయ్య పంతులు, సంగెం
లక్ష్మీభాయి, బూర్గుల రామకృష్ణారావు, కవిరాజమూర్తి, కొండా వెంకటరంగారెడ్డి, అరిగె రామస్వామి, మాసుమా బేగం, మహేంద్రనాథ్‌, మర్రి
చెన్నారెడ్డి, మల్లికార్జున్‌, జయసూర్య, మెల్కోటే, కోదాటి రాజమల్లు, సుద్దాల హనుమంతు లాంటి సాహిత్య సామాజిక రంగాల్లో పనిచేసిన వేలాది మంది
ఇవ్వాళ ‘వాళ్లెవ్వరు?’ అనే ప్రశ్నను ఎదుర్కొంటున్నారు. వారు చేసిన పోరాటాల గురించి కూడా నేటి తరానికి తెలియకుండా పోయింది.

 

తెలంగాణపై పోలీస్‌యాక్షన్‌ నాటి గురించి చెప్పుకుంటేనే ఇంత చరిత్ర ఉంది. వీరి కన్నా ముందు సామాజికోద్యమాలు నడిపిన భాగ్యరెడ్డి వర్మతో పాటుగా మత
సహనానికి చిహ్నం మహబూబ్‌ అలీఖాన్‌, బందగీ, బండి యాదగిరి, షోయెబుల్లాఖాన్‌, తుర్రెబాజ్‌ఖాన్‌, యాదగిరి,  లాంటి ఎంతో మంది తెలంగాణ ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేసిండ్రు. వ్యక్తులుగా వీరికి విగ్రహాలు, భవనాలకు పేర్లు, పార్కులు, స్టేడియాలకు పేర్లు పెట్టినంత మాత్రాన పంచాయితీ వొడువదు.  ఇన్నేండ్లుగా ప్రజా
ఉద్యమాల్లో సేవ, త్యాగం లక్ష్యంతో సర్వం అర్పించి పోరాటం చేసిన భూమిపుత్రులను ప్రతి యేటా జయంతి, వర్ధంతుల్లో స్మరించుకోవాలి. త్యాగపురుషుల జీవితాలను తెలంగాణ పుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలి. సమ్మక్క, సారలమ్మల పోరాటం, సర్వాయి పాపన్న విజయ బావుటా, తుర్రెబాజ్‌ఖాన్‌ తిరుగుబాటు, గ్రంథాలయోద్యమం, ఆంధ్రమహాసభ, పత్రికోద్యమాలు, సాయుధ పోరాటం, హైదరాబాద్‌పై పోలీసుచర్య, ఆంధ్రప్రదేశ్‌ పీడ, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, నక్సలైట్‌ పోరు, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచిన వైనం, మలిదశ ప్రత్యేక తెలంగాణ పోరాటం, టీఆర్‌ఎస్‌ ఉద్యమం అన్నీ రేపటి చరిత్ర పుస్తకాల్లో సముచిత రీతిలో రికార్డు కావాలి.
మనం బోనం, బొట్టు, బతుకమ్మ, దసర పండుగ, హోళి, నోములు, వ్రతాలు, పీర్ల పండుగ, సాంస్కృతిక పయనం అన్నీ తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో చేసుకునే
పండుగలుగా ఆదరించబడాలి. సమ్మక్క సారలమ్మ జాతరలతో పాటు, నాగోబ జాతర, మహాంకాళి, మన్నెంకొండ, కురుమూర్తి, రంగాపూర్‌ ఉర్సు, కొమురెల్లి మల్లన్న,
ఏడుపాయల దుర్గమ్మ, బడాపహాడ్‌ ఉర్సు, లింగమంతుల, సిరసనగండ్ల జాతరలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించాలి. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన
చర్యలు. ఇన్నేండ్లు సీమాంధ్ర ఆధిపత్యం మూలంగా స్మరణకు, గౌరవానికి నోచుకోకుండా పోయిన ఉత్సవాల్ని మనమే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. గత 25
యేండ్లుగా తెలంగాణ వాదులు తమ ఉద్యమాలను ఎందుకోసం  చేశారో ఆ కల నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలి.
ఇక విశ్వవిద్యాలయాల కొస్తే సాహిత్య, సామాజిక రంగాల్లో విస్తృతమైన పరిశోదనలు జరపాలి. మన ఔన్నత్యానికి చిత్రిక గట్టాలి. 1956కు ముందు వచ్చిన
ప్రతి రచనను అచ్చులోకి తీసుకు రావాలి. అకాడెమీలు ఈ రంగంలో ప్రధాన పాత్ర వహించాలి. అముద్రితంగా ఉన్న తాళపత్రాలను సేకరించి వాటిని ప్రచురించాలి.
గతంలో ప్రచురించబడ్డప్పటికీ ఇప్పుడు అందుబాటులో లేని రచనలను పునర్ముద్రించాలి. అలనాటి తెలంగాణ సాహితీవేత్తల జీవితం, సాహిత్యం రెండిరటిపై విశేషమైన పరిశోధనలు జరిపించాలి. వీటి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలి. ఒక్కోకవి/రచయితకు సంబంధించిన రచనలన్నింటిని సమగ్ర సంకలనాలుగా వెలుగులోకి తేవాలి. రచయితలు, రాజకీయ నాయకులు, ప్రసిద్ధుల జీవిత చరిత్రలను/ ఆత్మకథలను కూడా అచ్చేయాలి. తెలంగాణ పెయింటర్ల జీవితాలు వారి పెయింటింగ్స్‌ రెండూ అచ్చవ్వాలి.
గుణాఢ్యుడు దగ్గరి నుంచి ఈనాటి వరకు తెలంగాణలో పుట్టిన ప్రతి ప్రసిద్ధ వ్యక్తి సమాచారాన్ని ‘జీవిత సర్వస్వం’ రూపంలో రికార్డు చేయాల్సిన అవసరముంది. ఇప్పటికే ఇంగ్లీషులో డిక్షనరీ ఆఫ్‌ నేషనల్‌ బయోగ్రఫీ అని ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తుల జీవిత  చరిత్రలను ప్రతి యేటా రికార్డు చేస్తున్నారు. ఆ మాదిరిలో తెలంగాణ వారి జీవిత చరిత్రలను కూడా చరిత్ర
పుటల్లోకి ఎక్కించాలి. దీనికి తెలుగు విశ్వవిద్యాలయం వారికి పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో పది జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దాంతో మొత్తం జిల్లాల సంఖ్య 20 కానుంది. ఈ ఇరవై జిల్లాల గెజిటీర్లను/ జిల్లా సర్వస్వాలను కూడా ముద్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది.
తెలంగాణలోని వ్యక్తుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించే విధంగా అవార్డులను ప్రముఖ తెలంగాణ వ్యక్తుల పేరిట నెలకొల్పాలి. లలితకళలు, ఫోటోగ్రఫీ, జానపదాలు, సాహిత్యం, సాంస్కృతికం ఇలా అన్ని రంగాల్లోని ప్రతిభావంతుల్ని గుర్తించి ప్రోత్సహించాలి. అవసరమైతే వారికి మెరుగైన శిక్షణ ఇప్పించాలి. నిజాం జమానాలో డాక్టర్‌ మల్లన్న, రూపాబాయి ఫర్దూంజీ లాంటి డాక్టర్లను విదేశాలకు పంపించి అక్కడ విద్యాభ్యాసం చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. డాక్టర్‌ మల్లన్న అనస్తీషీయాలో నోబుల్‌ ప్రయిజ్‌ గెలుచుకున్న జర్మన్‌ డాక్టర్‌ దగ్గర పనిచేశారు. ఆయనకు ఆ ప్రయిజ్‌లు రావడంలో ఈయన పాత్ర ప్రధానమైంది. భవిష్యత్‌లో కూడా ఈ పరంపర కొనసాగాలి. రేపటి బంగారు తెలంగాణలో ఇన్నేండ్లుగా విస్మరణకు గురైన శ్రేణులకు సరయిన గుర్తింపు దక్కాలి. వారి ప్రతిభకు ప్రోత్సాహమూ ఉండాలి.
ఎక్కడ కూడా ఆధిపత్య పోకడలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు / గౌరవం దక్కేలా ప్రభుత్వం వ్యవహరించాలి. ఇవన్నీ వాస్తవ రూపం దాల్చాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వ్యవహరించాలి.
తెలంగాణ కళలకు కాణాచి. నిన్నటి వరకు ‘ఎవరెస్టు’ అనే పేరు హైదరాబాద్‌తో సంబంధమున్న ఒక సర్వేయర్‌గానే తెలుసు. కాని ఇవ్వాళ తెలంగాణ పిల్లలు ఆ పేరిట ఉన్న శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ వ్యాప్తంగా మన్ననలందుకుంటున్నారు. భవిష్యత్‌లో సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణ పేరు కూడా ‘ఎవరెస్టు’లా నిలిచేందుకు ఆ యా రంగాల్లో ప్రవేశం, తెలంగాణపై అమితమైన ప్రేమ ఉన్న కె.చంద్రశేఖరరావు పై కూడా ఇక్కడి ప్రజలకు అపరిమితమైన ఆకాంక్షలున్నాయి. వీటన్నింటిని కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీరుస్తాడనే విశ్వాసం కూడా ఉంది. తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేలా, కేసీఆర్‌పై ఉన్న నమ్మకం ఇనుమడిరచేలా కొత్త రాష్ట్రం అన్ని రంగాల్లో
ముందడుగేయాలి.

– సంగిశెట్టి శ్రీనివాస్‌

సంప్రదాయపు ‘వీటో పవర్’-కన్యాత్వ చర్చ

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

రాజుగారి దేవతావస్త్రాల కథ చాలామందికి తెలిసే ఉంటుంది. నాకు ఆ కథ పూర్తిగా గుర్తులేదు కానీ, గుర్తున్నంతవరకు ఆ కథ సారాంశం ఇలా ఉంటుంది:

ఒక నేత కార్మికుడు దేవతావస్త్రాలను నేస్తానని రాజుగారికి చెప్పాడు. నమ్మిన రాజుగారు అతనికి గడువు ఇచ్చాడు. గడువు ముగిసిన తర్వాత నేతకార్మికుడు రాజుగారిని దర్శించుకున్నాడు. ‘ప్రభూ…ఇవిగో దేవతావస్త్రాలు’ అంటూ ఒట్టి చేతులు చూపించాడు. ‘ఏవీ? నాకు కనిపించడం లేదే’ అన్నాడు రాజు. ‘ఇవి దేవతావస్త్రాలు కదా, మామూలు కళ్ళకు కనిపించవు’ అన్నాడు నేతకార్మికుడు. ‘ఓహో, అలాగా, అయితే వాటిని నాకు ధరింపజేయి’ అని ఆజ్ఞాపించాడు రాజు. ‘చిత్తం మహారాజా’ అంటూ నేత కార్మికుడు రాజుగారికి దేవతావస్త్రాలను ధరింపజేసినట్టు అభినయించాడు. ‘ఇదిగో ఇప్పుడు మీరు దేవతావస్త్రాలను ధరించారు’ అన్నాడు. అప్పుడు రాజు,‘దేవతావస్త్రాలు ఎలా ఉన్నాయి?’ అని తన పరివారాన్ని అడిగాడు. దేవతావస్త్రాలు కనిపించడం లేదన్నా, బాగులేవన్నా రాజు తలతీసేస్తాడని వాళ్ళకు తెలుసు. ‘అద్భుతం ప్రభూ, వీటిని ధరించిన తర్వాత మీ అందం ద్విగుణీకృతమైంది’ అని పరివారం ముక్తకంఠంతో అన్నారు.

ఈ కథ ఎందుకంటే,‘కన్యాత్వా’నికి, దేవతావస్త్రాలకు పోలిక ఉందని చెప్పడానికే.

కన్యాత్వం వివాహానికి ముందు ఉండి, తర్వాత అంతరించే ఒక శారీరక అవస్థ లేదా ప్రకృతి చేసిన ఏర్పాటు కాదనుకుంటే, నేతకార్మికుడు దేవతావస్త్రాలను సృష్టించినట్టే సంప్రదాయం కన్యాత్వం అనే ఒక ఊహను కల్పించుకుందన్నమాట. లెక్కల్లో కూడా చూడండి, ఒక ‘ఎక్స్’ను కల్పించుకుని దాని మీద లెక్క చేస్తారు. ఇంకో పోలిక చెప్పాలంటే, సాలె పురుగు తన కడుపులో ఉన్న ద్రవంతోనే దారాలు సృష్టించుకుని వాటితో గూడు అల్లుకుని అందులో ఉంటుంది. కన్యాత్వం కూడా అలాంటిదే అనుకుంటే, కన్యాత్వం అనే ఊహను సృష్టించిన సంప్రదాయమే, ఆ ఊహను వాస్తవంగా తనే నమ్మి, ఇతరులను నమ్మించడం ప్రారంభించిందన్న మాట.

అదే జరిగిందనుకున్నప్పుడు, అది తప్పా, ఒప్పా; అందులో మోసం ఉందా అన్న చర్చకే పరిమితమైతే అంతకన్నా పొరపాటు ఉండదు. తటస్థంగా చెప్పుకోవలసిన విషయాలలో ఇది ఒకటి. కన్యాత్వం అనే ఊహను సృష్టించుకోవలసిన అవసరం సంప్రదాయానికి నిజంగానే కలిగింది. ఎందుకంటే, ఒక పాతవ్యవస్థ స్థానంలో ఒక కొత్త వ్యవస్థను అది సృష్టిస్తోంది. అది అప్పటికి పురోగామి వ్యవస్థ కూడా కావచ్చు.

పాతవ్యవస్థనుంచి కొత్త వ్యవస్థను సృష్టించే ఆ ప్రయత్నం లేదా ప్రయోగంలో మరో విశేషం ఉంది. మహాభారతం లాంటి ఇతిహాసాలు ఆ ప్రయోగాన్ని బహిరంగ ప్రయోగంగా నిర్వహించాయి. అంటే, అది పాఠకుల కళ్ళముందే జరుగుతోందన్న మాట. ఇది ఎలాంటిదంటే, ఒక పుస్తకం, లేదా పత్రిక తాలూకు అంతిమ ఉత్పత్తి(endproduct)ని మాత్రమే పాఠకులకు ఇవ్వడం కాకుండా, దాని ఎడిటింగ్ దశతో సహా ఇవ్వడం లాంటిది. ఇంకో పోలిక చెబితే, ఇతిహాసాలు ఆధారంగా లేబరేటరీలో తను చేస్తున్న ఆ ప్రయోగాన్ని ప్రయోక్తే నేటి టీవీ ప్రత్యక్ష ప్రసార పద్ధతిలో మనకు చూపిస్తున్నాడు. ఆవిధంగా ఇతిహాస కథలలో కేవలం కథలు మాత్రమే కాక, పాతవ్యవస్థనుంచి కొత్త వ్యవస్థను సృష్టించడానికి కథకుడు చేసిన ప్రయోగం లేదా పెనుగులాట కూడా భాగం.

మహాభారత కథకుడు ఎదుర్కొన్న అనేక ధర్మ సంకటాలలో ప్రస్తుత సందర్భానికి సంబంధించినవి రెండున్నాయి: మొదటిది, కన్యాగర్భం; రెండవది, ద్రౌపది అయిదుగురిని వివాహమాడడం. ఇవి రెండూ పాత వ్యవస్థకు చెందినవనుకుంటే, కొత్త వ్యవస్థలో ఇవి చాలా అసంబద్ధంగా కనిపిస్తాయి. ఈ పరిస్థితిలో వీటిని కొత్త వ్యవస్థకు అన్వయించడం ఎలా? కొత్తవ్యవస్థ వైపు నిలబడిన కథకుడు ఎదుర్కొన్న ప్రశ్నఇదే. దాంతో అతను కొన్ని ఉపాయాలను ఆశ్రయించాడు. పాత వ్యవస్థకు చెంది అసంబద్ధంగా కనిపించే అంశాల స్థానంలో వరాలు, శాపాలు, మహిమలు వగైరాలను ప్రవేశపెట్టి, తద్వారా వాటిపై చర్చను నిషేధించే ప్రయత్నం చేశాడు. అందుకు పురాణ, ఇతిహాసాలకు సహజంగా ఉండే మాంత్రికశైలి అతనికి ఉపయోగపడింది. అంటే, పాత అంశాలను కొత్త వ్యవస్థకు నప్పించే ప్రయత్నంలో రెండింటి మధ్యా వరాలు, శాపాల రూపంలో అతుకులు కల్పించాడన్న మాట. అయితే గతంలో కూడా పలు సందర్భాలలో చెప్పుకున్నట్టు కథకుడు అలా అతుకు పెట్టే పనిని చాలా చోట్ల అంత సమర్థంగా చేయలేకపోయాడు. పాతవ్యవస్థ తాలూకు అవశేషాలను మనం ఊహించడానికి తగిన జాగాలను విడిచిపెట్టాడు.

అదిగో, ఆ జాగాలలోనే సంప్రదాయవాదులకు, ఇతరులకు మధ్య వాగ్యుద్ధం. సంప్రదాయేతరులు ఆ జాగాలలో నిలబడి యుద్ధం సాగిస్తే, సంప్రదాయవాదులు సాంప్రదాయికపాఠాన్నే-అందులోని మహిమలు, మంత్రాలు, వరాలు, శాపాలు వగైరాలతో సహా- మరింత ధాటిగా నొక్కి చెప్పడానికి ప్రయత్నించారు. పెండ్యాల, వారణాసి వార్ల వాదంలో ఇది మనకు కనిపిస్తుంది.

‘కన్యాగర్భం’ విషయానికే వస్తే, పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రిగారి వాదం ఇలా సాగుతుంది:

“నాడు కన్యకలు బిడ్డల గనుట దోషము కాదని యాశ్రమవాసపర్వములోని కుంతీ వ్యాసుల సంభాషణము చెప్పుచున్నది”

“వ్యాసుని తల్లి యగు సత్యవతి కూడ వ్యాసుని గని కన్యాభావము నొందుట గమనింపదగిన విషయము.”

“మామ యగు వ్యాసునితో గుంతి తన చిన్నతనపుజేష్టను వెల్లడించినటులు వ్యాసుని తల్లి సత్యవతి సవతి కొడుకగు భీష్ముని కడ తన చిన్నతనపు చేష్ట నిట్లు సంతోషపూర్వకముగానే చెప్పినది”

“వ్యాసభీష్ముల వంటి మహానుభావులట్టి యధర్మమును ధర్మముగా నంగీకరించుట కానాటి దేశకాల పరిస్థితులే కారణమై యున్నవా? లేక వ్యాసభీష్ములు కూడ ధర్మవైరుధ్యమునకు ఇష్టపడి ఉండిరా? ఆలోచింప నాటి పరిస్థితులే అట్టివి కావచ్చునని తోచెడిని”

కన్యలు బిడ్డల్ని కనడం అప్పట్లో దోషం కాకపోవచ్చని, నాటి దేశకాలపరిస్థితులే అందుకు కారణం కావచ్చునని పెండ్యాలవారు అంటున్నారు. అలా అనడంలో సంప్రదాయ పాఠాన్ని ఆధారం చేసుకుంటూనే, ఆ పాఠం నుంచి పక్కకు జరిగి స్వతంత్ర ఊహ చేస్తున్నారు. సంప్రదాయం అంగీకరించని దేశకాలపరిస్థితులు, హేతుత్వం అనే అదనపు పరికరాలను తన పరిశీలనకు వాడుకుంటున్నారు.

పూర్తిగా సంప్రదాయపక్షం వహించిన వారణాసివారి దృష్టిలో ‘ఒకప్పుడు కన్యాగర్భం దోషం కాదనీ, తర్వాత దోషంగా మారిందనీ’ అంటూ ఊహ చేయడం, కాలాల మధ్య తేడా తీసుకురావడం చాలా తీవ్రమైన విషయం. అలా చేసినప్పుడు మొత్తం సంప్రదాయ వ్యూహమే విఫలమైపోతుంది. కనుక కన్యలు సంతానం కనడం ఎప్పుడైనా దోషమే నని చెప్పడానికి ఆయన ప్రయత్నించారు.

 

మరి కుంతి, సత్యవతుల సంగతేమిటని అడిగితే, దానికి సంప్రదాయ పాఠంలోనే సమాధానం ఉంది. అదేమిటంటే, సాధారణులకు వర్తించే నియమం సత్యవతికి, కుంతికి వర్తించదు. వారు కన్యలుగా ఉండి సంతానం కనడం వెనుక ప్రత్యేక కారణముంది. వారిద్దరి వెనుక పరాశరుడు, దూర్వాసుడు అనే ఇద్దరు మహర్షులు; సూర్యుడు అనే దేవుడు ఉన్నారు. వారి వరాలు, మహిమలు ఉన్నాయి. ఆవిధంగా అవి దైవనిర్ణయాలు కూడా. సత్యవతి విషయంలో ఇంకో అదనపు విశేషం కూడా ఉంది. ఆమె కన్యాగర్భంలో జన్మించినది సాధారణవ్యక్తి కాదు, వ్యాసుడి వంటి మహర్షి. కనుక అది పూర్తిగా దైవ సంకల్పమే. వరాలు, మహిమలు, దైవసంకల్పాలు వగైరాలను అంగీకరిస్తే ఇంతవరకు సంప్రదాయ పాఠం పకడ్బందీగానే ఉంది. వారణాసి వారు చేసింది ఆ పాఠాన్ని మరోసారి నొక్కి చెప్పడమే.

8385917_f520

విషయాంతరం అనుకోకపోతే నాకిక్కడ ఒక విచిత్రం కనిపించింది. అదేమిటంటే, తెలుగు భారతం ప్రకారం సత్యవతికి వ్యాసుడు, కుంతికి కర్ణుడు ‘సద్యోగర్భం’లోనే జన్మించారు. అలాంటి ఒకే విధమైన విశేషజన్మ రీత్యా వ్యాసుడు, కర్ణుడు ఒకే విధమైన మహా పురుషులు కావాలి. పోనీ సద్యోగర్భాన్ని పరిహరించి చూసినా ఇద్దరి పుట్టుక వెనుక పరాశరుడు, దూర్వాసుడు అనే ఇద్దరు మహర్షులు; కర్ణుని పుట్టుక వెనుక అదనంగా సూర్యుడు అనే దేవుడు ఉన్నారు కనుక కర్ణుడు వ్యాసునితో సమానుడు, బహుశా అంతకంటే విశిష్టుడు కావాలి. కానీ కాలేదు. అతడు మహాభారతంలో మొదటినుంచి హీనజన్ముడిగానే గుర్తింపు పొందాడు. దుష్టచతుష్టయంలో ఒకడయ్యాడు. అర్జునుడితో జరిగిన అన్ని యుద్ధాలలో ఓడిపోయాడు. అనేక విధాలుగా అతడు శాపగ్రస్తుడు కూడా. మరి వ్యాసుడు అలా కావడానికి, కర్ణుడు ఇలా కావడానికి సంప్రదాయ భాష్యం ఎలాంటి వివరణ ఇచ్చిందో, లేక ఇస్తుందో తెలియదు.

వారణాసివారి ఖండనకు మళ్ళీ వస్తే, పెండ్యాలవారు ఉదహరించిన సంస్కృత భారతం, ఆశ్రమవాసపర్వం లోని కుంతి, వ్యాసుల సంభాషణను యథాతథంగా ఆయన ఎత్తిరాస్తూ; అప్పుడే కాదు, ఎప్పుడూ కన్యాగర్భం దోషమే నని నొక్కి చెప్పారు. ఆయన ప్రకారం, తను కన్యాదశలో ఉండి కూడా మూర్ఖంగా దూర్వాసుని మంత్రం పఠించి సూర్యుని రప్పించినందుకు, పితృమర్యాదను కాపాడడానికి రహస్యంగా కొడుకును కని, నీళ్ళలో విడిచిపెట్టవలసి వచ్చినందుకు కుంతి వ్యాసుని దగ్గర బాధపడింది. ‘నిజముగా నా సూర్యదేవుని కటాక్షమున మరల నాకు కన్యాత్వము ప్రాప్తించినది. దుర్వాసోమహర్షి చెప్పినట్లే జరిగినది. నేను మూఢురాలనై పుత్రు నపేక్షించితిని. పుణ్యమో పాపమో నీ యొద్ద వివరింపబడిన ఈ విషయము నన్ను పీడించు చున్నది.’అని ఈ సందర్భంలో కుంతి అంటుంది.

అప్పుడు వ్యాసుడు ఇలా అంటాడు: ‘నీవెట్లు చెప్పితివో అట్లది జరగవలసిన విధియై యున్నది (నీకు సూర్యాంశమున సూతుడు గూఢముగా బుట్టి దూరమైపోయి దుర్యోధనుని జేరి యుద్ధహేతువు కావలసిన విధి యట్లున్నది). నీ కపరాధము లేదు. నీవు కన్యకవై కదా అప్పుడుంటివి. అణిమాది సిద్ధులు కల దేవతలు శరీరముల నావేశింతురు. సంకల్పము చేతను, వాక్కు చేతను, దృష్టి చేతను, స్పర్శ చేతను, రతి చేతను ఐదు విధములుగా దేవతలు సంతతి నిచ్చుచుందురు. మనుష్యధర్మము దైవధర్మముచే దూషితము కాదు. కుంతీదేవీ! నీకు మనోవ్యధతో బని లేదు’.

దీనిపై వారణాసివారు వివరణ ఇస్తూ,‘వ్యాసభగవానుని మాటలలో గూడ దుర్వాసోమహర్షి యుపదేశము మొదలు సూర్యసంబంధ సుతోత్పత్తి, సుతపరిత్యాగాంతకృత్యములు విధివశమున జరిగినవి. ఆ ఘటన యంతయు నీకు కన్యాదశయందు అట్టి యిచ్ఛ లేనప్పుడు తటస్థించినది కనుకను దేవతలు సంకల్పాదులచే నైదు విధములుగా సంతతి నిచ్చువారు కనుక దేవధర్మముచే మనుష్యధర్మము దూషితము కాదు కనుకను నీ తప్పు లేదు అని యున్నది. ఈ కుంతీ సంభాషణములో కన్యకలు బిడ్డల గనుట దోషము కాదని యున్నదా? సూర్యానుగ్రహమున సుతుని గన్న కుంతీదేవికి అది దోషము కాదని యున్నదా?’ అంటారు.

సంప్రదాయపక్షం వహించిన వారణాసివారు ఇక్కడ విధి గురించి, దేవతలు అయిదు విధాలుగా సంతతి నివ్వడం గురించి వ్యాసుడు అన్న మాటల్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నారు. కన్యకలు బిడ్డల్ని కనడం దోషం కాదని ఈ సంభాషణ చెప్పడం లేదంటున్నారు. ఆయన ప్రకారం, కన్యకలు సంతానం కనడం ఎప్పుడైనా తప్పే. అయితే కుంతికి కానీ, సత్యవతికి కానీ ఆ నియమం వర్తించదు. ఎందుకంటే వారి వెనుక ఒక ‘విధి’ ఉంది. వారికి ‘దేవధర్మ’మే కానీ ‘మనుష్య ధర్మం’ వర్తించదు. ‘అయిదు విధాలుగా సంతానం ఇచ్చే దేవతల ద్వారా’ సంతానం పొందే ప్రత్యేక అర్హత వారికి ఉంది.

అయితే సాధారణ హేతుబుద్ధితో పరిశీలించినప్పుడు ఈ వాదం సమాధానపరచకపోగా మరిన్ని సందేహాలను సృష్టిస్తుంది. ఎలాగంటే, విధిని అనుసరించి ‘దేవధర్మం’ ప్రకారం కన్యగా సంతానం కన్న కుంతి; అలా సంతానం కన్నందుకు, పితృ మర్యాదను కాపాడడానికి ఆ సంతానాన్ని నీళ్ళలో విడిచిపెట్టవలసివచ్చినందుకు ‘మనుష్యధర్మం’ ప్రకారం బాధపడుతుంది. అది పుణ్యమో, పాపమో అన్న విచికిత్సకు లోనవుతుంది. విధికి, దైవ సంకల్పానికి తను ఒక సాధనం ఎందుకు కావలసివచ్చిందో, తనే ఎందుకు కావలసివచ్చిందో పాపం కుంతికి వ్యాసుడు చెబితే తప్ప తెలియదు. చెప్పిన తర్వాత కూడా తెలిసిందో లేదో తెలియదు. వాస్తవంగా జరిగింది ఏమిటంటే, కుంతి సాధనం అయింది విధికీ, దైవసంకల్పానికీ కాదు; కథకుడికి! దేవధర్మం, మనుష్యధర్మం అనే రెండు చక్రాలతో కథ అనే బండిని నడిపించడం కథకునికి అవసరం. ఎందుకంటే, అతను రెండు భిన్న వ్యవస్థల మధ్య అతుకు పెడుతున్నాడు!

అప్పటికీ-దేవధర్మం ఏమిటి, అది కొందరి విషయంలోనే మనుష్యధర్మాన్ని అతిక్రమించి ఆవహించడమేమిటి, దేవతలు అయిదు విధాలుగా సంతానం ఇవ్వడం ఏమిటి అనే సందేహాలు సాధారణ హేతుబుద్ధిని సలుపుతూనే ఉంటాయి. అప్పుడిక సంప్రదాయం ప్రయోగించే అంతిమ అస్త్రం: శాస్త్రమర్యాద! వారణాసివారు చివరికి ఆ అస్త్రాన్ని కూడా ఇలా ప్రయోగిస్తారు:

‘…సూర్యుడేమి? శరీరధారియై కుంతీదేవి యొద్దకు వచ్చి సంతానమిచ్చుట యేమి అనిపించినది కాబోలు. వీరికి శాస్త్రమర్యాద నొకింత వినిపింతము.

‘తాత్పర్యమేమనగా (దేవతాధికరణము-బ్రహ్మసూత్రము)-యోగశక్తులను బట్టి సూర్యాది దేవతలకు జ్యోతిర్మండలాది రూపములతో నుండుటకును, ఇష్టము వచ్చిన విగ్రహము ధరించుటకును గూడ సామర్థ్యము కలదు. కనుకనే…సూర్యుడు పురుషరూపము ధరించి కుంతీదేవిని బొందెనని ఇతిహాసమందును చెప్పబడినది…

మనకు ప్రత్యక్షము కాకున్నను పూర్వులకు ప్రత్యక్షమగుటచే దేవతావిగ్రహాదికము ప్రత్యక్షసిద్ధము కూడ నగుచున్నది. కనుకనే వేదవ్యాసాదులు దేవతలతో ప్రత్యక్షముగా వ్యవహరించిరని చెప్పబడినది. ఇప్పటివారికి వలెనే పూర్వులకు కూడ దేవతలతో వ్యవహరించెడి సామర్థ్యము లేదని యెవ్వడనునో అతడు జగత్తునందు విచిత్రతయే లేదనువాడగును…ఇప్పటి వలెనే కాలాంతరమందు గూడ వర్ణాశ్రమధర్మము లవ్యవస్థితములే యనును. దానివలన వ్యవస్థావిధాయకమైన శాస్త్రము నిరర్థకమగును…

పరిశీలింపగా మన శాస్త్రమర్యాద యిట్లున్నది. ప్రతివాది ప్రసంగము లట్లున్నవి.

వారణాసివారి ఈ మాటలు సంప్రదాయ మర్మాన్ని కూడా వెల్లడిస్తున్నాయి.అదేమిటంటే, శాస్త్రం ఒక వ్యవస్థను, అంటే కట్టడిని చేస్తుంది. వర్ణాశ్రమధర్మాలు (ప్రస్తుత సందర్భంలో కన్యాత్వం మొదలైనవి) ఆ కట్టడిలో భాగాలే. శాస్త్రవిరుద్ధమైన స్వతంత్ర ఆలోచనలు చేస్తే వర్ణాశ్రమధర్మాలు (అలాగే కన్యాత్వం) ఒకప్పుడు లేవు, ఇప్పుడే ఉన్నాయనే విపరీతవాదానికి ఆస్కారం కలుగుతుంది. అది తప్పు. అంటే, అలాంటి కట్టడులు ఎప్పుడూ ఉన్నాయని ఈ మాటల్లోని సారాంశం. పాత వ్యవస్థ తాలూకు అవశేషాలను తుడిచి పెట్టి కొత్త వ్యవస్థను నెలకొల్పడం సంప్రదాయానికి ఎంత పెద్ద పరీక్ష అయిందో, ఆ సవాలును అది ఎలా అధిగమించిందో పరోక్షంగా ఈ మాటలు సూచిస్తూ ఉండచ్చు.

ఇంకో సందర్భంలో కూడా వారణాసివారు ఇలా అంటారు:

‘కర్ణోత్పత్తిని గూర్చి కన్యాదశలోని తన వృత్తాంతమును కుంతీదేవి వ్యాసమహర్షి తోడను, వ్యాసోత్పత్తిని గూర్చి కన్యాదశలోని తన వృత్తాంతమును సత్యవతీదేవి భీష్ముని తోడను చెప్పినపుడు ఆ మహానుభావులు అట్టి యధర్మమును ధర్మముగా నంగీకరించిరట! అది యధర్మమే యైన యెడల వారు ధర్మముగా నంగీకరింపరు. వారట్లు యంగీకరించినపుడు అది యధర్మము కాదు. కనుక నధర్మమును ధర్మముగా నంగీకరించి రను మాట విరుద్ధము. పూర్వోక్తగ్రంథ సందర్భమేమి? యోగశక్తి తపోమహిమలచే జరిగిన యా లోకోత్తరఘటన యేమి? ఆ అక్షతయోనిత్వరూప కన్యాత్వ వరప్రాప్తి యేమి? భీష్మవేదవ్యాసులు దానిని ధర్మముగా నంగీకరించుట యేమి? దానిని ఈ మ. భా. చ. కారులు అధర్మ మనుట యేమి? ధర్మాధర్మ నిర్ణాయకు డా వ్యాసమునియా? యీ వ్యత్యాసమూర్తియా? “తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ” అనుటను బట్టి అకార్య మేదియో కార్య మేదియో తెలిసి కొనుటకు శాస్త్రమే ప్రమాణము కాని మనుష్యబుద్ధి కాదు. అట్టి స్థితిలో శాస్త్రకర్త యగు వ్యాసభగవానుడు, శాస్త్రనిష్ణాతుడగు భీష్ముడు చెప్పినదే నిజము. “వారట్లు చెప్పుటకు నాటి పరిస్థితులే కారణము” అనుట తప్పు. పరిస్థితులను బట్టి అధర్మమెపుడును ధర్మము కానేరదు. ధర్మాధర్మ నిర్ణాయకము శాస్త్రము కనుక నెట్టి పరిస్థితులలో నైనను శాస్త్రీయమే ధర్మము. అశాస్త్రీయ మధర్మమే.

ప్రతివాదులు ఆ కుంతీ సత్యవతీ చరిత్రములలో రహస్యముగా బిడ్డలను గనుటను మాత్రమే గ్రహించిరి గాని ఆపై ముఖ్యమైన కన్యాత్వసిద్ధిని గ్రహింపలేదు. అదియే వారి హృదయ దోషము.

ఈవిధంగా మనుష్యబుద్ధిపై శాస్త్ర ప్రమాణం అనే అంకుశం బిగించిన తర్వాత ఇక మాట్లాడగలిగింది ఏమీ ఉండదు. అంతిమంగా సంప్రదాయం చెలాయించే ‘వీటో పవర్’ అది!

కొసమెరుపు ఏమిటంటే, శాస్త్రమే ప్రమాణమన్న వారణాసివారు కూడా కుంతి కన్యాగర్భాన్ని సమర్థించడానికి ‘మనుష్యబుద్ధి’తో ఒక విచిత్ర తార్కాన్ని ఆశ్రయించడం! కన్యగా ఉన్నప్పుడు సంతానం కనడంలో ఉన్న తప్పును గమనించకుండా బాల్య చాపల్యంతో(బాలభావేన) వ్యవహరించానని కుంతి అంది కనుక, అప్పటికామె బాలికే తప్ప యవ్వనవతి కాదని ఆయన అన్వయించారు. ఆవిధంగా ఆమెది కన్యాగర్భమే కాక, బాలికాగర్భం కూడా. పైగా కుంతికి అలాంటి కోరిక కూడా లేని స్థితిలో సూర్యుడి నిర్బంధంవల్ల అలా జరిగిందంటున్నారు. అంటే, అప్పటికి కుంతి రజస్వల కూడా కాలేదా అన్న సందేహం ఆయన సమర్థన వల్ల కలుగుతుంది. అదే ఆయన ఉద్దేశమైతే ఇక్కడ ప్రకృతి ధర్మం కూడా సంప్రదాయపు వీటో పవర్ ముందు తలవంచుతోందన్న మాట.

అంతిమంగా ఇంకొకటి గమనించాలి. పెండ్యాలవారు సంప్రదాయ పాఠాన్ని ఆధారం చేసుకుంటూనే సంప్రదాయ భాష్యం నుంచి పక్కకు జరిగి స్వతంత్ర ఊహలు చేస్తున్నారు. వారణాసివారు పూర్తిగా సంప్రదాయ పాఠాన్ని, భాష్యాన్ని ఆధారం చేసుకుంటున్నారు. అంటే, అందులో సంప్రదాయాన్ని నొక్కి చెప్పడమే తప్ప కొత్తదనం ఏమీ లేదన్న మాట. ఆవిధంగా వీరువురూ ఒకే విధమైన ఆధార భూమిక నుంచి మాట్లాడడం లేదు. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే ఇద్దరి వాదాలూ రైలు పట్టాలవంటివయ్యాయి. వాటి మధ్య కలయిక ఎప్పటికీ సాధ్యం కాదు.

కన్యాత్వ చర్చ మరికొంత వచ్చే వారం…

 

 

ఆ ‘మాలపిల్ల’ మాదిరిగా మాటలు రాసేవారున్నారా ఇప్పుడు?

 

గుడిపాటి వెంకటాచలం తన రచనల ద్వారా సమాజంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. స్త్రీలోకంలోనైతే ఆయన విప్లవమే తెచ్చారు.
ఆయన రచనల అండగా తెలుగు సమాజంలోని స్త్రీలు ప్రశ్నించడం నేర్చుకున్నారు. సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం పోరాడారు. విజయాలు సాధించారు. చలం ప్రభావం పాజిటివ్‌గానైనా, నెగటివ్‌గానైనా పడని రచయిత ఒకప్పుడు లేడంటే అతిశయోక్తి కాదు. అలాంటి చలానికి నాటకీయ సన్నివేశాలు, కృతక సంభాషణలతో నిండివుండే సినిమాలంటే ఏవగింపు. మరి అదే చలం సినిమాకి పని చేయాల్సి వస్తే ఏం చేస్తాడు? సంభాషణలు రాయాల్సి వస్తే ఎలా రాస్తాడు?
కథల్లో కానీ, నవలల్లో కానీ చలం సృష్టించిన పాత్రలను చూస్తే, అవి మాట్లాడుకోవడం చూస్తే – కృతకంగా కాక సహజంగా ఉన్నట్లు కనిపిస్తాయి. వ్యావహారంలో మనుషులు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటున్నట్లే అనిపిస్తాయి. రచనల్లో గ్రాంథిక భాష రాజ్యం చేస్తున్న కాలంలో చలం భాష, చలం శైలి ఆకర్షణలో, మాయలో కొట్టుకుపోయారు జనం. పదాలతో, శైలితో అంతటి గారడీ చేసిన చలం 1938లో వచ్చిన ‘మాలపిల్ల’ సినిమా కథనీ, సంభాషణల్నీ రాసిన తీరు అద్వితీయం!
స్వాతంత్ర్యానికి తొమ్మిదేళ్ల ముందు వచ్చిన ‘మాలపిల్ల’ సినిమా తెలుగునాట పెను సంచలనమే కలిగించింది. బ్రాహ్మణాధిపత్యం పూర్తిగా చలామణీ అవుతున్న కాలంలో, అంటరానితనం తీవ్రంగా ఉన్న కాలంలో బ్రాహ్మణాధిపత్య సమాజాన్ని సవాలు చేస్తూ, అస్పృశ్యతను ధిక్కరిస్తూ, అణగారిన కులాలకు అండగా నిలుస్తూ ‘మాలపిల్ల’ అనే పేరుతో ఒక సినిమా రావడమంటే మాటలా! దర్శకుడు గూడవల్లి రామబ్రహ్మం సంకల్ప బలానికి చలం సునిశిత కలం తోడైతే వచ్చే మహోన్నత ఫలం ‘మాలపిల్ల’ కాకుండా మరొకటి ఎలా అవుతుంది!!
https://www.youtube.com/watch?annotation_id=annotation_3277241873&feature=iv&src_vid=4h26GRojjfY&v=v_dz61Nz8_8
మనం ఇప్పుడు ‘మాలపిల్ల’ కథ గురించి కాక, అందులోని సంభాషణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోబోతున్నాం. ఆ సినిమాకి ముందు వచ్చిన సినిమాల్లోని సంభాషణలకూ, ‘మాలపిల్ల’ సంభాషణలకూ పొంతననేది కనిపించదు. టాకీ యుగం ప్రారంభమైన కాలంలో అప్పటి నాటకాల భాషలోనే సినిమాల సంభాషణలు నడిచాయి. ఆ భాషను ‘మాలపిల్ల’ భాష సమూలంగా మార్చేసింది. నిజానికి ‘మాలపిల్ల’ తర్వాత వచ్చిన కొన్ని సాంఘిక సినిమాల సంభాషణలు పాత వాసనలోనే నడిచాయి. ఐతే అతి త్వరలోనే ‘మాలపిల్ల’ సంభాషణలకు లభించిన ఆదరణను రచయితలు అందుకోక తప్పలేదు. పాత్రోచితంగా, సందర్భోచితంగా ఆ చిత్రంలోని సంభాషణలను చలం నడిపించిన తీరు అనన్య సామాన్యం.
‘మాలపిల్ల’లో నీళ్లకోసం చెరువు వద్దకు వచ్చిన మాలలను బ్రాహ్మణుల నాయకత్వంలోని అగ్ర కులాల వాళ్లు అడ్డుకుంటారు. నీళ్లు తీసుకెళ్లడానికి వీల్లేదని కట్టడి చేస్తారు. అదే సమయంలో పెద్ద వర్షం మొదలవుతుంది. మాలలు తడుస్తూ సుందరరామశాస్త్రి ఇంటి ముందుకు వస్తారు. వారిలో నాగాయ్ అనే యువకుడు “బాపనోళ్లది ఎప్పుడూ తిని కూర్చునే ఖర్మ. మాలోళ్లది ఎప్పుడూ బువ్వలేక మలమలమాడే ఖర్మ.. గుళ్లో కూర్చుని సుఖంగా ప్రసాదాలు మింగమరిగిన దేవుడు మురికి మాలపల్లిలోకి వచ్చి మా కష్టాలు తీరుస్తాడా?” అంటాడు. ‘మాటల తూటాలు’ అంటే ఇవే కదా. అగ్ర వర్ణాలు – నిమ్న వర్ణాల మధ్య, ఉన్నోళ్లు – లేనోళ్ల మధ్య తేడాని రెండంటే రెండు ముక్కల్లో ఎంత శక్తిమంతంగా చెప్పాడు చలం! ఈ విషయంలో దేవుడినీ వదల్లేదు. దేవుడు కూడా పెద్ద కులాలవైపే ఉన్నాడని సూటిగా ఆ పాత్రతో చెప్పించాడు.
index
‘నేనున్నంత కాలం గ్రామంలో కుల ధర్మాలకు ఏమాత్రం విఘాతం రానివ్వన’ని శాస్త్రి బీష్మించినప్పుడు మాలల నాయకుడు మునెయ్య అంటాడు – “మీరు చెరువు కట్టేశారు. దాన్ని విడవండి. ధర్మయుద్ధం చెయ్యండి. అంతేకానీ మాకు నీళ్లివ్వవద్దని ఏ ధర్మశాస్త్రం మీకు బోధించిందో మాకు తెలీదు. మా పిల్లల్నీ, ఆడాళ్లనీ మాడ్చారా, మీ పిల్లలూ, ఆడాళ్లూ క్షేమంగా ఉండరు. మమ్మల్ని మృగాల కింద నొక్కిపట్టారు. అవును. మృగాలమే. చేసి చూపిస్తాం. జాగర్త.” అని హెచ్చరిస్తాడు. తమకు నీళ్లివ్వకుండా చెరువు కట్టేసి అధర్మయుద్ధం చేస్తున్నారని తేల్చేసిన మునెయ్య, తమకు నీళ్లివ్వవద్దని ఏ ధర్మశాస్త్రం బోధించిందో చెప్పమని అడుగుతున్నాడు. అంతేనా, తమని మృగాలకింద తొక్కిపెడితే, నిజంగా మృగాలమవుతామని హెచ్చరిస్తున్నాడు. అంటే తిరగబడతామని చెబుతున్నాడు. అగ్ర వర్ణాల అకృత్యాల వల్ల, నిమ్న కులాలు ఎట్లా యాతనలు అనుభవిస్తున్నాయో ప్రత్యక్షంగా చూశాడు కాబట్టే మాలల తరపున ఉండి ఆ మాటలు పలికించాడు చలం.
‘మాలపిల్ల’ టైటిల్ రోల్ చేసింది – తెలుగు సినిమా తొలి స్టార్ హీరోయిన్ కాంచనమాల. ఆమె పాత్ర పేరు శంపాలత. ఆమె మునెయ్య కూతురు. సుందరరామశాస్త్రి కొడుకు నాగరాజు (వెంకటేశ్వరరావు)కూ, ఆమెకూ మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఆ ఇద్దరూ సన్నిహితంగా మాట్లాడుకుంటూ మునెయ్యకి దొరికిపోతారు. “అయ్యా మీరు పెద్దలు. మీ కులంలో ఆడోళ్లు లేరా. మురికోళ్లు, అంటరానోళ్లు.. ఈ పిల్లలెందుకు కావాల్సొచ్చారు నాయనా. మేం అరమైలు దూరంలో ఉంటేనే మీరు మైలపడతారే. ఇలాంటి పనులకు అభ్యంతరాలు లేవు కావచ్చు. వీళ్లకి ఉన్నదల్లా ఒక్కటే. అది శీలం. దాన్నీ దోచుకోవాలా! ధనం, అధికారం, సుఖం చాలవేం? వెర్రిపిల్లల్ని చేసి ఒంటరిగా కలుసుకుని, మెరిపించి, మాయమాటలు చెప్పి నమ్మించాలని చూశారూ. శాస్త్రులవారి వంటి మహాత్ముల కుమారులు చెయ్యదగ్గ పనికాదు” అంటాడు మునెయ్య. తన కథల్లోని శైలి తరహాలోనే ఈ సినిమాలోని సంభాషణలనూ గొప్ప లయతో నడిపించాడు చలం. కేవలం మనం చలం సమ్మోహన శక్తిని శైలికే పరిమితం చెయ్యడం పొరపాటు. ఆయన సంభాషణా శిల్పం కూడా అసాధారణం. ఇన్ని దశాబ్దాల తర్వాత, ఇవాళ్టి సినిమాల్లో ఎంతమంది రచయితలు ఇలాంటి శైలితో, ఇలాంటి శిల్పంతో సంభాషణలు రాయగలుగుతున్నారు?
అప్పటికింకా నాగరాజుకు, శంపాలతకు తమ మధ్య ప్రేమ పెనవేసుకుంటున్నదనే సంగతి తెలీదు. స్నేహమైతే ఏర్పడింది. అంతలోనే మునెయ్యకు దొరికారు. నాగరాజును అపార్థం చేసుకున్న మునెయ్య.. చెడుబుద్ధితోనే అతను శంపకు చేరువవుతున్నాడని తలచాడు. ఒక పెళ్లికాని అమ్మాయి తండ్రి ఎలా స్పందించాలో అలాగే స్పందించాడు మునెయ్య. పైగా నాగరాజు సాక్షాత్తూ తమని మృగాల కింద భావించే శాస్త్రి కొడుకు. కరడుకట్టిన దురాచారవాది కొడుకు. తామా తక్కువ కులంవాళ్లు. దుర్బలులు. శంపని లోబరచుకోవడానికి మాయమాటలు చెప్పి దగ్గరవుతున్నాడని సంశయించాడు మునెయ్య. అలాంటి స్థితిలో అతని నోటినుంచి ఎలాంటి మాటలు వస్తాయి? ఎంత శక్తివంతంగా వస్తాయి? ఆ సందర్భానికి తగ్గట్లు మునెయ్య నోటినుంచి వచ్చిన మాటల్ని ఇంతకంటే శక్తివంతంగా, ఇంతకంటే సమర్థవంతంగా ఎవరు రాయగలరు?
‘మాలపిల్ల’లో మాలలకు దన్నుగా చౌదరి నాయకత్వంలోని ‘హరిజన సేవాసంఘం’ నిలుస్తుంది. మాలలను మృగాలుగా పెద్ద కులాలు చూస్తుంటే, కాదు, వాళ్లూ అందరిలాంటి మనుషులేనని సంఘం వాదిస్తుంటుంది. మాలల పక్షం వహిస్తే కమ్మ కులాన్నుంచి వెలేస్తామని ఒకతను చౌదరిని బెదిరిస్తాడు. దానికి చిన్నగా నవ్వి “కులం.. వెలి.. మా కులం హరిజన కులం. వాళ్లతో నీళ్లు త్రాగి, వాళ్లతో పరుండటమే మా నిత్య కృత్యం” అని చెప్పిన చౌదరి “రండి. మాలగూడేనికే పోదాం. మాలల్లో మాలలమై మాలలూ మనుషులేనని లోకానికి చాటుదాం” అంటూ సంఘ సభ్యులతో అక్కడికే వెళ్తాడు. ఆ పాత్రచేత అలా చెప్పించిన చలం నిజ జీవితంలో బ్రాహ్మణ సమాజం తనను వెలేస్తే, మాలపల్లెల్లోనే నివసించిన సంగతి గమనించదగ్గ విషయం.
Mala Pilla_C53242-83C451
ఈ కథలో శంపకు చేదోడు వాదోడుగా ఉండే పాత్ర అనసూయ. ఆమె శంప చెల్లెలే. చిన్నదైనా అక్కకి సలాహాలు, ధైర్యం ఇవ్వగల గడుగ్గాయి. తెలివైంది. శంపను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు, ఆమెని వెతుక్కుంటూ బయలుదేరతాడు. మార్గంలో అనసూయ కనిపిస్తే శంప గురించి ఆమెని అడుగుతాడు. ఎందుకని ప్రశ్నిస్తుంది అనసూయ. “నేను శంపాలతను పెళ్లి చేసుకుంటాను” అంటాడు రాజు. అనసూయ పెద్దగా నవ్వుతుంది. ఆరిందాలా “పెళ్లి? పెళ్లి? మాలపిల్లని? మీకు మతిపోయినట్టుంది” అంటుంది. దాంతో “మీ చిన్నికృష్ణుని పాదాల సాక్షిగా పెళ్లి చేసుకుంటాను” అని చెబుతాడు రాజు (చిత్రంలో శంప, అనసూయ కృష్ణభక్తులు). అప్పుడు అనసూయ ఏమనాలి? ఏ ఇతర రచయితైనా అనసూయతో ఎలాంటి మాటలు పలికిస్తాడు? కచ్చితంగా చలం పలికించినట్లు “ఎక్కడి మాటలు లెండి. మీ నాన్నగారు గుండెపగిలి చావరూ? మిమ్మల్ని నరుకుతారు మీ బ్రాహ్మలు” అని పలికించలేడు. 76 సంవత్సరాల క్రితమే ఒక సినిమాలోని పాత్రల చేత ఇలాంటి సునిశితమైన, బాకుల్లాంటి మాటలు పలికించడం ఒక్క చలానికే సాధ్యం.
మాలలకు నీళ్లివ్వకుండా చేసి, వాళ్లు నీళ్ల కోసం అలమటించేలా చేస్తున్నందుకు నిరసనగా మాలలంతా చౌదరి నాయకత్వంలో అగ్ర కులాల వారి పొలం పనులకు, ఇతర పనులకు వెళ్లకుండా సమ్మెకట్టారు. ఆ పనులకు పొరుగూళ్లనుంచి మనుషులు రాకుండా చూశారు. దాంతో చౌదరి వాళ్లతో ఒకసారి మాట్లాడమని శాస్త్రికి చెబుతాడు ఆయనకు అనుయాయిగా ఉండే మల్లికార్జున శర్మ. శాస్త్రి కోపంతో ఊగిపొయ్యాడు. “పోండి. పోండి. అందరూ పోండి. నా కొడుకే నాకు ఎదురు తిరుగుతున్నాడు. నేనొక్కణ్ణే ఏకాకినై నిలుస్తాను. రానీ మాలల్ని. నా ఇంటిచుట్టూ మూగి నా అగ్నిహోత్రాల్ని మలినం చెయ్యనీ. నా వంటలో గోమాంసాదులు వెదజల్లనీ. పూర్వం రాక్షసులు  రుష్యాశ్రమాల్ని ధ్వంసం చెయ్యలా. నేనే నిలుస్తాను. ఆ శ్రీరామచంద్రుడే ఉంటే మళ్లా నా ఇంటికొచ్చి కావలి కాస్తాడు. నాకెవ్వరితోనూ నిమిత్తం లేదు నాయనా. పోండి” అంటాడు.
వర్ణ భేదాల్ని నిక్కచ్చిగా పాటిస్తూ, కరడుకట్టిన బ్రాహ్మణిజానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపించే సుందరరామశాస్త్రి అవసరమైతే ప్రాణాలైనా వదులుకుంటాడు కానీ ఆచారాలనూ, కట్టుబాట్లనూ వదులుకుంటాడా? తమ అవసరం కోసం బెట్టుని వదిలి మెట్టు దిగుతాడా? మాలలతో రాజీకి వస్తాడా? అలాంటి స్థితిలో ఉన్న శాస్త్రి నోటివెంట ఇలాంటి మాటలు కాకుండా వేరేవి ఎలా వస్తాయి? ఆద్యంతం శాస్త్రి పాత్ర తీరుకు తగ్గట్లు (ఇదే మాట అన్ని పాత్రలకూ వర్తిస్తుంది) చలం రాసిన మాటలు ఆ పాత్రకి వన్నె తెచ్చాయి. చలం మాటల్ని శాస్త్రి పాత్రలో గోవిందరాజుల సుబ్బారావు పలికిన తీరు అసామాన్యం. డైలాగులు పలకడంలో, ఆ పలికేప్పుడు హావభావాలు ప్రదర్శించడంలో ఎస్వీ రంగారావుని మించిన నటుడు లేడని మనవాళ్లు అంటుంటారు. అయితే ఆయనకటే ముందు అలాంటి నటుడు ఒకరున్నారనీ, ఆయన గోవిందరాజుల సుబ్బారావనీ ఒప్పుకోక తప్పదు. ‘కన్యాశుల్కం’లో లుబ్దావధాన్లుగా ఆయన నటనని మరవగలమా? ఆయన ఎక్కువ సినిమాలు చేయలేదు కాబట్టి, తొలి తరం ప్రేక్షకులు ఇప్పుడంతగా లేరు కాబట్టి ఆయన గురించి చెప్పుకునేవార్లు లేకుండా పోయారు. అందుకే ఆయనకు రావలసినంత పేరు రాలేదు.
మాటల రచయిత చలం

మాటల రచయిత చలం

శంపాలతనూ, అనసూయనూ తీసుకుని కలకత్తా పారిపోయాడు నాగరాజు. దీంతో ఇటు శాస్త్రి కుటుంబం, అటు మునెయ్య కుటుంబం దిగాలుపడ్డాయి. శంపాలతను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నానని తండ్రికి ఉత్తరం రాశాడు రాజు. ఆగ్రహంతో ఊగిపోయిన శాస్త్రి తనకసలు కొడుకు పుట్టలేదని అనుకుంటాననీ, పుట్టినా చచ్చిపొయ్యాడనుకుంటాననీ చౌదరితో అన్నాడు. ఆవేశపడకుండా ఆలోచించమన్నాడు చౌదరి. మనుషుల్లో విభజన ఏ శాస్త్రంలో ఉందో చూపించమన్నాడు.
“మేనమామ కూతుర్ని వదిలి మాలపిల్లను వివాహం చేసుకున్నాడంటే దాన్ని తేలిగ్గా చూస్తున్నారు కానీ అది సామాన్యమైన పని కాదు. పెద్ద ఇంటి బిడ్డ, ఉదార స్వభావం కలవాడే ఆ పని చేయగలడు. ఏరి? ఎందరుంటారు అలాంటివాళ్లు? కామానికి లొంగేనండీ, ఎంగిలి బతుకులు బతుకుతూ ఎంతమంది లేరు ఈ దేశంలో. అమాయకురాళ్లను వలలో వేసుకున్నవాళ్లు ఎందరు లేరు? చేరదీసినదాన్ని పెండ్లి చేసుకుని తన పేరును, తన హోదాను దానికి కూడా ఇవ్వగలిగినవాళ్లు ఎందరు? వెయ్యిమందిలో ఒక్కడుంటాడో, ఉండడో. ఆ ఒక్కడే మనిషి. తక్కినవాళ్లంతా నీచులు. వారే సంఘద్రోహులు. నిజమైన అస్పృశ్యులు. అలాంటివాళ్లంతా మనలో ఉన్నారు. మనతో తిరుగుతున్నారు. మన మర్యాదలు పొందుతున్నారు. దానికి తప్పులేదు. మాలలనంటితేనే తప్పు. మీరేమన్నా అనండి. నాగరాజు ధన్యుడు. వారడ్రస్ తెలీదు కానీ అక్కడికి పోయి స్వయంగా ధన్యవాదాలు చెప్పేవాణ్ణి” అన్నాడు చౌదరి.
గూడవల్లి రామబ్రహ్మం

గూడవల్లి రామబ్రహ్మం

ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు చౌదరి చేత పలికించిన ఈ మాటల ద్వారా రెండు ప్రయోజనాలు సాధించాడు చలం. ఒకటి – ఒక ‘మాలపిల్ల’ను వివాహం చేసుకోవడం ద్వారా బ్రాహ్మణుడైన నాగరాజు చేసింది చాలా గొప్ప పని అని చెప్పడం, రెండు – సంఘంలో పైకి పెద్ద మనుషులుగా, మర్యాదస్తులుగా చలామణీ అవుతూ చాటుమాటుగా పరాయి స్త్రీలతో వ్యవహారాలు నడిపేవాళ్లను ఎండగట్టడం. ఈ రోజుల్లో కులాంతర, వర్ణాంతర, మతాంతర వివాహాలు సాధారణమయ్యాయి కానీ, ఆ రోజుల్లో అలాంటివి గొప్ప పనులే. తక్కువ కులం అమ్మాయిని ప్రేమించి ధైర్యంగా పెళ్లి చేసుకున్నవాడే మనిషనీ, అమాయకురాళ్లను వలలో వేసుకుని ఎంగిలి బతుకులు బతుకుతున్నవారంతా నీచులనీ, వారే సంఘద్రోహులనీ, నిజమైన అస్పృశ్యులనీ చౌదరిచేత చెప్పించాడు చలం. అలాంటి వాళ్లంతా మనతో తిరుగుతూ మర్యాదలు పొందుతున్నారని ఎండగట్టాడు. నిజానికి ఆ మాటలు పలికింది చౌదరి కాదు. చలమే. అవి అచ్చంగా చలం భావాలే.
ఇవాళ్టి సినిమాల్లోనూ ఈ తరహా డైలాగులు రాయగల రచయిత ఒక్కడైనా ఉన్నాడా? మరి దురాచారాలు, కట్టుబాట్లు అధికంగా రాజ్యం చేస్తున్న కాలంలో ‘మాలపిల్ల’ వంటి సినిమా రావడం పెద్ద సాహసం, గొప్ప విషయమైతే, అందులో బ్రాహ్మణాధిపత్య సమాజానికి సూటిగా, బాణాల్లా తగిలే పదునైన సంభాషణలు రాయడం ఇంకెంత సాహసం, ఇంకెంత గొప్ప విషయం! నేటి సినీ రచయితలు తప్పకుండా అధ్యయనం చెయ్యాల్సిన సినిమా ‘మాలపిల్ల’ అయితే, అందులోని సంభాషణలు వారికి మార్గదర్శకమయ్యే గొప్ప పాఠాలు!!
-బుద్ధి యజ్ఞ మూర్తి
261374_585952121417138_1370360100_n

ఆనాటి పండిత చర్చలు: పెండ్యాల వర్సెస్ శ్రీపాద, వారణాసి

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

కాలంలో ఒకసారి ఎనభయ్యారేళ్ళ వెనక్కి వెడదాం…

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1928లో ‘మహాభారత చరిత్రము’ అనే పేరుతో ఒక పుస్తకం వెలువరించారు. 1928-33 మధ్యకాలంలో అది రెండు ముద్రణలు పొందింది. 1991లో ఏటుకూరు బలరామమూర్తిగారి పరిచయవాక్యాలతో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ దీనిని పునర్ముద్రించింది. ఆ ప్రతి నా దగ్గర ఉంది.

అప్పట్లో ఈ పుస్తకం ఒక సంచలనం అన్న సంగతి రచయిత, ఇతరులు రాసిన ముందు మాటలను బట్టి అర్థమవుతుంది. మహాభారతాన్ని చారిత్రక దృష్టినుంచి, హేతు దృష్టినుంచి చర్చించిన ఈ పుస్తకంపై తీవ్ర ఖండనలు వెలువడ్డాయి. దీనిపై ఖండన తీర్మానాలు చేయడానికి పలు చోట్ల పండిత సభలు కూడా జరిగాయి. ఈ పుస్తకాన్ని ప్రప్రధమంగా ఖండించిన వారిలో ప్రసిద్ధులు శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు. ఆయన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవి కూడా. పెండ్యాల-శ్రీపాదవార్ల వివాదం చివరికి కోర్టుకు ఎక్కి, ఏడాది- ఏడుమాసాలపాటు కేసు నడిచింది. రాజమండ్రిలోని ఆనరరీ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేటు ఇద్దరికీ ఇరవై రూపాయల వంతున అపరాధ రుసుము విధించారు. కృష్ణమూర్తిశాస్త్రిగారు రెండుసార్లు తన సాక్షులను ప్రవేశపెట్టని కారణంగా పెండ్యాల వారికి పన్నెండు రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని కూడా మెజిస్ట్రేటు తీర్పు చెప్పారు.

పెండ్యాలవారి రచనను ఖండిస్తూ 1948-49 ప్రాంతంలో ఆరు సంపుటాలుగా మరో రచన వచ్చింది. దానిపేరు ‘మహాభారత తత్త్వ కథనము’. ఈ గ్రంథ రచయిత వారణాసి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు. ఈయన కూడా పిఠాపురం వాస్తవ్యులే. వీరిద్దరూ తమ వాదోపవాదాలు వినిపించడానికి అప్పట్లో పండితుల మధ్యవర్తిత్వంలో సభలు కూడా జరిగాయి. అది కూడా ఆసక్తి గొలిపే ఓ ముచ్చట. దానినలా ఉంచితే, 2003లో ‘మహాభారత తత్త్వ కథనము’ రెండు సంపుటాలుగా పునర్ముద్రణ పొందింది. ఆ సంపుటాలు నా దగ్గర ఉన్నాయి.

స్వవిషయం అనుకోకపోతే పాఠకులతో ఒక విషయం పంచుకోవాలనిపించింది. అది నా ‘జన్యు’ లక్షణాన్ని మరోసారి గుర్తుచేసిన విషయం కూడా.

ఈ వ్యాసం ప్రారంభించేముందు పెండ్యాలవారి ‘మహాభారత చరిత్రము’ తిరగేస్తుంటే దీనిపై మా నాన్నగారు కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులుగారు నమోదు చేసిన తన స్పందన వాక్యాలు కనిపించాయి. ఇంతకుముందు కూడా వాటిని చూశాను కానీ అంత పరిశీలనగా చూడలేదు. ఇప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యమనిపించింది. బహుశా ఈ సందర్భానికి అవి తగినట్టు ఉండడం వల్ల కావచ్చు.

ఈ వ్యాసపరంపర ప్రారంభంలో మా నాన్నగారి గురించి రాశాను. ఆయన సంస్కృతాంధ్రాలలో కావ్యాలు రాసినవారు. పద్దెనిమిది పురాణాలను తెలుగు చేసినవారు. పండితులుగా ఆయన సంప్రదాయవర్గానికి చెందినవారే. ఏదైనా పుస్తకం చదివినప్పుడు అందులోని లోపలి పేజీలపై తన స్పందన నమోదు చేయడం ఆయనకు అలవాటు. ‘మహాభారత చరిత్రము’పై ఆయన స్పందన ఇలా ఉంది:

“పరమాద్భుత గ్రంథమిది. పూర్తిగా చదివాను. పూర్ణ సంఖ్య 9/9/98”

“చాలా లోతుపాతులు చూచి చక్కగా రూపొందింపబడినదీ రచన”

“(పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి) ఈయన నివాసము, ఎడ్రస్సు, ప్రస్తుత ఎడ్రస్సు ఏమో? తెలుసుకోవాలి”

“ఇది చేతనుంచుకొని మహాభారతము సవిమర్శముగా చదివి చెప్పాలి”

“శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి అనువాదం కూడా దీనితో జోడించి మరల చదవాలి”

“రాజసూయ విధానము, అశ్వమేధ విధానము పూర్తిగా పరిశీలింపబడిన గ్రంథము”

“వీరి పరువునష్టం దావా రికార్డు రాజమండ్రిలో సంపాదించాలి. ఆ కాగితాలు చాలా అవసరం”

పెండ్యాలవారు తమ పుస్తకం రెండోముద్రణకు రాసిన ఉపోద్ఘాతం చివరిలో,‘చదువరులకు ఒక మనవి’ అనే ఉప శీర్షిక కింద ఇలా రాశారు:

“నేను రాసిన విమర్శనాంశములలో బెక్కులు నాకు తెలియని తప్పులుండవచ్చును. భాషా స్ఖాలిత్యముండవచ్చును. ఎంతగా బరిశీలించినను ముద్రణస్ఖాలిత్యము లనివార్యములు. అభిప్రాయభేదము లనివార్యములే. అందులకని నన్ను దూషింపకుడని వేడుచున్నాను. నిజమగు తప్పులను సవరించుకొనుట కెప్పుడును వెనుదీయను. అభిప్రాయభేదములే లేకుండిన ‘ప్రస్థానత్రయ’మునకు ‘ద్వైతాద్వైతవిశిష్టాద్వైత’ భాష్యము లేల కలుగును? అట్లే భారత గాథా విశేషములపై నాకును నభిప్రాయభేదములున్నవని తలప గోరెదను. విమర్శించి సత్యముం గనుగొనువారికి నా విమర్శనము కొంత సహాయకారి యగుననియు నేరికై నంత గొంత యిది సహాయమొసగిన నందువలన నేను ధన్యుడ నగుదు ననియే నమ్ముచున్నాను. ఓం తత్సత్”

మా నాన్నగారు,‘అభిప్రాయభేదములే లేకుండిన’ అనే వాక్యం నుంచి చివరి వరకు, మార్జిన్ లో ఒక నిలువు గీత గీసి, పక్కనే “ఇది సత్యం, సర్వదా సత్యం” అని రాశారు.

ఈ పుస్తకం ముందు మాటలు తిరగేయడం , నాన్నగారి స్పందన చదవడం నాలో ఒకవిధమైన మెరుపుతీగలాంటి జ్ఞానశకలాన్ని ఆవిష్కరించాయి. అంటే రెవెలేషన్ లాంటిదన్నమాట. భారతరామాయణాలపై సంప్రదాయవిమర్శ ఒక మూసలో ఉంటుందనుకుంటాం. చాలావరకు అది నిజమే కూడా. అయితే సంప్రదాయపండితులందరూ ఒకే మూసలో ఉండరని ఈ పుస్తకం తిరగేస్తున్నప్పుడు అనిపించింది. వాళ్ళలోనూ ఛాయాభేదాలు ఉన్నాయి. మా నాన్న గారే కాక, అలాంటివారు- అంటే సంప్రదాయవాదానికి చెందినప్పటికీ నవీనత్వాన్ని పూర్తిగా నిరాకరించకుండా తెరచిన పుస్తకం లాంటి బుద్ధితో దానిని ఆస్వాదించగలిగినవారు, సంప్రదాయ పరిధిలోనే కొంత హేతుబద్ధంగా, తార్కికంగా ఆలోచించగలిగినవారు ఈ పుస్తకంలో మరికొందరు కనిపిస్తారు. ఎవరివరకో ఎందుకు, పెండ్యాలవారితో ఘర్షణపడి కోర్టుకు కూడా ఎక్కిన శ్రీపాదవారే ఉదాహరణ. ఆయన నవీనత్వాన్ని ఆహ్వానిస్తారని అనలేకపోయినా కొంత స్వతంత్రించి హేతుబుద్ధితో ఆలోచించిన పండితులే.

పెండ్యాలవారే ఇలా రాస్తారు:

“వారు(శ్రీపాదవారు) నా గ్రంథమును నిరాకరింపుచు వ్రాసిన వ్యాసములలోనూ ఆ వ్యాసములన్నిటిని చేర్చి కూర్చిన ‘శ్రీ మహాభారత చరిత్ర నిరాకరణము’ అను గ్రంథములోనూ నేను వ్యాసాదులను నిందించితిననియు బురాణపురుషులను నిందించితిననియు, బెక్కుసారులు నన్ను దూషించిరి. కాని నా పుస్తకమునకు బూర్వమే వారు వ్యాస, భీష్మ, బలరామ, శ్రీరాముల గూర్చి యెట్లు వ్రాసిరో దిగ్మాత్రముగా వ్రాయుచున్నాడను.

కృష్ణమూర్తిశాస్త్రిగారు ‘కురుపాండవదాయభాగ విమర్శనము’న వ్యాసుని గూర్చి యిట్లు వ్రాసిరి.

(1)  “ధర్మశాస్త్రముల మాటకేమిగాని, మహానుభావుడై యడవులలో దపము చేసికొను వ్యాసుడంతవా డిట్టి పాడు పనికీయకొనెనని మన మొప్పుకొనుచున్నప్పుడు రెండు మూడు తడవులకు సందేహించి చర్చింపవలసి యున్నదా?”

అడవులలో దపము చేసికొను వ్యాసుడు రాజాంతఃపురము జొచ్చి ‘అంబికాంబాలికలను దాసిని’ గూడి బిడ్డల గనుట,‘ఒకటి కాదు, రెండు కావు, మూడుసారులు చేసిన పాడుపను’లనియే కృష్ణమూర్తిశాస్త్రిగారి ముఖ్యాభిప్రాయము.(మానవసేవ పత్రిక 1912 ఆగస్టు సంచిక)

భీష్ముని గూర్చి యిట్లు తమ వజ్రాయుధ పత్రిక (1927 సం.రము అక్టోబర్ సంచిక)లో వ్రాసి యున్నారు.

(2)“భీష్ముని మెచ్చుకొనినారు దానికి సంతోషింపవలసినదేకా? భీష్ముని బ్రహ్మచర్యము స్వచ్ఛందమైనది కాదు. తండ్రి కోర్కెం దీర్ప వ్రతంబు బూనెగాని విరక్తుండై కాదు. అది యుత్తమ మన నొప్పదు. భీష్ముం డుత్తమపాత్రమే గాని తాను సమర్థుండై యుండియు నెవరికిం జెప్పవలసినట్లు వారికి జెప్పి యుద్ధము గాకుండం జేయవలయు. అటులం జేయక తానొక పక్షముం జేరి పాండవులతో భండనము జేసినాడు సరే! దుర్యోధనుని యుప్పు దినుచున్నాడట! అందుచేత యుద్ధము జేసినాడనుకొందము. తన చేరిన పక్షమునకు జేటుగా దన చావునకు మార్గము తానే చెప్పి పరులకు లోలోన సలహా నిచ్చినాడు. ఇది స్వామిద్రోహము కాదా? స్వామిద్రోహపాతకము సామాన్యమా?”

(3) “వీరు (గరికపాటి రామమూర్తి గారు) రాముని మాత్ర మవతారపురుషుడని యన్యాయము లేనివాడని వ్రాసిరి. సంతోషమే గాని మాటవరసకుం జెప్పుచున్నాము. రాముడు మహానుభావుడే కదా, లోకవృత్తముతో నవసరము లేక యొకరి జోలికిం బోక యొక యడవిలో గూర్చుండి ముక్కు మూసికొని తపము జేయుచున్న శంబూకుని తల నరికినాడు. ఇది న్యాయమా? వాలి సుగ్రీవులు పోరాడుచుండ జాటునుండి వాలిం దెగవేసినాడు. ఇది న్యాయమా? అగ్నిశుద్ధిం బొందియున్న సీతను సంపూర్ణ గర్భవతిని నరణ్యములకుం బడద్రోసినాడు. ఇది న్యాయమా? (వజ్రాయుధ పత్రిక, సంపుటము 2, సంచిక 9)

(2,3 అంశములు శ్రీ గరికపాటి రామమూర్తి బి.ఎ గారి వ్రాతలను ఖండింపుచు కృష్ణమూర్తిశాస్త్రి గారు వ్రాసినవి)

Files.34

***

శ్రీపాదవారు భీష్ముడి గురించి, రాముడి గురించి ఇలా రాయడమే నమ్మశక్యం కాని ఆశ్చర్యం. శ్రీపాదవారు రాశారని చెప్పకుండా ఇవే వాక్యాలను చూపించి ఇవి ఎవరు రాసుంటారని ఇప్పటి వారిని అడిగి చూడండి, తప్పకుండా ఏ త్రిపురనేని రామస్వామి చౌదరిగారి పేరో చెబుతారు. అంటే, నాటి సంప్రదాయపండితులలోనే కొందరిలో త్రిపురనేని రామస్వామి చౌదరిగారి అంశ కూడా ఉండడం ఎంత విలక్షణం! వ్యాసాదులను, పురాణపురుషులను నిందించారని పెండ్యాలవారిని దూషించిన శ్రీపాదవారే ఆ పని చేయడం ఎలాంటిది? వ్యక్తిగతంగా చెబితే, బహుశా అది ఆయనలోని ద్విధా వ్యక్తిత్వాన్ని(splitpersonality)ని సూచిస్తూ ఉండచ్చు. వ్యవస్థాగతంగా చెబితే, మహాభారత రామాయణాదులు అప్పటికి చాలావరకూ ఆయనలాంటి పండితుల విశేషాధికార పరిధిలోనే ఉన్నాయి. కనుక పండితులు వాటిపై ఎటువంటి వ్యాఖ్యలు, విమర్శలు చేసినా అది పూర్తిగా ‘ఆంతరంగిక’ విషయం. ఈ పండిత సామ్రాజ్యంలోకి ఇతరులు అడుగుపెట్టడంతోనే సమస్య వచ్చినట్లుంది. అందువల్ల కలిగిన అభద్రతా భావం సంప్రదాయపండితవర్గాన్ని ఆత్మరక్షణలోకి నడిపించి, రామాయణభారతాదులకు వారిని కాపలాదారులుగా మార్చివేసి ఉండచ్చు. క్రమంగా కేవలం జబ్బపుష్టి మాత్రమే కలిగిన ‘లుంపెన్ శక్తులు’ ఈ కాపలా బాధ్యతలో పాలుపంచుకోవడం సహజ పరిణామం కావచ్చు.

చెహోవ్ రాసిన ‘గుల్లలో జీవించిన మనిషి’ కథలోలా రామాయణభారతాదులపై పండిత విమర్శ క్రమంగా ఒక గుల్లలో ముడుచుకోవడానికి లోతైన చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాలూ ఉండచ్చు. ఇప్పుడంత లోతులోకి వెళ్లద్దు కానీ, ఎమ్మే పిహెచ్ డీలనే మూస పండితులను సృష్టించే యూనివర్శిటీల కార్ఖానా చదువు కూడా ఒకనాటి పండిత సంప్రదాయాన్ని చంపేసిందా అనిపిస్తుంది. నేటి పండితులు గడుసుగా సాంప్రదాయిక సాహిత్యానికి సంబంధించిన వివాదాల జోలికి వెళ్లకుండా అలంకారం, రసం, శిల్పం వగైరా కావ్యసామగ్రికి పరిమితమవడమే చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన ఆంధ్రమహాభారతంలో అది కనిపిస్తుంది. ఆ ప్రచురణ వ్యాఖ్యాతలు నిజంగా వ్యాఖ్యానం అవసరమైన చోట ఎలా మౌనం వహించారో ఇంతకు ముందు ఒకటి రెండు సందర్భాలలో చెప్పుకున్నాం. బహుశా ముందు ముందు కూడా చెప్పుకోవలసి రావచ్చు.

అసలు సామాజిక, రాజకీయ, చారిత్రక పాఠం కూడా అయిన మహాభారతం లాంటి ఒక రచనను పూర్తిగా మత,ఆస్తిక వ్యవస్థ అయిన టీటీడీ ప్రచురించడంలోని ఔచిత్యమేమిటో తెలియదు. అప్పటికే సౌజన్యం, గడుసుదనం అనే సుతిమెత్తని లోహంతో తయారైన ఎమ్మే పండితుల పాళీపై టీటీడీ ప్రచురణ అదనపు అంకుశం. ఇదే ఏ వావిళ్ల వారి ప్రచురణో, తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణో అయితే ఆ దారి వేరు. అప్పటికీ నేటి మన పండితులు స్వతంత్రవ్యాఖ్య చేస్తారన్న నమ్మకం లేదు.

విచిత్రం ఏమిటంటే, సంప్రదాయభిన్నంగా మాట్లాడడానికి ఇప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసివస్తుంటే, సంప్రదాయ వర్గానికి చెందిన శ్రీపాదవారు ఏ జాగ్రత్తా తీసుకోకుండా వ్యాఖ్యానించడం! భీష్ముని గురించి ఆయన అన్న మాటలే చూడండి…నిజానికి భీష్మునిలో ఆయన ఎత్తి చూపిన లోపాలకు సాంప్రదాయిక పాఠం లోనే కావలసినంత సమర్థన ఉంది. ఆదిపర్వం తృతీయాశ్వాసం ప్రకారమే చూస్తే, కురుక్షేత్రయుద్ధం జరిగింది భూభారం తగ్గించడం కోసం. భూదేవి ప్రార్థనపై బ్రహ్మ దేవుడు రచించిన కురుక్షేత్రయుద్ధమనే విశాల వ్యూహంలో,‘భీష్మాది వీరులు దేవదానవ అంశలతో పుట్టి యుద్ధం చేసి మరణించడం’ ఒక భాగం. అప్పుడు బ్రహ్మదేవుని వ్యూహం అనే పెద్ద గీత ముందు; కురుపాండవ శత్రుత్వం, పాండవులకు రాజ్యం దక్కడం, ఆయా పాత్రల లోపాలోపాలు వగైరాలు చిన్న గీతలు అయిపోతాయి. అయినా సరే, మహాభారత అనువాదకులు కూడా అయిన శ్రీపాదవారు స్వతంత్రించి సంప్రదాయభిన్న వ్యాఖ్య చేయడం ఆసక్తికరం.

***

‘మహాభారత చరిత్రము’ రెండవ ముద్రణకు పెండ్యాలవారు రాసిన ఉపోద్ఘాతం, వారణాసివారి ‘మహాభారత తత్త్వకథనము’ చదవడం నిజంగా ఒక తాజాదనాన్ని కలిగించే అనుభవం. మహాభారతాన్ని సంప్రదాయేతర కోణం నుంచి పరిశీలించిన రచనలు కొన్ని పెండ్యాలవారి రచనలకు ముందే వచ్చాయి. కట్టమంచి రామలింగారెడ్డి గారు మద్రాసులోని గోఖ్లేహాలులో ఇచ్చిన మహాభారతోపన్యాసం పెక్కుమంది ఆంధ్రులను భారతంపై దృష్టి మళ్లించేలా చేసిందని పెండ్యాలవారు అంటారు. అప్పటికే రావుబహద్దర్ పనప్పాకం అనంతాచార్యులుగారు, విమర్శకాగ్రేసర కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రిగారు ‘కురుపాండవ దాయభాగ నిర్ణయము’ల గురించి గ్రంథాలు రాశారు. బ్రహ్మయ్యశాస్త్రిగారి గ్రంథాన్ని ఖండిస్తూ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు ‘కురుపాండవ దాయభాగ వినిర్ణయ’మనే గ్రంథం రాశారు. దుర్యోధనుని పక్షంలోనే న్యాయముందని చెబుతూ కోటమర్తి చినరఘుపతిరావు అనే కవి ‘సుయోధన విజయము’ అనే కావ్యం రాశారు. వజ్ఝల చిన సీతారామస్వామిశాస్త్రి గారు సంప్రదాయాభిన్న వివరణతో ‘కర్ణచరిత్రము’ రాశారు. పూర్తిగా సంప్రదాయ పక్షం నుంచి ‘మహాభారత తత్త్వ కథనము’ రచించిన వారణాసివారు ఇలాంటి రచనలను అన్నిటినీ ఖండించారు. ఆర్ష సాహిత్యంపై సాంప్రదాయిక భాష్యం ఎలా ఉంటుందో తెలుసుకోడానికి ఒక ఆసక్తికరమైన ఆధారం వారణాసివారి రచన.

అయినాసరే, భారత రామాయణాదులపై ‘వంగ మహారాష్ట్రాది’ భాషలలో వచ్చినన్ని రచనలు తెలుగులో రాలేదని పెండ్యాలవారు అంటారు. ఆయన ఇంకా ఇలా అంటారు:

‘ఆంధ్రభాషలో విమర్శన గ్రంథములు తక్కువ. మహాభారతమును తత్రస్థవ్యక్తులను విమర్శించుట మరియును దక్కువ. దుర్బలమానసులకట్లు విమర్శించుట భీతావహముగా నుండును. విమర్శించినవారి కేదేని యనిష్టము సంభవించునని వారు తలంతురు. నా నేత్రవ్యాధికి గారణమిదియ యని యసూయాపరులు హేళనము చేయుటయే కాదు, కొందరు మిత్రులును నయోక్తులతో నయనిష్ఠురోక్తులతో గూడ నను నీ కార్యమునుండి మరలింప బ్రయత్నించిరి.’

తన మహాభారత ప్రసంగాలపై వ్యక్తమైన వ్యతిరేక స్పందనకు ఉదాహరణగా పెండ్యాలవారు ఒక సందర్భాన్ని ఇలా పేర్కొన్నారు:

‘గడిచిన నవంబరు(1932 సం.)నెలలో మ.రా. సర్. కూర్మా వెంకటరెడ్డి నాయుడుగారి యాధిపత్యమున (మద్రాసు)పచ్చయప్ప కలాశాలలో నే నిచ్చు నుపన్యాసమున సందర్భానుసారముగ ‘అశ్వమేధము లోని యశ్వసేవ’ను గూర్చి చెప్పుచున్నప్పుడు కొందరు కేకలు వైచిరి. అపుడు శ్రీ విద్వాన్ గంటి జోగి సోమయాజులు యం.యే. యల్.టి గారు ఈ యంశము నీ నాటి రాత్రి నేను చదివి రేపు సభలో యథార్థము జెప్పెదను గాన మరునాడు తిరిగి ఉపన్యసింప రమ్మని కోరి యట్లు సభ చేయించిరి…ఆ సభారంభముననే శ్రీ సోమయాజులుగారు లేచి నిన్నటి దినమున శాస్త్రిగారు చెప్పిన యశ్వసేవా విధానము సత్యముగా నట్లే యున్నది గాని యసత్యము గాదని చెప్పుటచే నందరును సావకాశముగా నా యుపన్యాసము నాలకించిరి.’

తన రచనను గర్హిస్తూ పండిత సభలలో చేసిన తీర్మానాల గురించి, వాటిపై పత్రికల స్పందన గురించి పెండ్యాలవారు ఒక చోట ఇలా రాశారు:

‘…పిమ్మట వారు(శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు) వెళ్ళిన రెండు పండిత సభలలో నన్నును, నా గ్రంథములను గర్హించు తీర్పులు పొడసూపినవి…కలువాయి(అనే ఊరు)లోని నిరాకరణపు తీర్పయుక్తమని ‘ఫెడరేటెడ్డు ఇండియా’ యను ఆంగ్ల వారపత్రిక యిట్లు నిరసించినది.

Finally a resolution was accepted condemning in unmeasured terms the work of Pendyala Subrahmanyasastry of Pithapuram who is alleged to have committed the sin of criticizing Bharatam and its author. It is unfortunate that our sense of veneration to all that is ancient should be so keen as to resent any criticism. Literary criticism is at its lowest ebb in Andhra and if the few who courageously come out with views of their own should be hunted out. I am afraid we are not advancing the cause of literature to any extent…

సంప్రదాయపు మూసను దాటి ఆలోచించగల మరో అరుదైన పండితుడు నాకు కనిపించారు: ఆయన, జమ్మలమడక మాధవరామశర్మ. పెండ్యాల, వారణాసి వార్ల మధ్య తలెత్తిన ఒక వివాదంలో జమ్మలమడకవారు ఒక తీర్పరిగా ఉన్నారు. బ్రహ్మసూత్రాలు రచించిన బాదరాయణుడు, వ్యాసుడు ఒకరు కారని పెండ్యాలవారి వాదన అయితే, ఒకరే నని వారణాసివారి వాదన. ఎవరి వాదన సమంజసమో నిర్ణయించడానికి 1947 జూలై, 2న అన్నవరం దేవస్థానంలో సభ ఏర్పాటు చేశారు. పెండ్యాలవారు ఎన్నుకున్న జమ్మలమడకవారిని, వారణాసివారు ఎన్నుకున్న పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రిగారిని తీర్పరులుగా నియమించారు. మళ్ళీ వీరిద్దరూ కలసి రాళ్ళభండి వేంకట సీతారామశాస్త్రి గారిని తీర్పరిగా ఎన్నుకున్నారు. పెండ్యాలవారు చారిత్రకమైన దృష్టితో సమీక్షిస్తే, చరిత్ర సంబంధములేని ప్రామాణిక దృష్టితో వారణాసి వారి వాదము సాగిందనీ, ఎవరి విమర్శ కూడా గాఢంగా లేదనీ, నేను ఈ తగాయిదాను త్రోసివేస్తున్నాననీ జమ్మలమడకవారు తీర్పు చెప్పారు. మిగిలిన ఇద్దరూ వారణాసి వారి పక్షం వహించి ఆయనకు అనుకూలంగా ‘మెజారిటీ’ తీర్పు ఇచ్చారు. ఈ ఇద్దరిలో సంప్రదాయ పాక్షికత వ్యక్తమైతే, జమ్మలమడకవారిలో విషయ ప్రధానమైన నిష్పాక్షికత కనిపిస్తుంది.

***

క్షమించాలి, కన్యాత్వ చర్చలోకి వెళ్లకుండానే ఈ వ్యాసాన్ని ముగించాల్సివస్తోంది. దాని గురించి మరోసారి….

 

 

 

 

 

 

మంచుకొండ

MY

 

నా పేరు రాజేష్ యాళ్ళ. ఉండేది విశాఖపట్నంలో.
ఉద్యోగం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో క్యాషియర్ గా.
అప్పుడప్పుడూ కథలు రాయడం ప్రవృత్తి. తెలుగు భాషన్నా
తెలుగు సాహిత్యమన్నా ఎనలేని ఇష్టం.

— రాజేష్ యాళ్ళ

“ఎక్కు! బెంచీ ఎక్కి నిలబడు!!” చలం మేష్టారు కేక వేసేసరికి బిత్తరపోయి గబగబా బెంచీ ఎక్కేసాడు అనిల్.
“మూడో తరగతికే ఇంత కొమ్ములొస్తే ఎలారా నీకు?!” వాడేదో అన్నాడని ఇష్టమొచ్చినట్టు పక్క వాణ్ణి చితక్కొట్టెయ్యడమే?!” మళ్ళీ కోపంగా అరిచారు చలం మేష్టారు.
జవాబు ఏమీ చెప్పకుండా మౌనంగా తల దించుకున్నాడు అనిల్. క్లాసులో పక్కన కూర్చున్న గోపిగాడు తనను పదే పదే ఏడిపిస్తుంటే తట్టుకోలేక వాడి చెంప మీద గట్టిగా ఒక్క గుద్దు గుద్దేసరికి వాడు పక్కకు తిరిగడంతో వాడి కన్ను మీదకు పోయింది దెబ్బ!! క్షణాల్లో వాడి కన్ను నుదుటివరకూ పొంగుకొచ్చి భయంకరంగా వాచిపోయింది. దాని పర్యవసానమే ఇప్పటి దాకా తన వీపు వాయించి, బెంచీ ఎక్కించిన చలం మేష్టారి ఆగ్రహానికి కారణం!
హాజరు వెయ్యడం అయ్యాక పాఠం చెప్పేందుకు తెలుగు వాచకం తెరిచి అంతలోనే క్లాసు మధ్యలో నించున్న అనిల్ గాణ్ణి చూసి పుస్తకం మూసేసారాయన. “నీ వల్ల నాకు పాఠం చెప్పాలన్న ఆసక్తి కూడా పోయిందిరా!” అని కోప్పడి, “ఈ పూటకి ఎక్కాలు చదువుకోండ్రా!” అని పిల్లలకు ఆజ్ఞను జారీ చేసారు చలం మేష్టారు.
చిన్న పల్లెటూర్లోని ఆ స్కూల్లో చలం మేష్టారికి పాఠాలు బాగా చెపుతారని ఎంత మంచి పేరుందో, కోపానికి పరాకాష్టగా కూడా అంతే పేరుంది. ఒకటినుండి అయిదు తరగతులున్న ఆ పాఠశాలలో ఎంతోకాలంగా ఆయనొక్కడే మేష్టారు. వంద మందికి పైగా ఉండే అందరు పిల్లలనూ, అన్ని తరగతులనూ తానొక్కడే నల్లేరు మీద నడకలా గత పదహారేళ్ళుగా లాక్కొస్తున్నాడు.
స్కూల్ బంట్రోతు రంగయ్య లాంగ్ బెల్ కొట్టేందుకు వెళ్ళడం గమనించిన పిల్లలు గబగబా పలకా పుస్తకాలూ సర్దేసుకున్నారు. గంట మ్రోగడమే తడవుగా కేరింతలు కొడుతూ బైటకు పరుగులు తీస్తున్నారు. బెంచీ ఎక్కి శిక్ష అనుభవిస్తోన్న అనిల్గాది వైపు కక్ష సాధించిన సంతృప్తితో వెటకారంగా నవ్వుతూ చూస్తూ బైటకు వెళుతున్నాడు గోపి. ‘నీ పని బైటకొచ్చాక చెప్తానూ అన్నట్టు చూపుడు వేలు చూపుతూ అనిల్ గాడు బెదిరించడం మేష్టారి కళ్లలో పడనే పడింది.
“నువ్వు ఇంటికి వెళ్ళరా!” అని గోపి గాడిని గావు కేక పెట్టి పంపేసారు చలం మేష్టారు.
“ఎందుకురా నీకు అంత పొగరు?! వేలు పెట్టి బెదిరిస్తున్నావ్, వాణ్ణి చంపేస్తావా?” అనిల్గాడి వీపు మళ్ళీ పేలింది.

“వాదు నన్ను వెక్కిరిస్తున్నాడు సార్!” వెక్కుతూ వెక్కుతూ చెప్పాడు అనిల్ అందీ అందని తన చేతులతో వీపు వెనుక తడుముకుంటూ.
“ఇంతకూ వాడు నిన్నేమన్నాడని వాది కంట్లో పొడిచేసావ్?!”
“నేను చెత్తకుప్పలో పుట్టానట. అస్తమానూ అలా అని నన్ను ఏడిపిస్తున్నాడు.” వాడి దు:ఖం కట్టలు తెంచుకుంది.
‘ముందే ఏమైంది’ అని అడిగి ఉండాల్సింది అనుకున్నారు చలం మేష్టారు వాడి వైపు జాలిగా చూస్తూ.

Kadha-Saranga-2-300x268

***

“వదిలెయ్యండి మేష్టారూ! ఇంక కొట్టకండి… పసి పిల్లాడు కదా” చలం మేష్టారికి అడ్డం వెళ్తూ చెప్పాదు గిరి.
“అయిదో క్లాసుకొచ్చాడు, ఇంకా చిన్నపిల్లాడేంటయ్యా గిరీ! అసలు నిన్ను అనాలి. ముప్పూటలా వాదికి తిండి పెట్టి గారాబం చేస్తూ మేపుతున్నావ్!!” చలం మేష్టారి కోపం తారాస్థాయినుండి దిగడంలేదు.
బిక్కుబిక్కుమంటూ గిరి చాటునుండి చూస్తున్నాడు అనిల్ గాడు. అప్పటికే వాడి వీపు, చెంపలు బాగా వాతలు తేలిపోయి ఉన్నాయి, మేష్టారు కొట్టిన దెబ్బలకు!
“ఇంకెంత కాలం మేష్టారూ?! అయిదుగురు పిల్లలతో మొదలు పెట్టాను. వాళ్ళంతా వెళ్ళిపోయారు. వీడొక్కడె మిగిలాడు. ఇంకా పిల్లలను తెచ్చి పోషించే ఓపిక నాకూ లేదు. నాతో ఔన్నదుకైనా వీడిని సరిగ్గా చూసుకోకపోతే ఎలా చెప్పండి? ఉన్నంతలో బాగానే చదువుతాడు కదా! మనం కాకపోతే ఎవరు చూస్తాం చెప్పండి?” అనిల్ గాడిని దగ్గరకు లాక్కుంటూ చెప్పాడు గిరి.
“కానీ వీడికి అంత పొగరెందుకు చెప్పు? తోటిపిల్లలు వెక్కిరించిన మాత్రాన వాడి చేతికి పని చెప్పేసి వాళ్ల ఎముకలు విరగ్గొట్టేసి నా ఉద్యోగానికే ఎసరు పెట్టేస్తున్నాడు వీడు. ఐదో క్లాసుకొచ్చాడు… ఆ మాత్రం బుద్ధి రాకపోతే ఎలాగయ్యా? రోజుకో కేసు! వీడితో ఎలా వేగడం చెప్పు?!” కోపంగా చెప్పారు చలం మేష్టారు.
“ఇక ముందెప్పుడూ అలా చెయ్యడులెండి మేష్టారూ… ఈసారికి వదిలెయ్యండి! ఏరా అనిల్, ఇంకెప్పుడైనా ఇలాంటి తప్పు చేస్తావా?!” అడిగాడు గిరి.
చెయ్యను అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు అనిల్.
“నువ్విలా ప్రతిసారీ చెప్పడం, వాడు షరా మామూలుగా చెయ్యడం కొత్తేం కాదుగా?! వాడు మారతాడని అనుకోవడం కలలో మాట! వెళ్ళండి వెళ్ళండి!” విసుగ్గా చెప్పారు చలం మేష్టారు.
బాగా చిన్నదైన ఆ ఊళ్ళో అనాథలను చేరదీసి వాళ్ళూ వీళ్ళూ ఇచ్చిన విరాళాలతో అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు గిరి. ఇప్పటివరకూ అతను చేరదీసిన పిల్లలను ఎవరో ఒకరు దత్తత తీసుకుని టవున్లోకి తీసుకెళ్ళిపోయారు. ఇక మిగిలింది అనిల్ ఒక్కడే! ఎక్కడో దొరికాడు అని పసికందును తెచ్చి పడేసి తొమ్మిదేళ్ళ క్రితం ఎవరో తెచ్చి తన దగ్గర పడేసిన వాడిని ఓపిగ్గా పెచుతూ వచ్చాడు గిరి. పదిహేనేళ్ళ క్రితమే అతని భార్య మరణిచింది. వంట చేసేందుకు అతనికి సాయంగా ఓ నడివయసామే ఉంటుంది.
“ఏమయిందిరా? ఎందుకురా అలా మేష్టారి చేత దెబ్బలు తింటూనే ఉంటావ్?! నేను మాత్రం ఎన్నిసార్లు ఆయంకు సర్ది చెప్పగలను చెప్పు?!” సముదాయిస్తూ అడిగాడు గిరి.
“లేదు మావయ్యా! ఈ రోజు మేష్టారు స్కాలర్ షిప్ డబ్బులు వస్తాయని అప్లికేషన్ మీద నా సంతకం తీసుకున్నారు. దాన్ని పూర్తి చేస్తుంటే అందరూ మూగి….” ఏడుపుతో వాడు మాట పూర్తి చేయ్యలేకపోయాడు.
“ఏమైంది?! మూగి ఏం చేసారు?” ఏం వినాలో అని బాధపడుతూ అడిగాడు గిరి.
“ఆ అప్లికేషన్లో అమ్మ పేరు కానీ, నాన్న పేరు కానీ లేదట. అక్కడ మేష్టారు గీత గీసి వదిలేసారు. కింద మరోచోట నీ పేరు రాసారు. అది చూసి గోపి గాడు, రాంబాబు గాడు, ఇంకా ఇద్దరు ముగ్గురు నీకు అమ్మా నాన్నా లేరోచ్…. అంటూ గోల గోల చేసి నన్ను ఏదిపించారు. నాకు ఏదుపొచ్చింది మరి. క్లాసు అవ్వగానే వాళ్ళను ఒక్కొక్కణ్ణీ పట్టుకుని… బాగా…”
“అలా నీ ఇష్టం వచ్చినట్టు అందర్నీ బాదేస్తే ఎలారా? వాళ్ళు అంతా కలిసి నిన్ను తంతే ఏం చేస్తావ్?! తప్పు కదా?!”
“వాళ్ళూ నన్ను కొట్టారు మావయ్యా! ఇంకా మేష్టారు కూడా!! కానీ వాళ్ళు అలా అంటుంటే నేనెందుకు ఊరుకొవాలి చెప్పు?!” తొమ్మిదేళ్ళ అనిల్ గాడికి ఏడుపును అదుపులో ఉంచుకోవడం మరిసాధ్యడలేదు.
దగ్గరగా హత్తుకుని వాది జుత్తులో వేళ్ళుంచి దువ్వుతూ ఉండిపోయాదు గిరి, ఎలా పందించాలో తెలియని అయోమయంతో, దిగులుతో!

***

ఆ రోజు భయం భయంగానే క్లాసులోకి అడుగు పెట్టాడు అనిల్.
“ఏరా! చాలా త్వరగా వచ్చేసావ్ ఇవాళ?” చలం మేష్టారు గర్జించారు.
అప్పటికే డజను మందికి పైగా పిల్లలు మోకాళ్ళ పైన కూర్చుని చేతులు కట్టుకుని ఉన్నారు.
‘ఈరోజు నా పని ఐపోయినట్టే’ అని మనసులో అనుకుంటూ బెదురుగా చెప్పాడు అనిల్, “వస్తుంటే దారిలో చెప్పు తెగిపోయింది సార్… అది కుట్టించుకోవడానికి నా దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ వెనక్కి వెళ్ళి గిరి మావయ్యనడిగి డబ్బులు తీసుకుని కుట్టించుకొచ్చేసరికి ఆలస్యం అయింది.”
“కుంటిసాకులు చెప్పమంటే సవాలక్ష చెప్తార్రా మీరు!” మాట పూర్తి అయ్యేలోగానే అనిల్ గాడి వీపు మీద దభీ దభీమని నాలుగు దెబ్బలు పడిపోయాయి.
“నిజమే చెప్తున్నా సార్!” గిర్రున కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా చెప్పాడు అనిల్.
మళ్ళీ గట్టిగా పేలింది అనిల్ గాది వీపు చలం మేష్టారి హుంకరింపుతో- “నోర్ముయ్! ఎదురు చెప్పావంటే వీపు చీరేస్తాను!!
***
గిర్రుమంటూ పదిహేనేళ్ళు గడిచిపోయాయి.
“సర్! వైభవ్ ఇండస్ట్రీస్ బోర్డ్ మీటింగ్ వచ్చే నెల పదహారో తేదీ పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు.” పీ ఏ ప్రదీప్ వినయంగా చెప్పాడు.
కాస్త ఆలోచించి చెప్పాడు అనిల్, “పదహారో తేదీ అని వాళ్ళే అనేస్తే ఎలా ప్రదీప్?!” వాళ్ళ ఎకౌంట్స్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు కదా. రెండురోజుల్లో చెప్తామని చెప్పు.”
“ఓకే సర్!” పీ ఏ ఫోన్లో అవతలి వాళ్ళకు చెప్పడానికి బైటకు వెళ్ళాడు.
టేబుల్ మీదున్న ఫోన్ మ్రోగింది. “సర్! అహూజా గ్రూప్ ఛైర్మన్ గారు లైన్లో ఉన్నారు. మాట్లాడతారా?!” రిసెప్షనిస్ట్ అడిగింది.
“సరే, కనెక్ట్ చెయ్” చెప్పాడు అనిల్. కంపెనీ వ్యవహారాలకు సంబంధించిన కీలక విషయాలు కావడంతో పది నిమిషాల పైనే జరిగింది ఆ సంభాషణ.
ఫోన్ పెట్టేస్తుంటే, “ఎక్స్ క్యూజ్ మీ సర్…” అంటూ లోపలకి వచ్చాడు ప్రదీప్.
“ఇవ్వాళ మనం సీ షెల్స్ కంపెనీ బోర్డ్ మీటింగ్ కి వెళ్ళాలి. మధ్యాహ్నం లంచ్ అక్కడే! సాయంత్రం అయిదు గంటలకు పోర్ట్ ఇండోర్ స్తేడియంలో జరగబోయే కంపెనీ సెక్రటరీల కాంఫరెన్సును మీరు ప్రారంభించాలి. అక్కడ చీఫ్ లెక్చర్ కూడా మీదె…” ఆరోజు దినచర్యను వల్లె వేసాడు ప్రదీప్.
“చాలా టైట్ గా ఉంది ప్రదీప్ ఇవాళ షెడ్యూల్! సరే కానీ, ఏం చేస్తాం తప్పదుగా?! బయలుదేరదామా?!” టై సరిగ్గా బిగించుకుంటూ అడిగాడు అనిల్.
అలా ఉదయం ఆఫీస్ నుండి బయలుదేరింది మొదలు రాత్రి తొమ్మిది దాకా బిజీ అయిపోయాడు అనిల్. “కంపెనీ సెక్రటరీ అంటే ఇంత ఊపిరి సలపని జీవితం అని ముందే తెలిసి ఉంటే చదివే వాణ్ణి కాదయ్యా ప్రదీప్!” ఉసూరుమని కారు సీట్లో వెనక్కి చేరగిలపడుతూ చెప్పాడు అనిల్.
“అలా అనకండి సర్! దేశంలోనే మీకెంతో పేరుప్రఖ్యాతులున్నాయి. సంపాదన కూడా తక్కువేమీ కాదు. ఇంతకంటే అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి?” ప్రదీప్ మాటల్లో అసూయ కూడా తొంగి చూసింది.
“కావచ్చు కానీ నా కోసం నేనంటూ గడిపే సమయం ఉండడంలేదు ప్రదీప్!” బాధగా చెప్పాడు అనిల్.
“వస్తుందిలెండి… ముందు పెళ్ళి చేసుకోండి సర్!” అని నవ్వాడు ప్రదీప్”నాకే టైం దొరకడంలేదు… ఏదో సామెతలా నా జీవితంలోకి మరొకరా? చూద్దాంలే!” అనిల్ కూడ నవ్వాడు.
“కాంఫరెన్స్ తర్వాత డిన్నర్ చెయ్యమని చాలా అడిగారు సర్ వాళ్ళు!”
“నన్నూ అడిగారు ప్రదీప్. కానీ మధ్యాహ్నం భోజనమే బాగా ఎక్కువైంది. అందుకే పళ్ళ రసంతో సరిపెట్టేసాను. ఇంతకూ నువ్వేమైనా తిన్నావా?!”
“తిన్నాను సర్! థ్యాంక్ యూ!” చెప్పాడు ప్రదీప్.
అంతలో అనిల్ ఫోన్ మ్రోగింది.
“బాబూ, అనిల్ నువ్వెలా ఉన్నావ్?” అవతలినుండి ప్రశ్నించిందో స్త్రీ కంఠం.
ఆ గొంతులోని తేడాను వెంటనే పసికట్టాడు అనిల్. “ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావ్?!” ఆదుర్దాగా ప్రశ్నించాడు.
“నువ్వో సారి ఇక్కడకు రాగలవా అనిల్?” గద్గద స్వరంతో అర్థింపు వినపడి వెంటనే ఫోన్ పెట్టేసిన ధ్వని. మళ్ళీ చాలాసేపు ఆ ఫోన్ నంబర్ కి డయల్ చేసాడు కానీ ప్రయోజనం లేకపోయింది. అవతలి వైపు ఎవ్వరూ ఎత్తలేదు.

“ఏమయింది సర్? ఎనీ ప్రోబ్లెం?” ఆత్రుతగా ప్రశ్నించాడు ప్రదీప్.
“అదే తెలియడంలేదు. వెంటనే నేను ఊరు బయల్దేరాలి. తెల్లారేసరికల్లా చేరుకోవాలి. ప్లీజ్, నాకో సాయం చెయ్యాలి ప్రదీప్. మరో గంటలో నేను హైదరబాద్ ఫ్లైట్ అందుకోవాలి. నాకు టికెట్ ఎయిర్ పోర్ట్ కి తెచ్చి ఇవ్వగలవా?” అర్థింపుగా అడిగాడు అనిల్.
“అయ్యో అదెంత పని సర్! దార్లో ఉన్న ట్రావెల్ ఏజెన్సీ దగ్గర నన్ను వదిలెయ్యండి. ఈలోపుగా ఇంటికి వెళ్ళి అన్నీ సర్దుకుని ఎయిర్ పోర్టుకి రండి.” వెంటనే చెప్పాడు ప్రదీప్.
దార్లో ప్రదీప్ ను వదిలిపెట్టి తను ఇంటికి చేరుకున్నాడు. గబగబా బట్టలు బ్యాగ్ లో సర్దుకుని, స్నానం చేసి ఆ వెంటనే ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. దార్లోనే హైదరబాద్ లోని తన మిత్రునికి ఫోన్ చేసి హైదరాబాద్ నుండి ఊరికి వెళ్ళేందుకు కారు ఏర్పాటు చేసుకున్నాడు.
కారు దిగి అడుగులు వేస్తున్న అనిల్ కి పరుగులాంటి నడకతో ఎదురొచ్చాడు ప్రదీప్. అనిల్ చేతికి ఓ కవర్ అందిస్తూ చెప్పాడు, “సర్, ఈ కవర్లో టికెట్ ఉంది. మరో పావుగంటలో హైదరాబాద్ ఫ్లైట్ బయల్దేరబోతోంది. మీ పేరు ఇప్పటికే చాలాసార్లు పిలిచారు. వెళ్ళండి.” తొందరపెట్టాడు ప్రదీప్.
“థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్!” అని ఎయిర్ పోర్టు లోపలికి పరుగు పెట్టాడు అనిల్.
“హ్యాపీ జర్నీ సర్!” ప్రదీప్ మాటలు వినిపించాయి వెనుకనుండి.
వెనక్కి తిరక్కుండానే చెయ్యి ఊపి లోపలికి వెళ్ళాక సరిగ్గా మరో పావుగంటకల్లా విమానంలో కూర్చున్నాడు అనిల్. ఖచ్చితంగా బయల్దేరవలసిన సమయానికే విమానం గాల్లోకి లేచింది. నిస్త్రాణగా కళ్ళు మూసుకున్నాడు అనిల్. అతని మనసులో ఏవేవో ఆలోచనలు! విమానం ముందుకెళుతున్నా అతని మనసు మాత్రం పదిహేనేళ్ళ వెనక్కి మళ్ళింది.
***
ఆ రోజు ఎప్పుడూ లేనంత ప్రసన్నంగా ఉంది చలం మేష్టారి ముఖం. ఆయనకు ప్రమోషన్ తో పాటూఅ టవున్లోని హై స్కూల్ కి బదిలీ కావడమే అందుకు కారణం!
హడావిడిగా పరుగు పెడుతూ వచ్చిన రంగయ్య తెచ్చిన వార్త వింటూనే ఆయన ముఖంలోని ఆనందం మటుమాయమైంది. వెంటనే ఊళ్ళోకి బయలుదేరారు చలం మేష్టారు. గుమిగూడిన జనం మధ్యలోంచి ఖాళీ చేసుకుంటూ ముందుకు వంగిన ఆయనకు అక్కడ కనిపించిన దృశ్యం – విగతజీవుడై ఉన్న గిరి, ఆ పక్కనే “మావయ్యా…. మావయ్యా….” అంటు బిగ్గరగా ఏడుస్తూ అనిల్!
ఉదయాన్నే గుండెపోటుతో మరణించాడు గిరి. మంచివాడిగా పేరు పొందడంవల్లనో ఏమో, ఊరు ఊరంతా అక్కడే ఉంది. అంతా తలా చెయ్యీ వేసి అతని అంతిమసంస్కారానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
“బ్రతికితే ఇలాంటి బ్రతుకే బ్రతకాలి. తనకెవ్వరూ తోడు లేకపోయినా అమ్మానాన్నలు లేని పిల్లలకు తానే తోడై వాళ్ళదే లోకంగా బ్రతికాడు.”
“తనకు ఉన్న దాంట్లోనే ఇంకొందరికి పెట్టడం అందరి వల్లా అవుతుందా?! పుణ్యాత్ముడు!”
గిరి పట్ల సానుభూతితో, అభిమానంతో అక్కడి జనం చెప్పుకుంటున్న మాటలు వినబడ్డాయి చలం మేష్టారికి. అక్కడి హృదయవిదారక దృశ్యానికి, ఆ మాటలకు ఆయన కళ్ళలోనూ కన్నీళ్ళు సుడులు తిరిగాయి.
శవం లేచింది. “మావయ్యా….” అంటూ పెద్దగా ఏడుస్తూ వెనుకే పరుగెత్తాడు అనిల్. దహనం అవుతున్నంతసేపూ అనిల్ ను తనకు దగ్గరగా పొదవుకుని ఓదారుస్తుంటే వెక్కిళ్ళ మధ్యలో చెప్పాడు అని, “దేవుడు మంచోడు కాదు సార్! లోకంలో అందరికంటే మంచివాడైన మా మావయ్యను ఎత్తుకుపోయాడు.”
ఉబికి వస్తోన్న కన్నీటిని ఆపుకుంటూ చెప్పారు చలం మేష్టారు, “బాధపడకు నాన్నా! గిరి మావయ్య లేకపోయినా ఇకనుండీ నీకు నేనున్నానురా!” అనిల్ చెయ్యి పట్టుకుని తన ఇంటి వైపుగా నడుస్తూ.
తన ఇద్దరు కొడుకులతో పాటు అనిల్ ను ఏ లోటూ రాకుండా విద్యాబుద్ధులు నేర్పారు చలం మేష్టారు.
***
ఆలోచనలు, కునికిపాట్ల మధ్య హైదరాబాద్ చేరుకుంది విమానం. ఎయిర్ పోర్టు బైటకు రాగానే తన కోసం సిద్ధంగా ఉన్న కార్లో ఎక్కి కూర్చున్నాడు అనిల్.
తెలతెలవారుతుండగా ఊళ్ళోకి ప్రవేశించింది కారు. ఊరి పొలిమేరల్లోనే ఉన్న బంట్రోతు రంగయ్య ఇంటి దగ్గర కారు ఆపించాడు.
“రంగయ్య తాతా!” అని పిలిచాడు ఇంటి బైట నిలబడి.
“ఎవరూ?” అంటూ బాగా కిందకి ఉన్న ఆ తాటాకింటి చూరు కిందనుండీ వంగుని వస్తూ అడిగాడు రంగయ్య.
“నేను అనిల్ ని తాతా! ఎలా ఉన్నావు?” ఆప్యాయంగా అడిగాడు.
“నువ్వా అనిల్ బాబూ, నాకేం బాగానే ఉన్నాను కానీ సెలం మేట్టారి పరిస్తితే గోరంగా ఉందయ్యా! నిన్నే ఇంట్లో పెద్ద గొడవైపోయింది.”
“ఏమయింది?”
“పిల్లలిద్దరూ ఎప్పుడునుండో ఉన్నదంతా మాకు రాసిచ్చెయ్యమని గోల పెడతన్నారు బాబూ. ఆళ్ళ గోల బరించలేక నిన్ననే పంపకాలు సేసేసి రిజిట్రేసన్ కూడా సేసేసారు.”
“మరింక సమస్యేముంది?”
“అసలు సమస్య అదే కదా బాబూ. రిజిట్రేసన్ అయిపోగానే మీరు బైటకు నడవండంటూ సామాన్లు ఇసిరేసారు కొడుకులు, కోడళ్ళు!” కళ్ళనీళ్ళతో చెప్పాడు రంగయ్య.
చివ్వుమంటూ అనిల్ కళ్ళలోనూ కన్నీళ్ళు చిప్పిల్లాయి. “మరి వాళ్ళు ఎక్కడున్నారు?”
“పెద్దలు పంచాయితీ పెట్టి చెప్పినా ఎవరి మాటా ఆళ్ళు ఇనలేదు బాబూ. మేట్టారు అనిల్ బాబుకు వాటా వత్తాదని గోలెట్టినా కానీ ఇనకుండా కాయితాల మీద ఆళ్ళే బలవంతంగా సంతకాలు ఎట్టించేసుకున్నారు. పెసిడెంటు గారు అందాకా ఆళ్ళను పంచాయితీ ఆపీస్ పైనుండె గదిలో ఉండమన్నారు బాబూ!”
అయ్యో ఎంత పనైపోయింది?! అందుకే నిన్న అమ్మ కంఠం అంత దు:ఖంతో ఉంది! గబగబా కార్లోకి వెళ్ళి కూర్చుని పంచాయతీ ఆఫీసుకు వెళ్లాడు అనిల్.
మెట్లెక్కి తలుపు తట్టి “నాన్నా, అమ్మా!” అని గట్టిగా పిలిచాడు.
తలుపు తీస్తూనే అనిల్ ను చూసిన చలం మేష్టారు, జానకమ్మ దంపతులు వాటేసుకుని ఒక్కసారిగా బావురుమన్నారు.
“వచ్చావా నాన్నా! వాళ్ళు న్యాయంగా నీకు రావల్సిన ఆస్థిని లాగేసుకున్నార్రా! ఈ చేతులతో కష్టపడి కట్టుకున్న ఇంటిని బలవంతంగా వాళ్ళ పేరు మీద రాయించేసుకున్నారు.” రుద్ధకంఠంతో చెప్పారు చలం మేష్టారు.
“కట్టుబట్టలతో మమ్మల్ని తరిమేసారు బాబూ!” జానకమ్మ అశ్రువులు అనిల్ భుజాన్ని తడిపేస్తున్నాయి.
“ఊరుకో అమ్మా! మరేం పర్వాలేదు నేనొచ్చానుగా” అని జానకమ్మ కనులు తుడుస్తూ చెప్పాడు అనిల్. చలం మేష్టారిని కూడా ఓదార్చాడు, “ఊరుకోండి నాన్నా! ఆ ఆస్థి కోసం నేనెప్పుడూ ఆశ పడలేదు. అనాథగా మళ్ళీ రోడ్డున పడాల్సిన నన్ను చేరదీసి మీ కొడుకుగా చేసుకున్నారు. కోపంతో వృత్తిపరంగా మీరెన్ని దెబ్బలు కొట్టినా మంచుకొండలాంటి మీ మనసుతో నన్నింతటివాడిని చేసారు. మీ ఋణం ఎలా తీర్చుకోగలను చెప్పండి?! పదండి, వెళ్దాం!”

***

ముంబాయిలో విమానం దిగిన ముగ్గురూ కార్లో ఇంటికి చేరుకున్నారు. కారు దిగి, “ఇకనుండి ఇదే నాన్నా మీ ఇల్లు!” భరోసాగా చెప్పాడు అనిల్.
“ఎక్కడిదిరా ఈ ఇల్లు? నువ్వు అద్దె ఇంట్లో కదా ఉండేవాడివి?” ఆశ్చర్యపోతూ అడిగారు చలం మేష్టారు.
“మనదే నాన్నా! ఈ మధ్యనే కొన్నాను. ఇటు చూడండి…” అని వాళ్ళిద్దరినీ గేటు పక్కకు తీసుకెళ్లాడు అనిల్.
‘గిరినిలయం’ అన్న అక్షరాలను చదువుతూనే చలం, జానకమ్మల కనులు మరింత సంతోషంతో తడిసాయి.

***

మనసు పొరల జల

pulipati
కథా ఆరంభానికి ,
ముందు జరిగిన కథ
ఎప్పుడో బయటకు రాక తప్పదు
*       *       *
ఎందుకో పసిగట్టే పరికరాలు నా కాడ లేవు
నిన్ను చూడంగానే
ఎక్కడో పేరుకుపోయిన దుఃఖం
ఊపిరాడనివ్వదు
ఇంత వేసవి తీవ్రతని తడుపుతూ
నీ తలపొకటి
లోపల ప్రవహిస్తే తప్ప
దుఃఖం కోలుకుంటుంది
నిరాసక్త క్షణాలకి మనమే కదా ప్రాణం పోసి
జ్ఞాపకాల వరుసకి చేర్చేది
ఆ దుఃఖ భాండాగారం
ఎప్పటికీ తొణికిసలాడాలి
అది జీవిస్తున్న ఉనికిని నిలుపుతుంది
నువ్వు ఆనందాన్ని
వెంట తెచ్చుకున్నట్టే
నేను దుఃఖాన్ని కలిగివున్నట్టు
నిన్ను కలిసిన పిదప తెలిసిపోయింది
రెండూ కలిసిన సందర్భాలు
పూల మీదికి ఎట్లా చేరుకున్నాయో
ఇప్పటికీ సందేహమే నాకు.
పక్వ అపక్వత శరీరానికి అంటుతుంది కానీ
మనసెప్పుడూ దుఃఖపునురగతో
ఎప్పటికప్పుడు తేటమౌతుంది
555792_533520886738947_1575508102_n
నువ్వు నన్నుగా
 నా మనసుకి కోరుకుంటావు కదా!
దాన్ని అలా స్వచ్చంగా నీకందించటం కోసం
దుఃఖంలో మునిగితె తప్ప కుదరదు
*     *     *
కథ ప్రారంభానికి ,
ముందు ఒంటరిగా,కారణం లేని వెలితి
ఎడారి వ్యసనంలా
పగుళ్ళు బారిన దాహం ఎదురుచూసేది
దుఃఖమే ఒక పాయలా
కథనంతా ప్రవహించి
పచ్చని ప్రపంచాన్ని నవ్వులతో పువ్వులతో
కళకళా ప్రకటిస్తుంది.

డా.పులిపాటి గురుస్వామి
చిత్రరచన: రామశాస్త్రి

నిర్మల నది

 vamsee krishna

ఆమె ముందు మోకరిల్లాను
అపరిమితమైన  అనుకంపతో
ఆమె నా తలను స్పర్శించింది
నా లోలోపలి  పురా పాప భారమంతా
ఆమె స్పఅల్లకల్లోలమైంది ర్శలో  లయించింది
నీటి మీద పడవ  నడుస్తున్నట్టుగా
ఆమె కరుణ నన్ను నడుపుతోంది
జ్ఞాన చక్షువు తెరుచుకుని
శరీరం తనకు తానే  వెళ్ళిపోయింది
పడవ  లోకి నీళ్లు  చేరాయి
తెరచాప దిశను మార్చుకుంది
పడవ  ముందుకూ  వెనుకకూ  ఊగిసలాడుతోంది
ఉన్నట్టుండి
పెనుతుఫాను  చుట్టు ముట్టింది
నది అల్లకల్లోలమైంది
పడవ తిరగబడుతోంది
“భయమేస్తుందా ?” అన్నదామె
“ఉహూ , నువ్వు  వున్నావు కదా ” అన్నాను
ఆమె నవ్వి
హృదయంలోకి  నన్ను తీసుకుంది
నది  నిర్మలంగా  మారింది
– వంశీకృష్ణ

వీలునామా – 37 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

కోట లో పాగా

తాననుకున్నట్టే మిసెస్పెక్ అడిలైడ్ వదిలి  మెల్బోర్న్ చేరుకుంది.

సముద్రప్రయాణంలో మూడురోజులుఅలిసిపోయినా, ఉత్సాహంగాకూతురి చిరునామా వెతికిపట్టుకుంది. ఏమాత్రం ఆలస్యంచేయకుండాఉన్నంతలోశుభ్రమైనబట్టలువేసుకుని కూతురిఇల్లుచేరుకుంది.

తలుపుతెరిచినపనమ్మాయితోతనపేరుమిసెస్మహోనీఅనీ, ఒక్కసారిఅమ్మగారితోమాట్లాడాల్సినఅవసరంవుందనీప్రాధేయపడింది. ఆఅమ్మాయిఅనుమానంగాచూస్తూమిసెస్పెక్నిలోపలికితీసికెళ్ళింది. అదృష్టవశాత్తూలిల్లీఫిలిప్స్ముందుగదిలోవొంటరిగాకూర్చొనుంది. చంటిపాపఆయాదగ్గరుంటే, ఎల్సీఇంకేదోపనిలోలోపలేవుంది.

లోపలికెళ్తూనేమిసెస్పెక్, కూతురిదగ్గరికెళ్ళిఆమెచేయిగట్టిగాపట్టుకుని,

“బెట్టీ! అమ్మా! నేనే, మీఅమ్మని. నన్నేమర్చిపోయావా?” అందిపనమ్మాయికివినబడకుండామెల్లిగామాట్లాడుతూ.

లిల్లీనివ్వెరపోయింది. పాలిపోయినమొహంతోలేచినిలబడింది. ఆమెగొంతులోంచిరాబోతున్నకేకనిపసిగట్టిమిసెస్పెక్,

“హుష్! బెట్టీ! అరవకు. ఊరికేనిన్నొకసారిచూసిపోదామనివచ్చా, ఎన్నాళ్ళయిందేనిన్నుచూసి! నిన్నుచూడాలనిప్రాణంకొట్టుకుపోయిందనుకో! అందుకేఎలాగోప్రయత్నంచేసినీమొగుడుఇంట్లోలేడనితెలుసుకునిమరీవొచ్చా! ఎంతమారిపోయావేనువ్వు!” కూతురినిపరిశీలనగాచూస్తూఅందిమిసెస్పెక్.

“అబ్బో! వేళ్ళకిఉంగరాలు, మెళ్ళోగొలుసులు, పెద్దఇల్లూ, నౌకర్లూచౌకర్లూ, దర్జా! అయినానిన్నుకన్నతల్లినీ, అందలంఎక్కించినఅమ్మనిమాత్రంమర్చిపోయావు. అవున్లే, నేనుచస్తేనీకేం, బ్రతికితేనీకేం! నీపెళ్ళయినీదార్ననువ్వెళ్ళిపోయాకానేనుపడ్డకష్టాలుఆపగవాడిక్కూడావద్దేతల్లీ! పోన్లేమ్మా, నువ్వైనాసుఖంగావున్నావు, అంతేచాలు,” కన్నీళ్ళుతుడుచుకుంటూ, ముక్కుచీదుకుందిమిసెస్పెక్.

తల్లీకూతుళ్ళకిపెద్దపోలికలులేకపోయినా, లిల్లీనిచూసిమిసెస్పెక్నిచూస్తే, ఆవిడాఒకవయసులోఅందంగావుండివుండేదేమోఅనిపించొచ్చు. భర్త గారాబమూ, నీడపట్టునజీవితమూ, మంచితిండీవుండడంచేతలిల్లీఆరోగ్యంగాఅనిపిస్తే, మిసెస్పెక్బ్రతుకులోదెబ్బలుతినిమొరటుమనిషిఅయింది. బ్రతుకుభయంలేనిలిల్లీమొహంనిర్మలంగాఅమాయకంగాఅనిపిస్తే, జన్మంతారకరకాలపోరాటాలుచేస్తున్నమిసెస్పెక్మొహంతోడేలుమొహంలాగుంది. లిల్లీకిఇంకాతల్లినిచూస్తేభయంగానేవుంది.

 

“అమ్మా! నువ్వెందుకొచ్చావిక్కడికి? స్టాన్లీకితెలిస్తేనన్నుచంపేస్తాడు!”

“ఇదిమరీబాగుందేవ్! కన్నబిడ్డనికళ్ళారాచూసుకోవడానిక్కూడాపనికిరానన్నమాట! నువ్వుమరీఇంతమారిపోతావనుకోలేదు.”

“అదిసరేకాని, స్టాన్లీ నువ్వుఅడిలైడ్లోవున్నావన్నాడే! ఇక్కడికెప్పుడొచ్చావ్? వస్తేవచ్చావుకానీ, వెంటనేవెళ్ళిపో! అక్కడే వుంటేస్టాన్లీనీఖర్చులకిడబ్బిస్తానన్నాడు!”

“అవున్లే, కన్నకూతురిక్కూడాకనికరంరానిజన్మనాది. నిన్నుచూడడానికిపడరానిపాట్లుపడివస్తేవెళ్ళిపొమ్మంటావేమిటే? అయినాభలేమంచిమొగుడుదొరికాడ్లే, అంతభయమేమిటివాణ్ణిచూస్తే”” కూతురిచేతులమీదముద్దులుపెట్టుకుందిమిసెస్పెక్.

“అయినాఆయనఇప్పట్లోరాడటకదా? కొద్దిరోజులుఊరికేవచ్చినిన్నుచూసిపోతూవుంటాను. ఎక్కడైనానన్నుచూసాడనుకో, నేనుఏదోపనిమనిషిననిచెప్పేయ్! నిన్నూపిల్లాణ్ణీచూసివెళ్తానే!”

నిజానికిలిల్లీఅమాయకురాలు. తల్లిచెప్పినంతతేలిగ్గాఅబధాలూకట్టుకథలూచెప్పలేదు.

“నీలానేనబధ్ధాలుఆడలేనమ్మా! స్టాన్లీతోదెబ్బలాడడంనాకిష్టంకూడవుండదు. పెళ్ళాడే ముందే నిర్మొహమాటంగా చెప్పాడు, నిన్ను మా ఇంటి గడప తొక్కనీయొద్దని. ఈ ఒక్క విషయంలో మొండి పట్టుదల తప్పించి స్టాన్లీ ఎంతో మంచివాడు. నన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు. అతనికి కోపం తెప్పించడం నాకిష్టం వుండదమ్మా! అర్థం చేసుకొని వెళ్ళిపో!” తల్లిని ప్రాధేయపడింది.

మిసెస్పెక్వున్నట్టుండిపెద్దగావెక్కిళ్ళుపెడుతూఏడవసాగింది. ఆగొడవకిపక్కగదిలోబట్టలుకుడుతూన్నఎల్సీపరుగునవచ్చింది. ఎల్సీనిచూడగానేమిసెస్పెక్, మాటమార్చింది.

“అమ్మా, లిల్లీగారూ, మీకుజన్మంతాఋణపడివుంటానమ్మా. ఏదోనాకూతురితోచిన్నప్పుడుఆడుకున్నమాటమర్చిపోకుండా, నన్నుఆదుకునేందుకుఒప్పుకున్నారు. అంతకంటేనాకింకేమీవొద్దు. మీరిచ్చేకొంచెండబ్బుతోఏదోఒకచిన్నవ్యాపారంపెట్టుకునినిలదొక్కుకుంటానమ్మా! మీదయఎన్నటికీమర్చిపోను,” వంకరగానవ్వుతూ, పైకిఏడుస్తూ, ఎల్సీవంకఓరకంటాచూస్తూకూతుర్నిఇరకాటంలోపెట్టింది. ఆమెనివొదిలించుకోకతప్పదనిలిల్లీతనడబ్బాలోడబ్బుకోసంవెదకసాగింది. ఆసమయంలోఎల్సీనిపరిశీలనగాచూసిందిమిసెస్పెక్. బహుశాఈఅమ్మాయేతానువిన్నఎల్సీమెల్విల్అయివుండొచ్చన్నఊహాఆమెమనసులోమెదలకపోలేదు.

“ఈఅమ్మాయెవరూ? పనమ్మాయా?” ఆరాగాఅడిగింది. అవునన్నట్టుతలూపిందిలిల్లీ.

“ఇదిగోఅమ్మాయ్! అమ్మగారికిఆరోగ్యంబాగోనట్టుంది. వెళ్ళికొంచెంవేడిగాతాగడానికేదైనాతెచ్చిపెట్టు!”

ఆమెగొంతులోవినవస్తున్నఅధికారానికిఆశ్చర్యపోయిందిఎల్సీ. ఏంమాట్లాడకుండాఆమెఅడిగిందిచ్చి మళ్ళీతనపనిలోపడింది. అయినాఆకొత్తమనిషీ, ఆమెఅమ్మగారితోచూపిస్తున్నచనువూ, అమ్మగారుడబ్బులకోసంవెదుకులాటాఎందుకోఎల్సీకిఅంతావింతగాఅనిపించింది. లిల్లీకిఅసలుడబ్బులతోపనేవుండదు. ఆమెఅవసరాలన్నీస్టాన్లీయేతీరుస్తాడు. ఇపుడీమెకిడబ్బివ్వడందేనికోఅనుకుంది.

“ లిల్లీ! ఏదోఇక్కడున్నకొద్దిరోజులూఅప్పుడప్పుడూనిన్నుచూడడానికివస్తూంటాను,” ఎల్సీలోపలికెళ్ళగానేమళ్ళీగుసగుసలాడిందిమిసెస్పెక్.

“నువ్వుమళ్ళీరానక్కర్లేదు. ఇదిగో, నాదగ్గరున్నడబ్బంతాఇచ్చేస్తున్నా. ఇదితీసుకొనిమళ్ళీనాకుకనపడకు, నీకుపుణ్యముంటుంది!”

“ఈడబ్బునాప్రయాణానికిసరిపోదమ్మాయ్! నాదగ్గరున్నదంతావూడ్చిఈవూరొచ్చాను. మరీఅంతభయపడతావేంనన్నుచూసి? అదిసరేకానీ, ఇందాకవొచ్చినమ్మాయెవరూ?”

“ఎల్సీఅని, నాక్కావాల్సినబట్టలవీకుట్టిపెడుతుంది. స్టాన్లీఆమెనిపన్లోపెట్టాడు. ఆమెఅన్నా, వాళ్ళఅక్కఅన్నాస్టాన్లీకెంతోఇష్టం.”

“మగవాళ్ళకిష్టమైనపనిమనిషినితరిమికొట్టకఇంట్లోవుంచుకున్నావా? ఎంతపిచ్చిమాలోకానివే!”

“అమ్మా! నీకుస్టాన్లీగురించసలేమీతెలియదు. అనవసరంగానోరుపారేసుకోకు. ఎల్సీకూడామంచిపిల్ల, అమాయకురాలు.” కోపంగాఅన్నదిలిల్లీ.

“ఆఅమ్మాయికిబట్టలుకుట్టడంవచ్చంటున్నావుకాబట్టినాకుతెల్సినవాళ్ళదగ్గర…”

“ఆఅమ్మాయినినువ్వుచూపించినపన్లోకిపంపాననితెలుస్తేస్టాన్లీమనమీదవిరుచుకుపడతాడు. వొదిలేయ్!”

“సరేలే, నీసంగతినాకెందుక్కానీ, మగవాళ్ళప్రేమలునమ్మడానికివీల్లేదు. ఆవొక్కవిషయంమాత్రంగుర్తుంచుకో. నాదగ్గరచిల్లికానీకూడాలేదేబెట్టీ! ఊరికేఅప్పుడప్పుడూవచ్చినీదగ్గరకాసేపుకూర్చొనివెళ్ళిపోతా. నోరెత్తితేఅప్పుడడుగు! ఇంకోపనిమనిషినిపెట్టుకున్నాననిచెప్పుఅందరితో. మాట్లాడకుండఒకమూలకూర్చొనినీకుస్వెట్టర్లుఅల్లిపెడతాను. ఇంతడబ్బున్నదానివి, కన్నతల్లికికాస్తసాయపడలేవటే?”

కొంచెంమెత్తబడిందిలిల్లీ!

“స్టాన్లీకితెలిస్తేమండిపడతాడనేనాభయమంతా…”

“దానికీనాదగ్గరఉపాయంవుందిగా? స్టాన్లీవచ్చేయగానేఈపనమ్మాయితోనాకెలాగోవార్తపంపించు. ఈచాయలక్కూడారాను!”

నిజానికిలిల్లీకితల్లిఅంటేమహాచెడ్డచిరాకు. పైగాతననెంతోప్రేమించినమ్మినస్టాన్లీమాటమీరడమంటేజంకుకూడా. ఆమెఆలోచించుకొనేలోపేమిసెస్పెక్మళ్ళీవెక్కిళ్ళుపెట్టిఏడవసాగింది. సరేననకతప్పలేదామెకు.

మళ్ళీమర్నాడువస్తాననిచెప్పిబయల్దేరిందిమిసెస్పెక్.

***

(సశేషం)

 

వూస బియ్యం..అనపకాయలు…నిన్నటి తీయని తలపులు!

Grain_millet,_early_grain_fill,_Tifton,_7-3-02

వూస బియ్యం…!

మీరు ఈ పేరు ఎప్పుడైనా విన్నారా..??

ఇది పల్లె టూర్లో  పుట్టి పెరిగిన వారికి మాత్రమే అర్ధమయ్యే మాట. అదీ మాగాణి భూముల్లున్న వారు కాకుండా ,మెట్ట పంటలు పండించే వారికి మాత్రమే తెలుస్తుంది. అవును..మళ్ళీ మెట్ట పంట లేంటీ అనే ప్రశ్న వచ్చింది కదా.. బాగా నీటి వసతి, కాలువలు, చెరువులూ, నదీ తీరాల్లో ఉన్నవారికి  వరి పంట పండుతుంది. లేదా వాణిజ్య పంటలు పండిస్తారు. కానీ నీటివసతి సరిగ్గాలేనివారు , వర్షాధార పంటలు , మెట్ట పంటలు పండిస్తారు. మెట్ట పంటలంటే వేరు శనగ , జొన్న, మొక్కజొన్న, సజ్జ ,కంది ,పెసర ,మినుము ఇలా అన్నమాట. మాకు మావూర్లో నీటి పారుదల లేదు. చిన్న చెరువు ,వర్షాధారం , మోట భావుల ద్వారా మాత్రమే పంటలు పండేవి. ప్రతి వారూ, వారికి సం.నికి సరిపడా వరి పంట వేసుకొని , మిగిలిన భూముల్లో మెట్ట పంట వేసుకొనేవారు అన్నమాట.

మా నాన్న గారూ కూడా అలాగే చేసేవారు. అందుకే మాకు కొద్దిగా వరి , వేరు శనగ, జొన్న ,సజ్జ, కంది ,పెసర , కొద్దిగా మిర్చి పండేవి. వేరు శనగ కాస్త ముదరగానే.. జీతగాళ్ళ ద్వారా అమ్మ ఇంటికి తెప్పించి, పచ్చికాయలు ఉప్పు వేసి ఉడికించడం , లేదా శనగ చెట్లు (ఎండినవి ) వేసి కాల్పించేది. వాళ్ళు ఇంటివెనుక మంటవేసి కాయలు కాలుస్తూ, కర్రతో మంట సరిచేస్తూ, కాయలు మాడకుండా తిప్పుతూ వుంటే , మేం చుట్టూ కూర్చుని కమ్మటి వాసన పీలుస్తూ కూర్చునేవాళ్ళం.  “దూరం జరగండి అమ్మాయి గారూ.. నిప్పురవ్వ ఎగిరొచ్చి మీద పడతుంది..” అన్నా వినేదాన్ని కాదు.నాకూ అలా కర్రతో విన్యాసం చెయ్యాలని వుండేది. కానీ ఇచ్చేవారు కాదు. భయం కదా..మా నాన్న అంటే..”దొర సంపేస్తాడు..నిప్పు తో చెలగాటం అమ్మాయిగారూ ..” అంటూ..అంతాకాల్చాక.. నీళ్ళు పల్చగా చల్లి నిప్పు ఆర్పి , చాటలోకి ఎత్తి, బొగ్గు, నుసి ,బూడిద చెరిగి అమ్మకు ఇచ్చేవాళ్ళు.

download

అమ్మ పేపర్ ముక్కలు చింపి వాటిల్లో కాల్చిన పల్లీలు , తలా ఒక బెల్లం ముక్క ఇచ్చేది..ఆ కమ్మటి  వాసన ,రుచి..ఆ పచ్చికాయలు కాల్చిన రుచి..ఇక జన్మలో తినగాలనా..ఉహూ..నమ్మకం లేదు..అవి గతకాలపు తీపి గుర్తులు మాత్రమే..నాకు ఉడక బెట్టిన పల్లీలు కూడా చాలా ఇష్టం. ఇప్పుడు రైతుబజార్ లలో పచ్చికాయలు దొరుకుతాయి అప్పుడప్పుడు..అవి ఉడకపెడతాను ,ఉప్పేసి కుక్కర్లో..కానీ ఆ రుచి..నా చిన్నప్పుడు అమ్మ కట్టెల పొయ్యి మీద ,ఇత్తడి గిన్నెలో ఉడికించిన రుచి..మళ్ళీ ఎలావస్తుంది..?
మీకు వూస బియ్యం గురించి కదా చెప్తాను అన్నాను.. అక్కడికే వస్తున్నా.. జొన్న , సజ్జ కంకులు వేసి గింజ పట్టి కొద్దిగా గింజ గట్టి పడగానే వాటిని ‘పాల కంకులు’ అంటారు. అంటే గింజలు తియ్యగా , నమిలితే పాల లాగా ఉంటాయన్నమాట. అప్పుడు కూడా అమ్మ కంకులు తెప్పించేది. పనివాళ్ళు వాటిని రెండు చేతులతో నలిచేవారు. అప్పుడు కంకులనుండి గింజలు రాలినా ,వాటికి నుసి వుండేది..అది గొంతులో గుచ్చుకుంటుంది. మళ్ళీ బాగా నలిచి, చెరిగి, పూర్తిగా నుసి పొయ్యాక మాత్రమే తినాలి. ఆ గింజలని “వూసబియ్యం “ అంటారు. వాటిని అలా తిన్నా..ఎంత తియ్యగా ఉంటాయో..నాకు సజ్జ వూసబియ్యం చాలా ఇష్టంగా ఉండేవి. వాటిలో కొద్దిగా చక్కర వేసి తింటే..ఆ రుచి ఎలా చెప్పను…??? నేను తినే ..దగ్గర దగ్గర 39,40 సం. అయ్యింది. ఇప్పటి వారికి సజ్జ , జొన్న ఎలావుంటాయో కూడా తెలియదు..ఇక వాటి రుచి తెలిసే అవకాశం శూన్యం… పైగా పంటలు రాగానే, మా అమ్మ సజ్జన్నం, జొన్నన్నం వండేది..గోంగూర పచ్చడి , దోసకాయ పప్పు, వెన్న, ఉల్లికారం కాంబినేషన్స్ తో..అసలు అలాంటి విందు భోజనాలూ ,రుచులూ ఎంత మందికి తెలుసు..?తిన్నవారు వుంటే..చెప్పండి ..విని ఆనందిస్తాను.
అలాగే మరో రుచి..నాకు ఎప్పుడూ గుర్తుకొచ్చేది..మేం కోదాడ కి వచ్చేటప్పటికే నాకు దొరకని ఆ రుచి..ఉడకబెట్టిన ‘అనపకాయలు’… అబ్బ.. నాకు విపరీతమైన ఇష్టం ..అవి మాకు పండేవికాదు…అవి పొలం గట్లమీద తీగల్లాగా వేసుకొనేవారు..చిక్కుడు కాయల్లగేవుంటాయి. గింజలు కూడా చిక్కుడు గింజల కన్నా కాస్తపెద్దగా ,ఆకుపచ్చగా..ఉండేవి. కాయలతోసహా తంపెట (నీళ్ళలో ఉడికించడం ) పెట్టేవారు..స్కూల్లో కొందరు అమ్మాయిలు తెచ్చేవారు. నాకు ఇష్టమని ఇచ్చేవారు..కానీ నాకు మాఇంట్లో ఎక్కువగా తినాలని ఆశ. బయట తిన్నానని చెపితే తిట్టేది అమ్మ. అలా ఎవరు పడితే వాళ్ళు పెట్టినవి తినకూడదు అని..( అప్పటి సాంప్రదాయాలకి బద్దులు ).., కానీ నేను తినేదాన్ని. మా రెండో అన్నయ్య ,ఇంటికి వచ్చి అమ్మకి చెప్పేవాడు.అమ్మ తిట్లు..అయినా షరా మామూలె అనుకోండి.. మా ఇంట్లో అవి  ఉడకబెట్టడం మాత్రం జరగలేదు..నాకు పదేళ్ళు దాటాక వాటిని తినలేదు కూడా మళ్ళీ..కానీ నాకు వాటి వాసన , రుచి మాత్రం గాఢ౦ గా గుర్తుండిపోయింది. ‘అనపకాయలు ‘ ఎవరికైనా తెలుసా..? అసలు ఇప్పుడు పండుతున్నాయో లేదో కూడా తెలీదు..

-ఉషారాణి నూతులపాటి

10014699_686488301403306_267157800_n

ప్రియమైన శేఖర్ గారికి…

శేఖర్గారి ది ఒక చిన్న కోరిక వుండేది, తన గురించి నేనేదైనా వ్రాయాలని.

మేమిద్దరం కలిసి ఒక చోట పనిచేసిన వాళ్ళం కూడా తీర్చాల్సిన కోరికే అది, అయినా నేనేం వ్రాయలేదు.

వ్రాయాల్సిన తరహా నాకు చేత కాకపొవడం ఒకటైతే, వీడ్కోలు కోసమన్నట్టుగా వ్రాయడం అనేది సహించలేక కూడా.

నిజానికి వీడ్కోలుఎక్కడుంటుంది? తలవంచుకు మాట్లాడుకుంటూ నడుస్తుంటాం, వింటున్నవాడు ఎప్పుడాగిందోకూడా తెలువదు. మనం మాట్లాడుతూనే వుంటాం ఖాలీ అయిన స్థానం లోమరొకరెవరో వుంటారు.

మాటలు, నడక సాగుతూనే వుంటాయి ఖాలీలు పూరించబడుతూవుంటాయి.

నాకు తెలిసి శేఖర్ గారికి నేను ఇవ్వాల్సింది అక్కడ వీడ్కోలు కాదు ఆనందం, గత ఆరు నెలలుగా చిన్ని చిన్ని వాక్యాలతో నేనాయనకు ఆనందం ఇవ్వడానికి ప్రయత్నించాను ఇలాంటి వుత్తరాలతో , ఇది శేఖర్ గారికివ్రాసిందే కాదు నాకు నేను వ్రాసుకుంది కూడా. నా కున్న వారందరికి వ్రాస్తుందికూడా.

10402885_10202779443520617_4356749740251472669_n

 

6 December 2013

 

ప్రియమైన శేఖర్ గారు,

 

రెండురోజులుగా మీకు మెయిల్ చేద్దామనే అనుకుంటున్నా చేతులు ఆడలేదు. మూగగా వుంది.

చంద్రం గారి సభ లో నా చొరవ ఏమీ లేదు దీన్నంతాచేస్తున్న వారు భాస్కర్ గారు వారి మిత్రులు. ఆయన తో కలిసి కొంత కాలంప్రయాణం చేసిన సాటి చిత్రకారుడిగా ఒక కనపడని దుక్కం అంతే. మీరు మీ ఇంట్లొ “బొమ్మల్లో ఇంకా ఏమీ సాధించలేక పొయానని దిగులుగా వుంద”ని అన్నారు, మనకున్న, మనముంటున్న బొమ్మల ప్రపంచం వేరు, ఎంత సాధించినా గుర్తించడానికి, గుర్తుపెట్టుకొడానికి నిరాకరించే ప్రపంచానికి మన అమాయకత్వం సరిపోదు, నాకు తెలిసినఇద్దరు పిల్లలు వున్నారు, ప్రపంచంలో అందరు తండ్రుల కన్నా గొప్ప తండ్రివారికి వున్నాడు, ఆ పిల్లల తల్లికి తెలుసు తన భర్త ఏం సాధించాడో.భగవంతుడ్ని నేను కొరుకునేది అదే, ఆ పిల్లల దగ్గర్నుంచి, ఆ తల్లిదగ్గర్నుంచి వారి జీవితాల్లొకెల్లా అతి విలువైన దాన్ని ఒకదాన్ని వారితోనేవుంచమని. మీరు మీ కోసం కోరుకొవద్దు, మీ వాళ్ళ కోసం కోరుకోండి .

 

ఈ మధ్యేమేము ఇల్లు మారాము,మూడో అంతస్తు పెంట్ హౌస్, వచ్చిన రోజు నుంచి ఒక తల్లిపిల్లి పరిచయం అయింది, తర్వాత్తర్వాత మాలో ఒక భాగం అయింది నిజంగానే పిల్లుభలే ప్రేమాస్పదం ఐనవి. మా ఫ్యామిలికి బహూశ ఇది ఐదో పిల్లి, పిల్లులు మనకు ప్రేమ ఇవ్వవు గాని మన దగ్గరి నుంచి తమకు కావాల్సిన ప్రేమ హాయిగా తీసేసుకుంటాయి.

 

ఇవ్వాల్టి రోజు తొలిఎండను కాచుకుంటూ దాని హొయలు చూడతగినవేకాని చెప్పలేం. నడుస్తూ నడుస్తూ అట్టా కూలబడింది అచ్చు కోతిలా – ముందుకాళ్ళల్లో ఒకదాని చేతిలా చాచి వెనుక కాలు కాక్కుని దాన్ని గట్టిగాపట్టుకుంది ఎంటో! ఎందుకో? ఆ పై వల్లు విరుచుకుని వెల్లికిలా పందుకుని ఎండనుకాగుతూ దాని పలుచని బూడిద రంగు కడుపు, లేత గులాబి రంగు చిన్న చనుమొనలుదాన్నెంత వింతగా చూస్తూ నేనెట్లా వున్నానో అంతే వింతగా నన్ను చూస్తూ అదీ.

 

దేవుడికి నా పై ఎంత ప్రేమ లేక పొతే ఇదంతా చూడ్డానికి నాకు రెండుకన్నులిచ్చి ఈ భూమి పైకి పంపుతాడు శేఖర్ గారు, ఎంత అందం వుంది మనచుట్టూ అదిపదే పదే మనల్ని చూడమంటుంది, తెలియని దిగులుని నింపుకుని మనం దీన్నంతా దూరంపెడుతున్నామేమో!

 

బహూశా మీ నందూ చిన్నప్పుదో చేతన బాల్యంలొనో ఆ బంగారుపిల్లలు అన్నపు మెతుకు రుచి తెలుసుకుంటున్న తొలిరోజుల్లొ మూతికి అంటిన ఆపాల బువ్వ మీరు సుతారంగా తుడిచే వుంటారు , “సవాలక్ష మామూలు విషయంలా”అగుపించే ఆ పని ఒక కళ్ళు లేని తండ్రి గాని, తల్లి గాని అంతటి అపురూపాన్నివూహించగలరా ?

 

మనం పేపర్ పై వాడుతామే స్కార్లెట్ ఫొటొ కలర్ని నీళ్ళల్లోకలిపి పలుచగా చేస్తే వచ్చిన గులాబి రంగులాంటి పెదాల చుట్టూ తెల్లని పాలమరకలు. వూహించుకుంటే నాకు ఏడుపు వస్తుంది , ప్రపంచంలో ని గ్రుడ్డి వారందరుసామూహికంగా ఎందుకో ఒక తెలీని త్యాగం చేసి మనకందరికి చూపు వుండేలాచేసారనిపిస్తుంది.

 

నిజంగా మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకోలేని దురదృష్టవంతులమేమో? అద్భుతాలు ఆశించే వాణ్ణి, నా చుట్టూ ఎన్నో అద్భుతాలుచూస్తున్న వాణ్ణి, తను స్వయం కొన్ని అద్భుతాలు కోసం పరిశ్రమించిన ఒకఅద్భుత వ్యక్తి, తన జీవితంలో అతిపెద్ద అద్భుతాన్ని చేయబోతున్నాడని గట్టిగాఎదురుచూస్తున్న వాణ్ణీ. రేపొ ఎల్లుండో మళ్ళీ మీతో వుంటాను.

 

మీ

 

అన్వర్

 

ఆమె ఒక కరుణ కావ్యం!

drushya drushyam 33

పేరు తెలియదు.

కోల్ కతా నగరంలో మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కు చెందిన ఒక నన్ ఈవిడ.
నన్ అంటారో సిస్టర్ అంటారో కూడా తెలియదు గానీ, అమ్మ వెనుక అమ్మ.

+++

సుప్రసిద్ధ ఛాయాచిత్రకారులు రఘురాయ్ చిత్రించిన మదర్ థెరిస్సా ఛాయా చిత్రాల ప్రదర్శన ఒకటి రెండేళ్ల క్రితం జరిగింది.
ఆ సందర్భంగా సిస్టర్ నిర్మలతో కూడి వచ్చిన ఒక సోదరి తాను.

ఆమె అందం, హుందాతనం ఆ కార్యక్రమంలో గొప్ప ఆకర్షణ.
బాధ.

సామాన్యమైన మనిషైతే అందరూ చేతులు కలిపేవారు.
కబుర్లు చెప్పేవారు.
కానీ, తాను సోదరి.

అంతకన్నాముఖ్యం, తాను కదులుతుంటే ఒక దేవదూత వలే అనిపించడం.
దాంతో మనిషిగా అందరూ వినమ్రంగా పక్కకు జరగడం మొదలైంది.
కానీ, ఏదో బాధ.

సేవానిరతి తప్పా మరో విషయం లేని…లేదా విషయాసక్తి అస్సలు లేని…ఒక అలౌకికమైన సేవా తరుణిగా తాను.
దాంతో ఒక బాధ. విచారం.

ఆంత అందమైన మనిషిని చూస్తే తెలియకుండానే ఒక జాలి.

సేవకు అంకితమైన సిస్టర్ గా, జీవితమంతా అందాన్ని, ఆనందాలను ఫణంగా పెట్టి, సుఖమూ సౌకర్యవంతమూ అయిన జీవితాన్ని పూర్తిగా వొదిలి, రోగగ్రస్థులను స్వాంతన పరచడమే జీవితం చేసుకున్న ఈ మనిషి చూస్తే, ఆమె సాహసానికి ఆవేదనా కలిగింది.

ఎందుకని చెప్పలేనుగానీ ఒక చెప్పలేని విచారంతోనే ఉంటిని.
గుండె గొంతుకలోన కొట్లాడినప్పటి నా నిశ్శబ్ద బాధకు ఈ చిత్రం ఒక ఉదాహరణ.

+++

చిత్రమేమిటంటే, ఈ చిత్రం తీసి ఊరుకోలేదు.
ఆ బాధను అణచుకోలేక తన దగ్గరకు వెళ్లి వ్యక్తం చేస్తిని కూడా.
కానీ, తాను చిరునవ్వు నవ్వింది.

నవ్వు కూడా కాదు, ప్రేమను పంచింది.
‘అందమైన ప్రపంచం కోసం తప్పదు’ అని చిన్నగా, ప్రేమగా అని ఊరుకున్నది.

అంతే!
ఇంతకన్నాఎక్కువ మాట్లాడటం విజ్ఞత అనిపించుకోదని ఆమె అనుకున్నట్టున్నది.
ఈ రెండు ముక్కలు చెప్పి తప్పుకున్నది.

అర్థమైంది.
ఇక ఆ నాటి నుంచి నా చిత్రాల్లో వ్యక్తి అందం అన్నది ద్వితీయం అయిపోయింది.
అందమైన మనుషులంటే నాకు అప్పట్నుంచీ ఆసక్తీ పోయింది.

బహుశా ఈ చిత్రంతోనే నేను వ్యక్తులను చిత్రించడం ఆగిపోయింది.

ఒక స్త్రీ తాలూకు సౌందర్యం అన్నది పురుషుడి తాలూకు దృష్టి అయినట్టు, సొత్తు అయినట్లు అనిపించి ఆసక్తి చెడింది.
ఇక నాటి నుంచీ స్త్రీలను మనుషులుగా చూడటం మొదలైంది.
జీవితంగా దర్శించడం ప్రారంభమైంది.

ఆమె తన మొత్తం బతుకును సమాజానికి ఇచ్చిన మనిషి అయినప్పుడు ఇక ఆమె అందం చందం సేవా అంతా కూడా వ్యక్తిత్వం, స్త్రీ వ్యక్తిత్వం అవడం మొదలైంది.
అది నాలోని పురుషుడిని దాటేసి మనిషిని కలుసుకునే అపూర్వ చాలనంగా మారింది.
అప్పట్నుంచీ జీవితాల చిత్రణం మొదలైంది.

+++

దృశ్యాదృశ్యం అంటే అదే.
మనిషిని చేయడం.

+++

మీరూ గమనించి చూడండి.
నా వలే మీలోని పురుషుడిని దాటేసే చిత్రణలు జరిగినయా అని!
ఉంటే అదృష్టం, జీవితానికి దారి దొరుకుతుంది.
లేకుంటే వ్యక్తులే జీవితం అవుతుంది.

నిజం.
అందంతోనే ఇదంతా.
సోదరి నేర్పిన పాఠం ఇది.

ధన్యుణ్ని.

 

– కందుకూరి రమేష్ బాబు

ramesh

త్రిపురాంతకుడి వలసగానం

 

సిద్ధార్థ

సిద్ధార్థ

 

 

 

 

 

 

 

(మే 24: త్రిపుర నిష్క్రమణ- ఒక ఏడాది)

 

త్రిపురని మొదటిసారి చూసినపుడు బౌద్ధభిక్షువనుకున్నాను.

తెల్లటి సరస్సులా, చలికాలపు ఎండలా ఉందప్పుడు ఆయన మొహం. ఈయన చాలామందికి తెలియరు. తెలుసుకో ఇష్ట పడరు.

త్రిపుర మోపిన కథల బరువుతో, కవిత్వంతో స్థాణువులైపోయి, ఇలా కూడా రాయొచ్చేమో. కథల్నీ, కవిత్వాల్నీ అవి తీవ్ర అంతస్థాపానికి గురయ్యింది తెలుగు పాఠకలోకం. త్రిపుర మొహంలో ఏమీ తెలియదన్నట్టు, అన్నీ తెలుసుకుని చాటుకొచ్చిన అమాయకత్వమూ, త్రిపుర అన్న పేరు చూసి చాలామంది అది ఒక స్త్రీ పేరేమోనని ఊహించడం కూడా జరిగింది. త్రిపురగారి కథల్ని చదివినవాళ్ళు చాలామంది ఆయనకి స్నేహితులూ, శత్రువులూ అయిపోయారు. ఆయన కథల్లో వుండే తీవ్రతా, సాంద్రతా, ద్రవగుణమూ ఇప్పటికీ నెమరుకొస్తాయి. ఆయన్ని రెండుసార్లూ ట్రైన్‌లో, స్టేషన్‌లో ఆగినపుడే కలిశాను. ఐదోసారి… నేనూ నాయుడూ… కలిశాం.

అయితే ఎప్పుడూ అన్పిస్తూంటుంది త్రిపురకీ ట్రైన్‌కీ ఏదో సంబంధం వుందని. హఠాత్తుగా ఏదో ప్రాంతం నుండి మరేదో ప్రాంతానికి వెళ్తూ వెళ్తూ మధ్యలో తన అలుపుకు ఆగిన రైలు కిటికీలోంచి వొక వలసపక్షిలా తల బయటికి పెట్టే అమాయకపు నవ్వు ముఖం. త్రిపుర కథల్ని చదివి చాలా సీరియస్‌గా, జ్ఞానపు బరువు చూపుల్తో ఉంటాడేమో అనుకున్నవాళ్ళు ఒక్కసారిగా త్రిపురని చూసి ఫరవాలేదు. పాపం యాభై ఏళ్ళు వుంటాయేమో అనుకుంటారు. (ఆయనకు అటూ ఇటూ డెబ్బైఏళ్ళు), జర్దాపాన్‌ వొకటి ఎప్పుడూ నాలిక కిందా, పంటి పక్కనా, దవడ లోపలికీ, ‘ఉండ’లా కదులుతూ ఉంటుంది.

అప్పుడే ఎనస్తీషియాలోంచీ, tranquility నుంచి హఠాత్తుగా తెగిపడిన కంటిచూపు, మాట్లాడుతూ… డుతూ… వుంటే మెల్లమెల్లగా జంకు ఇగిరిపోతుంది. తనపైనే తను detached గా వుండి జోక్స్‌ కట్‌ చేసుకుంటూ వుంటాడు. మాటల్లో ఆవిరయ్యే పసిపిల్లల ఆవిరితనం. కేవలం 15 కథల్లో (త్రిపుర కథల సంపుటి రెండవ ముద్రణ, 1999) త్రిపుర మనల్ని వేళ్ళతో సహా పెరికేస్తున్నాడు. (మనకు ఏమైనా వేళ్లు వుంటే అవే మనల్ని కాపాడతాయని వొక జాతక కత). ముప్పై  వరకూ రాసిన కవితల్లో తన స్థలాకాలాల్ని భద్రం చేసుకున్నాడు.

అవునూ ఈ ‘భగవంతం’ ఎప్పటివాడు. మనకంటే చిన్నవాడేమో అనుకుంటాం. ఇష్టంలేక మాట్లాడుతున్నట్టుగాని, జ్ఞాన భారంతో వంగి ప్రవర్తిస్తున్నట్టుగాని అనిపించదు. త్రిపురతో మాట్లాడుతూ త్రిపురని చదువు కోవడమూ మధ్య ఏ అగాధమూ కనిపించదు.

ఫోన్లో మాట్లాడగానే… మీకూ వ్యాంగో బొమ్మకూ ఏమైనా సంబంధం వుందా అంటే…

‘‘ఏమో నాకూ అర్థంకాలేదు. కాని ఎంతో ప్రేమతో వేశారా పుస్తకాన్ని. పాపంవాళ్ళు పెట్టే ఖర్చుల కయినా డబ్బులొస్తే బాగుండని,’’ బాధపడ్డాడు. లక్ష్మణ్‌ బొమ్మల్నీ… అందులోని నలుపు గాఢతల్నీ, తెలుపుల లోతుల్నీ తడుముతూ…

‘‘నాకు నలుపంటే ఎంతో ఇష్టం. కేవలం నలుపుతో కూడిన ముదురు రంగులంటే ఇష్టం’’ అంటూ వో కుంచె నవ్వును పారేశాడు.

మాట్లాడటం మాట్లాడక పోవడం నడుమ ఒక తెర వుంటుందనీ, ఎవరైనా వచ్చి ఆ తెరని జరిపితే ఎక్కువ మాట్లాడు తుంటాననీ అంటారు. తన రచనల గురించి ఎవరైనా వచ్చి చెప్పి, తనకే తెలియని అంశాల్ని ఆపాదించి మాట్లాడుతూంటే… ఇబ్బందిగా వుంటుందనీ చెప్తాడాయన. వెయిటింగ్‌ ఫర్‌ గొడో (బెకెట్‌ నాటకం) తను భగవంతం కోసం రాసిం తరువాతే చదివాననీ చెప్పారు.

ఫొటోలో ఉన్నవారు ( L to R ) సిద్ధార్థ, త్రిపుర, ఎం. ఎస్. నాయుడు, నరేష్ నున్నా, గుంటక శ్రీనివాస్ …….వొక ప్లాట్ ఫారం మీది కలయిక…

త్రిపురా… ఇప్పుడేం చేస్తున్నారు… ఏం జీవిస్తున్నారు… ఏం చదువుతున్నారు…? అని అడిగితే, ‘‘ఇప్పుడు బొత్తిగా ఫిక్షన్‌ను ఇష్టపడటంలేదు. పట్టుమని ఓ పదిపేజీల కంటే ఎక్కువ చదవలేక పోతున్నాను. కొంత చదివిం తరువాత అతనేం చెప్పదలుచుకున్నాడో తెలిసిపోతుంది. పుస్తకంలో ఏం చెప్పదలచుకున్నాడో తెలిసిం తరువాత ఎలా చదవగలం? ప్రస్తుతానికిక ఫిలాసఫీయే… కవిత్వం కూడా అంతే. ఎవరైనా ఎక్కడైనా ఒక మంచి కవిత చదివి నాకు కటింగ్‌ పంపు తూంటారు. నా కవితలు ఎక్కడయినా అచ్చయితే నా ఫ్రెండ్సే కట్‌ చేసి పోస్ట్‌ చేస్తారు వాటిని,’’ అంటూ ఇంకో టీలోకి మరో పాన్‌ వేసుకుని కొంచెం ఆపి వొక్కసారి నిశ్శబ్దించిన thought constipation లోకి…

మీ కథల influences on the readers అంటూ ఏదో మాట్లాడబోతే… ‘‘అసలు నన్ను ఎవరైనా గుర్తుపెట్టుకున్నారంటే ఎంతో ఆశ్చర్యం, సంతోషమూ కలుగుతుంది. నేను నిజంగా తెలుసా అనే సందేహం కూడా కలుగుతుంది. (అవునూ, త్రిపురని అచ్చేసిన కవిత్వం శ్రీనివాస్‌ నువ్వెక్కడున్నావే….) 1990లో త్రిపుర బాధల సందర్భాల్ని అచ్చేసేదాక కథకుడిగా గుర్తుకురాలేదు. ఈ 1999లో రెండోసారి కథల్ని అచ్చువేస్తే కవి గుర్తుకు రావడంలేదు. కథకూ కవిత్వానికీ మధ్య వున్న విభజనను చెరిపేశాడాయన. న్యాయస్థాం ముందు ద్వారపాలకుడిలా… వేచి… వేచి… ఎవర్నీ లోపలకి వెళ్ళనీయక కాపలా కాస్తున్నాడు. కాఫ్కా అయి, trial లోకి తనని పంపించుకుని, ఇదంతా… ఎందుకు? ఏమిటని ప్రశ్నించనివారికే లోపలికి వెళ్ళే ఆజ్ఞ వుందని, చాలామంది ఆగంతకుల్ని వద్దు వద్దు ప్రశ్నలొద్దు. జ్ఞానమొద్దు ఎవరి అనుజ్ఞలకోసం వెంపర్లాడటమూ వద్దని నివేదించు కుంటున్నాడు త్రిపుర.

మీరు రచయిత ఎందుకయ్యారు… కవిత్వం ఎందుకు? అంటే ‘‘నాకు ఎక్కువ inferiority వుండేది. చదూకునేరోజుల్లో నా పేరుకు ముందు ఓ అరడజను initials, affixes  వుండేవి. వాటిని పిలవడానికి అందరూ ఇబ్బందిపడేవాళ్ళు. పేరు అంత పొడుగ్గా వుండి, నా ఆకారమేమో చిన్నగా వుండి, నానా ఇబ్బందులకి గురిచేసేది నా పేరు నన్ను. నేను త్రిపురగా బోధపడటానికి రాయటం మంచి దారిగా కనిపించింది. ఇంగ్లీష్‌లో ఎక్కువగా రాసేవాణ్ణి. ఇప్పుడసలు రాయలేను. నేను రచయితను అవ్వాలనీ అనుకోలేదు.’’ అవునూ ఇప్పుడు మీ memoirs రాయొచ్చు కదా. ‘‘memoirs autobiography గా రాయకూడదు. జీవిత చరిత్రలు పెద్ద మోసం. రాస్తే ‘మో’ బ్రతికిన క్షణాల్లా రాయాలి. నా కది చేతకాదు. రచయితల జీవితాల్ని జీవితచరిత్రల్లో వెదకడం పెద్ద hoax. వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ కథల్లోనే తెలుసుకోవాలి. నేనెక్కువగా నా గురించి మాట్లాడుతున్నానంటే పెద్ద దగా…’’

మీరు దృశ్యాలని కథల్లో కదిలిస్తున్నప్పుడు వాటికి పరిమళాల్ని అంటగడతారు కదా… (ఉదాహరణ- ‘నీలిరంగు, ఛాయల్లో నిద్రిస్తూన్న తటాకంలో ఒక సువాసన, గులకరాయి సృష్టించిన తరంగాల వృత్తాల్లోంచి ప్రసరించిన ధ్వనికిరణం లాగా వుంది,’ వలసపక్షుల గానంలో, ‘ఇది కాఫీ కాదు, ఉత్త వేడిగా వున్న గోధుమరంగు’- భగవంతంకోసంలో) ఏమీ చెప్పలేను. నాకు చిన్నప్ప ట్నుంచీ జంతువులూ, పక్షులతో సాన్నిహిత్యం ఎక్కువ. అన్నిరకాల జంతువులూ నన్ను చూడగానే దగ్గరికొచ్చేస్తాయి. నా కథల పుస్తకంలోని (first print)  భుట్టో (పిల్లి) మీకు జ్ఞాపకం వుందా? అది ఇంచుమించుగా మనిషే… నేను ‘అగార్త’లో ఉన్నప్పుడు అన్నిరకాల పక్షులూ జంతువులూ మా కాటేజీ చుట్టూ వచ్చి వాలి నన్ను పలుకరిస్తూ వెళ్ళేవి. కొన్ని వానసాయంత్రాల్లో పెద్దకప్పలు నా పాదాల మీదికెక్కి నిద్రపోయేవి. బహుశా నా శరీరంలో వొకరకమైన animlas కి వచ్చే smell వాసన ఉందేమో, తెలీదు. లేక క్రితం జన్మలో ఏ పామునో, కప్పనో పక్షినో అయ్యుంటాను.’’

‘‘నేను ఒక known poet ని కాను. ఎవరికీ తెలియని రచయితని. నన్ను తెలుసుకోవాలని అనుకునే వాళ్ళుంటారా అని అనుకుంటాడు త్రిపుర. అవును- ఈయనని ఎవరైనా గొప్ప రచయితని పొగిడినప్పుడు సిగ్గుపడిపోతాడు. ఆ పరిస్థితి నుంచి తప్పుకుపోవాలనుకుంటాడు. ఆ disturbance ఎలాంటిదంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారిని కలవడానికి ఎప్పుడూ కొంతమంది doctors వచ్చేవాళ్ళట. (ఆయన medical officer గా పనిచేసేవారు.) అందులో ఒక lady doctor ఉండేది. ఆమెను చూడగానే భయపడి, సిగ్గుపడి ఇంటివెనుక ఉన్న back yards లోకి పారిపోయి ముళ్లపొదల మధ్య దాక్కునేవాడట. బయటికి వొచ్చేసరికి ఆ ముళ్ళు గీరుకుని, అక్కడక్కడా రక్తమొచ్చి భయపెట్టిన అనుభవం. అదే అనుభవాన్ని తననెవరైనా రచయితగా తెలుసుకోవాలని వచ్చినప్పుడు ఎదుర్కొంటానని చెపుతాడు. ‘‘రచయితలూ, పాఠకులూ అన్న సంగతి వదిలేసి ముందు మనుషులుగా దగ్గరవుదాం,’’ అంటాడీ భగవంతపు త్రిపుర. మధ్య మధ్యలో తనని ఆకట్టుకునే తన కథల్లోని కొన్ని పంక్తుల్ని చదివించుకుంటాడు. ఆ లైన్ల ద్వారా తనకీ మనకీ ఏదైనా ఒక తలపు, దారి స్పురిస్తుందేమోననే ఆశ. తన కథల్లోని ప్రతి పాత్ర సంఘటనా అన్నీ జరిగి తను ఎదుర్కొన్నవనే అంటాడు. అందుకే కథల్లో ఏ భాగం దగ్గర తను liberate అయ్యాడో ఎక్కడ తను పొందిన అర్థాలని పొందుపరిచాడో పేరాల్ని చదివించుకున్నాడు. చిన్నప్పటి నుంచి తను lone walking అంటే ఇష్టపడతానని చెబుతాడు. ‘‘అలా ఒక్కణ్ణే నడుచుకుంటూ వెళ్లిపోతాను. ఆ సమయాల్లో నాతో నేను intactగా వున్నట్లనిపించి స్వేచ్చగా అనిపిస్తుంది. ఆ అలవాటు ఇప్పటికీ పోలేదు.’’

త్రిపుర కథల్లోపల ఏం వుంది? ఏం దొరుకుతుంది? అని ప్రశ్నించుకుంటే ఏమీ వుండదు. ఏమీ వుండబోదు. తనని తాను ఎక్కడికీ జారిపోకుండా అదిమిపట్టే అస్తిత్వపు స్పృహ. కొన్ని సంవత్సరాలుగా పొందిన అనుభవాలు తదేక వేదనోద్విగ్నతలో మాగి మాగి రాలకుండా కథల్ని చెప్పి రాలిపోయిన సంఘటనలు. ఓ కొండమీద నిస్సంచార మధ్యాహ్నంలో ఎండిన కొమ్మమీద పిట్టని చూస్తూ తదేకతలోకి జారిన జెన్‌ భిక్షువు గుర్తుకొస్తాడు త్రిపుర చూసినప్పుడు.

భిక్షువుకి పిట్టలాగా త్రిపురకి కథ. అంతే… నాకు కాఫ్కా అంటే ఇష్టం, ఎంతిష్టం అంటే అతని పుస్తకంలోని ఏ వాక్యాన్నీ తీసుకున్నా నా కొక కథ లేదా వొక poem. కళ్ళు మూసుకుని ఒక పేజీ తెరిచి వొక పదాన్ని స్పృశిస్తే అది కవిత్వంగా తగులుతుంది. బహుశా మనకి నచ్చిన authors కి సంబంధించి ఇలాగే వుంటుందమో. కాఫ్కా జీవితం చుట్టూరా అతని తండ్రి వొక irresistible ప్రభావం.

కథల్రాయలేరా ఇక అని బెరుకిరుకుతనంతో అడిగితే… ‘‘ఎట్లా రాయను… అనుభవాలేమీ లేవు… చాలావరకూ అంతా చచ్చిపోయింది. ఏమైనా రాస్తే పాత అనుభవాలనే, ఇరవై ఏళ్ళ క్రితంవి రాయాలి. అవన్నీ రాసేశాను. రాయడం నాకెప్పుడూ ఇష్టంలేదు. నేను professional writer నీ కాదు.  I’m a dead wood now. రాస్తే కవిత్వాన్ని రాసుకుంటున్నాను. వాట్లో కాఫ్కా themes. కాఫ్కాని నేను ఇంకా ఇంకా అర్థం చేసుకుంటున్నాను. కాఫ్కాని పూర్తిగా ఒకసారే చదవలేను. కొన్ని పేరాలు చదివిన తర్వాత ఆగిపోతాను. ఆ తర్వాత నా discovery మొదలవు తుంది.  K తో.. అది నేనే… బహుశా నా స్వంత K ని నేను extend చేసుకుంటున్నానేమో… నా కనిపిస్తుందీ నేను చెప్పేసుకున్నదంతా వలసపక్షులగానంలో ఎక్కువగా పలికింది. నా ఫ్రెండ్‌ ఒకతను అన్నాడు. అది మీ magnum opus అనీ. కానీ దాన్ని ఎవరైనా పూర్తిగా చదివి చెబుతారా అని ఎదురుచూస్తున్నాను. అందులోనే కొన్ని పంక్తులు చదివితే నా పరిస్థితి ఇంకా నాకు ఎక్కువ స్పుటమవుతుంది.

‘‘నవ్వేను…. నవ్వితే రెండు సిగరెట్లు ఒకేసారి కాలుతున్నట్టుగా అడుగడుగున తెలుస్తుంది. పిప్పి పన్ను నొక్కుకుంటూంటే నొక్కుకుంటున్నట్టుగా, నొప్పి క్షణాలన్నింట్లోనూ పాకురుతున్నట్టుగా తెలుస్తుంది. గోలెంలోని మొక్కుకి నళ్ళు పోస్తూ ఉంటే నీరూ, నీరు రూపం చెందిన వెలుగూ, మొక్కమీద పడి మొక్క చుట్టూ చెదిరి వ్యాపించి, మట్టిలో కలిసినట్టుగా- ఆ ప్రాసెస్‌ అంతా- ఆ క్షణాల్లో ఆ క్షణాలన్నీ నన్ను కదిపి ఒక కాస్మిక్‌ కాన్షష్‌నెస్‌లోకి తోస్తాయి. తెలుస్తుంది. తెలియగానే నా ఫ్రాంటియర్స్‌ నాకు పోతాయి’’- బాబుట్టి బోధపరుచుకోటానికి ప్రయత్నిస్తున్నట్టుగా చూసింది. కానీ నవ్వింది చివరకు. నవ్వి, అంది నీ శక్తి కాదేమో అది, అదొక వ్యాధేమో ఆలోచించావా?’’

ఈ పేరాలోని తనవి చెప్పుకునే క్రమాన ‘‘నాకు స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే ఈ  constant awareness of myself. ఇది నన్ను వదిలిపోదు. బహుశా ఇదే నన్ను తట్టుకోలేక కథల్ని రాయించిందేమో. ఎంత దీన్నుంచి తప్పించుకోవాలనుకున్నా కుదరడంలేదు. ఒక సైకాలిజిస్టు ఫ్రెండ్‌కి చూపుంచుకుంటే ఇది కొంతమంది mystics కోరుకునే స్థితి అని చెప్పాడు. నాకయితే అక్కడ కుబ్బ చెబుతున్నట్టుగా వ్యాధిగా కూడా తోస్తుంది. మీతో ఈ మాట్లాడుతున్నదంతా ప్రతి క్షణక్షణానికీ తెలిసీ… తెలుసునని తెలిసీ… తెలిసింది తిరిగి తెలిసి…’’

త్రిపుర చనిపోయిన తన తల్లిని కాఫ్కాలోకి పిలిచి ఖాళీకుర్చీతో మాట్లాడిన కవిత ఇంకా గుర్తుంది. ‘‘మీ అమ్మతో మీ అసోసియేషన్‌ ఏమిటి’’ అన్నాను. కవితని మసగ్గా recollect చేసుకుంటూ, మా అమ్మగారికి mental illness ఉండేది, చాలా fragile గా ఉండేది. హాస్య ప్రియత్వం ఎక్కువ. ఒక గొప్ప image maker మా అమ్మ, ఎవర్నైనా చూసినప్పుడు ఒక వస్తువు పేరును ఆ వ్యక్తికి అంటగట్టేది.

ఒకసారి భమిడిపాటి జగన్నాథరావుగారు మా ఇంటికి ఇస్మాయిల్‌గారిని తీసుకుని వచ్చారు. ఆయన్ని కవిగా మా అమ్మకు పరిచయం చేశారాయన. ‘‘నువ్వు చెప్పనక్కరలేదురా అతడి మొహం చూస్తేనే తెలుస్తుంది కవి అని,’’ అందామె. ఇస్మాయిల్‌గారు ఈ విషయాన్ని ఎంతో సరదాగా చెప్పుకుని తిరిగేవారు.’’

త్రిపుర కవిత్వంలో adjectivesని ఇష్టపడరు. పదాల్ని తేలికపరిచి condense చేసి డాలీ, వంచిన కాలంతో తడిపినట్టు చిన్న పదాల్నే తడిపి పలికిస్తుంటాడు.  ఇప్పుడు తనకు జెన్‌ తప్ప ఏదీ ఛత్రపు ఛాయ అంటూ తనదైన tranquil looksలోంచి అశబ్దంగా కులికాడు. మీరు నమ్మరు, మీరు పవిత్ర ఖురాన్‌నిగానీ, భగవద్గీతనుగానీ తిరగేసినట్టుగా నేను Kafka diariesలోని రోజూ వొక పేజీని తిరగేస్తుంటాను. అందులో వొకచోట ఆగిపోయి freeze అయిపోతాను…’’ అంటూ చెపుతాడీయన. ఇంకా ఇలా గొణుగుతుంటాడు కూడా. Everything gives way at the center under that feet అంటూ కాఫ్కా చెప్పిన మాటల్లోకి తూలి కవిత్వం చేయొచ్చునంటూ సంబరపడిపోతాడు.

జీవితంలో ఏదైనా తుఫానులాంటిది మీదపడితేనేగానీ రాయలేనంటాడు. వలసపక్షుల గానాన్ని రాయడానికి తన అగర్తల (త్రిపుర) ఉద్యోగ జీవితాంతాన్ని గుర్తుకు తెచ్చుకుని అప్పటి తమ ఒంటరి బతుకుల కరెంటులేని చీకటి సాయంత్రాల ఈశాన్యపు పక్షుల స్నేహాన్నీ recall చేసుకున్నాడు.

త్రిపురా, వలసపోయిన పక్షులన్నీ ఇప్పుడొకసారైనా నీ గూటికి తిరిగొచ్చాయా చెప్పు త్రిపురా…. నీ పాఠకుడెక్కడున్నాడో అతన్నైనా పక్షుల జాడ చెప్పమందాం.

 

-సిద్దార్థ

ఆంధ్రప్రభ దినపత్రిక, 7 మార్చి 1999

త్రిపుర ఫోటో: మూలా సుబ్రహ్మణ్యం

చూస్తూ చూస్తూ వుండగానే, అతనొక జ్ఞాపకం!

Dsc_7391

ముఖపుస్తకాలు లేని వొక అనగా అనగా కాలంలో స్నేహితులు వొకరి ముఖాలు వొకళ్ళు ఎలా చూసుకునే వారు? పొద్దూ పొద్దున్నే వొక చాయ్ తాగేసి, ఏ పొద్దుటి రైలో, ఫస్ట్ బస్సో అందుకొని దగ్గిరే వున్న స్నేహితుడి ముందు వాలిపోయే వాళ్ళు.

అవును, శేఖర్ – మేం “కంభా” అని పిలిచేవాళ్ళం- అలాగే వాలిపోయే వాడు వో ఆదివారం పొద్దున్న ఖమ్మంలో!

ట్విటర్లూ గట్రా లేని ఆ కాలంలో స్నేహితులు ఎలా పక్షి ముక్కుల్తో పొడుచుకునే వాళ్ళు? బహుశా, ఎక్కడో వొక పబ్లిక్ ఫోన్ పట్టుకొని, వొక పలకరింతో, ఇంకో తిట్టో రాల్చి వెళ్ళిపోయే వాళ్ళు.

అవును, కంభా అలాగే వున్నట్టుండి ఏ నెంబరూ లేని వొక ఫోన్లోంచి కొన్ని మాటలు మెల్లిగా రాల్చి తన వూళ్ళో తన మూలలో ఎక్కడో వొదిగి వుండి పోయే వాడు.

నెట్లూ మొబైల్ సెట్లూ లేని ఆ అనగా అనగా కాలంలోనే బహుశా మనుషులు ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు. మాట కోసం ఎదురు చూస్తూ వుండే వాళ్ళు. మాట కోసం కలవరిస్తూ వుండే వాళ్ళు. నిద్రలో స్నేహితుల పేర్లు పలవరిస్తూ వుండే వాళ్ళు.

చాలా అమాయకంగా ముఖంమీద ఎలాంటి పేచీ లేని వొక విశాలమైన నవ్వుతో కంభా ఖమ్మంలో మా ఇంటికొచ్చే వాడు. “ఖంభా ఆయారే, బాబూ!” అంటూ మా అమ్మ నవ్వుకుంటూ లోపలికొచ్చి కబురు చెప్పేది. (ఆ రోజుల్లో నేను వంట గదిలో డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని రాసుకునే వాణ్ని, మధ్య మధ్యలో అమ్మతో కబుర్లు చెప్తూ) శేఖర్ ఇంటి పేరు అమ్మ దగ్గిరకి వచ్చేసరికి ఉర్దూ యాసలో “ఖంభా” – అంటే స్తంభం- అయిపోయేది.

javed

చిత్రం: జావేద్

2

అప్పుడు కార్టూన్ అంటే ఇంకా ఏమిటో కంభాకి పూర్తిగా తెలీదు. పుస్తకాలు విపరీతంగా చదివే వాడు. . కార్టూనిస్టులు ఆ కాలంలో సాహిత్యంతో సంబంధం లేని వేరే లోకంలో వుండే వాళ్ళు నిజానికి!

కాని, కార్టూనిస్టుల లోకంలో కూడా సాహిత్యమూ కవిత్వమూ వుంటాయని అప్పుడే నా మటుకు నాకు సురేంద్ర (ఇప్పుడు “హిందూ” సురేంద్ర) వల్ల అనుభవమైంది. అప్పుడే సురేంద్ర – తన పేరుని సురేన్ద్ర- అని రాయడం మొదలెట్టాడేమో! సురేంద్రలాగానే శేఖర్ కి కూడా సాహిత్యం వొక ప్రాణం! తన అసలు ప్రాణం కార్టూన్ లో వుందని కొంచెం ఆలశ్యంగా తెలిసి వచ్చింది శేఖర్ కి! కాని, ఆ ప్రాణం చిరునామా తెలిసాక వొక క్షణం వృధా చేయలేదు శేఖర్!

శేఖర్, శ్యాం మోహన్, సురేన్ద్ర…ఇలా ఇంకా ఈ తరం కార్టూనిస్టులు అక్షరంలోంచి కుంచెలోకి చేసిన ప్రయాణం చాలా విలువైనదని నాకు అనిపిస్తుంది. ఈ సాహిత్య సహవాసం వల్ల ముందు తరంలో ఏ కొద్ది మంది కార్టూనిస్టులకో పరిమితమైన కొత్త అందం వీళ్ళ కుంచెల్లోకి వచ్చి చేరింది.

శేఖర్ చివరి దాకా ఆ సాహిత్య సహవాసాన్ని నిలబెట్టుకుంటూ వెళ్ళాడు. బాగా గుర్తు- మహాశ్వేతా దేవి నవలల్ని చదివిన తాజా ఉద్వేగంలోంచి నడిచి వచ్చి, ఖమ్మంలో వొక ఆదివారం పొద్దున్న శేఖర్ అన్న మాటలన్నీ! “జీవితంలోని ఆ చిన్ని డీటెయిల్స్ మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం?” అని ఆ రోజు అతను నన్ను అడిగాడు. శేఖర్ కి ఆ “చిన్ని డీటెయిల్స్” మీద విపరీతమైన పట్టింపు! సాహిత్య వ్యాసాల రచనతో మొదలైన శేఖర్ ప్రయాణం కార్టూన్ దగ్గిర స్థిర పడడంలోడీటైల్స్ మీది పట్టింపే కారణమని నాకు అనిపిస్తుంది. రోజువారీ జీవితాన్ని కార్టూనిస్టు చూసినంత దగ్గిరగా మరో కళాకారుడు చూడలేడు అని నేను ఖాయంగా చెప్పగలను. ఎందుకంటే, కార్టూనిస్టు daily basis మీద జీవితాన్ని బేరీజు వేసుకోవాలి. వాస్తవికతని చూస్తూనే దాన్ని ఆట పట్టించే క్రిటిక్ అతనిలో వుండాలి. అంత కంటే ఎక్కువగా ఆ వాస్తవికతని దాని అసలు రూపు చెడకుండా నవ్వు పుట్టించే కోణంలోంచి కూడా చూడాలి. కార్టూన్ వెనక వున్న ఈ ఫిలాసఫీ శేఖర్ కి అర్థమైంది. అందుకే, కార్టూన్ని వొక కళారూపంగా గుర్తించి తీరాలని మొండి పట్టుదల అతనికి!

ఇవాళ శేఖర్ మన ముందు లేని ఈ రోజున మీరు అతని కార్టూన్లన్నీ దగ్గిర పెట్టుకొని, వొక్కోటీ చూస్తూ వెళ్ళండి. ఈ కార్టూనిస్టు ఫిలాసఫీ గురించి నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది.

శేఖర్ చివరి గీత

శేఖర్ చివరి గీత

3

నిజమే, జీవితం చాలా వేగంగా దూసుకుపోతోంది. మన మధ్య ఎవరున్నారో ఎవరు లేరో కనుక్కునే వ్యవధి మనకెవ్వరికీ లేదు. చూస్తూ వుండగానే, మన కళ్ళ ముందు పెరిగి పెద్దదైన వొక కార్టూన్ గీత నిష్క్రమించింది. వొక చిర్నవ్వు నిశ్శబ్దంలోకి రాలిపోయింది. వొక స్నేహ హస్తం మన భుజమ్మీంచి బలహీనంగా కూలిపోయింది. బతికి వుండగా వొక మనిషి ఎన్ని పాత్రాలు పోషించ గలడో, ఆ పాత్రలన్నీ ధైర్యంగా వాటిల్లో ప్రాణం పొదివినంత పదిలంగా పోషించి వెళ్ళిపోయాడు శేఖర్!

“కలడు కలండు అను వాడు కలడో లేడో!” అన్న నిత్య సంశయంలోకి నేను వెళ్లదలచుకోలేదు కాని, వుంటే, ఇదిగో – ఖాలిద్ హుస్సేనీ నవల The Kite Runners లో వొక పాత్ర అడిగినట్టుగా ఇలా అడగాలని వుంది…

When you kill a man, you steal a life. You steal his wife’s right to a husband, rob his children of a father. When you tell a lie, you steal someone’s right to the truth. When you cheat, you steal the right to fairness. Do you see?

మన మధ్యలోంచి వెళ్ళిపోయింది కేవలం వొక వ్యక్తి మాత్రమే కాదు, వొక కుంచె మాత్రమే కాదు. వొక నిజాన్ని నిజాయితీగా పలికే స్వరం. నిజానికి వున్న అనేక రూపాల్లో వొక రూపం!!

 – అఫ్సర్

శేఖర్ ధైర్యం మనకో పాఠం!

 

myspace

 బహుశా మనిషికి ఉండాల్సిన అన్ని గుణాల్లోధైర్యమే గొప్పది. అది ఎన్నోసార్లు రుజువై ఉండవచ్చు. కానీ  నాకు మొన్న శేఖర్ని చూసేక అనిపించింది, ధైర్యమే వుంటే ఇంకేమీ అక్కర్లేదని జీవితంలో.

 Old Man and the Sea లో ముసలి వాడి ధైర్యమది. విప్లవం ఎట్లైనా విజయవంతమవుతుందని  నమ్మిన ‘అమ్మ’నవల్లో ముసలి తల్లి మొండి ధైర్యం అది. కొండల్ని పగల గొట్టినముసలి చైనా మూర్ఖుడికి వుండిన తెగువ అది. 

సాధారణంగా ఇలాటి పాత్రలు రచనల్లో కనిపిస్తాయి. అసలు రచయితలు ఇలాటి పాత్రల్ని ఎక్కడనుంచి సృష్టిస్తారు? చరిత్రలో ఇలాటివాళ్ళు ఎక్కడినుంచి పుట్టుకు వస్తారు? మొత్తం ప్రపంచం తమకి వ్యతిరేకమైనా, కష్టాలన్నీ ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడిచేసినా, జబ్బులేవో చావుని అనంతంగాశరీరంలోకి నింపుతున్నా, అంతులేని వనరులున్న శత్రువు నిరంతరం దాడిచేస్తున్నా — నిలువరించే వీళ్ళు ఎలాటి వారై వుంటారు? వాళ్ళు ఏయే ధాతువులతో తయారైవుంటారు?

వాళ్ళు ఏ శక్తుల్ని కూడదీసుకుని ధైర్యంగా నిలబడతారు? అత్యంత సామాన్యులైన వాళ్ళకు ఏ ఊహలు, ఏ హామీలు అంత ధైర్యాన్నిస్తాయి?

నేను చూడలేదు కానీ, చెరబండ రాజు గురించి చెప్తారు చూసిన వాళ్ళు. ఆయనతో గడిపిన వాళ్ళు మెదడుని మృత్యువుకబళిస్తున్నా కూడా, రాజ్యాన్ని ధిక్కరించే స్వరం కొంచెమైనా తగ్గలేదని, ‘ముంజేతిని ఖండించిన నా పిడికిట కత్తివదల’ అని అన్నాడని.

నేనెప్పుడూ కలవలేదుగానీ, అలిశెట్టి ప్రభాకర్ కూడా అలాగే ఉండేవాడని,మృత్యువుని పరిహసిస్తూ.

ఇక పతంజలి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంకో నెల రోజుల్లోచనిపోతారనగా, మిత్రుల్ని, శిష్యుల్ని పిలిపించుకుని ఒక Last Supper చేసారు. అప్పటికే ఎన్నో రౌండ్ల కెమోతెరపీ సెషన్లతో శరీరం వడలు పోయింది. నాలుక, గొంతు అలవికాని మంటతో మండిపోయేది. కానీ, మిత్రులకు సామూహిక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎందుకు వ్యవస్థతో శాశ్వత పేచీ పెట్టుకోవాల్సి వచ్చిందో, తనని రచయితగా నిలబెట్టినదేమిటో as-a-matter-of-factగా చెప్పేరు.

బహుశా, తాము నమ్మిన, ప్రేమించిన, ఇష్టపడిన వ్యాసంగమేదో వాళ్ళని నిలబెట్టి వుండవచ్చు. ఇలాటి తెగువ చాలా మందిలో వుండొచ్చు. కానీ, ప్రజల పక్షాన వుంటూ, తిరుగులేని శక్తివున్న ప్రజా శత్రువులకి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళ వైపు వున్నవాళ్లు చూపించే తెగువ ఇంకా గొప్పది.

కార్టూనిస్ట్ శేఖర్ కి ఇష్టమైన వస్తువులు నాలుగు – సంఘ్ పరివార్, ప్రపంచ బాంక్-చంద్రబాబు, తెలంగాణ, ఇంకా కులమనే కేన్సర్. శేఖర్ మెదడును, హృదయాన్ని బాధపెడుతున్నది తనను కబళిస్తున్న కేన్సర్ కాదు. కులమనే కేన్సర్. అందుకే పెట్టుకున్నాడు ఒక ప్రోజెక్ట్ — Caste Cancer. ఆసుపత్రి బెడ్ మీదనే పనికి ఉపక్రమించి పూర్తి చేసేడు. “ఇంకా ఎక్కడుందండీ కులం,” అని అనేవాళ్ళకు ఈ బొమ్మలు చూపించాలి. ఒక్కొక్క కార్టూనూ ఒక్కొక్క కొరడా దెబ్బలా వుంటుంది.

10173554_844876798861497_2505974776557559890_n

రేపు పుస్తకం ఆవిష్కరణ వుందనగా, ఫోన్ చేసేడు. హిందూ లో తనపై వ్యాసం రాసినందుకు. “చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. చాలా సంతోషంగా వుంది. కానీ, రేపు పుస్తకం ఆవిష్కరణకు రాగలనో లేదోన”ని అన్నాడు. ఇక ఎక్కువ మాట్లాడకుండా రెస్ట్ తీసుకోమని ఫోన్ పెట్టేశాను.

ఇక తర్వాత రోజు సభలో గంటల పాటు ఓపిగ్గా కూచున్నాడు. అంతే కాదు, చివర్లో తన preamble చెప్పుకున్నాడు. జీవితం పట్ల తన దృక్పథం, తనిప్పుడు మరో ప్రాజెక్ట్ ని ఎందుకు చేపట్టబోతున్నాడు అన్నీ చెప్పేడు. ఇంకో ప్రాజెక్ట్ ఎందుకంటే, అది తనలోని కేన్సర్ తో పోరాటానికి ఉపయోగపడే ఒక మానసికమైన ఆయుధం. కానీ, అది మనకి శేఖర్ ఇచ్చే ఆయుధం కూడా.

ఒక కుల రోగ గ్రస్తమైన వ్యవస్థ చుండూర్ మారణకాండ నిందితుల్ని వదిలేస్తే, ఒక రోగంతో అద్వితీయమైన పోరాటం చేస్తున్న శేఖర్ మనకి ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. అది కేవలం ఒకానొక పుస్తకంగానే కనిపించవచ్చు. కానీ, దాని వెనుక వున్న అతడి తెగువ దానికి తిరుగులేని శక్తిని ఇచ్చింది.

ఇప్పుడు ఆ శక్తితోనే మనం, ఇప్పుడు వేయి దెయ్యపు కన్నుల, కోరల, కొమ్ములతో దేశంపై తెగపడ్డ వింత, క్రూర జంతువుతో యుధ్ధం చెయ్యాలి. ఆ తెగువ, ధైర్యం కావాలిప్పుడు దేశానికి.

*

1901233_805223106160200_304354655_n

post script: 
   శేఖర్ ధైర్యం గురించి నేను రాసి, సారంగ సంపాదకులకు పంపి మూడు రోజులైంది. ఈ రోజు తెల్లవారు జామున శేఖర్ చనిపోయాడు. నిశ్చలంగా, పెట్టెలో ఉన్న శేఖర్ ముఖం ప్రశాంతంగా వున్నది. యుద్ధంలో గెలిచిన సంతృప్తి వుంది ఆ ముఖంలో. శరీరంలో శక్తి అయిపోయింది కాబట్టి కేన్సర్ పై పోరాటం ఆపేడు కాని, ఏమాత్రం శక్తి వున్నా ఇంకా పోరాడేవాడే.
పుస్తకం రిలీజ్ అయిన రోజు అడిగాడు, “మీకు చాలామంది డాక్టర్లు పరిచయం వుంటారు కదా. అడగండి వాళ్ళని శక్తి రావడానికి ఏం చెయ్యాలని. ఏం తాగితే ఇంకొంచెం వస్తుందో కనుక్కోండి,” అన్నాడు.
   ఆ బక్క శరీరంలో వున్న అణు మాత్రం శక్తినీ వాడుకొని బతికేడు. చనిపోయిన రోజు కూడా ఆంధ్రజ్యోతిలో కార్టూన్ వచ్చింది. ఎవరో అంటున్నారు, “రేపటికి కూడా పాకెట్ (కార్టూన్) పంపించాడు.” అని.
  సామాన్యుల అసమాన ధైర్యసాహసాలే మనకి ఊపిరి, ప్రేరణ. నిత్య జీవితంలో ఇంతే గొప్పగా పోరాటం చేస్తున్న వాళ్ళు చాలా మంది వున్నారు. దుస్సహమైన జీవితం ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే, శత్రువు వేయి పడగల నాగరాజై దాడిచేస్తున్నపుడు మనకి ఇలాటి ధైర్యవంతులే ప్రేరణ.
  శేఖర్ గుర్తుంటాడు ఎప్పటికీ.

అపరాధం

ఆ సంఘటన గురించి ఇప్పుడు తల్చుకున్నా కూడా నాకు అపరాథభావనతో కన్నీళ్ళు వస్తాయి. నా కళ్ళల్లో కలవరం వచ్చి చేరుతుంది. అయితే దాన్ని నేను తల్చుకుని అప్పుడు జరిగిన పొరపాటు లాంటిదే మళ్ళీ జరగకుండా చూసుకోవడానికి ఈరోజు అది నాకు ఉపయోగపడింది. ఈరోజు జరిగిన పొరపాటుని గురించి శ్యామలకి చెప్పి క్షమాపణ చెప్పగలిగిన దానిని ఆ రోజు ఆ పొరపాటుని రాకేష్ కి చెప్పి క్షమాపణ అడగకపోవడానికి కారణం ఏమిటి?

భయం – ఔను.

ఆ రోజు నేను ఇంట్లో అబద్దాలు చెప్పి పెళ్ళి కాకుండానే రవిని హోటల్ రూమ్ లో కలవడం అందరికీ తెలుస్తుందనే భయంతో మౌనంగా ఉన్నాను.

మనకి బాధ కలిగించిన విషయాలని చెప్పుకుంటే ఆ బాధ తొలుగుతుంది నిజమే కావొచ్చు కాని కొన్ని కొన్ని మనం బయటకి చెప్పుకోలేని అనుభవాలు మన జీవితంలో జరుగుతాయి. ఆ అనుభవాలు మళ్ళీ అలాంటి సంఘటనలు జరగకుండా మనకి ఉపయోగపడితే మన బాధ తొలగిపోతుందనే విషయం నాకు ఈరోజు తెలిసింది……

నిన్న రాత్రి మా అబ్బాయి “అమ్మా! నా నైకీ టీ షర్ట్ కనబడటం లేదు. ఎక్కడ పెట్టావు?” అని అడిగాడు.

“నీ అల్మైరాలోనే పెట్టి ఉంటుంది శ్యామల సరిగా్గ చూడు” అన్నాను.

వాడు వెతుక్కుని వెతుక్కుని ఏడుపు ముఖం పెట్టుకోని “కనపడటం లేదమ్మా!” అన్నాడు. నేను వాడి బట్టల అల్మైరాతో పాటు ఇల్లంతా వెతికాను.

“సరే రేపొద్దున శ్యామల రాగానే అడుగుదాములే పడుకో” అని వాడిని సముదాయించాను కాని నా ఆలోచనలన్నీ ఆ షర్ట్ మీదే ఉన్నాయి.

శ్యామల కాజేసి ఉంటుందా? స్కూల్లో పనులు, పరీక్షల హడావుడి లో ఇంటిని అసలు పట్టించుకోవడం లేదు. ఇంట్లో ఏమి పోయాయో, ఏమున్నాయో కూడా చెప్పలేనేమో ఇప్పుడు. పని వాళ్ళ మీద పూర్తి బాధ్యత వదిలేస్తే ఇలాగే జరుగుతుంది అనుకుంటూ బాధపడసాగాను.

తెల్లవారింది. ఎవరి పనులకి వాళ్ళు తయారవుతూ హడావుడిగా ఉన్నాం. శ్యామల రాగానే వాకిట్లోనే నిలేసి షర్ట్ గురించి అడిగాను.

“నాకు తెలియదమ్మా!” అంది.

“నీకు తెలియక ఇంకెవరికి తెలుస్తుంది? ఇల్లంతా వెతికాం రాత్రి. ఎక్కడా లేదు. నువ్వు తీయకపోతే ఇంట్లో ఉండాలిగా” అన్నాను.

“లేదమ్మా! నేను తీసుకోలేదు” అంది.

“నువ్వు తీశావని నేను అన్నానా? తీయకపోతే ఇంట్లోనే ఎక్కడో ఉంటుందిగా సాయంత్రం నేను వచ్చేలోపు ఇల్లంతా వెతుకు” అన్నాను కఠినంగా.

“సరేనమ్మా” అంది శ్యామల.

సాయంత్రం నాలిగింటికి వచ్చి కాఫీ పెట్టుకుంటుండగా “అమ్మా! షర్ట్ ఇదిగో – మొన్న స్పెషల్ పంక్షన్ కి అభినవ్ అడిగితే ఇచ్చా. ఈరోజు స్కూల్లో వాడిని చూడగానే గుర్తొచ్చింది. స్కూలు నుంచి నేరుగా వాళ్ళింటికి వెళ్ళి తీసుకొస్తున్నా” అన్నాడు – నా కోసం ఏదో ఘనకార్యం చేసిన వాడిలా.

“అలా ఎలా మర్చిపోయావురా? రాత్రంతా వెతుకుతూనే ఉన్నాను నువ్వు నిద్రపోయాక కూడా” అన్నాను కోపంగా.

వాడు నన్ను పట్టించుకోకుండా “అఁ మర్చిపోయాను – ఏమయింది? ఇప్పుడు తెచ్చానుగా” అంటూ దాన్ని నా ముఖాన విసిరేసినట్లుగా కిచెన్ కౌంటర్ మీద పడేసి వాడి గదిలోకి వెళ్ళిపోయాడు.

అప్పుడు ఒక్కసారిగా – మళ్ళీ చాలా రోజుల తర్వాత – రాకేష్ గుర్తొచ్చాడు.

ఇరవయ్యేళ్ళ క్రితం……

నేను హోటల్ నుంచి ఇంటికి రాగానే మా అమ్మ “ఎక్కడికెళ్ళావే? నీ కోసం మీ హెడ్ మిసెస్ వచ్చారు మనింటికి. ఏదో ఫైలు అర్జంటుగా కావాలని వెతికితే ఎక్కడా కనపడలేదంట. నువ్వు ఎక్కడ పెట్టావో అడగాలని వచ్చిందిట” అంది.

మీ మేడమ్ వచ్చింది అని చెప్పగానే నా గుండెలు గుబుక్కుమన్నాయి. ఈ రోజు ఉదయం రవిని కలుసుకోవడానికి హోటల్ కి వెళుతున్నప్పుడు మా స్కూల్లో పని చేసే ఒక టీచర్ ఇంట్లో టిక్కీ పార్టీ అని అమ్మకి చెప్పాను. దాన్నే మళ్ళీ చెప్తూ ఆ టీచర్ కీ, మా హెడ్ మిసెస్ కీ పడదులేమ్మా అందుకే ఆమె ఫ్రెండ్స్ ని మాత్రమే పిలిచింది. కొంపదీసి ఆమెకి ఈ సంగతి చెప్పలేదు గదా!” అన్నాను – నేను చెప్పిన అబద్దానికి నిజం రంగు పులుముతూ.

“నాకేం తెలుసే మీరు ఆవిడకి చెప్పకుండా పార్టీ చేసుకుంటున్నారనీ…. ఎవరో టీచర్ ఇంట్లో టిక్కీ పార్టీ అని వెళ్ళిందని చెప్పా” అంది.

రవితో గడిపిన మధురక్షణాల తాలూకు మైకం నాలో మాయమైపోయి ఆందోళన ప్రవేశించింది. హోటల్ రూమ్ నుండి మా హెడ్ మిసెస్ కి ఫోన్ చేసినపుడు అదృష్టవశాత్తూ ఆవిడ ఫోన్ ఎత్తలేదు, నా అసిస్టెంట్ రాకేష్ ఎత్తాడు. చాలా పేదబ్బాయ్. పదవ తరగతి వరకూ చదివి కాలేజీకి ఫీజు కట్టలేక మేడమ్ ని బ్రతిమాలుకుని ఇక్కడ అసిస్టెంట్ కమ్ అటెండర్ గా చేరాడు.

“రాకేష్ నాకు జ్వరంగా ఉంది, చూపించుకోవడానికి హాస్పిటల్ కి వచ్చాను. మేడమ్ కి చెప్పు ఈరోజు ఆఫీసుకి రావడం లేదని” అన్నాను.

“ఆఁ ఆఁ” అంటున్నాడు.

“రాకేష్” అన్నాను.

“మీకేం నంబరు కావాలి?” అన్నాడు.

“ఇది 26…..9 కదా!”

“ఆఁ చెప్పండి… ఎవరూ?”

“ఏంటి రాకేష్ నేను స్వప్నని వినపడుతోందా…. నాకు బాగాలేక హాస్పిటల్ కి వచ్చాను. డాక్టర్ కి చూపించుకోని త్వరగా రావడానికి ట్రై చేస్తాను కాని వీలయ్యేట్లు లేదు. ఇక్కడ క్యూలో చాలా మంది ఉన్నారు. ఈ విషయం కూడా మేడమ్ కి చెప్పు – సరేనా, చెప్తావా” అన్నాను.

“ఆఁ చెప్తా చెప్తా” అంటున్నాడు.

నాకు భలే ఆశ్చర్యమేసింది అతని ముభావతకి. ఆఫీసు ఇన్ ఛార్జినైన నన్నుగౌరవంగా ఎప్పుడూ ‘మేడమ్’ అని పిలుస్తాడు. ‘ఈరోజేంటి ఇతను ‘చెప్తా చెప్తా’ అంటున్నాడు కాని ‘మేడమ్’ అని పిలవడం లేదు పైగా గొంతులో గౌరవం కూడా లేదు? నేను చెప్పింది నమ్మడం లేదా లేక నేను ఈ లాడ్జిలోకి రావడం చూశాడా? – ఇక్కడెక్కడో దగ్గర్లోనే అతనిల్లు అని చెప్పడం గుర్తు. చూసి ఉండడులే ఒట్టి అనుమానం నాది, పనిలో ఉండి ఉంటాడు’ అనుకున్నాను.

అమ్మతో ఏదో చెప్పి నా గదిలోకి రాగానే ఆ సంభాషణంతా రీలు లాగా నా కళ్ళ ముందు కదలాడింది. ‘రాకేష్ మేడమ్ కి చెప్పి ఉంటాడు. రేపు స్కూలుకెళ్ళగానే మేడమ్ అడిగితే ఏం చెప్పాలి? ఆఁ ఏముందీ… నా స్నేహితురాలి ఇంట్లో పార్టీకి బయలుదేరాను కాని బాగా తలనొప్పి వచ్చి హాస్పిటల్ కి వెళ్ళానని చెప్తే సరి’ అనుకున్నాను.

ఒక అబద్దానికి ఎన్ని అబద్దాలు చెప్పాలో కదా అనుకుంటూ కాసేపూ, రవి గురించి కాసేపూ ఆ రాత్రంతా ఆలోచనలే… రవి నా క్లాస్ మేట్. ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. మేము గుంటూరులో ఉన్నప్పుడు ఎక్కడో చోట కలుసుకునేవాళ్ళం. నాన్నకి హైదరాబాద్ ట్రాన్సఫర్ అయ్యాక నేను కూడా ఇంటికి దగ్గరగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో చేరాను. రవి ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నాడు. అతనికి ఉద్యోగం రాగానే ఇంట్లో వాళ్ళకి చెప్పి పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాము.

హైదరాబాద్ లో ఏదో కంపెనీలో ఇంటర్వ్యూకి వచ్చి లాడ్జిలో దిగిన రవి నన్ను కలుసుకోమని ఫోన్ చేస్తే వెళ్ళాను.

‘ప్చ్! చాలా తప్పు చేశాను, అసలు అలా వెళ్ళకూడదు, అతన్ని ఏ పార్కులోనో కలుసుకుని ఉండాల్సింది’

తర్వాత జీవితంలో ఈమాటలు ఎన్ని సార్లు అనుకున్నానో…..

మేడమ్ రాకముందే రాకేష్ తో మాట్లాడాలి, మేడమ్ ఏమందో కనుక్కోవాలి అనుకుంటూ పది కాకముందే స్కూలుకి వెళ్ళాను. ఏవో జెరాక్స్ కాపీలు తీసుకుంటున్న రాకేష్ నన్ను చూడగానే “గుడ్ మార్నింగ్ మేడమ్. హెడ్ మిసెస్ మేడమ్ మీ కోసం మీ ఇంటికి వెళ్ళారు అప్లికేషన్స్ ఫైల్ కోసం – ఎక్కడ పెట్టారు?” అన్నాడు ఆందోళనగా.

“అదేంటీ నీకు ఫోన్ చేసి చెప్పానుగా హాస్పిటల్ కి వెళ్ళానని!” అన్నాను.

“నాకు ఎప్పుడు ఫోన్ చేశారు?” అన్నాడు ఆశ్చర్యంగా.

“అదేమిటీ నీకు ఫోన్ చేసి చెప్పానుగా – మేడమ్ కి చెప్పు అంటే సరేనన్నావ్” అన్నాను కోపంగా.

“నేనెప్పుడన్నాను? లేదు లేదు మీరు ఫోన్ చేయలేదు” అన్నాడు – అతని కళ్ళనిండా అంతులేని విస్మయం.

“నీకేమైనా పిచ్చా! మతిమరుపు ఎక్కువవుతుంది నీకీమధ్య. నేను మాట్లాడుతుంటే ‘ఆఁ ఆఁ’ అంటున్నప్పుడే అర్థమైంది మన మైండ్ లో లేవని” అన్నాను పెద్దగా అరుస్తూ. అక్కడే నిలబడి మా మాటలు వింటున్న ప్యూను వెంకటప్పయ్య “ఔనమ్మా! నేను కూడా విన్నాను ఎవరితోనో ఫోనులో ‘ఆఁ ఆఁ చెప్తాను చెప్తాను’ అని రెండు సార్లు అనడం” అన్నాడు నాకు సపోర్టు వస్తూ.

“మేడమ్ రాగానే చెప్పు నేను ఫోన్ చేసిన సంగతి ‘చెప్పడం మర్చిపోయాన’ని స్పష్టంగా చెప్పు లేకపోతే బాగుండదు చెప్తున్నా” అన్నాను కోపంగా – చూపుడువేలు విదిలిస్తూ.

అతను నేను ఫోన్ చేసిన సంగతి చెప్పడం మర్చిపోయి ఇప్పుడు మేడమ్ తిడుతుందని బొంకుతున్నాడనే అనుకున్నాను. మేడమ్ రావడం, ‘నేను చెప్పడం మర్చిపోయాను’ అని రాకేష్ ఆవిడతో చెప్పడం జరిగిపోయింది.

సాయంత్రం ఇంటికి వెళ్ళేప్పుడు మేడమ్ నన్ను పిలిచి “నువ్వు రాకేష్ ని బెదిరించి చెప్పించినట్లుగా ఉంది అతని ముఖం చూస్తుంటే – నిజంగా నువ్వు ఫోన్ చేశావా స్వప్నా?” అంది.

“నిజంగా చేశాను మేడమ్” అన్నాను ఆవేదనగా. నా ముఖంలో కూడా నిజాయితీని చూసిన మేడమ్ “సరేలే పో” అంది.

తర్వాత రోజు 10-11 గంటల మధ్యలో రాకేష్ వచ్చి “మేడమ్ మీకు ఫోన్” అన్నాడు. నేను ఫోన్ దగ్గరకి వెళ్ళి “హలో” అన్నాను.

“హల్లో…. ఏమంది మీ మేడమ్? మీరు నిన్న నాకూ చేసింది ఫోన్…. రాకేష్ కి కాదు. మీ పక్కన ఎవరో ఉన్నట్లుంది ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు….. నిజంగా మీరెళ్ళింది హాస్పిటల్ కా లేక…… ఇహిహి…”

టప్ న ఫోన్ పెట్టేశాను. కాళ్ళు వణకసాగాయి భయంతో. మళ్ళీ చేశాడు. ఫోన్ ఎత్తి “రాంగ్ నంబర్” అన్నాను.

“రాంగ్ నంబరా – హ!హ!హ!” అంటూ నవ్వుతున్నాడు.

వాడు నవ్వుతున్నందుకో లేక వాడు నేను వెళ్ళింది లాడ్జికన్న సంగతి కనిపెట్టినందుకో నాకు బాధ కలగలేదు కాని రాకేష్ ని అనుమానించి, బాధపెట్టి, భయపెట్టి మేడమ్ కి అబద్దం చెప్పించినందుకు నాకు కళ్ళనీళ్ళు వచ్చేస్తున్నాయి.

ఏడుస్తున్న నన్ను గమనించిన మేడమ్ “ఎవరు స్వప్నా?” అంది నాకు దగ్గరగా వచ్చి.

“ఎవరో మేడమ్ ఏదేదో చెత్తగా మాట్లాడుతున్నాడు” అన్నాను.

ఫోన్ మళ్ళీ మోగుతోంది. ఈసారి మేడమ్ ఫోన్ ఎత్తి “ఎవర్రా నువ్వు? స్వప్న భర్తని పిలిపించి మాట్లాడిపించనా?” అంది బెదిరింపుగా – నాకు పెళ్ళయి్య భర్త ఉన్నట్లుగా. ఆవిడ ఉద్దేశం పెళ్ళిగాని పిల్లలని ఇలా ఫోన్లు చేసి ఏడిపిస్తారని అనుకుని అలా చెప్పిందని అనుకుంటా.

అవతల వాడు ఫోన్ కట్ చేశాడు. తర్వాత ఆ స్కూల్లో నాలుగేళ్ళు పని చేశాను. ఇక నాకు వాడి దగ్గరనుండి ఫోన్ రాలేదు కాని రాకేష్ ని చూస్తుంటే బాధ కలగసాగింది. ఆ రోజు నుంచీ రాకేష్ ని నా తమ్మడిలాగే చూసుకున్నాను. అతనికి ఫీజు కట్టి చదివించాను. ఇప్పుడతను గవర్నమెంట్ ఆఫీసులో మంచి ఆఫీసర్. అతనికి సహాయం చేసి నా అపరాధాన్ని పోగొట్టుకున్నాను కాని నాలోని బాధ మాత్రం ఇన్నాళ్ళుగా తొలగిపోలేదు.

పెళ్ళి కాకుండానే లాడ్జిలకెళ్ళడం, ప్రమాదాల్లో ఇరుక్కోవడం ఎంత అసహ్యమైన విషయమో తద్వారా నా జీవితంలో జరిగిన ఈ అనుభవం ఇంకా అసహ్యం. ఆతొందరపాటుతనంతో మరో తప్పు చేయబోయేదాన్నే ఈరోజు.

“స్వప్నా వస్తున్నావా?” నా పక్కింటి వాకింగ్ ఫ్రెండ్ ప్రమీల కేకతో ఆలోచనల్లోనుండి బయట పడి వాకింగ్ షూస్ వేసుకుని బయటకొచ్చాను.

వాక్ చేస్తున్నప్పుడు చొక్కా విషయం ప్రమీలకి చెప్పాను దిగులుగా. “దొరికితే దొరికిందిలే – దొరికిందని మీ పనిమనిషికి చెప్పకు. నీకు భలే తొందరపాటని కాలనీ అంతా టాం టాం వేస్తారు ఈ పనోళ్ళు” అంది ప్రమీల.

“వద్దు వద్దు. వాళ్ళేమైనా అనుకోనీ నేను మాత్రం చొక్కా దొరికిన విషయాన్ని చెప్పేస్తాను. చెప్పకపోతే ఆ పిల్ల ముఖం చూసినప్పుడంతా వచ్చే అపరాధభావన అంతకంటే ఎక్కువ బాధ కలిగిస్తుంది” అన్నాను.

వాక్ నుంచి ఇంటికి రాగానే “శ్యామలా షర్ట్ దొరికింది. వీడు వాళ్ళ ఫ్రెండ్ కిచ్చి మర్చిపోయాడు. ఇదిగో ఈ రోజు తెచ్చాడు” అన్నాను పని చేసుకుంటున్న శ్యామలకి షర్ట్ చూపిస్తూ.

“దొరికిందా – నేనే తీశానని నన్ను పనిలోంచి తీసేస్తారని భయమేసిందమ్మా” అంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు.

పొద్దునైనా నిన్ను నేను ఏమీ అనలేదుగా శ్యామలా… ఇంట్లో ఎక్కడో పడేసి ఉంటావు, వెతుకు అనే కదా అన్నాను, ఎందుకు భయం?” అన్నాను.

పైకి అలా అన్నానే కాని చొక్కా దొరక్కపోయినట్లైతే మరో తప్పు చేసి ఉండేదాన్నేమో!

ఆ ఆలోచన రాగానే ఏమాత్రమూ సంకోచించకుండా శ్యామల చేతులు పట్టుకుని “ఏది ఏమైనా నిన్ను బాధ పెట్టినందుకు, నా తొందరపాటుకు నన్ను క్షమించు తల్లీ” అన్నాను.

“అయ్యో అమ్మా!- ఏం ఫరవాలేదు ఊరుకోండి” అంది శ్యామల. మా ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్ళు. రాకేష్ సంఘటన మళ్ళీ గుర్తొచ్చింది అయితే చిత్రంగా నాకు ఈసారి బాధ కలగకపోగా దాని నుంచి ఏదో నేర్చుకున్నట్లుగా అనిపించింది.

**********

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 20 నుంచి 26 భాగాలు ( సమాప్తం )

26( గత వారం తరువాయి )

 20

కొద్దిగా కళ్ళు తెరిచాడు రామం.. రెండ్రోజుల తర్వాత అప్పుడే స్పృహలోకొచ్చి..

అపోలో హాస్పిటల్‌.. హైద్రాబాద్‌.

బయట ఎడతెగని వర్షం.
రాష్ట్రం అట్టుడికి పోతోంది. ఇరవైమూడు జిల్లాల జనసేన కార్యాలయాల దగ్గర వేలకొద్ది ప్రజలు. టి.వి. చానళ్ళన్నీ బ్రేకింగు న్యూస్‌.. ఎప్పటికప్పుడు రామం ఆరోగ్య పరిస్థితిపై బులిటిన్లు. భారతదేశంలో ‘ప్రక్షాళన’ పేరుతో ఆరంభమైన ఈ వినూత్న అహింసాయుత వైవిధ్య ఉద్యమాన్ని పరిశీలించేందుకు, విశ్లేషించేందుకు జాతీయ, అంతర్జాతీయ టి.వి చానళ్ళుకూడా హైద్రాబాద్‌లో మకాం వేశాయి.

అంతకుముందు రోజే రామం కోరికగా క్యాథీ, డాక్టర్‌ గోపీనాథ్‌, మూర్తి, శివ ఒకేమాటగా.. ‘వ్యక్తులు ముఖ్యంకాదు.. ముందుకుపోవడం, యుద్ధం చేయడం, పోరాటాన్ని కొనసాగించడం.. అవిశ్రాంతంగా లక్ష్యంవైపు  పయనించడం.. యివే ముఖ్యం’ అని భావించి రామం హాస్పిటల్లో ఉన్నా… యథావిధిగా ముందే వేసుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని జిల్లా కేంద్రాల్లో ‘ప్రక్షాళన” మూడవ విడత కార్యక్రమం జయప్రదంగా నిర్వహించబడింది. అన్ని కేంద్రాల్లో రిటైర్డ్‌ ఆడిటర్స్‌, ఇన్‌కంటాక్స్‌, సేల్స్‌టాక్స్‌ ఆఫీసర్స్‌, కొందరు మాజీ ఎస్పీలు, యిదివరకు ప్రభుత్వంలో పనిచేసి అన్ని రూల్స్‌ సమగ్రంగా తెలిసిన సెక్రటరీ స్థాయి ఉద్యోగులు.. తమతో చాకుల్లాంటి, దేశంపట్ల, సమాజంపట్ల తమ బాధ్యతలనెరిగిన మెరికల్లాంటి, క్రీమ్‌వంటి యువకులు తోడుగా.. చేతిలో ‘సమాచార చట్టం’ ప్రకారం సంపాదించిన సర్టిఫైడ్‌ కాపీలను జతచేసి.,
శక్తి నిత్యమూ, సత్యమూ, నాశనంలేనిదీ ఐనట్టే.. అందరికీ చెందిన గాలి, భూమి, నీరు, నిప్పు, ఆకాశం వంటి సహజవనరుల ద్వారా ఉత్పత్తిగా, సేవగా, వస్తువుగా.. చివరికి డబ్బుగా మారిన సంపద.. అంతిమంగా సమాజానికి చెందాలి. సమంగా అందరికీ పంచబడాలి. కాని అందరికీ చెందాల్సిన సామాజిక సంపద అనేక అక్రమ మార్గాలద్వారా కొందరి.. అంటే దేశంలోనే ఓ ఏడెనిమిది శాతం మంది గుప్పిట్లలో బందీ ఐ ఉంది. అందరికి చెందవలసిన ప్రజలఉమ్మడి సంపద కొందరి దగ్గర్నే గుప్తమై ఉండడం సహజన్యాయానికి విరుద్ధమైంది కాబట్టి.. దాన్ని ప్రజలే విముక్తం చేస్తున్నారు.
ఆ క్రమంలో.. జనసేన రహస్య సమాచార సేకరణ బృందాలు అన్వేషించి సంపాదించిన అవినీతి సంపాదన, లంచాలద్వారా కూర్చుకున్న నల్లడబ్బు గల అనేకమంది ఉన్నతస్థాయి ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ సంస్థలవాళ్ళు, బ్రోకర్లు, కన్‌సల్టెంట్స్‌, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలు.. వీళ్ళ గత ఐదు సంవత్సరాలుగా ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించిన రిటర్న్స్‌, ఎలక్షన్‌ కమీషన్‌కు లిఖితపూర్వకంగా యిచ్చిన సమాచారం.. ఒక్కొక్కరిపేర ఉన్న బినామీ ఆస్తుల వివరాలు.. అన్నీ జతచేసి ప్రజల సమక్షంలో దాడులు నిర్వహించి నిగ్గుతేల్చాల్సిందిగా ప్రజల పక్షాన ప్రజలు ఋజువుల్తో సహా కంప్లెయింట్‌ చేయడమే.. వాటిపై చర్య తీసుకోకుండా ఎగవేసేందుకు వీల్లేకుండా కాపీ టు కలెక్టర్‌, కాపీ టు చీఫ్‌ సెక్రటరీ, కాపీ టు గవర్నర్‌.. కాపీ టు.. ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌, గవర్నమెంటాఫ్‌ ఇండియా.. బృందాలు బృందాలుగా చేసిన కంప్లెయింట్లను కార్యరూపంలోకి తెచ్చేదాకా డే టు డే ఫాలోఅప్‌.. ఎవర్నీ నిద్రబోనిచ్చేది లేదు.. తాము నిద్రపోయేది లేదు.
పరిస్థితి ఏమైందంటే.. ‘జనసేన’ వెంటపడ్తే..ఒక ఆల్సేసియన్‌ కుక్కలమంద వెంటపడి తరిమినట్టే.. చంపవు.. విడిచిపెట్టవు. సాధారణ ప్రజలకుమాత్రం ఒక సుదీర్ఘ చీకటి తర్వాత.. కొత్త ఉషోదయం.
మొత్తం నాల్గువేల ఆరువందల ముప్పయి రెండు కేసులు.

27
ఆ రోజు విప్లవించిన అహింసాయుత ప్రజాచైతన్య ప్రభంజనాన్ని మీడియా ఆకాశమంత విశాలంగా కథనాలు కథనాలుగా.. ప్రజల అభిప్రాయాలుగా, స్పందనలుగా, మేధావుల ప్రశంసలుగా.. కొందరు గుండాల పశ్చాత్తాపాలుగా ప్రసారంచేసి, ప్రచురించి ఎంతో ప్రాచుర్యం కల్గించాయి.
పరిస్థితి.. నిబద్ధత.. ఎవరికోసం ఏదీ ఆగదు. తీరం చేరేదాకా ప్రయాణం తప్పదు. కొనసాగింపేగాని విరామంలేదు.
వందల వేల సంఖ్యలో ‘రామం’ గురించిన ఎంక్వయిరీలు.. రాష్ట్రం నలుమూలల్నుండి.. ఇతర రాష్ట్రాల అభ్యుదయకాముకులనుండి, ప్రజాసంఘాలనుండి.
ఎప్పుడూ శక్తి ఒకచోట క్షిప్తమై ఉంటుంది. కాని ఒక వెక్టార్‌గా బాణంవలె, తుపాకీగుండువలె అనుసంధానించగలిగే కర్త ఒకరు కావాలి. రామం.. నాయకుడు.. ప్రజాశక్తిని ఒక నిశ్శబ్ద రక్తపాతరహిత ఉద్యమంగా రూపొందించి బ్రహ్మాస్త్రాన్ని చేసి సంధించిన సంధానకర్త. కర్త కర్మ క్రియ..అన్నీ.
యిప్పుడా నాయకుడెలా ఉన్నాడు. అసలా ‘అగ్ని’పై దాడి ఎలా జరిగింది.
పోలీసులు.. కుక్కలు.. అందరూ రంగప్రవేశం చేశాయి.
కాని.. జనసేన కార్యకర్తలు.. సుశిక్షితులు.. యోధులు.. కొత్తవాడ దాడి జరిగిన రెండుగంటల్లోనే శివనగర్‌లో పట్టుకున్నారు ఆ బాంబువేసినవాణ్ణి. ఆ వ్యక్తిని పోలీసుల అదుపులోకి ఇచ్చేముందు సరియైన పద్ధతిలో గూఢాచార కార్యకర్తలు విచారిస్తే.. అంతా బయటపడింది. దాదాపు ఐదు ప్రజాసంబంధమైన ప్రాజెక్ట్‌ల్లో పధ్నాలుగు వేలకోట్లు ప్రక్కదారి పట్టించి తింటున్న ఒక రాయలసీమ రాజకీయ నాయకుడు యిక తన దుశ్చర్యలన్నీ బట్టబయలైతాయని భయపడి, ‘జనసేన’ ఉద్యమం ఇంకా ఇంకా బలపడి వేళ్ళూని బలపడకముందే ఆదిలోనే తుంచేయాలని రామంను హతమార్చేందుకు యాభై లక్షల బేరాన్ని కుదర్చుకుని పంపగా వచ్చిన కిరాయిరౌడీ.. పేరు ఈరప్ప.. మొత్తం కూపీ బయటపడింది. ఆ నాయకుడెవడు. వాని చరిత్ర నేపథ్యం ఏమిటి.. వాని వెనుక ఉన్న తెరవెనుక గుండాలెవరు.. అంతా వెంటనే చర్యకొరకు రాయలసీమలోని ‘జనసేన’ కార్యాలయానికి ఆదేశాలు వెళ్ళాయి.
రామం కళ్ళు తెరిచి.. స్పృహలోకొస్తూ.. మెల్లగా చుట్టూ చూశాడు.
వర్షం చినుకుల చప్పుడు.
గదిలో.. క్యాథీ, డాక్టర్‌ గోపీనాథ్‌, శివ.. మూర్తిగారు.
”బాంబు పేల్చినవాడు పట్టుబడ్డాడు”అన్నాడు శివ ఆత్రంగా
”….” మౌనంగా శివవంక చూశాడు రామం నిర్మలంగా.. ప్రశాంతంగా.. ఆ చూపులనిండా కరుణ జాలువారుతోంది.
”పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు..రాయలసీమవాడు.”
”శివా.. వాణ్ణి వదిలేయమని నా తరపున ఒక ఆప్లికేషన్‌ తయారుచేయి ప్లీజ్‌”
”రామం.. మీరేమంటున్నారు. వాడు మిమ్మల్ని హతమార్చాలనుకున్నాడు”
”ఔను.. అందుకే వదిలేయమంటున్నాను”
”….” శివ అవాక్కయి శూన్యంగా చూస్తూండగా.,
గోపీనాథ్‌కు రామంలో పూర్తి పరిపక్వత చెందిన పరిపూర్ణ మానవుడు దర్శనిమస్తూండగా..,
”శివా.. అతను యిప్పటికే పశ్చాత్తాపపడ్తూంటాడు. విడిచిపెట్తే వాడొక వాల్మీకిలా పరివర్తన చెందుతాడు శివా.. నిజం.. ద్వేషానికీ, పగకూ శిక్ష ఎప్పుడూ పరిష్కారం కాదు. క్షమ ఒక్కటే అటువంటి వ్యక్తికి సరైన శిక్ష”
మూర్తిగారు ఆశ్చర్యంతో ఆనందపడిపోయాడు. తను ఇన్నాళ్లుగా జరిపిన ప్రపంచ తత్వవేత్తల, మహాపురుషులకు సంబంధించిన అనేక అధ్యయనాల్లో యింత పరిణతి కనిపించదు. రామం ఆయనకు ఓ కొత్తకోణంలో మహామనీషిలా కనబడ్డాడు మొదటిసారి.
ఈలోగా శివ చేతిలోని ‘జనసేన’కు సంబంధించిన హాట్‌లైన్‌ మొబైల్‌మ్రోగింది. వరంగల్లు జనసేన కేంద్రక కార్యాలయంనుండి..
”హలో..” అన్నాడు శివ ఏదో ముఖ్యవిషయమే ఐ ఉంటుందని ఊహిస్తూ,
‘ఆపరేటర్‌ పద్మజ.. హలోశివా.. అస్సాంనుండి అఖిల్‌ గొగోయ్‌ అనే సామాజిక ఉద్యమకారుడు రామంగారి ఆరోగ్యంగురించి వాకబు చేస్తున్నాడు. మనవలెనే సమాచారచట్టం ఆర్టిఐని ఆధారంగా చేసుకుని 2006 నుండి కృషిక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి అనే సంస్థను స్థాపించి ఎఫ్‌ సి ఐ గోదాములు, ప్రజాపంపిణీ వ్యవస్థపై చారిత్రాత్మకమైన పోరాటం చేస్తున్నాడు.. అతను..”
”కనెక్షన్‌ యివ్వు పద్మజా”
వెంటనే లైన్‌ రీ ఓపెనై అఖిల్‌ గొగోయ్‌ ట్రాక్‌లోకొచ్చాడు.
”గుడ్మార్నింగు.. హౌ ఈజ్‌ మిస్టర్‌ రామం.. జనసేన చీఫ్‌”
”గుడ్మార్నింగు సర్‌. హి ఈజ్‌ ఔటాప్‌ డేంజర్‌ నౌ.. ఆల్సో సేఫ్‌..”
”థాంక్‌గాడ్‌.. రామం వంటి వారు ఈ దేశానికి చాలా అవసరం.. మీ జనసేన గురించి మీడియాలో జాగ్రత్తగా గమనిస్తున్నాను. నేను ‘అగ్ని’ ఛానల్‌ చూస్తా. మేము యిక్కడ చేయలేని పనిని మీరు భారీఎత్తున చేపట్టి విజయం సాధిస్తున్నారు.. బెస్టాఫ్‌ లక్‌.. ఒకసారి రామం గారికివ్వండి” అన్నాడు అస్సామీ భాషలో-
శివ ఫోన్‌ను రామంకు అందించాడు.. యిచ్చి ”అఖిల్‌ గొగోయ్‌.. కె ఎమ్‌ ఎ స్సెస్‌ అస్సాం” అన్నాడు.
”గుడ్మాన్నింగు.. మిస్టయ్‌ గొగోయ్‌.”
”…..” అట్నుండి సంభాషణ జరిగి.,
”థాంక్యూ.. థాంక్యూ వెరీమచ్‌.. ఐ ఆల్సో విష్‌ ద బెస్ట్‌ ఇన్‌ యువర్‌ ఎండీవర్‌” అన్నాడు  రామం.
”యు ఆర్‌ ది హోపాఫ్‌ ది నేషన్‌.. మిస్టర్‌ రామం.. ప్లీజ్‌ టేక్కేర్‌..”
”….” నిశ్చలంగా మొబైల్‌ను శివకు అందించాడు రామం.
”శివా.. మొన్నటి మన ‘ప్రక్షాళన’ జరిగిందా ముందే అనుకున్నట్టు”
”ఔను.. జరిగింది.”
”క్యాథీ… గోపీనాథ్‌ సార్‌.. నావల్ల మన కార్యకలాపాలేవీ ఆగొద్దు. మనవంటి సామాజిక ఉద్యమాల్లో ఒక నాయకుడు, అనేకమంది అనుచరులుండొద్దు.. ప్రతివ్యక్తీ ఒక స్వయంచోదిత నాయకుడుగా ఎదిగి ఎదురొడ్డి పోరాడాలి.. క్యాథీ మనం అనుకున్న ప్రోగ్రాం చెప్పవా ప్లీజ్‌” అన్నాడు రామం ఆమెవైపు చూస్తూ.
”మన కార్యాచరణ పథకంలో మనం ప్రధానంగా ఐదు థల్లో లక్ష్యాన్ని చేరుకుంటాం. అవి అవగాహన, ప్రక్షాళన, సంగ్రామం, పరిపాలన మరియు కొనసాగింపు. మనం గత మూడునెలలో నెలపదిహేను రోజులు అవగాహన పేరుతోలక్షలమందిని సంప్రదించి, అభిప్రాయాలు సేకరించి, డాక్యుమెంట్‌ చేసి ప్రజల్లో పౌరవిధులపట్ల, బాధ్యలపట్ల, హక్కులపట్ల, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలపట్ల అవగాహన కల్పించి చైతన్యవంతులను చేశాం. దాదాపు నాల్గు లక్షలమందిని జనసేనలో చేర్పించి, లక్షమంది క్రియాశీల కార్యకర్తలతో ఒకటి, ప్రక్షాళన రెండు.. ప్రక్షాళన మూడు కార్యక్రమాలను అమలుచేస్తూ కాంట్రాక్టర్లరూపంలో ఉన్న రాజకీయ నాయకులపైన, యితర దుర్మార్గ బినామీ ఆపరేటర్ల మీద, పవర్‌ ప్రాజెక్ట్‌లు, ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, రోడ్లు, వంతెనలు, నిర్మాణాలు.. వీటన్నింటిపై మొత్తం ఆరువందల నలభై ఎనిమిది కేసులను ముఖాముఖి ప్రజల సమక్షంలో నిలదీసి.. దాదాపు డెబ్బయిఎనిమిది వేల కోట్ల రూపాయల పాక్షిక దుర్వినియోగాన్ని కోర్టులద్వారా, లోకాయుక్త ద్వారా.. నైతిక విజయాలద్వారా ఆపి నిలదీశాం. దీంతో ప్రభుత్వ సూడో రాజకీయ యంత్రాంగమంతా తోకముడిచి కలుగుల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు యిప్పుడు నేయి హవిస్సుగా లభిస్తున్నప్పుడు ఎగిసెగిసిపడే యజ్ఞ అగ్నిజ్వాలల్లా చైతన్యంతో ధగధగలాడ్తున్నారు. యిక ప్రక్షాళన నాల్గు ఇంకో వారం తర్వాత ఉంది. ఆ థలో ఈ రాష్ట్రంలో పరిశ్రమలు ఎందుకు రావట్లేదు. ఉద్యోగాలు ఎందుకు రూపొందించబడట్లేదు. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో బడాబడా వెధవలు ఎలా శాశ్వత ప్రకృతి వనరులను, మానవశక్తిని దోపిడీ చేస్తున్నారు. దేశీయ ఆదివాసీ, గిరిజన, అరణ్యప్రాంత తెగల ప్రజలు ఎందుకు అణగారిపోయి జీవిస్తున్నారు. వీరిపేర ప్రభుత్వాలు ఇంతవరకు ఎన్నివేల కోట్లను ఉపయోగించి, ఖర్చుపెట్టి అభివృద్ధి చేశామని చెప్పి.. ఎంత భోంచేశాయి.. యివన్నీ, వీటి చిట్టా విప్పవలసి ఉంది. వీటి సమగ్ర సమాచారం మన గూఢాచార, యువజన విభాగాలు సేకరిస్తున్నాయి. యిక ఆ తర్వాత అతి కీలకమైన సంగ్రామం ప్రారంభమౌతుంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా చైతన్యవంతులైన ప్రజలు యిక బెబ్బులులై విజృంభించి నేరచరితులు, గుండాలను, అవినీతిపరులైన రాజకీయ నాయకులను కనబడ్తే తరిమి తరిమికొడ్తారు. కలుషితమైన ప్రస్తుత వ్యవస్థ పూర్తిగా నిర్మలమై, స్వచ్ఛమై పారదర్శకమయ్యేదాకా మన ‘సంగ్రామం’ కొనసాగుతుంది. ఇది ఒక దీర్ఘకాలిక కార్యక్రమం.. నిరంతరమై, అవిశ్రాంతమై కొనసాగవలసిన ప్రాణక్రియ. ఒకసారి మన ‘జనసేన’ చేత ఆమోదముద్రను పొంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు.. అధికారంతో సంబంధంలేని మన ‘జనసేన’ సూచించిన ఆదర్శపాలనను ఆరంభించిన తర్వాత.. పరిపాలనా విధానం.. జనాన్ని పూర్తిస్థాయి ఆత్మగౌరవంతో యాచకులవలెగాక ఆత్మాభిమానంతో బతుకగల నాణ్యమైన జీవితాలన్నందించే స్థాయిని, స్థితిని సాధించిన తర్వాత.. మార్గదర్శకాలను, ఆదేశాలను ఎప్పటికప్పుడు స్వార్థరహిత సలహాదారుల నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షమై.. సుశాంతమై.. వర్థిల్లుతూంటే.. యిక ఆ స్థితియొక్క కొనసాగింపు..  ఓ నిరంతర నియంత్రణ క్రియ. నియంత్రణ లేకుంటే పాలనా వ్యవస్థ కుప్పకూలి పతనమైపోతుంది. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత పదేళ్ళకాలం రాజకీయ విలువలతో కూడిన సంస్కారవంతమైన వ్యక్తులే దేశపరిపాలనలో పాలుపంచుకున్నారు. తర్వాతనే ఎవరి నియంత్రణాలేక, అసమర్థతవల్లా, అధికార వ్యామోహం వల్లా నాయకులు నీచులైపోయారు. యివీ మన ప్రధాన కార్యక్రమాలు రామం..” క్యాథీ ఆగింది నెమ్మదిగా.
”ఇవేవీ ఎక్కడా ఒక్కశాతం కూడా డిరైల్‌ కావద్దు. నేను కోలుకునేదాకా.. మీరంతా మనం అనుకున్న ప్రకారమే కార్యక్రమాలను యథావిధిగా నడిపించండి.. నేనుంటా మీవెంట.. ఈ బెడ్‌పై నుండే..”
”యస్‌.. యస్‌..” అన్నారు గోపీనాథ్‌.. మూర్తి సాలోచనాగా..ఒకేసారి.
తర్వాత.. చుట్టూ నిశ్శబ్దం.
బయట వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా.
”నాకు నిద్రొస్తోంది..” అన్నాడు రామం.. మెల్లగా కనురెప్పలను మూసుకుంటూ.
అది నిద్రకాదు.. యింతకుముందు డాక్టర్‌ యిచ్చిన ట్రాన్‌క్విలైజర్‌ అని గోపీనాథ్‌కు తెలుసు.
శివ, గోపీనాథ్‌, మూర్తి.. ఆ గదిలోనుండి బయటికి.. బాల్కనీలోకి నడిచారు.
క్యాథీ ఒక్కతే ఆ గదిలో మిగిలింది.
ఎందుకో ఆ క్షణం నిగ్రహించుకోలేని దుఃఖం ఆమెను ముంచేసింది. ఎక్కెక్కిపడి ఏడ్చింది మౌనంగానే.

21

‘శత్రుశేషాన్ని సమూలంగా ధ్వంసం చేయాలి. ఆ విషయంగా ఉపేక్ష అస్సలే కూడదు.’ అనేది ఎస్పీ విఠల్‌ సిద్ధాంతం.
మంత్రి మాధవయ్య హత్య.. కానిస్టేబుల్‌ హత్య.. తర్వాత ఒక అద్భుతమైన కథ.. హోంమంత్రి స్థాయిలో అంతా మర్యాదల అంగీకారాలు.. నానుండి.. నీకేంకావాలి..నీనుండి నాకేంకావాలి.. బేరసారాలు, లావాదేవీలు. ముఖ్యమంత్రిదాకా  ఒక రాయబారం – ఒక అవగాహన. చివరికి మంత్రి మాధవయ్య హత్యపై ఒక కమీషన్‌.. ఎంక్వయిరీ.. మంత్రి. కాబట్టి తొందరగా నివేదిక కావాలని ఆదేశం..
ఈ దేశంలో ప్రధానమంత్రి హత్య చేయబడ్తే పదేళ్లు.. ముఖ్యమంత్రి చచ్చిపోతే నిజంనిగ్గు తేల్చడానికి పదినెలలు పట్టే ‘రెడ్‌టేప్‌’ కాలంలో, వ్యవస్థలో.. ఎవని గోల వానిది.. ఎవని శ్రద్ధాసక్తులు వానివి. భారతదేశంలో పై తరగతి ఉద్యోగుల్లో పశువులకంటే ఎక్కువ అతిస్వేచ్ఛ, ఎవనిపై ఎవనికీ నియంత్రణలేని అరాచకత్వంతో నిండిన విచ్చలవిడితనం ఉందంటే.. ఆ బురదలో నివసిస్తున్నవాడికే ఈ దుర్గంధానుభవం అర్థమౌతుంది.
విఠల్‌ ఆరోజు రాత్రి చాలా ఆనందంగా ఉండి మధ్యవర్తిత్వం జరిపిన ముగ్గురు ఫ్రెండ్స్‌కు మద్యం, మగువలతో పోలీస్‌ గెస్ట్‌హౌజ్‌లో పోలీసుల పహరామధ్య పార్టీ యిచ్చాడు. మంత్రి మాధవయ్య హత్యను ఎంక్వయిరీ చేసిన వన్‌మ్యాన్‌ కమీషన్‌.. మంత్రిగారిని అతని దగ్గర అంగరక్షకుడుగా పనిచేస్తున్న మురళీధర్‌ అనబడే గన్‌మన్‌ ముఖ్యమంత్రి యొక్క వీరాభిమాని కావడంవల్ల, ఆరోజే ఉదయం మంత్రి మాధవయ్య ముఖ్యమంత్రిని విమర్శిస్తూ, తూలనాడ్తూ మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించడంవల్ల మానసికంగా గాయపడి.. బాగా తాగిన మైకంలో అర్ధరాత్రి బాగా తాగిఉన్న మంత్రి మాధవయ్యను రివాల్వర్‌తో రెండుసార్లు తూటాలు పేల్చి హత్య చేశాడు. ఈ తతంగాన్నంతా తన కళ్ళముందు జరుగుతూండగా ప్రత్యక్షంగా చూస్తున్న ఎస్పీ విఠల్‌ తన విధినిర్వహణలో భాగంగా కానిస్టేబుల్‌ను అడ్డుకోబోయి విఫలుడై విధిలేని పరిస్థితుల్లో ఆత్మరక్షణార్ధం తన సర్వీస్‌ రివాల్వర్‌తో గన్‌మన్‌ మురళీధర్‌ను కాల్చవలసి వచ్చింది. అందువల్ల మురళీధర్‌ అనివార్యమై మరణించాడు. ఇదంతా ఒక అతి సహజ ఘటన. దీంట్లో ఎస్పీ విఠల్‌ ప్రమేయం అస్సలేలేదు. అతను పూర్తిగా నిర్దోషి.. అదీ సారాంశం.
ఎంక్వయిరీ కమీషనర్‌కు కోటి రూపాయలు ముట్టాయి.. మధ్యవర్తులిద్దరికి చెరో పది పదిలక్షలు. ఒకటి రెండు నెలల తర్వాత.. ముఖ్యమంత్రి సమక్షంలో జెంటిల్‌మన్‌ అగ్రిమెంట్‌.. మంత్రి తాలూకు బ్రతికున్న వారసులకు, తనకు.. బార్ల లెక్కలు, భూముల లెక్కలు, సెటిల్‌మెంట్ల అకౌంట్స్‌.,
రాజీకి రాకుంటే చచ్చినోడు ఎట్లాగూ తిరిగిరాడు.. కనీసం ఈ పరిష్కారం క్రింద ఇరవైరెండు కోట్లు పోతాయని చెప్పినమాట వినుడు. అంతేగాని ఎవడు వెధవ కాడు.. ఎవడూ గాజులేసూక్కుర్చోడు.
మంత్రిని చంపడం వల్ల వాడు లెక్కలు తప్పించి నొక్కేసిన డబ్బులోనుండి ముప్పయి రెండు కోట్లు తనకు లాభం.
మొత్తంమీద ఎస్పీ విఠల్‌ టైం బాగుండి హత్యవల్ల ఇబ్బడి ముబ్బడిగా కోట్ల కొద్ది రూపాయల లాభమే చేకూరింది. పైగా బోనస్‌ క్రింద వేరొక జిల్లాకు ట్రాన్స్‌ఫరై.. మళ్లీ కొత్త గడ్డిమైదానం.. పచ్చని తాజాగడ్డి. మళ్ళీ ఇష్టమున్నట్టు మేత.
కాని.,
ఆ రోజు.. ఆ వర్షం కురిసిన రాత్రి..హత్యచేయబడ్డ మంత్రిగారు బాగా తాగి, తనూ తాగి, తనతో షూట్‌ చేయబడ్డ గన్‌మెన్‌ మురళీధర్‌ కూడా బాగా తాగి.. అందరికందరూ తాగుడుమైకంలో పిచ్చిపిచ్చిగా ఓలలాడ్తున్న ఆ చీకటి రాత్రి.,
తను మంత్రిని కాల్చిచంపడం కిటికీలోనుండి ఆరోజు సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ రాములు చూశాడేమోనని అనుమానం విఠల్‌కు. అందుకే రాములును అప్పుడప్పుడు ఏదో ఒక నెపంమీద తన దగ్గర్కి రప్పించుకుని మాటల్తో పరీక్షించాడు. కాని అనుమానం బలపడ్తూనే ఏదీ స్పష్టంగా అర్దంగాక పిచ్చిపిచ్చిగా, చికాగ్గా ఉందతనికి.
మరి.. శత్రుశేషం.. సిద్ధాంత కింద రాములుగాణ్ణి శాశ్వతంగా లేపేస్తేమిటట.,
ఏమీలేదు.. లేపెయ్యొచ్చు సుళువుగా.
రాజు తల్చుకుంటే దెబ్బలక్కొదువా అన్నట్టు ఎస్పీ తల్చుకుంటే ఒక కాన్‌స్టేబుల్‌ను చంపడం కాలితో చీమను తాడించి చంపినంత సుళువు.
ఒక ఎన్‌కౌంటర్‌.. ఒక తుపాకీ శుభ్రం చేసుకుంటూండగా పొరపాటున తూటా పేలి ప్రమాదవశాత్తు దుర్మరణం.. డ్యూటీపై వెళ్తూండగా లారీకింద పడి పరమపదించెను.. ఇలాంటివి సవాలక్ష.,
కాని.. ఏది చేసినా.. పకడ్బందీగా, రంజుగా చేయాలని విఠల్‌ కోరిక.
అందుకే.. రాములును తనతోపాటే తనకు కొత్తగా పోస్టింగిచ్చిన జిల్లాకు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని రప్పించాడు.
రేపు ఉదయం.. ఏడుగంటలకు సీక్రెట్‌ ట్రిప్‌.. ముత్తారం అడవుల్లోకి.. ఒక నక్సలైట్ల రహస్య స్థావర ఆచూకీ కోసం.. టాఫ్‌లెవల్‌ పర్సూఎన్స్‌లో.. ఎస్పీ తను.. డ్రైవర్‌ రాములు.. ఇద్దరే.. రహస్య పర్యటన.. అడవి లోపలికి.. మనుష్య సంచారమేలేని అడవి గర్భంలోకి.,
అక్కడ.. రాములు.. పరలోకగతుడగుట.,
శత్రుశేషం పూర్తిగా నిశ్శేషమై.. క్లీన్‌బౌల్డ్‌.. పరమపదసోపానం.
విఠల్‌ విస్కీ మత్తులో తన సరికొత్త ఉంపుడుగత్తె రాణీ పద్మజ కౌగిట్లో దొర్లుతూ.. రాములు కథను ఊహించుకుంటూ.. ఆమెతో.,
”రేపుదయం ఆరింటికి లేపాలి.. ఆరున్నరకు స్పెషల్‌ దౌరా.. ” అంటున్నాడు ముద్దముద్దగా.
అప్పుడు రాత్రి ఒంటిగంట పదినిముషాలైంది.
కానిస్టేబుల్‌ రాములుకు ఆశ్చర్యంగా, అదోలా, విచిత్రంగానే కాకుండా భయంగాకూడా ఉంది.
నక్సలైట్ల వేటకోసం కేంద్ర నిధులతో సమకూర్చుకున్న బులెట్‌ ఫ్రూఫ్‌ వాహనాల్తోసహా నిజంగా కొన్నవి కొన్ని, కొన్నట్టు కాగితాల్లో చూపించినవి కొన్ని. ప్రత్యేకంగా అడవులు, కొండల్లో పనికి వచ్చేవి కొన్ని.. అందులో ఒకటి.. ఎస్పీగారు తన యిష్టమొచ్చినపుడు టీ షర్ట్‌, స్పోర్ట్స్‌ ష్యూస్‌ వేసుకుని థర్డ్‌లేడీతో విహారశృంగారయాత్ర జరపడానిక్కూడ పనికొచ్చే ధగధగా నల్లనాగులా మెరిసే ర్యాంగ్లర్‌ జీప్‌.,
ఆ జీప్‌డ్రైవర్‌గా తను.. ప్రక్కసీట్లో ఎస్పీ విఠల్‌.. ఉదయమే నాల్గున్నర గంటలకు.. ఇద్దరే ఇద్దరు వర్షం వెలిసి చల్లగా ఈదురుగాలి వీస్తున్నవేళ బయల్దేరి.,
”మహాముత్తారం అడవుల్లోకి.. ” అన్నాడు జీప్‌ కదలగానే. అంతే యిక మాట్లాడ్డేదు ఎస్పీగారు ఇంతవరకు. మధ్య ఒకసారీ స్పీడ్‌పెంచి యింకా యింకా వేంగా పోనీ అన్నట్టు చూశాడంతే. గంటకు నూరుకిలోమీటర్లకన్నా ఎక్కువవేగంతో జీప్‌ గత మూడుగంటలు పరుగెత్తి పరుగెత్తి.. మహాముత్తారం అడవుల్లోకి ప్రవేశించి.. అరగంటగడిచి..,
మధ్య మధ్య అక్కడక్కడ పోలీస్‌పోస్ట్‌ల్లో రోడ్డుపైకి ఓ కానిస్టేబుల్‌ గన్‌తో సహా పరుగెత్తుకొచ్చి అతి వినయంగా సెల్యూట్‌ చేసి.. అంటే.. ఎస్పీ గారొస్తున్నట్టు కొంతమందికి సమాచారముందున్నమాట.
ఎస్పీ విఠల్‌ ప్రయాణిస్తున్న మూడుగంటల్లో ఎక్కువసేపు కండ్లమూసుకుని ధ్యానంలోఉన్నట్టు ఉండిపోయాడు. అతను ఏదన్నా సీరియస్‌గా ఆలోచిస్తున్నాడో, నిద్రపోతున్నాడో, ధ్యానముద్రలో ఉన్నాడో రాములుకు అర్ధంకాలేదు. ఏది చేస్తున్నా అతని శరీరంలోనుండి విస్కీవాసన, బట్టల పోలీస్‌ వాసన.. వెరసి ఖాకీ కంపుకొడ్తోంది. ఒక ఎలుగుబంటు ప్రక్కన భయం భయంగా తప్పనిసరి పరిస్థితుల్లో కూర్చున్నట్టు రాములు వణికిపోతూ గజగజలాడ్తూ వేగంగా, పదిలంగా జీప్‌ను నడిపిస్తున్నాడు.
అడవంతా నిశ్శబ్దంగా గంభీరంగా.. తపస్సు చేసుకుంటున్న ఋషిలా ఉంది.
ఎక్కడో అక్కడక్కడ కనబడ్డ చిన్న చిన్న ఆదివాసీ గ్రామాలు కనుమరుగైపోయి.. యిక అంతా అడవే. ఎక్కడా మానవ సంచారంలేదు.
”అడవంటే యిష్టమా రాములూ నీకు” అన్నాడు విఠల్‌.
మూడున్నర గంటల తర్వాత అతను మాట్లాడిన మొదటి మాట అది.
”ఔన్సార్‌..”
”చాలా యిష్టమా.. కొంచెం యిష్టమా”
”చాలానే యిష్టంసార్‌..”
‘ఊఁ.. నాక్కూడా అడవంటే చాలా యిష్టం నీకులాగానే”
రాములు మాట్లాడలేదు.. ఈ సంభాషణేమిటి అసంగతంగా అనుకున్నాడతను.
”ఔను రాములూ ఆ రోజురాత్రి.. వర్షం కురుస్తున్న రాత్రి.. వరంగల్లు గెస్ట్‌హౌస్‌లో..జ్ఞాపకముందా..” అన్నాడు సడెన్‌గా.
పోలీస్‌ బుద్ది, కుక్కబుద్ది ఒకటే.. వాసన చూడ్డం. ఐతే, వాడు కానిస్టేబులైనా ఎస్పీఐనా ఒకటే.
”జ్ఞాపకముంద్సార్‌.. మంత్రి మాధవయ్యగారు హత్యచేయబడ్డ రాత్రిగదా మీరంటూన్నది.”
”ఊఁ.. ” ఎస్పీ విఠల్‌ నిర్ధారించుకున్నాడు ఆ రాత్రి తను మంత్రిని చంపుతూండగా వీడు చూశాడని.
”నువ్వప్పుడు సెంట్రీడ్యూటిలో ఉన్నావా రాములూ”
”ఔన్సార్‌..”
వెంటనే ఎస్పీ విఠల్‌ నిర్ధారించుకున్నాడు యిక వీణ్ణి లేపేయాలని.
సరిగ్గా అప్పుడే గ్రహించాడు రాములు ఈ ఎస్పీగానితో ఏదో ప్రమాదం పొంచిఉందని.
”ఐనా మీరు మొన్నటి ఎంక్వయిరీ కమీషన్‌ రిపోర్ట్‌లో నిర్దోషని తేలిపోయిందిగదా సర్‌.. కంగ్రాట్స్‌ సర్‌” అన్నాడు రాములు.
”ఊఁ..”
వెంటనే ఒక మెరుపులా లీల జ్ఞాపకమొచ్చింది విఠల్‌కు. పాపం పుణ్యాత్మురాలు తనను కాపాడిందా గండంనుండి. ఎంక్వయిరీ కమీషన్‌గా వేసిన ఆ ఢిల్లీ బేస్ట్‌ రిటైర్డ్‌ డిజిపి లక్ష్మీనారాయణ సక్సేనా ముక్కూమొఖం తెలియదు తనకు. ” అమ్మా కాపాడని” వేడుకున్నాడు తను లీలను దీనంగా. ఎంత విస్తృతమైన పరిచయాలో, ఎన్ని గ్లోబల్‌ లావాదేవీలో లీలకు. క్షణాల్లో తనను ఢిల్లీ పిలిపించుకుని ఒక కోటి రూపాయలతో సక్సేనాతో డీల్‌ సెటిల్‌ చేసింది. తర్వాత్తర్వాత చచ్చిపోయిన మంత్రి పెళ్ళాన్ని, తనను హైద్రాబాద్‌ పిలిపించి మూడు ముక్కల్లో మూడువందల కోట్ల వ్యవహారాలను ఫటాఫట్‌ పంచి సరే అనిపించింది. తనుమాత్రం రెండు కేసులకూ కలిపి ఓ నాలుక్కోట్లు తీసుకుందంతే. డెడ్‌ చీప్‌. సెటిల్‌మెంట్లు చేయడంలో ఎవడు సాటొస్తాడు లీలకు. వినకుంటే వాడు లేచిపోయిండంతే. ఒకసారి ఓ కర్ణాటక పాలిటీషియన్‌ వినకుంటే వాన్ని చార్టర్డ్‌ ప్లేన్‌లో తీసుకెళ్లి హిందూమహాసముద్రం డీప్‌వాటర్స్‌లో పడేసొచ్చింది స్వయంగా. వాడింకా పోలీస్‌ రికార్డుల్లో అబ్‌స్కాండింగుగానే ఉన్నాడు. ఒక్క ఆడది.. వంద మగాళ్లకంటే ఎక్కువ.. రియల్లీ గ్రేట్‌ లేడీ.
విఠల్‌ చుట్టూ చూచి.. ఎక్కడా మానవ సంచారంలేదని పకడ్బందీగా నిర్ణయించుకుని.. బాగా దట్టమైన చెట్లు, పొదలు, తుప్పలు.. పక్కనే పెద్ద లోయ.. నదిపాయ ఉన్న కీలక ప్రాంతాన్ని ఎన్నుకుని..
”జీప్‌ ఆపు రాములూ” అన్నాడు మృదువుగా.
రాములు సాలోచనగా ఎస్పీగాడి దిక్కు చూచి.. జీప్‌కు బ్రేక్‌ అప్లయ్‌ చేస్తూ.. ఇప్పుడు నిరాయుధంగా ఉన్న తనను వీడు తను పిస్టల్‌తో కాల్చే ప్రయత్నం చేస్తే ఎలా తప్పించుకోవాలా అని మెరుపులా ఆలోచిస్తున్నాడు. ఏమీ తోచడంలేదు. మరోవైపు భయం ముంచుకొస్తోంది గుండెల్లోకి.. వణుకు..వణుకు.
అనివార్యమైనపుడు..జైల్లో ఉన్నవాడు వేలిగోటితో గోడను గీకిగీకి పొక్కచేసుకుని తప్పించుకుని పారిపోయిన ఉదంతం జ్ఞాపకమొచ్చింది రాములుకు.
”యిక్కడెక్కడో.. నక్సలైట్ల డంప్‌ ఉండాలి.. వెదుకుదాం.”
విఠల్‌ కిందికి దిగాడు. అటువైపు నుండి రాములుకూడా దిగి.,
”నువ్వటు పో.. నేనిటు చూస్తా..ఓ.కే..”
”యస్సార్‌..”
అక్కడ డంప్‌ లేదు పాడులేదని విఠల్‌కు తెలుసు.. కాని ఒట్టి బహానా.
అటుదిక్కు విఠల్‌ అడుగులో అడుగేసుకుంటూ కదిలాడు ఏదో వెదుకుతున్నట్టు.
అదేక్షణం.. విఠల్‌ వెళ్తున్న దిశకు వ్యతిరేకదిశలో రాములు బయల్దేరాడు మెల్లగా.. అతని ఒళ్ళు గజగజ వణికిపోతోంది.. ఏ క్షణాన్నైనా విఠల్‌ చటుక్కున వెనక్కి తిరిగి తనను రివాల్వర్‌తో కాలుస్తాడని ఊహిస్తున్నాడతను.. కాని ఎలా.
మెరుపులా.. ఏదో తోచి.. జరజరా వాలుగా ఉన్న పెద్ద మట్టిజాలుపై నుండి క్రిందికి జారాడు రాములు కావాలని..వేగంగా, బండరాయిలా జారుతూ జారుతూ వేగంగా వచ్చి వచ్చి.. ఒక మోదుగుచెట్ల తుప్పకు తట్టుకుని ఆగి.. పిర్రలు, చేతులు, కాళ్ళంతా గీరుకుపోయి..,
లేచి నిలబడి.,
పైకి చూశాడు రాములు.. ఎత్తుగా ఆకాశాన్ని తాకుతున్న పెద్దపెద్ద ఎత్తైన చెట్లు.. కింద ఒంపులో.. ఒర్రెలో తను. విఠల్‌ కనిపించడంలేదు.
ఇలాగే పారిపోయి తప్పించుకుంటే.,
”అరె రాములూ.. ఏడున్నవ్‌రా.” పైనుండి ఎస్పీగారి అరుపులు,.,
పైకి చూస్తూ వెనక్కి వెనక్కి నడుస్తున్న రాములు కాలికి ఏదో చల్లగా, నునుపుగా తాకి.. దిగ్గున ఉలిక్కిపడి.. ఆగి.,
కాలిదగ్గర.. తుపాకీ.. ఎ.కె. ఫిఫ్టీ టు.. నల్లగా త్రాచుపామువలె మ్యాగజైన్‌ లోడ్‌ చేసి.. రెడీ టు యూజ్‌ టైప్‌లో, చటుక్కున చుట్టూ చూశాడు.. ఎక్కడా ఎవరూ లేరు.
రాములుకు క్షణంలో అంతా అర్థమైంది. తను యిదివరకు నక్సలైట్ల కూంబింగు ఆపరేషన్స్‌లో పాల్గొన్న అనుభవం గుర్తొచ్చింది. మళ్ళీ చుట్టూ చూశాడు పరిశీలనగా.. అటుప్రక్క తుప్ప.. అప్పుడే కప్పినట్టు ఎర్రగా.. కొత్తగా మట్టి..పైన తుమ్మకొమ్మలను కప్పినట్టు పచ్చిపచ్చి.,
టకటకా తుమ్మకొమ్మలను జరిపి.. కప్పిన మట్టిని చేతివ్రేళ్ళతో పెకిలించి. తోడి ..చకచకా..ప్రాణభయం ఒకవైపు.. అనుకోని గగుర్పాటు కల్గించే సందర్భం మరోవైపు.. ప్రక్కన ఎ.కె ఫిప్టీటు తుపాకీ..కొండంత ధైర్యం..ఓ జానెడు లోతుపోగానే చేతికి తాకింది పెద్ద రేకు సందుగ. తుపాకీతో మట్టిని పెళ్ళగించి, అటుతోడి ఇటుతోడి.,
”అరే రాములూ.. ఏడ సచ్చినౌరా..” విఠల్‌ గొంతు.. దగ్గరైతోంది తనకు.
కరకరా ఎండిన ఆకులు బూటు కాళ్ళకింద నలిగి విరుగుతున్న చప్పుడు
హమ్మయ్య.. ట్రంక్‌పెట్టె మూత తెరిచాడు రాములు.. తెరిచి కొయ్యబారిపోయి.. కళ్ళప్పగించి.. గుండె చెదిరి.
అన్నీ వేయి రూపాయలనోట్ల కట్టలు.. భద్రంగా నింపి, పేర్చి.. ప్రక్కన కొన్ని గ్రేనైడ్స్‌. రెండు ఎ.కె ఫార్టీసెవెన్‌ గన్స్‌.,
”వీటిని తను చేజిక్కించుకంటే..”రాములు మెదడులో ఓ మెరుపు మెరిసి, జలదరింపు కలిగి., చుట్టూ చూశాడు.. ఆలోచన పదునెక్కుతోంది. క్షణంలో వందప్లాన్స్‌ రూపొంది, మలిగి..మళ్ళీ రూపొంది.. మళ్ళీ చచ్చి.. మొండి ధైర్యం తలెత్తుతోంది నిద్రలేస్తున్న బ్రహ్మరాక్షసిలా.
ఏదన్నా చేస్తే?.. ఈ డంప్‌లోని కోట్లకొద్ది డబ్బు తనదే.. పోలీసోళ్ళు ఎన్ని డంప్‌లను దొంగతనంగా దొంగల్దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు దోచుకోలేదు.. తనకిప్పుడు భగవంతుడు ఒంటరిగా దీన్ని చేజిక్కించుకునే అవకాశమిచ్చాడు ..కమాన్‌ కమాన్‌ క్విక్‌.. ఏదో నిర్ణయం తీసుకోవాలి రెప్పపాటులో .. అవకాశాలు మళ్ళీ మళ్ళీరావు.
వెనుకనుండి మెత్తగా బూట్ల చప్పుడు వినబడింది రాములుకు.
విఠల్‌.
పిలుస్తూ రావడం మానేసి.. హైడ్‌ అండ్‌ సీక్‌ టైప్‌లో దాడికి వస్తున్నాడు..
యిక ఒక్క లిప్తకాలం కూడా వృధా చేయలేదు రాములు. చేతిలోని ఎ.కె. ఫిఫ్టీ టు తో విఠల్‌ను దగ్గరగా పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో తూట్లు తూట్లు కాల్చాడు వరుసగా దూసుకుపోయే బుల్లెట్లతో.
విఠల్‌ శరీరం క్షణాల్లో మాంసం ముద్దలుగా ఖండఖండాలై ఎగిరి..ఎర్రగా రక్తం.. మజ్జ.. ఎముకలు చిట్లి చిట్లి.. గాలిలోకి ఎగిరి ఎగిరి చెల్లాచెదరైపోయింది.
క్షణకాలం అడవి తుపాకీ గుళ్ళధ్వనితో దద్దరిల్లి.,
చెట్లపైనుండి పకక్షులు అదిరిపడి ఎగిరి.. ఆకాశంలోకి రెక్కలార్చి.. టపటపా టపటపా ,
మరుక్షణం.. మళ్ళీ భీకర నిశ్శబ్దం.
రాములు నిలబడ్డాడు అలాగే.. దృఢంగా.. స్థిరంగా.. ఒక చెట్టువలె. అతని తల దిమ్మెక్కిపోయింది.. తిమ్మిరి.. భయం.. దడ దడ.. ప్రకంపన.. సంతోషం.. తను బతికినందుకు. తనను చంపాలనుకున్నవాణ్ని తాను చంపినందుకు.
పైగా.. ప్రక్కన.. కోట్ల రూపాయలు..పిచ్చి ఆనందం. ఉద్విగ్నత.
క్షణకాలంలో తేరుకుని రాములు..షాక్‌లోనుండి బయటపడి.,
వంగి చకచకా ట్రంక్‌పెట్టెలోని వేయిరూపాయల కట్టలను బయటికి తోడుకుంటు పడేస్తూ చుట్టూ ఉన్న సర్వ ప్రపంచాన్ని మరచిన ఉన్మాదక్షణంలో.,
ప్రక్క సెలయేరు దాపుల్లోనుండి దూసుకొచ్చిన ఎ.కె. ఫార్టీసెవెన్‌ తుపాకీ గుళ్ళు రాములు శరీరాన్ని తుత్తునియలు చేసి ముక్కలు ముక్కలుగా గాల్లోకి విసిరేశాయి.
అడవి దద్దరిల్లంది.
అక్కడంతా చెల్లాచెదురుగా.. పచ్చని ఆకులపై ఎర్రగా చిక్కని రక్తం.. మాంసం ముద్దలు. నిశ్శబ్దం.
ఎక్కడా మనుషుల అలికిడిలేదు
ఐతే.. దూరంగా.. సెలయేటి ఒడ్డుమీద ప్రశాంతంగా గడ్డిమేస్తున్న పశువులమంద దగ్గరినుండి ఎవరో కాపరి వినిపిస్తున్న పిల్లనగ్రోవి ధ్వని మృదువుగా, లలితంగా.. తెరలు తెరలుగా అడవిలోకి ప్రవహించడం మొదలైంది.
అడవి తనను స్పర్శిస్తున్న పాటకు పులకించిపోతోంది పరవశించి.. వివశయై.

22

28

అర్ధరాత్రి దాటింది.
సువిశాలమైన ముఖ్యమంత్రి అత్యంత ఆంతరంగిక సమావేశ మందిరం. హాల్‌నిండా వెన్నెల నిండినట్టు, చల్లగా వసంతఛాయలు వ్యాపించి, గాలినిండా పారిజాత పరిమళం నిండి.. నిశ్శబ్దం ఎంతో మధురమై ధ్వనిస్తున్న వేళ..
ఇద్దరే వ్యక్తులు.
డెబ్బయ్యారేండ్ల ముఖ్యమంత్రి. ముప్పయిరెండేళ్ళ లీల.
సోఫాల్లో ఎదురెదురుగా.. మధ్య మౌనగంభీర అనిశ్చితి.
‘ఇంత’రాత్రి ముఖ్యమంత్రి గారు తననిలా ఏకాంతంగా, ఒంటరిగా ఎందుకు పిలిపించినట్టు. ఇది ఒక ప్రత్యేక రహస్య సమావేశం వలెనే ఉంది. లోపలికొస్తూంటే పి.ఎస్‌, సెక్యూరిటీ, స్టెనో.. ఇతరేతర ఇన్‌విజిబుల్‌ గార్డ్స్‌ ఎవరూ లేరు. ఒక్క బంట్రోతుమాత్రమే ఉండి రాగానే ‘ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఈ హాల్లో కూర్చోమన్నారు’ అని ఈ హాల్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. అంతే.. యిక ఏ ఇతర మానవ సంచారమూ లేదు.
ఎందుకిలా..
వ్చ్‌. అర్ధంకావడంలేదు.
ముఖ్యమంత్రి తనకు అత్యంత సన్నిహితుడు, మధ్య అత్యంత పరస్పర విశ్వసనీయుత కూడా ఉంది.. అనేకానేక కోటానుకోట్ల ప్రభుత్వ ప్రభుత్వేతర ఆర్థిక లావాదేవీలు తమ మధ్య ఉన్నాయి. వ్యాపారముంది. వ్యవహారముంది. వీటికి అతీతమైన ఇంకేదో వాత్సల్యంతో కూడిన, భాషకందని ఆత్మీయతకూడా ఉంది.
ఏమున్నా.. అతని సంస్కారంపట్ల, తెలివిపట్ల, వ్యవహార దక్షతపట్ల.. అన్నింటినీ మించి తనతో పనిచేస్తున్నపుడు చూపే హృదయస్పర్శపట్ల ఎంతో గౌరవముంది తనకు.
జీవితాన్ని చాలా లోతుగా, చాలా తరచి తరచి సూక్ష్మదర్శినిలో చూచినట్టు దర్శించిన వాడాయన. తన దాదాపు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎందరో కౌటిలుల్ని, వ్యూహకర్తలను, దార్శనికులను, ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాళ్లను, పరమ దుర్మార్గులను, నీతిహీనులను, గుండాలను.. ఎందర్నో చూశాడు తను. అన్నింటినీ ఎదుర్కొని.. అందర్నీ తట్టుకుంటూ, భరిస్తూ..
తను వచ్చి సోఫాలో కూర్చున్న తర్వాత..పదినిముషాలు గడిచి..అప్పుడొచ్చాడాయన. అదే తెల్లని ధోతీ.. తెల్లని లాల్చీ.. అర్ధరాత్రి దాటినా ముఖంపై చెదరని చిర్నవ్వు. అలసటలేని గాంభీర్యం.
వచ్చి తన ఎదురుగా సోఫాపై మౌనంగా కూర్చుని,
అలా కూర్చునిపోయాడంతే చాలాసేపు.
ఐతే అతను వ్యాకులంగా ఉన్నాడు. అంతఃర్మథనంలో ఉన్నాడు. ఏదో లోలోపల ఘర్షణపడ్తున్నాడు.
”లీలా.. నువ్వు విజ్ఞురాలివి.. అనేక విషయాలు తెలిసిన దానివి. చిన్నవయసులోనే ప్రపంచాన్ని లోతుగా చదివినదానివి.. అందుకే నీతో మనసును పంచుకుందామనీ, బయటికి వ్యక్తీకరించలేని ఒక అంతర్గత మథనకు నిష్కృతిని అన్వేషిద్దామని..” ఆగిపోయాడు.
వత్తి అంటుకున్నపుడూ, ఆరిపోబోయేముందూ తెగుతూ మండుతూ, మండుతూ తెగుతూ తల్లడిల్లుతుంది కాసేపు. అలా ఉన్నాడతనప్పుడు.
”జీవితంలో ఎప్పుడూ అధికారంలో ఉండడమే విజయమనీ, విజయమే మనిషి ప్రతిభకు తార్కాణమనీ, విజయాన్ని సాధించే క్రమంలో రాజనీతి ప్రకారం ధర్మాధర్మ విచక్షణ అనవసరమనీ అనుకుంటూ వచ్చాను లీలా. ఐతే కొన్నిసార్లు విజయాలు సాధిస్తాం కాని నిజాకి ఓడిపోతాం.. అధికారంలో, కుర్చీలో ఉంటాం కాని వాస్తవంగా ఎవడికో బానిసగా, తోలుబొమ్మవలె ప్రవర్తిస్తూ జీవిస్తాం.. ఈ తేడా మనిషిని నిశ్శబ్దంగా ఒక లోహాన్ని ఆసిడ్‌ తిన్నట్టు తినేస్తూ మెల్లగా మరణం రుచిని చూపిస్తూంటుంది.. ఔనా..” అని ఆగి,
అతను తనతో తానే గంభీరంగా సంభాషించుకుంటున్నట్టు.. లేదా తనపై ఎంతో ఆత్మీయతతో కూడిన గౌరవంతో తనను తాను నివేదించుకుంటున్నట్టు.,
”మీకు తెలియందేముంద్సార్‌. వర్చువల్‌ రియాలిటీ, రియల్‌ రియాలిటీ అని రెండున్నాయి గదా. గెలుస్తాం కాని నిజానికి ఓడిపోతాం.. ఒక వస్తువు హర్రాజ్‌లో ఏదో క్షణికమైన ఆవేశానికి లోనై దాని వాస్తవ విలువకంటే ఎన్నోరెట్టు ఎక్కువపెట్టి దాన్ని స్వంతం చేసుకుంటాం. కాని తర్వాత తెలుస్తుంది దాని విలువ తక్కువని. అది గెలిచి ఓడడం. నీతిగా, నిజాయితీగా ఒక రోజంతా కష్టపడి వందరూపాయలే సంపాదించినా అదే పనిని అవినీతితో నిర్వహించి ఐదువందలు సంపాదించే వ్యక్తితో పోల్చుకుని ఆత్మతృప్తితో ఆనందపడడం ఓడి గెల్వడం వంటిది. ఇదొక ధర్మ మీమాంస..”
”’ఔను.. ధర్మం వేరు న్యాయం వేరుగదా..”
”ధర్మం కాలంతో పాటు మారనిది. శాశ్వతమైంది. న్యాయం మనిషి చేత నిర్వచింపబడేది, కాలంతోపాటు మారేది.”
”అధికారం.. వ్యామోహం.. శాశ్వతత్వం.. చరిత్ర.. వీటిని విస్తృతమైన అవలోకనలో దర్శించినపుడు.. మనిషి యొక్క దూరదృష్టి, పరిణతి, వికాసం నిజంగా ఎంత ఉదాత్తంగా ఉండాలి లీలా.. మనం ఆ కోణంలో చూచినపుడు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నామో అనిపిస్తోందప్పుడప్పుడు. ఒక విషయం చెప్తాను చూడు, 1776లో బ్రిటిష్‌ పాలనలో ఉన్న అమెరికాను యుద్ధంచేసి విముక్తంచేసిన తర్వాత జార్జ్‌ వాషింగ్టన్‌ తను తలచుకుంటే తనను తాను చక్రవర్తిగా ప్రకటించుకుని ఏకచ్ఛత్రాధిపత్యంగా యిష్టమున్నంతకాలం యిష్టమొచ్చినట్టు పరిపాలన కొనసాగించగలిగేవాడు. కాని ప్రజాపక్షపాతి ఐన దార్శనికుడు కాబట్టి ఆయన ఆ ఏకవ్యక్తి పాలనను వద్దని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని ప్రవేశపెట్టి, ఒక రాజ్యాంగాన్ని నిర్మించి, క్రమశిక్షణతో కూడిన అనేక నియంత్రణలతోపాటు అతిస్వేచ్ఛను పరిహరించే శాస్త్రీయ స్వాతంత్య్రాన్ని ప్రసాదించాడు. అందుకే ఒక ప్రపంచ అగ్రరాజ్యానికి ”జాతిపిత” కాగలిగాడు. రెండు వందల ఏళ్ళకు పైగా కాలం గడిచినా యింకా తరతరాలుగా అమెరికా ప్రజల హృదయాల్లో చెక్కుచెదరకుండా నిలిచిఉన్నాడు. అధికార వ్యామోహం గనుక వాషింగ్టన్‌కు ఉంటే చరిత్రలో యింత పవిత్రమైన స్థానం దక్కి ఉండేదికాదుగదా.. కుర్చీ.. సింహాసనం.. అధికారం.. యివి..”
ఒక తీవ్రమైన ఉప్పెనలో కొట్టుకుపోతున్న ఒట్టి అట్టపెట్టెలా అనిపించాడాయన ఆమెకాక్షణం.
”నిస్సందేహంగా జార్జ్‌ వాషింగ్టన్‌ చాలా గొప్పవాడే సర్‌. కాని చక్రవర్తిత్వాన్ని కాదని ఒక ప్రజాస్వామ్య దేశంగా అమెరికానుప్రకటించిన తర్వాత ఆయనే మొదటి, రెండవ అమెరికా అధ్యకక్షునిగా అధికార పగ్గాలను చేపట్టారు గదా.ఆ కోణంలో చూస్తే ఎప్పుడూ ఏ అధికారాన్నీ ఆశించకుండా ఒక రక్తపుబొట్టు కూడా చిందకుండా భారత స్వాతంత్య్రాన్ని సాధించిన గాంధీ సంగతి..ఈయనెంత గొప్పవాడు. స్వతంత్ర సాధన తర్వాత కూడా ఎన్నడూ ఏ పదవీ కోరుకోలేదే….
” ఆదే పొరపాటు జరిగింది లీలా. నీ వంటి పరిణతి గల ఆధ్యయనకారులు కూడా యిక్కడే హేతుబద్దంగా ఆలోచించడం లేదు…”
”ఎలా….”లీలా కంగుతుంది.
”అక్కడ వాషింగ్టన్‌ ప్రజాస్వామిక ఆమెరికాను ఏ రకంగా స్యప్నించాడో ఆ విధంగా అ దేశం యొక్క ఆకృతిని తీర్చిదిద్దేంకు స్వయంగా పూసుకుని పటిష్టమైన రాజ్యాంగాన్ని నిర్మింపజేసి, దాన్ని స్వయంగా తాను ఆమలు చేసి చూపించి ఒక దారి ఏర్పర్చి….. యిక ఈ మార్గంలో నడవండని చిటికెన ప్రేలును వెనక్కి తీసుకుని వెళ్ళి పోయాడు. అలాగే గాంధీ కూడా తన అద్భుతమైన సిద్ధాంతాలను రాజ్యాంగబద్దం చేసి, కుర్చీపై కూర్చుని ఆమలుచేసి చూపి విలువలతో కూడిన రాజకీయ సంస్కృతిని స్థాపిస్తే బాగుండేదేమో…ఆది జరుగలేదు కాబట్టి ఓ పదిరవై ఏండ్లు దాటక ముందే చూడు రాజకీయాలు బురదకుంటై, పందులు పొర్లాడే రొచ్చుగుంటై ఛండాలమైపోయింది.”
”……” లీల నిజంగా షాకైంది… నిజమేనా ఆని అన్పించిందామెకు.
గాంధీ… అనే జీవి ఒక్కడే… కాని వ్యక్తినిబట్టి ఒక్కొక్కరికి ఒక్కోరకంగా అర్థమౌతున్నాడు గదా.
”విలువల కోసం అధికారమా… అధికారంకోసం విలువల త్యాగమా, ఇదమ్మా అసలు ప్రశ్న ఈ రోజు” అన్నాడు ముఖ్యమంత్రి మళ్ళీ.
”నిస్సందేహగా అధికారంకోసమే విలువల విధ్వంసం నిర్లజ్జగా కొనసాగుతోంద్సార్‌ ఈ రోజు భారతదేశంలో..
ఈ దౌర్భాగ్య పరిస్థితి మారాలి లేకుంటే ఎవనికందిందివాడు అప్పులుతెచ్చి..పైనబడి లాక్కుని.. ఎగబడి గుంజుకుని దోచుకునే స్థితి ఏర్పడ్తుంది. విలువలకోసం మాత్రమే అధికారం ఒట్టి నామమాత్రంగా నిర్వహించబడే  చేష్ట కావాలి.”
”ఔనా..”
”ఔన్సార్‌ .. ” అంది లీల స్థిరంగా .. దృఢంగా ఖచ్చితంగా
”కదా .. అసలీ రామం ఎవడమ్మా”
లీల మాట్లాడలేదు.
అనుకోని ప్రశ్నకు ఉలిక్కిపడి.. తర్వాత ఆశ్చర్యపడి.. తేరుకుని,
”రామం అనేవాడు జనసేనను స్థాపించి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు”
”…”
”రామం అనేవాడు .. నాలోకి నేను తొంగిచూచుకుని ఆత్మాన్వేషణతో పునర్విమర్శ చేసుకొమ్మని వేదిస్తున్నాడు..”
”…..”
”రామం అనేవాడు నా ఆత్మను ఒక గునపమై పొడిచి పొడిచి ప్రశ్నిస్తున్నాడు”
”……”లీల ఆవేశంగా మాట్లాడ్తున్న ముఖ్యమంత్రి ముఖంలోకి కొయ్యబారి చూస్తోంది.
”రామం అనేవాడు హిరణ్యకశిపుణ్ణి పరేషాన్‌ చేసిన ప్రహ్లాదునివలె వెంటాడ్తూ చాలా కలవరపెడ్తున్నాడు”
”……”
”రామం అనేవాడు దుర్మార్గులైన రాజకీయ నాయకులందర్నీ ఉచ్చలుపోయిస్తూ అంతరాంతరాల్లో వీడురా మగాడంటే..అని అన్పించుకుంటూ అందరిచేతా ప్రేమించబడ్తున్నాడు”
”…..” లీల ఆశ్చర్యంగానేఐనా.. ఆనందంగా ఆయనవంక చూస్తోంది.
”అసలు ఈ రామం ఎవడు..?” స్థిరంగా ఉంది ముఖ్యమంత్రిగారి గొంతు.
లీల లేచి నిలబడింది సోఫాలోనుండి.
యటికి నడవడం ప్రారంభిస్తూ.. ”రామం ఒక ఋషి” అంది స్పష్టంగా
బయటికొచ్చి కార్లో కూర్చుంటున్న లీలకు ముఖ్యమంత్రి తనను ఎందుకు పిలిపించుకున్నాడో అర్థంకాలేదు. కాని వచ్చి తను ఏమి నేర్చుకుందో మాత్రం స్పష్టంగా అర్థమైంది.

29

23

”ఎందుకు..?”
”వ్చ్‌.. ఏమో..”
”ఎందుకో..?”
”ఏమో తెలియదు.”
”ఇంత అర్ధరాత్రి ఈ అత్యవసర పిలుపేమిటో.. మీకేమైనా తెలుసా”
”తెలియదు. మీకు తెలుసా”
”ఉహుఁ.. నాక్కూడా తెలియదు. వెరీ అర్జంట్‌ అంటే ఉన్నపళంగా వచ్చా. ఇంత రాత్రి నలభైమందికి అత్యవసర పిలుపు. పన్నెండు గంటల ముప్పయి నిముషాలకు.. ముఖ్యమంత్రి నివాసభవనంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో.. అందరికీ ఆశ్చర్యం.. ఎందుకు.. ఎందుకు..?
అన్ని ప్రముఖ దినపత్రికల సంపాదకులకు మాత్రమే, అన్ని తెలుగు న్యూస్‌ చానళ్ళ అధిపతులకు, ‘జనసేన’ బాధ్యులు ముగ్గురు..రామం, డాక్టర్‌ గోపీనాథ్‌, క్యాథీ, హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌..ఒకే ఒక లోక్‌సభ సభ్యురాలు, ఒక పౌర హక్కుల నేత, ఒక మానవ హక్కుల సంఘ నాయకుడు, ఒక యాభై తొమ్మిదేళ్ళ వయసున్న సీనియర్‌ ప్రిన్స్‌పాల్‌ సెక్రటరీ సుబ్బన్న ఐఎఎస్‌, అటార్నీ జనరల్‌, ఆంటీ కరప్షన్‌ బ్యూరో చీఫ్‌.. వీళ్ళు మొత్తం నలభైమంది.ఒక్క మంత్రి కూడా ఆ మీటింగుకు ఆహ్వానింపబడలేదు.
రాత్రి పన్నెండుగంటల ఇరవై నిముషాలైంది.
బయట చిక్కని చీకటి.. ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌హాల్‌లో చిక్కని పాలవంటి వెలుగు.
ఒకటితర్వాత ఒకటి..మెత్తగా, మెల్లగా ఒక్కోకారు వచ్చి పొర్టికో ముందు ఆగి.., ఆహ్వానితుల్లో ఎవరో ఒకరు దిగి.. హడావుడిగా.. ముఖంనిండా మొలిచే ప్రశ్నతో లోపలికి నడుస్తూ,
బయట ఎక్కడా సెక్యురిటీ హంగామా లేదు.
ఉన్నత రాజకీయవర్గాల్లో వార్త ఎప్పుడూ అంటుకున్న పెట్రోల్‌ మంటే..ప్రాకిపోయింది. మనిషికి ఎప్పుడూ ఉత్సుకత అనేది నోట్లో నానని నువ్వుగింజ. బయటికి కక్కేదాకా కడుపుబ్బుతుంది.
దాదాపు నలభై రెండుమంది మంత్రుల ఇళ్ళలోని అందరి సెల్‌ఫోన్లు పరమబిజీగా ఉన్నాయి. ‘మంత్రులకు తెలియకుండా ముఖ్యమంత్రి నివాసంలో ఏమిటీ ఉన్నతస్థాయి సమావేశం.. ఎందుకు. ఏమిటి సంగతి.. ఏం జరుగబోతోంది..” అంతా టెన్షన్‌.
”కనుక్కునేదెలా..?”
ప్రయత్నించు ప్రయత్నించు.. నీకు తెలిస్తే నాకు చెప్పు.. నాకు తెలుస్తే నీకు చెప్తా.
ఈ లోగా ఢిల్లీకి కబురు.. అధిష్టానం పెద్దలకు..తాబేదార్లకు, పైరవీకార్లకు, బ్రోకర్లకు, ఏజంట్లకు.. సలహాదార్లకు అందరికి వాళ్ళవాళ్ళ మనుషులు హాట్‌లైన్లలో సమాచారం చేరవేసి ‘ఏమిటో’ కనుక్కుంటున్నారు.
అన్ని చోట్లనుండీ ఒకటే జవాబు ‘తెలియదు’ అని
సమయం పన్నెండూ ముప్పయి.
సెక్రటరీ రామలక్ష్మి వచ్చింది ముఖ్యమంత్రి గదిలోకి. అక్కడ ఆయన, అతని భార్య ఉంది. ఆమె డెబ్బయిమూడేళ్ళ వృద్ధాప్యంలో పండుపండిన గోగుబుట్టలా ఉంది.. నిండుగా, ప్రసన్నంగా ముఖ్యమంత్రి కూడా చాలా నిబ్బరంగా, తృప్తిగా.. ముఖంనిండా వెలుగుతో ఉన్నాడు.”సర్‌. అందరూ వచ్చార్సార్‌” అంది రామలక్ష్మి వినయంగా. ఆమెకు జరుగబోయేది చూచాయగా అర్ధమైంది. రేపు భారత రాజకీయ చరిత్రలో సంభవించబోయే పెనుసంచలనాన్ని అంచనా వేస్తోందామె. ఐతే ఆమె ఒక రకమైన లౌకికాతీత ఆనందాన్ని అనుభవిస్తూ ముఖ్యమంత్రి గారి ముఖంలోకి ప్రశంసాపూర్వకంగా చూచింది.
మాట్లాడకుండానే లేచి వెంట భార్యను తీసుకుని మౌనంగా కాన్ఫరెన్స్‌ హాల్‌లోకి నడిచాడు. అతని వెంట ఓ బరువైన తోలుసంచీని మోసుకుంటూ రామలక్ష్మి కూడా కదిలి,
హాలులోని వేదికపైకి ముఖ్యమంత్రి దంపతులు రాగానే గౌరవపూర్వకంగా అందరూ లేచి నిలబడ్డారు. దంపతులిద్దరూ వేదికపైకి చేరగానే చేతులు రెండూ వినమ్రంగా జోడించి అందరికీ నమస్కరించి వేదికపైనున్న రెండే రెండు కుర్చీల్లో ఆసీనులై,
హాల్‌లో ఒకే ఒక ఫోటోగ్రాఫర్‌ ఉండే విధంగా ఏర్పాటు చేయబడింది.
వేదికపై మీడియా మైక్రోఫోన్‌లున్నాయి.
అంతా నిశ్శబ్దం.. గంభీరం.. ఉద్వేగం.
అందరి ముఖాల్లోకి ఒకసారి కలియజూచి, ఆయన కళ్ళు ‘జనసేన’ సంస్థాపకుడు రామం కోసం వెదికాయి..కాని రామంపై కొద్దిరోజుల క్రితం వరంగల్లులో జరిగిన బాంబుదాడి జ్ఞాపకమొచ్చి., జనసేన తరపున వచ్చిన సిద్ధాంతకర్త గోపీనాథ్‌, క్యాథీ, ‘అగ్ని’ ఛానల్‌ అధినేత మూర్తి..ఇతర నిప్పువంటి వ్యక్తిత్వం గల పాత్రికేయులు..పత్రికా సంపాదకులు, టి.వి. సిఇఓలు, హైకోర్టు చీప్‌ జస్టిస్‌.. లోకాయుక్త.. అందర్నీ కళ్ళతో పలకరించి,
”మిత్రులారా.. డెబ్భై మూడేళ్ళ వయసులో.. నిజానికి ఏ రాజకీయనాయకున్నీ ఇన్నాళ్ళ దాకా పని చేయనివ్వద్దు.. ఈ పెద్ద వయసులో చాలా అలసటతో, బాధతో, దుఃఖంతో మీతో ఒక మంచి స్నేహితునిగా నా వ్యధను పంచుకోవాలని ఈ వేళగానివేళ మిమ్మల్ని యిక్కడికి రప్పించాను. మొదట అందుకు నన్ను క్షమించండి. దాదాపు యాభై సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ఉన్నాను. చిన్నపిల్లాడిగా గాంధీ టోపిని నెత్తిపై పెట్టుకుని ఈ పవిత్ర మాతృభూమినే తలపై కిరీటంగా ధరించినంత ఆనందాన్ని పొందాను. ఒక్కోమెట్టు. ఒక్కో అడుగు.. ఒక్కో అధ్యాయం.. ఎందరో మహానుభావులు.. పుచ్చలపల్లి సుందరయ్యగారు, తరిమెల నాగిరెడ్డి, తెన్నేటి విశ్వనాధం, సురవరం ప్రతాపరెడ్డి, వందేమాతరం రామచంద్రరావు, చండ్ర రాజేశ్వర్రావు.. పార్టీలు ఏవైనా.. అందర్లోనూ మూలధాతువైన మానవతా విలువలు, దేశభక్తి, సామాజిక చింతన, ప్రజాసంక్షేమ పరితపన. బ్రిటిటిష్‌వాడు విడిచిపెట్టివెళ్ళిన ఈ భారతదేశంలో అవిద్య, నిరక్షరాస్యత, నిరుద్యోగం, అనారోగ్యం, పేదరికం, దరిద్రం.. ఇవే ఎక్కడ చూచినా.. వీటికితోడు మతకలహాలు.
పరిపాలన అనే ఫ్లైట్‌ టేకాఫ్‌ సరిగానే జరిగింది.
ప్రజాకవి శ్రీశ్రీ చెప్పాడు..కాదు హెచ్చరించాడు 1964లోనే,
”ఆకాశం అందుకునే ధరలొకవైపు
అంతులేని నిరుద్యోగ మింకొకవైపు-
అవినీతి, బంధుప్రీతి చీకటి బజారు
అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు-” అని
జాతీయభావం, దేశంపట్ల ప్రేమ, మాతృభూమిపట్ల మమకారం, పౌరునిగా సామాజిక బాధ్యత.. యివన్నీ క్రమంగా నశిస్తూ.. నిజంగానే అతివేగంగా ఈ దేశం దిగజారడం మొదలైంది.
నిజానికి నేనిప్పుడు మీతో మాట్లాడ్తున్నదంతా నా ఆత్మతో నేను జరుపుతున్న ఒక స్వగత సంభాషణ వంటిది.
కర్ణునిచావుకు కారణాలనేకం అన్నట్టు ఈ దేశం ఈ రకంగా పతనమై దిగజారిపోయేందుకు గల అనేక కారణాల్లో నాలాంటి సీనియర్‌ రాజకీయనాయకులు కూడా శల్యుని పాత్ర, శకునిపాత్ర, విభీషణుని పాత్ర యిలా అవకాశాన్ని బట్టి  కుర్చీకోసం, పదవులకోసం, అధికారంకోసం రాజీపడి.. తలవంచుకు నిలబడి.. తప్పులు చేసి.. తప్పువెనుక తప్పులు చేసి.. దుర్మార్గాన్ని ఎదిరించవలసివచ్చినపుడు ఎదిరించకుండా మౌనం వహించడం యుద్ధనేరం. మాట్లాడవలసివచ్చినపుడుమాట్లాడకుండా మిన్నకుండడం పరమ పాతకం. అలాంటి పాపాలు, నేరాలు నేను కూడా చాలానే చేశాను. యిప్పుడు నేనిలా మాట్లాడ్డం వృద్ధ నారీ పతివ్రత’ లాంటిదే. నాకు తెలుసు. కాని యిప్పటికైనా నేను చేసిన తప్పులకు చెంపలేసుకుని కన్‌ఫెస్‌ ఐపోదామనే.
వెనక్కి తిరిగి చూచుకుంటే.. నాపై నాకే అసహ్యమేస్తోంది. నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు చేస్తున్న అకృత్యాలనెన్నింటినో వ్యతిరేకించి ఎదిరించలేదు సరికదా, అమోదముద్ర వేశాను. బొక్కసంలో ఒక్క పైసా లేకున్నా ప్రజలకు పంచరంగలు కలలను చూపించాం. అధిష్టానం అడిగినా అడుగకున్నా నెలకింత అని కోట్లానుకోట్ల రూపాయలను కార్లలో పంపించాం. శాసనసభ్యులు ఎదురుతిరుగుతారనే భయంతో ఎవడేదికోరితే అది..రోడ్ల కాంట్రాక్ట్‌లు, పవర్‌ ప్రాజెక్ట్‌లు, సెజ్‌ల అలాట్‌మెంట్స్‌, ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, మైన్‌ లీజులు, ఇసుక సీనరేజ లీజ్‌లు.. హార్బర్లు, సముద్ర జలాల అప్పగింత, అడవుల లీజ్‌, కొండల గుట్టల లీజ్‌లు.. ఎన్ని..ఎన్నెన్ని.
ఓట్లకోసం ఆర్థికంగా సాధ్యంకాని ఎన్నో ఉచితాలను ప్రకటించాం. బియ్యం, విద్యుత్తు, టి.విలు, ఫీజులు, పచ్చకార్డులు, ఆరోగ్యపథకాలు.. మాకు తెలుసు ఇవేవీ అమలు కావని. ప్రపంచబ్యాంక్‌ అప్పులు, ఐఎమ్‌ఎఫ్‌ అప్పులు, జపాన్‌లాంటి దేశాల పరస్పర వినియోగ ఆర్థిక సహకారాలు.. పబ్లిక్‌ బాండ్స్‌, ప్రజలనుండి అప్పులు.. ఎన్ని చేసినా తెచ్చిన బుడ్డపరకలాంటి అప్పును రాజకీయనాయకుల రూపంలో ఉన్న కాంట్రాక్టర్లందరూ జస్ట్‌ చప్పరించి సఫా చేయడమే. మరుక్షణమే మళ్ళీ మేతకు తయ్యార్‌.  ఈ నా ప్రక్క తోలుసంచీలో అన్ని వివరాలున్నాయి. తొంభైశాతం శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు, జిల్లాలలో కార్పొరేటర్లు.. అందరూ వాళ్ళ వాళ్ళ స్థాయినిబట్టి జాతీయ, రాష్ట్ర , జిల్లా స్థాయి కాంట్రాక్టర్లే. సిగ్గులేకుండా ప్రజలసొమ్మును, ప్రభుత్వ సొమ్మును భోంచేయడానికి అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీ, వామపక్ష పార్టీ అన్న తేడాలేదు. అందరిదీ ఒకటే జాతి. వీళ్ళందరూ నా హయాంలో అడ్డమైన పనులను చేస్తూ నాతోకూడా చేయించినవారే. యిప్పుడు ప్రజాకర్షక పథకాలను ఓట్లకోసం ప్రవేశపెట్టిన భారతదేశంలోని ప్రతి రాష్ట్రప్రభుత్వం ప్రజలను బిచ్చగాళ్ళను చేయబోయి తామే ఓ పెద్ద బిచ్చగత్తె ఐ కూర్చుంది. చివరికి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలన్నీ తాగుబోతుల దయతో, వాళ్ళు దానం చేస్తున్న ఎంగిలి సొమ్ముతో బతికి బట్టగడ్తున్నాయి. కాని ఈ నీటి బుడగ ఎన్నాళ్ళో నిలవదు. చితికి బ్రద్దలైపోద్ది.

30
ప్రజల తరపున రాజ్యాంగ నిర్వచనం ప్రకారం ప్రభుత్వ అధికారుల పనితీరును, శాసనాల, విధానాల అమలును పర్యవేక్షించి తనిఖీ చేయవలసిన ప్రజాప్రతినిధులే అధికారులతో కలసిపోయి కంచే చేను మేసినట్టు, ఇంటికుక్కే ఇంటి యజమానిని కరిచినట్టు కుమ్మక్కయితే యిక ఏ రూల్సూ, ఏ నిబంధనలూ సమాజాన్ని భ్రష్టుపట్టడం నుండి కాపాడలేవు. ఈ రోజు..నావద్ద రికార్డులున్నాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఎనభైశాతం అవినీతి ఉంది. పర్సెంటేజ్‌లున్నాయి. కమీషన్లున్నాయి. దీనికి తోడు నాణ్యతలేక, ప్రమాణాలు పడిపోయి ప్రతి ప్రభుత్వ ఆఫీసులో పనికిరాని, పనిచేయరాని ఉద్యోగుల మెజారిటీవల్ల అసలు పరిపాలన స్తంభించిపోయింది. అంతా కాగితాలకే పరిమితమైన పని మాత్రమే మిగిలి ఉంది..నిజానికి ఎక్కడా ఏమి ఉండదు. వ్యవస్థ అంతా అసమర్థమై, నిర్వీర్యమై క్రమశిక్షణ పూర్తిగా లోపించింది.
ఎవడు ఎవనిమాట వినడు.. ఎవడు ఎవన్ని లక్ష్యపెట్టడు.. అతిస్వేచ్ఛ.. నిర్లక్ష్యం.. ఎదురుతిరుగుడు.
అనేక దేశాల్లో ఉన్నట్టు ”ఐ లౌ మై ప్రొఫెషన్‌” అనే తత్వమే యిక్కడ లేదు. అంకితభావం లేదు. ఇది ప్రజలసొమ్ముకదా మనం ప్రజలకు జవాబుదారులం కదా అన్న స్పృహ లేదు.
‘కుచ్‌తో భీ కరో.. బస్‌ పైసే కమావో” అనే కల్చర్‌ ప్రబలిపోయింది.
మిత్రులారా.. యిదంతా మీకు తెలిసిందే. కాని ఈ రోజు నా తప్పును నేను ఒప్పుకుని తలవంచుకుని ఈ వ్యవస్థ యికముందు యింకా యింకా పతనం చెందొద్దనీ, ఈ దురాగతాలకు కనీసం యికనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాలని, భావితరాలు ఈ పరమ దుర్మార్గ మృగతుల్య రాజకీయ నేరచరితుల చేతుల్లో బందీలై నష్టపోవద్దని క్షోభపడి క్షోభపడి, కొద్ది రోజులుగా అంతర్మథనం చెందీ చెందీ, ‘భయం’ అనే సంకెళ్ళను తెంచుకుని, నన్ను ఈ రాజకీయ బురద కంపునుండి విముక్తం చేసుకోడానికి భరించలేని ఆత్మక్షోభతో, దుఃఖంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా నా ప్రధానమైన కొన్ని నిర్ణయాలను బహిరంగంగా, నిస్సంకోచంగా మీముందు, మీరు సాకక్షులుగా ప్రకటిస్తున్నాను.
ఒకటి.. నేను నా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంలేదు. నా నాయకత్వంలో పనిచేస్తున్న నాతోసహా చాలామంది అవినీతి మంత్రుల సవివరమైన, లంచగొండి పనితీరు నివేదికలను ఋజువుల్తో సహా గవర్నర్‌కు, రాష్ట్రపతికి సమర్పిస్తూ నా ప్రభుత్వాన్ని బర్త్‌రఫ్‌ చేసి ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాను.
రెండు.. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యిదివరకటి ముఖ్యమంత్రుల హయాంలో కూడా నేను మంత్రిగా ఉన్నపుడు కలిపి.. గత పదిసంవత్సరాల అప్పులు, ఆస్తుల పట్టికలను, ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో నలభై ఐదుశాతం ఋణాలు, వడ్డీచెల్లింపుల కిందనే ఖర్చుచేస్తున్నామనే భయంకరమైన సత్యాన్ని, గత ప్రభుత్వాల ద్రోహాన్ని అధికారిక శ్వేతపత్రంద్వారా ప్రజలకు తెలియజేస్తూ నన్ను క్షమించమని ప్రజలను వేడుకుంటున్నాను.
మూడు..ఈ తోలు సంచీలో ఉన్న నాల్గువందల అరవై నాల్గు కరప్టివ్‌ కేసులను..మంత్రులపైన.. శాసనసభ్యులపైన, ఉన్నత ప్రభుత్వాధికారులపైన, కార్పొరేట్‌ బ్రోకర్‌ కంపెనీలపైన, నగరాల్లో పెత్తనం చెల్లాయిస్తున్న మాఫియాలపైన ఆధారాలూ, నిరూపణలతో పాటు హైకోర్టుకు, లోకాయుక్తకు, మానవ హక్కుల కమీషన్‌కు ముఖ్యమంత్రిగా వీళ్ళందరిపై వెంటనే తగు విచారణ చేపట్టి చర్య తీసుకోవాలని అప్పీలు దాఖలా చేస్తున్నాను.
ఈ మొత్తం అవినీతి ఉదంతాల మొత్తం విలువ లక్షాయాభై రెండు వేల కోట్లు. మీకు ఇన్నాళ్ళబట్టి కరకరలాడే గంజిబట్టలవెనుక నవ్వు ముఖాల్తో కనబడ్డ అనేకమంది యొక్క నిజమైన అసలైన వికృతరూపం ఈ కేసుల్లో సవివరంగా ఉంది. వీటిని గత ఆరునెలల కాలంగా యింకా ప్రభుత్వంలో అవశేషంగా మిగిలి ఉన్న కొద్దిమంది నీతివంతులైన అధికారులతో సమగ్రంగా దర్యాప్తు చేయించి తయారు చేయించాను. వీటిమొత్తం విలువ రెండు సంవత్సరాల రాష్ట్ర బడ్జెటుకు సమానం.
నాల్గు..నాలో ఈ పశ్చాత్తాప బీజాన్ని నాటిన జనసేన వ్యవస్థాపకుడు శ్రీ రామంకు వ్యక్తిగతంగా నేను ఋణపడి ఉన్నాను. ఒక మొలకలా పుట్టి మహావృక్షమై విస్తరించిన ఈ ఆత్మప్రక్షాళన సంస్కృతి నిజంగా నన్ను ముగ్దుణ్ణి చేసింది. ‘జనసేన’ స్థాపన ఆలోచనే మంచిది. ఎటువంటి స్వార్థ చింతనాలేని నాయకత్వ విధానం కలకాలం వర్థిల్లుతుంది. భావితరాలకు ఆదర్శమౌతుంది. అందువల్ల ‘జనసేన’ సంస్థకు నా సకల స్థిరాస్తులన్నింటినీ విరాళంగా దాఖలు పరుస్తూ ఓ విల్లు రాశాను. దానిని స్వీకరించి ఈ నా పశ్చాత్తాపానికి నిష్కృతిగా ప్రాయశ్చిత్తం చేసుకునే అదృష్టాన్నీ ప్రసాదించవలసిందిగా రామంగారిని వేడుకుంటున్నాను.
మన భారతదేశ చరిత్రలో ముఖ్యమంత్రులను శాసన సభల్లో అభిశంసించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. కాని ముఖ్యమంత్రే తన సహచర మంత్రుల అధికారుల, ప్రజాద్రోహాల అవినీతిని బట్టబయలుచేసి కంప్లెయింట్‌ చేసిన ఉదంతాలు ఎక్కడాలేవు. ఈ సాంప్రదాయం నాతోనే మొదలౌతుంది. ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు పిల్లిమెడలో గంట కట్టాలి..తప్పదు.
నాకిక ఏ పదవిపైనా, అధికారంపైనా కాంక్షలేదు.
రేపు మతిచలించి ముఖ్యమంత్రిగారు పిచ్చిపిచ్చిగా ఏదేదో చేశాడని మొగుణ్ణి కొట్టి వీధిలో మెరమెరలాడే తరహా మా రాజకీయ సహచరులంటారు. అందుకే నేను మంచి స్వస్థతతో, స్పృహతో, జాగ్రదవస్థలో ఉండి ఈ ప్రకటన చేస్తున్నానని ప్రభుత్వ డాక్టర్‌తో ధృవీకరణ పత్రాన్ని జతచేస్తున్నాను.
ఈ సమావేశానంతరం.. గవర్నర్‌గారి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను. వారిని కలిసి కాగితాలు అప్పగించి ముఖ్యమంత్రి నివాసంనుండి నిష్క్రమించి వానప్రస్తాశ్రమం.. నా స్వంత జిల్లా విజయనగరం వెళ్ళిపోతున్నాను.
మిత్రులారా.. యింతసేపు నన్ను ఓపిగ్గా విన్నందుకు.. నా వ్యథను పంచుకున్నందుకు వ్యక్తిగతంగా ధన్యవాదాలు.
ముఖ్యమంత్రి గొంతు ఎందుకో పూడుకుపోయి గద్గదమైంది. ఇన్నాళ్ళబట్టి తనను బంధించి ఉంచిన ఇనుప సంకెళ్ళు అప్పుడే భళ్ళున తెగిపడిపోయి విముక్తుడైన మహానుభూతి కలిగిందతనికి. మౌనంగా ఉండిపోయాడు.
హాలునిండా ఒట్టి నిశ్శబ్దం
వెంటనే రామం తరపున డాక్టర్‌ గోపీనాథ్‌ లేచి నిలబడి ముఖ్యమంత్రినుద్దేశించి ”థాంక్యూ సర్‌” అన్నాడు.
ఎందుకో..అనూహ్యంగానే కొందరు చప్పట్లు కొట్టారు.    రామలక్ష్మి యింకో వ్యక్తి సహకారంతో తోలుసంచీలోని కాగితాల సెట్లను హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌కు, పత్రికా సంపాదకులకు, టి.వి. అధిపతులకు.. అందిస్తోంది వినయంగా.
హాలులోని నిశ్శబ్ద ప్రళయం ఒక అరగంట తర్వాత మీడియాలో భళ్ళున బాంబులా ప్రేలి ఢిల్లీ వీధులను గడగడలాడించింది..అంటుకున్న పెట్రోలుమంటలా దేశం వీధివీధిలో ప్రవహించింది.
రాత్రి కొనసాగి కొనసాగి.. చీకటి వెలుతురుగా రూపాంతరం చెందుతున్నవేల..
ఎదుట ఆకాశంలో శిశుసూర్యుడు ఎర్రగా.. రౌద్రంగా.. కాంతివంతంగా.,

24

లీలకు ఎందుకో చాలా భయంగా ఉంది.
న్యూ ఢిల్లీ..హోటల్‌ లి మెరిడియాన్‌.. విండ్సర్‌ ప్లేస్‌..రాష్ట్రపతి భవన్‌నుండి రెండు కిలోమీటర్ల దూరం
నంబర్‌ పధ్నాల్గువందల పది.. పదిహేనవ అంతస్తు.
లీల.. ఒకప్పుడు ఒట్టి అనాథ.. దిక్కులేక రోడ్డుమీద జనం చీత్కరిస్తూండగా అడుక్కుంటూ చిరిగిన బట్టలు, చీమిడికారే ముక్కు.. ఆకలితో నకనకలాడే కడుపు .. కళ్ళనిండా నీళ్ళు.,
ఎవరో పుణ్యాత్ముడు అనాథ బాలల పాఠశాల ‘చిగురు’లో చేర్పించాడు. ఒక వర్షం కురుస్తున్న రాత్రి రైల్వేస్టేషన్‌లో అడుక్కుంటూండగా..క్రిస్టియన్‌ మిషన్‌ క్రింద నడుపబడే అనాథ బాలల ఉద్ధరణ సంస్థ.. ఎన్‌జివో.. జీసస్‌ ఈజ్‌ ఓన్లీ ద గాడ్‌.., దేవుడు చెప్పెను.. ప్రవచనాలు.. బైబిల్‌ ఆరవ అధ్యాయము మూడవ పేరా..యోహాను..బోధనలు..ప్రక్కన గర్జిస్తూ, తలనిమురుతూ, ఊరడిస్తూ గలగలా పారే నది. నది ఒడ్డుపై కూర్చుని ఏకధాటిగా ఎవరికీ తెలియకుండా ఏడ్చిన ఎన్నో రాత్రులు.
ఎక్కడ పుట్టానో.. ఎవరికి పుట్టానో.. ఎందుకు పుట్టానో.. ఏమి తెలియని వయసునుండి..జీవితమంటే ఒక ఆసరా వెదుక్కోవడమని, జీవితమంటే లోతును తెలుసుకుని సముద్రాన్ని ఈదడమని..జీవితమంటే ఓడినా సరే మళ్ళీ మళ్ళీ గెలవడమని.. ఎన్నో నిర్వచనాలు.,
దిక్కులేక అనాథగా ఎదుగుతున్న తను తనకుతాను ఒక ప్రశ్న. తనతోపాటు ప్రశ్నకూడా ఎదిగి..పెరిగి.. పెద్దదై.. జీవితమంటే ప్రశ్నించడమని అంతిమంగా నిర్ణయించుకున్న రాత్రి..,
తమ ‘చిగురు’ సంగతి తెలిసింది. ఎన్‌జివోగా అది ప్రభుత్వం నుండి పదెకరాల నదిఒడ్డున ఉన్న సారవంతమైన ప్రభుత్వ స్థలం.. ఏడాదికి ఎనభై లక్షల ప్రభుత్వ నిధులు.. మతం ముసుగులో, సేవ ముసుగులో ఎన్నో భవనాలు.. ఎన్నో సౌకర్యాలు..
అనుకునేది.. ఈదేశంలో మతమేదైనా, కులమేదైనా.. కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో రిజస్టరై ఎన్‌జివోలుగా చెలామణి ఔతున్న, ఈ సమాజాన్ని సంస్కరించి, ఉద్ధరించి, బాగుపరిచి సేవలు చేస్తున్న సంస్థలు దేశ్యాప్తంగా ఎన్నున్నాయి.. వాటి వివరాలు,వారు స్వాహా చేస్తున్న నిధులు, వారు పంచుకుంటున్న భూములు, వారనుభవిస్తున్న సౌకర్యాలు, సౌఖ్యాలు.. వీటన్నింటినీ ప్రభుత్వం ఒక శ్వేతపత్రంగా విడుదలచేసి గనుక ప్రజల సమక్షంలో విడుదలచేస్తే నిజాన్ని తెలుసుకుని ప్రజలు వేలమంది దొంగ సామాజిక కార్యకర్తలను, బాబాలను, ధార్మిక సంస్థల నిర్వాహకులను, గ్రుడ్డి, వికలాంగలు ఉద్ధరణ సంస్థల నిర్వాహకులను, వాళ్ళ నిజరూపాలను తెలుసుకుని పెడ్డలతో, కర్రలతో తరిమి తరిమి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. వేల ఎన్‌.జి.వోలు కోట్ల కొద్ది రూపాయలు ఎవని పర్సెంటేజ్‌ వానికి పోగా ఎవనికి దొరికిందివాడు పందికొక్కులకంటే హీనంగా తింటూ..,
లీలకు ఎందుకో గతం గుండెలో నిప్పులా భగభగమండుతూ దహిస్తోంది పొద్దట్నుండి.
ఒకటే ప్రశ్న.,
కారణమేదైనా.. కసి ఎవరిపైననో, ఎందుకో ఐనా.. తెగబడి అసాధ్యాలను సాధ్యంచేసి పైశాచిక ఆనందాన్ని పొందుతూ కోట్లకుకోట్లు పోగేసి.. ఎంతపెద్ద వెధవనైనా డబ్బుతో, ఇంకేదో ప్రలోభంతో కొనచ్చునని, వానిలోని బలహీనతతోఎవన్నయినా జయించవచ్చునని..ఋజువు చేస్తూ చేస్తూ.,
ఐతే.. తను చేస్తున్నది కూడా పైరవీయే కదా.. తను చేస్తున్నది కూడా అవినీతి, మోసం, దగాయే కదా.. చీకటిపనే కదా.. చేసే విధానం వేరు కావచ్చు కాని అంతిమంగా తన పనులన్నీ కూడా అనైతికమైనవీ, తుచ్ఛమైనవీ, హేయమైనవే కదా.
ఔను.. ఔను.. తెలుసు తనకు. తెలిసే చేసింది..చేస్తోందింకా.,
ఇంకా ఇంకా చేస్తుందా తను ఈ తప్పును..?
అది అసలు ప్రశ్న.. వేదిస్తున్న ప్రశ్న.. తనను ఛేదిస్తున్న ప్రశ్న. మొన్న ముఖ్యమంత్రిని కలిసి ఢిల్లీకి చేరిన మరుక్షణంనుండి హృదయాన్ని తొలుస్తున్న ప్రశ్న.
జవాబు కావాలి.. జవాబు కనుగొనాలి.,
అద్దాల కిటికీలోనుండి చూస్తోంది లీల. చుట్టూ ఢిల్లీ మహానగరం.. విస్తరించి విస్తరించి.. భవనాలు భవనాలుగా, రోడ్లు రోడ్లుగా, డబ్బు డబ్బుగా, అధికారం, దర్పం, అహంకారం, మోసం, దగా, కుట్ర, కుతంత్రం, హత్యలు, ప్రాణముండీ చచ్చిపోవడాలు.. చచ్చిపోయీ బతికుండడాలు.. అంతా ఓ పెద్ద చదరంగం.. వైకుంఠపాళీ.. పావులు, పాములు, నిచ్చెనలు.. లోయలు, శిఖరాలు.. పరుగు.. పరుగు-
లీలకు ఎందుకో చాలా భయంగా, వ్యాకులంగా, వెలితిగా.. ఎవరో లోపల చేయి పెట్టి దేవినట్టుగా ఉంది.
ప్రక్కకు చూచింది.
పన్నెండు దినపత్రికలు టీపాయ్‌పై పరిచి ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ.. ఎన్నో.
”రాష్ట్ర ప్రభుత్వ పతనం.. రాజకీయ సంక్షోభం..స్వయంగా ముఖ్యమంత్రే బహిరంగంగా బయటపెట్టిన లక్షాయాభైవేల కోట్ల అవినీతి”
”రాష్ట్ర ప్రభుత్వ బర్త్‌రఫ్‌.. కదుల్తున్న అధికార పీఠాలు.. ప్రజల్లో ఆగ్రహజ్వాలలు.. లక్షా యాభైవేల కోట్ల అవినీతిని ఋజువుల్తో సహా బయటపెట్టిన ముఖ్యమంత్రి”
”మాకు తెలియకుండా మమ్మల్ని ఎప్పుడో ఎవరికో అమ్మారు..ప్రజల గగ్గోలు. రాష్ట్ర ప్రభుత్వ పతనం. రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన, అవినీతి మంత్రులు, నాయకుల పరార్‌. రోడ్లపై రాళ్ళతో దాడిచేస్తామని ప్రజల ధర్మాగ్రహం.”
”పునాదుల్తో సహా కూలిపోయిన రాష్ట్రప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన.”
”అవినీతి యింత భయంకరంగా ఉందని అనుకోలేదు. నీతిమాలిన నాయకులను ఉరితీయాలి – హైకోర్ట్‌ చీఫ్‌ జస్టిస్‌”
‘జనసేన’ చైతన్యంతో ప్రభుత్వ పతనం,
”పరార్‌లో అవినీతి మంత్రులు.. నాయకులు.. తరుముతున్న ప్రజలు”
”దేశరాజకీయాల్లో మొదటి పెనుతుఫాను. రాష్ట్ర ప్రభుత్వం పతనం.. శాసనసభ రద్దు.”
ప్రపంచం విస్తుపోయింది. రాజకీయ పండితులు అవాక్కయిపోయారు. వ్యూహకర్తలు జుట్టు పీక్కున్నారు. ఢిల్లీ కుర్చీలు గడగడలాడినై.. బలిసిన ఎలుకలన్నీ అర్జంటుగా కలుగుల్లోకి పరారై పారిపోయినై.
లీలకు పిచ్చి ఆనందంగా ఉంది. భరించలేనంత సంతోషంగా ఉంది.
ఎవడో ఒకడు.. ఈ అవినీతి సామ్రాజ్యాన్ని అంతమొందించేందుకు హనుమంతునిలా అగ్నినంటించాడు. యిక మంటలెగిసి సర్వం దగ్ధమైపోతుంది. శుభం.. ఇది జరగాలి.. ఇది జరిగి తీరాలి.
లీలకు బిగ్గరగా అరిచి ఎగిరి గంతేయాలన్నంత మహోద్వేగంగా ఉంది.
రామం జ్ఞాపకమొచ్చాడు.
రాముని రూపంలో ఉన్న హనుమంతుడు వీడేనా.. అసలు రాముడూ, హనుమంతుడూ వేర్వేరుకాదుగదా.. అంతా శకలాలు శకలాలుగా సర్వవ్యాప్తమై ఉన్న శక్తి సంలీనానికి ప్రతీకలుకదా వీళ్ళిద్దరు.
రామం ఒక నిశ్శబ్దం.. రామం ఒక చర్య.. రామం ఒక ప్రజ్వలన.. రామం ఒక విజయం.
లీల చేతిలోని మొబైల్‌ మోగింది.
”హలో..”
”కింద కాన్ఫరెన్స్‌ హాల్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాట్లన్నీ ఓ కే మేడం.. రిపోర్టర్సందరూ మీకోసం నిరీక్షిస్తున్నారు” నిర్మల.
నిర్మల ఈట్రిప్‌లో తనతోనే ఉంది.. వెంటరమ్మని తనే చెప్పిందామెకు.
నిర్మల.. తన అసిస్టెంట్‌.. ఒక మెరుపు.. వందమంది ఐపిఎస్‌ ఆఫీసర్స్‌, వేయిమంది ఇంటలిజెన్స్‌ పర్సెనల్‌, ఒక వ్యక్తి.. ఒక వ్యవస్థగా.. ఒక డిపార్ట్‌మెంట్‌తో సమానం.
తన దగ్గర చేరి.. తన దగ్గర శిక్షణ పొంది.. తనవలెనే ఎదిగి.. పదునెక్కి,
కాని తనవలెనే ఓ అవినీతి సామ్రాజ్యానికి అధిపతి ఔతుందా చివరికి..
కావద్దు.. కావద్దు.. అలా జరుగొద్దు.
అందుకే రమ్మంది ఈ సారి తనవెంట.. చివరి పాఠం చెప్పేందుకు.
నిర్మలకు తెలియదు ఇప్పుడీ ప్రెస్‌ కాన్ఫరెన్సెందుకో. అందుకే ఉదయం నుండి తన వంక పిచ్చిపిచ్చిగా, ప్రశ్నప్రశ్నగా చూస్తోంది భయంతో వణికిపోతూ.
”ఐదు నిముషాల్లో వస్తున్నా నిర్మలా.. యు హోస్ట్‌ దెమ్‌”
”యస్‌ మేం”
లీల ఒకసారి అద్దంలో చూచుకుని ప్రక్కనే ఉన్న స్కాజెన్‌ బ్రీఫ్‌కేస్‌ను తీసుకుంది చేతిలోకి.
అప్పుడామె అప్పుడే సముద్రగర్భంలోంచి జలతలంపైకి మహాప్రచండంగా పయనిస్తూ చేరుకుంటున్న వాయుగుండంగా ఉంది.
స్థిరంగా బయటికి నడిచి.. లిఫ్ట్‌ఎక్కి.. మొదటి అంతస్తులో ఉన్న కాన్ఫరెన్స్‌ హాల్‌లోకి ప్రవేశించి,
దాదాపు ఇరవైమంది.. తెలుగు పత్రికా విలేఖరులు, టి.వి. చానళ్ళవాళ్ళు, హిందూ, టైమ్సాఫ్‌ ఇండియా ప్రతినిధులు.,
”గుడ్మార్నింగు ఎవ్రీబడీ”
”ఆంధ్రప్రదేశ్‌ ఈరోజు ఒక ప్రపంచ ప్రసిద్ధమైన ఘటనను సృష్టించి చరిత్రలో నిలిచిపోయింది. దీనిని మీలోని ఓ కార్పొరేట్‌ నిర్వాహకురాలు ఎలా స్వీకరిస్తోంది.”
”కార్పొరేట్‌ ప్రపంచానికి చెందిన దానిగానైనా, ఒకప్పటి పేద అనామకురాలిగానైనా, ఒక సాధారణ భారతీయ పౌరురాలిగానైనా, మరీ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళగానైనా ఈనాటి ఈ పరిణామాన్ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నాను, భావిస్తున్నాను.చరిత్రను ఒక కుదుపు కుదిపి మలుపు తిప్పిన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను. ఈ ఆరోగ్యకర మహాపరిణామానికి కారణమైన ‘జనసేన’ను, దాని వ్యవస్థాపకుడు, రూపకర్త, సాహసి రామంను, అతని సహచరురాలు క్యాథీని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రశంసిస్తున్నాను”
”దీని ప్రభావం మున్ముందు ఎలా ఉంటుంది మేడం”
”చాలా ప్రభావశీలంగా ఉంటుంది. జనసేన చెప్పినట్టు ‘ప్రక్షాళన’ కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పుడే. యిక స్కావెంజింగు చర్య జరుగుతుంది. అశుద్ధాన్ని నీటిధాటితో కడిగి శుభ్రం చేయాలి. నిజానికి ప్రజలందరూ ముక్తకంఠంతో ఈ అవినీతిపరులైన రాజకీయనాయకులను, అనైతిక పాలనను కొనసాగిస్తున్న ప్రభుత్వాలను, చాలా తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. యిక దొంగలను, గూండాలను, నేరచరిత్ర గలిగిన ఏ పార్టీ నాయకున్నైనా ప్రజలు వీధిలో గల్లాపట్టి కొడ్తారు. పారిపోవాలి కంటకులు తోకముడుచుకుని. ప్రజాబలం ఎంత శక్తివంతమైందో ఋజువౌతోంది.”
అందరూ రాసుకుంటున్నారు.
”సరే.. మిమ్మల్ని ఈ ప్రెస్‌మీట్‌కు పిలిపించిన కారణాలు చెప్తాను”
రెండు నిముషాల్లో అందరూ అప్పటిదాకా రాసుకుంటున్నదాన్ని ఆపి.. తలలెత్తి.. ప్రశ్నలై.,
”మిత్రులారా.. యిప్పుడు నేను చెప్పబోతున్నదాన్ని యధాతథంగా, విపులంగా, నిజాయితీగా రిపోర్ట్స్‌ చేసి నా హృదయాన్ని ప్రజలకు ఒక పూర్తి పాఠంగా అందజేయాలని ఆకాంక్షిస్తున్నాను…నిజాకికి యిది ఒక ‘కన్‌ఫెషన్‌ సెషన్‌’ ఈ సందిగ్ధ సందర్భంలో ఒక విద్యావంతురాలైన పౌరురాలిగా యిన్నాళ్ళ బట్టి.. అంటే దాదాపు పదిహేనేళ్ళుగా ప్రపంచ వేదికపైన నిర్వహించిన అనేక అసాంఘిక, సంఘవిద్రోహ, నేరపూరిత చర్యలను మీముందుంచి, నిజాన్ని నిర్భయంగా అందరికీ తెలియజేసి, ప్రాయశ్చిత్తం చేసుకుని పశ్చాత్తాపం ప్రకటిస్తూ ప్రజలను నన్ను క్షమించమని వేడుకునేందుకే ఈ ప్రత్యేక విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశాను.
తప్పులు చేయడం.. తోటి మానవులకు నష్టం కల్గించే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డం.. చివరికి ఏదో ఒక సందర్భంలో జ్ఞానోదయమై పశ్చాత్తాపాన్ని ప్రకటించి సన్మార్గంలోకి మళ్ళి శేషజీవితాన్ని మానవ వికాసం కోసం శ్రమించడం మానవ చరిత్రలో కొత్త విషయమేమీకాదు. బుద్ధునినుండి, అశోకుని నుండి మొన్న ది కన్ఫెషన్‌ ఆఫ్‌ ది హిట్‌మన్‌ అనే పుస్తకాన్ని రాసి అమెరికా రహస్య దుర్మార్గ ఆలోచనలను బయటపెట్టిన జాన్‌ పెర్కిన్స్‌ వరకు, నిన్నరాత్రి మన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రివరకు.. పశ్చాత్తాప ప్రకటించిన మహావ్యక్తులెందరో ఉన్నారు. తెలిసి తెలిసి తప్పులు చేస్తూ చేస్తూ తన చేస్తున్నది తప్పని తెలుసుకుని యిక తప్పులు చేయకుండా మారినవాడు యింకా యింకా తప్పులు చేస్తూ ఎప్పుడూ తప్పుని తప్పని తెలుసుకోకుండా మరణించేవానికంటే ఉత్తముడని నేను విశ్వసిస్తాను.
ఈ రోజు బహిరంగంగా నా తప్పులన్నింటినీ మీ అందరి సమక్షంలో బయటపెట్టి.. నా నుండి నా సంఘర్షించే ఆత్మనుండి.. చివరికి అర్ధరహితంగా కొనసాగుతున్న ఈ జీవితం నుండి విముక్తమైపోతున్నాను..”
నిర్మల షాకైంది.. అవాక్కయి చూస్తోంది లీలవంక. అసలేం జరుగుతోందో అర్ధం కావడంలేదామెకు.
”సరిగ్గా నేను పది మార్చి పందొమ్మిదివందల తొంభై ఐదు నాటి రాత్రి వరంగల్లు చౌరస్తాలో ఒక విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి ఒక ప్రకటన చేశాను. పుట్టు అనాథను, దిక్కులేనిదాన్ని, నిట్టనిలువుకొండను ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రాకుతూ ప్రాకుతూ జీవితాన్ని ఓ చాలెంజ్‌గా తీసుకొని బ్రతకాలనుకుంటున్నదాన్ని.. చేతిలో ఒక్క రూపాయికూడా లేనిదాన్ని సరిగ్గా పదిహేను ఏండ్ల తర్వాత సర్వశక్తులనూ ఒట్టి యిరవై వేల కోట్ల రూపాయలను సంపాదించి ఒక మామూలు స్త్రీ ఎలా విజయాలను సాధించగలదో ఋజువు చేసి చూపిస్తానని సవాలు విసిరి నిష్క్రమించాను. మర్నాడు ఆ విషయం ఒక ఉత్కంఠభరితమైన విషయంగా అన్ని తెలుగు పత్రికల్లో వచ్చింది. దాని కాపీ మీకు అందిస్తాను తర్వాత. అప్పట్నుండి యిక జీవితంలో పరుగు ప్రారంభించాను. నేను ఎంబిఎ చదివినప్పుడు మౌళిసార్‌ అని ఓ ప్రొఫెసర్‌ ఉండేవాడు. ఒక వాక్యం చెప్పాడాయన.. మనిషి సర్వకాల సర్వావస్థల్లో సుఖ, దుఃఖ, నిర్వేద, సంకక్షుభిత సర్వసందర్భాల్లో తోడుండేది ఒక ‘పుస్తకమే’ అని. పుస్తకాన్ని ఆయుధంగా చేసుకుని భారత పురాణేతిహాసాల్నుండి ప్రపంచ సకల మానవవికాసానికి సంబంధిచిన పుస్తకాలన్నింటిని ఒక సంవత్సరంపాటు ఆమూలాగ్రం అధ్యయనం చేశాను. పదిహేనేళ్ళలో ఒక ఏడాది గడిచింది. యిక రెక్క విప్పి నన్ను నేను ఒక ప్రశ్నగా, పదునైన పనిముట్టుగా, ఆయుధంగా, బాణంగా, శక్తిగా.. శిల తనను తాను చెక్కుకుని శిల్పంగా మలుచుకున్నట్టు రూపాంతరీకరించుకుని యిక పరుగు పందెంలోకి ప్రవేశించాను.
యిప్పుడు నా నెట్‌ అసెట్‌ వ్యాల్యూ యిరవై ఐదు వేల కోట్ల రూపాయలు. నేను చాలెంజ్‌ చేసినదానికంటే ఐదువేల కోట్ల రూపాయలు ఎక్కువ.
ఐతే మనిషికి పరుగుపందెంలో ఉన్నప్పుడు ఒక్క లక్ష్యం, గమ్యం మాత్రమే కనిపిస్తుందిగాని విచక్షణ ఉండదు. డబ్బు.. డబ్బు.. డబ్బు. డబ్బేలోకం, డబ్బేదైవం, డబ్బే జీవితం. డబ్బు ఇంకా ఇంకా చేరుతున్నకొద్దీ మనిషిని ఒక అజ్ఞాతమైకం కమ్ముతుంది. నిషా శరీరం, మనసు, హృదయం, బుద్ధి వీటన్నింటినీ ఆవహించి ఉన్మాదుణ్ణి చేస్తుంది. డబ్బుతో అధికారం, అధికారంతో వ్యామోహం, వ్యామోహంతో మదం, మదంతో అహంకారం, అహంకారంతో పశుప్రవృత్తి.. యిక మనిషి ధనమదంతో మృగమైపోతాడు. విచక్షణ పూర్తిగా నశించిపోతుంది.
నేను గత పదిహేనేళ్ళుగా మృగంగా జీవిస్తున్నాను.
కాని యిప్పుడు నాలో.. ‘ఎందుకు?’ అన్న ప్రశ్న ఉదయించింది.
ఈ గుట్టల గుట్టలు డబ్బు ఎందుకు.. కనీసావసరాలకు మించిన ఈ సౌకర్యాలెందుకు.. ఈ అవధులు మీరిన లౌల్యం ఎందుకు.. అసలు గమ్యమే తెలియని ఈ ప్రయాణం ఎందుకు.
ఏమిటి..?ఎందుకు?..ఎక్కడికి?..యివి అసలైన ప్రశ్నలు
యిక యిప్పుడు నన్ను నేను తెలుసుకుని విముక్తమౌతున్నాను.
సూట్‌కేస్‌లో సర్వ వివరాలతో, ఋజువుల్తో కొన్ని ఫైళ్ళున్నాయి. వీటిలో ఈ కేంద్ర ప్రభుత్వంలో పెద్ద మనుషులుగా చెలామణిఔతూ కోట్లకోట్ల అవినీతికి పాల్పడ్తున్న దాదాపు నూటా ఇరవై మంది ఐఎఎస్‌లూ, మంత్రులూ, డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీలు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఉన్నతస్థాయి వ్యక్తుల జాతకాలు, వాయిస్‌ ఎవిడెన్సెస్‌, వీడియో క్లిప్పింగ్సు.. అన్నీ ఉన్నాయి.
అంతర్జాతీయంగా ప్రపంచబ్యాంక్‌, ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ వంటి సర్వోన్నత సంస్థల్నుండి బిలియన్సాఫ్‌ డాలర్స్‌ను పర్సెంటేజ్‌లపై భారతదేశపు ఎనిమిది రాష్ట్రప్రభుత్వాలకు తరలించి, ఎన్నో పవర్‌ ప్రాజెక్ట్‌లకు, ఇర్రిగేషన్‌ ప్రాజెక్ట్‌లకు, రోడ్లకు, విద్య, వైద్య, ఆరోగ్య పథకాలకు కోటానుకోట్ల మళ్ళించి.. ఇన్ని రాష్ట్రాల్లో ఎవడు ఎంత కమీషన్‌ తీసుకుంటాడు, ఎవడు ఎలా పనులు చేస్తాడు.. ఎవడు ఎంత దోచుకుంటాడు.. ఏ కార్పొరేట్‌ కంపెనీ ఎంత ముట్టజెప్పి ఎంత లాభపడ్తుంది.. యివన్నీ లీలకు ఫింగర్‌ టిప్స్‌. లీల నెట్‌వర్క్‌ ప్రపంచవ్యాప్తంగా ఉంది. లీల సామ్రాజ్యం అదృశ్యంగా భారతదేశం మొత్తం వ్యాపించి ఉంది. నేను ఒక ఆక్టోపస్‌ వంటిదాన్ని. విస్తరణ నాకు వెన్నతో పెట్టిన విద్య.
నా సామ్రాజ్య రూపురేఖల వివరాలన్నీ ఈ సూట్‌లోని కాగితాల్లో మైక్రోఫిల్ముల్లో నిక్షిప్తమై ఉంది.
సారాంశమేమిటంటే.. దేశమేదైనా.. భాష ఏదైనా.. విషయమేదైనా.. వ్యవహారమేదైనా.. చాలావరకు ‘మనిషి దొంగ.’ ఏ మనిషైనా దేనికో ఒకదానికి లొంగుతాడు..పడిపోతాడు చెప్పిన పనిచేస్తాడు..అది పెద్ద రహస్యమేమీకాదు.. మనం ఎవనికివాడు గుండెపై చేయేసుకుంటే మనకే తెలుస్తుంది మనం దేనికీ లొంగిపోతామో.
ఐతే.. ఏ మనిషైనా దేనికో ఒకదానికి లొంగిపోవడం మాత్రం ఖాయం అన్న సూత్రంపై ప్రపంచాన్ని జయించుకుంటూ వచ్చాను.
కాని అంతిమంగా ఈ డబ్బంతా ఈ సమాజానిది.. ఈ ప్రజలది.. ఈ దీనులది.. ఈ ప్రజలది.. ఇథియోఫియాకు పోండి. ఇండోనేషియాకు పోండి, యుద్ధానంతరం ఇరాక్‌ వీధుల్లో తిరగండి, అప్ఘనిస్తాన్‌ పల్లెల్లో నడవండి. భారతదేశపు ఆదివాసీ గ్రామాల్లోకి తొంగిచూడండి. దుఃఖం.. కన్నీళ్ళు ఏరులై పారుతాయి. ఆకలి, అనారోగ్యం.. దరిద్రం.. నిస్సహాత, దిక్కులేనితనం.. యివి మనల్ని ఒక జీవితకాలం వెంటాడ్తాయి. డబ్బును యింత దారుణంగా దోచుకుంటున్న మనల్ని నిలదీసి సిగ్గుతో తలవంచుకునేట్టు చేస్తాయి.
పశ్చాత్తాపపడ్తూనే నేను ఈ సందర్భంగా దోపిడీదారులైన ఈ దేశవ్యాప్త రాబందు నాయకులకు, ప్రభుత్వాధికారులకు, వ్యాపార రాక్షసులకు ఒకటే వినయపూర్వక విన్నపం చేస్తున్నాను. లంచం తీసుకునేప్పుడు, లంచం యిచ్చేప్పుడు ఈదేశంలో ఆకలితో అలమటిస్తున్న కోటానుకోట్లమంది పేదల కన్నీళ్ళను, వాళ్ళ ఆకలి కడుపులను, వాళ్ళ దుర్భర జీవిత ఆవరణను ఊహించుకోండి. మీరు తీసుకుంటున్న డబ్బు వాళ్ళ రక్తాన్ని తాగుతున్నట్టు వాళ్ళ శరీరాన్ని చించుకుని తింటున్నట్టుగా దృశ్యించండి. ఆ డబ్బు వాళ్ళదే…మీరు దొంగతనంగా వాళ్ళ నోటిముందరి అన్నం ముద్దను లాక్కుని తింటున్నట్టుగా ఊహించుకోండి. యిక మీరు మీ జన్మలో ఎక్కడా లంచం తీసుకోరు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు, సర్వ న్యాయవ్యవస్థకు చేతులెత్తి విన్నపం చేస్తున్నాను.. మీ కళ్ళముందే యిన్ని ఘోరాలు, నేరాలు, దౌర్జన్యాలు, బహిరంగ రాజకీయదోపిడీలు, శాసనాలను, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ గూండాలు చట్టసభలను ఆక్రమించుకోవడాలు..జరుగుతుంటే దయచేసి మాకెవ్వరూ కాగితాలపై పిటిషన్‌గానో, దరఖాస్తుగానో దాఖలు చేయడం లేదని చర్యలు తీసుకోకుండా మౌనం పాటిస్తున్నారు. ఒక సాధారణ మనిషిగా మీరే  ఓ రాజ్యాంగ పౌరునిగా స్పందించి సుమోటో కేస్‌గా ఈ దోపిడీని, దొంగతనాన్ని ఆపండి. అవినీతిని పరిహరించండి ప్లీజ్‌.
అంతిమంగా ప్రజలకు చేతులెత్తి దండంపెడ్తూ వేడుకుంటున్నాను. రామం వంటి నాయకులు ఎప్పుడో ఒకరో ఇద్దరో పుడ్తారు. కాని మీరు ఎవరికి వారు ఒక్కోనాయకునిగా ఎదగండి. సింపుల్‌ ఫార్ములా..కోట్లను కుప్పలేస్తున్న వానిదగ్గరికి ఒక సమూహ జనశక్తిగా వెళ్లి నువ్వేం పనిచేస్తున్నావ్‌..నీకిన్ని ఆస్తులెక్కడివి..కోటానుకోట్లు ఏ అపక్రమ మార్గంలో వస్తున్నాయ్‌..అని బాజాప్తాగా నిలదీయండి. వ్యక్తి ఒంటరిగా ఎప్పుడూ బలహీనుడు..సంఘటితం కండి..చినుకు చినుకు కలిసి ఉప్పెనై విజృంభించండి.
రామం స్థాపించిన ‘జనసేన’ ఒక మహాశక్తి కేంద్రకం. ఎటువంటి అధికార వాంఛలేని, స్వంత ఆస్తులపై మమకారం లేని, ఏ పదవీ వ్యామోహం లేని లక్షమంది శాశ్వత కార్యకర్తలతో, ఒక నిరంతర మహోద్యమాన్ని ఈ దేశానికే ప్రేరణగా రూపొందించి ఒక స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అతని ఆ మహాయజ్ఞంలో సమిధగా నా సర్వ స్థిర చరాస్తులన్నింటినీ ‘జనసేన ట్రస్ట్‌’కు ధారాదత్తం చేస్తున్నాను. ఆ విల్లు ఈ సూట్‌కేస్‌లో ఉంది. నా తరపున నిర్మల ఈ కేసులన్నింటిని కోర్టుల్లో ఫైల్‌ చేస్తుంది. మిగతా వ్యవహారాలన్నీ నా వారసురాలిగా కొనసాగిస్తుంది. నిర్మలే మున్ముందు నాకు వారసురాలు.
విలేఖరులందరూ తలలు వంచుకుని రాసుకుంటున్నారు. టి.వి. ఛానల్‌ వాళ్ళు కెమెరాల్లో ముఖాలు పెట్టి షూట్‌ చేస్తున్నారు. అటు ప్రక్క నిర్మల నిర్ఘాంతపోయి రాతిబొమ్మలా నిలబడి వింటోంది.
అప్పట్నుండి ఒక ప్రవాహంలా మాట్లాడ్తున్న లీల గొంతు ఆగిపోయింది చటుక్కున. ధార తెగి…నిశ్శబ్దమై..స్తబ్దమై
అందరూ ఆ అంతరాయానికి స్పందిస్తూ తలెత్తారు లీలవైపు…
కాని ఎదురుగా అప్పట్నుండి మెరుపులా కనిపించిన లీల అక్కడ లేదు. ఒక లిప్తకాలంలో సుడిగాలిగా కదిలి..ఉరికి.. ప్రక్కనే ఉన్న గాజు కిటికీ తలుపులను తెరుచుకుని చటుక్కున బయటికి కిందికి దూకింది…పదిహేనవ అంతస్తుపైనుండి…అకస్మాత్తుగా.
అందరూ గగుర్పాటుతో ఉలిక్కిపడి..కిటికీ దగ్గర చేరి..కిందికి చూస్తూ.
క్రింద రక్తపు మడుగులో లీల శవం..చుట్టూ ఎర్రగా రక్తం…సడన్‌గా జరిగిన సంఘటనకు విస్తుపోయి గుమికూడుతున్న జనం…కోలాహాలం.
కాన్ఫరెన్స్‌హాల్‌లో…టేబుల్‌పై లీల అప్పట్నుండి చెప్పిన డాక్యుమెంట్లతో నిలిచిన స్కాజెన్‌ తోలు సూట్‌కేస్‌…
కొందరు విలేఖరులు లీల మరణ దృశ్యాన్ని రికార్డ్‌ చేయడానికి పరుగు తీశారు కిందికి కెమెరాల్తో. హాల్‌నిండా గంభీర నిశ్శబ్దం అలుముకుంది.
ఏమిటి?…ఎందుకు?…ఎక్కడికి? లీల గొంతు ప్రతిధ్వనిస్తోంది.
ప్రశ్నలు ప్రశ్నలుగా నిర్ఘాంతపోయిన నిర్మల కళ్లనిండా నీళ్లు…ఎదుట ఏమీ కనబడడం లేదు. గాలి బరువెక్కుతుంది.

31

25

రామం కొద్దికాలం కోమాలో ఉండి కోలుకుని మొదటిసారిగా ‘జనసేన’ కేంద్రకానికొచ్చాడు ఆ రోజు.
ఉదయం ఎనిమిది గంటలు…
మనిషి చాలా బలహీనంగా ఉన్నాడు. బాంబు ప్రేలినప్పుడు వీపు భాగం ఛిద్రమై, పేలికలై…మాంసం ముద్దగా మారి…
వరుసగా ఎనిమిదిసార్లు ఆపరేషన్స్‌ జరిపి సెట్‌ చేసి…కుట్టి…తొడల నుండి మాంసాన్ని కత్తిరించి అతికి..కోలుకోవడం ఓ గండం గడిచి బయటపడి…
రామంను క్యాథీ తన భుజాన్ని ఆసరాగా ఇచ్చి నడిపించుకొచ్చింది కారు నుండి ఆఫీస్‌లోని కుర్చీదాకా.
అత్యంత కీలకమైన సమావేశం అది.
”అందరికీ నమస్కారం సర్స్‌…శివ, గోపినాథ్‌గారు, మూర్తి గారు…మీకందరికి ధన్యవాదాలు…నన్ను కంటికి రెప్పకన్నా అధికంగా చూచుకున్నారు”.
”ఒక్కసారి అటు చూడండి” అన్నాడు మూర్తి…హాల్‌లో ఓమూలనున్న అక్రిలిక్‌ ట్రాన్స్‌పరెంట్‌ షీట్‌తో చేసిన పెద్ద మనిషెత్తు పెట్టెను చూపిస్తూ.
రామం తలను అటు త్రిప్పిచూశాడు. దాదాపు దానినిండా ఉత్తరాలు, టెలిగ్రాంలు ఉన్నాయి.
”అవన్నీ మీరు తొందరగా కోలుకుని జనసేన కార్యకలాపాలకు స్వయంగా నాయకత్వం వహించాలని రాష్ట్రవ్యాప్తంగా, రాష్ట్రేతర ప్రాంతాల్నుండి, ఎన్నారైలనుండి వచ్చిన ఉత్తరాలు…మెసేజ్‌లు”
”రియల్లీ… ఐ ఓ టు దెం…ఏం చేసి వాళ్ల ఋణం తీర్చుకోగలను…” చటుక్కున అతని కళ్ల నిండా నీళ్లు నిండాయి చలించిపోయాడు.
కొద్దిసేపు నిశ్శబ్దంగా గడిచిన తర్వాత…తేరుకుని…”చెప్పండి సర్స్‌…విశేషాలు”
గోపీనాథ్‌గారు ప్రారంభించారు.”మీకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి గాని..ఫర్‌ క్లారిటీ..రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో భవిష్యత్తుపట్ల పెల్లుబుకుతున్న విశ్వాసంతో చైతన్యం వెల్లివిరుస్తోంది. అన్ని ‘జనసేన’ కార్యాలయాల్లో పౌరశిక్షణ తరగతులు సజావుగా సాగుతున్నాయి. మనం అనుకున్న శాశ్వత లక్షమంది నిస్వార్ధ జనసైనికులు తమ విధులను జనంతో కలసి ప్రేరక్‌లుగా పనిచేస్తున్నారు. అవసరమైతే జనసైనికులుగా ఫుల్‌టైమర్‌లుగా పనిచేయడానికి ఇంకో లక్షమంది సంసిద్ధంగా ఉన్నారు. మొత్తం జనసేన సభ్యుల ఎన్‌రోల్‌మెంట్‌ ఒక కోటి డెబ్బయి లక్షలు. అహింస…క్రమశిక్షణ…సంస్కారం…ప్రశ్న…త్యాగం అంశాలుగా నిరంతర శిక్షణ కొనసాగుతోంది.
తర్వాత మూర్తిగారు మాట్లాడ్డం మొదలెట్టారు.”ముఖ్యమంత్రి తనే స్వయంగా అవినీతి నిర్మూలన కార్యక్రమానికి శ్రీకారం చుడ్తూ లంచగొండి నాయకులపై, మంత్రులపై యితరేతర అన్ని రాజకీయ పార్టీలనాయకులపై అవినీతిపరులైన ప్రభుత్వాధికారులపై కేసులు పెట్టిన తర్వాత…మొత్తం పాలనా వ్యవస్థ కుప్పకూలిపోయింది. దీన్ని ఒక ‘నాన్‌వయలెంట్‌ సివిల్‌ రెవల్యూషన్‌గా’ మీడియా అభివర్ణించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ బర్తరఫ్‌ చేసిన తర్వాత ఇది ఒక ‘జనసేన’ ఘన విజయంగా ప్రజల హృదయాల్లో నమోదైంది. దేశం యావత్తూ మన రాష్ట్రం వైపు, జనసేన వైపు పరిశీలనగా, ఆశతో చూస్తోంది. వేరే రాష్ట్రాల్లో కూడా ఇదే మాదిరి జనచైతన్య వేదికలు రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చేసుకున్న దరఖాస్తులు, మనం పెట్టిన వేల కంప్లయింట్స్‌తో ఇనకంటాక్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ ‘వాలంటరీ డిస్‌క్లోజర్‌ అండ్‌ టాక్స్‌’ పథకాన్ని ప్రవేశపెట్టి నల్లడబ్బును సేకరిస్తే నమ్మశక్యం కాని విధంగా లక్షా నలభై రెండు వేల కోట్ల రూపాయలు జమయ్యాయి. రెండు వందల రెండు కాంట్రాక్ట్‌లు రద్దయి రీవర్కవుతున్నాయి. ఎసిబీ మన కంప్లయింట్స్‌ ఆధారంగా జరిపిన దాడుల్లో మొత్తం ఒక వేయి ఆరువందల అరవై కోట్ల రూపాయలు, ఎనిమిది వందల కిలోల బంగారం పట్టుబడింది. మొత్తం ఎనిమిది వందల పైచిలుకు కేసులు నమోదై కోర్టుల్లో నడుస్తున్నాయి. మొత్తానికి వ్యవస్థలో సమూలమైన మార్పు స్పష్టంగా గోచరిస్తోంది. పాలక రాజకీయ పార్టీకి చెందిన మూడువందల పదిమంది, ప్రతిపక్ష…వామపక్ష రాజకీయ పార్టీలకు చెందిన నూటా పద్దెనిమిదిమంది రాజకీయనాయకులు…ఎంపిటిసి స్థాయి నుండి మంత్రుల దాకా అవినీతి ఆరోపణల కింద ప్రజలచే దాడి చేయబడి, ప్రశ్నించబడి ఆధారాలతో సహా నిలదీయబడ్డప్పుడు సిగ్గువిడిచి ముక్కును నేలకు రాసిన సందర్భాలున్నాయి. చిత్రమేమిటంటే ఒకనిపై ఒకరు పోటీపడి, ఎగబడి సంపాదించుకున్న ఆరువేల ఐదువందల తొంబై ఆరు మద్యం షాపుల్లో ఐదువేల నాలుగువందల పదహారు మంది మాకు షాపులు వద్దని ఆఫర్లు వెనక్కి తీసుకున్నారు. ఆడవాళ్ల పేరుమీద అప్లికేషన్‌ పెట్టుకుని మద్యం షాపును దక్కించుకున్న వందమంది పాలకపక్ష, ప్రతిపక్ష రాజకీయ నాయకుల్లో ఏడ్గురు మంది ఎమ్మెల్యేల పెళ్లాలు మొగుళ్లను బహిరంగంగా ‘జనసేన’ కార్యకర్తల ఎదుట చీపుళ్లతో కొట్టి సత్కరించారు. మద్యం సిండికేట్లన్నీ పటాపంచలైపోయాయి. ధరలు నలభై శాతం తగ్గాయి. డాక్టర్లు ఫీజులను స్వచ్ఛందంగా తగ్గించుకున్నారు. ప్రతి వక్రబుద్దిగలవానిలో ఎక్కడ్నుండో ఎవరో ‘జనసేన’ కార్యకర్తలు తమను గమనిస్తూ అంతా రికార్డు చేస్తున్నారనే భయం వ్యాపించింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ పకడ్బందైన నిఘాలో ఉన్నాయి. అందువల్ల ఆఫీసుల్లో పనులు చకచకా, సజావుగా ఆమ్యామ్యాలు లేకుండా ఆరోగ్యవంతంగా నడుస్తున్నాయి. మొన్ననే ఎన్నికల కమీషన్‌ రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ రోజు తేది పది. ఇరవై నామినేషన్లకు చివరి తేది. ఇరవై రెండు విత్‌డ్రాయల్స్‌…వచ్చేనెల ఎనిమిదిన పోలింగు. పన్నెండున కౌంటింగు.
రామం అప్పటిదాకా కళ్లు మూసుకుని సావధానంగా వింటున్నవాడల్లా…నెమ్మదిగా…ఆగండని సైగచేసి..కళ్లు తెరచి సర్దుకుని కూర్చుని…”ఇంతవరకు జరిగిందంతా ప్రక్షాళనే..అసలు మన ‘జనసేన’ యొక్క ‘సంగ్రామ’ థ ఇప్పుడు మొదలు కాబోతుంది. ఒక గురువు తన సర్వశక్తులను ఒడ్డి శిష్యుణ్ణి తయారుచేసిన తర్వాత ఆ శిష్యుడు ప్రతిభాపాటవపరీక్షల్లో పాల్గొన్నప్పటి ఉద్విగ్న పరిస్థితి ఇది. ప్రస్తుత రాజకీయ పార్టీల ప్రతిస్పందన ఎలా ఉంది…”
”యిదివరకటిలా రెచ్చిపోయి ఒకనిపై ఒకరు ఎగబడి టికెట్ల కోసం పైరవీలు చేసుకోవడం, లాబీలు నడపడం, డబ్బుతో ఎవర్నయినా కొనగలమనే స్థితి లేకపోవడం వల్ల దొంగ నాటకాలు వేయడం అంతగా ఎక్కడా కనబడ్డం లేదు. అంతా గుంభనంగా, నివురుగప్పిన నిప్పులా, దొంగలుపడ్డ యింట్లోని పరిస్థితిలా ఉంది. లీల అనే కార్పొరేట్‌ మహిళ ఢిల్లీలో వందలమంది కేంద్ర రాజకీయులు, ప్రభుత్వ పెద్దలపై వందల కేసులు పెట్టి ఎలక్షన్‌ కమీషన్‌కు నేరచరితుల లిస్ట్‌ వేరే ఋజువుల్తో సహా ఇచ్చి ప్రకంపనలు సృష్టించి ఆత్మార్పణం చేసిన తర్వాత ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీల పునాదులు కదులుతున్నాయి…”
”లీలనా..” అన్నాడు రామం వెంటనే…చటుక్కున అని క్యాథీ వైపు చూశాడు.
”ఔను రామం…లీలనే…ఆమె తనకు చెందిన సర్వ లీగల్‌ ఆస్తులను జనసేనకు డొనేట్‌ చేసి గతనెల రెండవ తేదీ ఒక విభ్రాంతికరమైన ప్రెస్‌మీట్‌ పెట్టి అనేక అవినీతికర సంబంధిత చిట్టాలను బహిర్గతపరిచి అనూహ్యంగా పదిహేను అంతస్తుల హోటల్‌ భవనంపైనుండి కిందికి దూకి ఆత్మార్పణ చేసుకుంది. లీల మరణం ఢిల్లీ పెద్దలకు చలిజ్వరం తెప్పించింది. ఎందరి చీకటి చరిత్రలో బయటపడి ఒక్కొక్కడు అదిరి చచ్చిపోతున్నాడు. అంతా కకావికలైంది”
”ఉహు…చెప్పండ్సార్‌”
”శివా చెప్పు…” అన్నాడు మూర్తి తప్పుకుంటూ
శివ చెప్పడం ప్రారంభించాడు. యింతవరకు ‘జనసేన’ ద్వారా ప్రజల్లో ఒక నీతివంతమైన సంస్కృతి, ప్రశ్నించే చైతన్యం, శాస్త్రీయంగా సమాజం, దేశం స్పృహతో ఆలోచించే విధానం అలవడ్డాయి. మన ‘జనసేన’ కేంద్రాలన్నింటికి ఈ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సచ్చరిత్ర గలిగి, అంకితభావంతో, విలువలు ప్రధానంగా ప్రజలకోసమే పనిచేసే విద్యావంతులైన యువకులు అనేకమంది ఆసక్తిచూపుతూ ముందుకొస్తున్నారు. మనం మన స్పందనను తెలియజేయాల్సిఉంది. ‘సంగ్రామ’ థలో మన పాలసీని ప్రకటించవలసి ఉంది. ప్రధానంగా ఈ సమావేశం అందుకే..
”డు యు హావ్‌ స్టాటిస్టికల్‌ డాటా ఆఫ్‌ ఆల్‌ దోజ్‌”
”యస్‌..”
”క్యాథీ ప్లీజ్‌ స్క్రీన్‌”
క్యాథీ వెంటనే క్షణాల్లో ఎల్‌సిడి ప్రొజెక్టర్‌ను స్టార్ట్‌ చేసింది.
తెరపై..నియోజక వర్గం…’జనసేన’ ఆమోదముద్ర కోసం అప్లికేషన్‌ పెట్టుకున్న అభ్యర్థి వివరాలు కదులుతున్నాయి.. రామం చేతిలోకి మానిటర్‌ను తీసుకుని మచ్చుకు ఐదారు చూచి…పాస్‌ చేసి
”చెప్పండి మూర్తి గారు..తర్వాత” ప్రధానంగా ‘జనసేన’ ఆమోదం పొందిన ఏ అభ్యర్థి అయినా ఏ రాజకీయ పార్టీ క్రిందికి రాడు. అతను ఇండిపెండెంట్‌. అంటే స్వతంత్ర అభ్యర్థియై ఉండాలి విధిగా. దరఖాస్తు చేసుకున్న కాండిడేట్లలో ఎవరో ఒకరికి ఐతే.. మన జనసేన ఆమోద ముద్ర తెలిపిన అభ్యర్థిని ఎంపిక చేయడానికి కొన్ని మార్గదర్శక సూత్రాలను మన విధాన నిర్ణాయక సంఘం తయారుచేసింది. జనసేన ఆమోదం కావాలంటే మొట్టమొదట అభ్యర్థి ఈ కండిషన్లను సంతృప్తి పర్చాలి…విందామా వాటిని… శివా వినిపించు..”
”శివా…” అన్నాడు రామం
”ఒకటి.. అభ్యర్థి ఆ నియోజక వర్గానికి స్థానికుడై ఉండాలి. రెండు…కనీసం పట్టభద్రుడై ఉండాలి. వయస్సు అరవై ఏళ్ల లోపు గలవాడై ఉండాలి. మూడు…విధిగా నిరాడంబర జీవితాన్ని గడపడానికి ఇష్టపడే తత్త్వాన్ని, జనంలో మమేకమై వాళ్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు గ్రహించి పరిష్కరించాలనే అనురక్తిని కలిగి ఉండాలి. నాలుగు…ఎటువంటి నేరచరిత్ర ఉండకూడదు. ఐదు..రాజకీయమంటే కొంతపెట్టుబడిపెట్టి గెలిచి దానికి వందరెట్లు సంపాదించుకోవడమనే ఒక ముద్ర ఉండి. ఆ కోణంలో ఏ కొంచెం ఆలోచన ఉన్నా ఆ అభ్యర్థి నిరాకరించబడ్తాడు. అందుకు అభ్యర్థి యొక్క సాధారణ ప్రవర్తనను, తత్వాన్ని జనసేన స్వయంగా అధ్యయనం చేయిస్తుంది. ఆరు… ఎన్నికైతే అభ్యర్థి ఆ నియోజక వర్గం ఉన్న జిల్లా కేంద్రంలో ఉన్న జనసేన కార్యాలయ ప్రాంగణంలో శాసనసభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్మించి ఇచ్చేఅన్ని సౌకర్యాలున్న సాధారణ గృహంలోనే భార్యా పిల్లలతో నివాసముండాలి. జనసేన ఇచ్చే వాహనాది సదుపాయాలనే ఉపయోగించాలి. ఏడు..ఏ ఓటరుకైనా ఎన్నికైన శాసనసభ్యుడు పిలుపు దూరంలో ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. ఎనిమిది… ప్రవర్తన బాగా లేనప్పుడు ప్రతి ఆరునెలలకొకసారి జనసేన నిర్వహించే జనాభిప్రాయ సేకరణలో నిరసన వ్యక్తమైనపుడు ఆ శాసనసభ్యుడు తన సభ్యత్వాన్ని వదులుకొని వెనుదిరిగి రావడానికి సంసిద్దుడై ఉండాలి. తొమ్మిది తన పదవీ కాలం ఐదేళ్లలో ప్రభుత్వం తరపున, జనసేన తరపున లభించే ఆదాయం మినహా ఎటువంటి అదనపు సంపాదననూ సమకూర్చుకోరాదు. ఇతర వ్యాపారాలు చేయరాదు. అతనికి, అతని కుటుంబ సభ్యుల సౌకర్యార్థం జనసేన సకల ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి పదవీకాలం ఐదేళ్లను ప్రజల, నియోజకవర్గ అభివృద్ది కోసమే పాటుపడాలి. పది…నీతివంతమైన జీవన సంస్కృతిని జనసేన తరపున ప్రజల్లో ప్రతిష్టించి పౌరునిగా ఆదర్శంగా స్వతంత్రంగా జీవించాలి…ఇవి పది నిబందనలు”.
”ఊ…బాగున్నాయి…ఒకసారి ఒక స్వతంత్ర అభ్యర్థి. మన జనసేన తన ఆమోదముద్ర వేసిన తర్వాత అతను ప్రజల అభిమానాన్ని చూరగొని ఎన్నికై రావడానికి మనం అవలంభించే పద్దతులను కూడా ఖరారు చేద్దామనుకున్నాం గదా గోపినాథ్‌ గారు…” అన్నాడు రామం సాలోచనగా.
”ఔను..అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. క్యాథీ మీరు వినిపించండి”
‘ఒకటి…ప్రజలను ఇన్నాళ్లుగా మోసం చేసిన ప్రజాకర్షక పథకాల గురించి ఏమీ ప్రస్తావించం. ‘ఉచితాలు వద్దు…ఉపాధి ముద్దు..’ యాచకులుగా కాదు ఆత్మగౌరవంతో జీవిద్దాం’, ‘వృద్దుల సంరక్షణ సామాజిక బాధ్యత’ ఇవి మన సిద్దాంతపరమైన నినాదాలు.రెండు..ఏ నియోజకవర్గంలోనైనా జనసేన ఆమోదముద్ర పొంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తనతో పోటీలో ఉన్న ఏ ప్రత్యర్థి గుర్తించీ తన ప్రచారంలో ప్రస్తావించడు..దుర్భాషలాడడు, విమర్శించడు. తను ఎన్నికైతే ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాడో, ఏమేం సేవలు చేయగలడో వివరిస్తారు. సంస్కారవంతమైన భాషతో ప్రచారం నిరాడంబరంగా కొనసాగిస్తాడు. మూడు…ఎక్కడా రోడ్‌షో వంటి పిచ్చి పిచ్చి నడిరోడ్డు చిందులాటలు జరిపి ప్రజలకు అసౌకర్యం కలుగజేయరు. నాలుగు…నిర్ణీతమైన విశాల మైదానాల్లోనే పద్దతి ప్రకారం…డబ్బిచ్చి జనాన్నికొనుక్కుని రాకుండా నిజంగా తనపై, జనసేనపై ఉన్న అభిమానంతో వచ్చిన ప్రజలతోనే చాలా నిజాయితీగా తన గురించి క్లుప్తంగా చెప్పుకుంటాడు. నాలుగు…జనసేన ఆమోదమున్న అభ్యర్థులెవ్వరూ పోలీస్‌ సెక్యూరిటీని పోటీ చేసినపుడు గానీ, గెలిచిన తర్వాత గాని అంగీకరించరు. ప్రజల మధ్య స్వేచ్చగా తిరుగలేని వాడు ప్రజలకు మిత్రుడు కాడని జనసేన నమ్ముతుంది. ఐదు…జనసేన తరపున సుశిక్షితులైన జిల్లాకే చెందిన మూడువేల కార్యకర్తలు ప్రతి నియోజకవర్గంలో మన అభ్యర్థి తరపున యింటింటికి తిరిగి ప్రచారం చేస్తారు. నిరాడంబరంగా, స్వచ్ఛందంగా, వాళ్ల క్రమశిక్షణాయుతమైన ప్రచారమే అభ్యర్థి గెలుపుకు ప్రాణవాయువు. ఆరు…ప్రతి నియోజకవర్గంలోని స్థానిక కేబుల్‌ నెట్‌వర్క్‌ ద్వారా మాత్రం మన అభ్యర్థి ప్రతిరోజు ఓ పావుగంట ప్రజలనుద్దేశించి ఏ పరిస్థితుల్లో ఎన్నికలొచ్చాయి…అంతకు ముందు ఏం జరిగింది..జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు ఎలా ఉండాలి…ఎలా ఉన్నాయి. ఇన్నాళ్లు ప్రజాధనం ఎలా కొల్లగొట్టబడింది..ఎలా ప్రజలపై ఋణభారం మోపబడింది. మనం ఎంత లోతు అప్పుల బురదలో కూరుకుపోయి ఉన్నాం..ఈ విషయాలను అంకెలతో సహా పారదర్శకంగా ప్రజలకు తెలియజేయాలి. ఏడు…అభ్యర్థికి అయ్యే పరిమితమైన ఈ ప్రచార ఖర్చును, కార్యకర్తల నిర్వహణ ఖర్చును, ఎక్కడా అతిగా అనిపించని ప్రచార సామాగ్రి ఖర్చును స్వచ్ఛందంగా ‘జనసేన’ భరిస్తుంది. ఎనిమిది…ప్రచార సమయంలో పకడ్బందీ సమయపాలనతో రామం, క్యాథీ, గోపీనాథ్‌, మూర్తి, శివలతో కూడిన సారథ్య బృందం తప్పనిసరిగా ఒక్కసారైనా ప్రతి నియోజక వర్గంలో పర్యటిస్తుంది. ప్రజలను కలుస్తుంది. తొమ్మిది…మన లక్ష్యం…ప్రజల కోసం, ప్రజలతో, ప్రజల వెంట…యివీ తొమ్మిది సూత్రాలు” ఆగింది క్యాథీ.
”బాగున్నాయి…ఫర్‌ఫెక్ట్‌..సర్‌… యింతవరకు ఎన్ని నియోజకవర్గాలనుండి ‘జనసేన’ ఆమోదం కోసం దరఖాస్తులందాయి మనకు”
”అన్నీ…రెండవందల తొంభై మూడు శాసనసభా నియోజక వర్గాలకు ఒక్కో నియోజక వర్గానికి కనీసం యిరవై మంది నుండైనా అప్లికేషన్లయినా వచ్చి ఉంటాయి. ఐతే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే…చాలామంది ముప్పయ్యేండ్లవయస్సు లోపు వారే కాకుండా అందరూ బీద, వెనుకబడిన, దళిత, ఆర్థికంగా నిమ్నమధ్యతరగతికి చెందినవాళ్లే. ఆ జన్మ ధనవంతులు దాదాపు ఎవరూ లేరు.
”మనకు వాళ్లే కావాలి…వాళ్లే చరిత్ర నిర్మాతలు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా ఏ వస్తువు తయారైనా, ఎక్కడ ఏ బృహత్తర నిర్మాణం జరిగినా వాటివెనుక వీళ్ల శ్రమే ఉంది. నాయకుడెప్పుడు కరుణార్థ్ర హృదయుడై, పీడిత జన పక్షపాతియై ఉండాలి. ప్రపంచ ప్రఖ్యాత నంబర్‌వన్‌ ధనవంతుడు వారెన్‌ బఫెట్‌ తన నలభై ఏండ్ల క్రితం కొనుక్కున్న పాత యింట్లో నివసిస్తూ, అతి సాధారణ జీవితం గడుపుతూ ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చేయనంత పెద్ద మొత్తంలో ముప్పయి బిలియన్‌ డాలర్లను దానం చేస్తూ…ధనవంతులపై విపరీతంగా టాక్స్‌ పెంచి పేదలను టాక్స్‌ నుండి విముక్తం చేయమన్నాడు. మన లక్ష్యం పేదవాని అభ్యున్నతి”.
”…..” కొద్దిసేపు మౌనం తర్వాత…”కొద్దిగా టీ తాగుదామా..క్యాథీ విల్‌ యు కైండ్లీ అరెంజ్‌ సం టీ ఫరజ్‌…” అన్నారు రామం చొరవగా.
బాంబు పేలుడు ఉదంతం నుండి రామం టీ తాగలేదని అందరికి తెలుసు. అతను కోలుకుని స్వయంగా టీ అడగడం ఎందుకో అందరిని ఆనందపర్చింది.
ఓ ఐదునిముషాల్లో టీ వచ్చింది.
క్యాథీ అందరికి టీ ని స్వయంగా కప్పుల్లో వంచి అందించి ప్రేమగా ఓ కప్పును రామంకు కూడా ఇస్తూ, అతని కన్నుల్లోకి చూచింది లిప్తకాలంలో.
అతని కన్నుల నిండా పొంగిపొర్లే కృతజ్ఞత.
”సర్‌..ఐతే…అందరి అప్లికేషన్స్‌ను మీరు కలిసి పరిశీలన చేయండి. ఎల్లుండి ఫైనలైజ్‌ చేసి కమ్యూనికేట్‌ చేద్దాం..శివా..ఫైనల్‌గా నిలుస్తున్న వాళ్ల గురించి మన గూడాచారి విభాగంతో సమగ్రంగా అధ్యయనం చేయించు. ఎక్కడా మనంతట మనం నిర్ణయం తీసుకోవద్దు. నామినేషన్స్‌ విత్‌డ్రా డేట్‌ తర్వాత మన విస్తృతమైన అన్ని నియోజక వర్గాల పర్యటనను ఫిక్సప్‌ చేయ్‌…సంగ్రామం థ ప్రారంభమైంది…”
కుర్చీలో నుండి మెల్లగా, ఆయాసంగా లేచి నిలబడ్డాడు రామం. వెంటనే చటుక్కున క్యాథీ అతన్ని పొదివి పట్టుకుంది.
కారులోకి ఎక్కి వెనక్కి చేరగిలపడ్తున్న రామంకు…కారు కదుల్తుండగా ఎందుకో శివ చెప్పిన లీల విషయం గుర్తొచ్చింది..ఢిల్లీలో పదిహేనంతస్తుల హోటల్‌ గదిలోనుండి కిందికి దూకి మరణించండం…
ప్రొద్దున తను ఇంట్లో నుండి బయల్దేరే ముందు ఎన్నో రోజుల నుండి చెక్‌ చేసుకోకుండా ఉండిపోయిన ఈమెయిల్స్‌ని తన లాప్‌టాప్‌లో పరిశీలిస్తుండగా ఆ రోజే కావచ్చు…చనిపోవడానికి కొద్ది గంటలకు ముందు తనకు డిస్పాచ్‌ చేసిన మెయిల్‌ జ్ఞాపకమొచ్చింది.
”రామం..ఈరోజు వాషింగ్టన్‌ డి.సి. ఏర్‌పోర్ట్‌ ఫస్ట్‌క్లాస్‌ లాంజ్‌లో..నాతో నువ్వున్నావు..లీలా, నీకు పద్మవ్యూహంలోకి ప్రవేశించడం తెలిసింది. ప్రవేశించి భీకరంగా , వీరోచితంగా యుద్ధం చేస్తున్నావు. కాని కావాలనుకున్నప్పుడు పద్మవ్యూహం నుండి నిష్క్రమించడం నీకు తెలియదు. అయితే విషాదమేమిటంటే నిష్క్రమించడం తెలియదనే విషయం కూడా నీకు తెలియదు..నిజం రామం..పద్మవ్యూహ నిష్క్రమణ నాకు తెలియలేదు. నేను నక్షత్రాణ్ణి కాను. తారాజువ్వను. కాంతివంతంగా క్షణకాలం వెలిగి తప్పనిసరిగా నేలరాలిపోతాను…నీకు ఏమీ కాలేకపోయిన..లీల”.
రామం కళ్లలో సన్నని కన్నీటి పొర  ఏర్పడి హృదయం భారమైంది.
అప్పుడతనికి ఎక్కడ్నుండో ఆరుద్ర గీతం…’ప్రాప్తమున్న తీరానికి పడవ చేరిపోయింది.’ గీతం వినబడ్తోంది..సన్నగా..లీలగా.

32

26

సురేఖ దిగ్గున ఉలిక్కిపడి…మెలకువ వచ్చి ఎదురుగా ఉన్న గోడ గడియారం దిక్కు చూచింది.
సమయం ఉదయం నాలుగ్గంటలు    ప్రక్కనున్న పక్కను చూచుకుంది. మున్సిపల్‌ వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌ భర్త బాలకృష్ణ యింకా ఇంటికి రాలేదు. ప్రక్కన ఇద్దరు పిల్లలు…రమ్య నాలుగేళ్లు, బాబు కృష్ణ ఏడాదిన్నర…ఇద్దరూ అదమరచి నిద్రపోతున్నారు.
రాత్రంతా గడిచిపోతోంది. ఇతనింకా రాడేమిటి…ఎక్కడ ఎవన్తో తాగి, ఏడ తందనాలాడ్తున్నాడో…అసలే మున్సిపాలిటీ చెత్త..కంపు.
‘అమ్మచెప్పింది స్త్రీకి రెండు జీవితాలని
ఒకటి ఇక్కడ…మరొకటి అక్కడ
కాని అమ్మ చెప్పలేదు స్త్రీకి మరణాలెన్నో’
ఇంటర్‌ ఫెయిలై, వీడు…ఈ బాలకృష్ణ అనబడే డిప్లమో ఇంజనీర్‌..మున్సిపల్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గాణ్ణి తన తండ్రి మూడు లక్షలకు కొని మెడకు ఆవుమెడలో మొద్దులా కట్టి సంసారంలోకి పంపితే…మొదటి రోజు…శోభనపు రాత్రే తెలిసింది…వాడు పరమ పచ్చి తాగుబోతు..లంచగొండి వెధవ…అవినీతిపరుడు…సర్వ దుర్లక్షణాలూ మూర్తీభవించినవాడు.
కాని ఏం జేయగలదు తను…కిక్కుమనకుండా కాపురం చేస్తూ…భరిస్తూ..,
యిద్దరు పిల్లలు…రమ్య, బంగారు బొమ్మ…కాని చెవులు వినపడవు…కొడుకు కృష్ణ..మూగ..మాటలురావు.
భర్త బాలకృష్ణ…మున్సిపల్‌ రోడ్లు వేయించి, కాలువలు కట్టించి, కల్వర్టులు కట్టించి, బాక్స్‌ డ్రాయిన్‌లలో పూడికలు తీయించి…పైప్‌లైన్‌లు, వాటర్‌ పైప్‌లు…కాంట్రాక్టర్‌లు…వీడు…బిల్లులు..కాంట్రాక్టర్‌…కమీషన్లు..రాత్రిదాకా ఎవడో తాగిస్తే పీకలదాకా తాగి…ఊగుతూ, తూగుతూ…ఎప్పుడో రాత్రి రెండు గంటలకు…చేతిలో మల్లెపూలు.. నోట్లో విస్కీ కంపు…జేబులో కొన్ని నోట్ల మడతలు..
ఏమిటిది…వర్క్‌ ఇన్స్‌పెక్టర్‌…జీతం నాల్గువేల రెండు వందల యాభై…
కాని ఇంట్లో కలర్‌ టి.వి., ఫ్రిజ్‌., హీరోహోండా మోటార్‌ బైక్‌..స్వంత ఇల్లు…ఈ మధ్య వింటున్నది ఎక్కడో రెండో సెటప్‌…ఏమిటిదంతా…
పాపం….పాపం…లంచాలు…దోపిడీ..,
”వద్దండీ ఈ పాపపు డబ్బు…పిల్లలు చూడండి ఈ పాప ఫలితంగా ఎలా మూగ, చెవుడు”
‘చెంప చెళ్లు…గూబ గుయ్యి’
అదంతే…యిదంతే…వీడు మానడు…వీడు మారడు.
ప్రక్కనున్న సెల్‌ మ్రోగింది. సమయం సరిగ్గా నాల్గూ ముప్పయ్యయిదు.
”హలో”
”ఏయ్‌..తలుపు తియ్యవే..” మాట ముద్ద ముద్ద….తూలి తూలి.
తలుపు తీస్తే…ఎదురుగా మనిషిరూపంలో ఓ పశువు…విస్కీ కంపు…ఉల్లిపాయల వాసన.
”ఎంతసేపే నీయవ్వ…మొద్దు నిద్రపోతానవా…”దబాయింపు.
”ఏంరా ఒళ్లు బలిసిందా..రాత్రంతా నిదురపోక ఇద్దరు పిల్లల్నేస్కోని ఎదురు సూత్తాన…పోరికి జ్వరంతో ఒళ్లు కాలిపోతాంది. ఎవడో పోయిస్తే గుద్దబల్గ తాగిందిపోయి నకరాల్‌ చేస్తానావ్‌…మూస్కో”
”ఏందే మాటల్‌ బాగత్తానై”
”…..”తమాయించుకుంది సురేఖ.
”గా జేబుల నాల్గువేలున్నై తీయ్‌…”
”ఎక్కడియీ నాల్గువేలు…”
”ఎవడో యిచ్చిండు నీకేందే…చెప్పినట్టు చేయ్‌….తీసి లోపల దాయ్‌…” గదమాయింపు.
”పాపపు ముండాకొడ్కా…గీ పాపపు సొమ్ము చేయబట్టే నా పిల్లల మాట పాయె, చెవుల్‌పాయె..ఎందుకురా….వద్దంటే ఇనవుగదరా…లంచగొండి ముండకొడ్కా…”బాలకృష్ణ చొక్కా గల్లా పట్టుకొంది సురేఖ.
”పా….బైటికి పా…గీ పాపపు సొమ్ము నా యింట్లద్దు. గా జనసేన పోరగాండ్లు నెత్తి నోరుపెట్కొని ఒర్రుతాండ్లుగాదురా….లంచం వద్దు…అవినీతి వద్దు అని…చదువుకున్నవో సిగ్గుశరం లేదు…పో..బైటికి పో…లంచం తీసుకుంటే నా యింట్లకు రావద్దు…పో ముండకొడ్క…” బాలకృష్ణను బైటికి వీధిలోకి నెట్టి లోపల్నుండి తలుపులుగొళ్లెం వేసుకుంది సురేఖ.
ఎందుకోగాని ఆమెకు పిచ్చి ఆనందం….తృప్తికలిగాయి.
ప్రతిఘటించి..తను ఒక ప్రశ్నగా మారినందుకా….?

***

ఇంజనీరింగు రెండవ సంవత్సరం చదువుతున్న మాధవికి మూడు రోజులుగా కంటికి కునుకు లేదు.
ఆమెకు అవమానంగా ఉంది. సిగ్గుగా ఉంది. నలుగుర్లో తలెత్తుకోలేకుండా ఉంది. చాలా అసహనంగా,కోపంగా, అసహ్యంగా కూడా ఉంది.
ఎవరిపైనా…ఎందుకు….?
రెండ్రోజుల క్రితం తన తండ్రి ప్రముఖ ప్రొఫెసర్‌ రాంనివాస్‌ కొప్పుల…ఎమ్సెట్‌ కన్వీనర్‌..ఎంతో పెద్ద విద్యావేత్త… ముప్పయ్‌ రెండేళ్ల సర్వీస్‌….ప్రతిష్టాత్మకమైన ఎమ్సెట్‌ పరీక్షలకు సాధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించవలసిన గురుతర బాధ్యత.
కాని ఏంచేశాడు…పరీక్ష ప్రారంభమైన అరగంట లోపే రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు. ఇంజనీరింగు పేపర్‌ లీక్‌…జిరాక్స్‌ కాపీలు…పంపకాలు…డబ్బులు…వేటలు….కట్టలు కట్టలు..చేతులు మారటాలు..
తనకు ముందురోజే డౌటొచ్చింది…యింటికి ఎవరెవరో ఏవో వేళకాని వేళల్లో కార్లలో… మోటార్‌బైక్‌లపై..బ్రీఫ్‌ కేస్‌లు….డబ్బు వాసన…ప్రైవేట్‌ కార్పొరేట్‌ కాలేజ్‌ల వాసన…ఏదో గుసగుస…వ్యాపారం.
బెడిసిందెక్కడో…పేపర్‌ లీక్‌..ద్రోహచర్య బట్టబయలు…
నాన్న అరెస్ట్‌…లాకప్‌…కస్టడీలోకి తరలింపు…విచారణ.
ఎమ్సెట్‌ పరీక్ష వాయిదా..మళ్ళీ నిర్వహించేందుకు ప్రభుత్వ అంగీకారం.,
కాని లక్షలమంది విద్యార్థుల మానసిక స్థితి…టెన్షన్‌,…వాళ్ల ఉద్వేగాలు…ఎవరి తప్పు…ఎవరు బలి…ఎవరి నేరం…ఎవరికి శిక్ష.
మాధవికి చాలా అసహ్యంగాఉంది తన తండ్రిపై…అవినీతి పనులు చేస్తుంటే వాడితో కలిసి కాపురం చేస్తూ పాపపు డబ్బుతో కులుకుతున్న అమ్మపై…తమ ఇంట్లోనే ఉంటూ డిఎస్పీ హోదాలో ప్రతినిత్యం ఎందరినో యింటికి రప్పించుకుని కట్టల క్కట్టలను లంచంగా స్వీకరించే తన చిన్నాన్నపై…వారి లంచం డబ్బుతో స్లీవ్‌లెస్‌ జాకెట్టు వేసుకుని జులాయిగా తిరిగే చిన్నమ్మపై…అందరిపై..తన కుటుంబ సభ్యులందరిపై.
కాని..ఎలా….ఎలా..దీన్ని పరిష్కరించాలి.
”మాధవీ….మీ నాన్నేనట గదా…నిన్నటి ఎమ్సెట్‌ పేపర్‌ లీక్‌…”
ప్రశ్నలు-ప్రశ్నలు-తలదించుకుని నడవడాలు…సిగ్గుతో కుచించుకుపోవడాలు’
‘నాన్నా నీకు ఈ కుక్క బుద్దెందుకు…నీకున్నది ఒక్కగానొక్క కూతుర్ని నేనే.. అసలు నీ దగ్గరున్న నీ డబ్బే నీకు ఎక్కువ…యింకా మందికొంపలు ముంచే ఈ దొంగ డబ్బెందుకు. పైగా పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉన్న విద్యావేత్తవు…తగునా యిది. నీకు సిగ్గెందుకు లేదు…బుద్దెందుకు లేదురా ఓ దుర్మార్గపు, ఛండాలపు నాన్నా”
ఎన్నట్నుండి డిఎస్పీ చిన్నాన్న..యింకెవడెవడో ఒకటే హైరాన పరుగులు….అటురుకు..యిటురుకు..ఎవరికో ఫోన్‌ చేయ్‌..ఎవడ్నో బతిమాలు…
తెలుసు తనకు …నాన్న అనబడే వీడికి ఈ దౌర్భాగ్యపు దేశంలో ఏ జడ్జో అమ్ముడుపోయి బెయిలిస్తాడు. మళ్లీ వీడు బాజాప్తాగా యింటికి తిరిగొస్తాడు.
అందుకే కసిగా…దుఃఖంగా.. అసహ్యంగా…పరమ క్రూరంగా ఎదురుచూస్తోంది మాధమి మూడు రోజుల్నుండి… నిద్రాహారాలు మాని లోలోపల కుమిలిపోతోంది.
సరిగ్గా..తెలతెల్లవారుతుండగా…ఉదయం ఐదున్నర-ఓకారు యింటి ముందు ఆగి ఓ తలుపు రెక్క తెరచి…లోపల్నుండి ప్రొఫెసర్‌ రాంనివాస్‌ కొప్పుల బెయిల్‌పై విడుదలై దిగి నిస్సిగ్గుగా యింటికి చేరుతూ
మెరుపులా…రేచుకుక్కలా ఉరికొచ్చింది మాధవి తండ్రి పైకి…చేతిలో డిఎస్పీ డెన్మార్క్‌ పిస్టల్‌ క్షణంలో బుల్లెట్ల వర్షాన్నికురిపించి…
శరీరం తూట్లు, తూట్లు…గావుకేక…మరుక్షణం నిశ్శబ్దం.
లక్షల మంది విద్యార్థుల జీవితాల ట్రాజడీ సంగతేమిట్రా తండ్రి బాస్టర్డ్‌…ఎన్ని జనసేనలొస్తే, మార్తారురా మీరు ముండాకొడ్కుల్లారా…బుద్దిరాని, బుద్ది లేని దరిద్రుల్లారా చావండి…” మాధవి శపిస్తోంది.
ఎదురుగా ఎర్రగా రక్తం…మధ్య ప్రశ్న ఆకారంతో రాంనివాస్‌ శవం.
మాధవి నేలపై మోకాళ్ల మీద కూర్చుని పిస్తోలు అలాగే చేతిలో ఉండగా ఘొల్లున ఏడుస్తోంది.
ఎందుకు….?

***

ఎప్రిల్‌ పదమూడో తేది…ఉదయం పదకొండు గంటలు.
వరంగల్లు నగరం…జనసేన ‘కేంద్రకం’. కార్యాలయంలో ఓ వెల్లివిరుస్తున్న పండుగ..నగరం నిండా రోడ్లపై ఎక్కడ బడితే అక్కడ జనం సంబరాలు…మిఠాయి పంపకాలు. బాణసంచా కాల్చడాలు..మైకుల్లో జనసేన పేద, సాధారణ కార్యకర్తల చైతన్య గీతాలు…ఒక నూతన ఉత్సాహం…విజయ మహోద్వేగం.
రాత్రి పొద్దుపోయే దాకా శాసనసభా స్థానాల ఫలితాల ప్రకటన కొనసాగుతూనే ఉంది. తెల్లవారగానే పెద్ద పెద్ద పతాక శీర్షికలతో దినపత్రికలు.
‘నూతన శకారంభం..’
‘భారత చరిత్రలో ఓ కొత్త మలుపు’
‘ప్రజల విజయం…అవినీతి అంతం’
‘మరో కొత్త చరిత్ర…జనసేన చారిత్రాత్మక విజయం’
టి.వి.లు…..మేధావుల చర్చలు…విశ్లేషణలు…అంతటా కోలాహలం.
”రెండు వందల ఎనభై రెండు స్థానాల్లో జనసేన అభ్యర్థుల తిరుగులేని విజయం-ఓడిపోయిన అభ్యర్ధులందరి డిపాజిట్లు గల్లంతు”
బ్రేకింగు న్యూస్‌
‘ప్రజల స్వప్నం సాకారమైన వేళ’
‘ఒక చీకటియుగం ముగిసింది. ప్రజల విజయంతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం’
‘అప్పులు లేని…దోపిడీ లేని స్వచ్ఛమైన పాలనకు హామీ’
‘ఒక నూతన రాజకీయ సంస్కృతికి రూపకల్పన’
ఎన్నో ఆశలు..ఎన్నో అంచనాలు..ఎన్నో కలలు.,
రాత్రికి రాత్రి రాష్ట్రం నలుమూలల నుండి స్వతంత్ర అభ్యర్థులుగా, జనసేన ఆమోద ముద్రతో, జనసేన హామీపై గెలిచిన రెండువందల ఎనభై రెండు మంది శాసనసభ్యులను జనసేన రక్షక దళాలు ప్రాణ సమానంగా కార్లలో తీసుకుని వచ్చి ‘కేంద్రకం’లో హాజరుపర్చాయి.
లేలేత ఎండ…విశాలమైన ప్రాంగణం…నిండా పచ్చని గడ్డి…చెట్లు…పూల మొక్కలు…అంతటా క్రమశిక్షణ నిండిన వ్యక్తుల కదలికలు.
సెంట్రల్‌ హాల్‌లో నూతన సభ్యులందరూ తమ తమ కుర్చీల్లో ఆసీనులయ్యారు. వెంటనే ఉద్వేగ భరిత క్షణాల మధ్య వేదిక పైకి నలుగురు వ్యక్తులు ప్రవేశించారు. రామం,క్యాథీ, డాక్టర్‌ గోపీనాథ్‌, మూర్తి గారు..ఎటువంటి అట్టహాసం లేకుండా.
అప్పటికే శాసనసభ్యులందరికీ జనసేన తరపున శుభాకాంక్షల లేఖలను, పుష్ప గుచ్ఛాలను పంపిణీ చేయించాడు శివ.
మైక్‌లో డాక్టర్‌ గోపీనాథ్‌ మాట్లాడ్డం ప్రారంభించారు…’మిత్రులారా మీకందరుకు జనసేన పక్షాన మరోసారి విజయ శుభాకాంక్షలు. జనసేన అతి తక్కువగా మాట్లాడ్తుంది. ఎక్కువగా పనిచేస్తుంది. ఆ పరంపరలో భాగంగా మన జనసేన వ్యవస్థాపకులు రామం మీకు శుభాకాంక్ష సందేశం వినిపిస్తారు. తర్వాత కొత్తగా ఎన్నుకోబడ్డ మొత్తం శాసనసభ్యులు పన్నెండు బస్సుల్లో మన జనపథం ప్రాంగణం నుండి హైద్రాబాద్‌ శాసనసభా ప్రాంగణానికి వెళ్తారు. అక్కడ లాంఛనంగా గవర్నర్‌ గారిని కలిసి తదుపరి నూతన ప్రభుత్వ నిర్మాణ కార్యాన్ని నిర్ణయించుకుంటారు. అని చెప్పి కూర్చుని..
రామం నిలబడ్డాడు. నిశ్శబ్దంగా, వినమ్రంగా రెండుచేతులా జోడించి అందరికీ నమస్కరించి.,
”మిత్రులారా..మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు..జనసేన ఆమోదముద్రతో పోటీ చేసిన అందరూ గెలిచారు. ఒక్కరు కూడా ఓడిపోలేదు. పైగా ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యేంత భారీ మెజార్టీతో గెలిపించారు. అంటే ‘జనసేన’ ఆలోచనలను, విధానాలను ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో, మనమీద ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకొన్నారో సృష్టమవుతోంది. ఒకటే మీకు వినమ్రంగా విన్నవించుకుంటున్నాను…మనం..మనందరం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేద్దాం. ఒక కొత్త చరిత్రను, నీతిమయమైన భవిష్యత్తును నిర్మిద్దాం. భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ”ఇండిపెండెంట్స్‌ రూల్డ్‌ స్టేట్‌” పరిపాలనలోకి రాబోతోంది. దేశం, ప్రపంచం యావత్తూ ఎంతో ఆసక్తిగా మన పనితీరును పరిశీలిస్తోంది. జాగ్రత్తగా ప్రగతి పథంలో అడుగులు వేద్దాం కలసికట్టుగా.
మేము…జనసేన సారథ్య సంఘ సభ్యులం నల్గురం నాల్గు దిక్కులమై, లక్షమంది కార్యకర్తలు మీ చుట్టూ ఒక వలయమై కవచమై అన్నీ పదవులకూ, అధికారాలకూ అతీతంగా ప్రజల పక్షాన మిమ్మల్ని డేగ కళ్లతో గమనిస్తూనే ఉంటాం. యిచ్చిన మాట ప్రకారం నిజాయితీగా పనిచేసి ప్రజల రుణం తీర్చుకోండి…జైహింద్‌”.
చప్పట్లు…కొద్దిసేపు.
అందరూ ఒకరి వెంట ఒకరు క్రమశిక్షణతో బయటికి ఆవరణలోకి వచ్చి కార్యకర్తలు సూచించిన స్థానాల్లో నిలబడ్డారు.
ఎదురుగా అరుగుపై రామం, క్యాథీ, గోపీనాథ్‌, మూర్తిగారు…శివ…నిలబడి.,
ముందు…అందంగా అలంకరించిన గద్దెపై జెండాకర్రకు కట్టిన మువ్వన్నెల జెండా.
”మూర్తిగారిని మన జాతీయ జెండాను ఆవిష్కరించవలసిందింగా ప్రార్థిస్తున్నాను” అన్నాడు రామం.
నాల్గడుగులు ముందుకు నడిచి..సీనియర్‌ పాత్రికేయుడు ‘అగ్ని’ వార్తా ఛానెల్‌ అధినేత మూర్తి పులకించిపోతూ జాతీయ జెండాను నూలు తాళ్లు లాగి  వినీలాకాశంలోకి ఎగరేసి…
భారత పతాక ఒక చారిత్రాత్మక నూతన అధ్యాయానికి ప్రతీకగా…గర్వంగా, ధీమాగా ఉజ్జ్వలంగా ఎగుర్తూండగా..
”వందేమాతరం…” గీతాలాపన ప్రారంభించింది స్వయంగా క్యాథీ, బిల్టిన్‌ మైక్రోఫోన్‌లో.
వందలమంది చేతులు దేశంపట్ల భక్తిప్రపత్తులతో జాతీయ పతాకానికి వందనం చేస్తూ,
అందరి కళ్లలోనూ ఓ బంగారు రంగు కల…ముత్యమంత ఆశ…కొండంత ఆత్మవిశ్వాసం…ఓ సుదీర్ఘ అవిశ్రాంత నిరంతర ప్రయాణం వైపు చూపు.

***

అప్పుడు…ఆ క్షణం,
‘అగ్ని’ టి.వి.చానల్‌లో ఆ రోజు ‘రాజకీయ ముఖచిత్రం’ అనే అంశాన్ని ముగ్గురు వ్యక్తులు విశ్లేషిస్తున్నారు.        ఒకరు…ఆబిడ్స్‌లో ఫుట్‌పాత్‌పై అరటిపళ్లమ్మే యాకూబ్‌, మరొకరు..సికింద్రాబాద్‌, అంబాసిడర్‌ లాడ్జ్‌లో పనిచేసే బాయ్‌ మల్లేశం, ఇంకొకరు…ఓల్డ్‌ సిటీ మక్కా మసీద్‌ దగ్గర కంకులు కాల్చి అమ్మే యాకమ్మ.
యాంకర్‌ ఆనందరావు అడుగుతున్నాడు. ”ఈ పెనుమార్పును మీరెలా అర్థం చేసుకుంటున్నారు”
అరవై ఆరేళ్ల యాకమ్మ మాట్లాడ్తోంది..ఉద్వేగంగా.

( సమాప్తం)

నాకంటూ నేను ఏమీ లేనని…!

swathi

 

 

 

 

 

లేత వెలుగు కిరణం కూన ఒకటి తారట్లాడుతూ వచ్చి

కనురెప్పల తలుపులు నాజూకు ముని వేళ్ళతో తట్టి

కలల పుష్పకం నుండి సుతారంగా ఎప్పటి త్రిశ౦కులో

దింపుతుంది.

 

ఉందో లేదో తెలియని అస్తిత్వానికి కాస్త కాస్త వశమవుతూ

రాత్రి నిశ్శబ్దపు గాలివాన చీకటి హోరులో రాలి పడిపోయిన కలలు

ఒక్కొక్కటిగా ఏరుకుంటూ , ఎంచుకుంటూ

నలిగిన దారే అయినా కొత్త నడక ఆరంభమవుతు౦ది

 

గతకాలపు ఆనవాళ్ళు ఎదురు దెబ్బల మచ్చలూ

ముళ్ళ పొదల పలకరింపులూ వీపున వేసుకు

అడుగడుగునా ఒంగిలేస్తూ అనుభూతుల ఆయాసంలో

ఊపిరందక ఉక్కిరి బిక్కిరవుతూ

స్వంతం కాని ఉనికిని నాదని భ్రమపడుతూ

ఎవరో కళ్ళాలు అదలించే ప్రయాణానికి

నన్ను నేను శతవిధాల సమాయత్తం చేసుకుంటూ-

 

ఎవరో నాటి పోయిన చెట్లన్నీ నిటారుగా నిలువెత్తు సాక్షాలుగా

రెప్పవాల్చకుండా చూస్తున్నా కాసిన కాయలన్నీ నావే అనుకుంటాను

 

పిల్ల కాలువల్లా సాగి సాగి నదీమతల్లులై పరవళ్ళు తోక్కే నదులన్నీ

నా స్వంతమేనంటాను .

 

అంగుళం అంగుళం కోకొలుచుకుంటూ ఆక్రమించుకుంటూ

అధునిక వామనావతారంలోకి దూరతాను

 

అంతా ముగిసిన అసుర సంధ్య చూపు మసకేసాక

నాది కాని ప్రతి దానికోసం నాది కాని జీవితం వెచ్చించి భాగించి

వెయ్యి న్నొక్క సమస్యల్లో తబ్బిబ్బయాక

కరిగి కరిగి ఎక్కడో ఏ బీటలు వారిన హృదయాల్లోనో

అక్షరాలై ఇ౦కిపోయాక తెలిసింది

 

నాకంటూ నేను ఏమీ లేనని.

 

 – స్వాతీ శ్రీపాద

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వేషాలు వేసిన గొంగళి పురుగులు

saif

 

 

 

 

 

రాత్రి  వెన్నెల్లో నాలుక చాపి వెన్నెల రుచి చూసావా ఎప్పుడైనా
ఆకాశం అందకపోయినా అద్భుతంగా ఉంటది కదా.
గులాబి పువ్వు ఒకటే తెచ్చావా
లేదు చదవాల్సిన  పుస్తకం కూడా ఒకటి ఉంది
అక్కడ ఆ చెట్టుకిందకు వెల్దామా
ఆ జాబిల్లి వెనక్కు ఐనా సరే నేను సిధ్ధం
నాకోసం నిన్న చాలా ఎదురు చూసావా
ఈ రోజు నిన్ను చాలా చూడాలి అనుకుంటున్నా
నేను నీకో విన్నపం చెయ్యాలనుకుంటున్నాను
నేను నిన్నని తిరిగి తెచ్చీవ్వలేను సారి
అసలు నా అభిప్రాయం వినవేంది
నీ గుండెల పై చెవి పెట్టి వినడానికే కదా వచ్చింది

1380399_10201616179779262_1021311603_n
నాకు ఏదో వెంటాడుతుంది
నువ్వే దాన్ని వేటాడేసెయ్యి
అందరిలా మాట్లాడకు ఎప్పుడూ
ఫకీర్ల భాషా ఎప్పుడూ అంతే తెల్వదా
అవును మీ అరుగు మీద ఎవరో పడుకోని ఉన్నారేంటి
అతను పడుకున్నంత సేపు మేము మా అరుగు అని అనుకోలేదు
చీపురుంటే బాగుండును ఊడ్చి కూర్చునేటోళ్ళం
మట్టి మనుషులం మనకు మట్టితో భయమెందుకు
అది కాదు తారలు ఏమన్నా అనుకుంటాయేమో
పూలు ఏమనుకుంటాయో పట్టించున్నామా ఎప్పుడన్నా
నువ్వు మొదలు పెట్టేసరికి ఆవలింతలు వస్తుంటాయి
రానీ తలుపుల దగ్గర నేను చూసుకుంటాలే
మొన్న అంతే చెప్పావ్ కాని పాలంతా పోంగిపోయాయి
పావురాలు ఎగిరిపోతే నాదేం తప్పులేదు చెప్పా చెప్పాకదా
ముద్దులు పెట్టేడప్పుడు షరతులు గుర్తున్నాయి కదా
నీకు ఝుంకాలు చాలా బాగుంటాయి ఎందుకు తీస్తుంటావ్
అసలు నిన్ను కాదు నన్ను నేను అనుకోవాలి
ఆ దేవతలు కూడా ఇలా అనుకుంటారంటావా
టైం అయ్యింది నేను వెళ్ళాలి
రేపు ఇదే భూమి మీద కలుద్దామా

-సైఫ్ అలీ గోరే సయ్యద్

చిత్రం: అన్నవరం శ్రీనివాస్

పదిహేడు మంది అమ్మల కథలు!

amma kathalu

 

అమ్మ ను గూర్చి కథలూ కవిత్వాలూ ఇవేవీ కొత్తవి కావు మన సాహిత్యానికి. కొన్ని సంకలనాలు కూడా వచ్చాయి. ఐనా ధైర్యం చేసి ” అమ్మ కథలు” అని పేరున సమ్మెట ఉమా దేవి గారు రాసిన కథల  పుస్తకం ఇటీవలే చదవడం జరిగింది. నిజానికి అమ్మ కథలంటే ఎప్పటిలానే ఉంటాయనుకుని చాలా యధాలాపంగా మొదలుపెట్టిన నేను మొత్తం కథలన్నీ ఆగ కుండా చదివేశాను. ఇది అతిశయోక్తి కాదు ఒక తీయని అనుభూతి.

 

ఒక్కొక్క కథ ఒకో విధంగా వైవిధ్యంగా ఉంది చాలా ఆసక్తిగా చదివించాయి. ఈ సంపుటిలోని 17 కథలు చాలా బాగున్నాయి అనేసి ఊరుకోలేము. ఎందుకు బాగున్నాయో కూడా ఒక రెండు మాటలు మీతో పంచుకుందామని నా తాపత్రయం.

అమ్మ అంటే సెంటిమెంట్ , అమ్మంటే ఒక త్యాగ శీలి , అమ్మంటే అన్నీ వరాలిచ్చేసే దేవత అలాంటిది సమ్మెట ఉమా దేవి అమ్మ మాత్రం నిజమైన సహజమైన రక్త మాంసాలున్న మనిషి. హృదయం , దేహం , ఆలోచన కలిగిన ఒక మేధావి , కరుణామృత మూర్తే కాదు కరుకు నిర్ణయాలను తీసుకుని సమాజాన్ని  ఎదిరించి నిలబడ గల ధీశాలి.

 

పదిహేడు కథల్లోనూ పదిహేడు అమ్మలు కనబడతారు. భర్త చనిపోయే ముందర ఎందుకు విడాకులు తీసుకుందా తల్లి అని పిల్లలందరూ సందేహ పడే ఒక కథ. అందరూ అమ్మని నానా మాటలూ అంటున్నా ఎందుకు భరించిందో ఆ అమ్మ మాటల్లోనే విని హతాశులైన పిల్లలు. త్యాగమంటే కేవలం ఉన్న సంపద ప్రేమ ఇవ్వడమే కాదు బాధ్యత ను నెరవేర్చడం కూడా . భర్త పైన మమకారం  లేక కాదు , కానీ పెళ్లి కావల్సిన ఆడ పిల్లలికి శోభాస్కరంగా పసుపూ కుంకుమలతో సాగనంపాలంటే తాను సుమంగళి గా ఉండాలి అన్న  ధృఢ నిశ్చయం తో అపవాదులకోర్చి ఆడపిల్లల క్షేమాన్ని ఆశించిన , నెరవేర్చిన తల్లిని దర్శింప చేసేరు ఉమా దేవి.

ఈ కథ ఎందుకో చాలా కదిలించింది నన్ను. ఇందులో చాలా విషయాలున్నాయి. ఆడపిల్లకి తల్లి అవసరం ఎంత ఉందో తెలుపుతూనే , ఇంకా మారని మన సమాజం లోని ఈ బోలు సాంప్రదాయాలను ప్రశ్నించే కథ ఇది .

 

అమ్మ కథల్లో కొన్ని కథలు హృదయాన్ని ద్రవింప జేసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా “సహాన” కథలో ఉమా దేవి గారు చూపించిన ప్రతీకాత్మకత పాఠకులను చాలా ఆకట్టుకుంటుంది. చిన్న పిల్లగా ఉన్న పాప అమ్మా వీధిలో కుక్కలే అంటూ ఝడిసి పరిగెత్తు కొస్తే , కంప్లెయింట్ ఇచ్చి ఆ కుక్కల బారినుండి తప్పించిన తల్లి , అమ్మాయి యుక్త వయస్కురాలైనాక ఎందరో మగ వాళ్ళు ఏదో ఒక సాకుతో ఆమెని తాకడానికి ప్రయత్నించడమూ , అది చెప్పుకోలేక ఆ పాప తల్లికి చెప్పినప్పుడు ఎలా తన బిడ్డని రక్షించుకోవలో తెలియని అయోమయ స్థితి లోని ఆ తల్లి మనసులోని వేదనని ఎంతో ఆర్ద్రంగా ఆవిష్కరించారు రచయిత్రి. ఒక్కసారిగా మన కళ్ల ముందు ఎన్నో ఘాతుకాలు ఆడపిల్లల పై జరుగుతున్నవి గుర్తొస్తాయి, తల్లి తండ్రులు ఎంత వరకు రక్షణ ఇవ్వగలరు? అన్నది మిల్లీయన్ డాలర్ ప్రశ్న . మొన్న బలై పోయిన నిర్భయ , నిన్నటి ఆయెషా ఇలా ఎందరో పసి మొగ్గలు తుంచబడి రాలిపోవడం గుర్తొస్తుంది.

1239667_473249809449813_888003086_n

 

అమ్మ కథల్లోని మరో ప్రత్యేకత ఏంటంటే అన్నీ అమ్మ ప్రేమనే కాక అమ్మ ప్రేమను ఆశించే పిల్లల మనస్సులు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకి ఒక కథలో ఒక పాప తన అమ్మ తనతో ఉండాలనే ఆస కొద్దీ ఊరికే కడుపు నొప్పి అని ఏడుస్తూ గాబరా పెడుతుంది. డాక్టర్ ఈ పాప అల్లరి కనిపెట్టి ప్రశ్నించినప్పుడు నాకు బాలేక పోతే అమ్మ నన్నే అంటి పెట్టుకుని ఉంటుంది కదా అని ఇలా చెప్పేను అని చెప్పినప్పుడు , వాస్తవం లో ఎందరో ఉద్యోగస్తులైన తల్లులు, పనుల్లోకి వెళ్లాల్సిన తల్లులు పిల్లలల్ని విడిచి పెట్టి వెళ్లాల్సిన తల్లుల మనసులు కరిగి నీరౌతాయి. అంతే గాక పిల్లల మనసులను కూడా మనం తెలుసుకునే లా ఉంది ఈ కథ.

 

తాను ఎన్నో కథలు రాసినా అవి సంకలనంగా వెయ్యమని వాటిల్లో అమ్మ ప్రస్తావన ఎక్కువగా వచ్చినందున వాటికి “అమ్మ కథలు” అనే పేరు పెట్టమని సూచించిన మంచి రచయిత నవ్య సంపదకులు జగన్నాధ శర్మ కి ముందుగా కృతజ్ఞతలు చెప్పడం ఉమా దేవి గారి సంస్కారాన్ని తెలియజేస్తుంది.

 

కథ ఒక సహజ సిద్ధంగా చెప్పబడేది కనుక , అలానే ఆమె కథలు ఒక్కో జీవితాన్ని గూర్చి మనతో చెప్పినట్టుగానే సాగుతాయి. ఎక్కడా అసహజంగా , అతిశయోక్తిగా మాట్లాడే ఏ పాత్రా మనకి కనిపించదు. ఎందుకంటే ఇవేవీ పాత్రలు కావు వాస్తవ జీవితాలు . అందుకే అమ్మ కథలు చదివితే మనకి అమ్మ ప్రేమే కాదు చాలా  విషయాలు తెలుస్తాయి . మనసు , మెదడు కదిలించే కథలుగా ఈ మధ్య వచ్చిన కథలలో ఉమాదేవి  కథలు పది కాలాలు నిలబడాలని నిలబడతాయని ఆశిస్తున్నాను.

 

“అమ్మంటే” ఎన్నో రూపాలలో  చూపించారు రచయిత్రి. ప్రాణం రక్షించిన ప్రాణదాత , అమ్మంటే ధైర్యం , అమ్మంటే బహురూపాలలో తన సంతానాన్నే కాదు ఎందరికో సహాయం చేసే దేవత.

అందుకే అమ్మ కావడం గొప్ప విషయమే కానీ అమ్మతనం కలిగి ఉండటం మరింత గొప్ప విషయం. ఈ అమ్మతనాన్ని తన కథల్లోని అమ్మల్లో ఆవిష్కరించారు ఉమా దేవి.

 

కథలన్నిటిని వర్ణించి విసిగించడం నాకు ఇష్టం ఉండదు . ఆమె రాసిన కథల్లోని సారాన్ని చెప్పడం , మృదు మధురమైన సరళమైన ఆ శైలి ఎలాంటి వారినైనా ఆకట్టుకోగల ఆ చెప్పే నేర్పు. వెరసి అన్నీ కలిసి “అమ్మ కథలు” గా మనముందు అక్షరాల రూపం లో పొందు పరిచి అందించిన ఈ స్నేహ మయి కి కృతజ్ఞతలు . మంచి కథలు రావడం లేదు అనే సాహితీ ప్రియులకు ఉన్నాయమ్మా ఉన్నాయి మా మంచి కథలు సమ్మెట ఉమా దేవి గారి “అమ్మ కథలు ” అని చెప్పాలనిపించి ఈ రెండు మాటలూ .

మరిన్ని మంచి కథలు అమెనుండి ఆశిస్తూ ….ప్రేమతో

జగద్ధాత్రి

1231658_539630582777569_2120927918_n

ఇంకా అదే సాంగా?!

10335815_4286155369203_550069818_n– మృత్యుంజయ్

11937_578811308820340_1396284388_n

బతుకమ్మ పాట

drusjua drisjua 32నగరం అన్నది అలిశెట్టి ప్రభాకరుడికి ఒక రకం.
చార్లెస్ డికెన్స్ కు మరో రకం.అది ఎవరైనా, వారికి ఏమైనా
బతుకు మాత్రం సాహిత్యం, అది నగరమైనప్పటకినూ.నా వరకు నాకు హైదరాబాదు ఒక బతుకమ్మ.
చెరువులు కుంటలు తోటలు విస్తారంగా ఉన్న పల్లెటూరు.
ముఖ్యంగా బతుకును పువ్వు వలే చూసుకుంటూ ఉన్నందున ఇదొక ఆటా పాటా కలగలసిన పండుగ, సాహిత్యం అయినందున నా బోటి బిడ్డకు పట్న జీవనమూ తీరొక్క పూవుల దృశ్యాదృశ్యం.రానైతే, పండుగలో సంబురమే కాదు, విషాదమూ ఉన్నది, ఈ చిత్రం వోలె!

+++

ఎందుకో తార్నాక వెళ్లి తిరిగి రాం నగర్ గుండు వైపు వస్తుంటే పోలీస్ స్టేషన్ ముందరి ఇల్లనుకుంట…ఇట్ల ఆ పెద్ద మనుషులు ఒకరి వెతలు మరొకరికి చెప్పుకుంటూ ఉన్నరు. కళ్ల నీళ్లు తీసుకుంటూ కనిపించారు. మాటలు వినరానంత దూరంలో ఉన్నానుగానీ, అర్థమవుతున్నది ఒక యాతన…

ఆగి పోయాను.

తాతమ్మ కనిపించింది. నాయినమ్మ యాదికొచ్చింది. సంతోషం వేసింది…ఇంకా వీళ్లున్నరని!
ఇట్లా ఒకరికొకరు తోడుగా ఎవరో ఒకరున్నరని.
అదే సమయంలో విచారంతో గుండె కునారిల్లింది, వాళ్లు ఎప్పట్లాగే తమ బాధల్ని వెళ్లగక్కుకోవడానికి అని ఇలా తమ వయస్కులను వెతుక్కుని ఇట్లా ఒక అరుగు మీద కూచొని ఒకరి వెతలు మరొకరికి చెప్పుకుంటూ సేద తీరుతూ ఉన్నరని!
తప్పదా అనిపించింది.
తప్పదనీ అర్థమైంది.

ఇదొక స్రవంతి.
కన్నీళ్ల స్రవంతి.
బతుకు పాటల ఒరవడి.

ఎవరైనా అన్ని దశలూ గడిపాక చివరి అంకంలో ఇలాగే ఉంటారు కదా అనిపించింది.
ఎన్ని అనుభవాలో…అన్నిటికీ ఒక కథ ఉంటుంది కదా… వెత ఉంటుంది గదా అనిపించింది కూడా…
తరగని గనిగా జీవితం ఎప్పుడూ చెప్పుకోవాలనుకుంటూనే ఉంటుందనీ అనిపించింది, వినేవాళ్లకూ ఉంది కనుక ఇదే కథ!

అట్ల నిలబడి వాళ్లను ఎంతమాత్రం డిస్ట్రబ్ చేయకుండా చాలా ఫొటోలు తీసుకున్నాను.
తీసుకుంటుంటే ఎన్నో విషయాలు.

నెరసిన జుట్టు…
వాళ్ల కట్టూ బొట్టూ…
ఆ చీరలు…అంచులు.
ఆధునికతలోకి వచ్చిన వాళ్ల కాలి చెప్పులు.

ఇంకా అరుగులు.

సన్నిహితంగా వాళ్లు కూచున్నతీరు.
ఒకరు చెబుతుంటే ఒకరు వింటున్నరీతి.
శ్రద్ధ, సహానుభూతి. ఓదార్పు. ఆత్మగల్ల జీవన సాహచర్యం.చూస్తుంటే వెనక్కి వెనక్కి వెళ్లని వాళ్లుండరు.
తమ పెద్దలను, తల్లులను యాది చేసుకోకుండా ఉండలేరు.ఒకటొకటిగా చిత్రీకరించసాగాను.
ఒకనాడు తాతమ్మలు ఇట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు చూశానుగానీ అది సానుభూతితో! నిస్సహాయంగా!
కానీ, ఈసారి మాత్రం బాధ్యతగా తీశాను.
ఎందుకంటే, నిదానంగా విషయాలూ అర్థమవుతూ ఉన్నయి గనుక.
ఇది నా ఇంటి కథే కాదు గనుకా.అసలికి మనిషిగా ఉండాలంటే ఇదంతా ఉంటుందని తెలిసిపోయింది.
ఇట్లా పంచుకోవడంలోనే బతుకు ఉన్నదని అర్థమయింది.
అందుకే పాటలు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో…
+++అయితే, ఈ చిత్రానికి వచ్చినప్పుడల్లా నాకు అర్థం కాని దొకటే. కానీ, ప్రయత్నించాను.
ఏది ఉత్తమ చిత్రం?చాలా తీశాను మరి.
అందులో ఇద్దరూ దగ్గరగా ఉన్న చిత్రం ఒకటి.
అందులో మరింత స్పష్టంగా అవతలి పెద్ద మనిషి కన్నీళ్లు కానవచ్చే చిత్రం అది.
ఆమె ఉబ్బిన కన్నుల నుంచి విషాదంగా కన్నీళ్లు రాలబట్టిన, జాలువారబట్టిన చిత్రం అది.ఒక లాంగ్ షాటూ ఉంది.
అందులో వాళ్లిద్దరూ చక్కగా కంపోజ్ అయి ఉన్నారు.
వాళ్ల ప్రపంచంలో కన్నీళ్లు తప్పా మరేవీ లేనట్టు ఉన్న చిత్రం అది.ఇంకా ఒక లాంగ్ షాట్, మీరు చూస్తున్న ఈ చిత్రమూ ఒకటి. దాన్నీ తీశాను.
ఇందులో వాళ్లతో పాటు మరి ఇద్దరూ ఉన్నారు.

+++

ఇందులో చిత్రానికి సంబందించిన ప్రధాన ఇతివృత్తమే కాదు,
వీళ్ల వెనకాల ఒక నడి వయస్కురాలు, బట్టలు ఆరవేస్తూ ఉన్నది.
ఆమెకు కాస్త ముందు ఇంకొక అమ్మాయి, చేతిలో ఫోన్ ధరించి ఉన్నది.
ఈ చిత్రం ముఖ్యం అనుకున్నాను. ఎందుకంటే, తరతరాలు ఉన్నాయి గనుక.

వృద్ధతేజం. ముదిమి, యువతి.
అందరూ స్త్రీలే.

కంపోజిషన్ లో మూడు తరాలు ఉండగా తొలి తరం కన్నీళ్ల పర్యంతమై ఉన్నది.
ఇదే నా ఉత్తమ చిత్రం అనుకుంటూ ఈ వారం దృశ్యాదృశ్యం ఇదే అనుకుంటున్నాను.

+++

కానీ, ఇదొక చిత్రమే కాదు. బతుకుల ఖండిక.
ఇందులోంచి పది పదిహేనేళ్లలో లేదా క్రమక్రమంగా ఈ వృద్ధులు అదృశ్యమైతరు.
వెనుక ఉన్న ఆమె మిగులుతుంది.
తనకూ స్నేహితులుంటరు. తానూ ఇలాగే కాకపోతే కొద్ది తేడాతో ఇంకొకరితో ముచ్చటిస్తూ ఉంటుంది.
అటు తర్వాత యువతి రంగంలోకి వస్తుంది.

ఒక పరంపర.

ఏ చిత్రమైనా పరిసరాలతో కూడిన విస్త్రుతిని, అలాగే ప్రధానాంశంలోని విశేషాన్ని పదిలపరిస్తే చాలు.

ఇది అసొంటిదే అనుకుంటను.
+++నిజానికి ఆ వృద్దులు ఒంటరిగా లేరు.
వారి ఆలనా పాలనా చూసుకుంటున్న కోడళ్లూ బిడ్డలూ మనవరాండ్లూ ఉండనే ఉన్నరు.
అయినా ఇది తప్పదు.  ఇలా అరుగుల మీద రెండు పక్షులు వాలడమూ అవి కిచకిచమని ఏవో చెప్పుకోవడం చీకటి అవుతున్నదని తప్పుకోవడమూ మామూలే. కానీ అన్నీ చూసే వాళ్లుంటరు. చూస్తూ ఉండగానే ఇవన్నీ జరుగుతయి. ఈ సంగతి చెప్పడానికి కూడా ఈ చిత్రం ఉపకరిస్తుందనే అనుకోవడం!అయితే, ఏదీ రద్దు కాదు.
ఆధునికులం అనుకుంటాం గానీ చోటు దొరుకుతూనే ఉంటుంది.
ముఖ్యంగా వెతలు పంచుకునేందుకు మనిషి దొరుకుతూనే ఉంటడు.స్త్రీకి తప్పదు.
పురుషుడు తన లౌకిక ప్రపంచంలో ఎన్నో విధాలుగా పలాయనం చిత్తగిస్తడు.
కానీ స్త్రీ చెప్పుకుంటుంది. తనకు జరిగినవన్నీ చెప్పుకుంటూనే ఉంటది.
పాటలుగా కట్టుకుని ఆడుతది, పాడుతది.జగమెరిగిన సత్యం ఇది.
దానికి ఒక సుందరమైన ఆవిష్కరణ ఇది.

అందరూ స్త్రీలే.
బతుకమ్మ పాటలే.
ఒక్కో స్థితిని బట్టి ఒక్కో పాట.
వినవచ్చిన వాళ్ల వింటరు. లేకపోతే లేదు.

అందులో దుఃఖం ఒక ఉపశమనం.
కన్నీళ్లు ఒక ఆలంభన.’city life’కి వందనం.
హైదరాబాదు, సికింద్రాబాదులు – జంట నగరాల… ‘A Tale of Two Cities’కి,
ఈ బతుకమ్మలకీ అభివందనం.

– కందుకూరి రమేష్ బాబు

ramesh

అల్లరి పాటలు…!

తృష్ణ

తృష్ణ

 
నేను 6th classలో ఉండగా మా ఇంట్లో మొదటి బ్లాక్ అండ్ వైట్ టివీ వచ్చింది. అప్పట్లో టివీ అనేది కొత్త సరదా అవడం వల్ల అన్ని కార్యక్రమాలతో పాటూ ‘చిత్రహార్’ కూడా వదలకుండా చూసేవాళ్ళం. చిత్రహార్ లో హీరో హీరోయిన్ ని ఏడిపిస్తూ పాడే టీజింగ్ సాంగ్స్ కొన్ని వచ్చేవి. పాట చివరిదాకా హీరోయిన్ ని ఏడిపిస్తూ, తిప్పేస్తూ, ఊపేస్తూ, అల్లరి పెడుతూ ఉంటే అప్పటిదాకా చిరాకుపడ్డ అమ్మాయి అబ్బాయిని కోప్పడకుండా పాట చివరికి వచ్చేసరికీ నవ్వేసేది. అలా ఎందుకు నవ్వేస్తుందో అర్థమయ్యేది కాదు. పాట అయిపోతోంది బట్టి తప్పనిసరిగా నవ్వేస్తుందన్న మాట అనుకునేదాన్ని. తర్వాత కొన్నాళ్ళకు తెలుగు కార్యక్రమాలు మొదలయ్యాకా చిత్రలహరి వచ్చేది. అందులోనూ కొన్ని పాత పాటలు ఇలానే ఉండేవి. పాట చివరిదాకా హీరో హీరోయిన్ ని నానారకాలుగా అల్లరిపెడుతూనే ఉంటాడు. ఇప్పటికీ నాకు అర్థంకానిది ఒకటే.. అలా ఎత్తి కుదేసి, దొర్లించేసి, అల్లరిపెట్టేసాకా ఒక్క లెంపకాయ వెయ్యాల్సింది పోయి పాట చివరికి హీరోయిన్ నవ్వేసి ఎందుకు కూల్ అయిపోతుందో.. అని!!
 
 
ఈసారి ‘పాట వెంట పయనం’ లో ఇలాంటి అల్లరి పాటలు కొన్ని చూపిద్దామని. అంటే అన్నీ పాట చివరిదాకా వచ్చాకా హీరోయిన్ నవ్వేసే పాటలు కాకుండా; అబ్బాయిలు అమ్మాయిల్ని ఏడిపిస్తూ పాడే పాటలు + అమ్మాయిలు కూడా అబ్బాయిల్ని ఏడిపిస్తూ పాడే కొన్నిపాటల్నే వెతికి తెచ్చాను. అప్పట్లో అమ్మాయిలు ఇంత ఫాస్టా? ఇంత ధైర్యమా? అని ఆశ్చర్యం వేస్తుంది అలాంటి కొన్ని పాటల్ని చూస్తే. పాటలు వెతుకుతూంటే నే గమనించిన సంగతి ఏంటంటే ఇలాంటి అల్లరి పాటల్లో చాలా వరకూ అక్కినేని పాటలే ఉన్నాయి. వేరే హీరోల పాటలు వెతకచ్చు కానీ చాలావరకూ చెవికింపుగా ఉండే పాటలు అవడం వల్ల ఈసారి ఎక్కువగా అక్కినేని పాటల్నే ఎంచుకోవడమైంది.
 alBKcXRoY1dqb1Ex_o_buddhimanthudu-movie-songs---havvare-havva---anr-vijaya-
 
ముందు అబ్బాయిలు అమ్మాయిల్ని ఏడిపిస్తూ పాడే కొన్ని పాటలు చూద్దాం.. అలాంటి పాటల్లో నాకు బాగా నచ్చేది “ప్రేమించి చూడు” చిత్రంలో పాట.
“మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడద
సాయము వలదా హోయ్…ఓ చెయి వేసేదా”
అని నాగేస్రావ్ పాడుతూంటే, ఆ అక్కాచెల్లెళ్ళు రుసరుసలడుతూ టైరులో గాలి కొడుతుంటే నాగేస్రావ్ మీద కోపం రాదు సరికదా భలే సరదాగా ఉంటుంది..
 
 
“బులిబులి ఎర్రని బుగ్గల దానా చెంపకు చారెడు కన్నుల దానా
మరచిపొయ్యవా నువ్వే మారిపోయావా..
నన్ను మరచిపోయావా..నువ్వే మారిపోయావా” 
అని అబ్బాయి పాడుతుంటే, అబ్బాయితో పాటే అమ్మాయి కూడా ఈల వెయ్యడం గమ్మత్తుగా ఉండేది చిన్నప్పుడు ఈ పాట చూసినప్పుడల్లా! “శ్రీమంతుడు” చిత్రంలోని పాట ఇది..
 
 
ప్యాంటు, చొక్కా వేసుకున్న అమ్మాయి వెనకాలే ఓ అబ్బాయి ” అయ్యయ్యో బ్రహ్మయ్య అన్యాయం చేసావేమయ్యా… ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా..య్యా..య్యా…” అని పాడుతూ ఉంటే “మనకి తెలిసిపోయింది కదమ్మా ఈ అబ్బాయికి తెలియలేదా అది అమ్మాయి అని” అని అమ్మని అడిగేవాళ్లం చిన్నప్పుడు..:)
(చిత్రం: అదృష్టవంతులు)

 
“ఇల్లరికం” చిత్రంలో మారువేషం వేసుకుని భర్త తన భార్యనే అల్లరిపెట్టే ఈ పాట చాలా సరదాగా, వినడానికి కూడా బావుంటుంది. 
ఎంత వెతికినా ఈ పాట వీడియో దొరకలేదు..:( ఆడియో లింక్ మాత్రమే ఇస్తున్నాను. 
(నిలువవే వాలు కనులదానా..)
 
 
 
 
“నేనంటే నేనే” సినిమాలోని ఈ సూపర్ స్టార్ కృష్ణ  పాట ఎంత ఫేమస్సో వేరే చెప్పాలా?! కొత్త సినిమా పాటలు చూసీ చూసీ, ఈ పాటలో అమ్మాయికి స్కర్ట్ వేసినా కూడా ఎంత నీట్ గా ఉందో పాట అనిపిస్తుందీ పాట చూస్తూంటే.
(ఓ చిన్నదానా నన్ను విడిచి పోతావటే..) 

 
యద్దనపూడి నవల “మీనా” ఆధారంగా తీసిన “మీనా” చిత్రంలో ఓ పాట ఉంది. ఓ పట్నం పిల్ల పొలంలోకి వచ్చి నడవలేక అవస్థ పడుతుంటే ఆమెని అల్లరిపెడ్తూ ఓ బావ పాడే పాట ఇది. 
“చేనుకి గట్టుంది.. ఇంటికి గడపుంది 
కంటికి రెప్పుంది.. కన్నెకు హద్దుందీ
హద్దు మీరినా, కాలు జారినా.. అంతా గల్లంతౌతుందీ..
అమ్మాయిగారండీ..” అని సాగే ఈ పాట సాహిత్యంలో ఎంతో నీతి కనబడుతుంది. 
ఈ చిత్రంలో నాయికగా వేరే ఎవరైనా అయిఉంటే సినిమా ఇంకా బాగుండేదేమో అన్నది నా డౌటాభిప్రాయం.
 
 
ఇంకా చెప్పుకుపోతే బుధ్ధిమంతుడు చిత్రంలో “హవ్వారే హవ్వా హైలెస్సో.. దాని యవ్వారమంతా హవ్వా హైలెస్సో” పాట, 
పల్లెటూరి బావ చిత్రంలో  “ఒసే వయ్యారి రంగీ..” , 
లేత మనసులు చిత్రంలో “హల్లో మేడం సత్యభామ..”, 
కొడుకు కోడలు చిత్రంలో  “గొప్పోళ్ళ చిన్నది..” ఇలా బోలెడు పాటలున్నాయి! 
ఈ వరుసలో ఒక కలర్ సాంగ్ మాత్రం పెట్టకుండా ఈ సిరీస్ పూర్తవదు. అదే ” నిర్ణయం” చిత్రంలో నాగార్జున పాడే “హలో గురూ..ప్రేమకోసమేరా జీవితం..” పాట. నాటక రచయిత, సినీ రచయిత గణేశ్ పాత్రో రాసిన పాట ఇది. అప్పట్లో విపరీతంగా ఫేమస్ అయిపోయిన ఈ పాట ఇప్పటికీ ఎక్కడో అక్కడ మోగుతూనే ఉంటుంది. అమల ఎంత బావుంటుందో ఈ పాటలో!
 
***    ***   ***
 
ఒకే చిత్రంలో సాహిత్యంలో కాసిని మార్పులతో రెండు పాటలు, రెండు సిట్యుయేషన్స్ లో చాలా చిత్రాల్లో పెడుతూంటారు. వాటిని “టేండమ్ సాంగ్స్” అంటారు. సాధారణంగా ఇలాంటివి ఒక హ్యాపీ, ఒక పేథోస్ ఉంటుంటాయి. “వినుము చెలీ తెలిపెదనే ఒక మధుర రహస్యం”, “చేతిలో చెయ్యేసి”, “నల్లవాడే..”, అందాల ఓ చిలుకా”, “ఆడేపాడే పసివాడా” మొదలైన పాటలన్నమాట. అలాంటి టేండమ్ హ్యాపీ సాంగ్స్ మేల్, ఫీమేల్ వర్షన్స్ కొన్ని సినిమాల్లో ఉన్నాయి. ఒకటీ”దొరికితే దొంగలు” చిత్రంలో ఉంది. ఒకటేమో అబ్బాయిని అమ్మాయి ఏడిపించేదయితే, మరొకటి అబ్బాయి అమ్మాయిని ఉడికించేది..
“ఎవరికి తెలియదులే యువకుల సంగతి..”
“ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి..”
***   ***   ***
మరిప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్ని ఏడిపించే పాటలు కూడా కొన్ని చూద్దామా…
 
మరిప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్ని ఏడిపించే పాటలు కూడా కొన్ని చూపిస్తానేం…
మొదట బ్రహ్మచారి చిత్రంలో అమ్మాయి + స్నేహితురాళ్లందరూ కలిసి ఓ అబ్బాయిని బాగా ఏడిపించేసే పాట ఉంది. అప్పట్లో ఇలాంటి పాట సెన్సేషనే అయి ఉంటుంది. ఇలాంటిదే.. అంటే హీరోయిన్ తన స్నేహితురాళ్లతో కలిసి “హల్లో ఇంజనియర్ హల్లో మైడియర్..” అంటూ హీరోని అల్లరి పెట్టే పాట “ధర్మదాత” చిత్రంలో కూడా ఉంది.  అందులోనూ అక్కినేని హీరో, అల్లరి అమ్మాయేమో నటి కాంచన.
ఇప్పుడు బ్రహ్మచారిలోని  “ఓ బ్రహ్మచారి నిను కోరి.. నిలుచున్నది.. చిన్నది.. నిను చేరి” పాట చూసేద్దాం..
 
 
తర్వాత, సావిత్రి ఏ.ఎన్.ఆర్ కి చెమటలు పట్టిస్తూ “ఏమండోయ్ శ్రీవారూ ఒక చిన్న మాట..” అంటూ పాడే పాటొకటుంది. చిన్నప్పుడూ చిత్రలహరిలో చూసేప్పుడు ఈ పాటలో “శ్రీవారూ..” అని సావిత్రి ఎందుకు పిలుస్తోంది అని అడిగితే అమ్మ సినిమా కథ చెప్పింది. తర్వాతెప్పుడో ఊళ్ళోకకొచ్చే పాత సినిమాలు తీసుకెళ్ళి చూపించినప్పుడు ఈ సినిమా కూడా చూపించింది.
(చిత్రం: మంచి మనసులు)
 
 
అవసరమైతే హీరోలను సైతం ఆటపట్టించగల అప్టుడేట్ యువతిగా పేరుపడ్డ నటి జమున. “బందిపోటు దొంగలు” చిత్రంలో అక్కినేని ని అల్లరి పెడుతూ జమున పాడే పాటుంది.. “కిల్లాడి దొంగా డియ్యూం డియ్యూం..” అని. అది కాకుండా “ముహుర్తబలం” చిత్రంలో జమునదే ఇంకో పాట ఉంది. పైన మీనా చిత్రంలో హీరో కృష్ణ ఓ పట్నం అమ్మాయిని ఏడిపిస్తే పాడతాడు కదా, ఇందులోనేమో పట్నం బాబులా వచ్చిన కృష్ణను అల్లరిపెడుతూ అల్లరి అమ్మాయిగా జమున పాడుతుందీ పాట.
(డొయ్ డొయ్ డొయ్ డొయ్ వస్తున్నాడోయ్..)
 
 
“గొప్పోళ్ల చిన్నది గువ్వల్లే ఉన్నది..
కొండ మీడి కోతల్లే చిక్కనంటది..
చెట్టు కొమ్మల్లే గుండేను ఊపేస్తది..”
అని కొడుకు కోడలు చిత్రంలో అమ్మాయిని ఉడికిస్తూ అబ్బాయి పాడే పాటొకటి ఉంది. అదే అమ్మాయి మళ్ళీ ఆ అబ్బాయిని ఏడిపిస్తూ “నా కంటే చిన్నోడు.. నా తమ్ముడున్నాడు.. అన్నాడూ ఒక పిలగాడు..” అని పాడే అల్లరి పాటొకటి ఉంది. వాణీశ్రీ  బాగా చలాకీగా నటించిన ఈ పాట చూసేద్దామిప్పుడూ..
(చిత్రం: కొడుకు కోడలు)

 

 
 
మైనర్ బాబు చిత్రంలో 
“కారున్న మైనరు.. కాలం మారింది మైనరు
ఇక తగ్గాలి మీ జోరు 
మా చేతికి వచ్చాయి తాళాలు..హోత్తెరీ..” అంటూ వాణిశ్రీ పాట మరొకటి ఉంది. 
మైనర్ బాబుని అల్లరిపెడుతూ, డబ్బున్న అబ్బాయిల గుణాలని ఎద్దేవా చేస్తూ ఓ పేదింటి పిల్ల పాడే పాట ఇది..
 
***   ***   ***
(మరోసారి మరో నేపధ్యంతో మళ్ళీ కలుద్దామే..)