Archives for March 2014

“పంచె”స్తా… సరేనా?!

1543946_4134524978538_551528335_n

రఘురాయ్ చిత్రం

drushya drushyam-25
జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం, ఢిల్లీ.
సుప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘురాయ్ ఫొటోగ్రఫీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు.ఆయన సంతోషంగా ఉన్నారు. తన ముందు ఉత్సుకతతో నిలబడ్డ పిల్లలందరినీ ఒకమారు చూసుకుని చిరునవ్వుతో ప్రసంగం ప్రారంభించటానికి ఉద్యుక్తులయ్యారు. చిత్రంగా ‘మీ కోసం ‘ఒక పాట పాడుతా’ అంటూ ఆయన ప్రారంభించారు.చిన్నగా గొంతు సవరించుకుంటుంటే అందరూ ఆయన పాట పాడుతారనే అనుకుంటున్నారు.
కానీ, ఆయన పాడలేదు. కొన్ని మాటలు మాట్లాడారు. అంతే!
కానీ, వాటిని విన్నవాళ్లు, ప్రసంగానంతరం హాయిగా ‘ఈల’ వేసుకుంటూ ఆ కాన్ఫరెన్స్ హాల్ నుంచి బయటకు వెళుతుంటే నేను చూశాను. ‘వారెవ్వా రఘురాయ్ ‘ అనుకున్నాను మనసులో!

ఇంతకీ ఆయన ఏం మాట్లాడారూ అంటే ఇదే…
ఈ చిత్రంలోని ఒక పిల్లవాడి ఏడుపు ఉన్నది చూశారూ…దాని గురించే మాట్లాడారాయన.
కారులో ఆ సమావేశానికి వెళ్లేముందు, ‘మీరు ఫొటోగ్రఫీ ప్లాన్ చేసుకుంటారా?’ అని అడిగితే ఆయన నవ్వారు.
నా అజ్ఞానానికి సమాధానం అన్నట్టు ఆయన తన ప్రసంగాన్ని ఇలా అందుకున్నారు…

+++

‘పిల్లల్లారా? మీరింకా నిజంగానే పిల్లల్లానే ఉన్నారా?’ సూటిగా అడిగారాయన!ఒక్క క్షణం నిశ్శబ్దం.’అడుగుతున్నాను, మీరు పిల్లలేనా? అని!
మీరంతా ఫొటోగ్రఫీలో ఉన్నవాళ్లు. ఛాయాచిత్రలేఖనాన్ని కళగానూ చూసేవాళ్లు.మరి, మీరంతా పిల్లవాడి తాలూకు సృజనాత్మకతను మీలో కాపాడుకుంటున్నారా అని అడుగుతున్నాను’ అన్నారాయన.

‘అర్థం కాలేదా? అయితే వినండి.’

‘మీరెప్పుడైనా పిల్లల్ని గమనించారా?’
‘ఫలానా దాని కో్సం మారాం చేసే పిల్లల్ని గమనించి చూశారా?’ అని గుచ్చి గుచ్చి అడిగారాయన.

పిల్లలంతా మ్రాన్పడి పోయారు.

మళ్లీ చెప్పసాగాడాయన.  ‘తల్లిని ఆకర్శించేందుకు పిల్లవాడు చాలా చేస్తాడు.  కావాలనుకున్నది తల్లి ఇవ్వకపోతే ఏడ్చి గోల చేస్తాడు. ముందుగా ప్రేమగా చెబుతాడు. గోముగా అడుగుతాడు. తర్వాత అలుగుతాడు. అదీ అయ్యాక అరిచి గీపెడతాడు. కాళ్లను తాటిస్తూ కింద పడి పొర్లుతాడు. తలుపులు దబదబా బాదుతూ తన అసహనాన్ని ప్రదర్శిస్తాడు.
అవసరమైతే కొరికినా కొరుకుతాడు. ఒకటని కాదు, అన్ని ప్రయత్నాలూ చేస్తాడు. ఒక్కమాటలో ‘విశ్వ ప్రయత్నం’ చేస్తాడు.’

‘అది తప్పా ఒప్పా అని కూడా లేదు. మంకుపట్టు పడతాడు. ఏదో రీతిలో తల్లిని సాధించి సమకూర్చుకుంటాడు. మరి, ఒక మంచి ఫొటో తీయడానికి మీరేం చేస్తున్నారు?’

’ఎప్పుడైనా ఆకలయిందీ అని తల్లిని అడిగినట్లు ‘ఇది కావాలి’ అని ప్రకృతి మాత ముందు మనవి చేసుకున్నారా? చేతులు జోడించి ప్రార్థించారా? దయ చూపమని అభ్యర్థించారా? మరేం చేస్తున్నారు?’

’ఒక ఫొటో చక్కగా రావాలంటే మీరు పిల్లవాడికి మల్లే ఆ ప్రకృతి మాతను శరణు వేడవలసిందే!  ఓపిగ్గా వేచి ఉండి కాదంటే దయతలచూమా అని వేడుకోవలసిందే. లేదంటే వెంటపడి వేధించి సాధించుకోవాల్సిందే!  పిల్లలంటే అది!’

+++

’మీరు పిల్లల్లేనా అని అందుకే అడగుతున్నాను.
అమాయకంగా అధికారికంగా ముందూ వెనుకలతో నిమిత్తం లేకుండా తక్షణం, అప్పటికప్పుడు ఏదైనా సాధించుకోవాలంటే తప్పదు…నానా యాతన పడాలి. పిల్లవాడు ఒక తల్లిని ఒప్పించి ఆ క్షణాన సాధించుకున్నట్టు మీరూ సాధించుకోవలసిందే! మీరూ మారాం చేయవలసిందే. మహత్తరమైనజీవిత రహస్యాలు బోధపర్చమని ఆ కళామతల్లిని ప్రాధేయ పడవలసిందే!’

కరాతాళ ధ్వనులు.

రఘురాయ్ ప్రసంగం ఇలా ముగిసేసరికి విద్యార్థినీ విద్యార్థులు, ప్రొఫెసర్లూ, చుట్టూ చేరిన ఇతర ఉద్యోగులు చప్పట్లతో తమ హర్షాతిరేఖాన్ని వ్యక్తం చేస్తున్నారు.కొద్దిమంది కళ్లళ్లోనైతే ఆనందమో దుఃఖమో తెలియని కన్నీళ్లు, ఆనంద బాష్పాలూ…

అంతా పిల్లలైన తరుణం అది. ‘గుర్తుగుంచుకోండి. మీ కోసం ఒక పాట పాడినట్లు కాసిన్ని మాటలు చెబుతున్నాను. ఎల్లవేళలా మీరు ఆ పిల్లవాడితో ఉండండి. ఆ పసిప్రాయపు జీవితంలోనే సృజనాత్మకత దాగి ఉన్నదని గ్రహించండి.
బుడిబుడి నడకలు పోయే పసిపిల్లవాడిలా ఎవరు తోడున్నా లేకున్నా నడుస్తూనే ఉండండి. పడ్డారా? ఫర్వాలేదు. మళ్లీ పిల్లవాడిలా లేచి నడిచేందుకు ప్రయత్నించండి. పడుతూ లేస్తూ మున్ముందుకే పొండి. ఆ పిల్లల మాదిరే delightful mistakes చేస్తూనే వెళ్లండి. ఏమీ కాదు.’

‘జీవితం కరుణించాలంటే పిల్లలే దిక్కు.
ప్రకృతి మాత ముందు ఏడ్చే పిల్లలే ధన్యులు.’

‘మరి ప్రియమైన విద్యార్థినీ విద్యార్థుల్లారా…పిల్లలు కండి.
all the best…’

+++

– ఇదీ రఘురాయ్ గారి ఉపన్యాసం. బాల్యాన్ని నిద్రలేపే గురుబోధ.

ఏడాదిన్నర దాటింది. పుస్తకం కోసం తనతో సంభాషిస్తున్న రోజులవి. ఎందుకో ఏమో…ఒకరోజు హఠాత్తుగా ఫోన్  చేసి, ‘వచ్చేవారం ఢిల్లీ రాగలవా?’ అని అడిగారాయన. ’తప్పకుండా’ అని వెళితే, విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లారు. కారులో వెళుతూ వెళుతూ సంభాషణలో ‘మీరు ఫొటోలు తీసేముందు ఏమైనా ప్లాన్ చేసుకుంటారా?’ అని అడిగితే నవ్వి, నా ప్రశ్నకు సమాధానం అంటూ సభాముఖంగా పై విషయమంతా ’పాడి’ వివరించారు.

నిజమే! ఆయన ఏదీ ప్లాన్ చేసుకోరు.
ఎందుకూ అంటే ఆయన నిజమైన బాలుడు! తనని ప్రకృతే కరుణిస్తుంది!!

ఈ పాఠం విన్నవాడిని కనుక మా వీధిలో ఏడుస్తున్న ఈ పిల్లవాడిని చూడగానే రఘురాయ్ కనిపించారు.
చప్పున చిత్రించాను. అంతే!

~ కందుకూరి రమేష్ బాబు

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 15 వ భాగం

( గత వారం తరువాయి)

15

విపరీతమైన ప్రతిస్పందన ప్రవహిస్తోంది ‘జనపథం’లోకి. రాష్ట్రం నలుమూలలనుండి అనేక మంది ఆలోచనాపరులు ప్రధానంగా సీనియర్‌ సిటిజన్లు,

విద్యాసంస్థలలోనుండి ఉత్తమ విద్యార్థులుగా నేపథ్యం గలవాళ్లు  ఎక్కువగా మహిళలు, సాహిత్యకారులు, కళాకారులు, కొద్దిమంది చిన్నస్థాయి పోలీసులు.. బీదలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో అట్టడుగుస్థాయి వర్గం.. వీళ్ళు చురుగ్గా స్పందిస్తున్నారు.

దాదాపు ప్రతిరోజు ఏదో ఒక టి.వి. వార్తా చానల్‌లో రామం.. లేదా డాక్టర్‌ గోపీనాథ్‌.. కొద్దిసార్లు క్యాథీలతో ముఖాముఖి ప్రసారాలు కొనసాగుతున్నాయి..’జనసేన’ ఆవిర్భావం, ఆలోచనలు, లక్ష్యాలు.. ప్రజాపాలనా రంగంలో విస్తరించిన అవినీతిని అంతమొందించేందుకు పథకాలు.. సంస్థ నిర్మాణం.. పారదర్శకత.. వీటిపై ఎక్కడ చూచినా చర్చ జరుగుతోంది. మంత్రి వీరాంజనేయులును విధిలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సిఫారసుపై గవర్నర్‌ మంత్రివర్గం నుండి బర్త్‌రఫ్‌ చేశాడు. మిగిలిన నలుగురు ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్‌ చేసి వివరణాత్మకమైన దర్యాప్తుకై ఒక కమిటీని నియమించింది.

పదిరోజుల్లో దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ‘జనసేన’ శాఖలు ఏర్పడ్డాయి.

ఒక కొత్త గాలి, కొత్త ఆలోచన వీచడం మొదలైంది.
విపరీతమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోంది మరోవైపు.

ఆపద సమయంలో ఆకలిగొన్న మందపైకి ఆహారపొట్లాలను విసిరితే మనుషులు పశువులకన్నా హీనంగా కొట్లాడుకోవడం కనబడ్తుంది. సముద్రంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడగానే చుట్టూ ఉన్న నీరు మహోధృతితో సుడిగుండంగా రూపదాల్చడం మనం చూస్తూంటాం. ఒక ఖాళీ ఏర్పడగానే అక్కడికి చుట్టూ ఉన్న ద్రవ్యం చొచ్చుకురావడం ‘ఫిజిక్స్‌’లో చదవుకుంటాం. సరిగ్గా అదే జరుగుతున్నట్టుగా క్యాథీ గమనిస్తోంది.

”ప్రజలు ఈ విపరీతమైన అవినీతికర వాతావరణంతో విసిగి విసిగి.. ఈ దుస్థితిలోనుండి బయటపడ్డానికి ఎవరైనా పూనుకుని ఏదైనా చేస్తే బాగుండు.. మనం కూడా మంటకు గాలిలా తోడవుదాం అన్న ఉత్సుకతతో ఎదురుచూస్తున్నట్టు ఈ విపరీతమైన జనస్పందన తెలియజేస్తాంది.” అని డాక్టర్‌ గోపీనాథ్‌ వంక చూస్తూ అంది క్యాథీ.
అప్పుడు సరిగ్గా రాత్రి పదిగంటల యాభై నిముషాలైంది.

‘జనపథం’ బయట వాతావరణమంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది.

”ఈరోజు మన రాష్ట్రవ్యాప్త కార్యాలయాలన్నింటిలోకూడా మనం ముందే అనుకున్నట్టు ‘అవగాహన’ కార్యక్రమం నిర్వహించబడింది సార్‌. ఒక్కో కార్యాలయం నుండి దాదాపు లక్ష ప్రశ్నాపత్రాలను ప్రజల్లోని వివిధ స్థాయిలకు చెందిన జనానికి అందజేసి జవాబులురాయించి వెంటనే వాపస్‌ తీసుకుని క్రోడీకరణ చేశాం. వాటిని అన్ని జనసేన శాఖల్లోనుండి మన హైద్రాబాద్‌ సెంట్రల్‌ డాటా వెబ్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే మనవాళ్ళు ఎనాలిసిస్‌ రిపోర్ట్‌ తయారు చేశారు. రిపోర్ట్‌ సమ్మరీ చూస్తే చాలా ఆశ్చర్యం కల్గుతోంది రామంగారూ..” అంటున్నాడు శివ.

”చెప్పు శివా.. ఒక్కోసారి ఇటువంటి అభిప్రాయ సేకరణలనుండి మనం ఊహించని వింత ఫలితాలు ఫీడ్‌బ్యాక్‌ క్రింద మనకు చేరుతాయి. అవి మన భవిష్యత్‌ రూపకల్పనకు ఎంతో తోడ్పడ్తాయి..”

”సర్‌ మనం అందజేసిన ప్రశ్నాపత్రంలో రెండే రెండు ప్రశ్నలున్నాయి.. అవి., ఒకటి

అవగాహన (అతిగోపనీయం)

1) మీ చుట్టూ ఉన్న సామాజిక వాతావరణం ఎంతమేరకు కలుషితమై ఉంది.
ఎ) కొద్దిగా     బి) చాలావరకు    సి) భరించలేని స్థాయికి
2) మీ పరిసరాల్లో అవినీతి ఏరూపంలో ఉంది..
……………………………………..
…………………………………….
మీపేరు :…………….. వృత్తి :………….. వయస్సు:………
అడ్రస్‌ :…………………….మొబైల్‌ నం.:……………….
గమనిక : మీరు రాస్తున్నది ఎవరికీ చెప్పబడదు. అతి రహస్యంగా ఉంచబడ్తుంది.

దాదాపు ఇరవై లక్షల ప్రశ్నాపత్రాలు ప్రజలకు అందజేయబడ్తే, అందులో బాధ్యతతో గరిష్టంగా పందొమ్మిది  లక్షల ముప్పయి రెండు వేల నలభై ఆరు మంది రెస్పాండయ్యారు. ఐతే చాలా ఆశ్చర్యంగా అందులో పందొమ్మిది లక్షల ఇరవై రెండు వేల నలభైమంది సామాజిక వాతావరణం ‘భరించలేని స్థాయిలో’ కలుషితమైందని జవాబు చెప్పారు. ‘కొద్దిగా’ అని చెప్పినవాళ్ళు అసలు లేనేలేరు. మిగిలిన అందరూ ‘చాలావరకు’ కలుషితమైందని బాధపడ్తున్నారు.

ఇక రెండవ ప్రశ్న.. ‘ మీ పరిసరాల్లో అవినీతి ఏ రూపంలో ఉంది’ అన్నదానికి.. అట్టడుగు వర్గాలు, చాలా విపరీతమైన ఆగ్రహంతో ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలను, వ్యవస్థను తిట్టి తమ నిరసనను, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఉన్నత వర్గాల్లో ఉన్నవాళ్ళు హాపీగా, డబ్బు సంపాదన విషయంలో నిశ్చింతగా ఉన్నారు కాబట్టి ప్రస్తుత సామాజిక స్థితిగతులపై మిగతా వాళ్ళున్నంత ఆగ్రహంగా లేరు. కాని ఆత్మానుగతమైన ఓ అపరాధ భావనతో ఈ పరిస్థితులు మారాలనిమాత్రం ఆకాంక్షిస్తున్నారు.

”మచ్చుకు విభిన్న వర్గాలకు చెందిన, భిన్న ప్రాంతాలకు చెందిన కొన్ని ప్రతిస్పందనలను వినిపిస్తావా శివం” అన్నాడు డాక్టర్‌ గోపీనాథ్‌.

”ఓకే సర్‌.. వినండి..”అని శివం తన ముందున్న కంప్యూటర్‌ స్క్రీన్‌ను సెట్‌ చేసుకుంటూ,

”ఊఁ.. ఇది .. ఒక హాకర్‌.. బి. అప్పారావు.. బెంజ్‌ సర్కిల్‌, విజయవాడ, సెంటర్లో బండిపై అరటిపండ్లు అమ్ముతూ జీవిస్తాడు.. చదువురాదు.. ప్రక్కనున్న ఇంటర్‌ విద్యార్థితో ఫాం నింపించి మనకు జవాబిచ్చాడు.. మొదటి ప్రశ్న జవాబు.. సమాజం భరించలేనిస్థితిలో కలుషితమైందని.. రెండవ ప్రశ్నకు జవాబు.. థూ నీయమ్మ.. అవినీతి ఏ రూపంలో ఉంది.. అని అడుగుతున్నారా.. అన్ని రూపాల్లోనూ ఉంది. పోలీసుల రూపంలో, గుండాల రూపంలో, మున్సిపాలిటీ ముండా కొడ్కుల రూపంలో, రాత్రి కాకముందే లంజలరూపంలో, ఎమ్మెల్యేల రూపంలో, మంత్రుల రూపంలో, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని రాజకీయ పార్టీల రూపంలో.. ఇక బతకడమే కష్టంగా ఉంది సారూ. రోడ్లమీద అరటిపండ్లమ్మి రెండొందలు సంపాదిస్తే వందరూపాయలు అందరికి పంపకం.. మిగిలేది. వంద.. బొక్కలు తెల్లబడ్తానయ్‌గాని ఈ బతుకు బాగుపడ్తలేదు…”

శివ తలెత్తి ముగ్గురి ముఖాల్లోకీ చూశాడు.

”వీటి ప్రింటవుట్సన్నీ భద్రపర్చాలి శివా.. మనం రెండు మూడు రోజుల్లో వీటిని సమ్మరైజ్‌ చేసి.. ఒట్టి కీలుబొమ్మే ఐనా రాష్ట్ర గవర్నర్‌ను, తర్వాత ముఖ్యమంత్రిని కలిసి ప్రజల మనోగతాన్ని సాధికారికంగా వినిపించబోతున్నాం. తర్వాత మీడియా ద్వారా ప్రజలతో ముఖాముఖి ఉంటుంది..” అన్నాడు రామం.

17

”యస్సార్‌.. ఇంకొక రెస్పాన్స్‌.. మరొక వర్గంనుండి.. ఇతని పేరు బి. రామచంద్రారెడ్డి. వయస్సు ముప్పయి రెండు. వృత్తి పోలీస్‌ కానిస్టేబుల్‌.. ఊరు వరంగల్‌.. మొదటి ప్రశ్న జవాబు.. సామాజిక వాతావరణం భరించలేని స్థాయిలో కలుషితమైందనే. రెండవ ప్రశ్న.. అంటాడు.. పోలీస్‌గా పుట్టడంకంటే ఏ క్లాస్‌ లంజెదగ్గరైనా కుక్కయిపుడ్తే ఎంతో సంతోషంగా ఉంటది. ఉన్న ఒక్క బిడ్డకు ఊరంతా మొగలే అని ఒక సామెత ఉంది.. పోలీస్‌ కానిస్టేబుల్‌కు అందరూ మొగలే. ఎస్సై, సి.ఐ, డిఎస్పీ.. క్యాంప్‌క్లర్స్‌, ఎస్పీ స్టెనో, ఎస్సై పెడ్లాం, సి.ఐ. ఉంచుకున్నది, డిఎస్పీ బిడ్డ, కొడుకు, బామ్మర్ది.. ఎందరయ్యో బాబు. ఒక వేళ పాళలేని కుక్కబతుకులు మావి.. యిక లంచాలా.. ఆదాయమా.. అధికారమా.. ఎవనికి ఎంత చేతనైతే గంత.. అందినకాడికి రిల్లుకుని ఉడాయించుడే. పోలీసుల సంస్కృతిలో ఏ పోలీసోడైనా తన క్రింది ఉద్యోగులకు పులి, పై ఉద్యోగులకు పిల్లి. మాకు రాజకీయ నాయకులందరూ మొగుళ్ళే. డబ్బు సంపాదన ప్రక్కనపెడ్తై.. ఈ సిగ్గూశరాలు లేని జీవితాలు జీవించడంకంటే బండకట్టుకుని బాయిలపడ్తే బాగుండనిపిస్తోంది. ఇగ ఈ దేశం ఎవడూ బాగుచేయలేనంత ఛండాలంగా చెడిపోయింది. గంతే..”

”ఊఁ.. జనం స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని చెప్పమని ఎంకరేజ్‌ చేసి విషయాన్ని గోప్యంగా ఉంచితే చూడండి మనుషులు తమ మనసులోని మంటను ఎలా మనముందు ఆవిష్కరిస్తున్నారో.. ఇదీ ప్రజల అసలు అంతరంగం..” అంది క్యాథీ.

”ఒక మున్సిపల్‌ కార్పొరేటర్‌.. పేరు శ్రీనివాసరావు బర్రెల.. వార్డ్‌ యిరవై నాల్గు. వయస్సు ముప్పయి ఐదు. మొదటి ప్రశ్న జవాబు. సామాజిక వాతావారణం భరించలేని స్థాయిలో కలుషితమై చెడిపోయిందనే. ఇక రెండవ ప్రశ్న.. ఈ రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేటరన్నా, కౌన్సిలర్‌ అన్నా బ్రాకెట్లో కాంట్రాక్టరనే. పది లక్షలు ఖర్చుపెట్టి గెలిచిన. ఐదేండ్ల టర్మ్‌. యాడాదిగాకముందే ఇరవై రెండు లక్షలు సంపాదించిన. పొద్దున లేవగానే పైన ఎమ్మెల్సీ కింద మేయర్‌, అటు దిక్కు జిల్లా మంత్రి. పైరవీలు, పార్టీలు, దందాలు, ధర్నాలు, రాస్తారోకోలు. షానిటేషన్‌ కాంట్రాక్ట్‌, రోడ్ల కాంట్రాక్ట్‌, సిల్ట్‌ రిమూవల్‌ కాంట్రాక్ట్‌, మలేరియా ప్రెవెక్షన్‌, ఇందిరమ్మ ఇళ్ళ కథ.. వరల్డ్‌ బ్యాంక్‌ ఫండ్స్‌ కింద స్లమ్స్‌ డెవలప్‌మెంట్‌ కాంట్రాక్ట్‌.. ఏమాటకామాటేగని .. కేన్సర్‌ రోగంకన్న కడుహీనంగా ఈ అవినీతి రోగం ముదిరిన ఈ సిస్టంను ఎవడు బాగుచేస్తడు.. ఎట్టా బాగుచేస్తడు. మారె.. ఎవని చేతగాదు.. కాని..మేము విసిగిపోయినం. అందరం బురదల నిలబడ్డం.. బాగ తాగినప్పుడనిపిస్తది.. నీయమ్మ ఈ అన్యాయం బతుకు, పాపపు బతుకు వద్దని.. గుండెలల్ల ఎక్కడ్నో తప్పుచేత్తాన అన్న ఫీలింగు తినేస్తాంది. మంచిగా, సాఫ్‌గా నీతిగా బతుకుతే బాగుండు. కాని ఏ లంజకొడ్కు బత్కనిత్తడు.”

”ఒక సాధారణ పౌరుడు.. ఉదాహరణకు ఓ పెద్ద బట్టల దుకాణ్లో పనిచేసే గుమాస్తా, .. అలాంటివాళ్ళ ఫీలింగ్సు చెప్పు శివా..” రామం అడిగాడు
శివ వెంటనే తన చేతిలో ఉన్న కొన్ని కాగితాలనూ, లాప్‌టాప్‌ స్క్రీన్‌ను వెదికి ఒక్క నిముషంలో.. నంబర్‌ను వెదుక్కుని ఓ కాగితాన్ని బయటికి తీసి చదవడం ప్రారంభించాడు.

”ఇతను వందన బ్రదర్స్‌లో పనిచేసే ఒక గుమాస్తా.. గత ఐదేండ్లుగా చేస్తున్నాడు. పేరు – వల్లభనేని రామారావు. వయస్సు నలభై ఎనిమిది.. మొదటి ప్రశ్నకు జవాబు.. సామాజిక వాతావరణం ..మనమిచ్చిన మూడు ఆప్షన్స్‌ కాకుండా ఒక కొత్త ఆప్షన్‌ తనే రాశాడు.. ”భరించలేని, కాదు ఎవడూ బాగుచేయలేని స్థాయికి ఈ సమాజం చెడిపోయింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తీ చెప్పాడుకదా యిక ఈ దేశాన్ని భగవంతుడుకూడా బాగుచేయడలేడని.. కాలుష్యం ఆ లెవెల్‌లో ఉంది. యిక రెండవ ప్రశ్న : మీరెవరోగాని ఈ ప్రశ్న కనీసం అడిగినందుకే నాకు పరమానందంగా ఉంది. దీనికి జవాబు తెల్సుకుని మీరేంజేస్తారో తెలియదుగాని కనీసం జనం గురించి కొందరు ఆలోచిస్తున్నందుకే రవ్వంత గర్వంగా ఉంది. యిక అవినీతి సంగతికదా.. చెబుతా.. వేయి రూపాయల కిరాయి కొంపలో కుక్కిన పేనువలె భార్యాపిల్లలతో గుట్టుచప్పుడు కాకుండా బ్రతుకేనేను మా ఓనర్స్‌ గొణుక్కుంటూ అప్పుడైదు వందలు అప్పుడైదు వందలుగా ఇచ్చే మూడువేల ఐదువందల రూపాయల జీతంతో ఎలా జీవిస్తానో ఆ భగవంతునికే ఎరుక.. యింట్లోనుండి బయటికి రాగానే మా వీధి మూలమీదో యాభైఫీట్ల వాకిలున్న విశాలమైన బిల్డింగు ఉంది. అది మా నగర ఎమ్మెల్యే ఉంపుడుగత్తె లలితాదేవిది. పొద్దున ఏడు గంటలనుండే ఆమె వాకిట్లో కార్లు, మోటార్‌ సైకిళ్ళు, ఆటోలు..ఫుల్‌ రష్‌. ఏంటయా అంటే.. ఎమ్మెల్యే గారితో చేయించుకోవాల్సిన అన్నిరకాల దిక్కుమాలిన పైరవీలకు బుకింగు పాయింట్‌ యిది. బుక్‌ ద కేస్‌, ఫిక్స్‌ ద రేట్‌.. టేక్‌ అడ్వాన్స్‌. పూర్తిగా బహిరంగ వ్యవహారం ఇది. పత్రికలవాళ్ళకు. పోలీసులకు, ప్రజాసంఘాలకు, నక్సలైట్లకు, సంఘ సంస్కర్తలకు.. అందరికీ తెలసిందే. ఏంజేస్తున్నారు ఎవరైనా. ఏమీ లేదు.. ఇంకాస్త ముందుకు రాగానే కుడిదిక్కు ఒక డిఎస్పీ ఉంచుకున్న రామలక్ష్మి ఇల్లు ఉంటది. యింటిముందు రెండు మనుషులకంటె పెద్దసైజు కుక్కలు. నిరంతరం ఇంట్లో బట్టలుతుకుడు దగ్గర్నుండి పిల్లల్ను బైటికి తీసుకుపోయి ఆడించేదాకా పోలీసుల చాకిరీ. ఉదయం, సాయంత్రం బుక్‌ ది కేస్‌.. టేక్‌ మనీ. అటుప్రక్క ఆడిటర్‌ రామనాథం. అన్ని రకాల ఇన్‌కంటాక్స్‌, సేల్స్‌టాక్స్‌ లావాదేవీలకు నగరంలో పెద్ద బ్రోకర్‌. ఆఫీసర్లకు అమ్మాయిలకు సప్లయ్‌ చేయడం దగ్గర్నుండి దొంగలెక్కలను స్కిప్‌ చేయడానికి, పన్ను ఎగవేయడానికి కోటి మార్గాలు వెదికి చూసి మందికొంపలు ముంచే పని. ఒక్క మా దుకాణం దొంగలెక్కలను కవర్‌ చేసినందుకు నేనే మొన్న రెండు లక్షల లంచమిచ్చిన. వాడు ఇరవై లక్షల పన్ను ఎగ్గొట్టించిండు. ఇంకో ఇవరై మీటర్లు నడువగానే ఒక ఇంద్రభవనం వంటి ఇర్రిగేషన్‌ సూపరింటెండ్‌ ఇంజినీర్‌ రామ్మూర్తి బిల్డింగు. (గారు అని సంబోధించడానికి సిగ్గనిపిస్తోంది) ఇరవై ఏండ్ల క్రితం ఆ స్థలంలోనే ఒక డొక్కు సైకిల్‌పై పోతున్న వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌గా రామ్మూర్తి నాకు తెలుసు. అతను చిన్నప్పుడు మూడవక్లాసునుండి ఆరవక్లాస్‌దాకా నాకు క్లాస్‌మేట్‌. యిప్పుడు అతనికి ఒక పెళ్ళాం, ముగ్గురు ఉంపుడుగత్తెలు. కోట్ల ఆస్తులు. కిలోల బంగారం. దేవాదుల ప్రాజెక్ట్‌..ఎల్లంపల్లి.. ఓపెన్‌ కరప్షన్‌. అంతా బహిరంగమే.. ఏం జరుగుతోంది.. ఎవరేం పీకుతున్నారు వాళ్ళను (సారీ.. ఆవేశం, బాధ..దుఃఖం.. పేదవాడు ఒట్టిగా తిట్టుకోవడంకంటే ఏమీ చేయలేని నిస్సహాయ దుస్థితి) ఈ అవినీతిని చూడవలసినవాళ్లందరి కండ్లు చితికిపోయినయా.
వీటన్నింటిని మించి.. ఒక నగర రౌడీ.. రాజేందర్‌.. పిట్టల రాజేందర్‌.. వాని తండ్రి రౌడీ, వాని అన్న రౌడీ,  వాని పెండ్లాం ఆడ రౌడీ. వాడు విచ్చలవిడిగా నగరంమీద ఆంబోతులా పడి యింత అత్యాధునిక సమాజంలో అటవికంగా గుడిసెవాసులను, గవర్నమెంట్‌లో దొంగ అధికారులైన ఎఫ్‌సిఐ, గ్రేన్‌మార్కెట్‌, ఆప్కారీ, ప్రైవేట్‌ ఇంజినీరింగు కాలేజీలు, పాఠశాలలు, వేశ్యాగృహాలు, దొంగ సారాయి దుకాన్లు, రోడ్లకిరువైపుల ఉండే హాకర్ల హఫ్తాలు.. వానికి స్వయంగా మూడు  బినామీ బార్లు. వాని పెళ్ళానికి, ఉంపుడుగత్తెలకు ఆరు బ్రాండీ షాప్‌లు, లిక్కర్‌ షాపుల్లో ఎంఆర్‌పిని మించి ఇరవై శాతం ఎక్కువగా అమ్మే సిండికేట్‌లకు నాయకత్వం.. వీడు బహిరంగంగా బలిసి వెంట గుండా అనుచరులతో నెత్తిపై గొడుగు పట్టించుకుని ఊరేగుతూంటే.. ఒక్క..ఒక్క పోలీస్‌ అధికారిగానీ, కలెక్టర్లు, సబ్‌ కలెక్టరు, సిగ్గులేని పౌర సమాజం ఏం చేస్తోంది. గాజులు తొడుక్కుని కూర్చుంది.. అంతే..

…అబ్బా.. యిలా రాసుకుంటూపోతే యిదంతా ఒక గ్రంథమౌతుంది.

నిర్మూలన.. కుళ్ళిపోయిన దుష్టాంగ నిర్మూలన జరగాలి. అర్జంటుగా.
కాని ఎవరు చేస్తారు..? అదీ ప్రశ్న.. అదీ దుఃఖం.. అదీ నిస్సహాయత..”

శివ ఆగిపోయాడు.. చదవడం ముందకు సాగడంలేదు. గొంతు గద్గదమైంది.

వాతావరణమంతా..ఎవరో చనిపోతే దుఃఖం చుట్టూ వ్యాపించినట్టు.. విషాద గంభీరంగాఉంది. స్తబ్దత అంతా.

”ఈ ప్రజలకు ఓదార్పు కావాలి సార్‌.. రవ్వంత ప్రేమను, బ్రతుకు పట్ల పిడికెడు భరోసాను, ఒక తలనిమిరే అనునయింపును, కొద్దిగా వాత్సల్యాన్ని అందించే ఏదో ఒక ప్రత్యామ్నాయం కావాల్సార్‌. నిజానికి అవినీతి మురుగు బురదలో కూరుకుపోయి ప్రభుత్వ వ్యవస్థలన్నీ ఎప్పుడో మృతిచెందాయి. ఈ సిస్టంను ఒక అంకుశం పోటుతో పునర్జీవింపజేయాలి..” అంటున్నాడు శివ..ఒకరకమైన ట్రాన్స్‌లోనుండి.

”మొత్తం పందొమ్మిది లక్షల ఇరవై రెండువేల నలభై మంది దుఃఖచరిత్రలు అవి శివా.. ఏ ఒక్కరూ నేను సంతోషంగా, ఆత్మసాక్షిగా, నీతిబద్ధంగా జీవిస్తున్నాడని చెప్పే పరిస్థితి లేదు. యిప్పుడు మనం వివిధ రకాల సామాజిక వర్గాల రోదనలను రికార్డ్‌ చేస్తున్నాం అంతే..ప్లీజ్‌ గొ ఎహెడ్‌..ఇంకో రెండు టిపికల్‌ కేస్‌లు విన్పించండి.” అన్నారు గోపీనాథ్‌.

శివ.. మరో కాగితాన్ని తీశాడు బయటికి.

”మూడు కేసులు విన్పిస్తున్నాను సార్‌. ఒకటి ఒక వేశ్యది. ఒకటి ఒక రచయితది. మరొకటి ఒక వైస్‌ ఛాన్స్‌లర్‌ది.. మొదటి కేస్‌.. పేరు బి. శ్యామల (నిజమైన పేరే) వయస్సు. ఇరవై ఏడు. వృత్తి శరీరాన్నమ్ముకోవడం. శరీరాన్నీ నమ్ముకోవడం. మొదటి ప్రశ్న : మూడవ ఆప్షన్‌కు టిక్‌ చేయబోయి.. మధ్యలో ఆగి.. రాసింది స్వయంగా.. అస్సలే భరించలేని కంపువలె ఈ సమాజం కలుషితమైపోయింది. రెండవ ప్రశ్న : నేను వేశ్యను. నాది అతినీతివంతమైన వృత్తి. సుఖాన్నందిస్తా, డబ్బు తీసుకుంటా. వృత్తి విషయంగా ఎటువంటి ఆత్మవంచన లేకుండా చాలా శుద్ధంగా, తృప్తిగా జీవిస్తున్నా. ఇప్పుడే పేపర్‌ చూచిన.. ఆంధ్రప్రదేశ్‌లో 6596 మద్యం షాపులను 7000 కోట్ల రూపాయలకోసం ప్రభుత్వం వేలం వేసి సంపాదించడంకంటే ఈ దిక్కుమాలిన ప్రభుత్వం వేశ్యాగృహాలను నడుపవచ్చనిపిస్తోంది. వేలంలో వందమంది మహిళలుకూడా పాల్గొని మద్యం షాపులను దక్కించుకున్నారట.. వాహ్‌ా.. భారతీయ పవిత్ర మహిళా నీకు జోహార్లు.. మహిళలందరం వీళ్ళందరికి హారతలు పట్టాలి. పోతే.. పత్రికలు చాలా స్పష్టంగా ఈ మద్యం షాపులు ఏఏ ప్రాంఆల్లో ఏఏ పార్టీవాళ్లు ఎన్ని దక్కించుకుని ఎవరెవరు సిండికేట్లుగా ఏర్పడ్డారో, ఏఏ మంత్రుల కొడుకులు, అల్లుళ్ళు, ఎక్కడెక్కడ ఎన్ని పదుల బార్లను నెలకొల్పబోతున్నారో రాశారు. సిగ్గులేని ఈ పార్టీల అధినాయకత్వం ఏంజేస్తోంది. వీళ్లపైన ఏ చర్యలూ తీసుకోకుండా ఎందుకిలా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు.. దేశాన్ని నడిబజార్లోపెట్టి మద్యం, మగువ, కమీషన్లు.. పర్సంటేజ్‌లు, ప్రమాణాలు లేని కాంట్రాక్ట్‌లు.. వీటిపేర దోచుకుంటూంటే.. వీళ్ళందరికంటే వేశ్యనైన నేను ఎంతో నీతిగా జీవిస్తున్నందుకు గర్విస్తున్నాను. ఈ రాజకీయ పార్టీల అధినేతలు నా కాలిగోటిక్కూడా సమానంకారు..”

చదువడం ఆగగానే.. గోపీనాథ్‌, రామం, క్యాథీ.. ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు ఆ అమ్మాయి ఆత్మచైతన్యానికి పొంగిపోయారు.

శివ మరొక కాగితాన్ని ఎంపిక చేసి తీశాడు బయటికి.

”పేరు : కె. నరసింహారావు. వృత్తి : యిదివరకు ఉపాధ్యాయుణ్ణి. కాని రచయితను, కవిని. వయస్సు : అరవై ఏడు సంవత్సరలు. ఊరు : పరకాల.

మొదటి ప్రశ్న: నిస్సందేహంగా ఈ దేశం నైతికంగా కుళ్ళిపోయి కంపుకొడ్తోంది.

రెండవ ప్రశ్న : అసలు ఈ దిగజారిన రాజకీయాల వల్ల ధ్వంసమైపోయిన మానవ సమాజం, తద్వారా విజృంభిస్తున్న రాక్షస అరాచకత్వం.. వీటికి అసలు మూలాలెక్కడున్నాయో వెదకాలి. ఒక చిన్న కూలీపనికోసమైనా వ్యక్తిని ఎంచుకునేటప్పుడు వాడు ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించగలడా లేడా.. వానికా పనితనముందా లేదా అని పరీక్షించుకుని ఎంచుకుంటాం. కూలీల అడ్డాపైన. అలాగే చిన్న అటెండర్‌ పోస్ట్‌క్కూడా కనీసం ఎస్సెస్సీ క్వాలిఫికేషన్‌ ఉండాలని ఒక అర్హతను నిర్ధారిస్తాం. ఈ ఉద్యోగానికి యిది వయోపరిమితి.. అని ఓ రూల్‌ పెడ్తాం. ఫలాన పనికి ఈ నిపుణత కావాలని ఒక ఇంటర్వ్యూ నిర్వహిస్తాం. కాని భారతదేశంలో ఒక్క రాజకీయాలకు మాత్రం ఏ నిబంధనా లేదు.. ఎటువంటి అర్హతా లేదు..ఎవడైనా రాజకీయాల్లో ఎమ్మెల్యే కావచ్చు. ఎంపి కావచ్చు. మంత్రి కావచ్చు, ప్రజల నుదుటిరాతను రాసే శాసనకర్త కావచ్చు.. వాని ప్రతిభతో నిమిత్తం లేకుండా ఏ శాఖనైనా పరమఛండాలంగా, అసమర్థంగా నిర్వహిస్తూ ప్రజాధనాన్ని స్వాహా చేయవచ్చు.. కాళ్ళు, చేతులు, శరీరం పనిచేయని ఎనభై ఏళ్ళ వయసుకు వచ్చినా యింకా యింకా ప్రజలనెత్తిపై కూర్చుని స్వారీ చేయవచ్చు.. పందికొక్కుల్లా దేశాన్ని తోడుకుని భోంచేయవచ్చు.. ఏమిటిది..ఎందుకిలా.. వీళ్ళకు మాత్రం ఒక మార్గదర్శకాల కోడ్‌, కనీస విద్యార్హత, ప్రభుత్వ ఉద్యోగులపై పోలీస్‌ ఎంక్వయిరీ చేయించినట్టు ప్రవర్తనపై నిఘా, పదవీ విరమణ వయస్సు ఎందుకుండకూడదు. వీళ్ళక్కూడా ఇలా కనీస అర్హతలను రాజ్యాంగబద్ధంగా నిర్ధారించి అమలుచేస్తే సగంకన్నా ఎక్కువ రాజకీయ దరిద్రం దానంతటదే పోతుంది. ఈ కోణంలో మేధావులు లోతుగా విచారణ చేయాలి. ప్రభుత్వాలపై కావలిస్తే కోర్టుల ద్వారా ఒత్తిడి తేవాలి.
”అసలు.. మనుషుల్లో నేను ఈ పనిచేయడం తప్పు. ఇది నైతికంగా కూడనిపని. నా చర్యవల్ల తోటి మానవ సమూహానికి ద్రోహం చేస్తున్నాననే స్పృహ ఎందుకుండడంలేదు. నాకనిపిస్తోంది. మనం ఇంకా అడ్వాన్స్‌డ్‌ స్టేజెస్‌లో ‘డబ్బు సంపాదించాలి.. ఎంత ఛండాలమైన పని చేసైనా సరే డబ్బు సంపాదించాలి.. ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత డబ్బును ఏదోవిధంగా సంపాదించాలి’ అని ఇన్ని దురాగతాలకు పాల్పుడ్తునవారికి స్పెషల్‌ కౌన్సిలింగు క్లాసులు నిర్వహించాలనుకుంటా మన జనసేన సభల్లో.. అందరి సమక్షంలో..”

‘ఎలా మార్తారు వీళ్ళు..’ అని రామం తనలోతాను గొణుక్కుంటున్నట్టుగా అనుకోవడం ప్రక్కనున్న క్యాథీకి వినిపించింది. ఆమె మౌనంగానే అతనివంక చూచి.. మళ్ళీ

శివ చదువబోతున్న మరో ప్రతిస్పందన దిక్కు దృష్టి మరల్చింది.

”ఒక చిన్న అంతరాయం సర్‌.. మనుషుల్లో పశ్చాత్తాపం ఉంటుందా.. యిది వినండి..”

నా పేరు.. (రాయను) వృత్తి : ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నడిపాను. వయస్సు : యాభై సంవత్సరాలు. యిప్పుడు చర్లపల్లి జైలులో ఉన్నాను. జైలునుండే ఈ జవాబు.

మొదటిప్రశ్న:  సమాజం మహారోతగా కుళ్లిపోయింది.. ఇది పచ్చినిజం

రెండవప్రశ్న : నేను పద్నాల్గువందల కోట్ల స్కాం చేశాను. మనిషి ఎందుకు నావలె యింత ఘోరమైన తప్పు చేస్తాడు. దానికి జవాబు.. తప్పు చేసే అవకాశం ఉండడం, పట్టుబడే అవకాశాలు లేవని భరోసా లభించడం, అసలు అంత డబ్బు ఎందుకో తెలియని ఒకపిచ్చి వ్యామోమం.. అంతరాంతరాల్లో నిర్లజ్జతో కూడాన నేరతత్వం..అందువల్ల.

మొన్న జైల్లో ఉన్న నన్ను పరామర్శించడానికి వచ్చిన నా తండ్రి అడిగాడు.. ‘ఓరే.. నేనెప్పుడూ మాకోసం యిటువంటి దేశద్రోహచర్య, దొంగతనం చేయమని చెప్పలేదు కదరా..అసలెందుకు చేశావ్‌ తప్పు.. ” అని మర్నాడు నా యిద్దరు పిల్లలు. నా భార్య వచ్చి.. ‘మా కోసం యిన్ని వేల కోట్ల స్కాం చేయమని, తద్వారా మమ్మల్ని  సుఖపెట్టమని ఎప్పుడూ  మేం చెప్పలేదుగదా.. మేం సమాజంలో తలెత్తుకొని తిరక్కుండా ఈ నేరం ఎందుకు చేశారు” అని నిలదీశారు. ఎవరో కవి అన్నట్టు.. ‘సగం జీవితం నన్ను కన్నవాళ్ళ కోసం, సగం జీవితం నేను కన్నవాళ్ళకోసమే గడిచిపోయింది.. అసలు నా జీవితమేది.. అన్నట్టు అటు నన్ను కన్నవాళ్ళు ఇటు నేను కన్నవాళ్ళూ నేను చేసిన నేరాన్ని ప్రశ్నిస్తున్నపుడు…నిజంగానే అసలీ ఘోరమైన కోట్లాదిరూపాయల స్కాంను ఎందుకు చేసినట్టు ఎవరికోసం చేసినట్టు..సిగ్గనిపిస్తోంది. దుఃఖం ముంచుకొస్తోంది. నాపై నాకే అసహ్యం కల్గుతోది.. పశ్చాత్తాపంతో చెంపలేసుకోవాలనిపిస్తోంది.. ప్రద్నాల్గువందలకోట్ల ప్రజాధనాన్ని తిన్న నన్ను యింకా సజీవంగా, క్షేమంగా రాచమర్యాదలతో జైల్లో అతిధివలె చూచుకుంటూ, దేశద్రోహ నేరంక్రింద షూట్‌ చేయకుండా బ్రతకనివ్వడం ఈ దేశంలో ఉన్న ఉదాసీన అలసత్వానికి నిదర్శనం. ద్రోహికి సత్వరమే శిక్ష పడాలి..”

”ఊఁ.. ఔను.. ” అనుకున్నాడు రామం.. డాక్టర్‌ గోపీనాథ్‌ ఒక్కసారే.. ఎవరికి వారే.

”చివరి ప్రతిస్పందన సార్‌..”

నాపేరు రాంనరసింహారెడ్డి. వృత్తి  : వైస్‌ చాన్స్‌లర్‌ (యూనివర్సిటీ పేరు చెప్పను) వయస్సు అరవై ఏండ్లు.

మొదటి ప్రశ్న : నిస్సందేహంగా దేశం పూర్తిగా కుళ్ళిపోయింది.

రెండవ ప్రశ్న : విపరీతమైన పైరవీలు చేసి, రాజకీయ నాయకుల, మంత్రుల ప్రమేయంతోని, డబ్బుతోనే నేను కూడా వైస్‌ ఛాన్స్‌లర్‌ అయ్యాను. ఆ మాట కొస్తే. ఈ దేశంలోని వైస్‌ చాన్స్‌లర్లలో తొంభైశాతంకంటే ఎక్కువమంది నాలాగే అనేక అవినీతికర మార్గాలద్వారానే పదవుల్లోకొచ్చారు. కొండపైకి ఎక్కినతర్వాత కిందికి చూస్తే అంతా వివరంగా కనబడ్డట్టు.. ఇటువంటి ఉన్నతమైన స్థానంలోకి వచ్చాక పెద్దవాళ్ళ పనుల లోలోతుల్లోకి తొంగి చూస్తే మహాఛండాలంగా ఉంది. మొన్నకు మొన్న చూశాంగదా ప్రొఫెసర్‌గా సరస్వతీ దేవికీ, వైద్యునిగా ధన్వంతరికీ ప్రతిబింబంగా ఉండవలసిన ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఒక మెడికల్‌ కాలేజికి అడ్డదారిలో సహాయం చేయడానికి రెండుకోట్ల లంచం తీసుకుంటూ పట్టుబడి దానికి కొనసాగింపుగా ఎసిబీ దాడిలో పద్దెనిమిది వందలకోట్ల రూపాయల నగదు, పదిహేను వందల కిలోల బంగారంతో దొరికిపోయాడు. అంతకుముందు జాతీయస్థాయి అత్యున్నత సంస్థ అఖిల భారత సాంకేతిక విద్యామండలి చైర్మన్‌పై, ఒక డైరెక్టర్‌పై ఎసిబి దాడిచేస్తే వందలకోట్లు దొరికాయి. విశ్వవిద్యాలయాలను నియంత్రించే యుజిసి అవినీతిపై వందల కథలున్నాయి. వీళ్ళపై ఏదో ఒక కఠిన చర్య తీసుకుని యిక మున్ముందు ఇటువంటి తప్పులు ఎవరూ చేయకుండా ప్రభుత్వం ఏదైనా చేయగలిగిందా. ఉహుఁ.. ఏం జరుగుతోంది. ఈ దేశం ఏమైపోతోంది. పవిత్రమైన విద్యావ్యవస్థలోకి జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రాజకీయాలు ఎంతస్థాయికి ప్రవేశించి వ్యాపించాయంటే.. వీటిని తొలగించి దీన్ని ఎవడూ శుభ్రం చేయలేరు. ఇందుకు తగ్గట్లు సర్వబలహీనతలకూ బానిసలైన యువకులు విశ్వవిద్యాలయ స్థాయిలో ఏ ప్రామాణికమైన స్థాయికీ చేరలేక, నాణ్యతను సాధించలేక పి.హెచ్‌డీ చేసిన వానికి ఒక్క దరఖాస్తును తప్పులేకుండా రాయడం చేతగాక, తప్పు లేకుండా నాల్గు ఇంగ్లీష్‌ వాక్యాలు మాట్లాడలేక.. అంతా ట్రాష్‌.. ఇక స్టాఫ్‌.. అన్నీ రాజకీయాలే. కుల రాజకీయాలు పార్టీ రాజకీయాలు, ఉగ్రవాద, మత రాజకీయాలు, బ్లాక్‌మెయిలింగు తంతులు.. చెదలు.. చెదలుపట్టిపోయిది విద్యావ్యవస్థ. పైకి ఒక మేడిపండు. లోపలంతా పురుగులు.. చెత్త.. చెదారం.. ప్రతి విశ్వవిద్యాలయం ఒక చెత్తకుండీ.. కష్టం. దీన్ని బాగుచేయడం కష్టం.. ఈ వారం నేను పదవీ విరమణ చేస్తున్నా.. ఏదో బాగు చేయాలని.. ప్రయత్నం చేసీ చేసీ అలసిపోయిన.. నా వశం కావడం లేదు.. సారీ..భారతదేశమా సారీ.. నన్ను క్షమించు తల్లీ.”

శివ చదవడం ఆపాడు.

ఏ లేఖ చదివినా.. కదిపినా కన్నీళ్లే.. ఏమిటిది..ఎలా.. ఈ స్థితికి పరిష్కారం ఏమిటి. ఎవనికివాడు వాని పనిచేసుకుని ప్రశాంతంగా బతుకనీయకుండా ప్రజాజీవితాల్లోకి రాజకీయాలు యింతలోతుగా చొచ్చుకురావడం అవసరమా. అన్ని టి.వి. వార్తాచానళ్లు ఇరవై నాల్గుగంటలు ఈ కుళ్ళు రాజకీయాలనే వార్తలుగా, చర్చలుగా, ఎపిసోడ్సుగా, వ్యాఖ్యలుగా.. ఇంకేదేదో పేర్లతో నిరంతరం ప్రసారం చేసీ చేసీ ప్రజలను హింసించడం., ఊదరగొట్టడం అవసరమా.
వ్చ్‌.. ఏదో చేయాలి.. ఏదో ఒకటి తప్పకుండా చేయాలి.
అందుకే ఈ ‘అవగాహన’

అల్లూరి సీతారామరాజు మన్యవిప్లవం ప్రకటించే ముందు పరిస్థితిని ఆకళింపు చేసుకునేందుకు దేశమంతా అవగాహన పర్యటన చేశాడు. గాంధీ బ్రిటిష్‌ ప్రభుత్వంపై సహాయ నిరాకరణ  ప్రతిఘటనను ప్రకటించేముందు విస్తృతంగా భారతదేశమంతా గ్రామగ్రామం పర్యటించి ప్రజల హృదయాన్ని అధ్యయనం చేశాడు.
అధ్యయనం ఎంతో అవసరమని భావించి.. దాదాపు వేయిమంది జనసేన కార్యకర్తలు రెండు ప్రశ్నలతో జనాన్ని కదిలిస్తే.. ఒక నిప్పుల సముద్రం గాండ్రించినట్టు.. గర్జించే ఆకాశం కన్నీళ్ళ తుఫానును వర్షించినట్టు.. అంతా దుఃఖం.. వేదన.. క్షోభ.. దిక్కులేని అనాధల్లా రోదన..
‘అవగాహన’ ఒక పిడికెడు గుండెలోని ఉప్పెనను విప్పి చూపించింది.

నలుగురూ విధిలేక ఒకరి మొగాన్నొకరు చూచుకుంటూండగా,

బయట ఆకాశం భీకరంగా గర్జించింది ఒక్కసారిగా.. టపటపా పెద్దపెద్ద చినుకులతో వర్షం ప్రారంభమైంది.
శివ వాచీవైపు చూశాడు.

టైం పదకొండు గంటల యాభై నిముషాలైంది.
రామం మౌనంగా లేచి.. తన గదివైపు కదుల్తూ.. ”గుడ్‌నైట్‌..” అన్నాడు.

అంతా విషాద గంభీరం.

( సశేషం)

వీలునామా – 32 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

బ్రాండన్ ప్రేమలేఖ

మేనల్లుడు ఎడ్గర్తోసహా మెల్బోర్న్ చేరుకున్న బ్రాండన్ హుటాహుటిని తన ఎస్టేటు బార్రాగాంగ్ చేరుకున్నాడు. అయితే అక్కడ పరిస్థితి తనూహించినంత దారుణంగా లేకపోవడంతో కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. అతని మేనేజరు స్వతహాగా కొంచెం భయస్తుడు కావడంతో బ్రాండన్ ని ఊరు రమ్మని కబురుచేసాడే కానీ, ఎస్టేటు డబ్బు వ్యవహారమంతా సజావుగానే వుంది.

ఆమాటకొస్తే ఫిలిప్స్ ఎస్టేటు విషయాలే కొంచెం తల్ల క్రిందులుగా నడుస్తున్నట్టనిపించింది బ్రాండన్ కి. స్టాన్లీ ఒకసారి వచ్చి తన ఎస్టేటు వ్యవహారాలమీద ఒక కన్నేసి ఉంచడం మంచిదేమో అనుకున్నాడు. వీలైతే ఈ విషయమై స్నేహితుణ్ణీ ఒకసారి చూచాయగా హెచ్చరించాలనీ అనుకున్నాడు. అయితే స్టాన్లీ మేనేజరు డాక్టరు గ్రాంట్ మాత్రం అంతా హాయిగానే వుందని ఉత్తరాల మీద ఉత్తరాలు గుప్పించేస్తున్నాడు.

కొద్దిరోజులు ఎస్టేటు పనులు చూసుకుని, ఒకరోజు ఎల్సీ కొక ఉత్తరం రాయాలని కూర్చున్నాడు బ్రాండన్. హేరియట్ తో తనకింకే సంబంధమూ లేదనీ, తన మన్సులో ఎల్సీ పట్ల ప్రేమ కొంచెమైనా తగ్గకపోగా, ఇంకా పెరిగిందనీ, ఇంకా చాలా చాలా విషయాలు రాయాలనుకున్నాడు. అయితే ఇలాటి వన్నీ ఎదురుగా కూర్చుని చెప్పడం అయితే చేయొచ్చుగానీ, రాయడం కొంచెం కష్టమే. అందులోనూ భాష మీద పెద్దగా పట్టులేని బ్రాండన్ లాటి మగవాడికి.

ఎదురుగా అయితే, మెత్తటి ఆమె చేయి పట్టుకుని, కళ్ళల్లోకి చూస్తూ, మనసులోని ప్రేమనంతా గొంతులోకి నింపుకోవచ్చు. అప్పుడు ఒక్క మాటలో, లక్షలకొద్దీ భావాలు పంచుకోవడానికి వీలవుతుంది. కానీ, ఏమాత్రం హృదయం లేని కాగితమూ, కలం సహాయంతో మనసు లోతుల్లోని భావాలనెలా మాటల్లోకి మార్చడం? అందులోనూ, తను ఆమె నిరాకరించగానే ఇంకా ప్రాధేయపడడం మానేసి వెంటనే మరొక అమ్మాయితో పెళ్ళి నిశ్చయం చేసుకొచ్చాడు. అతనికి హేరియట్ ఫిలిప్స్ కానీ, ఆమెతో తనకి తప్పిపోయిన పెళ్ళి కానీ గుర్తొస్తే మనసంతా చేదు మింగినట్టనిపిస్తుంది. తనలాటి తెలివి తక్కువ దద్దమ్మనీ, చపల చిత్తుణ్ణీ ఎల్సీలాటి దేవత క్షమించి ప్రేమిస్తుందా? ఈ అందోళనతో అతను దాదాపు అర డజను ఉత్తరాలు రాసి చించేసాడు. అందులోనూ ఆమె ఎంతో చదువుకుని కవిత్వంకూడా రాయగల స్త్రీ. తన లాటి విద్యాగంధం లేని మొరటు మనిషి కాదు.

ఇంగ్లండులో వుండగానే చెప్పడానికి వీలు కాకపోయింది. కొంపలంటుకున్నట్టు కబురుచేసి తనని రప్పించిన మేనేజరుని కొట్టాలన్నంత కోపం వచ్చిందతనికి. ఆఖర్న వచ్చే రోజన్నా చెప్దామంటే శని గ్రహం లా పట్టుకుని వదల్లేదు హేరియట్. అతనికి చుట్టూ వున్న మనుషులందరిమీదా చిరాకు ముంచుకొచ్చింది.

పోనీ, ఎమిలీ తోనో జేన్ తో నైనా చెప్పి రావాల్సిందేమో. వయసుకి చిన్నదైనా ఎమిలీ తెలివైనది, అర్థం చేసుకోగలదీ. ఇహ జేన్ కీ ఎల్సీ కి వున్న అనుబంధమైతే చెప్పనే అక్కర్లేదు. వాళ్ళిద్దర్లో ఒకరు తప్పక ఎల్సీకి తన మనసులోని మాట వివరంగా చెప్పేవారు.

ఎల్సీ చాలా మంచి అమ్మాయి. ఒక్కసారి కనక తను ఆమె లేకపోతే బ్రతకలేడన్న విషయం ఆమెకి అర్థమైతే చాలు. అది ఆమెకి అర్థం అయేలా చెప్పడం ఎలాగో తోచడం లేదతనికి.

మొత్తానికి ఆ రాత్రంతా కూర్చుని ఎలాగో ఉత్తరాన్ని పుర్తి చేసాడు బ్రాండన్. అది అతనికి కావల్సినంత బాగా రాలేదు కానీ, ఇహ ఓపిక లేకపోయిందతనికి. పైగా ఆ మర్నాడే పోస్టు వెళ్ళిపోతుంది. ఉత్తరం పోస్టులో వెళ్ళిపోయింతర్వాత అతనికి టెన్షన్ తో కాలు నిలవలేదు. పైగా ఫిలిప్స్ కుటుంబం కూడా దగ్గర లేదు. అందులోను స్టాన్లీ పిల్లలంటే బ్రాండన్ కి చాలా ఇష్టం కూడాను.  అతనికి దిగులుగా కాలం భారంగా సాగుతున్నట్టనిపిస్తూంది.

ఫిలిప్స్ మేనేజరు డాక్టరు గ్రాంట్ ఏమాత్రం నచ్చలేదు బ్రాండన్ కి. ఫిలిప్స్ ని రమ్మని రాయాలి, మళ్ళీ అనుకున్నాడు బ్రాండన్. గ్రాంట్ డబ్బు లెక్కలు నమ్మదగ్గవిగా అనిపించడంలేదు, పనివాళ్ళ మీద చలాయించే అధికారం బాగాలేదు. అతని శైలి నచ్చని పనివాళ్ళందరూ ఎస్టేటు వదిలి వెళ్ళిపోతున్నారు. ఇక మీదట ఫిలిప్స్ ఎస్టేటు విర్రావిల్టా వ్యవహారలన్నీ తానే చూసుకుంటానని చెప్పి బ్రాండన్ డాక్టర్ గ్రాంట్ ని తప్పించాడు. సహజంగానే గ్రాంట్ చాలా అవమాన పడ్డాడు. దానికి తోడు వచ్చే పై అదాయం కూడా తగ్గిపోతుందాయే.

veelunama11

అయితే ఎస్టేటులో పనివాళ్ళు మాత్రం ఫిలిప్స్ చిరకాల మిత్రుడు బ్రాండన్ కళ్ళాలు చేతిలోకి తీసుకోవడం చూసి చాలా సంతోషపడ్డారు. కొన్నళ్ళు ఆ పని హడావిడితో గడిచిపోయింది.

ఈలోగా ఎడ్గర్ కొత్త ప్రదేశానికి బానే అలవాటు పడ్డాడు. మేనమామ బ్రాండన్ కి బాగా చేరువయ్యాడు కూడా. సొంతంగా వ్యవహరించడం, గుర్రపు స్వారీ, పరిసరాలని నిశితంగా పరిశీలించడం లాటి వెన్నో నేర్చుకున్నాడు ఎడ్గర్. అతని తెలివితేటలూ, కష్టపడే మనస్తత్వమూ చూసి బ్రాండన్ ముచ్చటపడ్డాడు.

ఒకనాడు- మామూలు కబుర్లలో తనకి ఆస్ట్రేలియా చుట్టి తిరిగాలని వుందన్నాడు ఎడ్గర్. వింటున్న బ్రాండన్ కి వెంటనే తాము కొంచెం అలా తిరిగి ఆస్ట్రేలియాలోని మిగతా పట్టణాలు చూసి వస్తేనో, అనిపించింది. అన్నిటికంటే అడిలైడ్ పట్టణం చూడాలని అతను ఎన్నో రోజులనించి అనుకుంటున్నాడు. అక్కడ ముఖ్యంగా ఒక కొత్త రకం గొర్రెలు దొరుకుతున్నాయనీ, వీలైతే ఒక చిన్న మంద ని కొందామనీ అనుకున్నాడు. ప్రయాణమూ, పనిలో తలమునకలుగా వుంటే ఎల్సీ జవాబు కోసం ఎదురు చూడడం అంత దిగులుగా వుండకపోవచ్చు. ఒకవేళ అదృష్టవశాత్తూ ఎల్సీ తన ప్రేమనంగీకరిస్తే, తను ఉన్నపాటున వెళ్ళి ఆమెని పెళ్ళాడి ఇక్కడకి తీసుకొచ్చే పని ఎలాగూ వుంటుంది. అందుకే ఇప్పుడు అలా నాలుగు వూర్లూ తిరిగి తన ఎస్టేటు కి కావాల్సిన కొత్త రకాల గొర్రెలని కొనడం మంచిది.

మేనమామ ప్రయాణానికొప్పుకోగానే ఎగిరి గంతేసాడు ఎడ్గర్. గబగబా ప్రయాణానికి ఏర్పాట్లు మొదలు పెట్టాడు. అతని చురుకుతనమూ, హడావిడీ చూసి వుంటే అతని తల్లి ముక్కున వేలేసుకునేది. ఇంగ్లండులో వుండగా తల్లి చాటు బిడ్డగా, అమాయకంగా వుండిన ఎడ్గర్ ఇప్పుడు స్వతంత్రంగా ఆలోచించడమూ, ఇష్టాఇష్టాలు చెప్పడమూ నేర్చుకున్నాడు. అతను చేస్తున్న శారీరక శ్రమా, ఒంటరిగా పరిసరాలను పరిశోధిస్తున్న అతని ధైర్యమూ చూస్తే అతని తల్లి భయంతో గడగడా వొణికిపోయేది. కొన్నాళ్ళు తల్లికి దూరంగా వుందడం అతనికి మంచి చేసిందనే చెప్పాలి.

మామా అల్లుళ్ళిద్దరూ దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ పట్టణం చేరుకున్నారు. ఇక్కడ ప్రజలు కొంచెం అమాయకంగా, అందర్ని నమ్మేస్తూ వున్నారే, అనుకున్నారు అడిలైడ్ లోని మనుషులని చూసి.

అడిలైడ్ లో హోటల్లో దిగగానే బ్రాండన్ గొర్రెల మంద ఖరీదు చేయడానికి వెళ్ళిపోయాడు. స్టాన్లీ ఫిలిప్స్ కోసం కూడా ఖరీదు చేసాడు. ధర నచ్చడంతో ఇద్దరికీ కలిపి ఒక మందను కొని ఆ పని పుర్తి చేసి, నగరం చూడడానికి ఎడ్గర్ తో సహా బయల్దేరాడు.

ఎడ్గర్ మెల్బోర్న్ కంటే అడిలైడ్ అందంగా వుంది అనుకున్నాడు. బ్రాండన్ మెల్బోర్న్ తో పోలిస్తే అడిలైడ్ చాలా నెమ్మదిగా ప్రశాంతంగా వుందనుకున్నాడు. ధనవంతులు కూడా తక్కువే ననిపించింది. అయితే ఖరీదులు మాత్రం తక్కువే. ఎస్టేటులూ, ద్రాక్షతోటలూ, జీవన విధానమూ మెల్బోర్న్ కంటే అడిలైడ్ లో బాగున్నాయనుకున్నారు ఇద్దరూ.

మెల్బోర్న్ లో వుండే డబ్బంతా బంగారం తవ్వకాలనించి వచ్చిందే. ఆ పనులు చేసుకునే వాళ్ళు కొంచెం మొరటుగా వుంటారు. ప్రభుత్వ నియంత్రణలూ ఎక్కువే. దక్షిణ ఆస్ట్రేలియా ధనమంతా ద్రాక్ష తోటలూ, వైన్ తయారీ, పశు సంపదా నించి వచ్చింది. సహజంగా ఈ వ్యాపారాలు చేసే వారు ధనవంతులూ, విద్యావంతులూ అయివుంటారు. అందువల్ల సంఘంలో కొంచెం నాజూకూ, నాగరికతా కనిపిస్తాయి.

వాళ్ళిద్దరూ అడిలైడ్ లోని యార్క్ హోటల్ లో బస చేసారు. బ్రాండన్ తనకి లండన్ లో పరిచయమైన స్నేహితులని కలిసాడు. వాళ్ళు ఇంకొందరు స్నేహితులని పరిచయం చేసారు. చాలా మంది పెళ్ళి కావల్సిన ఆడపిల్లలూ కనపడ్డారతనికి. అయితే మనసంతా ఎల్సీ ఆలొచనలతో నిండి వుండడం వల్ల అతను ఎవరినీ శ్రధ్ధగా చూడలేదు. తనకేదైనా ఉత్తరం వస్తే అది వెంటనే అడిలైడ్ లో హోటల్ కి పంపాల్సిందని అతను తన మేనేజరు టాల్బాట్ కి పదే పదే చెప్పాడు. అయితే ఎన్ని రోజులు గడిచినా అతను ఎదురుచూస్తున్న ఉత్తరం రానేలేదు.

ఒక నెల రోజుల కింద ఎమిలీ దగ్గరనించి వచ్చిన ఉత్తరం తర్వాత ఇంకే ఉత్తరమూ లేదు. ఆ ఉత్తరంలో ఎమిలీ అందరూ జ్వర పడ్డారనీ, చిన్నది ఈవా మరణించిందనీ, తాము మాత్రం కోలుకుంటున్నామనీ రాసింది. ఆ తరవాత ఇక ఏ సమాచారమూ లేదు వాళ్ళ దగ్గర్నించి. ఈ పాటికి తన ఉత్తరానికి జవాబూ రావాలి. మరి ఏమైందో! తనకీ ఏదైనా జబ్బు చేసిందేమో. అలాగైతే జేన్ తో నైనా రాయించొచ్చుగా?  లేకపోతే ఇద్దరూ జబ్బు పడ్డారేమో! అతనికి ఏ విషయమూ తెలీక పిచ్చెత్తేలాగుంది. అలాటి అల్లకల్లోలంగా వున్న మనసుతోనే బ్రాండన్ మేనల్లుడితో సహా మెల్బోర్న్ తిరిగి వచ్చి చేరాడు.

***

(సశేషం)

ఒకే కథలో ధ్వనిస్తున్న రెండు గొంతులు

king samvarna

తపతి-సంవరణుల కథను మరీ లోతుగా అక్కర్లేదు, పై పైనే పరిశీలించండి…కొన్ని సందేహాలు కలుగుతాయి.

ఉదాహరణకు, తపతి కనుమరుగయ్యాక సంవరణుడు మూర్చితుడై పడిపోయాడు, మంత్రి అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు, ఉపచారాలు చేశాడు, సంవరణుడు అక్కడే ఉండిపోడానికి నిశ్చయించుకుని మంత్రిని, పరివారాన్ని పంపేశాడు. ఆ తర్వాత వశిష్టుని తలచుకున్నాడు.

సాధారణబుద్ధితో చూద్దాం. నిజానికి  సంవరణుడు వశిష్టుని తలచుకో నవసరమే లేదు. మంత్రితో వశిష్టునికి కబురు పెడితే చాలు. వాస్తవంగా అదే చేసి ఉంటాడు. కానీ కథకుడు ఇక్కడ సంవరణునికో, లేదా వశిష్టునికో, లేదా ఇద్దరికీనో ఒక మహిమను, మాంత్రికతను ఆపాదిస్తున్నాడు. అలా ఆపాదించడం అతనికి ఇష్టం!

కాకపోతే, ఆ ఆపాదించడం కూడా, అది  ‘ఆపాదన’ అనే సంగతి తెలిసిపోయేలా చేస్తున్నాడు.  ఆ తర్వాత వశిష్టుడు పన్నెండు రోజులకు సంవరణుని దగ్గరకు వచ్చాడని చెప్పడం ద్వారా కూడా అది ఆపాదన అనే సంగతి తెలిసిపోతూ ఉండచ్చు.

వశిష్టుడు వచ్చాడనీ, సంవరణుడు తపతి మీద మనసు పడిన సంగతిని యోగదృష్టితో తెలుసుకున్నాడనీ కథకుడు చెబుతున్నాడు. ఇక్కడ యోగదృష్టి అవసరమా? ఎందుకంటే, తను తపతి మీద మనసుపడి ఆమెను పెళ్లాడదలచుకున్నాడు కనుక, అది జరిగేలా చూడడం కోసమే కదా వశిష్టునికి సంవరణుడు కబురుచేసింది? వశిష్టునికి ఆ విషయం తన నోటితోనే చెప్పి ఉండాలి కదా? వశిష్టుడు యోగదృష్టితో చూసి మరీ ఆ విషయం తెలుసుకోవలసిన అవసరం ఏముంది? ఏముందంటే, అలా చెప్పడం కథకునికి ఇష్టం!

ఆ తర్వాత చూడండి…వశిష్టుడు అప్పటికప్పుడు బయలుదేరి సూర్యమండలానికి వెళ్ళాడు. సంవరణుడు తలచుకోగానే పన్నెండు రోజులకు అతని దగ్గరకు వశిష్టుడు వెళ్లాడని చెప్పిన కథకుడు, ఆయన సూర్యమండలానికి ఎన్ని రోజుల్లో వెళ్లాడో, ఎలా వెళ్లాడో చెప్పలేదు. కానీ తిరుగు ప్రయాణంలో మాత్రం, నిమిషానికి మూడువందల అరవైనాలుగు యోజనాల దూరం ప్రయాణించే సూర్యరథంలో తపతిని వెంటబెట్టుకుని వశిష్టుడు సంవరణుని దగ్గరకు వచ్చాడని చెప్పాడు. వెళ్ళేటప్పుడు అవసరం లేకపోయిన సూర్యరథం, వచ్చేటప్పుడు ఎందుకు అవసరమైందనే ప్రశ్న ఇక్కడ రావడం సహజమే. వశిష్టుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళినా, వచ్చేటప్పుడు మాత్రం సూర్యుడు అతని మీద గౌరవంతోనే కాక, తన హోదాకు తగినట్టుగా తన రథమిచ్చి కూతురితోపాటు పంపించాడా? లేక, వెళ్ళేటప్పుడు వశిష్టుడు తన మంత్రశక్తితో వెళ్ళినా, వచ్చేటప్పుడు తపతి కూడా తన వెంట కూడా ఉంది కనుక, ఆమెకు ఆ మంత్రశక్తి లేదు కనుక సూర్యరథంలో తిరిగి వచ్చాడా? అదే అయితే, సూర్యుని కూతురికి మంత్రశక్తి లేదని ఎలా అనుకోవాలి? లేక, పెళ్లి కూతురు కనుక ఆమెను రథంలో పంపించాలని సూర్యుడు అనుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం లేదు. అసలిలాంటి ప్రశ్నల జోలికి వెళ్లకుండా సింపుల్ గా చెప్పుకుంటే, వశిష్టుడు నిముషానికి మూడువందల అరవై నాలుగు యోజనాల దూరం ప్రయాణించే సూర్యరథంలో తిరిగి వచ్చాడని చెప్పడం…కథకునికి ఇష్టం!

కథకునికి ఇష్టం అన్నానా? చిన్న సవరణ. కథ వింటున్న శ్రోతలకూ అదే ఇష్టం. కథకుడు-శ్రోత ఇక్కడ ఒకరికొకరు పూర్తిగా అనురూపులు. అంటే ఒకరికొకరు అతికినట్టు సరిపోయేవారు. క్లుప్తంగా చెప్పాలంటే, తను తపతి మీద మనసుపడ్డాడని సంవరణుడు తన నోటితో వశిష్టుడంతటి వాడికి  చెబితే అది శ్రోతకు నచ్చదు. ఉప్పు కారం లేని వంటకంలా చప్పగా ఉంటుంది. కనుక వశిష్టుడు ఆ విషయాన్ని యోగదృష్టితో తెలుసుకున్నాడని చెబితేనే రంజుగా ఉంటుంది.

ఎలాగంటే…మహాభారతంలో అగస్త్యుడి కథ ఉంది. అగస్త్యుడు పరిసరాల పరిజ్ఞానం బాగా ఉన్నవాడు. దారీ తెన్నూ కనిపించని దుర్గమారణ్యాలు, ఆ అరణ్యాలలో ప్రమాదకరులైన తెగ జనాలు ఉండే ఆరోజుల్లో, అది చాలా విలువైన పరిజ్ఞానం. అగస్త్యుడు బహుశా వింధ్య దాటి దక్షిణాపథానికి వెళ్లడానికి అనువైన దారి కనిపెట్టిన ప్రథముడూ, లేదా ప్రముఖుడూ అయుంటాడు. అదే వింధ్యగర్వభంగం కథగా పురాణాలకు ఎక్కి ఉంటుంది. అగస్త్యుని పరిసరజ్ఞానాన్ని ధ్రువీకరించే మరో కథ కూడా ఉంది. అదేమిటంటే…కాలకేయులనే రాక్షసులు పగలు ‘సముద్రగర్భం’లో దాగి ఉంటూ రాత్రిపూట మున్యాశ్రమాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్నారు. వాళ్ళ బెడద ఎలా వదిలించుకోవాలో తెలియక దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. అగస్త్యుని ప్రార్థించమని బ్రహ్మ చెప్పాడు. వారు అలాగే చేశారు. అప్పుడు దేవతలు, యక్షులు, సిద్ధులు, సాధ్యులు వగైరాలను అగస్త్యుడు వెంటబెట్టుకుని వెళ్ళి కాలకేయులుండే చోటు చూపించాడు. అప్పుడు దేవతలు వాళ్లపై దాడి చేసినప్పుడు కొందరు చనిపోగా కొందరు పారిపోయారు.

కథకుడు ఈ కథ చెబుతున్నాడనుకోండి.  కథ మాంచి పట్టు మీద ఉన్నప్పుడు, ‘అగస్త్యుడు కాలకేయులు ఉండే చోటు దేవతలకు చూపించా’డని మాత్రమే చెబితే శ్రోతలకు నచ్చదు. అందులో ఒక అద్భుతత్వం, ఒక వైచిత్రి, ఒక మహిమ ఉండాలి. అందులోనూ ఎవరి గురించి చెబుతున్నాడు? అగస్త్యుడంతటి వాడి గురించి! కనుక అందులో పైన చెప్పినవి తప్పనిసరిగా ఉండవలసిందే. అందుకే ‘అగస్త్యుడు ఏకంగా సముద్రజలాలనే తాగేశాడనీ, దాంతో కాలకేయులు బయటపడ్డారనీ’ కథకుడు చెబుతాడు. అప్పుడు శ్రోతలు ‘ఆహా’ అంటారు.

ఆదిమకాలంలో కవిత్వమైనా, కథ అయినా, పురాణమైనా ఏకకర్తృకాలు కావు; ద్వికర్తృకాలూ, బహుకర్తృకాలూ కూడా. అందులో స్థాయీభేదాలు కలిగిన శ్రోతలు కూడా భాగస్వాములుగా ఉంటారు. తమ స్పందనరూపంలో కథకుడి ఊహలోలేని అదనపు కల్పనలను, లేదా శైలినీ, భాషనూ కథకు జోడించే అనివార్యతను కల్పిస్తూ ఉంటారు. ఆవిధంగా కథకుడు ఒక్కోసారి అప్పటికప్పుడు కథను improvise చేసుకుంటూపోతాడు. ప్రారంభంలో తను అనుకున్న వస్తువూ, రూపమూ, శైలీ, శిల్పమూ, భాషా మొదలైనవి చివరికి వస్తున్నకొద్దీ మారిపోతాయి. మొదట్లో వాగ్రూపంలో ఉంటూ వచ్చిన పురాణ, ఇతిహాస కథలకు అనేక పాఠాంతరాలు, ఒకే కథకు భిన్న రూపాలు, ఉపకథలు వగైరాలు ఏర్పడడానికి ఇదే కారణం కావచ్చు.

శ్రోతలు కూడా కథనంలో భాగస్వాములై కథ ఎలా ఉండాలో నిర్దేశించడం, ఆ శ్రోతలను రంజింప జేయడంలోనే తన అస్తిత్వం ఇమిడి ఉందని తెలిసిన కథకుడు వారి భాగస్వామ్యాన్ని ఆమోదించడం- నేటి సినిమాలకు అన్వయించి చూడండి.  ఒక సినిమా కథను తెరకు ఎక్కిస్తున్నప్పుడు, ఆ కథను ఏ తరగతి ప్రేక్షకులకు ఉద్దేశించారో ఆ తరగతి ప్రేక్షకులు అందులో భాగస్వాములుగా ఉంటారు. అయితే వెనకటి పురాణ కథకుడికీ, నేటి సినీ దర్శకుడికీ; అలాగే నాటి పురాణశ్రోతకూ, నేటి సినీ ప్రేక్షకుడికీ ఒక తేడా ఉంది: నాటి పురాణ కథకుడు, శ్రోత ఎదురెదురుగా, లేదా ఒకే గుంపులో భాగంగా ఉంటారు. అది ప్రత్యక్ష సంబంధం. నేటి సినీ ప్రేక్షకుడు దర్శకుడి ఊహలో ఉంటాడు. అది పరోక్ష సంబంధం. శ్రోతల అభిరుచిని బట్టి, డిమాండ్లను బట్టి పురాణకథను ఎప్పటికప్పుడు improvise చేసుకునే వెసులుబాటు నాటి కథకునికి ఉంటుంది. సినీ దర్శకుడికి అది ఉండదు. కాకపోతే శ్రోత/ప్రేక్షకుల భాగస్వామ్యం మాత్రం సమానం.

ఆదిమకాలంలో కవిత్వమైనా, కథ అయినా, పురాణమైనా ఏకకర్తృకాలు కావు; ద్వికర్తృకాలూ, బహుకర్తృకాలూ కూడా. అందులో స్థాయీభేదాలు కలిగిన శ్రోతలు కూడా భాగస్వాములుగా ఉంటారు. తమ స్పందనరూపంలో కథకుడి ఊహలోలేని అదనపు కల్పనలను, లేదా శైలినీ, భాషనూ కథకు జోడించే అనివార్యతను కల్పిస్తూ ఉంటారు. ఆవిధంగా కథకుడు ఒక్కోసారి అప్పటికప్పుడు కథను improvise చేసుకుంటూపోతాడు. ప్రారంభంలో తను అనుకున్న వస్తువూ, రూపమూ, శైలీ, శిల్పమూ, భాషా మొదలైనవి చివరికి వస్తున్నకొద్దీ మారిపోతాయి. మొదట్లో వాగ్రూపంలో ఉంటూ వచ్చిన పురాణ, ఇతిహాస కథలకు అనేక పాఠాంతరాలు, ఒకే కథకు భిన్న రూపాలు, ఉపకథలు వగైరాలు ఏర్పడడానికి ఇదే కారణం కావచ్చు. శ్రోతలు కూడా కథనంలో భాగస్వాములై కథ ఎలా ఉండాలో నిర్దేశించడం, ఆ శ్రోతలను రంజింప జేయడంలోనే తన అస్తిత్వం ఇమిడి ఉందని తెలిసిన కథకుడు వారి భాగస్వామ్యాన్ని ఆమోదించడం- నేటి సినిమాలకు అన్వయించి చూడండి. ఒక సినిమా కథను తెరకు ఎక్కిస్తున్నప్పుడు, ఆ కథను ఏ తరగతి ప్రేక్షకులకు ఉద్దేశించారో ఆ తరగతి ప్రేక్షకులు అందులో భాగస్వాములుగా ఉంటారు. అయితే వెనకటి పురాణ కథకుడికీ, నేటి సినీ దర్శకుడికీ; అలాగే నాటి పురాణశ్రోతకూ, నేటి సినీ ప్రేక్షకుడికీ ఒక తేడా ఉంది: నాటి పురాణ కథకుడు, శ్రోత ఎదురెదురుగా, లేదా ఒకే గుంపులో భాగంగా ఉంటారు. అది ప్రత్యక్ష సంబంధం. నేటి సినీ ప్రేక్షకుడు దర్శకుడి ఊహలో ఉంటాడు. అది పరోక్ష సంబంధం. శ్రోతల అభిరుచిని బట్టి, డిమాండ్లను బట్టి పురాణకథను ఎప్పటికప్పుడు improvise చేసుకునే వెసులుబాటు నాటి కథకునికి ఉంటుంది. సినీ దర్శకుడికి అది ఉండదు. కాకపోతే శ్రోత/ప్రేక్షకుల భాగస్వామ్యం మాత్రం సమానం.

 

ఇప్పుడు మాంత్రిక శైలి దగ్గరికి మరోసారి వద్దాం. బక్కపలచని హీరోచేత దుక్కల్లా ఉన్న పదిమంది రౌడీలను ఒంటి చేత్తో చితకబాదించడం మన సాధారణ లాజిక్కుకు విరుద్ధమని సినీ దర్శకుడికి తెలుసు. అయితే, అలా తీసినప్పుడే సినిమా హాలు ఈలలతో దద్దరిల్లిపోతుందనీ తెలుసు. ఆవిధంగా సినిమా తీసేవాడికీ, ప్రేక్షకులకీ మధ్య ఒక కెమిస్ట్రీ ఉంటుంది. అదే కెమిస్ట్రీ పురాణకథకునికీ, శ్రోతకీ మధ్య కూడా ఉంటుంది. అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు కోరుకునే సినిమా రూపం ముందు లాజిక్కులేవీ పని చేయవని సినిమా వాళ్ళకు ఎలా తెలుసో, అత్యధిక సంఖ్యాకులైన శ్రోతలు కోరుకునే పురాణ కథారూపం ముందు లాజిక్కులేవీ పనిచేయవని నాటి కథకునికీ బహుశా అలాగే తెలుసు. చెప్పొచ్చేది ఏమిటంటే, సినిమాకు ఒక నిర్ణీత శైలీ, రూపమూ ఎలా ఉంటాయో అలాగే పురాణ కథకూ ఉంటాయి. రెండింటిలోనూ ఒక మాంత్రిక శైలి సమానంగా ఉంటుంది.

ఒక మాంత్రిక శైలి రెడీమేడ్ గా ఎప్పుడైతే ఉందో, దానిని అనేక ఇతరవిధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు, వాస్తవాన్ని కప్పి పుచ్చడానికీ, లేదా ఒక అసత్యాన్ని చలామణిలో ఉంచడానికీ కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే, ఒక నాయకునికి లేని సుగుణాలను ఆపాదించి ఆకాశానికి ఎత్తవచ్చు. ఇంకో నాయకునికి లేని లోపాలు ఆపాదించి పాతాళానికి పడదొక్కవచ్చు. రాజకీయనాయకులనే చూడండి, ఎన్నికలముందు ప్రజల సమస్యలనన్నింటినీ పరిష్కరించే మంత్రదండం తమ వద్ద ఉందని నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఎన్నికలై అధికారంలోకి వచ్చాక తమ దగ్గర మంత్రదండం ఏమీ లేదని చేతులెత్తేస్తారు.

ప్రస్తుత తపతి-సంవరణుల కథలో కథకుడు రెడీమేడ్ గా ఉన్న మాంత్రికశైలినే యాంత్రికంగా వాడుకుని ఉండచ్చు. లేదా తపతి పెళ్లాడబోయేది, పాండవుల వంశకర్తలలో ఒకడైన కురుని తండ్రి సంవరణుని కనుక, తపతి ఆదివాసీ గుర్తింపును మరుగుపుచ్చడానికి వాడుకుని ఉండచ్చు. లేదా వశిష్టుని మహిమను చాటడానికి వాడుకొని ఉండచ్చు. లేదా, తపతిని సూర్యుడి కూతురు అనడంలో సూర్యుడు అన్నది గణసంకేతం అని తెలియక సూర్యదేవుడి కూతురని చెప్పి ఉండచ్చు. ఒకవేళ తెలిసినా, పైన చెప్పినట్టు దానిని మరుగుపుచ్చడం అతని ఉద్దేశం కావచ్చు. అంతకంటే ముఖ్యంగా అతడు మాతృస్వామ్య సూచకమైన కథను పితృస్వామ్యానికి మార్చే కీలకమైన ప్రయత్నం చేస్తూ ఉండచ్చు.

ఇక్కడినుంచి మనం మానవ మహేతిహాసంలోని ఒక నిర్ణయాత్మకమైన మలుపులోకి అడుగుపెట్టబోతున్నాం. ఒకవేళ ఆ మలుపులో ఇంకా ముందుకువెళ్ళిపోతే, మళ్ళీ వెనక్కి రావడానికి ఎన్ని వ్యాసాల వ్యవధి పడుతుందో ఈ క్షణాన నా ఊహకు అందడం లేదు. పూర్తిస్థాయిలో అందులోకి వెడతానన్న హామీ కూడా ఇవ్వలేకపోతున్నాను. ముందుకు వెళ్ళడం గురించి కాసేపు మరచిపోయి ప్రస్తుతం ఆ మలుపు దగ్గరే ఉండిపోయి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.

***

తపతి-సంవరణుల కథను జాగ్రత్తగా చెవి యొగ్గి వినండి…అందులో మీకు ఒక గొంతు కాదు, రెండు గొంతులు వినిపిస్తూ ఉంటాయి.  ఆ రెండు గొంతులూ పక్క పక్కనే వినిపిస్తూ ఉంటాయి. ఆ గొంతుల్లో ఒక గొప్ప ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా ఉంది. ఎలాగంటే, ఒక గొంతు ఇంకో గొంతును ప్రతిఘటించడంలేదు. నొక్కేయడానికి చూడడం లేదు. దేని మానాన అది తన కథను చెప్పుకుంటూ పోతోంది,

ఆ రెండు గొంతుల్లో ఒకటి కథకుడిది…ఇంకొకటి గంధర్వుడిది…

మామూలుగా అయితే, మొత్తం కథంతా కథకుడే చెబుతున్నాడనీ, గంధర్వుడి చేత చెప్పించడం కూడా కథకుడి వ్యూహంలో భాగమే ననీ అనుకుంటాం. కానీ ఎవరి కథనం వారిదే అయినప్పుడు ఆ అవకాశం లేదు. అంటే గంధర్వుడు పూర్తిగా కథకుడి చేతుల్లో లేడు. కథకుడు గంధర్వుడికి కొంత స్వేచ్ఛను అంగీకరించాడు. కనుక కథ చెబుతున్నది ఒకరు కాదు, ఇద్దరు! ఆ ఇద్దరి ప్రయోజనాలు వేరు. ఒకటి చెప్పాలంటే, తపతి సూర్యుని కుమార్తె అనడం ద్వారా సూర్యదేవుని వైపునుంచి, అంటే పురుషస్వామ్యం నుంచి చెప్పడం కథకుడు ఆశించే ప్రయోజనం. అర్జునునితో తను అన్న ‘తాపత్యవంశీకుడివి’ అనే మాటతో కథకు శృతి చేస్తూ తపతి వైపునుంచి, అంటే మాతృస్వామ్యం నుంచి కథ చెప్పడం గంధర్వుడు ఆశించే ప్రయోజనం. గంధర్వుడి వెర్షన్ కు కథకుడు కొంత అవకాశం ఇస్తూనే దానికి తన వెర్షన్ ను జోడించుకుంటూ వెడుతున్నాడు. ఈ ప్రక్రియ మనకు బుర్రకథ లాంటి ఒక కళారూపాన్ని గుర్తుచేస్తూ ఉండచ్చు. అయితే, బుర్రకథలో కథ చెప్పేవాడు ఒక్కడే ఉండి, వంత పాడేవారు ఇద్దరు ఉంటారు కనుక ఇది బుర్రకథ లాంటిది కాదు. ఇక్కడ ఇద్దరూ కథను చెబుతున్నారు. ఇది ఎలాంటి కళారూపమన్న సంగతి ఇప్పటికిప్పుడు చెప్పలేకపోతున్నాను.

మామూలుగా అయితే, మొత్తం కథంతా కథకుడే చెబుతున్నాడనీ, గంధర్వుడి చేత చెప్పించడం కూడా కథకుడి వ్యూహంలో  భాగమే ననీ అనుకుంటాం. కానీ ఎవరి కథనం వారిదే అయినప్పుడు ఆ అవకాశం లేదు. అంటే గంధర్వుడు పూర్తిగా కథకుడి చేతుల్లో లేడు. కథకుడు గంధర్వుడికి కొంత స్వేచ్ఛను అంగీకరించాడు. కనుక కథ చెబుతున్నది ఒకరు కాదు, ఇద్దరు!

ఆ ఇద్దరి ప్రయోజనాలు వేరు. ఒకటి చెప్పాలంటే, తపతి సూర్యుని కుమార్తె అనడం ద్వారా సూర్యదేవుని వైపునుంచి, అంటే పురుషస్వామ్యం నుంచి చెప్పడం కథకుడు ఆశించే ప్రయోజనం. అర్జునునితో తను అన్న ‘తాపత్యవంశీకుడివి’  అనే మాటతో కథకు శృతి చేస్తూ తపతి వైపునుంచి, అంటే మాతృస్వామ్యం నుంచి కథ చెప్పడం గంధర్వుడు ఆశించే ప్రయోజనం. గంధర్వుడి వెర్షన్ కు కథకుడు కొంత అవకాశం ఇస్తూనే దానికి తన వెర్షన్ ను జోడించుకుంటూ వెడుతున్నాడు. ఈ ప్రక్రియ మనకు బుర్రకథ లాంటి ఒక కళారూపాన్ని గుర్తుచేస్తూ ఉండచ్చు. అయితే, బుర్రకథలో కథ చెప్పేవాడు ఒక్కడే ఉండి, వంత పాడేవారు ఇద్దరు ఉంటారు కనుక ఇది బుర్రకథ లాంటిది కాదు. ఇక్కడ ఇద్దరూ  కథను చెబుతున్నారు. ఇది ఎలాంటి కళారూపమన్న సంగతి ఇప్పటికిప్పుడు చెప్పలేకపోతున్నాను.

ఇంకాస్త వివరంగా చూద్దాం. అర్జునునితో నువ్వు తాపత్యవంశీకుడివి అనడం ద్వారా గంధర్వుడు తన వెర్షన్ కు ముందే శృతి చేశాడు. అసలు కథను మాత్రం కథకుడు తన వెర్షన్ తో మొదలుపెట్టాడు. అది: సూర్యుని ఉద్దేశించి సంవరణుడు తపస్సు చేయడం,  సూర్యుడు అతనిని మెచ్చి తన కూతురైన తపతిని అతనికే ఇవ్వాలని నిర్ణయించుకోవడం…ఇలా చెప్పడం ద్వారా కథకుడు అసలు కథకు పురుషస్వామ్యం అనే చట్రాన్ని ముందే తయారు చేసిపెట్టుకున్నాడు.

ఆ తర్వాత గంధర్వుడు తన వెర్షన్ ప్రారంభించాడు. ఆ ప్రారంభించడం కూడా కథకుని చట్రాన్ని తోసి రాజనేలా. ఈ వెర్షన్ ప్రకారం సంవరణుడు వేటకు వెళ్ళాడు. అక్కడ తపతి ఒంటరిగా కనిపించింది. ఆమె అలా ఒంటరిగా కనిపించిందంటే, వర్ణసమాజంలో లేదా మైదాన ప్రాంతాలలో నివసించే స్త్రీ మీద ఉండే నిర్బంధాలు ఏవీ ఆమె మీద లేవు. సంవరణుడు ఆమెపై మనసుపడ్డాడు. ఆమె కూడా అతని మీద మనసు పడింది. అదే ఒక ఆదివాసీ యువకుడైతే అతన్ని చేపట్టడానికి తపతికి ఎవరి అనుమతీ, ఎటువంటి అభ్యంతరాలూ ఉండనవసరం లేదు. కానీ సంవరణుడు సాయుధుడైన క్షత్రియుడు. ఆదివాసుల అస్తిత్వానికి అతడో పెద్ద ప్రమాదం. కనుక ఈ సంబంధానికి తపతి తండ్రి కాదుకదా, తపతి తెగ మొత్తం అంగీకరించే అవకాశం లేదు. తెగ మనిషిగా తపతి కూడా వెంటనే అవుననే అవకాశమూ లేదు. కనుక మధ్యవర్తి అవసరం.

ఆవిధంగా వశిష్టుని ప్రవేశం… గంధర్వుని వెర్షన్ ప్రకారం కూడా ఇక్కడ మధ్యవర్తిగా వశిష్టుని ప్రవేశం అవసరమే. ఆపైన ఒక మునిగానూ, బ్రాహ్మణునిగానూ వశిష్టుడు ఆదివాసుల మనసుకు ఎలాగూ దగ్గరివాడే. కనుక మునుల గురించి, వారితో తమ సంబంధాల గురించి చెప్పడం గంధర్వుడికి ఇష్టమే. పాండవుల వెంట పురోహితుడు లేని సంగతి గంధర్వుడు మొదటే ఎత్తి చూపాడు కనుక, పురోహితుడి అవసరం ఎలాంటిదో చెప్పడమూ అతనికి అవసరమే. అదే సమయంలో, మీరు తాపత్యవంశీకులని నొక్కి చెప్పడం బహుశా అంతకంటే ఎక్కువ ఇష్టమూ, అవసరమూ కూడా  కావచ్చు. ఎందుకంటే, కథకుడు పురుష స్వామ్యంవైపు కథ నడిపిస్తాడు కనుక తను యథాశక్తి మాతృస్వామ్యం వైపు నడిపించక తప్పదు.  అదీగాక, వశిష్టునికి కూడా మాతృస్వామ్యంతో సంబంధం ఉందనేది ఇక్కడ అదనపు సమాచారం. దానిలోకి ఇప్పుడు మనం వెళ్లద్దు.

కథకుడికీ వశిష్టుని ప్రవేశం అంగీకారమే. అయితే మధ్యవర్తిగా కాకపోవచ్చు. ఒక బ్రాహ్మణునిగానూ, మునిగానూ వశిష్టుని మహిమను చెప్పడం కథకునికి ఇష్టం. అలాగే, క్షత్రియునివైపునుంచి కథ చెప్పడం కూడా అతనికి ఇష్టమే. సంవరణుడు సూర్యునికోసం తపస్సు చేశాడని చెప్పడం, భూమండలంలో అంతటి వీరుడు లేడని చెప్పడం, సంవరణుడు తలచుకోగా వశిష్టుడు వచ్చాడని చెప్పడం అందులో భాగమే కావచ్చు. కథకుడు ఆ తర్వాత వశిష్టుడికి మహిమలు ఆపాదించుకుంటూ వెళ్ళాడు. గంధర్వుడికి అభ్యంతరం లేదు. కథకుడు తన వెర్షన్ ఎలా చెప్పుకుంటూ పోయినా, ‘తాపత్యవంశీకుడివి’ అంటూ తను చేసిన శృతికి అనుగుణంగా తపతి వైపునుంచి చెప్పడమే గంధర్వుడికి కావలసింది.

తపతి-సంవరణుల పెళ్లి గాంధర్వ విధానంలో కాక, పెద్దల అనుమతితో, పురోహితునిద్వారా మాత్రమే జరగడం కథకునికి ఇష్టం కనుక అలాగే జరిపించాడు. తపతి వైపునుంచి చెప్పే అవకాశాన్ని తనకు ఇచ్చాడు కనుకా, ఆ అవకాశాన్ని తను వినియోగించుకున్నాడు కనుకా, ఇక కథకుడు తన కథను ఎలాగైనా చెప్పుకోనివ్వండి…గంధర్వుడికి అభ్యంతరం లేదు. అయితే, చివరగా ఎదురయ్యే ఒక చిక్కు ప్రశ్న ఏమిటంటే, సంవరణుడు రాజుగా నిర్వర్తించవలసిన కార్యాలు, ధర్మాలు విడిచిపెట్టేసి తపతితో ఇష్టభోగాలు అనుభవిస్తూ అడవిలో (అత్తవారి ఇంట) ఉండిపోయాడనీ, దాంతో రాజ్యంలో అనావృష్టి ఏర్పడిందనీ కథకుడు చెబుతున్నాడు. ఇంతవరకు సంవరణునికి అనుకూలంగా జరుగుతున్న కథనంలో ఇక్కడికి వచ్చేసరికి అతనిపై ఒకింత నిష్ఠురం ధ్వనిస్తున్నట్టు లేదూ? ఒకింత ఏమిటి, ఎక్కువే ధ్వనిస్తున్నట్టుంది. సంవరణుడు రాచకార్యాలను, ధర్మాలను విడిచిపెట్టేసి తపతితో ఇష్టభోగాలలో మునిగి తేలుతూ ఉండడం, అక్కడ రాజ్యంలో కరవు కాటకాలు ఏర్పడడం సంవరణుడి వైపునుంచి జరిగిన సామాన్యమైన నేరమేమీ కాదు. అప్పుడు వశిష్టుడు అనావృష్టిని నివారణకు క్రతువులు జరిపి సంవరణుని దగ్గరకు వచ్చి భార్యాభర్తలు ఇద్దరినీ రాజధానికి తీసుకెళ్ళాడు. అప్పుడు అనావృష్టి తొలగిపోయింది.

ఆ తర్వాతే, ఆ దంపతులకు కురుడు పుట్టాడు!

ఇంతకీ పన్నెండేళ్ళు సంవరణుడు అడవిలోనే ఎందుకు ఉండిపోయాడు? వారికి పన్నెండేళ్ళ వరకూ ఎందుకు సంతానం కలగలేదు? ఈ పన్నెండేళ్లలో ఏం జరిగి ఉంటుంది?

సంతృప్తికరమైన సమాధానాలు వస్తాయా, రావా అనేది వేరే విషయం; కానీ ఇవి న్యాయమైన ప్రశ్నలు కావంటారా?

మిగతా విషయాలు వచ్చే వారం…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)–కల్లూరి భాస్కరం 

 

వాళ్ల పేరు “ఈ రోజు, ఇప్పుడు” !

 

గాబ్రియేలా మిస్త్రాల్ ( http://en.wikipedia.org/wiki/Gabriela_Mistral ) అసలు పేరు లూసిలా (లూచిలా). ఆమె చిలీ దేశమునకు చెందిన కవయిత్రి. ఆమె జీవిత కాలము 1889 – 1957. ఆమెకు 1945లో నోబెల్ బహుమతి లభించినది. ఆమె చిన్నప్పుడు బడిలో చదువుచుండగా బడి పంతులు నీకు ఇక చదువు రాదు అని ఇంటికి పంపాడట. ఆమె తానే స్వయముగా చదువు నేర్చుకొన్నది. ఒక బడి పంతులమ్మగా పని చేసినది. పెండ్లి ఐన తఱువాత ఆమె భర్త ఎందుకో ఆత్మ హత్య చేసికొన్నాడు. ఆ సంఘటన ఆమె జీవితములో ఒక పెను తుఫాను రేపినది. తాను ఇకమీద నెప్పుడు తల్లి అవజాలననే కొఱత ఆమెను దహించినది. ఏ హృదయములో అగాధమైన శోకము దాగి ఉంటుందో అది కవితకు జన్మస్థానము అవుతుంది ఒక్కొక్కప్పుడు. గాబ్రియెలా అను పేరుతో పద్యములను వ్రాయుటకు ప్రారంభించినది ఆమె. మిస్త్రాల్ అనగా తేమ లేని చలి గాలి. ఆమె కవితా వస్తువు గర్భిణి స్త్రీ, పిల్లలు, పిల్లల లేమి, ఇత్యాదులు. ఆమె కవితలను కొన్ని తెలుగులో ఆంగ్లమునుండి చేసిన నా అనువాదాల రూపముగా మీతో పంచుకొంటున్నాను. ఇందులోని తప్పులన్ని నావే, కాని ఇవి మీ కవితాహృదయాలను తాకితే ఆ ఘనత మిస్త్రాల్‌కు చెందుతుంది. ఆమె విద్యారంగములో చేసిన కృషి మహత్తరమయినది. పన్నెండేళ్లకే బడి ముగించిన ఆమెను స్పానిష్ ప్రొఫెసర్‌గా నియమించారు. ఆమెకు చిన్న పిల్లలంటే ఎంతో ప్రేమ, తన యావజ్జీవితాన్ని వారి సంక్షేమముకోసము అంకితము చేసినది. పసి పిల్లలను గురించి ఆమె నాడు చెప్పిన పలుకులు నేటికి కూడ స్మరణీయమే
మనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, మన మెన్నో తప్పులు చేస్తాము. కాని వాటిలో అతి ఘోరమైన నేరము పిల్లలను నిర్లక్ష్యము చేసి వదలి వేయడము, ఎందుకంటే పిల్లలు మానవజీవితానికి ఊట. ఎన్నో కార్యాలలో మనము తాత్సారము చూపవచ్చును. కాని పిల్లల విషయములో వాయిదా వేయడము తప్పు. బాల్యములో వాళ్ల శరీరము ఎదుగుతుంది, రక్తమాంసాలు నిండుకొంటాయి, వారి మేధస్సు పెరుగుతుంది. వాళ్లకు రేపుఅని మనము బదులు చెప్పరాదు. వాళ్ల పేరు ఈ రోజు, ఇప్పుడు” “.

mistral

1)  నటన మాడు టెటులో – Those Who Do Not Dance – Women in Praise of the Sacred, p 214, ed. Jane Hirshfield, Harper Perennial, New York, 1995.

 

అడిగె నామె యడిగె – ఒక

కుంటి పిల్ల అడిగె

నటన మాడు టెటులో – నే

నటన మాడు టెటులో

నటన మాడు నీదు హృది

నటన మాడు మురిసి

 

అడిగె నామె యడిగె – ఒక

చిన్న పిల్ల యడిగె

పాట పాడు టెటులో –  నే

పాట పాడు టెటులో

పాట పాడు నీదు హృది

పాట పాడు మురిసి

 

ఎండు గడ్డి యడిగె – ఒక

ఎండు గడ్డి యడిగె

నటన మాడు టెటులో – నే

నటన మాడు టెటులో

నటన మాడు నీదు హృది

గాలిలోన తేలి

 

అడిగె దైవ మడిగె – నీల

గగనమందు నుండి

ధరకు దిగుట యెటులో – నే

ధరకు దిగుట యెటులో

వెలుగులోన రమ్ము – మాతో

నటన మాడ రమ్ము

 

వనములోన జనులు – నగుచు

నటన మాడి రెల్ల

వెలుగులోన జనులు – పాడి

నటన మాడి రెల్ల

రానివారి హృదయములు

అంధకార మాయె

రానివారి హృదయములు

చేరె ధూళి తోడ

mistral2

2) ఉయ్యాల  – Rocking – Selected Poems on Gabriela Mistral, translated and edited by Doris Dana, p 43, Johns Hopkins Press, Baltimore, 1971.

 

దివ్యమైనది యా సముద్రము

అలల నూపుచునుండె డోలగ

ప్రేమసంద్రపు టలల వింటిని

ప్రేమతో నిన్నూపుచుంటిని

 

అటుల నిట్టుల వీచు గాలియు

నూపె నాకుల రేయిలో మెల

ప్రేమపవనపు రొదను వింటిని

ప్రేమతో నిన్నూపుచుంటిని

 

నీరవమ్ముగ నిఖిల మంతటి

నూపుచుండెను తండ్రిదేవుడు

అతని జేతులు నను స్పృశించగ

ప్రేమతో నిన్నూపుచుంటిని

 

3) నెమ్మది – Serenity, p 71 of the reference in (2)

 

నీకోసము పాడగా జగమందున చెడు కనబడదు

కనుమదారి, ముండ్లకంపమృదువగు నీ ఫాలమే

 

నీకోసము పాడగా క్రూరత లేదీ భూమిలోన

సింహములు నక్కలు కరుణార్ద్ర నయనములే

 

4) సౌందర్యానికి దశ ముఖాలు  – Decalogue of the Artist, p37 of the reference in (2)

 

1 – విశ్వముపైన దేవుని నీడ

ఆ అందమునే ప్రేమించు సదా

 

2 – సౌందర్యమ్మో దేవదత్తము

సౌందర్యమ్మో వాని ప్రతీక

సృష్టికర్తను ప్రేమించకున్నను

వాని సృష్టికి నీవే సాక్షి

 

3 – ఇంద్రియాలను ఉద్రేకించుట

కాదెప్పుడుగా కామనీయకము

ఆత్మను విరియగ జేయునదేగా

నిజముగ నౌను సౌందర్యమ్ము

 

4 – భోగముకోసము వలదా యందము

ఆడంబరమున కది ఆమడ దూరము

 

5 – వెదకకు దానిని బజారులోన

వెదకకు దానిని సంతలలోన

అక్కడ లేదు స్వచ్ఛపు టందము

అక్కడ లేదు అచ్చపు టందము

 

6 – అందమ్మనునది సుందరగీతి

హృదయములోన జనియించే నది

హృదయములోన పెఱుగును పూయును

నిన్ను పునీతుని జేయును తథ్యము

 

7 – హృదయములోగల వెతలను ద్రోసి

శాంతిని నింపును సౌందర్యమ్మది

 

8 – తల్లి రక్తమును పంచుకొన్న యా

బిడ్డవోలె గావించుము సృష్టిని

 

9 – అందము కాదొక నల్లమందు, అది

కల్గించదు మత్తును నిద్రను

చైతన్యమును పెంపొందించుచు

పొంగెడు మదిరయె సౌందర్యమ్మది

స్త్రీయే యైనా పురుషుండైనా

కాలేవొక్క కళామూర్తిగ

ఆత్మనిగ్రహము లోపించిన నీవు

 

10 – సృష్టిని గాంచి గర్వపడకుమా

నీవు కన్న యా కలల శిఖరమును

చేరలేదు నీ సృష్టియు యెన్నడు

దేవదేవుని పూర్ణస్వప్నమౌ

ప్రకృతి కన్నను  మిన్నయు కాదు

 

5) పాల చుక్కలు – Prayer, p212 of the reference in (1)

 

మంచు చుక్కల సేకరించెడు కలశములవలె నే

నుంచినా నీ నాదు స్తనముల వాని ముందర పూ-

రించు నాతడు వీని జీవన గంగ ధారల సే-

వించ వత్తురు పాల చుక్కల నా తనూభవులు

 

6) అమ్మ – Birth Poetry, Ed. Charlotte Otten, p 4, Virago Press, London, 1993.

 

ఈ రోజు అమ్మ నన్ను చూడడానికి వచ్చింది, నా పక్కన కూర్చుంది.  మేమిద్దరము అక్కాచెల్లెళ్లవలె మాట్లాడుతున్నాము జరగబోయే విశేషమైన విషయాన్ని గురించి.

 

అలాగే కదలాడే నా కడుపుపైన చేతులనుంచి నా రొమ్ముపైన బట్టలను తొలగించింది. ఆమె కోమలమైన హస్తస్పర్శకు నా హృదయము మెల్లగా తెరచుకొన్నది. నాకు తెలియకుండా అక్కడినుండి ఉన్నట్లుండి చిమ్ముకొంటూ పాలు పొంగింది.

 

సిగ్గు, తొట్రుబాటు నన్ను ముంచెత్తింది.  నా దేహంలోని మార్పులను, అవి రేకిత్తించే భయాన్ని గురించి ఆమెతో మాట్లాడసాగాను.  ఆమె రొమ్ముపైన నా ముఖాన్ని ఉంచాను.  ఆక్షణంలో నేను మళ్లీ నా తల్లికి చిన్న పిల్లనైపోయాను, ఆమె చేతుల్లో ముఖాన్నుంచుకొని దిగులుతో, భయముతో  జీవితము కలిగించిన ఈ కొత్త మలుపును  తలుస్తూ ఏడవడానికి మొదలుపెట్టాను.

 

– జెజ్జాల కృష్ణ మోహన రావు

కలని ఆయుధం చేసుకున్న కవి అరసవిల్లి!

arasavilli krishnaకవిత్వానికి కవికి మద్య ఏ తెరలూ లేని మనిషి వుండాలని కోరుకోవడం అత్యాశ కాదు కదా? ఈ మాటెందుకంటే కవులుగా కథకులుగా చలామణీ అవుతూనే మాస్క్ తీస్తే వాళ్ళలో ఓ అపరిచిత మనిషి దాగుంటాడన్నది చాలా మందిలో చూస్తుంటాం. కానీ అరసవిల్లి కృష్ణ తన కవిత్వానికి జీవితానికి లోపలి మనిషికి బాహ్య రూపానికి తేడాలేని స్వచ్చమైన మానవుడు. దర్జీగా దేహానికి సరిపోయే దుస్తులను మాత్రమే కాకుండా మనసు పొరలను చేదించే అక్షరాలను అల్లిక చేసే కవిగా సామాన్య జీవితం గడుపుతూ సరళమైన పదాల మద్య తన భావోద్వేగాలను “తడి ఆరని నేల” గా మనముందుంచారు.

 

కవిత్వాన్ని తన నెత్తుటిలోకి ఆహ్వానించుకొని దేహమంతా ప్రవహింప చేసుకొని అదే తడితో తన సహజమైన సరళ పద చిత్రాలతో మనముందు సామాజిక వాతావరణాన్ని చిత్రించడంలో అరసవిల్లి తనదైన శైలిని పట్టుకుని చిత్రిక పట్టి మనముందు ఆవిష్కరిస్తాడు. వర్తమాన సమాజంలోని అన్యాయాన్ని సామాజిక సంక్షోభాన్ని రాజ్య నిరంకుశత్వాన్ని ఆగ్రహంగా ఎండగడుతూనే దానిని నినాదప్రాయం కాకుండా హత్తుకునేట్టు చెప్పడం ఈయన కవిత్వంలో చూస్తాం. 2008 నాటినుండి విరసం సభ్యుడిగా వుంటూ “సామాజిక నిబద్ధతతో కవిత్వాన్ని సృజిస్తూన్న అరసవిల్లి ఉద్యమ కవిత్వంలో సౌందర్యాత్మక విలువల్ని ప్రోదిచేస్తూ కవిత్వ భాషలోనూ, అభివ్యక్తిలోనూ, నిర్మాణంలో ఒక విలక్షణతని సాధించారంటారు” ప్రముఖ విమర్శకులు గుడిపాటి.

 

 

మరణం తర్వాత ఓ దీపం

ఆరిపోకుండా వెలుగుతుంది

 

సౌందర్యం కాలుతున్న

వాసన వెంటాడుతుంది

 

ఓ దేశాన్ని వెతుకుతున్నాను

ఒకే దేశం రెండు చేతులుగా కన్పిస్తుంది

ఒక చేతిలో ఆయుధముంది

రెండవ చేతిలో స్వప్నముంది

 

రైతుల ఆత్మహత్యలు, బూటకపు ఎదురుకాల్పులు, సామూహిక మానభంగాలు రాజ్యం చేయిస్తున్న మానభంగాలు దహనకాండలూ ఇలా మన కళ్ళముందు నిత్యమూ జరిగే సామాజిక చిద్రపటాన్ని తన కవితా వస్తువుగా తీసుకొని అరసవిల్లి కృష్ణ కవిత్వ గానం చేస్తున్నారు.

 

మరణం వ్యక్తిగతం కాదు

మరణం సామూహిక విషాదం

 

భూమితో నా సంభాషణ

గర్భంలో దాగిన పిండం వింటుంది

వినడం మట్టి ప్రయాణంలాంటిది.

 

వినడం భూమికి తెలిసినంతగా

అధికారలాలసకు తెలియదు.

 

ఈ దేశంలోని నదులన్నీ

స్త్రీల కన్నీళ్ళతో ప్రవహిస్తున్నాయి

 

స్త్రీలు కదా

సమాధానాలుండవు

ఏనాటికయినా

అడవి మాట్లాడుతుంది

ఆ పదకొండుమందికీ

ఆకాశం వందనం చేస్తుంది.

నిబద్ధతా కవిత్వ ప్రేమా రెండీటిని బాలన్స్ చేసుకుంటున్న కవి అరసవిల్లి!

-కేక్యూబ్ వర్మ

varma

మొగుని రోగం !

పూరింట్లో తలుపుకడ్డంగా నీల్ల బాన , నవారు మంచం పెట్టేసి కుట్టుమిసను పట్టుకోని, బలంగా ఈడస్తా, యాడస్తా వుండాది  మల్లిక . ‘ముండాకొడుకు …ఆ పాడు సారాయి తాక్కుండా వుంటే ఎంత మరేదగా వుంటాడో … తాగినాడంటే అంత ఎదవై పోతాడు’ . పెండ్లైన మూడేండ్లు తాగేసొచ్చి దినామూ కొడ్తే గూడా యాపొద్దూ మల్లిక అడ్డం జెప్పలా . మత్తంతా దిగినాక మొగుడొచ్చి అడుక్కొంటే మూతి ముప్పై సొట్లు దిప్పి, నెత్తిన రెండు మొట్టి … నెత్తిన బెట్టుకునిందే గానీ, ఈదినానికి గూడా…వోన్ని ఒగ  మాట అనింది  ల్యా . సుట్టుపక్కలోల్లు మద్దెలో వొచ్చి మద్దిస్తానికి  కుచ్చుంటే గూడా మొగుడన్నేక  కొట్టడా … తిట్టడా  అని మరేదగా పొమ్మనే సిండాది  శానా తూర్లు . ఇప్పుడు యౌర్నన్నా పిల్సినా వోల్లింటి కల్లా తిరిగిమల్లి గూడా సూడరు . మీసావు మీరు సావండని తుపుక్కున మూసేసి పోతారు.

రెండ్నెల్ల నించి మొగుడ్నుంచి వొల్లు కాపాడుకోవాలంటే సచ్చేసావుగా వుండాది. ఎవురికన్నా సెప్పుకోవాలంటే మానంబోతా వుండాది. మొగుడూ పెళ్ళాలు కలిసేటప్పుడు జాగర్తగా వుండాలని పెద్ద డాకట్రు జెప్పినాడు. ఈడికేమో మందు లోపలికిబోతే వొళ్ళూ పై దెలవదు. బద్రంగా  లేకపోతే మొగుడికుండే  రోగం మల్లిగ్గూడ వొస్తుందని ఇవరంగా సెప్పినారు. అదేవన్నా సిన్నరోగమా. దుడ్డులేనోల్ల పాణం తీసేరోగం. మొగుడు కాలందీరిపోతే వుండే వొక బిడ్డిని ఎట్ట సమాలించాలో తెలీక అల్లాడిపోతా వుంది మల్లి. ఇంత మనేదలో వుంటే రాజుగాడికి ఈ వుపద్రం బట్టింది. సారాయితాక్క పోతే ఏ కబురైనా గెట్టిగా సెప్తే ఇంటాడు. తాగేస్తే ఇగ అంతే. నోరిప్పితే కొట్టనొస్తాడు.  మొగుడంటే యిష్టం లేగ్గాదు. బతుకంటే బయిం బట్టుకునింది మల్లికి. ఈపూట వోడ్ని పక్కలోకి రానీను గాక రానీనని వోట్టేసుకొని, బొళువుగా  వుండే మిసన్ని తలుపుకడ్డంగా ఈడ్సి పైటకొంగు తో కారే సెమటని తుడ్సుకుంట కింద కుచ్చోని అట్టా కన్నుమూసింది మల్లి.

 ***

సమర్తైనాక  రెండేండ్లు గూడా మల్లిక అమ్మగారింట్లో ల్యా . ఆబిడ్ని మల్లయ్య మావ కొడుక్కిచ్చి  ఉండూర్లోనే  పెండ్లి జేసేసినారు . రాజు దిట్టంగా ఉంటాడు . ముగ్గురి తిండి  వొకడే తింటాడు … ముగ్గురి పనీ వొకడే జేసేస్తాడు. కాలు కొంచెం అవుడు. కుంటోన్ని నేను జేసుకోనని మల్లి మొండికేస్తే ,  “గుడ్డి పోగోర్తాది..కుంటి రాగోర్తాది” అని బలవంతాన మల్లిని పెండ్లికి వొప్పించినారు. అవుడైతే ఆస్తులు కూడబెడ్తాడని పెండ్లైన ఆర్నెల్లు  మొగుడు మల్లిని వొదిలి పక్కకుబోలా. కడుపులో కొడుకు పడ్నాకనే మళ్ళీ రాజు పనికిబోయిండేది. ఈతూరి సేద్దిగం వొదిలేసి శానా దుడ్డు వొస్తాదని లారీ పనికిబొయ్ నాడు. వొగ తూరి  లారీ  ఎక్కితే మల్లీ రెండ్నెల్లు ఐనాంకనే పెడ్లాం బిడ్లను జూసేది.

లారీ పనికి బొయ్ నాక  మొదల్తూరి వొచ్చినప్పుడు బాగనే వుణ్ణాడు. దుడ్డు తెచ్చిచ్చి అంగిడికి  బొయ్యి ఒగ కోక దెచ్చుకో మన్నాడు . లారీ పని బాగుండా దని మల్లి గూడా సత్తెమ్మకు పొంగిలి బెట్టుకోనొచ్చి వూరంతా పెసాదం తలారొంత ఇచ్చి మొగుడుణ్ణె  పదైదు దినాలూ పండగ జేసింది . వోడు మల్లీ పనికిబోతాంటే దొక్కలోనుంచి దుక్కమోస్తాంటే గూడా యిన్ని నీల్లు బోసుకోని మింగేసి, బద్దరంగా పొయ్యిరమ్మని  లారీ యెక్కించి ఉత్త సేతుల్తో  ఇంటికొచ్చేసింది.

నిండునెల్లు  వొచ్చేటప్పిటికి మొగుని మాట వొదిలేసి సీమంతం  జేసుకొని అమ్మగారింటికి ఎలబారి పొయ్యింది. అటక మిందుండే కొయ్య వుయ్యాల దింపిచ్చింది . నూలుకోకలన్నీ జవిరి వైరుబుట్టిలో ఎత్తి పెట్టింది. పెద్దిల్లు పేడతో అలికిచ్చి, సుబ్బరంగా తెల్లసున్నం పుయిపిచ్చింది. మొగబిడ్డి పుడ్తిందో … ఆడబిడ్డి పుడ్తిందో అనుకుంటా నొప్పులకోసరం ఎదురుసూస్కుంటా కుచ్చునింది .

ఆరోజు మల్లిక్కి బాగా గెవనం వుండాది. తెల్లార్తో నుండి కొంచిం వొంట్లో నలతగా వుణ్ణిన్ది . సగించకుంటే గూడా కడుపులో బిడ్డి కోసరం కొంచిం వుప్పిండి దినేసి గడపమింద కుచ్చోని ఎగదీసుకుంటా వుణ్ణిన్ది. కడుపులో నొప్పి మొదులయ్యే టప్పిటికి  మంత్రసాన్ని తొడుకోనొచ్చింది వోళ్ళమ్మ. దీపం గూడులో కాయితం కింద ఎత్తిపెట్టిన బ్లేడు, ఉడుకు నీళ్ళు, పాత నూలుకోకలు మంత్రసానికి ఎత్తిచ్చింది. తొలి కానుపాయ…ఒగ రాత్రి ఒగ పొగులు అల్లాడిపొయ్యింది నొప్పుల్తో. ఆస్పిటల్ కి పోదారంటే మొగుడింట్లో లేకపాయె. మాలపల్లంతా ఒగచేతి మింద కానుపులు జేసిండే మంత్రసానిగ్గూడా బిడ్డి అడ్డం దిరిగి పోయిన్దేవోనని కాల్లూ సేతులూ ఆళ్లా. ధనియాల కసాయం దాపిచ్చి…కడుపుకు ఆందెం రుద్ది ఎట్టో వొగట్ట పువ్వాలుండే మొగబిడ్డిని బయటకు దీసేసింది. ‘నాబట్ట బిడ్డె …ఎంత ఏడిపిచ్చినాడు వోల్లమ్మను అనేసి ..మేయ్…ఇప్పుడే నీకొడుకు ఇట్ట ఏడిపిస్తావుండాడు …పెద్దయితే ఇంగేం జేస్తాడో’ అంటా వక్కాకు లో బెట్టిచ్చిన నూర్రూపాయలు దీసుకొని మంత్రసాని నవ్వుమొగం తో ఎలబారిపొయ్యింది.

ఇంత జరిగినా మొగునికి ఇవేమీ దెలీలా… పురిటికి గూడా రాలా.  ఇంత కస్టంలో మొగుడు పక్కన లేడని మల్లి శానా తూర్లు ఎవురికీ దెలీకుండా ఏడ్సుకునింది. పక్కలో బిడ్ను జూసుకుని మొగుని మింద కలవరాన్ని తగ్గిచ్చుకునింది. మల్లెప్పుడో ఒగనెలకు వొచ్చినాడు రాజుగాడు.  వొల్లంతా కాలిపోతా వుంది. వారం దినాల్నుంచి జొరమని జెప్పినాడు. ఏం దిన్నా వాంతులు ..బేదులు. లారీ పనికి బొయ్యేది మొదులు బెట్నాక గొంతుదాక సారాయి దాగే పని బట్నాడు. వొళ్ళు వూనమైపోతే గూడా సారాయి అంగిడికి బొయ్యేది ఇసిపెట్లా.  పక్కన పెద్ద పల్లిలో వుండే అరెమ్పీ డాకట్ర దెగ్గిరికి పొయ్యి సూదేసుకొని వొస్తే కొంచిం కుదురుకునింది వొల్లు.

అట్ట వొచ్చినోడు మూడ్నెల్లు ఇల్లు వొదల్లా.. కొడుకుతో ఆట్లాడుకుంటా వుండిపోయినాడు. మొగుడుంటే వొగపక్క సంతోసంగుంటే గూడా వోని తాగుడు జూస్తావుంటే మల్లిక్కు బయంగా వుండాది. సంపాయిచ్చుకొని వొచ్చిందంతా ఈమారి తాగేస్తా వుండాడే అని మనేద బట్టుకునింది. దాంతో బాటు రాత్రయ్యిందంటే వొల్లు బాగాలేదంటే గూడా యినకుండా పక్కకు రమ్మని ఒకటే సతాయిస్తావుండాడు. రెండో నెలకే ఈతూరి కడుపు నిలిచిపొయ్యింది. సంకలో బిడ్డి సంకలో ఉండంగానే కడుపులో ఇంగోటి. లారీ వోనరు పిలస్తావుండాడని కబురొచ్చినాక  వొదల్లేక వొదల్లేక యలబార్నాడు రాజుగోడు. బిన్నా వొస్తానని చెపేసి పొయ్ నాడు. వోడు పోతే సాలని సూసిన మల్లి కంట్లో నీల్లు రాలా ఈతూరి. మొగుడు అట్టబోగానే పక్కూర్లో వుండే ఆరెమ్పీ డాకట్రు దగ్గిరికిబొయ్యి కడుపుదీయించుకొని వొచ్చేసింది. మొగుడికివేమీ జెప్పలా.

పొయ్ నోడు …పొయ్ నోడు ఈ తూరి పదైదు దినాలు గూడా గాకనే తిరుక్కో నొచ్చేసినాడు. మళ్ళీ వొల్లు బాగలా. ఇట్ట మూడుదినాలకోసారి  పడవబడి పోయ్యేవోడి తో పనికి పంచేటని వోనరు ఇంగోసారి పనికి రావొద్దని ఇంటికొచ్చి ఎచ్చరించి  పొయినాడు. సారాయి  దాగేది నిలిపైమని ,  ఆ దరిద్దరపు తాగుడే వొల్లు పాడుజేసేస్తా ఉండాదని మల్లి రంపు బెట్టుకునింది. పనికి బొయ్యేదాని గురించి రాజుగానికిప్పుడు మనేదే లేదు. తెల్లారి లేస్తే వంక కాడుందే సారాయి అంగిడికి బొయ్యేది…తాగేసొచ్చి నోటికి ఎంత మాటొస్తే అంత మాటా అనేది… బండ మాట్లన్నీ మాట్టాడుకుంటా అరుగుమింద గుచ్చోనుండేది …మత్తు దిగిపోయినాక మల్లీ సందేళ కాడ ఇంగోతూరి సారాయంగిడికి బొయ్యొచ్చేది…వూరంతా రాజుగాడి మొకాన కారిమూస్తే గూడా వాడికి లెక్కలేకుండా వుండాది.  దీనికితోడు మూడూమూడ్రోజులకు జొరమొకటి. కొడుకుని అమ్మగారింటి దగ్గిర వొదిలేసి కూలికి బోతావుంది మల్లి.

శనారం మద్దేనం పినపెద్ద ఇచ్చిండే ఆర్నూరు రూపాయిలు దీస్కోని, మొగున్ని దొడుకోని తిరప్తి లో వుండే రుయాస్పత్రికి ఎలబారింది. వొల్లు కొంచిం కుదురుకుంటే ఎట్టోకట్ట పనిలో బెట్టేయాలని జూస్తావుంది మల్లి. ఆసుపత్రిలో రగతం పరీచ్చజేసేస్తే ఏం రోగమొచ్చిందో తెల్సిపోతుందని  డాకట్రు జెప్పినాడు. అట్నే అని రగతం ఇచ్చేసి, రెండ్రోజులు ఆసుపత్రి లోనే వుండిపోయినారు. మంగలారం కాయితాలు జూసి డాకట్రు జెప్పిన మాట ఇన్నాక మల్లికి నోట్లో మాట రాలా. అట్నే యాడస్తా కూలబడి పొయ్యింది. రాజుగాడు మాత్తరం ‘ యాడవద్దు మే … ఏం గాదులే. ఎప్పుడో ఒగప్పుడు పోవాల్సిందే గదా .. నా టయుము ఐపోయిందనుకో..పైకి లెయ్ ‘ అంటా జబ్బ బట్టుకోని మల్లిని పైకి లేపినాడు. వోల్లిచ్చిన మందులు తీసుకొని నెత్తీనోరూ కొట్టుకుంటా….నా బతుకు ఎందుకిట్టా అగ్గిబడి పోయిందాని యాడస్తా ఇంటికొచ్చింది . అందురూ… “ఆస్పత్రికి పొయ్యి వోచ్చినారు గదా? ఏవిజెప్పినార”ని అడగతా వుంటే సెప్పలేక మల్లికి బేజారుగా వుండాది.  నా మొగుడికి ఎయిడ్సని ఎట్ట జెప్పుకునేది. సెప్తే కడుపుకిన్ని నీల్లుబోస్తారా ఎవురైనా?

Mogani Rogam katha illustration

రోగం ఏందో తెలిసిపోయ్యినాక పదైద్దినాల నుంచి రాజుగాడు గొమ్మునే వుంటా వుండాడు. అప్పుడప్పుడు మల్లితో, కొడుకుతో కుచ్చోని యాడస్తా ‘నేను బోతే ఎట్ట బతకతారో!’ అంటా కుమల్తా ఉంటాడు.   మాయదారి జబ్బు రానన్నా వొచ్చింది… మనిషి మారిపొయ్యినాడులే అనుకునేలోపల వాడికి ఇంకో రోగం బట్టుకునింది. ‘నేను సచ్చిపోతే నాపెళ్ళాo ఎందుకు బతకల్ల? ఆ బిడ్డె ఇంగ ఎవుర్నన్నా పెండ్లి జేసుకునేస్తిందా? నేను లేనప్పుడు  వాల్లెందుకు వుండల్ల?’ మల్లి నీల్లు పట్టకచ్చే దానికి కొళాయి కాడికి పొయ్యినా, ‘ఎవుడితో ఏం మాట్లాడేస్తా వుందో’ అని బయిపడతా ఆబిడ్డికి కాపలా గాస్తా వుండాడు. ఎవుర్తో మాట్లాడ్నా,’ వాల్తో నీకేం పని?’ అని మల్లిని తిడ్తా కొడ్తా వుండాడు.

రోగం యాడ అంటుకునేస్తిందో అని రాత్తిరైతే దూరదూరంగా తిరగతా వుండే మల్లిని జూస్తే వాడి కోపమింకా ఎక్కువైపోతా వుండాది. మామూలుగా ఉండేప్పుడు కొడ్తే ఊరంతా వొగిటై పోతిందని బయిపడి, తాగేసొచ్చి కొడ్తా వుండాడు. ఈరోజెట్టయినా మల్లిని లొంగదీసు కోవాలని వాడుగూడా వొట్టేసుకున్నాడు.

తలుపులు కొట్టీ కొట్టీ రాజుగాడి బలం సచ్చిపోతా వుండాది. దాలముందరం కాడనే నిద్దర బొయ్యినాడు. తెల్లార్నీ … మొగుడి కతేందో జూద్దారని మల్లి గూడా నడిజాముకాడ నిద్దరబొయ్యింది.

  టయిము నాలుగైంటింది. ఈపు మింద ఎవురో కొట్టినట్టు నిద్దర మత్తు వొదిలిపోయ్యింది రాజుగాడికి. మెల్లిగా పైకి లేసి తలుపుసందులో నుంచి ఇంట్లోకి తొంగి సూసినాడు. మల్లి మంచి నిద్దర్లో ఉండాది. గెడేసేసి తలుపుకడ్డంగా సామాన్లు పెట్టేసిండాది. సిన్నంగా తలుపు పక్కన్నే ఉండే గూట్లో కాలుబెట్టి గుడిసె పైకి ఎక్కినాడు. మెల్లిగా మనిసి పట్టేంత బోద ఎత్తి పక్కన పెట్టేసి, ఇంట్లోకి దిగి మల్లిమింద పడ్నాడు. మల్లి తప్పించుకునేదానికి వోడు సందీలా. వాడ్నించి కాపాడుకోను తలుపుకడ్డంగా పెట్టిన సామాన్లన్నీ ఆరోజు మల్లి పాణం మీదికి తెచ్చినాయి. వోడ్ని కొట్టి, తిట్టి, సాపనార్తాలు బెట్టినా లొంగిపోక తప్పలా మల్లికి.

***

ఇంత జరిగిపోయ్యినాక బతికేం జెయ్యాలని గన్నేరు పప్పు తినేసి సచ్చిపోదారని జూస్తే కొడుకుని జూసన్నా దైర్నంగా ఉండమని వోల్లమ్మ పోరుబెట్టుకునింది. ఇప్పుడు రాత్తిరైతే మల్లికి బయిం లేదు.  మొగోడంటేనే కడుపుగాల్తా వుండాది. మొగుడ్నే గాదు…కొడుకుని జూస్తే గూడా. ఇట్టాంటి కొంపలో పెద్దోడై వాడెంత మంది కొంపలు కూలస్తాడో అని. మొగోడు కనిపిస్తే సాలు, దొరికిండే రాయి ఎత్తుకొని పిచ్చిదాన్లా తరుమ్కుంటా వుండాది.

ఇంగోపక్క ఆరోజు రాత్తిరి నించీ రాజుగాడికి నెత్తినుండే మూటబొళువు దిగిపోయినట్టుగా వుండాది. వొంట్లో ఉండే రోగం అప్పుటికప్పుడు మానిపోయినట్టు తేలిగ్గా వుండాది. ‘ఇప్పుడు నాపెళ్ళాం యాడికి బోతింది, ఎవుర్తో తిరిగితిందో జూస్తా…నేనెన్ని దినాలు బతికితే అన్ని దినాలు అది గూడా నాతో వుంటింది. నేను సస్తే నాతోగూడా సస్తింది. పిల్లోడిని  వోల్లవ్వ మొగోన్ని జేస్తింది’ అనుకుంటా వుండాడు. ఇన్నిదినాలూ వోడికుండే రోగాన్ని దాసిపెట్టుకొన్నోడు ఇప్పుడు పెళ్ళాం కొచ్చిన రోగం గురించి తోటి ఈడోల్లందరికీ జెప్పుకుంటా వుండాడు.

శెప్తేనే గదా పెళ్ళాం గురించి అందురికీ తెల్సేది…ఎవురూ దాని జోలికి రాకుండా వుండేది! అది సచ్చిపోయినా, పిచ్చిదై పొయ్ నా సరే… దానికి నా తర్వాత, నేను లేని బతుకక్కరలేదు.

jhansi papudesi    —ఝాన్సీ పాపుదేశి

(జర్నలిజం చదివి, తిరుపతి రిపోర్టరుగా ఆంధ్రజ్యోతి దిన పత్రికలో పనిచేస్తూ చివరిదాకా ఇదే నా వృత్తి అనుకున్న సమయంలో అనుకోకుండా  రిపోర్టరు ఉద్యోగాన్నే కాకుండా, సొంత రాష్ట్రాన్ని కూడా వొదిలి బెంగుళూరులో స్థిరపడాల్సి వచ్చింది.  వృత్తి ఏదైనా ప్రతి రచనకో ఆత్మ సంతృప్తిని పొందుతూ,  రాయడం ఆపకూడదన్న పట్టుదలతో రాస్తున్నా. బ్లాగుల్లో రాసుకుంటున్న నేను కొందరు మిత్రుల ప్రోత్సాహంతో ఇంటర్నెట్ పత్రికలకు పంపడం మొదలుపెట్టా. నా స్వస్థలం చిత్తూరు జిల్లా అరగొండ గొల్లపల్లె. మాండలికాలు మర్చిపోయి పుస్తక భాషకు మారిపోతున్న సమయంలో చిత్తూరు మాండలికంలో రాయాలన్న ఆలోచన వచ్చింది. అచ్చంగా నా వూరి భాషలో రాస్తున్నా. మహిళగా పుట్టినందుకు తోటి మహిళల జీవితాల్ని అందరితో పంచుకోవాలని అనుకున్నా. తొలి కథ “దేవుడమ్మ” సారంగ లోనే వచ్చింది.

email : papudesijc @gmail.com)

 

కొత్త స్వతంత్ర మానవ సంబంధాల ప్రతిబింబం ‘ఫ్రిజ్ లో ప్రేమ’ !

సచిన్ కుండల్కర్

సచిన్ కుండల్కర్

సచిన్ కుండల్కర్ ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’, ‘పూర్ణవిరామం’ రెండు నాటకాలు రెండు విభిన్నమైన శైలుల్లో రాశారు. స్థూలంగా చెప్పాలంటే ‘పూర్ణవిరామం’ యొక్క శైలి వాస్తవిక వాదానికి సంబంధించింది. నిజ జీవితాల్లోని తర్కవితర్కాలు ఈ నాటకంలోని సంఘటనలకి అన్వయించు కోవచ్చును. ఈ నాటకంలోని మధ్యతరగతి వ్యక్తి రేఖా చిత్రాలైన ప్రసన్న, అతని స్నేహితురాలు శ్రేయల ప్రవర్తనకి కారణాలు, అందులోని సంఘటనలపరమైన ప్రశ్నలకి జవాబులు మనకి సాధారణ మానసిక శాస్త్రం లేదా సామాజిక శాస్త్రాల్లో దొరికిపోతాయి. కుండల్కర్ రాసిన మొదటి నాటకం ‘ఛోట్యాశా సుట్టీత్’ (చిన్నపాటి సెలవు) మరియు మొదటి నవల ‘కోబాల్ట్ బ్లూ’ ఈ రెండు కళాకృతులు వాస్తవికవాద శైలిలోనే రాయబడ్డాయి.

‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ (ఫ్రిజ్ లో ప్రేమ) నాటకం శైలి కుండల్కర్ రెండవ నాటకమైన ‘చంద్రలోక్ కాంప్లెక్స్’కి దగ్గరగా ఉంటుంది. ఈ శైలిని మనం స్థూలంగా ప్రతీకాత్మక శైలిగా అభివర్ణించవచ్చును. ఇందులోని ఘటనలు, వాటికి ఓ ఆకారాన్నిచ్చే తత్వం, ఏవీ సర్వసామాన్య తత్వానికి సంబంధించినది. ఇక్కడ ప్రేమ ఫ్రిజ్ లో గడ్డ కడుతుంది లేదా కుక్కలకి పూల వాసన చూపించి లొంగదీసుకోవడమూ జరుగుతుంది. ఈ నాటకంలో కూడా మళ్ళీ ప్రసన్న పాత్ర ఉంటుంది. కాకపోతే ఇందులో అతని జోడి ‘పూర్ణవిరామం’ లోని శ్రేయకి పూర్తిగా విరుద్ధమైన పార్వతి. వీళ్ళిద్దరితో పాటుగా వాళ్ళ హృదయాల్లోని ప్రతిబింబాలైన అతి ప్రసన్న, పార్వతిబాయి కూడా ఉంటారు. ఈ రెండు కాల్పనిక పాత్రల వల్ల నాటకానికి ఒక అవాస్తవిక వాదపు స్థాయి లభిస్తుంది.
ఈ రెండు నాటకాలు భిన్నమైన శైలుల్లో రాయబడినప్పటికీ రెండింటికి మానవ సంబంధాలే కేంద్రబిందువు. ‘పూర్ణవిరామం’ లోని ముఖ్య పాత్ర ప్రసన్న కుటుంబాన్ని వదిలి, కొన్ని చేదు జ్ఞాపకాలతో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చూస్తుంటాడు. అతనికి తోడుగా ఉండే ‘మిత్ర’ ప్రసన్నకి తోడుగానే ఉందామనుకుంటాడు. ప్రసన్నని తన మీద ఆధారపడే బలహీనుడిని చేయరాదని గట్టిగా అనుకుంటాడు. ఈ పాత్ర ‘ఫ్రిజ్ లో ప్రేమ’ లోని అతి ప్రసన్నలా ప్రసన్న హితవుకోరే అంతర్ మనస్సు అయి ఉండాలి అన్పిస్తుంది.

నాటకంలోని మూడవ పాత్ర శ్రేయ. ప్రసన్న మాదిరిగానే తను కూడా కుటుంబానికి ముంబయిలో దూరంగా ఒక్కర్తే ఉంటుంది. కాకపోతే ఇంకాస్త ఎక్కువ ఆత్మవిశ్వాసంతో. ఆమెలో కన్పించే స్నేహభావం ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది. నిద్రపోతున్న ప్రసన్న మీద దుప్పటి తెచ్చి కప్పే సహజమైన స్నేహభావమిది. తను గర్భవతినని తెలిసి, ఆ బిడ్డ తండ్రి ఈ విషయం విని పారిపోయాడని తెల్సి ఆశ్చర్య పడుతూ ఇలా ఉంటుంది. “ఉద్యోగం గురించి ఆలోచించలేదు నేను, కెరియర్ గురించి కూడా. నెల తప్పిందని తెలియగానే నాకు కేవలం ఆనందంగా అనిపించిందంతే. ఇంత మంచి విషయం తెలిసిన తర్వాత ఎవరికైనా భయం, దిగులు ఎలా కలుగుతాయి ? ఆ మాత్రం చూసుకోలేమా ముందేం జరిగితే అది. తనని తాను జీవితపు లాలసతో ముంచెత్తుకునే ఈ శ్రేయకి పూర్తి భిన్నమైన పాత్ర ” ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్” లోని పార్వతిది. ప్రేమని ఆచితూచి కొలిచి ఇస్తుంటుంది. కుక్కల మీద ప్రేమ వర్షం కురిపించే పార్వతి ప్రసన్నని మాత్రం ఆ ప్రేమ నుంచి వంచితుడ్ని చేస్తుంది.
ఈ రెండు నాటకాల్లోని ప్రసన్న జీవితంలోని ఒక్కో మలపులో ఒకే వ్యక్తిగా దర్శనమిస్తాడు.ఇద్దరు రచయితలే.ఇద్దరి వయస్సుల్లో తొమ్మిది సంవత్సరాలు తేడా ఉందంతే.’పూర్ణ విరామం’ లోని ప్రసన్న సున్నిత మనస్కుడు.ఈ నాటకం చదివేటప్పుడు కుండల్కర్ తన ‘కోబాల్ట్ బ్లూ’ నవలలోని నాయకుడు తనయ్ తన పేరు ప్రసన్న గ మార్చుకొని, కుటుంబాన్ని వదిలి ముంబైకి వచ్చాడా అనిపిస్తుంది.తన సామాను నుండి అతను ఆ నీలివర్ణపు పెయింటింగ్ తీసినపుడు మాత్రం కచ్చితంగా ఇతను తనయ్ నే అన్నది నిర్ధారణగ అనిపిస్తుంది.తనయ్ మిత్రుడు అతనింట్లో పేయింగ్ గెస్ట్ గా ఉన్నప్పుడు నీలివర్ణపు చిత్రాలు వేస్తాడు.ఆ మిత్రుడు జ్ఞాపకార్థంగా కొన్ని చిత్రాలు వేస్తాడు.ఆ మిత్రుడి జ్ఞాపకార్థంగా కొన్ని చిత్రాలు ఇతను ముంబై కి తెచ్చుకున్నట్టు గా అనిపిస్తుంది.ఆ మిత్రుడు స్మృతి ‘పూర్ణ విరామం’ లో సుప్త దశ లో ఉంటుంది.నాటకం చివర్లో వచ్చే ఒక పార్సెల్ లో ఉన్న నీలివర్ణపు చిత్రం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చును.
నిష్కల్మష్కుడైన తనయ్ కి జీవన సంబంధ విషయలేన్నిటినో నేర్పించిన మిత్రుడు అతడిని మోసగించి వెళ్ళిపోయాడు.దాంతో తనయ్ లో వచ్చిన మార్పులు, 26 ఏళ్ళ ‘పూర్ణ విరామం’ లోని ప్రసన్న లో కనిపిస్తాయి. ‘ఫ్రిజ్ లో ప్రేమ’ లోని ప్రసన్న మాత్రం 35 ఏళ్ళ వాడయాడు.కాని ప్రేమ కోసం అదే అలమటింపు,అయితే ఈ నాటకం ముగింపు లో మాత్రం,జీవితం లో వేరు వేరు స్థితిగతుల్లోని అనేక అనుభవాల తర్వాత,జీవితం ఎలా ఎందుకు జీవించాలి అన్నది అతనికి స్ఫురిస్తుంది.ప్రసన్న ఈ పరిపక్వారుపం మొదటి చిహ్నం మనకు ‘పూర్ణ విరామం’ లో కనబడుతుంది.ఒకప్పుడు తండ్రి దగ్గర నుండి దూరమైన ప్రసన్న ‘పూర్ణ విరామం’లో ఆయనతో సహ అనుభూతి అనుబంధాన్ని జోడించుకుంటాడు.

అతడు ‘పూర్ణ విరామం’ లో ఆపేసిన రచనా వ్యాసంగం ‘ఫ్రిజ్ లో ప్రేమ’ చివర్లో మొదలవడం,అదీ అతి జోరుగా సాగే సూచనలతో మొదలవడం మనం గమనిస్తాం.మనం మన ముఖ్యమైన పనులని ఇతరులు చేసిన దగా వల్ల వదిలేయడమో,మన స్వయం ప్రతిపత్తిని మన చేతులారా పోగొట్టుకోవడం,మనకి మనం చేసుకునే హాని అన్నది ప్రసన్నకి స్ఫురించినదని నాటకం ముగింపు సూచిస్తుంది.ఇక్కడ అతి ప్రసన్న ఎప్పుడైతే ప్రసన్న ని ‘అయితే ,ఎలా ఉంది కొత్త ఇల్లు’ అని అడిగినప్పుడు అతను ‘బాగుంది.ముఖ్యంగా శాంతంగా ఉంది.అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లోకి వచ్చినట్లుగా పిచ్చుకల అరుపులు కూడా వినవస్తాయి’.ఇంట్లోని శాంతే ప్రసన్న మనఃశాంతికి సాక్ష్యం పలుకుతున్నట్టుగా ఉంటుంది.

 

‘పూర్ణ విరామం’ లో ప్రసన్న శ్రేయకి చెప్పిన జీవన తత్వమే మరో రూపంలో ‘ఫ్రిజ్ లో ప్రేమ’ లో చెప్పబడుతుంది.’పూర్ణ విరామం’ లో ప్రసన్న అంటాడు,”కళాకారుడే ఎందుకు,నేనంటాను, అసలు మనిషి స్వతంత్రుడు కానేకాడు.కానవసరం లేదు కూడా.ఇలాంటి కాస్త కూస్త భావనిక ఆలంబనలోనైనా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళం ఆధారపడతాం కదా ! ” ఇలాంటి ఆలంబన మనిషిలోని మానవతా మర్మాన్ని తెలియచేసేదైతే,ఆ గుణాన్ని అలవర్చుకోవాలంటే శ్రేయలాంటి విశాల దృక్పథం కావాలి.అతి ప్రసన్న కొత్త ఇంటి కోసం కావాల్సిన వస్తువుల జాబితా తయారు చేస్తూ ఎప్పుడైతే ఫ్రిజ్ గురించి ప్రస్తావిస్తాడో ప్రసన్న చప్పున వెంటనే అంటాడు.”ఇంట్లో ఫ్రిజ్ వద్దు.మనం రోజు తాజాగా వండుకుందాం.ఏ రోజుది ఆరోజే తినేద్దాం.నిలువ ఉంచడం వద్దు.దీనితో జీవితం సరళంగా సాగిపోతుంది”.

friz
ఈ రెండు నాటకాలు మానవీయ సంబంధాలకి సంబంధించి ఉద్భవించే సమస్యలు నాటకకర్త వ్యక్తిగత సమస్యల్లాగా భాసిస్తాయి.ఈ నాటకాలు రాస్తున్నప్పటి సృజనాత్మక సెగ తాకిడి అనుభవం,ఎదుర్కొన్న ప్రశ్నలకి వెదుక్కున్న జవాబులు దీనికి కారణం కావచ్చు.ప్రతి రచయిత కొద్దో గొప్పో తనకి ఎదురైనా అనుభవాల్లోని ప్రశ్నలని తన రచనల్లో పొందుపరుస్తాడు.కానైతే కుండల్కర్ విషయంలో అదింకా ఎక్కువగా కనిపిస్తుంది.కారణం కుండల్కర్ రచనల్లోని ప్రధాన పాత్రలు రచయితలు అవి మొదట విచలితులై,నిలదొక్కుకుని,ఆ తర్వాత జీవితార్థన్ని వేదుక్కుంటాయి.ముఖ్యపాత్ర రచయిత అయినప్పుడే నాటకకర్త యొక్క ఆత్మ నిష్టాపరమైన ముద్ర స్పష్టంగా తెలుస్తుంది.కుండల్కర్ నవల మరియు ఈ రెండు నాటకాలని కలిపి చూస్తే ఇందులోని విషయ వివరాలు భావనాత్మకంగా పెనవేయబడి ఉంటాయి.రచయిత ఆత్మనిష్ట వీటిలో స్పష్టంగా ద్యోతకమవుతుంది.

ఇదే ఆత్మనిష్ట యొక్క మరో ఆవిష్కారం పార్వతి పాత్రలో కనపడుతుంది. కుండల్కర్ రచనలన్నింటిని చూస్తే తెలిసేదేమంటే ఉద్యమాలు, అవి ఏ మానవ సమస్యలకి సంబంధించినవైనప్పటికీ, అతనికి అసమ్మతాలే.అంతేకాక అతనికి ఉద్యమాల మీద కించిత్తు కోపం కూడా.’ఛోట్యాశా సుట్టిత్’ లో ఇదే కోపం అందులోని స్త్రీవాద పాత్రల మీద పరిణామం చూపిస్తుంది.అదే కోసానుభుతి ‘ఫ్రిజ్ మథె ఠేవ్ లేలా ప్రేమ్’ లోని పార్వతి పాత్ర చిత్రీకరణలో కనిపిస్తుంది.ఈ పాత్ర ద్వారా ఉద్యమాల్లోని కార్యకర్తలు మానవ సంబంధాలకు దూరమైనా ధోరణులను,రీతులను వెలికి తీస్తారు.వీటన్నిటి వెనకాల అతనిలోని నిఖార్సైన మానవతావాది కనపడతాడు.మానవ సంబంధాలను అరచేతులలో దీపంలాగా సంబాళీస్తాడు నాటకకర్త.అందుకే ఈ సంబంధాల్లోని ఆ పాత్రలేమో కర్కశంగా,బోలుగా,చదనుగా అనిపిస్తాయి.అయినప్పటికీ మానవతవాదంలోని ప్రతి వ్యక్తికీ న్యాయం జరగాలనే సూత్రాన్ని కుండల్కర్ ఒప్పుకోరు.ఉద్యమాల్లోని పాత్రల మానవత్వాన్ని ఉద్యమం లాగేస్తుంది.’ఫ్రిజ్ మథె ఠేవ్ లేలా ప్రేమ్’ లోని పార్వతి వ్యక్తీరేఖా చిత్రణ ఈ నాటకపు అస్తిత్వవాద శైలి యొక్క సుస్థిర భాగంగా చుస్తే,అదే రీతిలోని ‘ఛోట్యాశా సుట్టిత్’ లోని యశోద పాత్ర విభిన్నంగా కనిపిస్తుంది.స్త్రీవాది అయిన యశోద అభినేత్రి ఉత్తర తల్లి చేసిన ప్రతిపాదనలతో ఏకిభవించదు సరికదా విచారం వ్యక్తం చేస్తుంది.”ఆడవాళ్లేమైనా డైనోసార్సా ఏమిటి ! వాళ్ళ గురించి,వాళ్ళ స్వాతంత్రం గురించి పరిశోధనలు చేయడానికి?” అంటుంది.స్త్రీవాద ఉద్యమకారులు కర్కశ మనస్కులుగా ఉండవచ్చును.చాలాసార్లు ఉంటారు కూడాను.కానీ ఏ రచయితకైతే ఉద్యమం పట్ల సహానుభూతి ఉంటుందో అప్పుడు ఆ ఉద్యమపు ప్రాతినిధ్యం ఇలాంటి పాత్రల చేతుల్లోకి వెళ్ళవద్దన్నది ముఖ్యమైన అంశం.

కుండల్కర్ నిర్మించే భావవిశ్వం ఇవాల్టిదన్నదాంట్లో ఏ అనుమానం లేదు.ఇంతవరకు వచ్చిన మరాఠీ నాటకాల్లోని స్త్రీ పురుష పాత్రల సంబంధాలు ప్రసన్న-శ్రేయల సంబంధంలాగా స్పష్ట స్నేహభావంతో నిండిలేవు.స్త్రీ పురుషుల మధ్య నుండే అంతరం ‘పూర్ణ విరామం’ లో ఎక్కడా కనిపించదు.శ్రేయతో పాటుగా ప్రసన్న వంటింట్లో పనులు చూసుకుంటాడు. ఇక్కడ ఎవరూ ఎవరి మీద, కేవలం వాళ్ళు పురుషుడు- స్త్రీ అనే అస్థిత్వ వర్చస్సుని ఇంకొకళ్ళ మీద రుద్దరు. ఇద్దరు వ్యక్తులు సమాన సంబంధాలతో ఒకిరికొకరు ఆసరాగా నిలబడతారు. ఆధారాన్ని ఇచ్చి పుచ్చుకుంటారు. చివర్లో శ్రేయ ప్రసన్న బిడ్డకి తల్లిని కావాలనుకుంటుంది. ప్రసన్న విచలితుడవుతాడు. అప్పుడు శ్రేయ అతడితో అంటుంది. “నీకు నామీద విశ్వాసం ఉంది కదా! నేనేం నిన్ను కట్టిపడేసుకోను. నన్ను పెళ్ళి చేసుకోమని కూడా అనను.”

ఇలాంటి స్వతంత్ర, సమాన సంబంధాలు ఇతని ఇతర రచనల్లో కూడా తగుల్తుంటాయి. అతి వేగంతో మారుతున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల సందర్భంలో మానవ సంబంధాలను ఒక్కసారి పరిశీలించుకొని, ఇదే మానవ సంబంధాల పరదాల వెనక విశృంఖలంగా మారుతున్న సంబంధాలను వేదిక మీదకి తెద్దామన్న బాధ్యత కుండల్కర్ సునాయాసంగా తనమీద వేసుకున్నాడు. ఈ కొత్త స్వతంత్ర మానవ సంబంధాల రూపాన్ని కొత్త రచయితలందరూ పరిశీలించాలి. ఇవే సంబంధాలు మరాఠీ రచయితలైన మనస్విని, లతా రవీంద్ర, ఇరావతీ కర్ణిక్ నాటకాల్లో కూడా కనపడతాయి. కాబట్టి కుండల్కర్ నాటకాలని ఈ తరహా ప్రాతినిధ్యంతో పాటుగా ఆత్మనిష్ట లేఖనంగా కూడా పరిగణించవచ్చు.

కుండల్కర్ తన నాటకాల్లో అందమైన పారదర్శక మానవ సంబంధాల విశ్వాన్ని నిర్మిస్తాడు. ఈ విశ్వం సౌమ్యం,సరళమైనప్పటికీ సున్నిత, సుమధురమైంది కాదు. సంబంధాలని నిర్మించుకోవాల్సి వస్తుంది. అందుకోసం పోట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ పోట్లాటలో తమ తమ మూల జీవనతత్వానికి విభిన్నమైన పరిణామం కలగకుండా జాగ్రత పడవలసిన అవసరమూ ఉంటుంది. అందుకే ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ నాటకాంతంలో ప్రసన్న పార్వతి కోసం ప్రేమలేఖ ఒకటి రాసిపెడతాడు. అతిప్రసన్న ఆ లేఖ అవసరమేమిటని ప్రశ్నించినప్పుడు, ప్రసన్న చెప్తాడు.”జీవితం చాలా చిన్నది. ఈ ప్రపంచమయితే మరీ చిన్నది. అందులోను గుండ్రమైనది. మనుషులు అందులోనే తిరుగుతూ, ఎప్పుడో ఒకప్పుడు ఒకరికొకరు ముఖాముఖిగా ఎదురెదురుగా నించోవాల్సిందే. అలాంటప్పుడు నేనూ, పార్వతీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురెదురుగా నిలబడ్డ క్షణం శాంతంగా, సమంజసంగా ఉండాలన్న ప్రయత్నం ఈ ఉత్తరం.”
ఎక్కడికక్కడ హింసాప్రవృత్తి ప్రబలిపోతున్న సమాజంలో కుండల్కర్ ప్రేమ, సమంజసతని గురించి చెబుతూ వాటితో జీవించాలని సూచిస్తారు. ఇది అతని మానవ జీవన దృష్టి కోణం.

 

శాంతా గోఖలే

శాంతా గోఖలే

-శాంతా గోఖ్లే , ముంబాయి

–అనువాదం : గూడూరు మనోజ

ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు: ‘The Visceral-Corporeal’, బైరాగి కవిత్వం

aluri-bairagi

1.

మనకు జీవితకాలం పాటు ‘నిరంతరానంద భిక్ష’  పెడుతూవుండే కవితో మనకు – వైయక్తిక స్థాయిలో – చాలా సంక్లిష్టమైన, ambivalent అయిన సంబంధం ఉంటుందనిపిస్తుంది.

 

గాథాసప్తశతి ని ‘The Absent Traveller’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన  Arvind Krishna Mehrotra,  ఆయన  Translator’s Note లో ఇలా అంటారు: ‘As readers we sometimes feel possessive about certain authors. They are our discoveries, and write only for us. When the whole world comes to know of them, the magic of their pages is destroyed and we feel robbed.’ ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు ఆయన మనస్సులో ఏ రచయిత మెదిలారో గాని, ఆలూరి బైరాగి కవిత్వంపైని నా లుబ్ధత్వం గురించే రాసారనిపించింది. బైరాగిని అందరూ చదవాలనీ, చర్చించుకోవాలనీ వుంటుంది. అదే సమయంలో, నేను మాత్రమే unlock చేయగల రహస్యమేదో ఆయన encrypt చేసి వదిలివెళ్ళారనిపిస్తుంది.‘రంగుల తోట’ అనే కవిత చివరలో ‘నీతో ఒకటి చెప్పలేదు-/నా రంగుల తోటలోకి అప్పుడప్పుడు నిన్ను తప్ప/ ఎవ్వరినీ రానివ్వను’ అని నన్నుదేశించి రాసారనే అనుకుంటూవుంటాను. ‘ప్రశ్నను ప్రశ్నించిన కవి బైరాగి’ (‘మో’ మాట) ని కేవలం eulogize చేయడంవల్ల ఒరిగేదేమీ లేదు. మన సాహిత్యలోకం బైరాగిని అర్థంచేసుకోవడానికి చేసిన కృషి స్వల్పం. అలాగని గణించదగ్గ విమర్శ రాలేదనికాదు. ఇంతకంటే pressing, urgent  అవసరాల్ని literary mainstream పట్టించుకోవడం వల్ల ఆయన అర్థవిస్మృతుడు. అంతే.

 

2.

జెర్రులు ప్రాకుతున్నై, తేళ్ళు, త్రాచుపాములు నాచుట్టూ,

కత్తిరించి కుడుతున్నారు నన్నెవరో చొక్కాలా

శ్వాసనాళంలోంచి  శ్వాస త్రాగుతున్నారు హుక్కాలా

ఏదో ప్రవాహంలో(బహుశా అది నెత్తురేమో)

కొట్టుకుపోతున్నాను. నాచుట్టూ నాతోబాటు వందలు వేలు

చేతులు, కాళ్ళు, తెగిన శిరస్సులు, మొండాలు, పీకిన గ్రుడ్లు

వెంట్రుకలు నాచులాగ, ప్రేవులు నరాలు కాడల్లా;

పొగచూరిన ఎర్రకిరసన్ వెలుతురులో

కనుపించని ఒక చిక్కని ద్రవంలోన (నెత్తురే అయిఉంటుంది)

గిలగిల తన్నుకొంటున్నాను మాంసపు ముద్దలాగ;

అరుస్తున్నాను భయంతో చుట్టూచూసి, వినరాని కేకలువేసి,

సమస్త జీవకోటులు కొట్టుక వస్తున్నాయి

ఎటువైపు తిరిగినా ఏదో ఒకటి తగులుతోంది

మెత్తగా, నున్నగా, చీదరగా.

బిలబిల ప్రాకుతున్నవి పురుగులు నా ముక్కులోకి, చెవుల్లోకి

ఒంటినిచుట్టి పట్టుకొనే జలగలమూక.

అదిగదిగో, కొట్టుకొని వస్తున్నది శిరస్సొకటి,

దాని నొసట ఎర్రని నోరు, మూడవకన్ను,

తెరచిన రంధ్రమొకటి వెక్కిరిస్తోంది

పుర్రెలపాటలాగ గుడగుడమనే సుడిగుండం

కొంగ్రొత్త ఉపనదులవి, మహానగరాల మురుగు మోస్తూ

ఆసుపత్రి కాల్వల్లోంచి చీముతో, రసితో నిండి.

వినీల లోహకాంతులు విరిసినాయి దిక్కులలో

మసిగుడ్డవలే గగనం పరుచుకొన్నది నల్లనిదై

ప్రవాహవేగంవల్ల కదులుతోంది ప్రతి జీవం

చావులోకి, బ్రతులోకి, నిదుర మగతల మూర్ఛలోకి.

 

ముందున్నది క్షితిజం కాదు, అంతులేని సొరంగమది

గోడలు మెరుస్తున్నవి కొలిమిలో ఇనుములాగ

జీవంగల రుధిరామిషబిలం అదే

గోడలు చలిస్తున్నవి ప్రాకుతున్నపురుగుల్లా

ప్రవాహం ప్రవేశించింది గుహలో, సృష్టి రంధ్రంలో,

ఆవలనున్న సాగరంలో, రజనీ నైశ్శబ్ద్యంలో

నే నెవణ్ణి, ప్రభువునా, బానిసనా,

మెదులుతున్న మాంసపుముద్దనా, మానిసినా?

ఈ అగ్నిశిఖల్లోంచి, ఈ రక్తమఖం లోంచి

నూతన జననమా, లేక ప్రాక్తన మరణమా?

 

Literary Modernism యూరోప్ లోనూ, మన దేశంలోకూడా alienation/dehumanization ని చిత్రించడం ప్రధాన లక్షణంగా కలిగివుందని అందరికీ తెలిసిందే. కానీ, ఈ విషయాన్ని కవిత్వంగా మార్చేక్రమంలో కవి వాడే tropes, techniques అతడి విలక్షణతని పట్టిస్తాయి.

 

‘నూతిలో గొంతుకలు’ కవితాసంపుటిలో ‘హామ్లెట్ స్వగతం’, ‘అర్జున విషాదయోగం’, ‘రాస్కెల్నికోవ్’ అనే మూడు భాగాల ముందు eponymous కవితైన ‘నూతిలో గొంతుకలు’ ఐదు భాగాలుగా వుంది. ఈ ప్రారంభకవితలోని concerns నీ, themes నీ తరువాత వచ్చే మూడు స్వగతాలు dramatize చేస్తాయి. ‘అర్జున విషాదయోగం’, ‘రాస్కెల్నికోవ్’ అనే భాగాలు స్థూలంగా చూస్తే స్వగతాలు కావుగానీ, జాగ్రత్తగా గమనిస్తే అవీ స్వగతాలే.

ప్రారంభ కవితలో digressions , సంవాదం, exposition , illustration  లాంటి discursive పద్ధతులెన్నో కనిపిస్తాయి. కొన్ని దృశ్యాల్ని condense చేస్తూ, కొన్నింటిని extend చేస్తూ సాగే శైలి దీర్ఘకవితల్లో కానవచ్చేదే. పైన quote చేసిన extended image అటువంటిదే.

 

‘కత్తిరించి కుడుతున్నారు నన్నెవరో చొక్కాలా

శ్వాసనాళంలోంచి  శ్వాస త్రాగుతున్నారు హుక్కాలా

 

Loss of autonomy of the individual ని పైపంక్తుల్లో వ్యక్తీకరించిన పద్ధతి బైరాగి aesthetic (noun form లో) లోని ఒక కీలకమైన అంశాన్ని తెలియజేస్తుంది. ఎవరో తనని చొక్కాలా కత్తిరించి కుడుతున్నారనడంలో – bodily mutilation , invasion of the corporeal (ఇంకా చెప్పాలంటే, ‘body snatching’) ని ఆయన alienation కు సంకేతంగా వాడుతున్నారు. అప్పటి (1951) తెలుగు కవిత్వంలో కనిపించని ఆశ్చర్యకరమైన associations బైరాగి ఏర్పరిచారు. ఆయన కవిత్వ ‘ecosystem’ (కావ్యాంతర్గత జగత్తు) లో కొన్ని ప్రత్యేకమైన motifs పరిభ్రమిస్తూవుంటాయి. వేరే కవితల్లో ‘దేహపు పరిధానంలోంచి’ , ‘మాసిన చొక్కాలా దేహాన్ని వదలి’ వంటి మెటఫర్స్ కనిపిస్తాయి. భగవద్గీతలో శరీరాన్ని వస్త్రంతో పోల్చే శ్లోకం ప్రసిద్ధం.  పై image మిగతా related images ని ఎలా meta-morphose చేస్తోందో గమనించండి.

 

నేను ఈ కావ్యభాగాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం, బైరాగి,  శరీరాన్ని (ఇది hyper-sexualized స్త్రీదేహం  కాదు)  కేంద్రంగా చేసుకొని ‘దుర్భరతర జీవిత బాధావధి’ ని దృశ్యమానం చేసారని చెప్పటానికే. ‘దైహికత’ (corporeality) గురించిన మన received, a priori knowledge అంతటినీ దైహికానుభవం defy చేస్తూనేవుంటుంది. అసలు ఒక శరీరావయవం కలిగుండటమంటే ఏమిటి? Surrealist paintings లోలా disembodied limbs, torso, eyes, nose ని శరీరపు ‘presumed’ unity నుంచి వేరు చేసి చూడటమంటే ఏమిటి? బైరాగి వాడిన విశేషణాలు చూడండి – ‘మెత్తగా’ , ‘నున్నగా’ , ‘చీదరగా’. ఆ disconcertingly visceral experience ద్వారా ఆయన సూచిస్తున్నదేమిటి? చుట్టూరా అవయవాలు, తనే  ఒక మాంసపుముద్ద. పోతున్నది ‘రుధిరామిష బిలం’ లోకి. ఆ contiguity , juxtaposition of visceral images ద్వారా fluid స్థితిలో ఉన్న subjectivity ని allegorize చేస్తున్నారు. ఇటువంటి interpretation ని బలపరిచే imagery ఇతర modernists లోనూ కనిపిస్తుంది. అలాగని, కేవలం allegorical potential (మరీ ముఖ్యంగా, ప్రతిదీ potential allegory అయినప్పుడు) ఉండటమే ఇక్కడ ప్రత్యేకత కాదు. బైరాగి కల్పనలో ముఖ్యమైంది ఆ visceral, visual immediacy.

 

చిన్న detour. ఈ పంక్తులు –

 

‘గోడలు మెరుస్తున్నవి కొలిమిలో ఇనుములాగ

జీవంగల రుధిరామిషబిలం అదే

గోడలు చలిస్తున్నవి ప్రాకుతున్నపురుగుల్లా

ప్రవాహం ప్రవేశించింది గుహలో, సృష్టి రంధ్రంలో,’

 

చదివేటప్పుడు Roberto Bolano రాసిన Anne Moore’s Life కథలోని (ఆయన Last Evenings on Earth కథాసంకలనం లోది) ఈ భాగం స్ఫురిస్తుంది: ‘…It was as if the walls of the hotel room were made of meat. Raw meat, grilled meat, bits of both. …she looked at the walls and she could see things moving, scurrying over that irregular surface…’ పై రెండు సన్నివేశాలూ (కథ చదివి చూడండి) ఎక్కడో దిగంతంలో కలిసేవే.

 

ఇక ‘రక్త మఖం’ గురించి. ‘యజ్ఞం’ motif  బైరాగి కవితల్లో చాల చోట్ల కనిపిస్తుంది.’ఆగమగీతి’ కవిత ‘మానస యజనవాటిక పై మరల నేడు…’ అనే మొదలవుతుంది.’మృత్యు యజనపు జీవమంత్రం’, ‘యజనారణులు విఫలమైనవి/ ఇక ప్రజ్వరిల్లదీ హోమాగ్ని’ – యిలా. ఈ recurring motifs ని ఆయన మరింత శక్తిమంతం చేసుకుంటూపోయి, ఇంచుమించు ఒక private cosmogony వంటిది తయారుచేస్తారు.

 3444572043_9c3ce9bb22_o

 

3.

‘త్రిశంకు స్వర్గం’ బైరాగి దీర్ఘకవితల్లో అత్యంత విశిష్టమైనది. అది Nausea (Sartre) లా, The Stranger  (Camus) లా ఒక గొప్ప existentialist text. కానీ, దాని నిజమైన precursor మాత్రం, Soren Kierkegaard  రాసిన ‘Sickness Unto Death’ అనే తాత్త్విక రచన. Kierkegaard ని ‘Father of Existentialism’ అన్నారు. ఆయన దర్శనం theistic existentialist thought కి అత్యున్నత ఉదాహరణ.

 

(A section of the book relevant to this discussion and analysis can be accessed with this link (……………). Reading the whole excerpt will be helpful for understanding the drift of Kierkegaard’s argument.)

 

Kierkegaard దేన్ని ‘ఆమరణ రుగ్మత’ అంటున్నాడు? మరణహేతువైన వ్యాధి – అంటే terminal illness

– ‘Sickness Unto Death’ కాదు. మరణం రోగానికి అంతమేమో కాని, అదే అంతం కాదు. Kierkegaard ప్రకారం, మరణం అనేది పరమచరమాంతం అని భావించడమే రుగ్మత. Kierkegaard ‘నిస్పృహ'(despair) ని Sickness Unto Death అంటున్నాడు. ఈ నిస్పృహ భౌతికమృతితో ముగిసేది కాదు. అది ఎటువంటిది? Kierkegaard మాటల్లో –

 

‘On the contrary, the torment of despair is precisely this inability to die. Thus it has more in common with the situation of a mortally ill person when he lies struggling with death and yet cannot die. Thus to be sick unto death is to be unable to die, yet not as if there were hope of life; no, the hopelessness is that there is not even the ultimate hope, death. When death is the greatest danger, we hope for life; but when we learn to know the even greater danger, we hope for death. When the danger is so great that death becomes the hope, then despair is the hopelessness of not even being able to die.’

 

సరిగ్గా, ఈ స్థితినే ‘త్రిశంకు స్వర్గం’ లో బైరాగి చిత్రించారు. ‘రంగుల తోట’ అనే కవితలో, ఆయన ‘జీవిత జ్వరం’ అన్నది ఈ స్థితినే. Kierkegaard ‘నిస్పృహ’ – బైరాగి కవితలో ‘మెలకువ’ గా మారింది. ఆ మెలకువ – ఆ ‘స్వాప్నికసంయోగాల స్వేదదుర్భర జాగరణ’ – సర్వస్వం పొట్టబెట్టుకున్న రక్కసి.

 

ఈ కవితలో కేవలం psychological , spiritual torment  మాత్రమే లేదు. Mortality ఒక corporeal – visceral reality గా పరిణమించటమే కవిత ఇతివృత్తం. Kierkegaard అన్నట్లు అది – ‘to die dying, i.e., live to experience dying’.

 

‘జపాపుష్ప కాంతిలాగు, పచ్చిపుండు వాంతిలాగు

పసినెత్తురు కారుతున్న ఒక్క క్షణం!

చావు పుట్టుక బ్రతుకుల, విషమబాహు త్రిభుజంలో

మధ్యనున్న ఒక అదృశ్య బిందువులా

ఘనీభూత వాస్తవ కేంద్రీకరణం, ఒక్క క్షణం!’

 

Conscious selfhood ను పొందటమంటే ‘కంది కనలి కెంపెక్కిన ఒకే ఒక జ్వలితజీవిత క్షణం’ – ఆ epiphanic second – కోసం సంసిద్ధమవటం. కాని కేవలం ఇదే బైరాగి ఎరుక కాదు.

 

‘విసుగు! విసుగు!

కనులముందు విసుగులేని ఇసుకబయలు

జీవితపు శూన్యంపై ముసుగు విసుగు!

ఎంతకూరాని తుమ్ము, వెళ్ళిపోని వాంతి

కడుపులో త్రిప్పుతోంది విసుగు త్రేపు!

….

మెరసే నున్నని చర్మంపై ప్రాకే దురద విసుగు!

విసుగు! జీవితాల ముసుగు

 

‘This too shall pass.’ ఆ రక్తోజ్వల ముక్తిక్షణం తరువాత ఏమిటి? Tedium. Banality. Boredom. Ennui. ఇదీ బైరాగి దర్శనం.

 

Kierkegaard పుస్తకం బైబిల్ లోని Lazarus ప్రస్తావనతోటి మొదలవుతుంది. బైరాగికి intense reading of the scripture వల్ల ఆయా పురాగాథల connotative possibilities అర్థమైనాయని చెప్పవచ్చు (T. S.Eliot ‘The Love Song of J.Alfred Prufrock’ లో ఒక్కసారి Lazarus ప్రస్తావనొస్తుంది). బైరాగి మొత్తం రచనల్లో Lazarus ఒక central myth . బైరాగి లోని మరో ముఖ్య లక్షణం – a Modernist predilection for the mythic: Gulliver, Hamlet, Jesus, నహుషుడు, మార్కండేయుడు, ‘జగతీవిషసార పాయి(శివుడు)’ పదేపదే ప్రస్తావించబడతారు.

 

బైరాగి వాడే భాష గురించి కొంత చెప్పుకోవాలి. ఆయన శైలిలోని ఆసక్తికరమైన సమస్య గురించి ఆరుద్ర ఇలా అంటారు: ‘సరే, కల్తీలేని భారతీయ పద్ధతుల్లో వ్రాసే బైరాగి సంస్కృతపదభూయిష్టమైన మంచి కవిత్వం కూడా ఈ పండితులు గుర్తించరేం అని మధనపడ్డా.’ ప్రతి ప్రతిభావంతుడైన కవికీ తనదైన idiolect ఉంటుందని అనుకున్నా, బైరాగి భాషలోని సంస్కృతం పూర్తిగా క్లాసికల్ తెలుగుకావ్యాల సంస్కృతం కాదు. అలాగని సంస్కృతకావ్యాల లలితమృదుల సంస్కృతమూ కాదు. ఆయన, హిందీసాహిత్యంలో వాడే సంస్కృతపదాల కూర్పు వంటిది ఉపయోగించడం వల్లనూ, కఠిన శబ్దాలు – కర్ణపేయంగా అనిపించనివి – ఎన్నుకోవడం వల్లనూ పాఠకులు defamiliarization కి లోనవుతారు. పైగా, ఈ సంస్కృతం status-quoist కాదు. ‘Sanskrit cosmopolis’ (Sheldon Pollock) తాలూకు భాషా కాదు. ఆయన భాష సంస్కృతభాష లోనుంచి gothic, baroque  లక్షణాల్ని వెలికితీసి తయారుచేసుకున్న భాషనవచ్చు. అందుకే, ఆయన ‘దేవముఖ్యులు’ , ‘నవయుగ దైత్యులు’ లాంటి పదాల్ని వాడుతున్నప్పుడు, వాటిని మామూలు అర్థాల్లో వాడటంలేదనీ  , subvert చేస్తూ, problematize చేస్తూ ఉన్నారనీ తెలుస్తూంటుంది. ఇందుకు ఆధారాలు చాల కవితల్లో (‘రెండు క్రిస్మస్ గీతాలు’, ‘దైత్యదేశంలో గెలివర్’) కనిపిస్తాయి.

 

‘Beowulf’ epic ని గానం చేసిన అజ్ఞాత Anglo-Saxon కవులు సముద్రాన్ని whale-road అనీ, swan-road అనీ అన్నారు. మరీ అద్భుతంగా , శరీరాన్ని bone-house (banhus) అనగలిగిన ప్రజ్ఞ వారిది. ‘మేలుకొన్నవాడు’ అనే కవిత చివరలో –

 

‘విచ్ఛిన్న నైశసైన్యపు ప్రాణావశిష్ట భటుడు

అగ్రేసరుల ప్రథమ దూత,

ఆమిషాస్థుల పతనోన్ముఖ సేతువు పై ఉదర్కపు ఊహోద్ఘటుడు.

 

అన్న పంక్తుల్లో శరీరాన్ని ‘ఎముకలూ , మాంసముతో నిర్మించిన, కూలే స్థితిలో ఉన్న సేతువు’ అన్నారు. దేహం – లేదా ఒక  highly dynamic visceral-corporeal presence – గురించి ఇంత potent metaphor బైరాగి కవిత్వ తపః ఫలం.

 

(1978 లో మరణించిన బైరాగి- వాడ్రేవు చినవీరభద్రుడు, కవులూరి గోపీచంద్ అనే ఇద్దరు యువకుల సాహిత్య   చర్చల్లో పునరుత్ధానం పొందాడు. వారిలాగే ’80ల్లో చాలామంది ఎవరికి వారే బైరాగిని rediscover చేసారని తెలుస్తోంది. బైరాగి కవిత్వం గురించి వీరభద్రుడిగారితో మాట్లాడుతూ rhapsodic trance లోకి వెళ్ళి, తిరిగి  మర్త్యలోకానికొచ్చాక రాసుకున్న యాత్రాచరితమే యిదంతా. కాబట్టి ఈ వ్యాసానికి authorship నిర్ణయించటం చాలా nebulous/dubious విషయం. బైరాగి సాహచర్యంలో నిదురలేని రాత్రులు గడిపిన వారందరిదీ.. యిది.)

 

– ఆదిత్య

Painting : Robert Matta, Untitled Drawing, 1938.

పాదాల క్రింద నలగని ఆకు – కుష్వంత్ సింగ్

Krish.psd
నేలమీద అడుగులు వేస్తుంటే దారి పొడువునా పచ్చ టి ఆకులు పరుచుకుని తమ పై నుంచి నడిచివెళతారా అని దీనంగా చూస్తున్నాయి. తెల్లవారు జాము చల్లటి గాలి తగులుతుంటే పై నుంచి పచ్చటి ఆకులు దీవిస్తున్నట్లు రాలిపడుతున్నాయి. తలపై, భుజంపై ఒక్కో ఆకు కన్నీటి చుక్కల్లా పడుతూ పలకరిస్తున్నాయి. తడి పచ్చికపై కూడా అవే ఆకులు.పూలు ఆకుల వర్షాన్ని ఆనందిస్తున్నట్లు తలలూపుతున్నాయి. నేలపై కాగితపుపూలు, పచ్చటి ఆకులు కలిసి మట్టిని ముగ్గుల్లా అలంకరిస్తున్నాయి. స్కూలుకు వెళుతున్న పిల్లల్నీ అవే ఆకులు పలకరిస్తున్నాయి.

అవును ఇది శిశిరం. ఆకులు రాలే కాలం. ఢిల్లీలో చిరుచలిని ఎండ వేడిమి పారదోలుతున్న సమయంలో కాలం మారుతున్నదన్న స్ప­ృహ వెంటాడుతోంది. మృత్యువు అందమైనదా? లేకపోతే ఈ ఆకులు, పూలు రాలిపోతూ విషాదానికి బదులు ఆనందాన్ని ఎందుకు కలుగచేస్తున్నాయి? బస్‌స్టాప్ వద్ద పడిపోయిన ఒక పెద్ద రావి ఆకును ఏరి ఒక స్కూలు పిల్ల పుస్తకంలో దాచుకుంది. కాళ్ల క్రింద, వాహనాల క్రింద ముక్కలయ్యే బదులు లేత అక్షరాల మధ్య తల దాచుకునే అదృష్టం ఆ ఆకుకు కలిగింది.

పాదాల క్రింద ఆకుల ధ్వనిని వింటూ, ఆలోచిస్తూ వెళుతుంటే మొబైల్‌లో అందిన సమాచారం మరో పండుటాకు రాలిపోయిందని. 99 ఏళ్ల వయస్సులో కుష్వంత్ సింగ్ మరణించడం ఒక అసహజమైన సంఘటన ఏమీ కాకపోవచ్చు. కాని ఆయన మరణంతో ఒక చరిత్రతో సంబంధం ఉన్న ఒక అత్యంత ముఖ్యమైన వ్యక్తి గతించినట్లయింది. లాల్‌కృష్ణ అద్వానీ, కుల్దీప్ న య్యర్, మన్మోహన్ సింగ్, కుష్వంత్ సింగ్ వీరందర్నీ ఒక చరిత్ర కలుపుతుంది. అది దేశ విభజనకు చెందిన చరిత్ర. వీరందరూ దేశ విభజనకు పూర్వం జన్మించారు. ఆ తరం పండుటాకులన్నీ ఒక్కొక్కటీ రాలిపోతున్నాయి. వీరందరిలో కుల్దీప్ నయ్యర్, కుష్వంత్ సింగ్ ప్రత్యేక తరగతికి చెందిన వారు. వారు విభజన విషాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు, వాటి గురించి రాసిన వారు. అందరికంటే 99 ఏళ్ల కుష్వంత్ సింగ్ సీనియర్. ఆయన కుల్దీప్‌లా కేవలం జర్నలిస్టు మాత్రమే కాదు, రచయిత, కవి హృదయం ఉన్న వ్యక్తి.

కుష్వంత్ సింగ్ లాహోర్‌లో ఏడేళ్లు లా ప్రాక్టీసు చేశారు. విభజన తర్వాత కూడా అదే కొనసాగించి ఉంటే దేశంలో ప్రముఖ న్యాయవాదిగానో, న్యాయమూర్తిగానో కొనసాగేవారు. లండన్, పారిస్ తదితర నగరాల్లో రాయబార కార్యాలయాల్లో, యునెస్కోలో పనిచేసే అవకాశం కూడా ఆయనకు వచ్చింది. అదే కొనసాగించి ఉంటే ఆయనొక ప్రముఖ దౌత్యవేత్తగా మారి ఉండేవారు. ఆయన తండ్రి ఢిల్లీప్రభుత్వంలో ఉన్నతాధికారి. అనేక వ్యాపారాలున్నవారు. అందులో ప్రవేశించినా ఆయనొక ప్రముఖ వ్యాపారి అయ్యేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆయన ఇవన్నీ తృణీకరించి,రచయితగా, జర్నలిస్టుగా జీవితం కొనసాగించాలనుకున్నారు. జీవితాంతం తన రచనలపైనే బ్రతికారు. కవులు, కళాకారులు, రచయితల మధ్య జీవితాన్ని గడిపారు.

కుష్వంత్ సింగ్ రచనలు చాలా ఆలస్యంగా మొదలు పెట్టారు. లండన్‌లోని భారతీయ రాయబార కారాలయంలో పబ్లిక్ రిలేషన్ అధికారిగా ఉన్నప్పుడు ముల్క్‌రాజ్ ఆనంద్, రాజారావు, ఆర్.కె.నారాయణ్‌లను చదివిన తర్వాత తానెందుకు రాయకూడదని అనుకున్నాడు. మొదట రాసిన మార్క్ ఆఫ్ విష్ణు అనే చిన్న కథల సంకలనంతో ఆయన రచయితగా రంగప్రవేశం రాశారు. ఆ తర్వాత సిక్కుల చరిత్ర రాశారు. తర్వాత దాదాపు 40 ఏళ్ల వయస్సులో దేశ విభజనపై మొట్టమొదటి సంచ లన నవల ట్రైన్‌టు పాకిస్తాన్ రాశారు. అంతే, రచయితగా ఆయన స్థానం సాహిత్య ప్రపంచంలో స్థిరపడిపోయిది. ఆకాశవాణిలో విదేశీ సర్వీసెస్‌లో ఉన్న్పపుడు నిరాద్ సి చౌదరి, రుత్ జాబాల, మనోహర్ మల్గోంకర్ మొదలైన రచయితలతో పరిచయం ఆయనకు రచనపై ఆసక్తి కలిగించింది. అంతమాత్రాన కుష్వంత్ సింగ్‌కు అంతకుముందుసాహిత్యంపట్ల అభిరుచి లేదని కాదు. ప్రముఖ ఉర్దూకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఆయనకు లాహోర్ కాలేజీలో రెండేళ్ల సీనియర్. గాలిబ్ ఆయన అభిమాన కవి. మాటిమాటికీ ప్రముఖ ఉర్దూకవి ఇక్బాల్ కవిత్వాన్ని ఉటంకించకుండా కుశ్వంత్ సింగ్ ఉండలేరు.

1970567_10152240904637088_1438515080_n
దాదాపు 20 ఏళ్ల క్రిందట ఎపి టైమ్స్ కోసం ఆయనతో కాలమ్ రాయించేందుకు వెళ్లినప్పుడు ఆయనతో వ్యక్తిగత పరిచయం ఏర్పడింది. అప్పుడప్పుడూ కొంతమంది సాహితీ మిత్రులను కూడా తీసుకువెళ్లేవాడిని. స్నేహపూర్వకంగా మాట్లాడినప్పటికీ డబ్బుల విషయంలో మాత్రం చాలా కరుకుగా ఉండేవారు. ఏ మాత్రం ఆలస్యమైనా ఆయన తిట్లను భరించాల్సిందే. అప్పటికే ఆయన జీవితంలో ఎన్నో పదవులు అనుభవించారు. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ సంపాదకుడుగా ఆయన తనదైన ముద్ర వేశారు. బంగ్లాదేశ్‌లో నరహంతకుడు టిక్కాఖాన్, పాక్ నియంత జియాఉల్‌హక్ మొద లైన వారి ఇంటర్వ్యూలు, కొన్ని పరిశోధనాత్మకమైన వ్యాసాల ద్వారా వీక్లీలో జర్నలిజంస్థాయిని ఆయన పెంచారు. వీక్లీ సర్క్యులేషన్ 80 వేలనుంచి 4 లక్షలు దాటేలా చూశారు. ఆ తర్వాత ఏ వీక్లీ అంత సంచలనం సృష్టించలేదు. అయితేనేం, వీక్లీసంపాదకుడుగా ఎమర్జెన్సీని నెత్తికెక్కించుకుని, సంజయ్ మారుతి కార్లఫ్యాక్టరీ గురించి సానుకూల వార్తలు రాసి తాను సర్కార్ పాదాల క్రింద తివాచీగా మారారు. దాని వల్ల ఇందిర రెండో సారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయనకు తొలుత నేషనల్ హెరాల్డ్ సంపాదక పదవి, ఆతర్వాత రాజ్యసభ సీటు, హిందూస్తాన్ టైమ్స్ సంపాదకుడి పదవీ దక్కాయి. మేనకాగాంధీ ఆధ్వర్యంలోని సూర్య పత్రికకు కూడా సంపాదకుడుగా కొన్నాళ్లు వ్యవహరించారు. పద్మభూషణ్  దక్కించుకున్నారు. ఆపరేషన్ బ్లూస్టార్‌ను విమర్శించి ఆయన తన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరిగి ఇవ్వకపోతే, రాజ్యసభలో తనకు సీటు ఇచ్చిన కాంగ్రెస్‌నే తీవ్రంగా విమర్శించకపోతే కుష్వంత్ సింగ్‌ను ఏ పంజాబీ క్షమించి ఉండేవారు కాదు.

ఎన్ని కక్కుర్తి పనులకు పాల్పడితేనేం, కుష్వంత్ సింగ్‌లో అంతర్గతంగా రచయిత, కవి ఉన్నారని చాలా సార్లు రుజువైంది. దాని వల్లే ధిక్కార స్వరం ఆయనకు సహజసిద్ద లక్షణమైంది. తొలుత ఉన్నతపదవులను వదులుకుని కేవలంరచయితగా స్థిరపడాలనుకున్న కుష్వంత్ తర్వాత రాజీపడితేనేం, ఆ రాజీ గురించి ధైర్యంగా చెప్పుకున్న వ్యక్తి. హిందూమతతత్వాన్ని, గుజరాత్ అల్లర్లను, అద్వానీ రథయాత్రను తీవ్రంగా విమర్శించిన కుష్వంత్ జీవితపు విలువలను ప్రేమించారు. యదాలాపంగానైనా ధిక్కార స్వరాన్ని వినిపించకుండా ఉండలేకపోయారు. దేవుడి ఉనికిని, ఆత్మలను ప్రశ్నించకుండా ఉండలేకపోఆరు. గత ఆరుదశాబ్దాలుగా ఆయన ధారావాహికంగా ఏదో రాస్తూనే ఉన్నారు. వ్యంగ్యం, హాస్యం మేళవించినప్పటికీ ఆయన రచనల్లో కవిత్వం తొణికిసలాడుతుంది. ఆయన వ్యాసాల్లో స్వేచ్చా ప్రియత్వం స్పష్టంగా కనపడుతోంది. అందుకే ఫైజ్ లాంటి కవులు ఆయనకు ఆప్తబంధువులయ్యారు.

నా జైలు గదిలో కాంతి పేలవమై
రాత్రి ప్రవేశించినపుడు 
నీ నల్లటి కేశాల్లో నక్షత్రాలు
మెరుస్తున్నట్లనిపించింది. 
నన్ను కట్టేసిన గొలుసులు
కాంతిలో మెరిసినప్పుడు 
ఉదయపు కాంతిలో
నీ ముఖం వెలిగిపోవడాన్ని చూశాను..

అన్న ఫైజ్ అహ్మద్ కవితను కుశ్వంత్ ఆయన మరణానంతరం రాసిన వ్యాసంలో ఉటంకించారు. జైలు జీవితం తనను మళ్లీ ప్రేమలో పడేసింది.. అని ఫైజ్ అన్నట్లుఆయన పేర్కొన్నారు.

భింద్రన్ వాలే బృందం వెంటాడినా, 1984 లో జరిగిన సిక్కుల ఊచకోతలో రాజ్యసభ సభ్యుడుగా ఒక దౌత్యవేత్త ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చినా, మృత్యువుకు ఆయన ఎప్పుడూ భయపడలేదు. తన మృత్యువుపై తానే కథ రాసుకున్న వ్యక్తి కుశ్వంత్. మనిషి విశ్వాసానికి సంకేతాలు కావాలా? మృత్యువు సమీపించినప్పుడు అతడి పెదాలపై చిరునవ్వు చూడు.. అని ఇక్బాల్ రాసిన కవితను ఆయన అనేక సందర్భాల్లో ఉటంకించారు.

అవును.. కుశ్వంత్ రాలిపోయాడు. పండుటాకులా రాలిపోయాడు. ఉన్నట్లుండి ఒక సుడిగాలి ప్రవేశించింది. ఆ ఆకు నేలమీద పడీ పడగానే మట్టిని స్ప­ృశించి, గాలిలో తిరుగుతూ, తిరుగుతూ ఎక్కడికో అంతర్ధానమైంది. రాలిపోయాక కూడా పాదాలక్రింద నలిగి వ్రక్కలు కావాల్సిన ఆకు కాదది.

-కృష్ణుడు

రేఖాచిత్రం: శంకర్

పగిలే మాటలు

prasad atluri
నాలుగు రోడ్ల కూడలిలో
నలుగురు నిలబడేచోటు

చేతికర్ర ఊతమైనాడెవడో

నోరుతెరిచి నాలుగు పైసలడిగితే 

పగిలే ప్రతిమాట ఆకలై అర్ధిస్తుంది !


దర్నాచౌక్ దరిదాపుల్లో

కలక్టరాఫీస్ కాంపౌడుల్లో

ఒకేలాంటోళ్ళు నలుగురొక్కటై

తమలోని ఆవేదనల్ని వ్యక్తపరుస్తుంటే 

పగిలే ప్రతిమాట పోరాటమై నినదిస్తుంది   !


తలోరంగు అద్దుకున్న  

ఓ నాలుగు ఖద్దరు చొక్కాలు

టీవీ చానళ్ళ చర్చావేదికలపై

ప్రాంతాల్నితొడుక్కుని రచ్చచేస్తుంటే

పగిలే ప్రతిమాటా వాదమై విడిపోతుంది!       


నడిచే బస్సులో నల్గురుంటారని

హాస్టల్ రూముల్లో అందరుంటారని

ఆశపడ్డ ఆడపిల్ల వంటరిదై చిక్కినప్పుడు

మృగాలు మూకుమ్మడిగా కమ్ముకుంటే  

పగిలే ప్రతిమాటా ఆక్రందనై కేకలేస్తుంది!  


మాట పగిలిన శబ్దానికి ఉలిక్కిపడతామే కాని
 
పగిలే మాటలు తగులుతాయని తప్పుకుంటామే కాని 
అవసరాన్ని గుర్తించి ఆలంబనగా నిలబడలేమేం?
-ప్రసాద్ అట్లూరి

నిన్నూ తీసుకుపోనీ నాతో!

     il_fullxfull.249944992

  1.

ఎక్కడికో తెలీదు.

కానెప్పటికైనా,

నా ప్రాణాలనిక్కడ్నే వొదిలేసి పోవాలట.

***

                 2.

అర్ధం కాక అడుగుతానూ,

ఎలా? అసలెలా వెళ్లిపోవడం?

నా చుట్టూ అల్లుకున్న అక్షరాల పందిళ్లను కూలదోసుకుంటూ

జ్ఞాన వికాసాలను ఆర్పేసుకుంటూ

ఆకు పచ్చ చివురాశల్ని  రాల్చేసుకుంటూ

ఆ ఏకాకి ఎడారి లోకెలా వెళ్ళిపోడమని?

***

               3.

గురుతైన రంగు నెమలీకల్ని

అరచేతుల పూసిన  చందమామల్నీ

గుప్పిట మూసిన తళుకు పూల తారల్నీ

 గుండె వాకిట దొంతరమల్లె  పొదలనీ

 విదిలించుకు  పోవాలంటే

దుఖమౌతోంది.

 4.

 నా పుస్తకాలు.

– కంటి పాపలు.  చీకటింటి దీపాలు.

నా ప్రపంచ చరాచర సృష్టి కర్తలు.

నైవేద్యమయినా కోరని  ఇష్ట దైవాలు.

ఈ కొమ్మన కొలువైన ఇలవేల్పులు

విడిచి  పోవాలంటే,

ప్చ్.

గూడు చీకటౌతోంది.

చిక్కటి గుబులౌతోంది.

                  5.

కరచాలనం కోసం నిలిచిన కొత్త  అతిధులు

 మరి మరి చవిలూరించు భావోద్వేగాలు

 ఎదకెత్తుకున్న కాంక్షలు

– కస్తూరి తిలకంలా భాసిల్లు  ఆ స్వరూపాలు

ఆ జాడలు…లయబధ్ధ  గుండె శబ్దాలు

 అన్నిట్నీ, అందర్నీ ఇక్కణ్నే వొదిలేసి..

నన్ను నేను ఖాళీ చేసేసుకుంటూ

శూన్యమైపోతూ

ఉత్తి చేతులేసుకుని  వెళ్లిపోవాలంటే

నిశి గోదారికిమల్లే – మనసు గుభిల్లు మంటోంది.

6.

 దాహార్తినైన క్షణాన

గొంతు తడిపిన నదీమ తల్లులు  – నా పుస్తకాలు.

గ్రీష్మం లో కురిసిన వెన్నెల వర్షాలు – నా సాహిత్యాలు

మట్టి నిప్పుల పై వానజల్లుకు  ఎగజిమ్మే అత్తరు పొగలు  – నా పుస్తకాలు.

– పూర్తిగా ఆఘ్రాణించకనే..అనుభూతించకనే

ఎత్తైన ఆనకట్టలమీద నడయాడకనే..ఆకాశాన్ని తాకకనే

వెళ్లిపోవల్సి రావడం ఎంత ఖేదం!

కళకళ లాడు  నూతన  మధుపర్కాలు

చిలికిన దధి నించి కొత్త జన్మమెత్తిన నవనీతాలు

అదిగో సరిహద్దులవతల   నా వారి పొలికేకలు

నేనింకా వినకనే,

నా భాషలోకింకా తర్జుమా ఐనా కాకనే

వెళ్లిపోవాల్సి రావడం ఎంత క్లేశం!

7.

జీవ జల కెరటాల  పుటలు

పడవ విహార ప్రయాణాలు

చూపు దాటి పారిపోకుండా

గీటు గీసి ఆపుకున్న ఎర్రవన్నె ఇసుక తిన్నెల వాక్యాలు.

కాదు కాదు. తీపి కన్నీటి కౌగిళ్ళు

అన్నిం టినీ, ఆత్మ బంధువుల్నీవిడిచేసుకుని

నిరాశిస్తూ..నిట్టూరుస్తూ

వెళ్లిపోవాలంటే చచ్చేంత భీతిగా వుంది.

8.

పోనిఇ, అలానే కానీయి..

కొన్నే కొన్నిపూలగుచ్ఛాలను చేత పుచ్చుకుని

కొందరి కొండ గుర్తుల్ని..గోరింటల్ని

గుండె దారాలకు గుచ్చుకుని.. పోదునా?

చితిన పడనీక  గుప్పెడు అగరు ధూపాలనయినా చుట్టుకు పోదునా?

లేదు. వీల్లేదు. రిక్త హస్తాలతో పోవాల్సిందే..అనుకుంటే..

ఇప్పుడే చల్లబడిపోతోంది దేహం.

తరచినకొద్దీ

– అదొశిక్షగా, ఏదో శాపం గా.

తలచుకున్నక్షణమల్లా

– చివరి శ్వాసలా, శిలా శాసనంలా

మరణించినట్లుంటుంది.

***

10.

ఆ పై వాడ్ని బతిమాలో బామాలో

ఈ కట్టెకు ఓ పెట్టెని కట్టుకుని

పట్టుమని పది పుస్తకాలు పట్టుకుపో నూ ?

ఎప్పుడనే  కబురు తెలిస్తే ఇప్పుడే సర్దేసుకోనూ!

****

నిన్ను –

మెడనలంకరించుకొను హారంలా

నుదుట్న దిద్దుకొను సింధూరంలా

కరకంకణం లా, కర్ణాభరణంలా

ఆత్మను అలుముకున్న అత్తరు సుగంధంలా

పుస్తకమా!

నాలోని నిన్ను

తీసుకుపోని.

నిన్నూ తీసుకుపోనీ నాతో!

– ఆర్.దమయంతి

ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? – 14 వ భాగం

16

(గత వారం తరువాయి )

14

ఊరు.. ఉద్యమాల పురిటిగడ్డ, విప్లవాల రక్తగర్భ.. వరంగల్లు.
స్థలం : జనఫథం
తేదీ : ఆగస్ట్‌ 20
సమయం : ఉదయం 10.30 గం.
వేదికపైన ఒక బేనర్‌ ఉంది.. జనసేన పరిచయసభ
వేదికపై నలుగురు వ్యక్తులున్నారు.. నేలపై.. తెల్లని పరుపులపైన.. ఎదురుగా నేలపై తెల్లని జంపుఖానల మీద దాదాపు వందమంది ఆహుతులు..
ఆచార్య డాక్టర్‌ గోపీనాథ్‌. రామం. క్యాథీ.. శివ.
ముందున్న వాళ్ళలో.. దాదాపు అన్ని తెలుగు న్యూస్‌ ఛానళ్ళ బాధ్యులు.. ప్రముఖ దినపత్రికల సంపాదకులు.. నగరంలోని సీనియర్‌ పౌరులు.. పౌరహక్కుల మేధోజీవులు.. యిదివరకు అనేక బాధ్యతాయుతమైన పదవులు నిర్వహించిన డాక్టర్లు, ప్రొఫెసర్లు, రిటైర్డ్‌ ఐఎఎస్‌, రిటైర్డ్‌ ఐపిఎస్‌, ప్రజాసంఘాల వరిష్ఠ పౌరులు.. భారత దేశాన్ని స్వాతంత్ర సిద్ధిపూర్వం, తర్వాత లోతుగా ఎరిగినవాళ్ళు.. జీవితపు లోలోతులు పూర్తిగా, బాగా తెలిసినవాళ్ళు..,
డాక్టర్‌ గోపీనాథ్‌ ప్రారంభించాడు.. ”మిత్రులారా.. ఒక పెద్ద సామాజిక పెనుమార్పు అనివార్యంగా యధా యధాహి ధర్మస్య.. అనే రీతిలో కాలధర్మానికి అనుగుణంగా కూడా.. ఒక తుఫానువలె, ప్రజాచైతన్యం ఒకటి ఉప్పెనవలె ఉవ్వెత్తున రావలసిన సమయం ఇప్పుడాసన్నమైంది. అరవై సంవత్సరాల పూర్వం ఎంతో విలక్షణమైన స్వాతంత్య్ర సమరం సాగించి సాధించిన స్వేచ్ఛ యిప్పుడు చిన్నా భిన్నమై విచ్చలవిడితనంతో, అరాచకత్వంతో, అవసరానికంటే మించిన అధిక స్వంతత్రతో, హద్దులమీరిన వ్యక్తిస్వేచ్ఛతో రోగగ్రస్తమైపోయి ఉంది. ఏ కోణంలో, ఏ రంగంలో చూచినా బహుముఖంగా, భారత సమాజం భ్రష్టుపట్టి కుళ్ళిపోయి ఉంది. చూచినా, విన్నా జుగుప్స కల్గించే రీతిలో అవినీతి, లంచగొండితనం, బహిరంగ దోపిడీ, గుండాయిజం, మాఫియా కార్యకలాపాలు పెరిగి పెరిగి ఒక సాధారణ పౌరుడెవ్వడూ క్షోభననుభవించకుండా ప్రశాంతంగా జీవించే స్థితిలో లేరు.. ఈ నేపథ్యంలో.. మిత్రులారా.. నిన్న మనం మీడియాలో మనందరం సిగ్గుపడే మంత్రి వీరాంజనేయులు స్కాం గురించి కథనాలను విన్నాం.. చూశాం.. యిటువంటివి కోకొల్లలు. ఈ దుస్థితినుండి ఈ సమాజాన్ని ప్రక్షాళన చేసి ఎలా పరిస్థితులను చక్కదిద్ది మళ్లీ ఈ కూలిపోతున్న వ్యవస్థను పునర్నిర్మించాలన్న ఒక దుఃఖపూర్వక అంతర్జ్వలన నుండి ఈ మన ‘జనసేన’ అవిర్భవించింది.
‘జనసేన’ ఒక రాజకీయ పార్టీ కాదు. దీనికి రాజకీయ అధికారం వద్దు. ఎలక్షన్లలో పోటీచేసి గెలిచి రాజ్యాధికారం చేపట్టాలనే సంకల్పమూ లేదు. ఇది ప్రజలకోసం పుట్టి, ప్రజలతో పెరిగి.. ప్రజలతోనే జీవించి ఉంటూ ప్రజలను రక్షించుకునే పవిత్రకార్యంతో ఎల్లప్పుడూ కొనసాగాలనే ఆదర్శ లక్ష్యంతో ఆవిర్భవిస్తున్న ప్రజావేదిక..’డాక్టర్‌ గోపీనాథ్‌ చాలా సంక్షిప్తంగా. క్లుప్తంగా.. మాట్లాడుకుంటూ పోతున్నాడు.
అక్కడప్పుడు ఒక హృదయ జ్వలనానుభవ వినిమయం జరుగుతోంది.
”మొదట నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నేను డాక్టర్‌ గోపీనాథ్‌. జీవితకాలమంతా ఒక ఫిజీషియన్‌గా, ప్రొఫెసర్‌గా జీవించినవాణ్ణి. వరంగల్లు ప్రజలకు నేను బాగా తెలుసు. యిప్పుడు నా వయస్సు డెబ్బయి రెండేళ్ళు ‘సమాజం ఎలా ఉండాలి… ఎలా ఉంది.’ వంటి ఆరు పుస్తకాలు రాశాను. పార్టీలు ఏవైనా అనేకానేక వ్యక్తిగత కారణాలవల్ల ప్రస్తుత భారతదేశంనిండా కేంద్రంనుండి రాష్ట్రందాకా ముసలికంపు కొడ్తున్న వృద్ధ రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. వెంటనే ఈ ముసలివర్గాలను వేదికపైనుండి దింపి సామాజిక రంగాల్లో యువరక్తాన్ని నింపాలని బలంగా నమ్ముతున్నవాణ్ణి. ఐతే అపారమైన అనుభవమున్న ఈ సీనియర్‌ సిటిజన్ల విలువైన సేవలను అన్ని రంగాల్లోనూ ఉపయోగించుకునేందుకు తగిన నిర్మాణాన్ని చేపడ్తే సమాజం ఎంతో ఆరోగ్యవంతంగా, హుందాగా రూపుదిద్దుకుంటుందని నా విశ్వాసం.. యిప్పుడు.. మిస్టర్‌ రామం..” గోపీనాథ్‌ కూర్చున్నారు.
రామం లేచి నిలబడి రెండు చేతులు జోడించి అందరికీ వినమ్రంగా నమస్కరించి.. ” నాగురించి చాలా క్లుప్తంగా మీకు పరిచయం చేసుకుంటాను..” అని చుట్టూ ఒకసారి కలియజూచి.,
ఆ హాలులో ఉన్న అందరూ ఈ దరిద్రపు కక్షుద్ర, నీచ, స్వార్థ రాజకీయాల్తో విసిగి విసిగిన అలసటలోనుండి ఏదో ఒక కాంతిరేఖవలె తారసపడ్డ ఈ యువకెరటమన్నా ఓ ఆశావహమైన మార్పునూ. చైతన్యాన్నీ, భవిష్యత్తునూ రూపొందిస్తుందేమో అన్న జిజ్ఞాసతో పరిశీలనగా చూస్తూండగా.,
”పెద్దలు.. జీవితాన్నీ, సమాజాన్నీ, ఈ దేశాన్నీ ఎంతో లోతుగా ఎరిగిన విజ్ఞులారా.. నా పేరు రామం. నేను జన్మతః వరంగల్లువాణ్ణి. నా తండ్రి గత సంవత్సరమే పోయాడు. ఆయన మీకందరికీ తెలుసు. జీవితకాలమంతా రీజనల్‌ ఇంజినీరింగు కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగు ప్రొఫెసర్‌గా పనిచేసిన సామాజిక వేత్త డాక్టర్‌ రామనాథం. నేను ఆర్‌.ఇ.సి. వరంగల్లులో డిగ్రీ పూర్తి చేసి, ఐఐటి మద్రాస్‌ నుండి ది హైయ్యర్‌ డిస్టింక్షన్‌లో ఎమ్‌టెక్‌ చేసి.. కాంపస్‌ సెలక్షన్‌లో ఎంపికై..భారతదేశపు అత్యుత్తమ విద్యావంతులైన యువత విదేశాలపాలైనట్టుగానే డాలర్ల, సుఖాల వ్యామోహంలో అమెరికా వెళ్లి పదకొండు సంవత్సరాలు నివసించివచ్చిన వాణ్ణి. ఐతే ప్రస్తుత భారత, ప్రధానంగా తెలుగు సమాజంలో..ఉంటే పుస్తకాల పురుగులు, లేకుంటే దిక్కుమాలిన వెధవలుగా తయారౌతున్న ఒక చిత్రమైన స్థితినుండి … రాజకీయాలంటే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలను ఒక అంటరాని కలుషితరంగమని దూరంగా ఉంచుతున్న వర్తమానం నుండి.. నాన్న రాసిన అనేక పుస్తకాలను విపులంగా అమెరికా వెళ్లిన తర్వాతే అధ్యయనం చేసి.. చేసిన తప్పును తెలుసుకుని, చెంపలేసుకుని.. ఆలస్యంగానైనా.. ఈ పవిత్ర భారతదేశ పౌరునిగా నా బాధ్యతలను మదింపు చేసుకుని చాలా స్పష్టమైన లక్ష్యాలతో, ప్రణాళికతో అవినీతి నిర్మూలనకోసం, విలువల పునఃప్రతిష్టకోసం రంగప్రవేశం చేస్తున్నవాణ్ణి..”
అంతా నిశ్శబ్దం. వింటున్నారందరూ ఆసక్తిగా.. ఐతే ఎంతోగాఢమైన చింతనగల ఆ మేధోజీవులెవరికీ యింకా రామం గురించిన విలక్షణత ఏమీ కనబడలేదు.
”ప్రవేశం చాలా ఆలస్యంగానే జరుగుతోంది. పోల్చుకోవడం సరికాదేమోగాని.. గాంధీ తన నలభై ఆరవ సంవత్సరంలో ప్రజాఉద్యమంలోకి ప్రవేశించాడు. నెహ్రూ 32 సంవత్సరాల వయసులో రాజకీయాల్లోకి దూకారు. మావో ముప్పయ్యయిందేడ్ల తర్వాత, నెల్సన్‌ మండేలా నలభై సంవత్సరాల వయసులో ప్రజాజీవితంలోకి వచ్చారు. కాబట్టి కొద్దిగా ఆలస్యమైనా సరియైన సమయంలోనే నేను మీ అందరి ముందుకు వస్తున్నాని అనుకుంటున్నాను.”
”మిత్రులారా.. బ్రిటిష్‌ పాలకుల కబందహస్తాలనుండి విముక్తమైన భారతదేశం స్వాతంత్య్రానంతరం స్వదేశీయుల నీచరాజకీయాల్లో కూరుకుపోయి పరాయిపాలకులకంటే అతి భయంకరంగా దోపిడీ చేయబడ్తోంది. నైతిక విలువలు పూర్తిగా పతనమైపోయాయి. లంచగొండితనం, అవినీతి చాలా బహిరంగంగా ఒక పౌరహక్కుగా మారి విలయతాండవం చేస్తోంది. క్రమశిక్షణ అనేది అన్ని రంగాల్లో లుప్తమైపోయింది. జవాబుదారితనం అనేది ఎక్కడా, ఎవరిదగ్గరా లేదు. విచ్చలవిడితనం, అతిస్వేచ్ఛ, సంస్కృతి విధ్వంసం, అరాచకత్వం అన్నీ తారాస్థాయికి చేరి పరిహసిస్తున్నాయి. ప్రజలకు కనీస ఉపాధి.. సరియైన ధరలకు సరుకులు, నాణ్యమైన సామాజిక జీవావరణ.. ఇవేవీ లేవు. అంతిమంగా అన్ని రంగాల్లోనూ ఎవరిపైనా ఎవరికీ నియంత్రణలేని, ఎవరికీ పట్టని ఉదాసీన, నిర్లక్ష్య, అసమర్థ వ్యవస్థ విస్తరించి సమాజం నిర్వీర్యమై చచ్చిన పాములా పడి ఉంది.”
చటుక్కున.. అనూహ్యంగా ఆహూతుల్లోనుండి ఎవరో ఆవేశంగా చప్పట్లు చరిచారు. అందరూ ఎవరా అది అని వెనక్కితిరిగి చూచారు. వెనుకవరుసలో ఎవరో ఓ యువకుడు.. బహుశా విద్యార్థి విభాగానికి చెందిన వ్యక్తేమో.
”మిత్రులారా.. సారీ మీ సమయాన్ని తీసుకుంటున్నాను. కాని ఈ మాత్రం వివరణాత్మక పరిచయం అవసరమే అనుకుంటున్నాను. ప్రజల్లో రాజకీయనాయకులంటే విశ్వాసం, పూర్తిగా నశించిపోయింది. రాజకీయమంటే క్విక్‌ మనీమేకింగు యాక్టివిటీగా ముద్రపడింది. ప్రజలసేవకోసమే రాజకీయాలు అన్న స్పృహ అస్సలే లేదు. అందువల్ల మేము మా ప్రాథమిక ధర్మంగా ప్రజలకు మాపై నమ్మకమేర్పడే విధంగా ముందుగా మా వ్యక్తిగత జీవితాలను ఆదర్శంగా జీవించి చూపించదలుచుకున్నాం. దయచేసి విజ్ఞులు ఇప్పుడు నేను చెప్పబోతున్న విషయాలను శ్రద్ధగా విని మాకు అవసరమైతే మార్గదర్శనం చేయాలని విన్నవించుకుంటూ.. ఒకటి.. ఇప్పుడు మనందరం కూర్చున్న కుటీరంవంటి నిరాడంబరమైన సౌకర్యాలున్న ఈ ప్రాంగణమే మా వసతి. ఇదే జనసేన కార్యాలయం. కార్యస్థలం. నిరంతరం దీని తలుపులు ప్రజలకోసం తెరిచిఉంటాయి. రెండు.. ఈ క్షణంవరకు మాకున్న సర్వసంపదనూ ఒక ట్రస్టీగా ఏర్పాటుచేసి దాని నిర్వహణలోకి తెస్తున్నాం. యికముందు మాకెవ్వరికీ వ్యక్తిగత ఆస్తులనేవి ఉండవు. మూడు.. జనసేన ఒక రాజకీయ పార్టీ కాదు. ఎన్నికల్లో పోటీచేసి గెలిచి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుని ఏవేవో చేస్తామని వాగ్దానాలు చేసి దారితప్పే సంస్థ అసలేకాదు. కాని ప్రజలను చైతన్యవంతులనుచేసి మున్ముందు ‘జనసేన’ ఆమోదం ఉన్నవాళ్లనే ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకునేస్థాయిలో రాజకీయ పక్షాలను ప్రభావితం చేసి తను ఒక మార్గదర్శక సంస్థగా మాత్రమే భావిప్రభుత్వాలను నడిపిస్తుంది. మిత్రులారా.. యిక్కడ ఒక విషయం ప్రత్యేకంగా మనవి, కాదు గుర్తుచేయాలి. బహుశా అనుకుంటాను ప్రపంచంలోనే ఎవరూ చేయని అద్భుత ప్రయోగాన్ని మన పూర్వీకుడైన గాంధీ చేసి చూపించాడు. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. చేపట్టలేదు. కాని ప్రజలనూ, ప్రభుత్వాలనూ తన నిబద్ధతతో, వ్యక్తిత్వంతో విపరీతంగా ప్రభావితం చేశాడు. ‘జనసేన’ పంథాకూడా సరిగ్గా అదే. ఇప్పుడు మీముందున్న ఈ టీంలో ఎవ్వరుగానీ, మున్ముందు ఎటువంటి సంస్థాగత పదవులను చేపట్టరు. నాల్గు .. ‘జనసేన’కు  హింసమీద నమ్మకంలేదు. ‘అహింస ద్వారానే గాంధీమార్గంలో అన్నీ సాధిస్తుంది. ఐతే ‘భయా’నికి మాత్రమే లొంగే మనిషిని భయపెట్టి పనులు చేయించేందుకు, సరియైన మార్గంలో పెట్టేందుకు వాడు చేస్తున్న తప్పులను ప్రజల సమక్షంలో బహిరంగపరిచి.. సిగ్గుపడేలా, తలవంచుకునేలా చేసి భయపెడ్తుంది. వెంటపడ్తుంది. సరియైన దారిలో పెడ్తుంది. దేనికీ లొంగని మనిషి ప్రజల సమక్షంలో దోషిగా నిలబెట్టబడ్డప్పుడు తప్పకుండా తన తప్పును ఒప్పుకుంటాడనీ, ప్రజలమాట వింటాడనే పరమసత్యాన్ని ‘జనసేన’ పూర్తిగా విశ్వసిస్తో ంది. ఆ సిద్ధాంతంపైననే పనిచేస్తుంది.”
అనూహ్యంగా వెనుకనుండి మళ్ళీ చప్పట్లు వినబడ్డాయి. ఐతే ఈ సారి ఒక వ్యక్తినుండి కాదు. ఐదారుగురు సంతోషాతిరేకాలతో స్పందించారు.
”ఐదు. సరియైన దిశానిర్దేశం జరుగకపోవడం, నైతిక బాధ్యతను వహించి విద్యాసంస్థలు.. అంటే ప్రాథమిక పాఠశాలల నుండి విశ్వవిద్యాలయాలదాకా ఎవరూ ఈ తరానికి, నైతిక ప్రవర్తన గురించీ, నీతి నియమాల గురించీ, బాధ్యతల గురించీ, చెప్పవలసినంతగా ఏ స్థాయిలోనూ చెప్పకపోవడంవల్ల ఏర్పడ్డ దురదృష్టకర ఖాళీని .. వెంటనే నైతిక విద్యాబోధన ద్వారా ‘ప్రక్షాళన’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమస్థాయిలో చేపట్టి విజయవంతం చేయడం. ఈ క్రమంలో యిప్పటికే మనవద్ద సుశిక్షితులైన ఎనమిది వందల ఎనభై ఆరుమంది కార్యకర్తలున్నారు. అరవై నాల్గు జనసేన విభాగాలేర్పడ్డాయి రాష్ట్రవ్యాప్తంగా ఈ ‘ప్రక్షాళన’ కార్యక్రమమే జనసేనకు ప్రాణవాయువు. జీవం. జనసేన దీన్ని ఒక బహిరంగ మహోద్యమంగా చేపట్టబోతోంది మున్ముందు.. ఐదు.. ఒక చిన్న పిల్లాడిని నిలబెట్టి ఓ రూపాయి బిళ్లని ఉచితంగా ఇస్తే. ‘ఏమిటిది.. ఎందుకిస్తున్నారు.’ అని ఎంతో ఆత్మాభిమానంతో, రోషంతో ఎదురు ప్రశ్నిస్తాడు. ‘ఊర్కే ఉంచుకో’ అంటే పౌరుషంతో మన రూపాయి బిళ్లను మన ముఖానకొట్టి ”నేను బిచ్చగాణ్ణి” కానని తన ఆత్మగౌరవాణ్ణి ప్రదర్శిస్తాడు. కాని సిగ్గులేని అనేక భారత రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లను దండుకోవడంకోసం ప్రజాకర్షక పథకాలను.. పిల్లవానికి ఉచితంగా రూపాయినిచ్చి అవమానించినట్టు ఉచిత కలర్‌ టి.విలు, ఉచిత బియ్యం, ఉచిత విద్యుత్తు, ఉచిత నగదు.. ఇలా అనేక ఉచితాలను ఆశచూసి పేద ప్రజలను యాచకులుగా, సోమరిపోతులుగా, పనిదొంగలుగా మారుస్తున్నాయి. అట్టడుగు జనం ఈ దిక్కుమాలిన నిషావంటి జీవితాల్లో కూరుకుపోయి ప్రభుత్వమే తెచ్చి వాకిట్లోపెట్టి కవ్విస్తూ అమ్ముతున్న మద్యం అలవాటుకు బానిసలై ”హూమన్‌ గార్బేజ్‌” గా మారతున్నారు. కొద్దిగా ఉన్నవాడు ఇంకా ఇంకా సంపాదించుకునేందుకు అనేక అక్రమ మార్గాలద్వారా సాధ్యమౌతుంటే పేదలింకా నిరుపేదలుగా మారుతూ ఒక సన్నని విభజనరేఖ మనుషులను హావ్స్‌ అండ్‌ హ్యావ్‌నాట్స్‌గా వర్గీకరిస్తోంది. ఈ దుస్థితికి తోడుగా కులవ్యవస్థను కూలదోయవలసిన ప్రభుత్వం కులసంఘాలను ప్రోత్సహిస్తూ పాలనను కులాల ప్రాతిప్రదికన వాటాలు వేస్తోంది. మంత్రులకూ వాళ్లు నిర్వహించే శాఖలకు అసలు సంబంధమేలేదు. వెనుకట ఆయా రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను, అవసరమనిపిస్తే చట్టసభల్లో లేనివాళ్లను పిలిపించి మంత్రులగా నియమించి పరిపాలనకు న్యాయం చేసేవాళ్లు. యిప్పుడు తమ కుల, రాజకీయ నేపథ్యాన్ని బట్టి బహిరంగంగా, నిస్సిగ్గుగా డబ్బును దండిగా దండుకోగలిగే శాఖలను డిమాండ్‌ చేసి లాక్కుని మరీ అనుభవిస్తున్నారు. లక్షలకోట్ల స్కాంలు ఋజువుల్తో సహా బయటపడ్తున్నా ఎవడూ ఎవనిపైన చర్యలే తీసుకోవడంలేదు. ఏమిటీ నిర్వీర్యత.. ఏమిటీ నిష్క్రియాపరత్వం. ఎన్నోసార్లు అసలు ప్రభుత్వాలున్నాయి లేవా అనే సందేహం అరచి ప్రశ్నిస్తోంది. వేలకోట్ల రూపాయల ఖనిజాల అవినీతి, టెలికమ్యూనికేషన్ల అవినీతి, భూకుంభకోణాల అవినీతి, మెడికల్‌ ఇంజినీరింగు కాలేజీల అవినీతి.. ఇలా లెక్కలేనన్ని స్కాంల వెల్లువల్తో దేశం గబ్బుపట్టిపోతోంది. చివరికి ‘రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడౌతాడనే’ విధంగా పూర్తిపతనం జరిగింది. ఐతే మేధావులు, బాధ్యతాయుతమైన పౌరులు కొందరు టి.వి. చర్చల్లో కొట్లాడుకోవడం తప్పితే క్రియాశీలకంగా చేసిన ఉద్దరణ చర్యలేవీలేవు.. ఇప్పుడెలా.?
దేశం వృద్ధ నాయకుల చేతుల్లో ఉంది. బంట్రోతు ఉద్యోగానిక్కూడా కనీస విద్యార్హతలను నిర్ధేశిస్తున్న మనం ఈ రాజకీయ పదవులకు కనీస విద్యార్హతలనెందుకు నిర్ధేశించడంలేదు. రాజకీయాలకు వయోపరిమితులెందుకు లేవు. కదలలేని వాడుకూడా కుర్చీలపై కూర్చుని స్వారీ చేయడమెందుకు?
ఇప్పుడు మనం చుట్టూ ముక్కుపుటాలు పగిలిపోయే దుర్గంధాన్ని భరిస్తూ.. శ్రీశ్రీ అన్నట్టు సందులలో పందులవలె కొనసాగడమా..మనవంటి బుద్ధిజీవులు యికనైనా కొరడా ఝుళిపించి ప్రజల సత్తా ఏమిటో చూపించడమా.. ‘ప్రజలు’ అనే నిర్వచనం యిప్పుడున్న ఈ జనానికి వర్తిస్తుందో లేదో నాకు తెలియదుకాని. ఎందుకంటే నాయకులు, ప్రభుత్వాధికారులు ఏవిధంగా నీతి రీతి తప్పి పశువులకన్నా హీనంగా ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలుకూడా ఎవడు ఏదిస్తే అది తీసుకుని, ఎవనిముందు వాని పాటపాడి, తానతందాన రీతిలో తమ అవిద్యను, అజ్ఞానాన్ని జోడించి అతిగా, స్మార్ట్‌గా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా మనచుట్టూ ఓ పెద్ద భూమిపుండులా విస్తరించి ఉంది. ఈ భూమిపుండులో చిక్కుకున్న మేకవలె కదుల్తున్నకొద్దీ యింకా యింకా లోపలికి కూరుకుపోతూ.. చూస్తూండగానే మరణం దగ్గరికి చేరుకుంటోంది.
మిత్రులారా.. యిక్కడున్న మనలో ప్రతివారూ నేనిప్పుడు చెప్పిన సంకక్షుభిత సందర్భం గురించే మథనపడ్తున్నారని నేననుకుంటున్నా.. యిక ఉద్యమిద్దాం.. ఉదాసీనత యిక ఏమాత్రం తగదు. అడుగులు ముందుకు వేద్దాం.. అందుకు మేం నడుంబిగించి సంసిద్దులమై ఉన్నాం. మీరు మాతో చేరి..లేక మమ్మల్ని మీతో కలుపుకుని ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుద్దాం.. కొత్త ప్రపంచ ద్వారాలను తెరిచి నూతన చరిత్రను సృష్టిద్దాం.”
రామం ఆగాడు వడగళ్ళవాన ఆగినట్టు..ఒక తుఫాను క్షణకాలం స్తబ్దించినట్టు.. నిశ్శబ్దం.
దాదాపు అందరూ అభినందన పూర్వకంగా చప్పట్లు కొట్టారు. కొందరు యువకులైతే అబ్బా యిన్నాళ్ళకు మాకు ఓ కాంతిరేఖ కనిపిస్తోందన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరై దీర్ఘమైన చప్నట్లతో పెల్లుబికే ఆవేశాన్ని ప్రదర్శించారు.
”ధన్యవాదాలు మిత్రులారా..” అని రామం కూర్చున్నాడు.
హాలునిండా ఒకరకమైన రిక్తత చోటు చేసుకుంది. అది భూమిలోనుండి పొరలను చీల్చుకుని మొలక ఈ విశాల విశ్వంలోకి తలెత్తుకున్నప్పటి బీభత్స నిశ్శబ్దం.
కొద్ది వ్యవధి తర్వాత.. డాక్టర్‌ గోపీనాథ్‌.. ” యిప్పుడు మిస్‌ జేమ్స్‌ హెచ్‌. క్యాథీ తనను పరిచయం చేసుకుంటారు.” అన్నారు ముక్తసరిగా.
క్యాథీ లేచి నిలబడి ఒకసారి అందరివంకా వినమ్రంగా చూచింది..మొట్టమొదటిసారిగా రెక్కలను సవరించుకుంటున్న ఎగురబోయే పక్షిలా.
అందరూ ఆమెవంక ఆసక్తిగా చూశారు.. ఆమె విదేశీయురాలు కావడం, ఆ వేదికపై ఆమె ఉండడం వెనుక ఆమె పాత్రపై ఉత్సుకత అందరికీ..వింటున్నారు శ్రద్ధగా.
”పెద్దలందరికీ నమస్కారం..” స్పష్టమైన తెలుగు. ”నా పేరు జేమ్స్‌ హెచ్‌. క్యాథీ. నేను అమెరికన్‌ జాతీయురాలిని. అమెరికాలోనే పుట్టి, అక్కడే పెరిగి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంనుండి 1997లో యూనివర్సిటీ టాపర్‌గా ఎంబిఎ పట్టా పుచ్చుకున్నదాన్ని. స్వతహాగా పరిశ్రమలు నడుపుతూ వ్యాపారంలో ఉన్న వ్యక్తిని నేను. రామంగారితో పదేళ్లక్రితం ఏర్పడ్డ పరిచయం.. స్నేహం.. ఒక వ్యక్తి ఒక మహోన్నత నిర్వచిత లక్ష్యంవైపు నడుస్తున్నపుడు వెంట ఉండడానికి యిష్టపడి.. పాలు పంచుకోవాలని తపించి ఒక అనుచరురాలిగా.. అతనితో ఈ విప్లవాత్మక.. నేను దీన్ని అహింసాయుత విప్లవమనే నిర్వచిస్తున్నాను. ఈ విప్లవాత్మక గమ్యాన్ని చేరేందుకు ఆయన వెంట నీడలా ఉందామని నిశ్చయించుకుని.. మీ భాషను, మీ మహోన్నత సాంస్కృతిక నేపథ్యాన్ని, మీ చరిత్రను, వారసత్వాన్ని పూర్తిగా అధ్యయనం చేసి..ఐచ్చికంగా మీ ముందు నిలబడ్డదాన్ని.. నన్ను మీరు ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తాను..” అని రెండు చేతులనూ జోడించింది వినయంగా.
చప్పట్లు.. ప్రశంసా పూర్వకమైన వ్యక్తీకరణ.
క్యాథీ కూర్చుంది.
తర్వాత.. డాక్టర్‌ గోపీనాథ్‌ పరిచయం చేస్తూండగా, ముప్పయ్యేళ్ల శివ వేదికపై లేచి నిలబడ్డాడు. చిన్నగా పెరిగిన గడ్డం. సన్నగా నిరాడంబరమైన వేషధారణ, లాల్చీ.. ప్యాంట్‌. కళ్ళద్దాలు. ముఖంపై నిశ్చలమైన స్థిరత్వం.
”నేను శివ. మాస్టర్‌ ఇన్‌ కార్డియోథొరాసిక్‌ సర్జరీ.. గుండె ఆపరేషన్లు చేయడం నా వృత్తి. ఐతే హృదయం గురించి తెలిసినవాణ్ణి. ఈ మన వర్తమాన భారత సమాజంలో హృదయంలోపిస్తోంది. దాన్ని పునఃప్రతిష్టించడం కోసం రామంగారి వెంట.. రాముని వెంట హనుమంతునిలా ఉందామని..అంతే..”
చప్పట్లు..
”మిత్రులారా.. ఇప్పుడు మనం ఓ పదిహేను నిముషాలు తేనీటి విరామం తీసుకుని.. మనం గడిపిన ఈ గంటసేపట్లో తెరపైకి తెచ్చిన కొత్త ఆలోచనలను పరస్పరం ఎవరికివారుగా పంచుకుని.. మళ్లీ సమావేశమౌదాం..” అని మైక్‌లో ప్రకటించారు డాక్టర్‌ గోపీనాథ్‌.
అప్పట్నుండీ ఏకబిగిన కొనసాగిన గంభీరత సడలి.. దాదాపు అందరూ లేచి నిలబడి.. ఊపిరి తీసుకుని.. బయటికి వరండాలోకి నడిచారు ఎవరికివారు.
వరండాలో అక్కడక్కడా ఏర్పాటు చేసిన తేనీటి టేబుల్స్‌.. ప్రక్కనే బిస్కెట్లు.. పళ్ళ ముక్కలు.. కొందరికోసం పళ్ళ రసాలు..ప్రతి టేబుల్‌ దగ్గర వాలంటీర్స్‌.. క్రింద చుట్టూ పచ్చని గడ్డి.. పూలమొక్కలు. అక్కడక్కడ పావురాలు ఎగురుతూ.. మంచి అందమైన ల్యాండ్‌స్కేపింగును ఎవరో మంచి అభిరుచి ఉన్న మనిషి చేయించినట్టుగా.. మొత్తంమీద అంతటా క్రమశిక్షణ నిండిన అదోరకమైన గంభీర వాతావారణం ఆవరించి ఉంది చుట్టూ.
వచ్చిన వ్యక్తులందరూ జీవితాన్ని సీరియస్‌గా తీసుకుని సందర్భాన్ని అర్థవంతంగా ఆలోచించగల మేధోజీవులే. పాజిటివ్‌ అటిట్యూడ్‌తో పరిస్థితులను స్వీకరించడం మనిషికి అత్యంత అవసరమైన సంస్కారం. ఐతే దురదృష్టవశాత్తు వర్తమాన సామాజిక విశ్లేషకుల్లో ఎవనికివాడు ఓ ప్రపంచస్థాయి మేధావిగా భావించుకుంటూ ఎదుటిమనిషిలోని లోపాలను అన్వేషించడమేగాని తానుఎంతవరకు సహనశీలంగా, అంగీకార తత్వాన్ని కలిగి ఉన్నాడో ఆత్మపరీక్ష చేసుకోడు. ఈ తత్వంగలిగి కేవలం మాటలకు, చర్చలకు మాత్రమే పరిమితమయ్యే సూడో మేధావులను ఉద్యమకారులు గుర్తించి వారిని దూరంగా ఉంచడమో, తామే దూరంగా జరుగడమో చేయాలి. లేకుంటే వీరు కర్ణునిలాంటి మహావీరునికి శల్యసారధ్యం వహించినట్టు ఉద్యమహననానికి కారకులౌతారు. రామంకు, క్యాథీకి, డాక్టర్‌ గోపీనాథ్‌కు ఈ సంక్లిష్టమైన సున్నితమైన విషయం గురించి స్పష్టమైన అవగాహన ఉంది.
”నాకెందుకో.. యిన్నాళ్ళకు ఏదో ఒక ఆశారేఖ కనిపిస్తోంది రామారావుగారూ..” అన్నాడు ప్రముఖ రచయిత, కవీ, నిజాయితీకి మారుపేరైన కాంతారావు తన ప్రక్కనే టీ చప్పరిస్తున్న పౌరహక్కుల నేత రాములుతో
”ఔను.. నాక్కూడా. దానికి సిద్ధాంతరీత్యా రెండు హేతువులున్నాయి. ఇంతవరకూ ఎవడు రాజకీయాల్లోకొచ్చినా అధికారాన్నీ, కుర్చీని ఆశించీ, రాజ్యాధికారం లక్ష్యంగానే వచ్చాడు. వచ్చిన మర్నాటినుండి డబ్బును దోచుకోవడమే వ్యాపకంగా పెట్టుకున్నాడు. వీళ్ళు మాకు అధికారం వద్దంటున్నారు. ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైన ఆలోచన. కాగా ఈ ఆదర్శ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న రామం..ఇతర వ్యక్తులందరూ స్వంత ఆస్తులనేవీ లేకుండా ప్రజలకోసమే ప్రజల సమక్షంలో పారదర్శకంగా, నిరాడంబరంగా జీవించేందుకు సిద్ధపడి రంగంలోకి దిగుతున్నారు. మనిషి స్వార్ధాన్నీ, సుఖవాంఛలనూ విడనాడితే క్రమంగా ముముకక్షువుగా మారుతాడు. యిది ఎంతో ఆరోగ్యవంతమైన పరిణామం.. చూద్దాం.. దీన్ని సమర్థించడం వెంట ఉండడం, వెంటనడవడం మన బాధ్యత.”
”ఔను.. నాకూ అలాగే అనిపిస్తోంది.”
ఇంతలో రామం, క్యాథీ వాళ్ల దగ్గరకొచ్చారు ఒక్కొక్కరిని పలకరిస్తూ, రామారావు. రాములు కరచాలనాలు చేసి తమను తాము సంక్షిప్తంగా పరిచయం  చేసుకుని.. ”బెస్టాఫ్‌లక్‌ రామం. వుయార్‌ హైలీ హోప్‌ ఫులాఫ్‌ సం బెటర్‌ థింగ్సు టు అక్కర్‌..” అన్నాడు రాములు ప్రసన్నంగా.
”థాంక్యూ సర్‌.. మనం కలిసి నడుద్దాం సర్‌..”
తర్వాత ఒక టి.వి న్యూస్‌ చానల్‌ అధినేత రాజేందర్‌రాజు రామంను పలకరించి.. ”కంగ్రాట్స్‌ రామంగారూ.. బెస్టాఫ్‌ లక్‌ ఇన్‌ యువర్‌ ఎండీవర్‌..” అంటున్నాడు.
ఇంతలో లోపల్నుండి.. ఎవరో మైక్‌లో అందరినీ తిరిగి తమ తమ సీట్లలోకొచ్చి ఆసీనులు కావాల్సిందిగా అనౌన్స్‌ చేస్తున్నారు.
లోపలికి కదిలారు ఒక్కొక్కరే.
ఇప్పుడు వేదికమీద ఎవరూ లేరు. ఒక్క డాక్టర్‌ గోపీనాథ్‌ మాత్రమే ఒకే ఒక కుర్చీలో కూర్చుని ఉన్నవాడు లేచి మైక్‌ ముందుకొచ్చి.. ”మిత్రులారా.. మనసులో ఒక ప్రణాళికగా ఉన్న ‘జనసేన’కు సంబంధించిన ఆలోచనలను మీ ముందుంచాం. ఈ శక్తివంతమైన ఊహకు రిహార్సల్‌గా నిన్న.. గూడెం అడవుల్లో భద్రాచలం గోదావరీ పరీవాహప్రాంత గిరిజన, మూలవాసీ సంఘం, జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఒక ‘నిలతీత’ కార్యక్రమం జరిగింది. దాదాపు ముప్పయి ఏడు లక్షల ప్రపంచబ్యాంకు నిధులను వేయని రెండు రోడ్లను వేసినట్టు, అవి కొట్టుకుపోయినట్టు మంత్రి వీరాంజనేయులు నుండి చీఫ్‌ ఇంజినీర్‌, ఇ.ఇ. ఇత్యాది అసిస్టెంట్‌ ఇంజనీర్‌ వరకు కుమ్మక్కై పంచుకున్న సత్యాన్ని సోదాహరణంగా ఋజువు చేసి.. అందరినీ కస్టడీలోకి తీసుకునేలా చేసిన సంగతి ఈ రోజు మీడియా ద్వారా మీకందరికీ తెలిసిందే. దీంతో జనంలో అధికారుల్లో, రాజకీయవర్గాల్లో ఒక వణుకు పుట్టింది. ఇది మన తొలి విజయం. ఈ సందర్భంగా మానవ హక్కుల కమీషన్‌ చైర్మన్‌ చేసిన వ్యాఖ్యలను యిక్కడ ఉటంకించడం ప్రధానమని భావిస్తున్నాను. ఏమిటంటే ఒక సామన్య పౌరుణ్ణి ఎక్కడైనా పోలీసులు ఏదో నేరంపై అరెస్ట్‌ చేస్తే అతను తానునిజంగా నిరపరాధినని ఎంత మొత్తుకొని తన వాదనకు ఆధారాలను చూపేందుకు ప్రయత్నించినా పోలీసులు అతని మాటను వినరు. నువ్వు చెప్పదల్చుకున్నదంతా పోలీస్‌స్టేషన్‌ కొచ్చిన తర్వాత అక్కడో లేక కోర్టులోనో చెప్పుకో అని గదమాయిస్తాడు. కాని ఇదే న్యాయాన్ని పెద్దలకూ, రాజకీయులకూ వర్తించకుండా పోలీసులు వాళ్లను వెనకేసుకొస్తున్నారు. ఋజువులను చూపించినా అవి కోర్టులో నిరూపణయ్యేదాకా వారు నిర్దోషులేననే వితండవాదం చేస్తూ కొంత వెసులుబాటు నివ్వడం, ఆలోగా వాళ్ళ లాయర్స్‌ కోర్టుద్వారా బెయిల్‌ తీసుకుని రావడం, ఈలోగా నిందితునికి షరా మామూలుగా గుండెనొప్పి రావడం – ఆస్పత్రిలో చేర్పించడం.. ఇదంతా ఓ డ్రామాగా మారింది. కాబట్టి ఈ కేస్‌లో మంత్రికీ, మిగతా అధికారులకూ జీప్‌ ఎక్కిన మరుక్షణమే గుండెనొప్పులు వస్తాయని ముందే ఊహించి, కస్టడీలోకి తీసుకుంటున్నపుడు ఒక హృద్రోగ నిపుణుణ్నికూడా వెంట సహాయయకునిగా ఏర్పాటుచేసుకోవాలని ఆదేశిస్తున్నాను.” అని.. ఇది నిజంగా ఒక అపూర్వమైన విజయం.. ఇంటువంటివి మున్ముందు ఎన్నో మనం తప్పకుండా సాధిస్తామనీ, ప్రజల్లో నిప్పువంటి చైతన్యాగ్నిని రగిలించగల్గుతామని విశ్వసిస్తూ.. ఈ సందర్భంగా సీనియర్‌ పాత్రికేయులు ‘అగ్ని’ వార్తా ఛానల్‌ అధినేత మూర్తిగారిని ఆహుతులనుద్దేశించి తమ ప్రతిస్పందనను పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.”
మళ్ళీ నిశ్శబ్దం.. నిశ్శబ్ద గంభీరం.
యాభై ఆరు సంవత్సరాల ద్వారంపూడి కృష్ణమూర్తి.. పాత్రికేయ వర్గాల్లో ఎంతో గౌరవ ప్రతిష్టలను పొందుతున్న.. ఒకప్పటి ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు సంపాదకుడు, ప్రస్తుతం ‘అగ్ని’ న్యూస్‌చానెల్‌కు సిఇవో ఐన మూర్తి చాలా నిలకడగా నడచి వేదికపైకి వచ్చి.,
స్థిరమైన గొంతుతో..”మిత్రులారా.. ఈ రోజు ఎంతోసుదినం. ఈ మనుషుల గురించి, ఈ భారత పౌరుల గురించి, ఈ వ్యవస్థ గురించి రోజురోజుకూ భ్రష్టుపట్టిపోతున్న దుష్ట రాజకీయ వికృత చర్యల గురించీ సీరియస్‌గా ఆలోచిస్తున్న కొద్దిమంది బుద్ధిజీవుల మనోవేదననూ, అసంతృప్తినీ, ప్రేక్షకపాత్ర మాత్రమే వహించక తప్పని అనివార్య పరిస్థితులనూ ఒక అతి ప్రధానమైన సందర్భంగా గుర్తించి ఈ దురవస్థనుండి బయటపడే మార్గాలను అన్వేషించడానికి ఈవిధంగా అంకితభావంతో మనందరం, సమావేశం కావడమే నాకు పరమ ఆనందాన్ని కల్గిస్తోంది. ఇటువంటి ప్రయోజనకరమైన సందర్భాన్ని సృష్టించినందుకు, మనందర్ని యిక్కడకు ఆహ్వానించినందుకు రామంకు క్యాథీకి డాక్టర్‌ గోపినాథ్‌ గారికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్లను అభినందిస్తున్నాను.”
వాతావరణం చాలా గంభీరంగా ఉంది.
”మిత్రులారా.. వ్యాపారమేదైనా దాని సక్సెస్‌ కేవలం రెండు విషయాలపైననే ఆధారపడి ఉంటుంది. అవి..ఒకటి వస్తువు యొక్క గరిష్టమైన నాణ్యత.. అతి తక్కువ ధర. అదేవిధంగా సుదీర్ఘమైన మానవ పరిణామ వికాసాల చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేస్తే తేలే విషయమేమిటంటే.. ఒక మనిషేకాదు. జీవి ఏదైనా అంతిమంగా ”భయా”నికి మాత్రమే లొంగుతుంది. ఏదో ఒక భయం లేనిది మనిషి వినడు. తప్పుచేస్తే అమెరికావాడు విపరీతమైన ఫైనేస్తాడని భయం. ఆరబ్‌ దేశాల్లో తప్పుచేస్తే చేతులుకాళ్లు నరికేస్తారని భయం.. చెప్పినట్టు వినకుంటే తాలిబన్లు ప్రాణాలు తీస్తారని భయం.. ఆలస్యంగా ఆఫీస్‌కు పోతే అబ్సెంటేస్తారనీ, జీతం కట్‌ చేస్తారనీ భయం.. చివరికి ఏ ఇంట్లోనైనా కూడని పని చేస్తే పిల్లలను ‘తండ్రి’ తంతాడని భయం.. ఐతే ఏ భయమూ లేకుండా నిస్సిగ్గుగా, జంకూగొంకూ లేకుండా బహిరంగంగా ఈ దేశఖజానాను, ఈ దేశ భూమిని, భూమిని తవ్వుకుని ఖనిజాలను, అడవులను, బొగ్గును, అప్పులు కూడా చేసి ఆ లక్షలకోట్ల డబ్బును.. తింటూనే,  ఏండ్లకు ఏండ్లుగా ఏళ్ళ పర్యంతం యింకా తినే కార్యక్రమాలను కొనసాగిస్తున్న రంగం..మన భారత రాజకీయ రంగం భ్రష్టుపట్టిపోయింది. ఈ భారత రాజకీయ నాయకులు ఎటువంటి భయమూ, సిగ్గూ లేకుండా ఈ దేశాన్ని తినీతినీ అంతా ఖాళీచేసి యిక దీన్ని ఎవ్వరూ రిపేర్‌ చేయలేని దయనీయస్థితికి తెచ్చిపెట్టారు. యిప్పుడీ దేశం బంగారురంగు అట్టపెట్టెలో ఏమీలేని ఒట్టి ‘డొల్ల’గా మిగిలి ఉంది. వీళ్ళకిప్పుడు..ఉచ్ఛలుపోయించే ఏదో ఒక ‘భయం’ కావాలి – ఆ ‘భయాన్ని’ సృష్టించగల్గితే మనం మన ఆలోచనలు.. మన ప్రయత్నాలు సఫలమైనట్టే..”
రామం చాలా జాగ్రత్తగా వింటున్నాడు మూర్తిగారి ప్రసంగాన్ని. మేనేజ్‌మెంట్‌ సైన్స్‌లో ఒక ప్రిన్స్‌పుల్‌ ఉంది. అది ‘లెటిట్‌ కం ఫ్రం అదర్‌సైడ్‌ ఆల్వేస్‌” అని .. విషయం ఎంత ప్రధానమైందైనా ఎదుటివ్యక్తితో మనం ప్రతిపాదిస్తే దాని విలువ అంతగా ఉండదు. అదే ప్రతిపాదన ఎదుటి వ్యక్తినుండి వస్తే సందర్భం ఉత్తేజకరంగా ఉంటుంది. అందువల్ల ఒక మంచి మేనేజర్‌ ఎప్పుడూ తనకు కావలసిన ప్రతిపాదన ఎదుటివ్యక్తినుండి వచ్చేట్టుగా పరిస్థితులను సృష్టిస్తాడు. బంతిని ఎంత బలంగా గోడకేసి కొడ్తామో అది అంత బలంగా వేగంగా తిరిగొస్తుందనే గ్రహింపుతో నిర్వహనక్రీడను కొనసాగిస్తాడు. అతనికి..సరిగ్గా ఊహించిన విధంగానే విజ్ఞుడైన మూర్తిగారు ప్రతిస్పందిస్తూండడం చాలా ఆనందాన్ని కల్గించింది.
”మిత్రులారా.. భయం అంటే చాలామంది.. కొట్టడం, చంపడం.. లేదా జైల్లోపెట్టడం.. నక్సలైట్లయితే హత్యలు చేసి పేల్చివేయడం.. లాంటి చర్యలతో భయానికి తప్పు నిర్వచనం ఇచ్చారు. ఇన్నాళ్ళూ?. అసలు భయం మనిషిని ప్రజల సమక్షంలో నిలబెట్టి ఋజువుల్తో సహా నిలదీసి దోషిగా ప్రూవ్‌ చేసినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తుంది. ఎంత కిరాతకుడైనా ప్రజలమధ్య దోషిగా నిల్చున్నప్పుడు సిగ్గుతో తలవంచుకుని ‘క్షమ’నో, ‘శిక్ష’నో ఐచ్చికంగా కోరుకుంటాడు. దీనికి సజీవ ఉదాహరణ.. ఈ మధ్య టి.వి. ఛానళ్ళలో తప్పుచేస్తూ రెడ్‌హ్యాండ్‌గా పట్టుబడ్డప్పుడు చెట్టుకు కట్టేసి మహిళలు వాణ్ణి చెప్పుతో కొడ్తూంటే కిక్కురమనకుండా వాడు చెప్పుదెబ్బలు పడ్తున్న నిస్సహాయ దృశ్యాల్నే ఉదాహరణ. నేనీ తప్పు చేస్తే ప్రజలు ఋజువుల్తోసహా నడివీధిలో నన్ను నిలదీస్తారనే భయాన్ని మనం క్రియేట్‌ చేయగల్గితే.. చాలు.. మనం మన లక్ష్యం చేరుతాం. ఇది జరగాలంటే చాలా నిమగ్నతతో సమాచార సేకరణ జరగాలి.. అంకితభావంతో నిస్వార్థంగా పనిచేసే వందల వేలమంది నికార్సయిన, నీతిపరులైన కార్యకర్తలు కావాలి.. ఎటువంటి అధికార వాంఛాలేని నేతృత్వం కావాలి.. అవన్నీ మనకున్నాయి.. కాబట్టి మన ప్రయత్నం తప్పకుండా విజయవంతమౌతుంది.”
వెల్లువలా చప్పట్లు.. హర్షాతిరేకతతో నిండిన ప్రతిస్పందనలు..,
”ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా మిత్రులారా.. కరడుగట్టి పునాదులు బలపడి దుర్భేద్యంగా మనముందు నిలబడ్డ ఈ అవినీతి దుర్గం యింత సుళువుగా కూలిపోతుందా, నిర్మూలించబడ్తుందా అనే సందేహం మనలో కొందరికి కలగొచ్చు.. అడవి పెద్దదే కాని .. దాన్ని భస్మీపటలం చేయడానికి చిన్న అగ్గిపుల్ల చాలు. ఐతే కొన్ని సత్యాలు ప్రతిపాదనల స్థాయిలో ఉన్నపుడు నమ్మశక్యంగా ఉండవు. కాని ఋజువై కార్యరూపం దాల్చిన తర్వాత ఒక అద్భుతంగా మిగిలిపోతాయి చరిత్రలో.. ఒక ఉదాహరణ చెప్తా.. మొట్టమొదటి 1839లో స్కాటిష్‌క్‌ చెందిన ఒక సాధారణ కుమ్మరి మాక్‌ మిల్లన్‌ బైసికిల్‌ను కనిపెడ్తున్నపుడు.. రెండు చక్రాలతో ఒక యంత్రం నిట్టనిలువుగా పడిపోకుండా నిలబడ్తుందనీ, దానిపై ఒక మనిషి ఎక్కి కూర్చుని ప్రయాణం కూడా చేయవచ్చనీ, కాగా అతివేగంగా ముందుకు దూసుకుపోతుందనీ చెప్పినపుడు అందరూ హేళనగా నవ్వారు. వినే మా అందరి చెవుల్లో పువ్వులు కనిపిస్తున్నాయా అని గేలిచేశారు. పరిహసించారు. ఆ విషయాన్ని .. యిప్పటిక్కూడా మనం ఊహామాత్రంగా దృశ్యిస్తే నమ్మబుద్దికాదు. కాని నిజమైందికదా. ఒక నమ్మశక్యంకాని సత్యం సైకిల్‌గా రూపుదిద్దుకుని థాబ్దాలుగా సామాన్యుని వాహనమై ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తూనే ఉందికదా.. అందువల్ల ఒక ఆవిర్భావస్థితిలో కొన్ని పరమ సత్యాలు విశ్వసనీయంగా అనిపించవు. కాని అవి పరమాతిపరమ సత్యాలుగా ఋజువై చరిత్రలో నిలిచిపోతాయి. మిత్రులారా.. నాకు పూర్తి నమ్మకముంది. రామం ఎంతో దీర్ఘదృష్టితో, నిర్మలమైన హృదయంతో, నిస్వార్థంగా, ఎటువంటి అధికారకాంక్ష లేకుండా చేపట్టిన ఈ ‘ప్రక్షాళన’ కార్యక్రమం తప్పకుండా విజయవంతమౌతుంది. భారత రాజకీయ, సాంఘిక జీవితాల్లో పెనుమార్పును తెస్తుంది. యిప్పుడు మనందరం చేయవలిసింది ఆలోచనలను అమలుకాగల కార్యక్రమాలుగా ట్రాన్స్‌లేట్‌ చేయడం..చేద్దాం ఐకమత్యంతో. నేను నావంతు సహకారాన్ని పూర్తిగా అందిస్తాననీ, మీ అందరి వెంట నడిచి నా విద్యుక్తధర్మాన్ని నెరవేరుస్తాననీ ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. జైహింద్‌.. జై జనసేన…”
”జై జనసేన..” హాలు దద్దరిల్లింది.. పదులనుండి వందల సంఖ్యకు కంఠాలు పెరిగి.. చినుకులు సెలయేరుగా మారుతున్నట్టు..,
రామం ఒళ్ళు పులకించింది. శరీరంనిండా రోమాలు నిక్కి నిలబడ్డాయి. మాటలకందని దివ్యానుభూతి ఏదో అతన్లో విద్యుత్‌వలె ప్రవహిస్తోంది.. మౌనంగా ప్రక్కనే ఉన్న క్యాథీ ముఖంలోకి చూశాడు. ఆమెకూడా పరవశించిపోతూ నిండుసముద్రంలా నవ్వింది.
”మూర్తిగార్కి ధన్యవాదాలు.. ఒక వరిష్ట పాత్రికేయులుగా ఎంతో దీర్ఘదృష్టితో వర్తమాన సంకక్షుభిత సందర్భాన్ని స్పష్టంగా విప్పిచెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ.. మా వెంట ఉంటానని భరోసా యిస్తూ మన ‘జనసేన’కు ఊపిరినందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ.. ఇప్పుడు .. ప్రముఖ పౌరహక్కుల నేత.. సమాజంపట్ల ఎంతో బాధ్యతతో జీవిస్తున్న చింతనపరుడు ప్రొఫెసర్‌ రాములుగారు తమ అభిప్రాయాలను మనకు తెలియజేస్తారు.. ”డాక్టర్‌ గోపీనాథ్‌ చెబుతున్నారు మైక్‌లో.
చాలా క్రమశిక్షణ.. అనేకం ఏకమై.. ధారలు ఏరులై.. చినుకులు ప్రవాహమై.. ఒక నిశ్శబ్ద పరివర్తన.. ఆలోచనలు ఆలోచనలుగా మనుషులు వికసిస్తున్న సందర్భమది
చుట్టూ .. అంతా ప్రశాంతంగా ఉంది.

(సశేషం)

వీలునామా – 31 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

మరొక వీడుకోలు

ఇంగ్లండు వదిలి మెల్బోర్న్ తిరిగి వెళ్తున్నామన్న ఊహతోనే ఎమిలీ ఆరోగ్యం కుదుటపడసాగింది. స్టాన్లీ ఇంగ్లండు వదిలి వెళ్ళేముందు ఒక్కసారి ఎమిలీని తీసికెళ్ళి పెగ్గీకి చూపించాలనుకున్నాడు. తన చేతుల్లో పుట్టిన ఫిలిప్స్ పిల్లలని ఒక్కసారి చూడాలని పెగ్గీ ఎన్నోసార్లు అనుకుంది.

పిల్లలని తీసుకుని ఫిలిప్స్ దంపతులూ, జేన్ స్కాట్లండు బయల్దేరారు. ఎల్సీ ప్రయాణం పైన పెద్దగా ఉత్సాహం చూపించలేదు, పైగా ఇంటిల్లిపాదికీ సరిపడా బట్టలు కుట్టడంలో తల మునకలుగా వుండిపోయింది.

ఫిలిప్స్ కూతుళ్ళిద్దరినీ, జేన్ నీ చాలాకాలం తర్వాత చూసిన పెగ్గీ చాలా సంతోషపడింది. అందరూ నాలుగు రోజులు పెగ్గీ ఇంట్లో సందడిగా గడిపారు.  లిల్లీ అందాన్నీ, పిల్లల ముద్దు ముచ్చట్లూ చూసి పెద్దాయన టాం లౌరీ ఎంతో సంబరపడ్డాడు. జేన్ ని కలిసి మాట్లాడడానికి ఫ్రాన్సిస్ కూడా ఒకరోజు ఎస్టేటు నించి వచ్చాడు. అక్కణ్ణించే జేన్ వెళ్ళిపోవడం ఫ్రాన్సిస్ కే మాత్రం నచ్చలేదు.

“జేన్, ఇంగ్లండు మొత్తానికే వదిలి వెళ్ళేముందు ఒక్కసారైనా ఎస్టేటుకొచ్చి చూడవా? క్రాస్ హాల్ కి రాకుండానే వెళ్ళిపోతావా? మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో!”ఫ్రాన్సిస్ వేడుకున్నాడు. పల్లెటూర్లో ఎస్టేటుకి ప్రయాణం మాటేత్తగానే అందరికంటే ముంది ఎమిలీ ఎగిరి గంతేసింది.

“క్రాస్ హాల్! పేరు భలే వుందే! అదే మీ ఎస్టేటు పేరా? ఎప్పుడూ ఎల్సీ మాట్లాడుతూ వుంటుంది దాని గురించేనన్న మాట. వెళ్దాం! వెళ్దాం!వెళ్దాం!” గంతులేసింది.

లిల్లీ కూడా,

“నాకూ చూడాలనే వుంది. స్టాన్లీని అడుగుదాం. తప్పక తీసికెళ్తాడు!”  అంది.

నిజానికి జేన్ కి స్కాట్లాండు ప్రయాణమే ఇష్టం లేకపోయినా విధి లేక ఒప్పుకుంది. ఇప్పుడు క్రాస్ హాల్ కి వెళ్ళడమంటే పాత ఙ్ఞాపకాలతో మనసుని మళ్ళీ గాయపర్చుకోవడమేనని తెలుసామెకి. అందుకే వెళ్ళకుండా వుండాలని చాలా ప్రయత్నం చేసింది. కాని ఆమె మాట ఎవరూ వినిపించుకోలేదు. విధిలేక అందరి వెంటా జేన్ కూడా ప్రయాణమైంది.

రైలు దిగగానే ఫ్రాన్సిస్ ఆమె కొరకు పంపిన గుర్రపు బగ్గీలోకెక్కారందరూ. స్టేషను నించి ఎస్టేటు అయిదు మైళ్ళ దూరం. తనకు బాగా అలవాటైన మేనమామ గుర్రపు బగ్గీలో, తను స్వతంత్రంగా తిరిగిన వూళ్ళో, ఇప్పుడు అతిథిలా, దిక్కూ మొక్కూ లేని అనాథలా తిరిగి రావడం జేన్ కి దుర్భరంగా వుంది.

బగ్గీలో ప్రయాణం చేస్తూ వుండగానే ఆమెకి విలియం డాల్జెల్ తన కొత్త భార్యతో సహా కనిపించాడు. ఎస్టేటు వెళ్ళేదారిలోనే వున్న మిస్ థాంసన్ గారి ఇంటి దగ్గర ఆగారు.

మిస్ థాంసన్ ఇంట్లో జేన్ మొదటిసారి ఫ్రాన్సిస్ ఎన్నికల ఏజెంటు సింక్లెయిర్ ని కలిసింది. అయితే ఆ యింట్లో సింక్లెయిర్ కన్నా ఆమెని ఆకర్షించింది మేరీ ఫారెస్టర్, మిస్ థాంసన్ మేన కోడలు. మేరీ ఊరికే కొద్దిరోజులు అత్త ఇంట్లో ఉండిపోదామని వచ్చింది. మిస్ థాంసన్ ఇంట్లో ఉండే మిగతా పిల్లల సమ్రక్షణ లో తల మునకలుగా వుంది.

మేరీ నవ్వు మొహమూ, తెలివితేటలూ, సౌమ్యతా జేన్ కి చాలా నచ్చాయి. శీతాకాలపు ఉదయం సూర్య కాంతిలా ఇల్లంతా పరచుకోని వుంది మేరీ, అనుకుంది జేన్. ఫిలిప్స్ పిల్లలూ, థాంసన్ ఇంట్లో పిల్లలూ క్షణాల్లో కలిసిపోయారు.

వాళ్ళని ఆటల్లో వదిలి మేరీ, జేన్ కబుర్లలో పడ్డారు. అప్పటికే మేరీ జేన్ గురించి ఎంతో విని వుండడం మూలాన కుతూహలంగా చూసింది జేన్ వైపు. వాళ్ళు మాటల్లో వుండగానే జేన్ మనసులో ఒక చిన్న ఆలోచన మెరిసింది.

ఈ అమ్మాయి ఇదే వూళ్ళో ఉండేటట్టయితే, బహుశా ఫ్రాన్సిస్ ఈ అమ్మాయినే పెళ్ళాడొచ్చు, అనుకున్నదామె. ఆ ఊహకి ఆధారం లేదు, నిజానికి. అయితే ఆ ఊహ వల్ల తన మనసులో రేగే భావం ఎలాటిదో కూడా జేన్ తేల్చుకోలేకపోయింది.

“జేన్!  మీ గురించి నేనెంత విన్నానో చెప్పలేను. మిమ్మల్ని చూస్తూంటే నాకెంతో ఈర్ష్యగానూ వుంది. మీరు బయట ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తారోనని ఊళ్ళో అందరూ ఆత్రంగా ఎదురు చూసారంటే నమ్మండి.  స్టాన్లీ ఫిలిప్స్ గారి దగ్గర ఉద్యోగం లో చేరడం విని అందరూ తెరిపిన పడ్డారు.  మీ ఫ్రాన్సిస్ కూడా పదే పదే మిమ్మల్ని తలచుకుని బాధ పడేవాడు. ఆయన కూడా మీకు దొరికిన ఉద్యోగాన్ని చూసి సంతోషపడ్డారు. ఆయనలాటి సున్నిత మనస్కులకి మిమ్మల్ని నడివీథిలోకి నెట్టి ఆస్తి అనుభవించే మొరటుదనం వుండదు కదా?”  అన్నది.

“అవును మేరీ! ఫ్రాన్సిస్ ఎంత మంచి వాడో నాకు బాగా తెలుసు. అయినా, భగవంతుని దయవల్ల నేనూ మా చెల్లాయి ఎల్సీ క్షేమంగానే వున్నాము.”

“జేన్! నిజానికి నాకు మీతో పోల్చి నన్ను చూసుకుంటే సిగ్గుగా వుంటుందండీ! మిమ్మల్ని మీ మామయ్య గారు చదివించి పెంచి పెద్ద చేసినట్టే మమ్మల్నందరినీ మా అత్త మార్గరెట్ థాంసన్ చదివించి పెద్ద చేసింది. అయినా మేమే రకంగానూ పొట్ట పోసుకోలేకుండా ఆమెకి భారంగానే వున్నాము. నాతో సహా నలుగురం ఆడపిల్లలం వున్నాం. అందర్లోకీ చిన్నది గ్రేస్ ఒక్కతే ఇంకా స్కూల్లో వుంది. మిగతా అందరమూ పెద్ద వాళ్ళమే, అయినా ఉద్యోగం సద్యోగం లేకుండ ఇలా బంధువుల దయా ధర్మాలతో వెళ్ళదీస్తున్నాము. మీలాగే నేను బయటెక్కడికైనా వెళ్ళి ఉద్యోగం వెతుక్కుందామనుకున్నాను. అయితే, అత్త ఈ చలికాలం ఇక్కడే తనకి సాయంగా వుండమనీ, కావాలంటే ఆ తర్వాత వెళ్ళమనీ అంది. నాకూ ఏదైనా ఉద్యోగం వెళితే బాగుండు. మీరు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారట కదా? అక్కడ నాకేదైనా ఉద్యోగానికి అవకాశం వుంటే చూస్తారా?” ఆశగా అడిగింది.

“అయితే ఈ చలికాలం అంతా ఈ ఊళ్ళోనే వుంటావన్నమాట!” అంది జేన్ ఆమె ప్రశ్నకి జవాబివ్వకుండా, ఆసక్తిగా.

“అవును. ఇక్కడ అత్తా వాళ్ళింట్లో నాకు బాగా అలవాటే. సింక్లెయిర్ కూడా చాలా సాయంగా వుంటారు.”

“మీ అత్తకి మా ఫ్రాన్సిస్ కూడా చాలా నచ్చినట్టున్నాడు కదూ?”

“ఆ మాటా నిజమే. అసలు మీరిక్కడ వున్నప్పుడే ఆయన కూడా మీతోపాటే వుంటే బాగుండేది కదా?” అంది మేరీ అమాయకంగా. జేన్ నవ్వి, ఆమెని హత్తుకుని, వీడుకోలు చెప్పి క్రాస్ హాల్ ఎస్టేటుకి బయల్దేరింది.

క్రాస్ హాల్ ఎస్టేటులో భవంతీ, గదులూ తాము వున్నప్పుడెలా వుండేవో సరిగ్గా అలాగే వున్నాయి. ఫ్రాన్సిస్ ఏదీ మార్చనీయలేదు. భోజనం చేసి, లిల్లీ, పిల్లలూ విశ్రాంతి తీసుకుంటుంటే, ఫ్రాన్సిస్ స్టాన్లీనీ, జేన్ నీ ఎస్టేటంతా తిప్పి చూపించాడు. ఎస్టేటు పనివాళ్ళ కోసం, పాలేర్ల కోసం తను కట్టించి యిచ్చిన పక్కా యిళ్ళూ, చిన్న చిన్న పొలం ముక్కలూ అన్నీ తిప్పి చూపించాడు. పని వాళ్ళూ, పాలేర్లూ అందరూ జేన్ ని గుర్తుపట్టి పలకరించారు. ఇంట్లో నౌకర్లయితే జేన్ తో అన్ని కబుర్లూ చెప్పించుకొని గానీ వదల్లేదు. ఉద్యోగం ఎలా వుందో ఎల్సీ ఆరోగ్యం ఎలా వుందో, అసలు పెగ్గీ ఇంట్లో ఎలా సర్దుకునారో, అన్ని విషయాలూ మర్చిపోకుండా అడిగి మరీ చెప్పించుకున్నారు.

అందరితో కరువు తీరా మాట్లాడి జేన్ తనకని కేటాయించిన గదిలోకి వెళ్ళింది. పూర్వాశ్రమంలో ఆ గదినే తానూ, చెల్లీ పదిహేనేళ్ళపాటు వాడుకున్నారు. అంతా తను ఉన్నప్పుడు ఎలావుండేదో అలాగే ఉంది. రాత టేబిలూ, పడకా, దిండూ, దుప్పటీ అన్నీ అలాగే సర్దించాడు ఫ్రాన్సిస్. జేన్ మనసంతా ఒకలాటి ఆనంద విషాదాల్తో నిండిపోయింది. తన పూర్వపు గదిని చూసిన ఆనందం, ఇక ఆ గదికీ తనకీ ఋణం తీరిపోతుంది కదా అన్న విషాదమూ అలముకున్నాయామెని.

“పెద్దమ్మాయి గారూ? ఏదైనా కావాలాండీ?” సూసన్ తలుపు తట్టి లోపలికొచ్చింది.

“లేదులే సూసన్,” అనబోయింది జేన్. కానీ ఈ క్షణం లో తనకి ఇంకో మనిషి తోడూంటే బాగుండనిపించింది.

“లోపలికి రా సూసన్. కొంచెం తల దువ్వుతావా? బాగా అలసటగా వుంది,” అంది.

సూసన్ లోపలికొచ్చి దువ్వెన తో జేన్ తల దువ్వసాగింది.

“ఇక్కడంతా మీకు బాగానే వుంది కదా అమ్మాయి గారూ? ఫ్రాన్సిస్ సారయితే మీకే ఇబ్బందీ కలగకూడదని లక్ష సార్లు చెప్పారు. మీ గది కూడా దగ్గరుండి సర్దించారు,” సూసన్ చెప్పింది.

“లేదు సూసన్. అంతా బానే వుంది. ఎల్సీ ఇప్పుడు ఇక్కడ నాతో వున్నట్టయితే నేనసలు ఇక్కణ్ణించి వెళ్ళిపోయానన్న విషయం కూడా మర్చి పోయేదాన్ని. మీరంతా కూడా హాయిగా బాగున్నారు. ఇహ నేనే దిగులూ లేకుండ ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను.”

ఉన్నట్టుండి జేన్ కళ్ళు నీటితో నిండిపోయాయి. ఆ ఇంటినీ, ఫ్రాన్సిస్ నీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోవాలేమో అన్న ఆలోచన ఆమెని అతలాకుతలం చేసింది కాసేపు.

     ***

ఆ రాత్రి భోజనాల బల్ల దగ్గర కూడా జేన్ ఏమీ మాట్లాడలేకపోయింది. భోజనాలు ముగిసింతర్వాత ఫిలిప్స్ కుటుంబం నిద్రకి ఉపక్రమించారు. జేన్ లేచి వెళ్ళబోతూండగా

“జేన్, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు మార్పులు చేసింతరవాత లైబ్రరీ గది కూడా చూడలేదు. అక్కడ కాసేపు కూర్చుందాం రా! మళ్ళీ నిన్నెప్పుడు చూస్తానే ఏమో! నీకు నౌక దగ్గరికొచ్చి వీడుకోలు చెప్పే ధైర్యం నాకు లేదు.” ఫ్రాన్సిస్ కూడదీసుకుని అన్నాడు.

మౌనంగా జేన్ అతని వెంట లైబ్రరీ గదిలోకి నడిచింది. ఆ రోజు మేనమామ ఉత్తరాలు ఫ్రాన్సిస్ తో కలిసి చదివిన తర్వాత ఆమె ఆ గది మళ్ళీ చూడలేదు.

ఫ్రాన్సిస్ టేబిల్ సొరుగు తెరిచి కొన్ని కాగితాలూ, కొంచెం డబ్బు పట్టుకొచ్చాడు.

“జేన్! గుర్తుందా? నువ్వు మీ గదిలో వున్న సామానంతా అమ్మేసి ఆ డబ్బు మీకివ్వమని అడిగావు. ఆ సామాను నాకు చాలా ఇష్టం. ఈ ఇంట్లో అదీ ఒక ముఖ్య భాగమనిపిస్తుంది నాకు. అందుకే ఆ సామానంతా నేనే కొనేసాను. మార్కెట్ లో వాటి ధర ఎంతుంటుందో ఖచ్చితంగా లెక్క వేయించాను. ఆ లెఖ్ఖంతా ఈ కాగితాల్లో వుంది. ఇదిగో డబ్బు. ఈ డబ్బు నీదే. ధర్మంగా నీకు ఒక్క కానీ కూడా ఇవ్వడంలేదు నేను. నీ స్వాభిమానం ఎంత విలువైనదో నాకు తెలుసు. ఆస్ట్రేలియా చాలా దూర దేశం. ఈ డబ్బు నీకు పనికొస్తుంది. కాదనకుండా వుంచుకో!” డబ్బూ కాగితాలూ ఆమె చేతిలో పెట్టాడు.

మౌనంగా అవన్నీ అందుకుంది జేన్.

“జేన్, నేను ఎస్టేటులో చేసిన మార్పులు నచ్చాయా? పార్లమెంటులో నేను చేసిన ప్రసంగాలు నచ్చాయా?” ఆశగా అడిగేడు.

గొంతు పెకలని జేన్ మళ్ళీ మౌనంగా తలాడించింది.

“జేన్! ఇవాళ నేనీ స్థితిలో వున్నానంటే దానికి కారణం నువ్వే. నీ ప్రోత్సాహమూ, చేయూతా లేకపోతే నేను ఈ పనుల్లో ఒక్కటి కూడ చేయగలిగే వాణ్ణికాదు.  నన్నొదిలి అంత దూరం వెళ్ళడానికి నీకు మనసెలా ఒప్పుతుంది జేన్? నాకయితే ఎవరో నా ప్రాణాన్ని సగానికి కొసి పట్టుకెళ్తున్నంత బాధగా వుంది!”

“అది మనిద్దరికీ మంచిది ఫ్రాన్సిస్!”

“జేన్! నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పటికైనా నీకా విషయం అర్థమైందనుకుంటాను. ఎప్పుడైనా నీకూ నాలాగె నన్నొదిలి వుండడం బాధగా అనిపిస్తే వెంటనే నాకుత్తరం రాయి. మరుక్షణం నీ ముందు వచ్చి వాలతాను. నీ మాట మీదే నేనీ ఎస్టేటు వ్యవహారాలు తలకెత్తుకున్నాను. నీకంటే ఈ డబ్బూ ఆస్తీ నాకు ముఖ్యం కావు.”

“ఆ సంగతి నాకు తెలుసు ఫ్రాన్సిస్. అందుకే నేను వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాను. ఈ ఎస్టేటో, లేదా నేనో, ఏదో ఒకటే నీ జీవితంలో వుండగలిగే విచిత్రమైన పరిస్థితిలో ఇరుక్కున్నాం ఇద్దరమూ. ఈ ఎస్టేటూ డబ్బూ, రాజకీయ హోదా వుంటే నువ్వు బడుగు వర్గానికి ఎంతైనా మేలు చేయగలవు. అటువంటప్పుడు మన స్వార్థానికి లొంగి బాధ్యతలనించి పారిపోగలమా? ఆలోచించు!” జేన్ ఆవేదనగా అంది.

“సరే! నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. కానీ, ఒక్కసారి నిన్ను నా చేతుల్లోకి తీసుకోనీ! నిన్న పెగ్గీనీ, పొద్దున మేరీనీ హత్తుకొని వీడుకోలు చెప్పావు. నన్నూ అలాగే చెప్పనీ! నీకోసం ఏదైనా వొదులుకోగలను నేను. నన్ను ఎప్పటికీ వదిలి వెళుతున్నావు జేన్!”

జేన్ మనసు కరిగిపోయింది. అతని దగ్గరగా వెళ్ళి మెడ చుట్టూ చేతులు వేసి ఆప్యాయంగా కౌగలించుకుంది.

“జేన్! ఆ పాపిష్టి వీలునామా మన జీవితాల్లోకి రాకపోయినట్టయితే, మనిద్దరికీ ఈ కౌగిలి శాశ్వతంగా దక్కి వుండేది. ఇప్పుడైనా మించిపోలేదు జేన్! మళ్ళీ ఆలోచించుకో. ప్రేమ లేకపోయాక ఎంత డబ్బూ, ఆస్తీ వుండి ఏం లాభం? ఈ పేద ప్రజల బాగుకోసం నేను నా ప్రేమని ఎందుకు వొదులుకోవాలి?” ప్రాధేయపడ్డాడు ఫ్రాన్సిస్.

“మన జీవితాలూ, ప్రేమలూ వీటన్నిటికంటే సంఘానికి మనం చేయగల మేలు ఎంతో పెద్దది ఫ్రాన్సిస్. ఇంకొన్నాళ్ళు పోతే నీకే ఈ విషయం అర్థమవుతుంది.”

“సరే! ఉత్తరాలు మాత్రం రాస్తూండు. నీ ఉత్తరాల బలంతోనే నేను బ్రతికున్నానని మర్చిపోవద్దు. వుంటా జేన్! ఎక్కడ వున్నా నువు సంతోషంగా క్షేమంగా వుండడమే నాక్కావల్సింది,” ఫ్రాన్సిస్ ఆమె చెక్కిలి నిమిరి వెళ్ళిపోయాడు.

జేన్ ఒంటరిగా ఆ గదిలో నిలబడిపోయింది. ఇదే గదిలో కొన్నాళ్ళ కింద విలియం డాల్జెల్ తో ఇలాగే అన్ని సంబంధాలూ తెంచుకుంది. ఆ రోజు ఇంత బాధా నొప్పీ అనిపించలేదు. తను చేస్తున్న పని సరికాదేమో నన్న అనుమానమే రాలేదు. బహుశా విలియం మనసులో తన పట్ల అంత పెద్ద ప్రేమ ఏదీ లేదన్న విషయం తన అంతరాత్మకి తెలిసి వుండడం వల్ల కాబోలు. ఇవాళ తన నిర్ణయం ఫ్రాన్సిస్ ని ఎంత నొప్పిస్తుందో తన మనసుకి స్పష్టంగా తెలుసు. అందుకే తను తీసుకున్న నిర్ణయం పట్ల తనకే నమ్మకం లేకుండా పోతూంది. తన జీవితంలో తనకి ఎదురైన ఒకే ఒక్క అద్భుతమైన ప్రేమని కాలదన్నుకుంటూందన్న భయం బాధిస్తూంది.

ఒక్క క్షణం ఆమెకి తన నిర్ణయాన్ని మార్చుకోవాలన్నంత ఆవేశం కలిగింది. గదిలో పచార్లు చేస్తూ అద్దంలోకి చూసుకుంది. తనేమీ అద్భుతమైన అందగత్తె కాదు. చదువూ సంస్కారం తప్ప తనదీ అని చెప్పుకోవడానికి ఈ ప్రపంచంలో చిల్లి గవ్వ కూడా లేని మనిషి తను. తనని ప్రేమిస్తున్నానని ఫ్రాన్సిస్ అంటూంటే అది నిజమే అయుండాలి. తన దగ్గర ఏమాశించి అతను అబధ్ధాలాడతాడు? ఆశించడానికి తన దగ్గర ఏముందని? ఫ్రాన్సిస్ నిజంగానే తనని ప్రేమిస్తున్నాడు. తనే మూర్ఖంగా, అర్థంలేని ఆదర్శాలతో చేతికందిన అదృష్టాన్ని కాలదన్నుకుంటోంది.

కానీ ఫ్రాన్సిస్ మంచి నాయకుడిగా రూపు దిద్దుకుంటున్న మాటా నిజమే. తన మాటను తూచ తప్పకుండా పాటించేంత నమ్మకం అతనికి తనమీద. తన ఆలోచనలూ, ఆశయాలూ అన్నీ అమలులో పెట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. పైగా తను ఫ్రాన్సిస్ ని పెళ్ళాడితే ఎల్సీ సంగతి? ఇక్కడే వుండి అతనికి దూరంగా వుండడం మాత్రం తనకి అసాధ్యం.

తన ముందున్న రెండు దారుల్లో ఏ దారి ఎంచుకోవాలో అర్థం కాక జేన్ ఆ రాత్రంతా మథనపడింది.

తన చేత్తో తనే మూసుకున్న తలుపుల ముందు ఆమె మనసు చాలా సేపు తారట్లాడింది.

      ***

ఆ పైవారమే జేన్, ఎల్సీ, హేరియట్ ఫిలిప్స్, ఫిలిప్స్ కుటుంబాన్నీ, వాళ్ళ ఆశలనీ దిగుళ్ళనీ మోస్తూ వాళ్ళెక్కిన పడవ ఆస్ట్రేలియాకి బయల్దేరింది.

(సశేషం)

On Being Called a Film Critic…!

unnamed
ఏరా ఇంత ఆలోచిస్తూ సినిమాని అసలు ఎంజాయ్ చేశావా?” అన్నాడు మా అన్నయ్య ఆశ్చర్యపోతూ.
ఒక్క క్షణం ఆలోచించి…
“ఏమో…అలా ఆలోచిస్తూనే నేను సినిమాని ఎంజాయ్ చేస్తానేమో!” అన్నాను నేను. 
డిగ్రీ మూడో సంవత్సరంలో అనుకుంటాను, అప్పటికి లిటరరీ థియరీలు, ఫిల్మ్ క్లబ్ లో ప్రపంచ సినిమాలూ చూసి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్న టైం అది. సినిమాని ఒక లిటరరీ టెక్స్టులాగా తీక్షణంగా చూసి, ఆలోచించి, అర్థాలుతీసి, విశ్లేషించకపోతే సరైన జస్టిఫయబుల్ అనుభవంలాగా తోచని కొత్తబిచ్చగాడి బిహేవియర్ సమయం అది. మా అన్నయ్య మాత్రం చల్లగా (జాలిగా అని నా డౌట్) “ఇవివి సత్యనారాయణ సినిమాకి ఇంత అనాలిసిస్ అవసరమా?” అని తేల్చిపారేసిన జ్ఞానోదయపు క్షణం అది.
కానీ ఎందుకో అలవాటుపోలేదు.
సత్యజిత్ రే, ఘటక్, శ్యామ్ బెనెగల్, మణికౌల్, అకిరాకురసోవా, మాజిది మాజిది లాంటి మాస్టర్స్ ని చూశాక మైండ్ లో ఏవో కొన్ని నరాలు మళ్ళీ అతుక్కోకుండా తెగిపోయాయనుకుంటాను. అప్పటివరకూ చూసి ఎంజాయ్ చేసింది ఏదో సిల్లీ ట్రివియల్ గ్రాటిఫికేషన్స్ లాగా అనిపించడం మొదలయ్యింది. అప్పుడప్పుడూ, అక్కడక్కడా కొన్ని సినిమాలు తప్ప మిగతావి అంతగా గౌరవప్రదంగా అనిపించడం మానేసాయి.
దానికి యాంటీడోట్ యూనివర్సిటీలో పడింది.
ఒక క్లాస్ మేట్ ఉండేవాడు. ఫిల్మ్ అప్రిసియేషన్, ఫిల్మ్ క్రిటిసిజం, అండర్ స్టాండింగ్ సినిమా సబ్జెక్టులు శ్రధ్ధగా చదవడంతో పాటూ బాలకృష్ణకి పిచ్చఫ్యాన్. దానికి తోడు, ఒకటిన్నర గంట ఉండే ఇంగ్లీష్ సినిమాకి నలభైరూపాయల టికెట్టు పెట్టి చూడటం “గిట్టుబాటు కాదు” అని, కేవలం తెలుగు, హిందీ సినిమాలు మాత్రమే చూడటానికి ఇష్టపడే ఒక ఇంట్రెస్టింగ్ నమూనా.
మేమెప్పుడైనా సరదాగా ఏడిపిస్తే, “యూ బ్లడీ ఎలీటిస్ట్ ఫెలోస్! లెట్ మీ ఎంజాయ్ మై కైండ్ ఆఫ్ సినిమా” అనేవాడు.
కొంచెం సీరియస్గా కల్చరల్ స్టడీస్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ ఫర్ డెవలప్మెంట్ లాంటి సబ్జెక్టులు కలగలిపి చదువుతూ ఉంటే మా బాలకృష్ణ ఫ్యాన్ ఫిక్సేషన్ ఏమిటో, మేము నిజంగానే ఎలీటిస్టులం ఎలా అయ్యామో అర్థమయ్యింది.
హైబ్రో, లోబ్రో కల్చర్ల పాలిటిక్స్ మొదలు, సినిమా అనే కొత్త మతం ఇమేజెస్ తో మైండ్ ని ఎంతగా మానిప్యులేట్ చేస్తోందో తెలుసుకోవడంతో పాటూ, “టేస్ట్” పేరుతో మనలోనూ పెరిగే ప్రెజుడిస్ లో ఆధిపత్యభావజాలం ఎంతుందో అదీ అర్థమయ్యింది.
కానీ ఏంచేద్దాం….
మనిషన్నాక నాలెడ్జిని పెంచుకుంటాడు. దాన్ని బట్టి క్రిటికల్ థింకింగూ అలవర్చుకుంటాడు.
కేవలం చూసి, స్పందించి ఆనందించడంతో తృప్తిపడకుండా, విశ్లేషించి-వివరించి సంతోషపడతాడు.
ఎవడి జ్ఞానాన్ని బట్టి వారి గ్రాటిఫికేషన్. ఎవరి అండర్సాండింగుని బట్టి వారి అనాలిసిస్.
అందుకే క్రిటిసిజంలో…ముఖ్యంగా పాప్యులర్ ఆర్ట్ అయిన ఫిల్మ్ క్రిటిసిజంలో ఆబ్జక్టివిటీ అనేదానికి పెధ్ధప్రాముఖ్యతలేదు.
film_critic_1294385
ఒకే సినిమాకి పది వేరు వేరు రివ్యూయర్ల అభిప్రాయాలు పదిరకాలుగా ఉండొచ్చు. అంతాకలిపి కొన్ని సినిమాలకి ఒకటే కావొచ్చు. రేటింగుల్లో తేడాలుండొచ్చు. ఈ మధ్యకాలంలో బ్లాగులు, ఫేసుబుక్కూ, ట్విట్టర్ల పుణ్యమా అని ఆడియన్స్ రివ్యూలు క్షణక్షణం అప్డేట్స్ లాగా వచ్చేస్తున్నాయ్. దాన్నీ ఎవరూ ఆపలేం. చూసిన ప్రతివారికీ అభిప్రాయం చెప్పే హక్కుంటుంది. కాకపోతే “క్రిటిక్” అనేవాడు(అనుకునేవాడు/ఎవడో వాడు క్రిటిక్ అని చెప్పినవాడు) చెబితేమాత్రం కౌంటర్ అటాక్ లు ప్రారంభం అవుతాయి.
వాడేదో సినిమాకి పెద్ద ద్రోహం చేసేస్తున్నాడనే ఫీలింగ్. అభిప్రాయాల మీద క్రిటిక్ అనేవాడేదో గుత్తాధిపత్యం తీసుకున్నట్లు. అన్నమాటకు ఆధారాలు సరఫరాచేస్తానని బాండ్ పేపర్ రాసి ఇచ్చినట్టు మాట్లాడేస్తుంటారు. “చెత్త అన్నావ్! ఇప్పుడు ఆ సినిమా హిట్ అయ్యింది” అనో, “బాగుంది చూడండి అన్నావ్! కలెక్షన్లు నిల్ అంటా” అని ఎకసెక్కాలు పోతుంటారు. క్రిటిక్ అనేవాడు సినిమా చూస్తుండగా తను పొందిన అనుభవాన్ని, తనకున్న జ్ఞానాన్ని కలగలిపి సినిమా ఎలాంటిది అనే నిర్థారణకు వస్తాడుగానీ, ఆడియన్స్ అనే ఒక కాల్పనిక యూనిట్టు ఆ సినిమాకు ఏ విధంగా రియాక్టు అవుతుంది అనే బేరీజు వెయ్యడానికి రాడు. సినిమాపై తనకున్న అవగాహనతో సినిమా లోని మెరిట్స్ ని, లోటుపాట్లని ఎత్తిచూపడానికి ప్రయత్నిస్తాడేగానీ ఆడియన్స్ ఈ సినిమా చూసి ఎలా స్పందిస్తారనే ప్రిమొనిషన్ కోసం రాడు.

షో పూర్తయిన గంటలోగా రివ్యూ రాయాల్సి వస్తున్న ఈ కాలంలో అంతకన్నా ఆలోచించే ఓపికా, సమయం సోకాల్డ్ క్రిటిక్ కి ఉండవు. ఫ్యామిలీ హీరోల అజెండాల్ని, బిగ్ బడ్జెట్ సినిమాల ఇంట్రెస్టుల్ని, ఓవర్సీస్ రైట్స్ రేట్లలో తేడాల్ని నిర్దేశించే క్రిటిక్స్ ని వదిలేస్తే మిగతావాళ్ళు కేవలం సినిమా మీద ప్రేమతో తమ ఎన్నో శుక్రవారాల్ని సినిమాలు అనబడే అవమానాల్ని వెండితెరమీద కనురెప్పవెయ్యకుండా చూసి, భరించికూడా ఇంకా అడపాదడపా వచ్చే మంచి సినిమాల కోసం వెతుకుతూ, వేచి ఉంటారనే సంగతి మర్చిపోకూడదు.

ప్రతి ప్రేక్షకుడూ పొటెన్షియల్ రివ్యూయర్/క్రిటిక్ అవుతున్న ఈ సమయంలో “సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ క్రిటిక్” అంటూ సినిమాల గురించి రాసేవాళ్లను ఆరళ్ళు పెట్టడమూ చెల్లదు. వీలైతే మీకున్న జ్ఞానంతో మీ రివ్యూ మీరు రాసుకోండి. అప్పుడు మీరూ క్రిటిక్ అవుతారు. సింపుల్.

-కత్తి మహేష్ కుమార్

పాత చొక్కా: వొక జ్ఞాపకం బతికొచ్చిన సంబరం!

Velturu2

అవును ఆ పాత చొక్కా ఎప్పుడూ అలా
నా మనసు కొక్కేనికి వేలాడుతూనే వుంది

బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ కళ్ళు చిట్లిస్తూ
సూది బెజ్జంలో ప్రేమ దారాన్ని చేర్చి కుడుతున్నట్టు

స్నేహితుల తోపులాటలో చినిగి వస్తే నాతో పాటు
తననూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న అతుకు వేస్తున్నట్టు

మాసి పోయినప్పుడల్లా నెమ్మదిగా పులుముతుంటే
రంగు వెలసిన జ్నాపకమేదో మసకగా కంటి నీటి పొర వెనక కదులుతున్నట్టు

యింకా వదలని పిట్ట రెట్ట మరక చెవిలో
ఆ కువ కువ వేకువనింకా పల్లవిగా ఆలపిస్తున్నట్టు

వీచే చల్లగాలిని ఆప్యాయంగా ఒడిసిపట్టి అలసిన
దేహానికి తన బిగువులో కాసింత సేద దీరుస్తున్నట్టు

ఆ జేబులో దాచుకున్న గులాబీ రేకు
తననింకా ఆ మలుపుకు గురుతుగా దాచి వుంచినట్టు

ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!

 

1

IMG_6555

మంచి కవిత్వం ఎలా వుంటుందో యింతవరకూ యెవరూ చెప్పలేదు. చెప్పడానికి కావాల్సిన పదాలు లేవని మాత్రం అంటూనే వున్నాం. మంచి కవిత ఎందుకు మంచిదైందో చెప్పడానికి మళ్ళీ కవిత్వ వాక్యాలనే తిరగదోడుతూ వుంటాం. ఎందుకంటే, కవిత్వాన్ని కవిత్వంతో మాత్రమే కొలవగలమనీ, వచనంతో తూయలేమనీ అనుకుంటాం కనుక!

చాలా వరకు ఇది నిజమే! పరిమితమైన  నా అనుభవంలో నాకు తెలిసివచ్చింది కూడా ఇదే!

కవిత్వాన్ని గురించి మొత్తంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి సమస్య మామూలే! కాని,  విడివిడిగా వొక కవిత తీసుకొని మాట్లాడుతున్నప్పుడు  చెప్పే మాటలు కూడా నాకు అంతగా తృప్తినివ్వవు. కవిత చదివాక కలిగే వొకలాంటి తృప్తినీ, ప్రశాంతతనీ వచనంలో రాయలేకపోయినా, కనీసం కొంత మాట్లాడితే బాగుణ్ణు అనుకొని, గత కొద్ది కాలంగా కొన్ని కవితల ముందు ఎంతో కొంత నేర్చుకోవాలని తపించే విద్యార్థిలా నిలబడి, మాటలు కూడదీసుకుంటున్న సమయంలో అనుకోకుండా వర్మ రాసిన ఈ “పాతచొక్కా” కవిత తారసపడింది.

పాత చొక్కా…!

కవిమిత్రుడు హెచ్చార్కె కలిసినప్పుడల్లా తనకీ నాకూ జరిగే అనేకానేక సంభాషణల్లో ఈ పాత చొక్కా వొకటి. ఖమ్మంలో నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు హెచ్చార్కె తరచూ విప్లవ రచయితల సంఘం బాధ్యుడిగా ప్రసంగాలు ఇవ్వడానికి వస్తూండే వాడు. అతని ప్రసంగాలంటే నాకు ఇష్టంగా వుండేది. అంతకంటే ఎక్కువగా – అతనెప్పుడూ వేసుకొచ్చే వొక నీలంరంగు చొక్కా అంటే మరీ  ఇష్టంగా వుండేది. టీనేజర్ని కదా, నా జర్నీ కొంచెం అలాగే వుండేది! నాకు కూడా కచ్చితంగా అలాంటి నీలం రంగు చొక్కానే – సన్నటి వైట్ చెక్స్- తో వుండేది.  ఇద్దరమూ ఆ చొక్కాల మీద నిజంగానే   ఇష్టంగానే  మాట్లాడుకునే వాళ్ళం, విప్లవ రాజకీయాలు కాసేపు పక్కన పెట్టేసి!

కొంత కాలానికి మా స్నేహం పాతబడింది, ఆ నీలం చొక్కా మాదిరిగానే!

కాని, ఆ జ్ఞాపకం వుందే, అది ఇప్పటికీ వర్మ చెప్పినట్టు-  “మనసు కొక్కేనికి వేలాడుతూనే” వుంది ఎప్పటికప్పుడు  కొత్తబడుతూ!

ఇప్పుడు ఈ కవిత  చదివాక వెంటనే అనిపించింది, అసలు ఇన్నాళ్ళుగా నాతో వున్న, నాలో వున్న ఈ అనుభవాన్ని నేనే  ఎందుకు రాయలేకపోయానా అని. బహుశా, మంచి కవిత అనేది మనలోని అలాంటి వొక అశక్తతని కూడా కొన్ని సార్లు గుర్తుచేస్తుందేమో!

ఈ  కవిత మొదట చదివిన కొద్దిసేపటికి, ఆ తరవాత ఇంకో రెండు సార్లు చదువుకున్నాక ఇంకా అనిపించింది, రాసినా  నేను  ఈ కవిలా రాయలేను అని! మరీ దగ్గిరగా వుండే అనుభవం రాయడం ఎంత కష్టం!?

వొక  మంచి కవిత చేసే యింకో గొప్ప పని ఏమిటంటే — అది మన మనసు తెలిసో తెలియకో విధించుకున్న కొన్ని పరిమితుల్ని కూడా గుర్తు చేస్తుంది. ఆ పరిమితుల్ని తెగ్గొట్టి ఆ అనుభవాన్ని తిరిగి ప్రేమించడానికి మనల్ని సిద్ధం చేస్తుంది!

అందరమూ అనుకున్నట్టు- ఇలాంటి పని చేసే కవిత్వానికి, ఆ శక్తి ఆ కవిత్వ వాక్యం నించి మాత్రమే రాదు. గొప్ప కవిత్వ వాక్యాలు రాసే కవులు మనకి చాలా మందే వున్నారు. కాని, వాక్యాలు ముందు పుట్టి తరవాత భావాన్ని చొక్కాలా వేసుకునేది మంచి కవిత్వం కాదని  ఖాయంగా చెప్పగలను.

2

ఈ కవితలో ప్రత్యేకించి చెప్పాల్సింది: metaphorization – పదచిత్రీకరణ.  సాధారణంగా చలనమున్న పదచిత్రాల్నీ(dynamic images),  ప్రతీకల్ని (ఉదాహరణకు: సెలయేరు) తీసుకోవడంలో వున్న సౌలభ్యం చలనరహితమైన పదచిత్రాల్ని(static images), ప్రతీకల్ని (ఉదాహరణకు: ఈ కవితలో పాత చొక్కా) తీసుకోవడంలో లేదు. ఇక అలాంటి చలనరహిత ప్రతీకల్ని చలనశీలమైన భావాల్ని పలికించడానికి ప్రయత్నిస్తే  చాలా సందర్భాల్లో కవిత శిల్పం దెబ్బతింటుంది. ఆ ఇబ్బందిని గట్టెక్కడం శిల్ప పరంగా ఈ కవితలో వొక నిర్మాణ  విశేషం.

ఆ ఇబ్బందిని గట్టెక్కడానికి ఈ కవి  చేసిన పనేమిటంటే, ఆ చలనరహితమైన ప్రతీకలూ వస్తువుల వెంటనే చలనశీలమైన వొక అనుభూతిని ఆసరా తీసుకున్నాడు.

ఉదాహరణకు ఇక్కడ “బొత్తాం” “చినుగు” చూడండి:

  1. బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ…(బొత్తాం – కళ్ళు చిట్లించి, ప్రేమ దారంతో  అమ్మ)
  2. స్నేహితుల తోపులాటలో చినిగి… ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న (చినుగు – దాన్ని కుట్టే నాన్న)

 

ఈ continuity ని  చివరంటా సాధించింది కవిత.

రెండో నిర్మాణ విశేషం: కవి ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న క్రియా పదాలు. కవితలో రెండో పంక్తి లోని “వేలాడుతున్న” అనే పదం మొదలుకొని, చివరి పంక్తిలో వున్న “దాస్తున్న” దాకా క్రియ అనేది నిష్క్రియగా (dysfunctional)  కాకుండా, చాలా నిర్దిష్టమైన పని (very functional) కోసం వుపయోగించడం ఈ కవితలో బలంగా కనిపిస్తుంది.

మూడో విషయం: తన అనుభూతిని కవి ఎలాంటి frame నించి imagine చేస్తున్నాడో, ఆ ఊహకి ఎలాంటి రూపమిస్తున్నాడో అన్నదాన్ని బట్టి కూడా ఆ కవిత గుణం తెలుస్తుంది. అంటే, కవిత మొత్తంలో గుండె చప్పుడూ, ఆలోచనల అలజడీ కలగలిపే వాక్యాలు కొన్ని వుంటాయి. ఆ వాక్యాల్లో కవి పొదుపుగా దాచుకున్న అనుభూతి వినిపిస్తుంది. ఈ కవిత మొత్తం సాంద్రతని వొడిసిపట్టుకున్న వాక్యం నాకు అర్థమైనంత మటుకు ఇది:

ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!

3

ప్రతి బతుకు పుస్తకంలో అనేక  జ్ఞాపకాలుంటాయి. కొన్ని యిట్టే స్మృతిలోంచి జారిపోతాయి. అవి అలా జారిపోయాయని కూడా మనకి తెలియదు.  అలా జారిపోకుండా పట్టుకోగలిగిన జీవితం ఎక్కువ సఫలమైనట్టు అనుకుంటాను నేను. అలా జారిపోయిన వాటిని పట్టుకొచ్చి మన చేతికిచ్చేది మంచి కవిత అనుకుంటాను. అలాంటి ఎన్ని విస్మృత జ్ఞాపకాల్ని బతికిస్తే అంతగా ఆ కవిత బతుకుతుంది.

ఆ కొలమానంతో ఈ  కవిత – a celebration of the retrieval of a  memory – వొక జ్ఞాపకం బతికొచ్చిన సంబరం!

 – అఫ్సర్

కొంగలు చెలగి…!

1060266_4115994795295_588718941_n

-మృత్యుంజయ్

11937_578811308820340_1396284388_n

‘ఈగ’ చెప్పే కథనం

drushya drushyam 24

 

ఏదీ ముందుగా తెలియదు. అదే చిత్రం.

అవును మరి. మనుషులను చిత్రీకరిస్తున్నప్పుడు మొదట్లో తెలియలేదు గానీ, వారిపై వాలిన ఈగలు నిదానంగా కనిపించడం మొదలైంది. చిత్రానికి సంబంధించిన సిసలైన వాస్తవికతను అవే బహు చక్కగా ఆవిష్కరిస్తున్నవి!

ఇదే కాదు, గత వారం ముసలమ్మ వెన్నుపై కూడా ఈగలు ముసిరినవి. అయినా అంతా ఒక అనివార్య ప్రస్థానంగా ఆ ముసలమ్మ వొంగి అలా నడుస్తూనే ఉండింది. తప్పదు మరి!

ఈ చిత్రంలోనూ అంతే. ఆ మహిళ ఎంత ముద్దుగున్నది. ఎంత హాయిగా నిద్రిస్తున్నది. గదువపై, పెదవి మీద
వేలుంచుకుని ఆ నిద్రాదేవే విస్మయపోయే రీతిలో ఆ తల్లి ఎంత హాయిగా సేద తీరుతున్నది!

కాళ్లు రెండూ చాపుకుని నిద్రించే జాగా కూడా లేని ఆ మహిళ.. ఆ పట్టపగలు…ఇంత తిన్నాక…అట్లే…ఆ ఎండ వడలోనే కాసేపు కునుకు తీయడానికని అట్లా వొరిగి ఉంటుంది! కానీ, ఎంత మంచిగున్నది. ఆ స్థితి గురించి ఈ చిత్రమే మాట్లాడుతుంటే ఎంత బాగున్నది!

ఇదే ఈ చిత్రం విశేషం అనుకుంటే, తలను అలవోకగా చుట్టుకున్న ఆ చేతిపై ఈగ వాలడమూ ఇంకో విశేషం!
ఎట్లా? అంటే కొంత చెప్పాలి.

మొదట్లో ఆయా మనుషుల జీవన స్థితిగతులను – వాళ్లు నిలుచున్న చోటు, కూర్చున్న చోటు, లేదా ఇలా విశ్రమించిన చోటును బట్టి తెలియజెప్ప వచ్చని అనుకున్నాను. కానీ, నగరంలోని అనేక బస్తీలను చుడుతూ ఫోటోగ్రఫి చేస్తూ ఉండగా, ఒక్కో చిత్రాన్ని నాకు నేనే చూసుకుంటూ ఉండగా మరెన్నో రహస్యాలు తెలుస్తున్నవి- ఈ చిత్రంలో మాదిరే!  అవును, వాలిన ఈగ -మనుషుల సమస్థ దుస్థితిని చెప్పకనే చెబుతుందని తెలిసి వస్తున్నది.

ఇదొక అనుభవ పాఠం. అవును. ఇదే మొదటి పాఠం కాదు, అంతకు ముందు ఢిల్లీలో చిత్రించిన ఒక ఫోటో ఈ సంగతిని మొదటిసారి తెలియజెప్పింది. అప్పుడు ఒక మగాయన  చిత్రం తీశాను. అతడొక వర్కర్….చిరునవ్వుతో నా కెమెరా వైపు చూస్తూ ఉంటాడు. తనకూ నాకూ మధ్య ఒక పల్చని ఇనుప స్తంభం ఉంటుంది. దానిపై వాలిన ఒక ఈగ ఆ చిత్రంలో కనబడతుంది. ఆ ఈగ ఔట్ ఫోకస్ లో ఉండగా అతడి చిరునవ్వు మాత్రం క్లియర్ గా కానవస్తూ ఉండగా ఆ చిత్రాన్ని క్లిక్  చేశాను. అందులో నేను తెలియకుండానే చెప్పిందేమిటంటే, అది ఎవరైనా కావచ్చును, ఎక్కడైనా కావచ్చును, వాళ్ల స్థితిగతులు ఎంత దుర్భరంగానైనా ఉండనీయండి. కానీ, పెదవులపై దరహాసం మాత్రం చెక్కు చెదరదు.  అదట్లే ఉంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ చిరునవ్వు ఆరిపోక పోగా జీవన తాత్వికతను అర్థం చేసుకున్న అనుభవంతో, ఆ చిరునవ్వు మరింత హృద్యంగా మనల్ని హత్తుకుంటుంది. మన సంపద్వంతమైన జీవితాన్ని ఆ చిరునవ్వు కసిగా కాటువేస్తుంది. ఉదాహరణకు ఈ చిత్రమే చూడండి.

అదమరచిన ఆ యువతి, పెదాలపై వేలుంచుకుని విస్మయపోతూనే నిద్రించడం. ఆ కళ్లు, కనురెప్పలు, నుదుటిపై పచ్చబొట్టు, చేతికి ఏదో కట్టుకున్న విశ్వాసం…అట్లే తన ఒంటిపైన రంగుల చీర, డిజైన్… అంతా కూడా ఆ స్త్రీ తాలూకు సౌందర్యాభిలాష, సఖమయ జీవన లాలస, వదనంలో ఒకవైపు తొణికే ఉల్లాసం అదే సమయాన రవంత విచారం. చిన్న భయవిహ్వలత…ఏదో తెలియని భీతి.

పదే పదే ఆమె మొహాన్ని చూడండి. అది వాతావరణం వల్ల కావచ్చు, అక్కడి తక్షణ పరిసరాల వల్ల కావచ్చు, లేదా దశాబ్దాల తన ఉనికి వల్లా ఏర్పడిన అసంబద్ధ స్థితి వల్లా కావచ్చును, కాసింత అభేదం. అస్తిత్వ ఘర్షణ…బయట  రోడ్డుమీద జీవిస్తున్న యువతి తాలూకు జీవన నిర్వేదం…అంతా కూడా ఆ చిన్న బండిలోనే..ముడుచుకున్న దేహంలోనే…మూసుకున్న కళ్లతోనే అంతా చెప్పడం…

నిజమే, తప్పదు మరి. ఎందరో ఉన్నారు. వీరిలో కొందరు కాలిబాట మీద బతుకుతారు. మరికొందరు వీధిలొ కాసింత జాగాలో ఎలాగోలా తల దాచుకుని జీవిస్తారు. ఇల్లూ వాకిలీ లేకుండానే ఎంతో మంది పట్టణంలో ఇట్లా జీవించే వాళ్లున్నరు. రేషను కార్డు, ఆధారు కార్డుల అవసరాలూ వీళ్లకు ఉంటాయి. కానీ, అంతకన్నా అవసరమైనది ఒక భద్రత. తల దాచుకునేందుకు ఇల్లు. అది లేనప్పుడు ఎక్కడో ఒక చోట ఎంత మైమరపించే నిద్రే అయినా కొద్దిగా కలవరాన్ని, అపశృతిని పలకనే పలుకుతుంది.అదే బహుశా ఆమెలో నేరుగా కానరాని అశాంతినీ ఆవిష్కరిస్తున్నది. అందుకు ప్రబల సాక్షం – ఈగ.

అవును.  అంత హాయిగా ఒరిగినా, ఉన్న స్థలంలో ఒదిగినా, విశ్రమించిట్లే ఉన్నా, ఏ మూలో ఒక అస్తిరత్వం. అభద్రత. అసహజత్వం. ఆ ఒక్కటి చెప్పడానికి ఈ చిత్రం తప్పక ప్రయత్నిస్తుందేమో అని మనసులో అనుకుంటూ ఉండగా, తనని చట్టుముట్టి బాధించే ‘ఈగ’ రానే వచ్చింది…. చేతిపై వాలనే వాలింది. దాని ఉనికి నాకప్పుడు తెలియలేదుగానీ తర్వాత చూస్తే అది చాలా మాట్లాడుతున్నది. చూస్తూ ఉండగా నాకు అది చాలా విషయాలను వివరిస్తున్నది. అప్పుడనిపించింది, నా వరకు నాకు -అధోజగత్ సోదరసోదరీమణుల జీవితాలను చూపించే క్రమంలో ఒక్క ఈగ చాలు, వాళ్ల నిద్రని అనుక్షణం వాలి దెబ్బతీసేందుకూ అని!

మీరూ ఒప్పుకుంటారనే అనుకుంటాను. లేదంటే ఇంకాసేపు చూడండి…ఇంకొన్ని క్షణాల్లో…ఇంకాసేపు చూస్తే, ఆ మహిళ చేతుల్తో ఆ ఈగను చప్పున కొట్టి మళ్లీ నిద్రలోకి జారుకుంటుంది. కానీ, ఈగ మళ్లీ ప్రత్యక్షమవుతుంది.

అదే సిసలైన వాస్తవం. ఈ చిత్రం.

~ కందుకూరి రమేష్ బాబు

పిడికెడు పక్షి..విశాలాకాశం

417671_580561545289734_1052452842_n

పిడికెడు పక్షి.

తలపైకెత్తి చూచింది.యాభైరెండు ఫీట్ల ఎత్తైన దేవదారు వృక్షం పైనున్న తొర్రలోని తన గూడునుండి.విశాలమైన ఆకాశం నీలంగా..నిర్మలంగా కనబడింది.

కొత్తగా మొలచిన రెక్కలు.ఎంకా ఎగరడం తెలియని ఉత్సుకత.లోపల ఏదో తెలియని ఉద్వేగం.

చిన్ని కళ్ళతో తల్లిముఖంలోకి చూచింది.

తల్లి పక్షి కళ్ళనిండా శూన్యం.అభావం నిండిన ఒట్టి ఖాళీ.

తల్లిపక్షి కిందికి చూచింది.చాలా కింద,నేలపైన మగపక్షి సిద్ధంగా ఉంది.మెత్తని ఈకలు,పీచు,గడ్డి,ఆకులు..అన్నీ అమర్చి ఎదురుచూస్తోంది.పిల్లపక్షి ఒకవేళ ఎగరలేక కిందపడితే గాయపడకుండా ఉండడానికి.

తల్లి బిడ్డపక్షి ముక్కులోకి తన ముక్కును జొనిపి ముద్దాడింది.

రెండురకాల కిచకిచల ధ్వని.ఎడబాటు..వియోగం..బాధ..దుఃఖం..అన్నీ ఆ చిరుధ్వనిలో.

తల్లి తన స్వరసంకేతంతో కింద ఉన్న మగపక్షిని హెచ్చరించి అకస్మాత్తుగా పిల్లపక్షిని కిందికి నెట్టేసింది.

శిశుపక్షి కిందికి జారుతూ..ఉక్కిరిబిక్కిరౌతూ..పల్టీలుగొడ్తూ..అప్రయత్నంగానే అప్పటిదాకా మొలిచిన నునురెక్కలను విప్పి..చాచి..రిక్కించి.,

ఎగిరింది. మొట్టమొదటిసారిగా.

pidikedu

ఆశ్చర్యపోయిందది.తనింకా కిందికి జారిపోవడంలేదు.కాగా,పైకిలేస్తోంది.పైకి..ఇంకా పైపైకి.గాలిలో తేలిపోతూ.చెట్ల గుంపుల్లోనుండి,అడవిలోనుండి,నదులపైనుండి..విశాలనీలాకాశంలోకి.

చుట్టూ చూచింది.అన్నీ మేఘాలే.నీలిరంగు.చల్లగా.బంగారురంగు కాంతి.ఎటుచూచినా అనంతమైన నీలి.నిర్మలంగా.

పులకించిపోయింది పిడికెడంత పక్షిపిల్ల.

శిశుపక్షి సువిశాల అనంతాకాశాన్ని ఈదుకుంటూ పరుగెత్తుతోంది..మహానందంగా..పులకిస్తూ..గగనాన్ని జయిస్తూ.

తల్లిపక్షి అలా శూన్యంగా చూస్తూనేఉంది ఎగిరిపోతున్న బిడ్డ కనబడుతున్నంతసేపు.కనుమరుగయ్యేదాకా.

రెక్కలు రావడం..అందర్నీ విడిచి ఎగిరిపోవడం..జీవపరిణామంలో ఒక అతి సహజభాగంగా గుర్తిస్తూ.,

తల్లిపక్షి చెట్టు గూడులో మిగిలి.,

 

*                                                 *                                                                  *

 

తల్లిదండ్రులు లేని పిల్లలను అనాధలంటారుగదా.

అనాధలుకాని పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నదేమిటి.సంరక్షణ.ఆలనాపాలనా.ఇలా జీవించు.ఇలా ఆలోచించు.ఇవి విలువలు.ఇవి కావు.ఇది తప్పు.ఇది సరియైంది.ఇది నైతికం..ఇది కాదు.ఈ  దారిలోవెళ్తే బాగుపడ్తావు..ఈ దారిలోవెళ్తే జారిపడ్తావు.ఇవన్నీ చెప్పేవాళ్ళు తల్లిడండ్రులుగదా.పిల్లలకు ఇవేవీ చెప్పనివాళ్ళుకూడా తల్లిదండ్రులేనా.బాధ్యతారాహిత్యంతో పిల్లలను బలాదూర్ గా జన్నెకిడిచిపెట్టే తల్లిదండ్రులను సమాజం ఎలా అర్థంచేసుకోవాలి.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వమంటే ఒక కుటుంబానికి తల్లిదండ్రులవంటిదికదా.కుటుంబంలో పిల్లలు ఏమి చదవాలి.ఎక్కడ చదవాలి.ఎలా చదవాలి.ఏ వృత్తిలో స్థిరపడ్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది..ఇవన్నింటినీ   మార్గదర్శనం చేస్తూ తన ప్రజలను సరియైన దిశలో నడిపిస్తూ ప్రగతిపథంలో ముందుకు తీసుకుపోవలసిన గురుతర బాధ్యత ప్రభుత్వాలదేగదా.

కాని ఏం జరుగుతోందిక్కడ.

అసలు ప్రజలను పట్టించునే నాధుడున్నాడా.కనీస ప్రజావసరాలేమిటి.విద్య,వైద్య,ఉపాధి వంటి కీలక రంగాల్లోనైనా కనీస శ్రద్ద ఉందా ఏ నాయకుడికైనా.లక్షలకు లక్షలమంది యువకులు ఒట్టిగా బేవార్స్ గా రోడ్లవెంట తిరుగుతూ మెలమెల్లగా అసాంఘికశక్తులుగా మారుతూంటే చూచి పట్టించుకునే వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఉందా.అసలు ప్రజాసంక్షేమ దృష్టితో ఆలోచించి జనాన్ని కన్నబిడ్దలవలె కనీసవసతులతో అభివృద్దిచేయాలనే సంకల్పం ఉందా ఏ ఒక్కరికైనా.పూర్తిగా నీతిహీనమైపోతున్న ఈ వర్తమాన రాజకీయ వ్యనస్థను ఎవరు ఎలా సరిచేయాలి.

ప్రజలు అనాధలౌతూ,పాలకులు కోట్లకు పడగలెత్తుతూ,ఎల్లెడలా బాధ్యతారాహిత్యం విషవలయమై ఆవరించిఉన్న ఈ ప్రస్తుత సంక్లిష్ట సందర్భంలో తమతమ విధులను నిర్వర్తించవలసిన వాళ్ళు నిర్వర్తించనపుడు..ఏంచేయాలి.

pidikedu-image

     ఎవరోఒకరు..ఇపుడే ఇపుడు అని చొచ్చుకురాకుంటే ఈ అరాచక విధానం ఇలాగే కొనసాగుతుందిగదా.

ప్రతి ప్రజాప్రతినిధీ ఒక వ్యాపారి.ప్రతి అధికారీ ఎవరో ఒకరికి భృత్యుడు.ప్రతి పౌరుడూ ఒక పరాన్నభుక్కు.ఎవరికందిందివాడు ఎగబడి ఎగబడి దోచుకుతినడమే.అంతా నిస్సిగ్గు ప్రవర్తన.నిర్భయమైన విచ్చలవిడి దోపిడీ.అంతా బహిరంగ దురాక్రమణలే.అన్నీ మాఫియాలు.భూ మాఫియాలు.ఇసుక మాఫియాలు.విద్యారంగ మాఫియాలు.మీడియా మాఫియాలు.మెడికల్ మాఫియాలు.వెరసి ప్రజాజీవన రంగాలన్నీ మాఫియాలే.  ప్రజలేమో ఏది ఉచితంగా ఇస్తే దాన్ని ఎగబడి తీసుకునేందుకు సంసిద్ధులౌతూ..కలర్ టి వి లు,లాప్ టాప్ లు,గ్రైండర్లు,మిక్సీలు,ఉచిత బియ్యం.ఉచిత విద్యుత్..ఏదైనా.

ప్రజలకు ఏది అవసరమో అది చెప్పక,ఏది అవసరమో అది చేయక,ఏవి అవసరంలేదో వాటినిమాత్రం చేయిచాపితే అందేంతదూరంలో ఉంచి..చుట్టూ ఒక మాయ.ఒక ఉచ్చు.ఒక మత్తు.

ప్రతి ఇంట్లో ఒక దీర్ఘచతురస్రాకార రూపంలో ఒక ఉరిత్రాడు.అది టి.వి.జనాల్ని బానిసల్ని చేసి ముఖ్యంగా ఆడవాళ్ళ పని గంటల్ని బుగ్గిపాలు చేసేది.మనుషుల్ని పశువులవలె కోట్లక్కోట్లకు వేలంవేసి కొని ‘క్రికెట్’ పేరుతో లక్షలమంది యువజనాన్ని అనుత్పాదక శక్తులుగా మారుస్తూ ఒక నిరంతర విషక్రీడను ఈ దేశప్రజలపై రుద్దుతూ ప్రభుత్వాలే జూద వ్యసనాన్ని నల్లమందు వాడకాన్ని అలవాటు చేసినట్టు అందిస్తూ,ఏ టి వి చానెల్ ను చూసినా ఒంటిపై బట్టలతో రతిక్రీడ సలుపుతున్న నీచ భంగిమలతో..జుగుప్సాకరమైన శృంగార ప్రసారాలతో..దిక్కుమాలిన నిరంతర రాజకీయ చర్చలతో,ప్రసారాలతో..నీతిహీనమైన రాజకీయ వ్యభిచార ప్రస్తావనలతో..ప్రజలను తప్పుతోవపట్టించే తాయెత్తుల,రుద్రాక్షల,కేశాల,దేవతుల వ్యాపార ప్రకటనలతో..డబ్బిస్తేచాలు ఏ ప్రకటననైనా ప్రసారం చేస్తాం అన్న బాధ్యతలేని దుర్మార్గ చానెల్స్..ఇవన్నీ అవసరమా అసలు ఈ ఎనభైశాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన జనమున్న దేశంలో.

అన్ని రంగాల్లోనూ అతి.మనుషులకు అతి స్వేచ్ఛ..అతి ప్రవర్తన..అతి విశృంఖలత్వం..పిల్లలపై అతి గారాబం.అతి సంపాదన దాహం..అతి అధికార దాహం.అతి విజృంభణ..ఈ దేశంలో..ఎక్కడో ఏదో పట్టాలు తప్పుతున్న స్పృహ.శ్రీశ్రీ చెప్పినట్టు ‘కొంతమంది యువకులు పుట్టుకతో వృద్దులౌతున్నట్టు ‘ అనుభవాలు.పూర్తిగా మృగ్యమౌతున్న దేశ స్పృహ..దేశభక్తి..పౌర,సామాజిక బాధ్యతల చింతన.అసలు ఏ ఒక్కరిలోనూ కానరాని ‘అందరికోసం ఒక్కడు..ఒక్కరికోసం అందరు ‘భావన.ఎలా.?

ఎవరో ఒకరు ముందుకు రావాలి.ధైర్యంగా ముందుకు దూకి పరిస్థితుల్ని చక్కదిద్ది ఒక నూతన ఉజ్జ్వల నాయకత్వంతో మళ్ళీ కొత్త సమీకరణాలను రూపొందించి కొత్తదారిని వేయాలి.

అందుకే..ఈ సమావేశం.సరికొత్త ప్రయోగం.తప్పుచేస్తున్న మనిషిని నిలదీసి సమాజమే ప్రశ్నించడం ప్రారంభిస్తున్న ఒక కొత్త దిశ.

రాజరాజనరేంద్రాంధ్ర గ్రంథాలయం.కుర్చీలో నారాయణ.పద్మభూషణ్.కవి.తన కవిత్వంతో గత నలభయ్యేళ్ళుగా ప్రజలను సమీకృతం చేస్తూ అలుపెరుగని పోరాటం చేస్తున్న ప్రజాకవి.ఒకనాటి స్వాతంత్ర్య సమరయోధుడు.ప్రక్కన అటు..ఇటూ ఇంకో ఐదుగురు సచ్ఛీలతను కలిగిన నిష్కలంక రచయితలు.అందరికీ ఆదర్శనీయులు .తనకంటూ స్వంత ఆస్తి ఏదీ లేనివారు  .

ప్రజలచే ఎన్నుకోబడని శాసకుడు రచయిత..అని ప్రవచించే శుద్దమానవుడు.

వారంక్రితం ఒక ప్రజా సంఘటనను ఏర్పాటు చేశాడు  నారాయణ .పదిమంది రచయితలు..ఐదారుగురు ప్రముఖ పత్రికా విలేఖరులు..మూడు శక్తివంతమైన టి వి చానళ్ళు..ముందు విజ్ఞులైన ప్రజలు.ప్రత్యేక ఆహ్వానితులుగా కలెక్టర్.ఎస్పీ.ఇప్పుడు విచారించే సమస్య తాలూకు ప్రభుత్వ అధికారులు.ఎస్ ఇ రోడ్స్ అండ్ బిల్డింగ్స్..క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్..మొదలైనవాళ్ళు.

రెండురోజుల క్రితం చింతలపల్లి దగ్గర కడుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అకస్మాత్తుగా కుప్పకూలి అప్పుడు ఆ దారిలో వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అప్పటికప్పుడే మరణించారు.  ఆగ్రహోదగ్రులైన ప్రజలు గుమిగూడి చేతికేది అందితే దాంతో విధ్వంసం సృష్టించారు.అక్కడున్న కాంట్రాక్టర్ తాలూకు యంత్రాలన్నింటినీ నాశనం చేశారు.వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేసి..తర్వాత అంతా మామూలే.కాంట్రాక్టర్ తానే పోలీసులకు లొంగిపోవుట..కోర్ట్ కేసు.రిమాండ్..పత్రికల్లో సంతాప వార్తలు.లోకల్ రాజకీయ నాయకుల సందర్శనలు.ఎక్స్ గ్రేషియా హామీలు..విచార ప్రకటనలు.

ఒక వారం తర్వాత అందరూ..అంతా మరచిపోయి..ఎవరిపనుల్లో వాళ్ళు.ఎవరి పరుగుల్లో వాళ్ళు.

సద్దు మణిగినతర్వాత..కాంట్రాక్టర్ మెల్లగా కలుగులోనుండి ఎలుకవలె..బెయిల్ పై విడుదలై.,

అప్పుడందింది ప్రజాకవి నారాయణ పంపిన ‘ప్రజావేదిక ‘పిలుపు కాంట్రాక్టర్ దేవసహాయానికి.

ప్రజావేదిక..పిలుపంటే జనశాసనంగా రూపొందించాడు నారాయణ.ఎలా అంటే..పిలుస్తున్నవాళ్ళు రవ్వంతకూడా మచ్చలేని నిఖార్సయిన మనుషులు.రచయితలు.రచయితలంటే ఒట్టి ఆదర్శాలు రాసి మరిచిపోయి ఆచరణలో ఎక్కడికో పారిపోయే దుర్మార్గులుకారనీ,మానవత్వానికి ఒక నమూనాగా నిలువవలసిన ఆదర్శమానవులనీ,అక్షరసేనానులనీ నిర్వచించి కూర్చాడు నారాయణ అటువంటి వ్యక్తులను ప్రత్యేకంగా ఎంపికచేసి.వాళ్ళందరికీ వాళ్ళకున్న నైతిక వ్యక్తిత్వమే ఎనలేని బలం.వాళ్ళకు తోడుగా శక్తివంతమైన మీడియా.ప్రెస్.పిలుస్తే రాకుంటే మర్నాడు ప్రజళ్ళోకి ఈ ఉల్లంఘనను నేరంకింద పరిగణించబడి నిందితుడు దోషిగా ఋజువగుట.మీడియాద్వారా సమాజంలో ఇజ్జత్ పోవుట.పరువు పోతుందని భయం.

నారాయణకు తెలుసు మనిషిని లొంగతీసే శక్తి కేవలం భయానికే ఉందని.

సామాజిక నేరాలను చేస్తూ,కోట్లకొద్ది ప్రజా ధనాన్ని స్వాహాచేస్తూ నేరస్థులు తప్పించుకు తిరుగుతున్నారంటే దానిక్కారణం ఆ నేరస్థున్ని ప్రజలమధ్య ఋజువుల్తోసహా నిలబెట్టి పశ్చాత్తాపపడేట్టు చేయకపోవడమే.ఈ దేశంలో ఒక్క నేరస్తుణ్ణి పట్టుకుని నిలదీస్తే వానితోపాటు ఇంకో పదిమంది నేరస్థులు బయటపడ్తారు.దాన్ని ఒక్కసారి ధైర్యంగా బట్టబయలు చేయగల్గుతే పరువు భయంతో ప్రతివాడూ తన నడవడిలో మార్పుతెచ్చుకుంటాడు.అదీ నారాయణ చేయదల్చుకున్న చికిత్స.

కాగా..ప్రజావేదిక పిలిచిన తర్వాత ఏ అధికారైనా హాజరుకాలేదంటే..అతనిక్కూడా ఏదో పాత్ర ఉందని జనమనుకుంటారని భయం.వణుకు.ఆ స్థితిని సృష్టించాడు నారాయణ.

ప్రజావేదిక ఏ శిక్షా వేయదు.కేవలం నేరాన్ని అంగీకరింపజేసి తలవంచుకునేలా చేసి బుద్ది చెబుతుందంతే.ఒక్కసారి ప్రజావేదికపైకెక్కినవాడు వీపుపై ‘దోషి ‘ ముద్రను వేయించుకున్నట్టే.ఎదురుతిరిగితే పత్రికలూ,మీడియా ఏకి పారేస్తాయి.దానికితోడు ‘సమాచార హక్కు ‘చట్టం కింద సంపాదించిపెట్టుకున్న వివరాలు ప్రశ్నించబడే మనిషిని గుక్కతిప్పుకోకుండా పరేషాన్ చేసి వదుల్తాయి.మనిషిని ‘పరువు ‘అనే సున్నితమైన శిక్షతో పరివర్తింపజేయుట.

ప్రజావేదిక..స్థాపనప్పుడే చెప్పాడు నారాయణ..తమ సంస్థ లక్ష్యం ప్రజాహక్కులకూ,ప్రజాధనానికి కాపలాకుక్కలా ఉండడమేనని.

కుక్క దొంగను చూడగానే మొరుగుతుంది.కండను పట్టి  చెండాడుతుంది. అంతే.

*                       *                          *

“దేవసహాయంగారూ చెప్పండి..ఎందుకిలా..పదిహేను కోట్ల ఫ్లైఓవర్ ప్రాజెక్ట్..పూర్తికాకముందే కూలిపోవుట..ఇద్దరు వ్యక్తుల నిండు ప్రాణాలు పోవుట.తప్పు చేసినందుకు మీకేమైనా పశ్చాత్తాపముందా..మీ ప్రాజెక్ట్ తాలూకు వివరాలన్నీ సమాచార హక్కు చట్టం కింద సేకరించినవి..ఇవిగో..ఇక్కడున్నాయ్.చెప్పండి.”

దేవసహాయం మౌనంగా తలవంచుకుని నిలబడ్డాడు.

చుట్టూ మూడు టి వి చానళ్ళ కెమరాలు రికార్డ్ చేస్తున్నాయి.విలేఖర్లు రాసుకుంటున్నారు.

అప్పటికే ‘ప్రజావేదిక ‘విచారణంటే ప్రజల్లో ఒక సంచలనాత్మక ఆసక్తి స్థిరపడింది.

“సర్..నేను సహజంగా నేరస్వభావమున్న మనిషిని కాదు.ఆ మాటకొస్తే ఈ సమాజంలో ఎవరూ సహజంగా నేరస్థులు కారు.డబ్బు సంపాదించాలనే కక్కుర్తి అందరికీ ఉంటుంది.ఐతే అవకాశాలు అందరికీ రావు.సుళువైన మార్గాలు ముందు పరుచుకుని ఉన్నపుడు ఏ మనిషైనా తప్పుచేస్తాడు.నా విషయంగాకూడా అదే జరిగింది.నిజానికి నేనిప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను.నా దుఃఖాన్ని బహిరంగంగా నిజాయితీగా పంచుకోవాలనుకుంటున్నాను.దయచేసి వినండి.”

పరివర్తన..మార్పు..ఆత్మక్షాళన.రియలైజేషన్.

“నేను ఈ ప్రాజెక్ట్ ను తీసుకునేనాటికి..అలాట్మెంట్ ఖర్చులు ప్రభుత్వ సెక్రెటరీలు..మాథ్యూస్ కు పదిహేను లక్షలు.సెక్రెటరీ ఫైనాన్స్ విఠల్ కు పదిహేను లక్షలు.జాయింట్ సెక్రెటరీ అలీహుస్సేన్ కు పదిలక్షలు..ఇంకా చిన్న చిన్న సెక్షన్ ఆఫీసర్లు..అంతా కలిపి పది లక్షలు.మన జిల్లామంత్రి తన గుండాలతో నాపై దాడి చేయించినపుడు భయంతో చేసుకున్న ఒప్పందంప్రకారం ఇచ్చిన మొత్తం ఒక కోటి.మంత్రిగారిపేరు మీకు తెలుసు కోమాకుల రాజేంద్రప్రసాద్. ముగ్గురు ఎమ్మెల్యేలు..రూలింగ్ పార్టీ జయలలితకు ముప్పై లక్షలు.ఇంకో ప్రక్క నియోజకవర్గ శాసన సభ్యుడు రుద్రరాజుకు ఇరవైఐదు లక్షలు.అప్పోజిషన్ పార్టీ ఎమ్మెల్యే రవికిరణ్ కు పన్నెండు లక్షలు.ఎస్ ఈ రామసుబ్బారెడ్డికి పదిహేను లక్షలు.క్వాలిటీ కంట్రోల్ ఇన్స్ పెక్టర్ జాకబ్ కు పది లక్షలు.ఎ ఇ లు బాలక్రిష్ణ,రామలింగం,వి క్టర్..వీళ్ళకు  మనిషికి ఐదు లక్షలు.ఎమ్మెల్యే కొడుకు వాసుకు వాడు తాగివచ్చినప్పుడల్లా ఇచ్చినై పదిహేను లక్షలు.ఇట్ల మొత్తం ఐదుకోట్ల నలభై లక్షలు లంచాలకే పోతే ఇక నేను ఏ ప్రమాణాలతో కట్టగలను ఫ్లైఓవర్ ను.తక్కువ స్టీల్,ఎక్కువ ఇసుక,నాసిరకం ఫినిషింగ్.ఇంప్రాపర్ క్యూరింగ్.నేను తెచ్చిన అప్పులకు కోటి వడ్డీ.మొన్న ఫ్లైఓవర్ కూలిన తర్వాత పోలీస్ డి ఎస్ పి రామచంద్రయ్యకు ఇచ్చింది ఐదు లక్షలు.బెయిల్ గురించి జడ్జ్ పట్టాభిరామయ్యకు ఇచ్చింది పదిహేను లక్షలు.వెరసి నాకున్న అప్పులు ఇప్పుడు..పదహారు కోట్లు.ప్రతినెలా కట్టవలసిన వడ్డీలు ఎనిమిది లక్షలు.ఈ లంచగొండి దేశంలో ఊబిలోకి దిగీ దిగీ..ఇక ఆత్మహత్యే శరణ్యమయ్యే స్థితి దాపురించి..”..దేవసహాయం గొంతు గద్గదమై..ఎక్కెక్కిపడి ఏడుస్తూ..కుప్పకూలిపోయాడు.

హాలంతా నిశ్శబ్దంగా..విషాదంగా.దేవసహాయాన్ని పీల్చుకుతిన్న మనుషుల పేర్లు మంత్రితోసహా..అధికారులపేర్లు..అన్నీ బట్టబయలౌతూ.,గంభీర సానుభూతి.

తప్పులు జరుగుతున్నాయి.కుక్క నిద్రపోతోందికాబట్టి దొంగతనం జరుగుతోంది.కుక్క దొంగ పెడ్తున్న బిస్కిట్లను తినడానికి అలవాటైంది కాబట్టి..చివరికి కుక్కా,దొంగా కలిసి యజమానినే కరిచి,కండలు పీకి ,చంపి.,

నాలుగేండ్లక్రితం యువ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధి ఒక విస్తృతమైన ప్రజా అధ్యయనం చేస్తూ కనుక్కున్న ఒక పరమసత్యాన్ని ప్రకటించాడు.అదేమిటంటే..”ఈ దేశంలో అవినీతి ఎంత పెరిగిపోయిందంటే..ప్రభుత్వం పేదల అభ్యున్నతికోసం ఒక రూపాయిని అందిస్తే వివిధ మధ్యవర్తి దళారులు తినీ తినీ చివరికి కేవలం ఐదు పైసలను మాత్రమే లబ్దిదారులకు మిగులుస్తున్నారు “అని.

పద్మభూషణ్ నారాయణకు ఆ జ్ఞాపకం ఒక ములుకులా వచ్చి గుండెల్లో దిగినట్టనిపించింది.

కలెక్టర్ వికలమైన మనసుతో హాల్ నుండి బయటికొచ్చాడు.. లోపల ఉక్కపోతగా అనిపించి.

అప్పుడు..బయట దర్వాజా దగ్గర ఒక పదేళ్ళ చిన్న పిల్లాడు ఒక ప్లకార్డ్ పట్టుకుని నిలబడి ఉండడం కనిపించింది.

అట్టపై రాసిఉంది.”దయచేసి మా తరానికికూడా కొద్దిగా మిగల్చండి ప్లీజ్”అని.

ఆసక్తిగా చూస్తున్న కలెక్టర్ వైపు ఎమ్మార్వో రఫీక్ “ఈ కుర్రోడు ఆ పద్మభూషణ్ నారాయణ మనుమడు సతీష్ సర్” అంటున్నాడు.

 

*                           *                               *

సరిగ్గా అప్పుడే పిడికెడు పక్షిపిల్ల తన కొత్తగా మొలిచిన చిన్ని రెక్కలతో విశాల వినీలాకాశాన్ని ఈదుతూ..జయిస్తూ వెళ్తూనేఉంది.

పక్షికి ఒక్క గూడుతప్ప ఏ ఆస్తీ ఉండదు.

దానికి ఒక ఆకాశం..ఒక పచ్చని చెట్టు..చాలు.

 – రామాచంద్రమౌళి

 

 

పెద్దక్క మళ్ళీ పుట్టింది ఈ అక్షరాల్లో!

 

modified-coverpage3

ఈ ప్రపంచం లోకి మనం వచ్చేటప్పుడే మన ఎక్స్పైరీ డేట్ కూడా రాసి పెట్టి ఉంటుంది. ఐనా మనిషికి అన్నిటి కన్నా భయం మృత్యువంటే . నేను అన్నదే లేకుండా పోతే అన్న భయమే కొందరిని మంచిగా చేస్తుంది , మరి కొందరిని కలచి వేస్తుంది. ఎంత గొప్పగా వేదాంతం చెప్పే వారు కూడా మరణం పట్ల భయాన్ని కలిగి ఉంటారనడం లో సందేహం లేదు. జరా మరణాలు దైవాధీనాలు . దైవం అనే దాని పై మనకి నమ్మకం లేకున్నా మరణం మాత్రం ఎప్పుడూ ఎవరికి చెప్పి రాదు . ఎవరికి చెప్పి తీసుకుపోదు. అందుకేనేమో ఆ మృత్యువంటే  మనిషిలో అంత భయాందోళనలు.

మరణం ఒక కామా అంటాడో కవి , మరణం ఒక కామా  వాకాటి పాండురంగారావు గారి ప్రసిద్ధ పుస్తకం . నిజంగా మరణం ఒక కామా యేనా , మళ్ళీ మనం ఈ మానవ జన్మ ఎత్తుతామా ? ఏమో ఎవరికీ తెలియని ఈ వింత పట్లనే కదా మనిషికి ఇంత ఆకర్షణ వికర్షణలు. పాంచ భౌతిక  దేహం లో ప్రాణ స్పందన ఆగిపోయాక ఇక ఈ దేహం నశించవలసిందే. ఎవరూ తమ మరణాన్ని అనుభూతించి అక్షరీకరించలేరు. శంకరుడు అన్నట్టు మృత్యువు అది వచ్చే వేళకి నేను ఉండను , నేను ఉన్నన్నాళ్లూ అది రాదు, అని ఈ మరణాన్ని ఎదుర్కోవడానికి , మానసిక సంసిద్ధత పొందటానికి ఎన్నో నియమాలు , ప్రయోగాలు , అయినా నిరంతరం ఒక భయం తోనే బతికే మామూలు మనుషులం మనం అనుకుంటే . ఒక మామూలు మనిషి, కవి కాదు , తాత్వికురాలు కాదు , అయినా మరణాన్ని ఎంత ధీశాలి లాగా ఎదుర్కుంది.

ఎవరి గురించి చెప్తున్నానో అనుకుంటున్నారా ఇప్పుడే “పెద్దక్క ప్రయాణం” అని విజ్జి , చిన్నమ్మ , జాజి అనే ముగ్గురు చెల్లెళ్ళు  రాసిన ఒక హృదయ పూర్వకమైన నివాళి చదివాను. నలుగురు అక్క చెల్లెళ్లలో పెద్దది అయిన నాగవల్లి గారి స్మృతిలో వారు అక్షరీకరించిన ఈ నివాళి హృదయాన్ని ఆర్ద్రం చేసింది. జాజి డాక్టర్. కె.ఎన్ మల్లీశ్వరి , ప్రముఖ రచయిత్రి వాళ్ల మిగిలిన అక్కలతో కలిసి రాసిన “పెద్దక్క ప్రయాణం” గురించి ఓ రెండు మాటలు.

ఒక మనిషి చనిపోతే మనం చేసే ఎన్నో రకాల పనులతో వారికి నివాళి ఇవ్వాలనుకుంటాము. ఈ కర్మలన్నిటికీ మించినదే చేసేరు ఈ సోదరీమణులు. తమ పెద్దక్క స్మృతిలో అక్కను గూర్చిన జ్ఞాపకాలను అక్షరీకృతమ్ చేసి అక్కను అక్షరం లో బతికించి పెద్ద కూతురిని కోల్పోయిన  ఆ తల్లి తండ్రులకు అందించే ప్రయత్నం  చేసేరు. ఈ మధ్యన  ఇహ లోకాన్ని వదిలిన తమ సోదరి గురించి ఐదు రోజుల్లోగా ఒక పుస్తకాన్ని రాసి తీసుకొచ్చారు.

పెద్దక్క ను గురించి మిగిలిన ముగ్గురు చిన్నమ్మ , విజ్జి , జాజి కలిపి రాసిన స్మృతి మాత్రమే కాదు ఈ పుస్తకం. ఒక వ్యక్తి మరణం ఏమన్నా గొప్పదా ఎందరు పుట్టడం లేదు ఎందరు పోవడం లేదు , నిజమే కానీ మన అనుకున్న ఓ మనిషి ఈ మరణాన్ని ఎంత యధాతధంగా స్వీకరించిందో ఈ చిన్ని పుస్తకం చదివితే అర్ధం అవుతుంది.

తనకి  కేన్సర్ అని తెలిసినా ఏనాడూ ఊరికే  ఏడ్చి అందరినీ ఏడిపించి బాధించ లేదు నాగవల్లి. జీవితాన్ని ఎలా స్వీకరించిందో  అలాగే మరణాన్ని కూడా స్వీకరించింది. తాను బ్రతికుండగానే ఏయే పనులు చక్కపెట్టుకోవాలో ఆలోచించి చేసింది. కూతురిని మనుమరాలిని చిన్నమ్మ కి అప్ప చెప్పింది. చెల్లెళ్లకు ధైర్యం చెప్పింది . తాను లేని లోకం లో ఎలా బ్రతకాలో అని నిస్తేజులై  మిగిలిపోయిన అందరికీ ఒక ఆత్మీయ ఆదర్శంగా నిలిచింది.

కేవలం ఒక వ్యక్తి స్మృతిలో రాయబడినదే అయినా ఈ పుస్తకం లో జాజి తెలుసుకున్న కొన్ని జీవిత సత్యాలను చెప్పింది. ఒక కుటుంబం లో స్త్రీకి కనుక ఏదన్నా వ్యాధి వస్తే అది ఎలా మరి కొందరి కుటుంబాలను కూడా కదిలించేస్తుందో చెప్పింది. మరణం అన్నది తప్పదనీ తెలిసిన క్షణం నుండీ జీవితాన్ని ఎంత పరిపక్వతతో అక్క స్వీకరించి అలాంటి ఒక స్తిత ప్రజ్ఞతని తమకి ఒక పాఠంగా చెప్పి వెళ్ళిన వైనం జాజి మాటల్లో మనకు తెలుస్తుంది.

ఇక మీకు మేము ఏకలవ్య శిష్యులమ్ అన్న మాట చదవగానే నా గుండె చెమరించింది. ఎక్కడో దూర లోకాల్లో  ఉన్న అక్క కి ఇక్కడ చెల్లెళ్ళు ఏకలవ్య శిష్యులేగా మరి.

image

అమ్మను, ఆత్మీయతను , అక్షరాన్ని , అక్కను అజరామరం చేయగల ఒక  ప్రయత్నం  ఒక చిన్ని హృదయ నివాళి లో తెలియజేసేరు ఈ చెల్లెళ్ళు.

కరిగిపోతున్న క్షణాలలో తాను చదవగలనో లేనో అనుకుని ఎన్నో పుస్తకాలు చూసి విచారించిన అక్క ఆవేదన గూర్చి , తాను ఉండగానే ఇంటికి చెద మందు కొట్టించేయ్యలి లేకుంటే మీ బావ బాధ పడతారు ఆపైనా అని ఆలోచించే ఒక ఇల్లాలు , తల్లి , అమ్మమ్మ , కూతురు , అక్క ఇక ఒక స్మృతి మాత్రమే కదా. నిజానికి ఇంత ధు:ఖం లో కూడా ఈ చిన్ని పుస్తకాన్ని తీసుకొచ్చిన ఈ చెల్లెళ్ల ను తల్చుకుంటే నిజమే వీరు ఆ పెద్దక్క దగ్గర చాలా నెమ్మది ని నేర్చుకున్నారు అనిపిస్తుంది.

పెద్దక్క ప్రయాణం ఒక స్మృత్యంజలి కాదు ఒక మంచి మనసున్న అక్క చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక . మనసున్న వారు చదువుతారు , ప్రతిస్పందిస్తారు , అన్నిటికి మించి ఆ పెద్దక్క దగ్గర  మనం కూడా కొంత నేర్చుకుంటాము. జీవితాన్ని కాస్త దిద్ది తీర్చుకుంటాము . స్మృతి లో రాసిన పుస్తకాలు కవితలు మనలని మరింత బాధ కి గురి చేస్తాయి , లేదా నైరాశ్యం పాలు చేస్తాయి కానీ ఈ పుస్తకం ఒక ఆత్మీయ స్నేహితునిలా రాబోయే జీవితాన్ని గూర్చి , మరణం గూర్చి ఎంతో సంయమనం  పాటించే విధంగా మనకి మంచి పాఠాన్ని గరుపుతుంది. ఈ ముగ్గురికే కాదు ఈ పెద్దక్కను మనందరికీ ఒక ఆత్మీయురాలిని చేసేరు ఈ చెల్లెళ్ళు. మిత్రులారా చదవండి ఈ చెల్లెళ్ల ప్రేమను వారి ఆత్మీయ అక్షరాల్లో బంధించుకుని మనకి ఆవిష్కరించిన వారి పెద్దక్కను .

చిన్నమ్మ కు , విజ్జి కి ,జాజికి ప్రేమ పూర్వక అభినందనలు మీరు వేసినది పుస్తకం కాదు ఒక మంచి మనసును వ్యక్తిత్వాన్ని మాకు పరిచయం చేసేరు అందుకు మీకు కృతజ్ఞతలు . పెద్దక్కను చిరంజీవిని చేసిన మీ ప్రయత్నం సఫలమైంది .

జగద్ధాత్రి

381778_218808094872758_1009111763_n

గంధర్వుడి బడాయి- అర్జునుడి డైలమా!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (10)

నువ్వు తాపత్య వంశీకుడివి’ అని అర్జునుడితో అనడంలో గంధర్వుని బడాయి చూసారా…?

‘ఆ సంగతి నీకు తెలియదు, నాకు తెలుసు’ అన్న అతిశయం అందులో ఉండచ్చు, ఆశ్చర్యంలేదు. ఆ సందర్భంలో గంధర్వుడు తనకు తెలిసిన విషయాల గురించి బడాయికి పోవడం సహజమే కాదు, అవసరం కూడాను. ఎందుకంటే, తను అర్జునుని చేతిలో ఓడిపోయాడు. కనుక తను ఏదైనా విషయంలో అతని మీద పై చేయిని చాటుకోవాలి. అప్పటికే అతనా ప్రయత్నం మొదలుపెట్టాడు కూడా. నా దగ్గర మహిమలున్నాయనడం, మీకు గుర్రాలు ఇస్తాననడం, క్షత్రియుని వెంట పురోహితుడూ, అగ్నిహోత్రమూ ఎప్పుడూ ఉండాలని చెప్పడంలో, ఆ సంగతి మీకు తెలియదన్న ఆక్షేపణను ధ్వనించడం అందులో భాగాలే.

ఒకవిధంగా దానికి కొనసాగింపే, ‘నువ్వు తాపత్యవంశీకుడివి, తెలుసా?’ అనడం.

మొత్తానికి ఈ గంధర్వుడు అనుకున్నంత అమాయకుడేమీకాదు, గడుసువాడే! అర్జునుడి జిజ్ఞాసను గురి చూసి కొట్టాడు. తను తాపత్య వంశీకుడు ఎలా అవుతాడో తెలుసుకునేవరకూ గంధర్వుడి వలలోంచి అర్జునుడు బయట పడలేడు. అంటే, తనను బంధించి కొప్పు పట్టుకుని ఈడ్చుకు వెళ్ళి ధర్మరాజు ముందు పడేసిన అర్జునుని, తన మాట లనే ‘సమ్మోహనాస్త్రం’తో గంధర్వుడు కట్టిపడేసి ప్రతీకారం తీర్చుకుంటున్నాడన్నమాట. మొత్తానికి ఇప్పుడు గంధర్వుడు గురువు, అర్జునుడు శిష్యుడూ అయ్యారు.

గంధర్వుడు ఊరికే గురువు కాలేదు. పాండవులకు కొన్ని విషయాలు తెలియవని అతను ముందే కనిపెట్టేశాడు.  క్షత్రియుని వెంట పురోహితుడూ, అగ్నిహోత్రమూ ఎప్పుడూ ఉండాలన్న తొలిపాఠం చెప్పిన తర్వాత మరికొన్ని పాఠాలు చెప్పవలసిన అవసరమూ అతనికి కనిపించింది. ముఖ్యంగా ఆదివాసులకు, బ్రాహ్మణులకు ఉన్న దగ్గరి సంబంధాల గురించి చెప్పాలనుకున్నాడు. నువ్వు తాపత్యవంశీకుడివి అనడం దానికి శృతి.

గంధర్వుడు ‘నువ్వు తాపత్య వంశీకుడివి’ అనడంలో ఇంకోటి కూడా ఉంది. దాని గురించి చెప్పుకునే ముందు అతను చెప్పిన కథలోకి వెడదాం.

***

పాండవుల తరానికి అనేక తరాల వెనకటి కథ ఇది…

తపతి సూర్యుని కూతురు. సావిత్రికి తోడబుట్టినది. మంచి గుణవంతురాలు. ఆమె యవ్వనవతి అయింది. ఈమెకు తగిన వరుడు ఎవరా అని సూర్యుడు ఆలోచనలో పడ్డాడు.

అలా ఉండగా భరతకులానికి చెందినవాడు, అజామీఢుని కొడుకు అయిన సంవరణుడు సూర్యుని గురించి తపస్సు చేశాడు. అతను సూర్యుడికి నచ్చాడు. నేను ఆకాశంలో అధిక తేజస్సుతో ఎలా వెలుగుతున్నానో, అలాగే ఇతను కూడా ఈ జగతిలో ప్రసిద్ధుడిగా వెలిగిపోతున్నాడు, తపతిని ఇతనికే ఇచ్చి పెళ్లి చేస్తానని సూర్యుడు నిశ్చయించుకున్నాడు.

ఒకరోజున సంవరణుడు వేటకు వెళ్ళాడు. అడవిలో చాలాసేపు తిరిగిన తర్వాత అతని గుర్రానికి విపరీతమైన దాహం వేసింది. ముందుకు వెళ్లడానికి మొరాయించింది. అప్పుడు సంవరణుడు  ఒక్కడే కాలినడకన ఆ పర్వతవనంలో నడుచుకుంటూ వెళ్ళాడు.

ఒకచోట అతనికి ఒక సుందరి కనిపించింది. ఆమె బంగారు వన్నెలో ఉంది. ఆమె వల్ల, ఆమెకు దగ్గరగా ఉన్న చెట్లు, లతలూ కూడా బంగారువన్నెలోకి మారిపోతున్నాయి. ఆమెను చూడగానే సంవరణుడు రెప్ప వేయడం మరచిపోయాడు. త్రిభువన లక్ష్మి ఇక్కడికి వచ్చి ఇలా ఒంటరిగా ఎందుకుందో అనుకున్నాడు. ఇంతకీ ఈమె దేవకన్యో, యక్షకన్యో, సిద్ధకన్యో తెలియడం లేదనుకున్నాడు. ప్రశస్తమైన అన్ని లక్షణాలూ కలిగిన ఆకృతీ, అంతులేని కాంతీ కలిగిన ఈమె కచ్చితంగా దివ్యకన్యే అయుంటుందని కూడా అనుకున్నాడు. అంతలోనే, ఇంద్రకన్యలకు కూడా ఇంతటి రూప విలాస సంపద ఉంటుందా అన్న సందేహం అతనికి కలిగింది. మొత్తానికి ఇంతటి అందగత్తెను మాత్రం తనెప్పుడూ చూడలేదన్న నిశ్చయానికి వచ్చాడు.

Back-To-Godhead-Mahabharat

ఆవిధంగా ఆమె సౌందర్యం అనే అమృతాన్ని చూపులతోనే తాగేస్తూ రెప్ప వేయడం మరచిపోయిన తర్వాత, కొంతసేపటికి తెలివి తెచ్చుకుని, ‘నువ్వెవరివి, క్రూరమృగాలు తిరిగే ఈ అడవిలో ఇలా ఒంటరిగా ఎందుకున్నావు?’ అని అడిగాడు. ఆమె అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, మేఘాల మధ్య మెరుపుతీగలా మాయమైపోయింది.

ఆమె మాయమవడాన్ని సంవరణుడు తట్టుకోలేకపోయాడు. సిగ్గు వదిలేసి నేలమీద పడి ఏడవడం ప్రారంభించాడు. ఆమె మనసు కరిగింది. అదీగాక, మంచి యవ్వనంలో మన్మథుణ్ణి తలదన్నేలా ఉన్న అతన్ని చూడగానే ఆమె మనసులోనూ అలజడి మొదలైంది. మళ్ళీ అతని ముందుకు వచ్చి, ఎందుకిలా వివశుడివవుతున్నావని తీయని గొంతుతో అడిగింది.

‘ఈ భూమండలంలో ప్రతాపంలోనూ, బలదర్పాలలోనూ నన్ను మించినవాడు ఉన్నట్టు నేను వినలేదు. ఇంతవరకు నేను ఎవరికీ భయపడి ఎరగను. అలాంటిది ఇప్పుడు నేను భయంతో కంపిస్తున్నాను. నిన్ను అడ్డు పెట్టుకుని మన్మథుడు తన బాణాలతో నన్ను కొట్టి చంపకుండా నువ్వే నన్ను కాపాడాలి’ అని సంవరణుడు అన్నాడు. ఆ తర్వాత, ‘గాంధర్వవిధానంలో నన్ను పెళ్లి చేసుకో’ అని ప్రతిపాదించాడు.

అప్పుడామె, తను సూర్యుని కూతురుననీ, సావిత్రికి సోదరిననీ, తన పేరు తపతి అనీ చెప్పింది. నన్ను నువ్వు ఇష్టపడితే మా తండ్రిని అడుగు, ఆయనను ప్రార్థించు, అప్పుడు నన్ను నీకు ఇస్తాడు, ఆడపిల్లలకు స్వాతంత్ర్యం ఉండదని నీకు మాత్రం తెలియదా-అంది. అని, తను సూర్యమండలానికి వెళ్లిపోయింది.

ఆమె కనుమరుగయ్యేసరికి సంవరణుడు మూర్చితుడై పడిపోయాడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన మంత్రి అతన్ని చూసి శీతలోపచారాలు చేసిన తర్వాత తెలివిలోకి వచ్చాడు. మంత్రినీ, పరివారాన్నీ పంపేసి తను అక్కడే ఉండిపోయి సూర్యుని ఆరాధించడం ప్రారంభించాడు. ఆ తర్వాత తన పురోహితుడైన వశిష్టుని తలచుకున్నాడు.

తలచుకున్న పన్నెండు రోజులకు వశిష్టుడు సంవరణుడి దగ్గరకు వచ్చాడు. వ్రతాలతోనూ, ఉపవాసాలతోనూ కృశించిన సంవరణుని చూశాడు. అతను తపతిపై మనసు పడ్డాడని యోగదృష్టితో తెలుసుకున్నాడు. వెంటనే అనేక యోజనాలు ప్రయాణం చేసి సూర్యుని దగ్గరకు వెళ్ళి వేదమంత్రాలతో ఆయనను స్తుతించాడు. సూర్యుడు వశిష్టుని సముచితంగా గౌరవించి, ‘ఏం పనిమీద వచ్చా’రని అడిగాడు. ‘నీ కూతురైన తపతికి పౌరవకుల శ్రేష్ఠుడైన సంవరణుడు అన్ని విధాలా తగిన వరుడు. కూతురుని కన్న ఫలం దక్కేది తగిన వరుడికి ఇచ్చినప్పుడే కదా. కనుక నీ కూతురుని సంవరణుడికి ఇయ్యి’ అన్నాడు. సూర్యుడు అంగీకరించి తపతిని వశిష్టునితో సంవరణుడి దగ్గరకు పంపించాడు.

ఒక నిమిషంలో మూడువందల అరవై నాలుగు యోజనాలు ప్రయాణించే సూర్యరథంలో తపతిని వెంటబెట్టుకుని వశిష్టుడు సంవరణుడి దగ్గరకి వచ్చి విధివిధానంగా ఇద్దరికీ వివాహం చేయించాడు.

కనుక, మంచి పురోహితులను పొందిన రాజులు తాము కోరుకున్న అన్ని శుభాలనూ పొందగలుగుతారు. అలా తపతిని మహోత్సవంతో పెళ్లాడిన సంవరణుడు రాచకార్యాలనన్నింటినీ విడిచిపెట్టేసి తపతితో ఇష్టసుఖాలు అనుభవిస్తూ పన్నెండేళ్ళపాటు ఆ పర్వత, అరణ్యాలలోనే ఉండిపోయాడు. దాంతో భూమండలమంతటా అనావృష్టి ఏర్పడింది. వశిష్టుడు వర్షాలు పడడానికి అవసరమైన వైదిక విధులు అన్నీ నిర్వర్తించి సంవరణుడి దగ్గరకు వచ్చి, ఆ దంపతులిద్దరినీ హస్తినాపురానికి తీసుకువెళ్లాడు. అప్పుడు అనావృష్టి తొలగిపోయింది. కొంత కాలానికి ఆ దంపతులకు ‘తాపత్యుడు’(తండ్రివైపు నుంచి కాకుండా తల్లి తపతి వైపునుంచి చెప్పినప్పుడు ఆ సంతానం తాపత్యుడు అవుతాడు) గా కురువంశకర్త అయిన కురుడు పుట్టాడు. అప్పటినుంచి మీరు తాపత్యులయ్యారు….

***

అర్జునుడు విన్నాడు.

‘మా వంశానికి చెందిన పూర్వరాజులకు పురోహితుడైన వశిష్టుని మహత్యం గురించి ఇంకా వినాలని ఉంది’ అన్నాడు.

ఆదివాసులైన తమ మనసుకు ఎంతో దగ్గరగా ఉండే ఋషుల గురించి అడిగితే గంధర్వుడు చెప్పకుండా ఎలా ఉంటాడు? అర్జునుడు అడగడమే తరవాయి, ఎంతో ఉత్సాహంగా, ఇష్టంగా వశిష్టుని చరిత్ర చెప్పడం ప్రారంభించాడు. మనం మాత్రం తపతీ-సంవరణుల కథ దగ్గరే ఆగిపోదాం.

***

ఈ కథను మలచడంలో కథకుడు కొన్ని ప్రశ్నలకు, సందేహాలకు అవకాశమిచ్చే ఖాళీలు విడిచిపెట్టినట్టు కనిపిస్తుంది.  ఒక్కొక్కటే చూద్దాం.

ప్రారంభంలోనే చూడండి…సంవరణుడు సూర్యుని ఉద్దేశించి తపస్సు చేశాడు. సూర్యుడు కూడా అతన్ని మెచ్చాడు. తన కూతురు తపతికి ఇతనే తగిన వరుడనీ, ఇతనికే ఇచ్చి పెళ్లి చేస్తాననీ నిర్ణయానికి కూడా వచ్చాడు. అలాంటప్పుడు, సంవరణుడు వేటకు వెళ్ళడం, ఆ పర్వత అరణ్య ప్రాంతంలో తపతిని చూడడం, ఆమెను మోహించడం, గాంధర్వ విధానంలో తనను పెళ్లాడమని అడగడం, నా తండ్రిని అడగమని ఆమె చెప్పడం…అన్నింటికంటే ముఖ్యంగా, సూర్యుడే తన కూతురిని సంవరణునికి ఇవ్వాలని నిశ్చయించుకున్నతర్వాత కూడా వశిష్టుడు మధ్యవర్తిత్వం వహించడం…ఇవన్నీఅవసరమా?

సంవరణునికి తన కూతురుని ఇవ్వాలని సూర్యుడు ముందే నిర్ణయించుకున్నాడని చెప్పడం వల్ల తలెత్తిన ప్రశ్నఇది. ఆ మాట అనకపోతే సమస్యే లేదు. ఎందుకు అన్నట్టు? బహుశా కొన్ని సమర్థనలు ఇలా ఉండచ్చు:

1. సూర్యుడు కూతురిని సంవరణుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా, ప్రతిపాదన సంవరణుని వైపునుంచే రావడం విధాయకం కావచ్చు. 2. రాజులు గాంధర్వ విధానంలో పెళ్లాడడం తప్పు కాదు. అంతకు ముందు గాంధర్వ విధానంలో రాజులు పెళ్లి చేసుకున్న ఉదంతాలను మహాభారత కథకుడే చెప్పాడు కూడా. ఉదాహరణకు, శకుంతలా-దుష్యంతుల వివాహం. కానీ ఆ తర్వాత గాంధర్వ వివాహం మీద వ్యతిరేకత ఏర్పడినట్టు ఈ కథ సూచిస్తోందా? సంవరణుడు గాంధర్వ విధానాన్ని ప్రతిపాదించడం, దాంతో తపతి స్త్రీలకు స్వాతంత్ర్యం లేదంటూ, తన తండ్రిని అడగమని చెప్పడం, అప్పుడు సంవరణుడు వశిష్టునికి కబురు చేయడం, వశిష్టుడు సూర్యుని వద్దకు మధ్యవర్తిగా వెళ్ళడం…పెద్దల అనుమతితోనే పెళ్లి జరగాలని నొక్కి చెబుతూ ఉండచ్చు. 3. గాంధర్వం తప్పా, ఒప్పా అనేది కాకుండా; వివాహం అనేది పురోహితుని ద్వారా విధివిధానంగా జరగాలని చెప్పడం కథకుని ఉద్దేశం కావచ్చు. 4. లేదా, సాక్షాత్తూ దేవుడైన సూర్యుడే సంవరణుని వరునిగా ఎన్నుకున్నాడనీ, ఆ తర్వాత వశిష్టుని జోక్యం నిమిత్తమాత్రమేననీ చెప్పడం కథకుని ఉద్దేశం కావచ్చు. ఎందుకలా అంటే, కథకుడు పాండవుల వైపునుంచి కథ చెబుతున్నాడు. వారి వంశకర్తలలో ఒకడైన కురుని పుట్టుక గురించి చెప్పేటప్పుడు, అది ఒక బ్రాహ్మణుని జోక్యం వల్ల జరిగిన వివాహఫలితమని చెప్పడం అతనికి ఇష్టం లేకపోవచ్చు. ప్రత్యేకించి బ్రాహ్మణునికి ఘనతను ఆపాదించడంపై అతనికి వ్యతిరేకత ఉండకపోయినా, ఇక్కడ బ్రాహ్మణ-ఆదివాసీ సంబంధం కూడా ఉంది. బ్రాహ్మణునికి ఘనత కట్టబెడితే, అందులోకి ఆదివాసీ కూడా వస్తాడు. అది కథకుడికి ఇష్టం లేదు. కనుక వశిష్టుని జోక్యాన్ని నిమిత్తమాత్రం చేయడం అతని ఉద్దేశం కావచ్చు.

అసలు తపతిని దేవుడైన సూర్యపుత్రిక అనడంలోనే ఆమె ఆదివాసీ సంబంధాన్ని కథకుడు దాచిపెడుతున్నాడా? అదీ సంభవమే. ఆమె పర్వత, అరణ్యమధ్యంలో ఒంటరిగా కనిపించిందంటే, ఆమె పర్వతపుత్రిక లేదా అరణ్యపుత్రిక అన్నమాట. ఆ విధంగా చూసినప్పుడు జరిగింది ఇదీ: సంవరణుడు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ తపతి కనిపించింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. అయితే, సంవరణుడు క్షత్రియుడు. క్షత్రియులకూ, ఆదివాసులకూ సహజవైరం. కనుక, తపతి తండ్రి ఆ సంబంధానికి ఇష్టపడే అవకాశం లేదు. తండ్రి వరకూ ఎందుకు, తపతి కూడా ఆ సంబంధానికి సందేహించి ఉండచ్చు. వారిద్దరికీ అంగీకారమైనా, వారి తెగకు చెందిన పెద్దలు దానిని ఆమోదించే అవకాశం లేదు. తెగలలో వివాహం అనేది వ్యక్తిగత నిర్ణయం కాదు, సమష్టి నిర్ణయం.  ఇక్కడ ఇది ‘రాజకీయ’ నిర్ణయం కూడా. మరి వీరిద్దరికీ వివాహం జరగడం ఎలా?

అందుకే బ్రాహ్మణుని జోక్యం. గాంధర్వానికి తపతి నిరాకరించి వెళ్లిపోవడంతోనే సంవరణుడు సూర్యుని ఆరాధించడం ప్రారంభించి, వశిష్టుని తలచుకున్నాడని కథకుడు చెప్పనే చెప్పాడు. సూర్యుని ఆరాధించాడని కథకుడు చెప్పడం, తపతిని దేవుడైన సూర్యుని కుమార్తెగా చెప్పడానికి యాంత్రికమైన కొనసాగింపు మాత్రమే. అయితే, సూర్యుని ఆరాధించడం వల్ల సంవరణుని పని జరగదు. వశిష్టునివల్లనే జరుగుతుంది. ఎందుకంటే, ఒక బ్రాహ్మణునిగా వశిష్టుడు క్షత్రియులకు ఎంత కావలసినవాడో, ఆదివాసులకూ అంతే కావలసినవాడు. వశిష్టుడు మధ్యవర్తిగా లేదా హామీగా ఉంటే సంవరణునికి తపతిని ఇవ్వడానికి ఆదివాసులకు అభ్యంతరం లేదు. ఆయన మీద వారికి అంతటి గురి. అలాగే, వశిష్టుడు వచ్చాడు. విషయం తెలుసుకున్నాడు. నేరుగా తపతి తండ్రిని కలిశాడు. సంవరణుడు యోగ్యుడు, అతనికి నీ కూతుర్ని ఇయ్యి అని చెప్పాడు. తండ్రి మారు మాట్లాడకుండా అప్పటికప్పుడు కూతురిని అతనితో పంపేశాడు. వశిష్టుడు తపతికి, సంవరణుడికీ పెళ్లి జరిపించాడు.

గమనించారో లేదో…కూతుర్ని ఇవ్వడమే తండ్రి వంతు. తనే పెళ్లి జరిపించే బాధ్యత ఆనాడు తండ్రికి ఉన్నట్టు లేదు. పెళ్లి జరిపించుకోవలసిన బాధ్యత వరుడివైపు వారిదే. గాంధారీ-ధృతరాష్ట్రుల విషయంలో కూడా ఇదే జరిగింది. గాంధారి తండ్రి సుబలుడు తన కూతురిని ధృతరాష్ట్రునికి ఇచ్చానని మాత్రమే అన్నాడు. సోదరుడు శకుని వెంట ఆమెను హస్తినాపురం పంపించాడు. అక్కడ భీష్ముడు మొదలైన వరుడి వైపువారే పెళ్లి జరిపించారు.

రాను రాను గాంధర్వం పట్ల వ్యతిరేకత ఏర్పడిందనడానికి మరికొన్ని ఉదాహరణలూ ఆ తర్వాత కనిపిస్తాయి. బహుశా శకుంతలా-దుష్యంతుల అనుభవం అందుకు కారణం కావచ్చు. పాండవులకు మూడు తరాల వెనకటివాడైన శంతనునే తీసుకోండి. అతనోసారి గంగాతీరంలో విహరిస్తుండగా గంగ స్త్రీ రూపంలో కనిపించింది. ఆమెను శంతనుడు మోహించాడు. ఆమె షరతులు పెట్టింది. వాళ్ళ మధ్య వివాహబంధం ఏర్పడింది. సరే, ఆ కథను మరింత వివరంగా పరిశీలించే అవకాశం ముందు ముందు రావచ్చు. ప్రస్తుతానికి అవసరమైన ఒక వివరం ఏమిటంటే, నీకు గంగ కనిపిస్తుందనీ, ఆమెను కులగోత్రాలు అడగకుండా పెళ్లి చేసుకోమనీ శంతనుడికి అతని తండ్రి ప్రతీపుడు ముందే చెప్పాడు. కనుక, ఆ సంబంధం పెద్దలు ఆమోదించినదే నని చెప్పడం కథకుడి ఉద్దేశం కావచ్చు.

వివాహ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి కనుక వాటిని వాయిదా వేసి ప్రస్తుత కథకు వస్తే…

తపతిని సూర్యపుత్రిక అనడం, నా ఉద్దేశంలో గణస్వభావాన్ని ప్రతిబింబిస్తూ ఉండచ్చు. తపతి తెగకు సూర్యుడు చిహ్నం కావచ్చు. తెగ సభ్యులను తెగ చిహ్నంతోనే సూచించడం ఆనాడు పరిపాటి. ఉదాహరణకు, ఒక గోత్రానికి చెందినవారినందరినీ ఆ గోత్రంతోనే చెప్పడం మన పురాణ, ఇతిహాసాలు అన్నిటా ఉంది. కశ్యప గోత్రీకులందరినీ కశ్యపులనే అంటారు. అందుకే పురాణకథల్లో అనేకమంది కశ్యపులు కనిపిస్తూ ఉంటారు. వారు వేర్వేరు వ్యక్తులు అని తెలియనివారు, వారికి సంబంధించిన ఉదంతాలను అన్నింటినీ ఒకే కశ్యపుడికి ఆపాదిస్తూ ఉంటారు. ఈవిధంగా చూసినప్పుడు తపతి తండ్రి సూర్య చిహ్నం కలిగిన తెగకు చెందినవాడుగా సూర్యుడే అవుతాడు. సూర్యుడు అనడం వెనుక ఉన్న తెగ లక్షణం, కథ కూర్చే నాటికి మరుగుపడి ఉండచ్చు. లేదా, కథకుడికి ఆ సంగతి తెలిసినా, పాండవుల వంశకర్తలలో ఒకడైన కురుని పుట్టుక గురించి చెప్పేటప్పుడు, అతడికి ఆదివాసీ సంబంధం ఉందని చెప్పడం అతనికి ఇష్టం లేకపోవచ్చు. దేవుడైన సూర్యుని కూతురికి పుట్టినవాడుగా అతనికి ఘనతను ఆపాదించాలని అనుకొని ఉండచ్చు. మరొకటి జరగడానికీ అవకాశముంది. అది, ఆనాటి కథనరీతిలో అనివార్యంగా ప్రతిఫలించే మాంత్రిక వాస్తవికత. ప్రతిపరిణామంలోనూ మాంత్రికతను, మహిమను చూడడం ఆనాటి జీవనశైలిలో భాగం. కథ కూర్చే నాటికి అది మరుగుపడి, దాని తీరుతెన్నులపై కథకునికి తగినంత అవగాహన లేకపోయినా,  ఆ మాంత్రిక శైలే కథనంలో యాంత్రికంగా చోటుచేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన కొన్ని అంశాలను ఇదే వ్యాసంలో ఇటాలిక్స్ లోనూ, బొల్డ్ లోనూ సూచించాను. వాటితోపాటు మరికొన్ని విశేషాలు తర్వాత…

 

 

 

 

కొత్తలు పెట్టుకుందాం

303675_500898139938384_2048672978_n

 

నవ్వేటపుడు నవ్వకపోతే ఎట్లా

కన్నీళ్ళతోనే నవ్వుతాం

యాజ్జేసుకుంటాం పేగులు నలి నలి కాంగా

మడిసిపెట్టుకున్న కలలు

కొప్పున ముడుసుకునే పువ్వులైనంక

ఇంత దుఃఖం ఓర్సుకుని, ఇన్ని బాధలు మోసినంక

ఇగో యిప్పుడు ఆత్మగల్లసుట్టం వొచ్చినపుడన్న

మనసిప్పి నవ్వకపోతే ఎట్లా

 

అడివిల పొద్దీకినట్లు కాలం యెల్లబోసిన రోజులు పాయె

పొద్దు దర్వాజమీద పొడిసినంకగూడ

వాకిట్ల ముగ్గులెక్క నవ్వకపోతె ఎట్లా

చేన్ల పంటలెక్క మురవకపోతె ఎట్లా

పర్రెకాల్వల వూటలెక్క పొంగకపోతె ఎట్లా

 538574_3603108479500_46248201_n

ఎన్ని యాదికొస్తయి ఎంత దుఃఖమొస్తది

ఎవలెవలు కొత్తతొవ్వల్ల దీపాలెత్తి పోయిండ్రు

ఎవలెవలు కొత్తపాటల మునుంలేసి పోయిండ్రు

ఎవ్వరికోసం తమ పానాలుధారవోసి

కొత్తపాలధారలై మన కడుపునింపుతుండ్రు

అన్ని యాదికొస్తయి అందరు మతికొస్తరు

 

నవ్వబోతే వాళ్ళ ముకాలు గుర్తుకొస్తయి

నవ్వబోతే వాళ్ళ మాటలు యాదికొస్తయి

నవ్వబోతే వాళ్ళు లేకపోయిరనిపిస్తది

వాళ్ళందరు మన నవ్వులకోసమేకద

వాళ్ళ జిందగీలు మనకిచ్చిండ్రు

మనం నవ్వుకుంట వాళ్ళపేరన దీపాలు పెట్టుకుందాం

మనం నవ్వుకుంట కన్నీళ్ళను తుడుసుకుందాం

మనకు బతుకునిచ్చిన బతుకమ్మలెత్తుకుని

నవ్వులపండుగ చేసుకుందాం రండ్రి

                                             –  ఎస్.హరగోపాల్

                                            చిత్ర రచన: ఏలే లక్ష్మణ్

ఒక్కోరోజు..

1173881_719118168118659_732866424_n

ఒక్కోరోజు..
ఎవరి భారాన్నో
వీపుమీద మోస్తున్నట్టు
ఆలోచన తిప్పుకోదు ఎటువైపు

ఒక్కోరోజు..
కాకి రెక్కలు కట్టుకొని
ఎక్కడికీ ఎగిరిపోదు
రావిచెట్టు రాలు ఆకుల నడుమ
ఏ పిచ్చుక పిచ్చిరాగం తీయదు

ఒక్కోరోజు..
శూన్యం మరీ సంకుచితమై
మూసుకున్న తలుపులు, కిటికీల మధ్య
అలికిడి లేని అలజడి అవుతుంది
బయటకు నడిచిపోదు గది ఎప్పుడు

1932330_10202661888241320_485832493_n

ఒక్కోరోజు..
ఒక కరస్పర్శ కోసం
ఒక కమ్మని కంఠధ్వని కోసం
అలమటిస్తుంటాం- స్వీయశిథిలంలో

ఈ మానవ మహా సముద్రం మీద
ఇరుకిరుకు ఒంటరి ప్రయాణం
కాసింత ఉప్పునీటి ద్రవం కోసం
ఒక ఎడారి గుండె గాలింపు.

– కాంటేకర్ శ్రీకాంత్

చిత్రరచన: అన్నవరం శ్రీనివాస్

“అమ్మ” హేమలత తనకు తానే ఒక సైన్యం!

జోగిని బతుకుల్లో కాంతి "లత"

జోగిని బతుకుల్లో కాంతి “లత”

ఇది నా జన్మ భూమి

ఇది నా మాతృ భూమి
ఇది నా ప్రియతమ భారతి
దీని బాగు నా బాగు
దీని ఓగు నా ఓగు
“నా దేశం తప్పు అయితే దాన్ని దిద్దుతాను
నా దేశం ఒప్పు అయితే దాన్ని అనుసరిస్తాను ‘
అని కేక వేసిన ఒక దేశాభక్తుడైన నా సోదరుని కేకతో …
నా కంఠమూ కలుపుతాను …
అన్నదెవరో కాదు, మూఢ నమ్మకాలపై కన్నేర్రజేసి, తాయత్తు గమ్మత్తులను చిత్తు చేసి జోగినీ చెల్లెళ్ళ జీవితాల్లో వెలుగునింపిన, నేరస్థ జాతుల్ని జనజీవన స్రవంతిలో కలిపిన సంస్కరణోద్యమ ధీర వనిత,  కవికోకిల నవయుగ వైతాళికుడు జాషువా ముద్దుబిడ్డ కవితాలత హేమలత .   అమ్మ హేమలతాలవణం భౌతికంగా దూరమై అప్పుడే ఆరేళ్ళు.  కానీ ఆమె స్మృతులు  మా మదిలో సజీవంగానే ..  ఒక వ్యక్తిగా కాదు శక్తిగా ఆమె చేసిన సాంఘిక కార్యక్రమాలు కళ్ళముందు సజీవ చిత్రాలుగా కదలాడుతూనే ..
బాల్యములో అందరి ఆడపిల్లల్లాగే ఎదిగిన హేమలత వ్యక్తిత్వంలోకి తొంగి చూస్తే ఆవిడ ఏమిటో అర్ధమవుతుంది.
అస్పృశ్యత కూడా మూఢ నమ్మకమే . కుల భేదం , మత భేదం, మూఢ నమ్మకాలు … ఈ మూడూ మానవ కుటుంబాన్ని ముక్కలు చేసి వేరు చేసాయి.   నాటినుంచి ఈ నాటివరకు మానవ జాతి దీనిని ఎదుర్కుంటూనే ఉంది.  ఆనాడు మరీ కరుడుగట్టిన అజ్ఞానం, అగ్రకులం, కింది కులం, వారు గౌరవింప దగినవారు , వీరు దూరంగా ఉంచవలసినవారు అనే ఆచరణ పేరుకు పోయినరోజులు . ఒక్క మనుషుల మధ్యే కాదు ఈ బేధం . వస్తువుల మధ్య , పండుగల మధ్య , నీరు ఆహారాల మధ్య … అన్నింటి మధ్యా ఈ అంటరానితనం అడ్డుగోడ.   ఒక్క గాలి , ఎండ, వెన్నెలకే లేదు .  ఒక వేళ  వాటికీ అడ్డు పెట్టగలిగితే వీటిని కూడా అడ్డుకునే వారేమో !  అంటారామె .
బైబిలు చదివి , ప్రార్థనలు చేసి , తాతగారి క్రైస్తవ బోధనలు విని అప్పుడప్పుడు చర్చికి వెళుతుండే హేమలతతో ” అమ్మాయీ.., దేవుడు లేడు ” అనే మనిషిని చూసాను అన్న తండ్రి మాటలు దిగ్బ్రాంతి చెందించాయి.  ఆ మాటలు ఆమెను ఆకర్షించాయి.   తండ్రితో ఆ మాటలు అన్న వారిని చూడాలన్న, వారి మాటలు వినాలన్న జిజ్ఞాస గోరా, సరస్వతి గోరాలను కలవడానికి కారణమయింది.  వారి పరిచయం , వారు నడిపే “సంఘం” పత్రిక చదవడం ఆమె జీవిత విధానాన్ని మార్చివేశాయి. ఆమెను నాస్తికురాలిగా మార్చాయి.  గోరా , జాషువాల స్నేహం దిన దిన వర్ధమానమవుతున్న సమయంలో   గోరాగారి పెద్దకుమారుడు లవణం, జాషువాగారి  చిన్న కుమార్తె హేమలతకి పెళ్లి చేయ్యాలనుకున్నారు. సాంప్రదాయానికి విరుద్దంగా గోరాగారి ఆహ్వానంపై పెళ్ళికొడుకును చూడడానికి 1959 నవంబరులో జాషువా గారితో కలసి  హేమలత విజయవాడలోని నాస్తిక కేంద్రానికి వెళ్ళారు.  పెద్దలు అప్పటికప్పుడే వారి పెళ్లి 1960 జనవరి 12 వ తేదిన సేవాగ్రాం లో జరగాలని నిశ్చయించారు.
HEMALATHA LAVANAM___1
నాస్తిక కేంద్రంలో నిరాడంబరమైన జీవన విధానం హేమలతని ఆకట్టుకుంది.  కుల, మత రహిత సమాజం కోసం వారు తీసుకున్న నిర్మాణాత్మక కార్యక్రమాలు ఆమెను ప్రోత్సహించాయి. గోరా గారి కుటుంబం ఏమి చెప్పే వారో అదే ఆచరించే వారు.  కట్న కానుకలకు , ఆడంబరాలకు తావేలేక పోవడం ఆమెను ఆకర్షించింది.
పెళ్ళికోసం సేవాగ్రాం వెళ్ళగానే ఆమెకు కలిగిన భావాలిలా అక్షరీకరించారు
“ఇదే నాడు శాంతి నివాసం
అదే నాదు బాపూ వాసం
ప్రేమఝరులు ప్రవహించేనిచ్చట
సత్యాహింసలు మొలచెనిచ్చట
శాంతి సస్యములు పడిన విచ్చట
త్యాగ చంద్రికలు విరిసిన విచ్చట
………
వినుకొండలో పుట్టి పెరిగిన హేమలత చదువు మద్రాసులో సాగింది. ఆమెకు తల్లిదండ్రులు , స్నేహితులు , బంధువులు , నవలలు, జీవత చరిత్రలు , సాహితీ గ్రంధాలు, సాహితీ సమావేశాలూ  తప్ప సామాజిక జీవన పరిస్థితులు తెలియదు. అత్తవారింట అందుకు భిన్నమైన వాతావరణం.  సాంఘిక దృష్టి, సాంఘిక సమస్యలు, సమాజపు మార్పు , నాస్తిక జీవన విధానం , సత్యాగ్రహాలు, శాస్త్రీయ పరిజ్ఞానం … కార్యక్రమాలు.. అంతా కొత్తగా .. అందరూ ఆప్యాయంగా  నాస్తిక జీవన విధానానికి అలవడుతున్న ఆమె ఆలోచనల్లో మార్పు. భావాల్లో మార్పు .. భయాలు పోయి మనసు విచ్చుకుంది.
మన వ్యక్తిత్వం మన జీవితాన్ని నడుపుతుంది.  అయితే జీవితపు దిశ , నిర్ణయం మలుపులు మన చేతిలోనే ఉంటుంది . అలా మన చేతుల్లో దిశా నిర్ణయం లేకుంటే మన జీవితపు దిశ ఎదుటి వాళ్ళ చేతుల్లో ఉంటుంది  అంటారు అమ్మహేమలత  .
నాస్తికమార్గంలో .. 
వివాహానంతరం అత్తింటికి చేరిన ఆమె ఉదయం లేచి చూసిన దృశ్యం వారి పూరింటి ముందు మామ గోరా ఊడుస్తూ , గేదెల పాకలో అత్త సరస్వతి పాలు పితుకుతూ , ఉసిరి చెట్టు నీడలోనున్న పాకలో లవణం, విజయం, సమరం ప్రెస్లో , మైత్రి, విద్యలు రాత్రి భోజనం తాలుకు అంట్లగిన్నెలు తోముతూ . కేంద్రమంతా ఎప్పుడో మేల్కొంది.  ఆలస్యమైనందుకు సిగ్గు పడింది. వారిపనులు వారు చేయడం, పనుల్లో ఆడ మగ తేడా లేకపోవడం ఆమెను ఆశ్చర్యపరిచింది.  కులమత అడ్డు గోడలు లేని ఈ మానవ కేంద్రం ఆమె ప్రపంచాన్ని విశాలం చేసింది. విశ్వపుటంచుల్ని తాకి నిల్చేలా చేసింది. నాస్తిక జీవన విధానం లోని నిర్భయత్వాన్ని రుచి చూసింది.
ఒకరోజు హేమలత తాత గారు ఆమెను చూడడానికి వచ్చారు.  మాటల్లో అమ్మాయీ భగవంతుని ధ్యానం మరువ లేదు కదా అని అడిగారు.  నేను నాస్తికురాలిగా మారిన తర్వాతే ఈ ఇంటికి వచ్చాను. ఇక్కడ దేవుడు , పూజ , ప్రార్ధన అనే వాటికి తావు లేదని చెప్పి ఆయన కోపానికి గురైంది. చిరునవ్వే ఆభరణంగా , ఖద్దరు లేదా నేత బట్టల్లో ఆమె నిరాడంబర నాస్తిక జీవన మార్గంలోనే జీవించింది.
సంస్కరణ – నేపథ్యం  
హేమలత పెళ్ళయిన తర్వాత లవణం గారితో కలసి వినోభాభావే పాదయాత్ర జరుగుతున్న చంబల్ లోయకు వెళ్ళారు.  ఆ సమయంలో బందిపోట్ల క్రూర బీభత్సాన్ని , వారి హత్యల రక్తంతో తడిసిన భూమిని శాంతి ధామంగా మార్చాలన్న ప్రయత్నంలో ఉన్నారు వినోభా .
ఆ రోజు అర్దరాత్రి దాటాక బందిపోట్లు లొంగిపోవడానికి వినోభా దగ్గరకు వస్తున్నారన్న వార్త  హేమలతని భయకంపితురాలిని చేసింది.  మాములుగానే దొంగలు అంటే వణికిపోయే సున్నిత మనస్కురాలైన హేమలత .. ఆ అర్ధ రాత్రి , ఆ లోయల్లో .. అంధకారంలో .. బందిపోటు దొంగలు ..  గజ గజలాడింది. మరుసటి రోజు ఆ బందిపోట్ల నాయకుడు పూజారి లుక్కారాం ‘బహెన్ బహెన్ ‘ అని పిలువడంతో ఆమె భయం పోయింది.  ఆ సంఘటన వాళ్ళూ మనుషులే కదా అన్న ఆలోచనకు , తర్వాతి కాలంలో స్టువార్టుపురం నేరస్తుల సంస్కరణకు బీజం వేసింది.
వాసవ్య విద్యాలయం 
హింస కాదు అభివృద్ధి  – అహింస అభివృద్ధి
హింస కాదు పరిష్కారం  – శాంతి పరిష్కారం
అని నమ్మే హేమలత గోరా గారి ఆలోచన ప్రకారం ‘వాసవ్య విద్యాలయం ‘1961లో తన పెద్ద ఆడపడుచు మైత్రి తో కలసి ప్రారంభించారు. వాస్తవికత,  సంఘదృష్టి, వ్యక్తిత్వం లక్ష్యంగా నిర్వహించిన ఆ విద్యాలయంలో చదువంటే భయం లేకుండా, వత్తిడి లేకుండా ఆనందంగా బోధనా సాగేది.  spare the child, spoil the rod అన్న విధానంలో సాగేది విద్య.
 కులాంతర వివాహాలు 
కులాంతర , మతాంతర వివాహాలు అతి తక్కువగా ఉన్న సమయంలో కులాంతర , మతాంతర వివాహం చేసుకున్న హేమలత ఆ తరువాతి కాలంలో భర్త, అతని కుటుంబంతో కలసి  ఎన్నో కులాంతర , మతాంతర వివాహాలు జరిపించారు.
‘నా వివాహంతో నా  పుట్టింట మూసుకున్న కులాల మతాల తలుపులూ తెరుచుకున్నాయి . విశ్వమానవతా  పవనాలు చొరబడ్డాయి.  ఈ వివాహంతో చిన్నక్క కుటుంబంలో అన్నీ సమ సమాజ నిర్మాణానికి బాటలు వేసిన వివాహాలే జరిగాయి. స్వార్థపూరిత సాంఘిక కట్టుబాట్లను తెంచి ఈనాడు అందరూ అర్హమైన పదవుల్లో అలరారుతున్నారు’ అంటారు హేమలత
040
సంఘసంస్కర్తగా … 
మన దేశంలో స్వాతంత్రం  రాక ముందు ఎన్నో సంస్కరనోద్యమాలు జరిగాయి. కానీ స్వాతంత్ర్యానంతర ఉద్యమాలు రెండే రెండు అనుకుంటా .. ! అవి నేరస్థుల సంస్కరణ, జోగినీ దురాచార నిర్మూలన.  ఆ రెండూ హేమలతాలవణం దంపతుల ఆధ్వర్యంలోనే జరగడం విశేషం.
స్టువార్టుపురం అనగానే మనందరికీ గుర్తొచ్చేది అక్కడి గజదొంగలే. ఆ పేరు వింటేనే అంతా  ఉలిక్కి పడతారు.  అలాంటి చోటుకి 1974లో హేమలత అడుగుపెట్టారు.  అది మామూలు అడుగు కాదు. ఒక సాహసోపేతమైన అడుగు. ఒక వినూత్నమైన సంస్కరణకు మార్గం వేసిన అడుగు.  వినోభా బావే నుండి పొందిన ఉత్తేజం ఆమెను ఆ అడుగు వేయించింది. అదే ఆమెనీ సాహస కార్యానికి పురిగొల్పింది.
అటు దొంగలకు ఇటు పొలీసు అధికారులకు మధ్య వారధిలా ఉండి సమావేశాలు నిర్వహించడం, ఆ దొంగల ఇల్లు ఇల్లు తిరిగి వారి జీవన స్థితిగతులు తెలుసుకోవడం … ఈ క్రమంలోనే వారికి ఆమెపై ఆమె చేసే కార్యక్రమాలపై నమ్మకం ఏర్పడింది.  ఆమె జీవన సహచరుడు లవణం, గోరాగారి కుటుంబం ఆమె పక్కన నిలబడి అండగా నిలిచి మనో ధైర్యాన్ని నింపారు. .
సువార్టుపురం వెళ్ళినప్పుడు వాళ్ళు కాఫీ ఇచ్చినా , భోజనం చేయమన్నా స్వీకరించేది కాదు.  మీరు దొంగతనం చేసి తెచ్చిన సొమ్ముతో పెట్టే తిండి నాకు వద్దు.  మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము అయితేనే స్వీకరిస్తాను అని నిర్మొహమాటంగా ఆమె చెప్పిన మాటలు వారిని బాధించినప్పటికీ, వారి మనస్సులో ఆలోచనను రేకెత్తించాయి.  కరుడుకట్టిన జీవితాల్లో మార్పుకు దోహదం చేశాయి.
1975లో “మా కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు  పొలీసు వారి నుండి రక్షణ కల్పించండి .  వాళ్ళ హింసకు తాళలేక పోతున్నాం ”  అని విన్నవించిన కుటుంబాల్లో నేడు సామాజిక మార్పు.  ఆ మార్పు పరిమాణం స్పష్టంగా ప్రపంచానికి అగుపిస్తూ… వారి ఆలోచనల్లో కొత్తదనం, తరతరాలుగా వస్తున్న నేరసంస్కృతిని, ప్రవృత్తిని చేధించే తత్వం .. సంకల్పమ్. జనజీవన స్రవంతిలో కలసిపోవాలన్న ఆరాటం .. మూడు తరాల సాంఘిక చైతన్యం కనిపిస్తుంది వారి మాటల్లో, నడతలో .
ఎంత గాడాంధకారంలోనైనా సన్నని వెలుగు కనిపించి మనకి మార్గం చూపుతుంది. అదే విధంగా ఎంతటి దుర్మార్గులలోనైనా మంచి ఎంతో కొంత ఏ మూలో దాకుని ఉంటుంది అని నమ్మి ఆ మంచి వెతుక్కుని దాని ఆసరాతో ముందుకెళ్ళే ఆశా జీవి హేమలత.  నేరస్థ సంస్కరణోద్యమంలో ఓ వైపు దొంగల్ని, మరో వైపు పోలీసుల్ని, ఇంకో వైపు సమాజం అన్నింటినీ సమన్వయ పరుచుకుంటూ పనిచేస్తూ ముందుకు సాగిన ధీర ఆమె.
దాదాపు నలబై ఏళ్ల క్రితం పురుడు పోసుకున్న నేరస్తుల సంస్కరణోద్యమ కార్యక్రమాలు  ఇక అవసరం లేదనుకుంటా .. కారణం ఇపుడక్కడ బతకడం కోసం దొంగతనం చేసేవాళ్ళు, దొమ్మీలు , లూటీలు చేసే వాళ్ళు లేరు. వారి పిల్లలు చదువుకున్నారు. చదువుకుంటున్నారు.  శ్రమ జీవనం గడుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. వారి జీవితాల్ని వారు అమ్మ హేమలతాలవణం , ఆమె నెలకొల్పిన సంస్కార్.
అమ్మా అన్న పిలుపు 
దొంగతనానికి వెళ్ళినప్పుడు అయిన గాయం సలుపుతుంటే బల్లాని అంకయ్య అనే వారెంటు ఉన్న దొంగ బాధపడుతున్నాడు. అతన్ని పోలీసుల పర్మిషన్ తో ఆసుపత్రికి తీసుకెళ్ళింది హేమలత. బాధనుంచి ఉపశమనం పొందిన అతను మరుసటి రోజు హేమలతను కలసి “అమ్మా ! మీ దయ వల్ల  నొప్పి తగ్గింది. బాగా నిద్ర పోయాను తల్లీ !’ అన్నాడు ఆమె పాదాలకు నమస్కారిస్తూ .. అలా మొదటి సారి అతని నోట  అమ్మా అన్నపిలుపుతో పులకించిన హేమలత ఆ తర్వాతి కాలంలో వేలాది మందికి ‘అమ్మ ‘ అయింది. అది ఆమెకు బిరుదుగా మారింది.
జోగినీ దురాచార నిర్మూలన 
ఓ పక్క నేరస్థుల సంస్కరణ కార్యక్రమాలు, మరో పక్క కులరహిత సమాజం కోసం పనిచేస్తూ, ఉప్పెన వంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ముందువరస నిలిచి ఆపన్నులకు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు.  హేమలతాలవణం దంపతులు చేసే సేవా కార్యక్రమాల గురించి తెలిసిన ఆనాటి గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషి ఆనాడు నిజామాబాద్ జిల్లాలో కొనసాగుతున్న జోగినీ దురాచార నిర్మూలనకు పని చేయవలసిందిగా ఆహ్వానించారు.  ఆ విధంగా జోగిని దురాచారాన్ని గురించి తెలుసుకున్న అమ్మ తీవ్రంగా చలించింది.  ఈ నాగరిక సమాజంలో సాంప్రదాయం ముసుగులో  అలాంటి అమానవీయ ఆచారాలు  కొనసాగడం, అణగారిన వర్గాలలోని మహిళలు ఆ ఆచారపు కోరల్లో చిక్కి గిజగిజలాడిపోవడం ఆమెను చలింపజేసింది.  వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఎంత కష్టనష్టాలకైనా ఎదురొడ్డి నిలవాలని నిర్ణయించుకున్నఅమ్మ వెంటనే కార్య క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంది.  బలంగా వేళ్ళూనుకుని ఉన్న దురాచారాన్ని రూపుమాపాలంటే ఈ దురాచారం గురించి ప్రజలలో ప్రచారం చేయడమే కాకుండా ఒక చట్టం అవసరమని భావించింది హేమలత.  ఆవిడ సంస్కార్ సంస్థ ద్వారా గట్టి ప్రయత్నం చేసింది. ప్రభుత్వం పై వత్తిడి తెచ్చింది. ఫలితంగా  జోగిని, బసివి, మాతమ్మల దురాచార నిర్మూలనా చట్టం 1988లో వచ్చింది.
సమాజం అంగీకరించిన , సాంప్రదాయం ఆమోదించిన వికృతాచారపు కోరలనుండి వేలాదిమంది మహిళలు బయటపడేలాచేయడమంటే సామాన్య విషయం కాదు.  ఎంతో ప్రతిఘటన ఎదుర్కొంది.  దుర్భర దారిద్యంలో నిత్యం అవమానాలు అవహేళనలతో, తమ శరీరంపై తమకి హక్కులేని స్థితిలో  ఇది తమ తలరాత అనుకునే వారి తలరాతను మార్చింది అమ్మ. వారిని గౌరవంగా చెల్లీ అని పిలిచి సమాజం చేత కూడా అలా పిలిపించుకునే గౌరవాన్నిచ్చింది.
‘ఎవరు చేశారమ్మా నిన్నిలా ?!
వెన్నెలా నీ బతుకు నల్లనీ రేతిరలే
ఎవరు చేశారమ్మా నిన్నిలా ?!
వన్నెలా ని బతుకు వాడినా జోగిలా
ఓ! పోశవ్వ చెల్లీ!  ఓ లచ్చవ్వ తల్లీ !
ఎందుకున్నా వమ్మా మౌన మునిలా ?!
తిరగబడి నీ బ్రతుకు దిద్దుకో చెల్లెలా
ఎవరు మూశారమ్మ నీ నోరు మూగలా?!
నోరిచ్చి నీ పరువు నిలుపుకో చెల్లెలా
………………
నిప్పులే చెరుగమ్మా చెల్లెలా !
జోగి యాచారమ్ము బుగ్గి బుగ్గైపోవ !
నిప్పులే చేరుగమ్మ చెల్లెలా
బసివి యాచారమ్ము నుగ్గు నుగ్గై పోవ
అంటూ అమ్మ జోగినీ చెల్లెళ్ళని చైతన్యం చేశారు. ప్రశ్నించడం నేర్పారు. పెద్దలకు, భూస్వాములకు వినపడేలా ఒక నగారా మోగించారు. ఈ క్రమంలో ఎన్నో ఎదురు దెబ్బలు , ఆటుపోట్లు .. అన్నీ అధిగమిస్తూ ఆత్మవిశాసంతో సాగారు హేమలత.
 అమ్మ చేసిన అనేక సాహసోపేత నిర్ణయాలు, కార్యక్రమాల వల్లే  వారూ , వారి కుటుంబాలు ఇప్పుడు  గౌరవనీయమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు .  ఇప్పుడు వారికి అవమానం అంటే తెలిసింది. గౌరవప్రదమైన జీవితం ఏమిటో ఆర్ధమైంది.  నేడు నిజామాబాదు జిల్లాలో జోగిని ఆచారం రూపుమాసింది.  ఇప్పుడు వారి కుటుంబాల్లో పిల్లలకి కూడా జోగుపట్టం గురించి తెలియదు.  ప్రభుత్వం , సంస్కార్ సహకారంతో వారి జీవితాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. చేసిన అమ్మ హేమలత ఎందరికో ఆరాధ్యనీయురాలు.
ఎన్ని సత్కారాలైనా తక్కువే!

ఎన్ని సత్కారాలైనా తక్కువే!

జాషువా ఫౌండేషన్ 
దారిద్ర్యం అంటే ఏమిటో ఆమెకు బాగా తెలుసు. అందునా మహోన్నతమైన భావాలను నింపుకొని అక్షర వ్యవసాయం చేసే కవులెందరో అనుభవించిన దారిద్య్ర్యాన్ని కనులారా చుసిన్దామే. కవి పుత్రి అయిన హేమలత కవులను సన్మానించి, సమాదరించాలని భావించింది. కన్న తండ్రి జాషువా జ్ఞాపకార్ధం జాషువా ఫౌండేషన్ ద్వారా వివిధ భారతీయ భాషల్లోని ప్రముఖ సాహితీ వేత్తలను గుర్తించి వారికి జాషువా సాహిత్య పురస్కారం అందించారు.
గౌరవ డాక్టరేట్ అందుకుంటూ...

గౌరవ డాక్టరేట్ అందుకుంటూ…

రచయిత్రిగా 
నేరస్థుల సంస్కరణ అనుభవాలతో రాసిన పుస్తకాలు రెండు. ఒకటి నేరస్తుల సంస్కరణ , జీవన ప్రభాతం.  ఈ నవలకు తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం పొందింది.  జోగినీ దురాచార నేపథ్యంలో నవల రాస్తున్న క్రమంలోనే అమ్మ మనకు దూరం కావడం సాహితీ లోకానికి ఎనలేని లోటు.  అసంపూర్తిగా ఉన్న ఆ పుస్తకాన్ని ఆమె జీవన సహచరుడు లవణం గారు మనముందు ఉంచే ప్రయత్నంలో ఉన్నారు. మా నాన్నగారు , అహింసా మూర్తుల అమరగాదలు, జాషువా కలం చెప్పిన కథ, తాయత్తు గమ్మత్తు , మృత్యోర్మా అమృతంగమయ వంటి పుస్తకాలు వెలువరించారు అమ్మ.
HEMALATHA LAVANAM___2
నాకు కులం లేదు , మతం లేదు అనే అమ్మ హేమలత వటవృక్షంలా నిలిచి చేయి చాచి ఆపన్నులకు ఇచ్చిన చేయూతని, తద్వారా వారి కుటుంబాల్లో నిండిన వెలుగుని అనుభవిస్తున్న వారు  ఎప్పటికీ మరువలేరు.  సంస్కరణలో అలుపెరుగని యోధ , మానవతావాది , అహింసావాది అమ్మ హేమలతాలవణం బిడ్డలలో నేనూ ఒకరిని.  ఆమె బిడ్డలందరి తరపున అమ్మకి అక్షరాంజలి ఘటిస్తూ.. .
వి . శాంతిప్రబోధ

కళ్ళారా చూసిన “ఖైదీ” షూటింగ్!

 

 memories-1

నాకు చిన్నప్పట్నుంచే సినిమా చూడ్డం ఒక్కటే కాకుండా దానికి సంబంధించిన అంశాల మీద కొంత ఆసక్తి ఉండేది. వజ్రాయుధం షూటింగ్ సమయంలో మా అమ్మ వాళ్ళు సోమశిల కి వెళ్లింది. అప్పట్లో నేనూ వస్తానని ఏడ్చానో లేక షూటింగ్ అంటే ఏంటో తెలియని కారణాన నేను ఆసక్తి చూపించలేదో తెలియదు కానీ, అమ్మ తిరిగొచ్చాక మాత్రం షూటింగ్ విషయాలు చెప్తుంటే ఆశ్చర్యపోయాను. ముఖ్యంగా వజ్రాయుధం సినిమాలో పెద్ద పెద్ద బండ రాళ్లు పని వాళ్ల మీద పడి చనిపోయే ఒక సీన్ ఉంటుంది. మా అమ్మ వాళ్లు వెళ్లినపుడు అదే సీన్ షూటింగ్ జరుగుతోందట. ఆ బండరాళ్లన్నీ అట్టముక్కలతో చేసినవని చెప్పడం నాకు గుర్తుంది.

షూటింగ్ అనగానే గుర్తొచ్చే మరోక జ్ఞాపకం ఖైదీ సినిమా గురించి. ఖైదీ సినిమాలో చిరంజీవి ఆవేశంగా అరటి తోట ని నరికేసే సీన్ ఒకటుంటుంది. అది నెల్లూరు నుంచి బుచ్చి రెడ్డి పాళెం అనే ఊరికి వెళ్లే మధ్యలో వచ్చే ఒక తోటలో షూటింగ్ చేశారట. ఆ విషయం బస్సు లో వెళ్తుంటే మా మామ ఒక సారి చెప్పాడు. అప్పట్నుంచీ బస్ లో వెళ్తున్నప్పుడల్లా ఆ అరటి తోట చూసే వాడిని.

index

అప్పటి వరకూ షూటింగ్ గురించి వినడమే కానీ ఒక సినిమా షూటింగ్ ప్రత్యక్షంతా చూడ్డం మాత్రం ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు చాలా యాక్సిడెంటల్ గా జరిగింది. ఆ రోజు రాత్రి నాకింకా బాగా గుర్తుంది. అప్పటికి నాకు సైనిక్ స్కూల్లో సీట్ వచ్చింది. వేకువజామునే ప్రయాణం. నెల్లూరు నుంచి విజయనగరం వెళ్లాలి. మా బాబాయి వాళ్ల రూం లో ఉన్నాం. ఇద్దరికీ నిద్ర పట్టటం లేదు. ఏం చెయ్యాలో తెలియక సినిమాకి వెళ్దామన్నాడు నాన్న. నెల్లూరు లోని హరనాథపురం నుంచి నర్తకి థియేటర్ కి బయల్దేరాం. దారిలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గరకు రాగానే కాస్తా హడావుడిగా ఉండడంతో ఇద్దరం అక్కడ ఆగాం.

అర్జున్ నటించిన ఏదో సినిమా షూటింగ్ జరుగుతోంది. రైలు వస్తుండగా అర్జున్ బ్రిడ్జి మీద నుంచి కిందకు దూకాలి. అదీ సీన్. ఆ సినిమా ఏంటో ఇప్పటికీ తెలియదు. కానీ అప్పటికే మా పల్లెలో గోపాలుడు ద్వారా అర్జున్ కి వీరాభిమానిని నేను. కానీ చూసిన కాసేపటికే చిరాకొచ్చింది. అవతల షో టైం అవుతుందన్న కారణమొకటయ్యుండొచ్చు. లేదా అర్జున్ బదులు అతనిలా ఉండే డూప్ బ్రిడ్జి మీద నుంచి కింద ఉన్న అట్టపెట్టెల మధ్య వేసిన పరుపుల మీదకు దూకడం చూసి సినిమా అనేది పచ్చి మోసం అని తెలిసిరావడం కూడా అయ్యుండొచ్చు.

ఆ షూటింగ్ చూసిన చాలా రోజుల వరకూ నేను సినిమా షూటింగ్ కళ్ళారా చూశానని మా క్లాస్ మేట్స్ వద్ద గొప్పలు చెప్పుకునే వాడిని.  అ తర్వాత ఏడేళ్లకు ఒక పూర్తి స్థాయి సినిమా షూటింగ్ చూసే అవకాశం కలిగింది. మా స్కూల్లో దాదాపు నెల రోజుల పాటు భారీ తారాగణంతో కోదండరామి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బొబ్బిలి సింహంసినిమా షూటింగ్ జరిగిన రోజులవి. అప్పట్లో నేను పన్నెండో తరగతిలో ఉన్నాను. అంటే స్కూల్లో మేమే కింగ్స్ అన్నమ్మాట. మిగతా జూనియర్స్ అందరినీ షూటింగ్ స్పాట్ లోకి రానీకుండా ఆపే బాధ్యత మాదే! ఆ బాధ్యత ఎలా నిర్వహించామో పక్కన పెడితే, ఆ సాకుతో షూటింగ్ చూడ్డానికి వెళ్లిపోయే వాళ్లం.

Bobbili Simham (1994)1

అలా మొదటి సారిగా బాలకృష్ణ, మీనా, రోజా, బ్రహ్మానందం, శారద లాంటి పెద్ద పెద్ద నటీనటులను నిజంగా చూడగలిగాను. కానీ వాటన్నిటికంటే ఎక్సైటింగ్ గా అనిపించిన విషయం ఏంటంటే, ఫిల్మ్ మేకింగ్ అనే ప్రక్రియ ను మొదటిసారిగా పరిశీలించి కొంత అర్థం చేసుకోగలగడం.

సినిమాలో ఒక సీన్ లో బాలకృష్ణ, రోజా (మీనా?)లతో బెడ్ రూం లో ఒక సీన్ ఉంటుంది. వాళ్ళు బెడ్ రూంలో ఉండగా శారద వాళ్లని కిటికీ లోనుంచి దొంగతనంగా చూస్తుంది. అయితే అక్కడ బెడ్ రూం గా తీసిన గది మా స్కూల్ లైబ్రరీ. శారద తొంగి చూసే కిటికీ అసలా బిల్డింగ్ లోనే లేదు; అక్కడెక్కడో దూరంగా ఉండే క్లాస్ రూం కిటికీ అది. కానీ ఈ రెండు షాట్స్ ని వరుసగా చూసినప్పుడు శారద వాళ్లనే చూసినట్టు ప్రేక్షకులకు అనిపిస్తుంది.

షూటింగ్ చూసినప్పుడు పెద్దగా ఏమీ అర్థం కాలేదు. కేవలం యాక్షన్, కట్ అనే పదాలు తెలిశాయి. కానీ సినిమా లో పైన చెప్పిన సీన్ చూశాక నాకు మొదటి సారిగా ఎడిటింగ్ అనే విషయం గురించి తెలిసొచ్చింది.

మా స్కూల్లో బొబ్బిలి సింహం షూటింగ్ రోజుల్లో, సాయంత్రం అయ్యాక కోదండరామి రెడ్డి గారు వాకింగ్ కి మా హాస్టల్ వైపు వచ్చేవాళ్ళు. అప్పటికే మణిరత్నం, వర్మ సినిమాలు చూసి పిచ్చెక్కిపోయి సినిమా దర్శకుడైపోవాలని కలలు మొదలయ్యాయి మాలో కొంతమందికి.  మాది నెల్లూరే మీదీ నెల్లూరే అనే చనువుతో వెళ్లి కోదండరామి రెడ్డి ని పలకరించాం. సినిమాల్లోకి రావాలన్న మా కల గురించి చెప్పాం. ఆయన మమ్మల్ని బాగా చదువుకోమని ప్రోత్సాహించారు. సినిమా పరిశ్రమలోని కష్టాలు చెప్పి మా ఆశల మీద నీళ్ళు చిలకరించారు.

ఆ తర్వాత పదిహేనేళ్లకు మొట్టమొదటి సారిగా ఒక సినిమా కి పూర్తు స్థాయిలో పని చేసే అవకాశం వచ్చినప్పుడు, ఆ సినిమా షూటింగ్ యాధృచ్చికంగా మా స్కూల్లో నే చెయ్యాలనుకోవడం, అందుకు కావాల్సిన పర్మిషన్ లు, గట్రా అన్నీ నేనే ఏర్పాటు చేయడం జరిగాయి. అంతే కాదు పదిహేనేళ్ల క్రితం సినిమాల్లో పనిచెయ్యాలనే కలతో బయటకు అడుగుపెట్టి, తిరిగి అన్ని రోజుల తర్వాత షూటింగ్ చెయ్యడానికే తిరిగిరావడం ఒక మధురమైన జ్ఞాపకం.

*****

పున్నాగపూల పరిమళం !

2(1)

ఈ పూల పరిమళాన్ని హృదయంలో పదిలంగా భద్రపరచుకోండి.
‘‘కొన్ని పుస్తకాలని రుచి చూసి వదిలేయాలి. కొన్ని పుస్తకాలని చదివి జీర్ణం చేసుకోవాలి.’’  అని చిన్నప్పుడెప్పుడో చదువుకున్న జ్ఞాపకం. అలా చదివి జీర్ణం చేసుకోవల్సిన పుస్తకం ఎదురైతే మనం మనలాగా ఉండలేము కదా! అందుకే మరో వైపు మిత్రులతో ఈ సంభాషణ.
‘‘దేవుడు మనుషులను సృష్టిస్తే మనిషి తన అవసరాల కోసం వస్తువులను సృష్టించుకొన్నాడు. వస్తు మయ ప్రపంచంలో మనిషి మస్తుగా కూరుకుపోయిన తరువాత సాటిమనుషులను తనను సృష్టించిన దేవున్ని ప్రేమించడం మానేసి వస్తువులను ప్రేమించడం నేర్చుకున్నాడు. అందుకే ఇప్పుడు మనిషి మనిషిలాగా లేకుండా ఒక వస్తువులాగా మారిపోయాడు.’’ అని తరచూ ఆధ్యాత్మిక ప్రవచనకారులు ఉపన్యసిస్తూఉంటారు.
ఒక వస్తువుగా మారిన మనిషి మరలా మనిషిగా మారాలంటే ఏం చేయాలి? తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందంగా ఆహ్లాదంగా ఉంచడానికి మనిషిలో ఎలాంటి మెటామార్ఫసిస్‌ జరగాలి? అతడి అంతరంగంలో ఎన్ని యుద్ధాలు జరగాలి? ఈ సంగ్రామంలో ఎన్ని సార్లు క్షతగాత్రులవ్వాలి?
”The Greatest Discovery of My Generation is that Human beings by changing the inner attitudes of their needs can change the outer aspects of their lives”    అని కదా హెన్రీజేమ్స్‌ అన్నది. తమ తమ సోకాల్డ్‌ అవసరాల అంతర్గత దృక్పధాలను ఎలా మార్చుకోవాలి. అలా మార్పును పరిపూర్ణంగా పొందే ప్రాసెస్‌ ఎంత హృద్యంగా, ఎంత సహజంగా జరగాలి? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానమే నేను ఇటీవల చదివిన పుస్తకం. ఆ పుస్తకం పేరు పున్నాగపూలు. ఒక తెలుగు నవల. రచయిత్రి జలంధర.Jalandhara Garu
పున్నాగపూలని ఒక నవల అనడం కంటే అనేకానేక బాధిత వ్యక్తిత్వాలు అనే పున్నాగపూలను మార్పు కోసం చేసే ప్రయత్నం అనే దారంతో గుదిగుచ్చి పాఠకుడి మెడలో వేసిన వసివాడని హారం అంటే బాగుంటుంది.
రాధ ఒక అందమైన మంచి అమ్మాయి. మంచి ఇల్లాలు. మంచిగా ఉండాలని మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించే అమ్మాయిలు సంఘం కక్ష కడితే విక్టిమైజ్డ్‌ రోల్‌ లో ఇమిడిపోతారు. ఇందులో చాలా మంది సినిక్స్‌ అయిపోయి చాలా భయంకరమైన అత్తగార్లుగా, స్నేహాన్ని ఇవ్వలేని తల్లులుగా తయారయిపోతారు. అట్లా రూపుదిద్దుకున్న ఇల్లాలు రాధ.
సదరు రాధ తన భర్త రాజారావుకి జబ్బుచేస్తే జి.కె. హాస్పిటల్స్‌లో చేర్పించడానికి వెళుతుంది. అక్కడ హాస్పటల్‌ లో తనను తాను పూర్తిగా కనుగొని, సంపూర్ణమైన వ్యక్తిగా తయారు కావడం ఈ నవల యొక్క ప్రధాన ఇతివృత్తం. ఇలా మారడం అనేది ఒక రోజులోనే, ఒక రాత్రిలోనో, ఒక క్షణం లోనో జరిగిన మెటామార్ఫసిస్‌ కాదు. హాస్పిటల్‌కి వచ్చే రక రకాల వ్యక్తులు, వాళ్ళ వాళ్ళ జీవిత అనుభవాలు, వాళ్ళకు ఎదురైన సమస్యలు, వాళ్ళు ఎన్నుకున్న పరిష్కారాలు ఇవన్నీ రాధను సంపూర్ణమైన మనిషిగా తీర్చిదిద్దుతాయి. అన్నిటి కంటే ముఖ్యంగా రాధ ఆలోచించడం నేర్చుకుంటుంది.
ఈ క్రమంలో జలంధర తనదైన స్వరంతో చాలా విషయాలు మాట్లాడింది.
‘‘పిల్లలను పెంచుతూ మాటలు నేర్పిస్తాము. పాటలు నేర్పిస్తాము. టేబుల్‌ మేనర్స్‌ నేర్పిస్తాము. ఆలోచించడం మాత్రం చాలా తక్కువ సార్లు నేర్పిస్తాము. మన మేధస్సులో ఏ తలుపు తీస్తే మరొక అనుభూతుల ఆంతర్యంలోకి తొంగిచూడగలమో, ఆ తలపు తీయడమెలాగో మాత్రం నేర్పించము. తెలివితేటలు నేర్పించే చదువు వేరు. వివేకము జీవితానికి అది ఇచ్చే ఎరుక వేరు. ఆ జ్ఞానం వేరు. ఆ జ్ఞానాన్ని పిల్లలకి మనం నేర్పించాలి. కాని నేర్పించము’’. అంటుంది జలంధర.
నిజమే! మన పిల్లలకి మనం ఆలోచించడం నేర్పిస్తున్నామా? గర్భస్త పిండంగా ఉండగానే కార్పోరేట్‌ స్కూలుకి డొనేషన్‌ ఇచ్చి సీటు రిజర్వు చేసుకొంటాము. 3వ ఏట నుండే, వీలుంటే ఇంకా ముందే ప్రీ స్కూల్‌లకి పంపిస్తాము. పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చదివించడమే నాణ్యమైన విద్య అందించడం అనుకుంటాము. కానీ ఆ విద్య పిల్లలను మరమనుషులుగా మారుస్తున్నదని గుర్తించము. తీరా వాళ్ళు మనం ఆశించినట్లుగా తయారవకపోతే నింద మాత్రం మొత్తం వ్యవస్థ మీద వేస్తాము.
ట్రూత్‌ కెనాట్‌ బి టాట్‌
టీచింగ్‌ మీన్స్‌ హెడ్‌ టు హెడ్‌
ట్రూత్‌ ఈజ్‌ ట్రాన్స్‌మిషన్‌
ఫ్రం హార్ట్‌ టు హార్ట్‌
అన్న విషయం మనకే తెలియదు. మనం పిల్లలకి ఏం అనుభవం లోకి తీసుకొనివస్తాము. పై పెచ్చు మన మిడి మిడి జ్ఞానంతో వాళ్ళ ఆకుపచ్చటి లోకాన్ని పాడుచేస్తాము. శరీర శాస్త్రం ప్రకారం మనిషికి ఒక మెదడు ఉంటుంది. కాని ప్రాక్టికల్‌గా మనిషికి హెడ్‌ బ్రెయిన్‌, బాడి బ్రెయిన్‌ అని రెండు రకాల మెదడులు పనిచేస్తాయి.ఈ రెండిరటిని సరిగ్గా ఉపయోగించడమే పరేంగిత జ్ఞానం. పుస్తకాల జ్ఞానం, ఇంగిత జ్ఞానం రెండూ వేరు వేరని కొంతమందిని చూస్తే తెలుస్తుంది. మన లోని ఆలోచనలు, ఎదుటి మనిషిలోని ఆలోచనా స్రవంతులు తెలుసుకోవాలంటే ఈ రెండు రకాల మెదడులు, వాటి ప్రభావం మన మర్చిపోకూడదు.
పసిపిల్లలు సాధారణంగా తమ బాడీ బ్రెయిన్‌ చెప్పిన మాటను వింటారు. వాళ్ళకు ఇష్టం లేనివి వద్దు అనుకుంటారు. నచ్చని పిల్లలను దగ్గరకు రానివ్వరు. మనం మన పెంపక దోషంతో ముందు పిల్లల ఇష్టా ఇష్టాలను అర్ధం చేసుకోకుండా మనకు మంచిది అన్నది. వాళ్ళమీద రుద్దుతారు. మన ప్రవర్తన, మన మాట వలన ఎదుటివాళ్ళు ఏం అనుకుంటారో, నిజం చెప్తే అంటూ మెల్లగా పిల్లలను ఆ బాడి బ్రెయిన్‌ విస్మరించి హెడ్‌ బ్రెయిన్‌తో ఆపరేట్‌ చేయించడం నేర్పిస్తాము.
మన బాడీ బ్రెయిన్‌ మన గురించి నిజాలు చెప్తుంది. మన హెడ్‌ బ్రెయిన్‌ నువ్వు ఎలా ఉంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా రియాక్ట్‌ అవుతుందో నీ నుండి ఏం కోరుకుంటుందో చెప్తుంది. మన అసలు భరించలేని మనుషులను ఒప్పుకొని భరిస్తే మిగతా ప్రపంచం మనల్ని సహన శీలి అని, మంచి వ్యక్తి అంటారనే ఆలోచనతో వాళ్ళను భరిస్తాము. ఈ భరించడం వెనుక హెడ్‌ బ్రెయిన్‌ ఉంటుంది. కానీ మన బాడి బ్రెయిన్‌ అనుక్షణం సన్నటి గొంతుకతో మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, ఇది కాదు నీకు కావలసిందీ అని. బాడీ బ్రెయిన్‌ని ఎంత త్వరాగా మనం గుర్తిస్తే మనకది అంత త్వరగా మంచి గైడ్‌ అవుతుంది.
ఠాగూర్‌ అనే తెలుగు సినిమాలో శవాన్ని హాస్పిటల్‌కు తీసుకొని వస్తే నానా హడావుడి చేసి డబ్బు సంపాదించే డాక్టర్ని మన చూశాం. కాని ఈ జి.కె. హాస్పిటల్స్‌లో ఉన్న డాక్టర్‌ కృష్ణ అలాంటి డాక్టర్‌ కాదు. ఒక పేషెంటు తన సంతోషం కొద్దీ కోటి రూపాయలు తెచ్చిఇస్తే ఆ డబ్బును తీసుకోకుండా చెడుమార్గంలో వచ్చిన డబ్బు చెడు వైబ్రేషన్స్‌ని కలుగజేస్తుందని తిప్పి పంపిస్తాడు. ప్రతి మనిషి ఇలాంటి హాస్పిటల్‌ ఒకటి మన దగ్గర ఉంటే ఎంత బావుంటుంది అనుకునేంత బావుంటుంది ఈ హాస్పిటల్‌. లోపలికి వెళ్ళగానే కనిపించే మొదటి బోర్డు మీదే ఇలా వుంటుంది.
Here the Patient understands that body heals, and not the Therapy  ఈ విషయాన్ని అర్ధం చేసుకోవటానికి హాస్పిటల్‌లో రక రకాలు పద్దతులు అవలంభిస్తారు. ధ్యానం నుండి చిత్రలేఖనం దాకా. ఈ పద్దతులను చదువుతున్నపుడు మనం మొదట్లో ఆశ్చర్యపోతాం. కాని వాటి వెనుక ఉన్న రీజన్‌, తర్కము తెలిస్తే అద్భుతం అనిపిస్తుంది.
19వ శతాబ్దపు ఉత్తరార్ధంలో కేవలం నొప్పి తగ్గించడానికి మందు వేసుకొనే పద్దతి అమలు లోకి రాగానే వీలయినంత వరకు నొప్పికి కారణాలను అన్వేషించడం మనిషి మానేశాడు. ఎప్పుడైతే ఫిజికల్‌ పెయిన్‌ కి ఫిజికల్‌ లెవల్‌లో మాత్రమే కారణాలు వెతికి అంతర్లీనమైన కారణాలను కొంపలు అంటుకుపోతే తప్ప వెతకడం అనవసరం అనే స్థితికి వైద్యుడు, పేషెంటు ఇద్దరూ వచ్చేశారో అప్పుడే వైద్య రంగంలో మందులు పెరిగి నిజమైన వైద్యం తగ్గుముఖం పట్టింది. మనిషిలోగల అంతర్గమమైన శక్తికి ప్రాముఖ్యం తగ్గిపోయింది.
ఈ అంతర్గతమైన శక్తిని పునరుత్తేజితం చేయడానికే ధ్యానం. ఎఫర్మేషన్స్‌. ఎఫర్మేషన్స్‌ అనగానే మనకు మంత్రోపదేశం గుర్తుకొస్తుంది కదా. జలంధర ఇలా అంటోంది. ‘‘అర్దం చేసుకొని చదివితే అవన్ని ధ్యాన శ్లోకాలు. విజువైలేజేషన్‌ టెక్నిక్స్‌. సంకల్పాలు, స్తోత్రాలు, ఫల స్తుతులు, అఫర్మేషన్స్‌!’’ న చమాత్సార్యం, న లోభో, నాశుభామతి:’’ అని రోజు చెప్తూ ఉంటే మనిషి వ్యక్తిత్వం మారిపోతుంది. వాటికి అర్దంతో పాటు సౌండ్‌, వైబ్రేషన్‌ కలిపి ప్రాక్టీస్‌ చేసినపుడు మన లోపల, మన ఆరాలోను, చుట్టుప్రక్కల వాతావరణంలోనూ కూడా మార్పు వస్తుంది. అలా నీ వైబ్రేషన్స్‌కి తగిన మంత్రం ఇచ్చి నీ వైబ్రేటరీ లెవెల్స్‌ పెంచగలిగిన గురువు దొరికి అనుసంధానం జరిగితే అది అసలు మంత్రోపదేశం. కొంత మంది గురువులు తాము సిద్ది పొందిన మంత్రం ఇవ్వగలరు. కాని నీ జన్మకు ఏది కావాలో తెలుసుకొని, నీ చుట్టూ అతి సున్నితమైన రక్షణ కవచం వేసి, తన ఆత్మ శక్తితో నిన్ను నిరంతంర గైడ్‌ చేస్తూ జన్మ జన్మలకు కాపాడుకుంటూ వచ్చే గురువు దొరికితే అద్భుతం’’
నిజం. శ్రీ చక్రార్చన నిత్యం చేసేవాళ్ళు, గురువు దగ్గర మంత్రోపదేశం పొంది నిత్యం ధ్యానించేవాళ్ళ చాలామంది మొహాల్లో కనపడవలసినంత ప్రశాంతత కనపడదు. కొద్ది మంది బాబాలు గురుదేవులు కూడా ఇందుకు మినహాయింపుకాదు.
ఇక్కడ నా వయక్తిక అనుభవాన్ని ఒక దానిని చెప్తాను. దాదాపు రెండు సంవత్సరాల క్రితం నేను ఇప్పుడు పనిచేస్తున్న బ్రాంచికి బదిలీ అయి వచ్చాను. మొదటి వారం రోజులలోనే ఒక వంద మంది దాకా నన్ను బాబాగారి దర్శనం అయిందా అని ప్రశ్నించారు. అప్పటిదాకా ఒక బాబా ఆ ఊళ్ళో ఉన్నాడని తెలుసును కాని, అంతగా జనాన్ని ప్రభావితం చేశాడని నాకు తెలియదు. పైగా ఆ బాబాగారు నిత్యాన్నదానం కూడా చేస్తారు. అప్పటికే పాల్‌ బ్రంటన్‌తో మొదలుపెట్టి చాలా పుస్తకాలు చదివి ఉండటం చేత బాబా అంటే అంతర్గతంగా ఉన్న ఉత్సుకతతో, ‘‘సత్సంగత్‌యే, నిత్సంగత్వం, నిత్సంగత్వవే నిర్మోహత్వం’’ అని భజగోవిందం శ్లోకం చదువుకుంటూ బాబా గారిని దర్శించుకుందామని ఒక మధ్యాహ్నం వేళ వెళ్ళాను. నేను వెళ్ళే సరికే అన్న దానం కార్యక్రమం జరుగుతోంది. అది అయిపోయింతర్వాత బాబాగారి దర్శన బాగ్యం కలిగింది. బాబా అంటే ఆశ్రమ వాతావరణం ఉంటుందనుకున్నాను. కాని అది మూడంతస్తుల బిల్డింగు. ఏదో కనస్ట్రక్షన్‌ వర్కు జరుగుతున్నది. బాబాగారు పనివార్లకు సూచనలు ఇస్తున్నారు. ఆయన కుడిచేతి రెండు వేళ్ళ మధ్య నిత్యాగ్ని హోత్రంలాగా రగులుతున్నది సిగరెట్టు. నాతో పాటు వచ్చిన వాళ్ళంతా బాబాగారి కాళ్ళమీద పడిపోయారు. ఆయన తన పక్కనే ఉన్న సాయిరాం స్వీట్స్‌ ప్యాకెట్టులోనుండి తీసి తలా ఒక లడ్డూ ఇచ్చారు. దాన్నే మహా ప్రసాదం అనుకొని అందరూ తీసుకొన్నారు.
బాబా అన్న మాట వినగానే, ఆశ్రమానికి వెళుతున్నపుడు, నా మనసులో కౌపీనం కట్టుకొని కూర్చొని మౌన ముద్రలో ఉంటే, చుట్టూ చేరిన కోతులు అల్లరి చేస్తూ మహా చిరాకు పెడుతున్న ధ్యాన ముద్ర చెదరని మహా మౌని ముద్ర ఉంది. ఈ బాబా రూపు చూడగానే నాకు చెప్పలేనంత ఆశాభంగం కలిగింది. ఇలాంటి బాబా ఎలాంటి ఎఫర్మేషన్స్‌ ఇస్తాడు. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను మొదటి సారి కలిసిన బాబా ఉదంతం ఇది.
ఇప్పుడు మంత్రోపదేశం గురించి జలంధర రాసిన ఈ మాటలు చదువుతుంటే నాకు అనివార్యంగా ఈ బాబా గుర్తుకొచ్చారు.
ఐ లవ్‌ మై సెల్ప్‌, ఐ యాక్సెప్ట్‌ మై సెల్ప్‌. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నీ బలహీనతలు బలాలు అన్నింటితోనూ నిన్ను నీవు ఒప్పుకోగలగటం ఎంత కష్టమో ప్రాక్టీసు చేస్తుంటే కాని అర్ధంకాదు. ఎదుటి వారిని ప్రేమించగలిగిన వాళ్ళు చాలా మంది త్యాగాలు చేస్తూ అనాధలకు సేవలు చేస్తూ త్యాగమూర్తులుగా కనపడేవాళ్ళు చాలామంది తమను తాము ప్రేమించుకోలేరు. తమను తాము భరించలేరు. అన్నింటిలోకి తనను తాను భరించడమే కష్టం అంటుంది జలంధర.
ఇలా ఈ నవల గురించి ఎంతయినా చెప్పవచ్చు. ఏ కథతో అయితే జీవింతంలోని ఒక భాగం అర్ధం అయినట్లు ఉంటుందో అది మంచి కథ అని పెద్దిభొట్ల  సుబ్బరామయ్యగారు ఒక సారి అన్నారు. అది నవలకు కూడా వర్తిస్తుంది. ఈ పున్నాగ పూలు ఒక సారి చదవండి. మీ మానసిక ప్రపంచంలో ఏదో ఒక తలుపు తప్పక తెరుచుకుంటుంది.
ఈ వ్యాసంలో చాలా మాటలు నావి కాదు. అవన్నీ జలంధరవి. అందుకే ఈ వ్యాసం జలంధరతో కలసి వంశీరాసిన వ్యాసమని మీరనుకుంటే నాక్కొంచెం తృప్తి.

—వంశీ

cartoon1

http://saarangabooks.com/retired/2014/03/13/9291/

మన పదసంపదని కాపాడుకోలేమా?

      ram  ఈ తృతీయ సహస్రపు గుమ్మంలో నిలబడి  మనం, గడిచిన రెండు వేల ఏళ్ల మానవ చరిత్ర లో లెక్కకు  అందుతున్న, కనీసం వెయ్యేళ్ళ  తెలుగు భాషా  వికాస చరిత్ర ను క్రమబద్ధీకరించుకోవలసిన అవసరం ఉన్నది. గడిచిన శతాబ్దాల భాషా వికాసం, సంస్కృతి  సాహిత్యం లోనే లభ్యమవుతుంది. అందువల్ల ఈ వెయ్యేళ్లలో తెలుగు భాష ఎటువంటి వికాసాన్ని పొందుతూ వచ్చిందో,  పరిశోధనల ద్వారా నమోదు చేస్తూ ఒక బృహత్కోశాన్ని మనం తయారు చేసుకోవడానికి  కావలసినంత కాలమూ గడిచింది. తగ్గ వనరులు  కూడా ప్రభుత్వ శాఖల వద్ద ఇప్పుడు ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలలో వున్న ఒక భావన ఏమిటంటే తగు సూచనలు, ప్రణాళికలు ప్రతిపాదనలు గా రావడం లేదన్నది , వస్తే గనక భాష విషయంలో లోతైన పరిశోధనలకు మద్దతు, నిధుల కొరత లేదు అని సంబంధిత అధికారులు తెలియచేస్తూ ఉన్నారు.
అనేక తత్సమ పదాలతో  కలిసి, ఆఛ్చిక పదాలుగా తెలుగు పదాలు,మొదటి నుంచీ ప్రతి కవి వాడుకలోనూ వున్నాయి. ఇందుకు నన్నయ నుంచి, నన్నెచోడుడి  నుంచి మొదలు పెట్టి,  ఈ ఇరవయ్యో  శతాబ్దం దాకా తెలుగు ఎలా వికాస పరిణామాలు చెందిందో ఒక పెద్ద ప్రాజెక్టును మన తెలుగు సాహిత్య, భాషా పరిశోధక సమాజం రూపకల్పన చేసుకుని ఆచరణలోకి తీసుకురావలిసిన  అవసరం వున్నది.
ఇప్పుడు  ఇటువంటి కృషి ప్రధాన కార్య క్షేత్రం గా,  ఇంతకు ముందు లేనటువంటి  సంస్థలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రాచీన భాష ప్రాతిపదికన మైసూరు లో ఏర్పడిన ప్రాచీన భాషా విశిష్ట  అధ్యయన కేంద్రం ఒకటి. ఇది తెలుగుకు ప్రాచీన భాష హోదా ప్రకటించాక  ఫలస్వరూపం గా ఏర్పడిన  సంస్థ. ప్రస్తుతం  మన రాష్ట్రంలో ఏర్పడి ఉన్న  సందిగ్ధతల దృష్ట్యా కూడా ఈ సంస్థ “సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్”, మైసూరు, ఆధ్వర్యం లో పనిచేస్తున్నది. ఈ ప్రాచీన హోదా వల్ల తెలుగు భాష వికాస పరిశోధనలకు కావలిసిన నిధులను కూడా ఈ సంస్థ ద్వారా మనం పొందగలము. ఆలాగే  కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ, నిర్వహించే భాషా అభివృద్ది సంఘం లో తెలుగు భాష తరపున ఇప్పుడు ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి బాధ్యతలు   చేపట్టారు.
ఒకప్పుడు ఈ ప్రాచీన భాషా హోదాలు,  దాని వల్ల ప్రత్యేక కేటాయింపులుగా నిధులు, వనరులు, వసతులు  అందుబాటులో లేవు. ఇవాళ ఇవి ఏర్పడ్డాక, మన తెలుగు సాహిత్య, విద్యావంత సమాజం తగు లక్ష్యాలను ఏర్పరచుకుని ఈ సంస్థల ద్వారా నిధులు పొంది, తగు కృషి చేయగలిగిన మంచి సందర్భం ఇది. ఇందుకై  మనం ఒక బృహత్ ప్రణాళిక గా ఈ వెయ్యేళ్ళ తెలుగు భాషా వికాస స్వరూపాలు ప్రాజెక్టును ఈ సంస్థల ఆమోదం తో, పలు విశ్వవిద్యాలయాలలోఆయా శాఖల ద్వారా, తదితర సాహిత్య రంగ పరిశోధకులకు  గ్రాంటులు గా నిధులు కేటాయింపులు పొందడం ద్వారా   పెద్ద యెత్తున  మొదలు పెట్టాలిసిన అవసరం, సందర్భం  కూడా ఇప్పుడు ఉన్నాయి.

94917_bapusignature_logo_jpg
ఈ బృహత్కోశం పని మూడు భాగాలుగా మూడు దశలలో జరగవలిసి వుంటుంది. ప్రతీ కవి తన రచనలో భాగం గా  ఎన్నో కొన్ని ( కొద్దిగానో, ఎక్కువ గానో) తెలుగు పదాలను వాడి వుంటాడు అనేది ఒక స్పష్టమైన అంశం.  ఆ పదాలు ఆనాటి సమాజంలో వాడుకలో వుండడానికి ఎన్నో కారణాలు వుంటాయి. ఈ వెయ్యేళ్ళ  కాలాన్ని,  తలా వంద ఏళ్లుగా కాల విభజనలు చేసి కవి పరంగా, కావ్య పరంగా ఈ తెలుగు మాటలు ఎలా కాల ప్రవాహంలో సాహిత్య రూపేణా నమోదు అవుతూ వచ్చాయో గమనిస్తూ పరిశీలనలు, పరిశోధనలు చేయడం ఒక భాగం కావాలి.
ఈ పది శతాబ్దాల తెలుగు భాషా వికాస స్వరూపం గురించి ఒక ప్రాధమిక రూపం ఏర్పాడ్డాక, ఆయా కావ్యాలు , కవుల కాలపు రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్థితుల ప్రభావం ఎలా ఈ రచనలలోని  పై లేదా కవుల పై పడ్డదో ఒక ప్రత్యేక కృషి గా రెండో దశలో మరో పది విభాగాలు గా విస్తార అధ్యయనాలు జరగాలి.
చివరి భాగం గా ప్రతి కవి, కావ్యం పరంగా  తెలుగు భాషకు తన కాలంలో తన రచనలలో పొందు పరుస్తూ  వచ్చిన  తెలుగు ఆచ్చిక పదాల జాబితా ( ఆఛ్చిక పద కోశం), ఆయా పదాలు తెలుగు భాష లోకి వచ్చి చేరిన క్రమం గురించి  వివరణలు కూడా చేరిస్తే ఇదొక సమగ్ర భాషా వికాస స్వరూప గ్రంధంగా తెలుగు వారం తయారు
చేసుకోగలుగుతాము.
కన్నడ దేశంలో ఇన్ఫోసిస్ సంస్థ  కు చెందిన నారాయణమూర్తి గారు  “ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా” పేరిట భారతీయ ప్రాచీన సాహిత్యాన్ని అనువాద ప్రచురణలు గా  తీసుకొచ్చే  ముఖ్యమైన పనిని అంతర్జాతీయ స్థాయిలో చేపట్టారు. ఒక పేజీ లో మూల రచనా పక్క పేజీలో అనువాదం ప్రచురించడం పధ్ధతి గా అనేకమంది మన దేశ, విదేశాల పండితులు భారతీయ సంస్కృతి సాహిత్య రంగాలలో కృషి చేసే వారు ఈ అనువాదాలు, ప్రచురణల ఖరారు చేసే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.    మనం కూడా ఇవాళ ప్రభుత్వ శాఖలు, రాష్ట్రంలో గల అనేక మండి వ్యక్తులు, సంస్థలు, రామోజీ ఫౌండేషన్ వంటి ఉన్నత వేదికలు అందరం కలిసి, మన వెయ్యేళ్ళ తెలుగు భాషా వికాస స్వరూపాలు,  ప్రాజెక్టు కు కొన్నియేళ్ళు పట్టినా సరే ఇప్పుడే ప్రణాళికా బద్ధంగా  సంకల్పించడం అవసరం.
దీనికి తగిన ఒక ప్రాధమిక అవగాహనా సదస్సు విశాఖపట్నంలో నిర్వహించడం ఒక ప్రతిపాదన. ఇందుకు తగిన పూర్వ భూమిక ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వున్నది. 1931 లో పండిత రాధాకృష్ణన్  ప్రారంభించిన తెలుగు శాఖ , రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో కెల్లా మొదట గా ఏర్పడ్డది. ఆచార్య తోమాటి దొణప్ప, బూదరాజు రాధాకృష్ణ  ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య చేకూరి రామారావు , ఒకప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్ధులే. దొణప్ప ఆరంభించిన
ప్రాజెక్టును ఆచార్య లకంసాని చక్రధరరావు ఒక్కచేత్తో, పూర్తిచేసి  ఏడు భాగాల  తెలుగు పదాల  వ్యుత్పత్తి కోశాన్ని జాతికి అందించారు.
కేంద్ర ప్రభుత్వ భాషాభివృద్ధి సంఘంలో సభ్యులు గా వున్న ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి, మన ప్రాతిపదికల మేరకు తీసుకునే చొరవ ఫలించి , మైసూరు లోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఆమోద, సహాయ సహకారాలు మన ప్రాజెక్టుకు  లభించి , రాష్ట్రంలోని ఇతర పెద్దలు,  ఫౌండేషన్ల పూనిక తో, ఇప్పుడు తెలుగు భాషకు ఒక మంత్రిత్వ శాఖ ను కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపధ్యంలో  మనం స్పష్టమైన లక్ష్యాలతో, ఒక కార్యాచరణ పత్రంతో,  చైతన్యవంతమైన సాహిత్య  సాంస్కృతిక సమాజం గా  ముందడుగు వేయవలసిన తరుణం ఇది అని గుర్తు చేస్తూ, ఇందుకు అందరు పెద్దల నుంచి ఈ ప్రాజెక్టు సుసాధ్యమయే దిశలో ఆచరణాత్మకమైన సలహాలు, సహాయాలు, మార్గ దర్శకాలు లభిస్తాయని ఆశిస్తున్నాను.

-రామతీర్థ

వీలునామా – 30 వ భాగం

శారద

శారద

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

ఫిలిప్స్ కుటుంబం లో సంక్షోభం

లిల్లీ ఫిలిప్స్ కి చాలా చిరాగ్గా వుంది. తన భర్త స్టాన్లీ ఫిలిప్స్ కి తమ ఇంట్లో పని చేసే మెల్విల్ అక్కచెల్లెళ్ళ మీద అంత గౌరవమూ, ఆప్యాయతా ఎందుకో ఆమెకి అంతుబట్టడం లేదు. పోనీ తనకన్నా అందగత్తెలా అంటే, అంద చందాలలో తన కాలిగోటిక్కూడా సరిపోరు ఇద్దరూ. మరేమిటి వాళ్ళలో ప్రత్యేకత?

ఇప్పుడు ఈ యూరోప్ యాత్రలో ఎల్సీకి తనతో సమానంగా జరుగుతున్న మర్యాదలు చూడరాదూ! అసలు ఈ ప్రయాణం గురించీ, కూడా ఒక పని మనిషిని తీసికెళ్ళగలిగే తన ఆర్థిక స్థోమతని గురించీ స్నేహితుల దగ్గర ఎన్ని గొప్పలో చెప్పుకుందామనుకుంది. తీరా చూస్తే తనతో సమాన స్థాయిలో వుండే స్నేహితురాలిని తీసికెళ్ళినట్టుంది కానీ, చేతికింద వుండి కనిపెట్టుకుని వుండే పనమ్మాయిని తీసికెళ్ళినట్టే లేదు.

ఎప్పుడైనా స్టాన్లీతో ఎల్సీ తమ ఇంట్లో పనిమనిషి అనీ, జేన్ లా టీఛరు కూడా కాదనీ, ఆమెకి అంత గౌరవం ఇవ్వాల్సిన పని లేదనీ చూచాయగా అన్నా కొట్టిపడేస్తాడు.

“నా దృష్టిలో జేన్, ఎల్సీ, ఇద్దరూ సమానమే. చదువు చెప్తోందని జేన్ ని గౌరవిస్తూ, ఇంటి పని చూస్తుందని ఎల్సీని హీనంగా చూడడం నా వల్ల అయ్యే పని కాదు,” అంటాడు మొండిగా. పైగా, ఫ్రాన్సు లో వున్నన్ని రోజులూ,

“ఫ్రెంచి స్త్రీలు చూడు పని చేసే ఆడవాళ్ళతో ఎంత మర్యాదగా ఆప్యాయంగా వుంటారో చూడు! మన ఇంగ్లీషు వాళ్ళం ఎంతైనా నేర్చుకోవాల్సి వుంది వాళ్ళ దగ్గర,” అనడం మొదలుపెట్టాడు.

మొదటిసారి లిల్లీకి ఇంకొక ఆడదాని మీద ఈర్ష్య లాటిది కలిగింది. అయితే తన అందచందాల మీద ఆమెకున్న నమ్మకం ఆపారమైనదీ, తన వ్యక్తిత్వంలోని లోపాలగురించి వున్న అఙ్ఞానం అనంతమైనదీ కావడంతో ఆ ఈర్ష్య ఎక్కువసేపు నిలవలేదు. బాహ్య సౌందర్యాన్ని తప్ప స్త్రీలో ఇంకొక కోణాన్నీ చూడగలిగే మగవాళ్ళుంటారన్న విషయం ఆమె ఊహకందదు. బాహ్య సౌందర్యానికొస్తే తనకి తిరుగులేదు. ఈ ఆలోచనతో లిల్లీ కొంచెం ధైర్యం తెచ్చుకొంది.

అయితే ఈ మధ్య ఎల్సీలో ఏదో ఒకరకమైన ఉత్సాహం, సంతోషం కనబడుతోంది. దానితోపాటు వయసులో వుండడం వల్ల వచ్చిన నాజూకు, నిష్కల్మషమైన చిరునవ్వుతో ఎల్సీ మెరిసి   పోతూంది. తనేమో వరస కానుపులూ, సంసార జీవితంలో వుండే నిరాసక్తతతో ఆకర్షణ కోల్పోతుందేమో! ఈ మధ్య స్టాన్లీ ఎల్సీవైపు ఎక్కువగా చూస్తున్నట్టూ, ఆమెతో ఎక్కువ మాట్లాడుతూన్నట్టు అనిపించి లిల్లీకి ఉక్రోషంగా అనిపిస్తూంది. దానికితోడు ఇద్దరూ మధ్య మధ్యలో ఫ్రెంచిలో సంభాషిస్తూ వుంటారు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకున్నప్పుడు తనకి తెలియని రహస్యాలేవో చెప్పుకుంటున్నారేమోనన్న ఆలోచన ఆమెని ఎక్కువగా బాధ పెట్టసాగింది.

నిజానికి స్టాన్లీ కేవలం తన ఫ్రెంచి భాష మెరుగుపరచుకోవాలన్న ఉబలాటంతో ఎల్సీతో ఎక్కువగా ఫ్రెంచిలో మాటాడుతున్నాడు. ఎల్సీ ఏమో తనదైన అందమైన ప్రపంచంలో కొట్టుకొనిపోతూంది. ఆమెకి లిల్లీ మనసులో రేగుతున్న సంఘర్షణ ఏమీ పట్టలేదు. ఈ యాత్ర ఆమెకెంతో ఆనందంగా వుండడమే కాకుండా మళ్ళీ ఈ మధ్య కవిత్వం రాయాలన్న ఆశపుడుతూంది.

పేరిస్, ఫ్లారెన్స్, రోమ నగరాలన్నీ తిరిగారు ముగ్గురూ.

పెద్ద పిల్లల్నిద్దరినీ కూడా తమతో తిప్పి వుండాల్సింది అనుకున్నాడు స్టాన్లీ.

వాళ్ళు లండన్ తిరిగొచ్చేసరికి ఎన్నికల్లో ఫ్రాన్సిస్ నెగ్గిన సంగతి తెలిసింది వారికి.

 

*****************

 

బ్రాండన్ లేని లోటు తప్పితే లండన్ జీవితం యథా ప్రకారం మొదలైంది. కొద్దిరోజులకే మళ్ళీ విసుగెత్తిపోయిన స్టాన్లీ అమెరికా వెళ్ళి చూసొద్దామనుకున్నాడు. అయితే లిల్లీ మాత్రం ప్రయాణాలతో అలిసిపోయాననీ, ఇక ఇంటి పట్టునే వుంటాననీ అన్నది. స్టాన్లీకి ఒంటరి ప్రయాణాలు ఇష్టం వుండదు. అయినా ఇక ఇంట్లో ఏ పనీ లేక విసుగ్గా ఉందని ఒంటరిగానే అమెరికా ప్రయాణమయ్యాడు.

అదలా వుంటే, లిల్లీ మొరటుదనాన్ని చూసి ఎల్సీ ఈ మధ్య ఆశ్చర్య పోతూంది. తనంటే యజమానురాలికి ఏదో కోపం మనసులో వుందన్న విషయాన్ని కనిపెట్టింది కానీ, దానికి కారణం మాత్రం ఊహించలేకపోయింది. వీళ్ళ ఇల్లు వదిలి ఇంకెక్కడైనా వుద్యోగం చూసుకోవాలని నిర్ణయించుకుంది ఎల్సీ.

ఆమె ఆ ప్రయత్నాలలో వుండగానే పిల్లలకి ఒకరి తర్వాత ఒకరికి విష జ్వరం తగలసాగింది. పాఠాలన్నీ మూలపడ్డాయి. పొద్దస్తమానూ జేన్, ఎల్సీ ఇద్దరూ పిల్లల మంచాల పక్కనే కూర్చుని కనిపెట్టుకోవాల్సి వచ్చింది.

లిల్లీకి మధ్యమధ్య గదిలోకి వచ్చి పిల్లలని చూసి బెంబేలు పడడం తప్ప ఇంకేమీ తెలియదు. నిజానికి వాళ్ళ పరిస్థితి విషమిస్తూన్నట్టు కూడా ఆ అమాయకురాలు తెలుసుకోలేకపోయింది.

జేన్ ఆఖరికి పిల్లల తాతగారు, పెద్దాయన డాక్టరు ఫిలిప్స్ గారిని ఉన్నపళంగా రమ్మని ఉత్తరం రాసినతర్వాత గానీ, లిల్లీకి పరిస్థితి చేయి దాటిపోయిందేమోనన్న అనుమానం రాలేదు. వెంటనే జేన్ కి చెప్పి స్టాన్లీ ని కూడా అమెరికా నించి వెంటనే రమ్మని ఉత్తరం రాయించింది.

ఆమె ఉత్తరం చూడగానే తాతగారితో పాటు స్టాన్లీ తమ్ముడు డాక్టరు వివియన్ కూడా లండన్ చేరుకున్నాడు. తండ్రీ కొడుకులిద్దరూ పిల్లలకి శాయాశక్తులా చికిత్స చేసారు. ఎంత చేసినా స్టాన్లీ పిల్లలందర్లోకీ చిన్నది ఈవాని రక్షించలేకపోయారు.

లిల్లీ మొదలునరికిన చెట్టులా కూలబడిపోయింది. ఇది జీవితంలో ఆమెకి మొదటి దెబ్బ. పెళ్ళైంతర్వాత స్టాన్లీ సం రక్షణలో చీకూ చింతా లేకుండా వున్న లిల్లీ ఈ దెబ్బ తట్టుకోలేకపోయింది. అన్నిటికంటే పిల్లల్ని ప్రాణప్రదంగా ప్రేమించే స్టాన్లీ ఇంటికొచ్చి తనకే శిక్ష విధిస్తాడోనని వొణికిపోయింది. తనకే అంతుబట్టని కారణాల వల్ల బిడ్డ మరణించడం తన తప్పేనన్న నిర్ణయానికొచ్చింది లిల్లీ.

“అయ్యో! స్టాన్లీ, ఇప్పుడే నువ్వమెరికా వెళ్ళాల్సొచ్చిందా? ఇంటికొస్తే నీ ప్రియాతిప్రియమైన ఈవా లేకపోవడం చూసి ఎలా తట్టుకుంటావో! అసలు నాలాటి చేతకాని దద్దమ్మకి ఈ పిల్లల్నెందుకు అప్పజెప్పావ్ స్టాన్లీ? మిగతా పిల్లల్ని కూడా ఇలాగే పోగొట్టుకుంటానో ఏమో!”  గోడు గోడున ఏడ్చింది లిల్లీ.

రెండురోజుల తర్వాత మిగతా పిల్లలు కోలుకుంటున్నారనీ, ఇంకేమీ భయంలేదనీ మరిది వివియన్, జేన్ చెప్పినా నమ్మలేదు లిల్లీ. స్టాన్లీ వొచ్చి, నిజంగానే మిగతా పిల్లలు జ్వరం బారినించి తప్పించుకున్నారని చెప్పిన తర్వాతే ఆమెకి నమ్మకం కలిగింది.

స్టాన్లీ ఫిలిప్స్ పైకి ఏమీ అనకపోయినా ఈవా మరణం అతన్ని ఎంతగానో కృంగదీసింది. అయితే కనీసం మిగతా ముగ్గురు పిల్లలూ కోలుకుంటున్నందుకు అతను భగవంతునికి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు తెల్పుకున్నాడు. జేన్, ఎల్సీ, వివియన్ ముగ్గురూ కలిసి తన పిల్లలని మృత్యు వాత పడకుండా కాపాడగలిగేరని అనుకున్నాడు.

 

అప్పుడే లండన్ లో పార్లమెంటు సమావేశాలకోసం వచ్చిన ఫ్రాన్సిస్ కూడా వచ్చి పిల్లలని అడపాదడపా వచ్చి చూసాడు. పార్లమెంటులో మొదటిసారి ఫ్రాన్సిస్ చేసిన ప్రసంగాన్ని అంతా శ్రధ్ధగా విన్నారు. అతని ప్రసంగం ఎల్సీకంతగా నచ్చకపోయినా, జేన్ మెచ్చుకుంది.

 

మాట ఇచ్చిన ప్రకారం ఫ్రాన్సిస్ డెర్బీషైర్ వెళ్ళి పెద్ద ఫిలిప్స్ గారిని కలిసొచ్చాడు. అతనికి ఆ కుటుంబం లో అందరికంటే చిన్న డాక్టరు వివియన్ ఫిలిప్స్ నచ్చాడు. అయితే అతను జేన్ తో చనువుగా మాట్లాడడం చూసి కొంచెం చిన్న బుచ్చుకున్నాడు. పిల్లల చికిత్స కోసం వివియన్ జేన్ తో దగ్గరగా మసలేవాడు. అతను జేన్ ని ప్రేమిస్తున్నాడేమో నన్న అనుమానం ఫ్రాన్సిస్ ని పుండులా సలుపుతూంది. అతనికి వివియన్ ఎల్సీని ప్రేమిస్తున్నాడేమో నన్న అనుమానం రాలేదెందుచేతనో.

ఇంతకీ వివియన్ ఇద్దరు అమ్మాయిలతోనూ స్నేహంగా మర్యాదగా వున్నా ఇద్దరిలో ఎవరినీ ప్రేమించలేదు. జేన్ లాటి అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించగలిగే మగవారు అరుదుగా వుంటారు. ఆ సంగతి అందరికంటే జేన్ కే బాగా తెలుసు కూడా. అలాటి అమ్మాయిల సహచర్యంలో మగవాళ్ళు తాము అలసిపోతాం అనుకుంటారు. మగవారికి తెలివైన ఆడవారూ, తమతో సమానంగా ఆలోచించగలిగే వారూ కేవలం స్నేహితులుగానే నచ్చుతారు. తమకి భార్య గా వొచ్చే స్త్రీ పెద్దగా తెలివితేటలూ, సొంత ఆలోచనలూ లేకుండా, అన్నిటికి తమ పైన ఆధారపడే మనిషై వుండాలని కోరుకుంటారు.

ఇవన్నీ ఎలా వున్నా పిల్లలు బాగానే కోలుకోవడం మొదలుపెట్టారు. అయితే అందర్లోకీ పెద్దది ఎమిలీ మాత్రం బాగా నీరసించిపోయింది. దానికి తోడు చలికాలం ముంచుకొస్తూంది.

ఆస్ట్రేలియా లోని వెచ్చదనమూ, వేడీ అలవాటైన పిల్ల లండన్ చలిని తన అనారోగ్యంతో తట్టుకోగలదో లేదోనన్న భయం మొదలైంది అందరికీ. మళ్ళీ అరోగ్యం విషమిస్తే ఏం చేయాలో తోచలేదెవరికీ. పినతండ్రి వివియన్ అమ్మాయిని లండన్ చలికాలం నించి దూరంగా తీసికెళ్ళక తప్పదని తేల్చి చెప్పాడు. ఫ్రాన్స్ వెళ్దాం వస్తావా అని ఎమిలీని తండ్రి అడిగాడు.

 

“ఫ్రాన్స్ కాదు నాన్నా! హాయిగా మన వూరు విరివాల్టా వెళ్ళిపోదాం. అసలు ఆస్ట్రేలియాలో ఎప్పుడైనా ఇలా జబ్బు చేసిందా మనకెవరికైనా? వొస్తానంటే టీచరు జేన్ నీ, ఎల్సీనీ తీసికెళ్దాం. అక్కడే చదువుకుంటాం. ఈ లండన్ లో ఏముంది? పొగా, మంచూ, మనుషులూ!”  ఎమిలీ అంది.

స్టాన్లీ ఆలోచనలో పడ్డాడు. నిజంగా పిల్లలందరినీ ఆస్ట్రేలియా తీసికెళ్ళడమే మంచిదేమో. కనీసం పడవ మీద సముద్రపు గాలుల వల్ల ఆరోగ్యం మెరుగవవచ్చు. కాస్త అక్కడ తన ఎస్టేటు వ్యవహారాల పైనా ఒక కన్నేసి వుంచొచ్చు. లండన్ లో జీవితం కొంచెం ఖర్చుదారీగా కూడా అనిపిస్తోంది. అయితే పిల్లల చదువుల దృష్ట్యా జేన్ నీ తమతో తీసికెళ్ళక తప్పదు. ఎలాగైనా ఆస్ట్రేలియా వెళ్ళడమే మంచిదనుకొన్నాడు స్టాన్లీ.

ఈ విషయం వినగానే మండిపడింది లిల్లీ!

“ఏమిటీ? ఆస్ట్రేలియాకా? అసలు మనం ఎప్పటికీ ఇక్కడే వుంటామన్నావుగా స్టాన్లీ? అక్కడికెళ్తే పిల్లల చదువులేం చేద్దాం?”

“చదువుల గురించి నువు భయపడకు. జేన్ టీచర్నీ మనతో తీసికెళ్దాం. ఆవిడ సంగీతం తప్ప అన్నీ నేర్పగలదు. అన్నిటికంటే వాళ్ళ ఆరోగ్యం ముఖ్యం ఇప్పుడు. మనకి వెళ్ళక తప్పదు.”

“టీచరు చెల్లెల్ని వదిలి రానంటే?”

“అదీ నిజమే! అలా అయితే ఇద్దరినీ మనతో తీసికెళ్దాం.”

“నేనేదైనా అనగానే డబ్బు ఖర్చు ఎక్కవౌతుందంటావు, కానీ వాళ్ళిద్దరు అక్కచెల్లెళ్ళనీ తీసికెళ్ళడానికి నీకే డబ్బు ఇబ్బందులూ గుర్తు రావు,” లిల్లీ కోపంగా అంది.

“ తెలివితక్కువగా మాట్లాడకు లిల్లీ. ఎల్సీ నీకు బట్టలు కుట్టి పెడుతూంది. జేన్ ఇంటి లెక్కలు చూసి పెడుతూంది. వాళ్ళిద్దరి వల్లా ఎంత లేదన్నా మనకి యేడాదికి రెండు వందల పౌండ్లు ఆదా అవుతూంది. అన్నిటికంటే, ఎమిలీ ఎల్సీని వొదిలి వుండలేదు. అసలు ఎల్సీ సహాయం లేకుండా నువ్వు పిల్లలని చూసుకోగలననుకుంటున్నావా?”

“అక్కడ జేన్ తో పనేమీ వుండదు స్టాన్లీ! ఇంతకు ముందు మనం అక్కడ డబ్బులెక్కలు చూసుకోలేదా?”

“ఆ విషయం మాట్లాడకు. నువ్వు డబ్బు లెక్కలు చూసినప్పుడు మన ఇల్లెలా వుండేదో నాకింకా బాగా ఙ్ఞాపకం వుంది. నా మాట విను. పిల్లలకీ, నీకూ, మనందరికీ సహాయంగా వుండడానికీ, చేదోడు వాదోడుగా వుండడానికీ జేన్, ఎల్సీ ఇద్దరూ మనతో రావడమే మంచిది. పిల్లలు కూడా వాళ్ళనొదిలి వుండలేరు.”

“ఆ మాటా నిజమే లే. పిల్లలని అంత అనారోగ్యంలో వాళ్ళిద్దరే కనిపెట్టి వున్నారు. నేను ఏడవడానికి తప్ప ఎందుకూ పనికి రాను,” తలచుకొని మెత్తబడింది లిల్లీ.

“కానీ, స్టాన్లీ, నాకు ఇప్పుడు సముద్రపు ప్రయాణాలంటే మహా విసుగు. పోనీ అందరం విమానం లో వెళ్దాం, ఏమంటావ్? బ్రాండన్ కూడా విమానం లోనే వెళ్ళాడు.” ఆశగా అడిగింది.

“పిల్లలతో విమాన ప్రయాణం కష్టం లిల్లీ! బ్రాండన్ అంటే ఒంటిగాడు, తోడుగా ఒక్క మేనల్లుడు, అంతే. మనమో? ఇంత మందికి విమానం టికెట్లు తడిసి మోపెడవుతాయి. పిల్లల ఆరోగ్యాలు సముద్రపు గాలికి కాస్త కుదుటపడతాయి. మనిద్దరమే కలిసి ప్రయాణం చేసేటప్పుడు నిన్ను విమానం లో తీసికెళ్తా, సరేనా?” భార్యని బుజ్జగించాడు స్టాన్లీ.

తమ కుటుంబంతో పాటు మెల్బోర్న్ రమ్మని స్టాన్లీ అడగగానే ఎగిరి గంతే సారు జేన్,ఎల్సీ.

 

“స్టాన్లీ గారూ! తప్పక మీతో వొచ్చి పిల్లల చదువులు చెప్తాను. అయితే మీకొక్క విషయం ముందుగానే చెప్పడం మంచిది. నేనూ, పెగ్గీ వాకర్ కలిసి ఎప్పటికైనా మెల్బోర్న్ లో మా సొంతంగా వ్యాపారం చేయలని అనుకున్నాము. అదే కనక నిజమైతే మీ కుటుంబాన్ని ఎప్పుడో ఒకప్పుడు వదలక తప్పదు. అప్పుడు మీరు బాధ పడకూడదు. నాకైతే మీ ఇంట్లో పని చాలా హాయిగా వుంది, కానీ…”

“నాకు తెలుసు జేన్! ఎల్సీ కీ మా ఇంట్లో క్షణం కూడ మనశ్శాంతి లేదు. ఎల్సీకి కూడా ఇక్కడికంటే ఆస్ట్రేలియాలో మంచి ఉద్యోగం దొరకొచ్చు. అప్పుడు తనైనా నిస్సంకోచంగా మా ఇల్లు వదిలి పోవచ్చు. లిల్లీ కూడా మీ అక్క చెల్లెళ్ళిద్దరూ మా పిల్లలకి చేసిన సేవలకి ఇలా బదులు తీర్చుకోవాలనుకుంటుంది.”

 

ఆస్ట్రేలియా వెళ్ళడానికి స్టాన్లీ, లిల్లీ, పిల్లలూ, జేన్, ఎల్సీ అందరూ సిధ్ధమవుతూ వున్నారు. ఉన్నట్టుండి వాళ్ళతో ఇంకొక వ్యక్తి వచ్చి చేరడం జరిగింది.

 

**************

 

ఎన్నికల తర్వాత ఫ్రాన్సిస్ డెర్బీషైర్ వెళ్ళి ఫిలిప్స్ కుటుంబంతో కాసేపు గడిపి వచ్చాడు. కానీ అతనక్కడ హేరియట్ ఫిలిప్స్ ని కొంచెం కూడా పట్టించుకోలేదు. నిజానికి అక్కడ అతను రాజకీయాలూ, తన పనీ గురించి తప్ప ఇంకేమీ మాట్లాడలేదు. అదీ తమ తండ్రితోనూ, అక్కయ్య తోనూ. హేరియట్ హతాశురాలైంది. ఆమెకిప్పుడు తను బ్రాండన్ తో అంత నిర్దయగా ప్రవర్తించి వుండల్సింది కాదేమో, అనిపిస్తూంది. తను అతన్ని అంతలా ఉడికించకపోయి వుంటే తప్పక తనని పెళ్ళాడమని అడిగి వుండే వాడే. పైగా అందరిముందూ తనని ఇష్టపడి, తనకోసం పడి చచ్చిపోయే మగవాడు ఉండడం ఆమెకొక గౌరవాన్నీ ఇచ్చేది. ఇప్పుడు బ్రాండన్ లేకపోవడంతో ఆమె ఆ గౌరవాన్ని కోల్పోయింది. హేరియట్ మనసు ఇలాటి ఊగిసలాటల్లో ఉండగానే, అన్న కుటుంబంతో సహా ఆస్ట్రేలియా వెళ్ళబోతున్నట్టు కబురందింది ఆమెకి.

 

ఉన్నట్టుండి, తనూ అన్న కుటుంబంతో పాటు విక్టోరియా వెళ్తేనో, అన్న ఆలోచన వచ్చిందామెకి. తనకి కాస్త స్థలం మార్పు వుంటుంది. ఎమిలీ ఎప్పుడూ గొప్పగా చెప్పుకునే “మా వూరు విరివాల్టా” ని చూసే అవకాశం దొరుకుతుంది. అక్కడ తనలాటి లండన్ స్త్రీని అందరూ అబ్బురంగా చూస్తూ వుంటే బాగుంటుంది. అన్నిటికంటే బ్రాండన్ వుంటాడు! ఏడాది రెండేళ్ళు వుండి విసుగు పుట్టగానే మళ్ళీ వచ్చేయొచ్చు.

“లిల్లీకీ పిల్లలకూ తోడుగా వుండడానికి కావాలంటే నేనొస్తాను,” అని అన్నకి కబురు చేసింది హేరియట్. తన భార్యా పిల్లల పట్ల చెల్లెలికున్న ప్రేమ చూసి మురిసిపోయాడు స్టాన్లీ. తప్పక చెల్లిని తనతో తీసికెళ్తానన్నాడు.

రెండు వారాలు అహోరాత్రాలూ కష్టపడి ప్రయాణానికి సిధ్ధమయారు అందరూ.

***