కళాయోధుడికి వందేళ్లు -1

పి.మోహన్ 

 

P Mohanచిత్తప్రసాద్ కు జాతకాలపై నమ్మకం లేదు. తను బతికి ఉండగా పట్టని అదృష్టం చచ్చాక పడుతుందన్న భ్రమ అసలే లేదు. దున్నపోతులు పాలించే ఈ దేశం తన పిచ్చి బొమ్మలను గుర్తించుకుని, తన వందేళ్ల బర్త్ డే జరుపుకుని, నివాళి అర్పిస్తుందన్న వెర్రి ఆశ అసలే లేదు. అయినా చిత్తప్రసాద్ ఇప్పుడు ఎవడిక్కావాలి? మదరిండియాను ‘మేకిన్ ఇండియా’ కంతల గుడిసెలో ఎఫ్డీఐల కాషాయ పడకపై అంకుల్ శామ్, చైనా డ్రాగన్, యూరప్ గద్దలకు ఏకకాలంలో తార్చేస్తున్న స్వదేశీ జాగరణ మహావానరాలకు ఆ ఆ కల్తీలేని ఎర్ర దేశభక్తుడి పుట్టిన రోజుతో ఏం పని? కళ్లే కాదు సర్వాంగాలూ లొట్ట పోయిన గోతికాడి నకిలీ ఎర్రమనుషులకు ఆ ఒకనాటి తమ సహచరుడి సమరస్వప్నాలు ఏ జూదానికి పనికొస్తాయి? నిమిషానికి కాదు క్షణానికో రంగు మార్చే ఊసరవెల్లులు అతగాడి బ్లాక్ అండ్ వైట్ నిప్పుల జెండాలను ఏం చేసుకుంటాయి?

కానీ, చిత్తప్రసాద్ మహామోహంతో, నరనరానా ప్రేమించిన ఈ లోకంలో దున్నపోతులు, మహావానరాలు, నక్కలు, ఊసరవెల్లులే కాదు.. మనుషులు కూడా ఉన్నారు. అతని మాదిరే సాటి మనిషి కష్టానికి కన్నీరుమున్నీరయ్యేవాళ్లు, కళ మార్కెట్ కోసం కాదని, మనిషిని మనిషిగా నిలబెట్టేందుకని నమ్మేవాళ్లు, నమ్మకం కోసం నునువెచ్చని నెత్తుటిని ధారపోస్తున్నవాళ్లూ ఉన్నారు. చిత్తప్రసాద్ వాళ్లకు అవసరం! చెప్పలేనంత అవసరం. శత్రువు గుండెను గెరిల్లా బాంబులా పేల్చే అతని బొమ్మలు వాళ్లకు కావాలి. కలలను, కన్నీళ్లను, అక్కసును, ఆక్రోశాన్ని, కసిని, క్రోధాన్ని మహోగ్రంగా వెళ్లగక్కే ఆ నిప్పుకణికలు వాళ్లకు కావాలి. వాటి కథలూ, గాథలూ వాళ్లకు కావాలి. చిత్తను తెలుసుకోవడమంటే మన గుండెతడిని మనం పరీక్షించుకోవడం. మన భయాన్ని, పిరికితనాన్ని, నంగితనాన్ని వదలించుకుని మన పిడికిళ్లను మరింతగా బిగించడం. వందేళ్ల చిత్త బతుకు చిత్రాల గ్యాలరీని నేటి మన చివికిన బతుకు కళ్లతో చూద్దాం రండి!

1 (3)

చిత్త ఆధునిక భారతీయ కళాసరోవరంలో పూచిన ఒకే ఒక ఎర్రకలువ. దాని రేకులు ఎంత మెత్తనో అంత పదును. ఒక్కో రేకుది ఒక్కో పరిమళం. ఒకటి బొమ్మలు వేస్తుంది, ఒకటి పాడుతుంది. ఒకటి కవితలు, కథలు రాస్తుంది. అది జనం పువ్వు. కష్టజీవుల కళల పంట. అది వాళ్లు నవ్వితే నవ్వుతుంది, దుఃఖపడితే కలతపడుతుంది. ఆగ్రహిస్తే కత్తుల పువ్వయిపోయి వాళ్ల చేతుల్లో ఆయుధంలా మారిపోతుంది. అందుకే బడాబాబులకు అదంటే గుండెదడ. బడుగుజీవులకు గోర్వెచ్చని గుండెపాట.

కళను అర్థం చేసుకోకూడదని, అనుభవించాలని అంటారు మహానుభావులు. చిత్త విషయంలో ఈ మాటకు అర్థం లేదు. అతని చిత్రాలు అర్థం, అనుభవాల మేలుకలయిక.

‘..నేను చెప్పేది నీకర్థం కావడం లేదని అనుకుంటున్నానమ్మా! అయినా, మాటలు ప్రతిభావాన్నీ చేరవేస్తాయా? ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, మిత్రుడు ఎరిక్ మాట్లాడే డేనిష్.. అందరినీ అడిగి చూశాను.. మనుషుల ప్రగాఢమైన సుఖదుఃఖాలను, తృప్తి, అసంతృప్తులను, శాంతిని, క్రోధాన్ని సరిగ్గా చేరవేయగల మార్గాలను ఇంతవరకూ ఏ భాషా కనుక్కోలేదు’ అని అమ్మకు రాసిన లేఖలో అంటాడు చిత్త. భాషలు చెయ్యలేని ఆ పనిని అతని చిత్రాలు చేశాయి. 

చిత్తప్రసాద్ 1915 జూన్ 21న పశ్చిమ బెంగాల్ లోని 24 ఉత్తర పరగణాల జిల్లాలో నైహాతిలో పుట్టాడు. తల్లిదండ్రులు ఇందుమతీ దేవి, చారుచంద్ర భట్టాచార్య. చారుచంద్ర ప్రభుత్వోద్యోగి. పియానో వాయించేవాడు. ఇందుమతి కవిత్వం రాసేది, పాటలూ పాడేది. పుస్తకాలంటే పిచ్చిప్రేమ. ఈ పిచ్చి కొడుక్కీ సోకింది. పుస్తక సేకరణ సామ్రాజ్య నిర్మాణం వంటిదంటాడు చిత్త. అతనికి తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు ఇవ్వకున్నా అంతకుమించిన సాహితీసంస్కారాన్ని, బీదలపట్ల సానుభూతిని, నమ్మిన విలువల కోసం రాజీలేనితనాన్ని అందించారు. చిత్తకు ఒక చెల్లెలు. పేరు గౌరి. ‘దాదామోషి’ ఆ పిల్లను చెల్లి అని కాకుండా ముద్దుగా అక్కాయ్ అని పిలిచేవాడు. చారుచంద్ర ఉద్యోగరీత్యా మిడ్నపూర్, చిట్టగాంగ్ లలో కాపురమున్నాడు. చిత్త ఇంటర్, డిగ్రీ చిట్టగాంగ్ ఆ ఊళ్లలోనే పూర్తి చేశాడు.

 

బెంగాల్ విద్యావేత్త  ప్రొఫెసర్ జోగేశ్ చంద్ర రాయ్(1859-1952) లైబ్రరీ చిత్తకు చిత్రలోకాన్ని పరిచయం చేసింది. కుర్రాడు సాయంత్రం పూట జోగేశ్ పుస్తకాలను తుడిచి, సర్దిపెట్టేవాడు. అందుకు ప్రతిఫలంగా ఆ పెద్దాయన ‘ప్రభాషి’, ‘భరతబర్ష’ వంటి పత్రికల్లో వచ్చే బొమ్మలను ఇచ్చేవాడు. ఓ రోజు వాటర్ కలర్స్ బాక్సు కానుకగా ఇచ్చాడు. చిత్త బొమ్మల్లో మునిగి తేలాడు. జోగేశ్ తనను సొంత మనవడిలా చూసుకున్నాడని అంటాడు చిత్త.

3 (4)

1930వ దశకంలో బెంగాల్ విప్లవాగ్నులతో కుతుకుత ఉడుకుతుండేది. చిట్టగాంగ్ ఆయుధాగారంపై సమర్ సేన్ దండు ముట్టడి, తర్వాత విప్లవకారులను బ్రిటిష్ వాళ్లు వేటాడి చంపడం.. బ్రిటిష్ తొత్తుల ఇళ్లపై అనుశీన్ సమితి దాడులు… ఇవన్నీ చిత్త చుట్టుపక్కలే జరిగాయి. రెండో ప్రపంచయుద్ధంలో జపాన్ ఫాసిస్టులు బెంగాల్ పొరుగున ఉన్న బర్మాను ఆక్రమించారు. చిట్టగాంగ్, కలకత్తాలపై బాంబులు వేశారు. చిత్త రాజకీయాల్లోకి రాక తప్పలేదు. రహస్య కమ్యూనిస్టు రైతు సంఘాలతో పరిచయమైంది. జపాన్ దాడిని వ్యతిరేకిస్తూ చిత్త వేసిన పోస్టర్లను గ్రామం పక్కన పొలంలో కర్రలు పాతి, తడికలకు అతికించి ప్రదర్శించారు. అక్షరమ్ముక్క తెలియని జనం కూడా వాటిని చూసి మెచ్చుకున్నారు. అది అతని తొలి ఎగ్జిబిషన్. కొండంత స్ఫూర్తని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిన వేడుక.

చిత్త నిజానికి శిల్పికావాలనుకున్నాడు. కానీ ఆ కళాశిక్షణా గట్రా ఖరీదు వ్యవహారం కావడంతో చిత్రకళతో సరిపెట్టుకున్నాడు. బొమ్మల పిచ్చితో కలకత్తా వెళ్లాడు. గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ప్రిన్సిపాల్ ఇంటర్వ్యూ చేశాడు. రాజకీయాల్లో తలదూర్చనని హామీ ఇస్తేనే సీటిస్తానన్నాడు. చిత్త నిరాకరించి బయటికొచ్చేశాడు. తన ఆరాధ్యుడైన నందలాల్ బోస్ కళాపాఠాలు బోధిస్తున్న శాంతినికేతన్ కు వెళ్లాడు. రవీంద్రనాథ్ టాగూర్ ముందు కూర్చుని అతని బొమ్మను చకచకా గీసిచ్చాడు. టాగూరు, నందలాల్ ఇద్దరూ భేష్ అన్నారు. ‘నీకు మేం నేర్పేదేమీ లేదు, కాలం వృథా చెయ్యకుండా వెళ్లిపో, మమ్మల్ని మించిపోతావు!’ అని భుజం తట్టారు. చిత్త స్వయంకృషితో కళాసాధన చేశాడు. ఉడ్ కట్లు, లినోకట్లు, ఆయిల్స్, వాటర్ కలర్స్.. ఏది పట్టుకున్నా కళ్లు చెదిరే బొమ్మ తయారై బోలెడు ముచ్చట్లు చెప్పేది. చిత్త 1938లో రంగుల్లో వేసుకున్న స్వీయచిత్రంలో అతని నవకాశల యువపేశల స్వప్నకాంతులను చూడొచ్చు.

2 (4)

చిత్త 1937-38 లో కమ్యూనిస్టులకు మరింత దగ్గరయ్యాడు. బ్రాహ్మణ్నని గుర్తుచేసే భట్టాచార్య తోకను కత్తిరించుకున్నాడు. జంధ్యప్సోసను తెంచేశాడు. అవసరమున్నప్పుడు జంధ్యప్సోసను, నగానట్ర, పట్టుచీరలను బహు అందంగా తగిలించుకుని, అవసరం లేనప్పుడు బీరువాల్లో అతి జాగ్రత్తగా దాచుకుంటూ, తోకలను, కొమ్ములను భద్రంగా మోసుకు తిరిగే నేటి ‘వీరవిప్లవ కమ్యూనిస్టులు’ చిత్తను చూసి నేర్చుకోవాల్సిందేమీ లేదా ?

40వ దశకంలో దేశం విప్లవ, ప్రజాస్వామిక ఉద్యమాలతో కోట్ల వాల్టుల ఎర్రలైటులా ప్రకాశించింది. ఒక పక్క క్విట్ ఇండియా రణన్నినాదాలు.. మరోపక్క తెభాగా, పునప్రా వాయలార్, తెలంగాణా సాయుధ పోరాటాలు బ్రిటిష్ వాళ్లకు, వాళ్ల తొత్తు కుక్కలకు చుక్కలు చూపించాయి. సాంస్కృతిక కళారంగాల్లోనూ కొత్త విలువలు, ఆదర్శాలు పురివిప్పి నాట్యమాడాయి. ఫాసిస్టు వ్యతిరేక రచయితల, కళాకారుల సంఘం(ఏఎఫ్ డబ్ల్యూఏ), అభ్యుదయ రచయితల సంఘం(పీడబ్ల్యూఏ), భారత ప్రజానాట్యమండలి(ఇప్టా) అన్నీ నూతన మానవుడిని కలగంటూ పలవరింతలు పోయాయి. చిత్త కూడా రూపారూపాల్లో కలలుగన్నాడు. కమ్యూనిస్టుల దళపతి పీసీ జోషి చిత్తలోని కార్యకర్తనే కాక కళాకారుడినీ గుర్తించాడు.  పూర్తికాలం కార్యకర్తగా బాంబేకి పంపాడు.

కమ్యూనిస్టు పార్టీ పత్రికలైన ‘పీపుల్స్ వార్’, ‘జనయుద్ధ’లకు, బులెటిన్లకు ఇలస్ట్రేషన్లు, కార్టూన్లు వేయడం, రైతు, కార్మిక సంఘాలకు పోస్టర్లు రూపొందించడం చిత్త పని. ‘ప్రచార కళే’ అయినా కళావిలువల్లో ఎక్కడా రాజీపడకపోవడం చిత్త సాధించిన అరుదైన విజయం. ‘ప్రచార కళ’ అనేది మోటుగా చెప్పాలంటే తప్పుడుమాట. ఎందుకంటే కళను ప్రచారం కోసమే సృజిస్తారు కాబట్టి. ప్రచార కళా, మామూలు కళా అని రెండు రకాలు ఉండవు. కళకు కళాసౌందర్యవిలువలే ప్రమాణం. కళ ఎక్కడున్నా కళే. ‘ప్రచారం’లో ఉన్నంత మాత్రాన కళ కళ కాకుండా పోదు. మనిషి కళను ఎరిగింది మొదలు దాని లక్ష్యమంతా ప్రచారమే. ఆదిమానవులు గుహల్లో గీసిన బొమ్మలు, అధునిక మానవులు గుళ్లలో వేసిన బొమ్మలు, నవాధునిక మానవులు ఎక్కడెక్కడో వేస్తున్న బొమ్మలు.. వీటన్నింటి ఉద్దేశం తమ భావాలను ఎదుటి మనిషికి చెప్పుకోవడం. కాఫ్కాలు, వైల్డులు, డాలీలు, పొలాక్ లు తమ రచనలను, చిత్రాలను సృజించిది నేలమాళిగల్లో, భోషాణాల్లో ఎవరికంటా పడకుండా దాచిపెట్టుకోవడానికి కాదు. చిత్త బొమ్మలు బండగా, అందవికారంగా ఉంటాయని పైకి చెప్పకున్నా కొంతమంది కళాభిమానుల లోపలి అభిప్రాయం. ‘కళలో గుణం(కేరక్టర్) లేకపోవడం ఉంటుంది కానీ అందవికారమనేది అసలుండదు’ అని అంటాడు ఫ్రెంచి మహాశిల్పి అగస్త్ రోదా.

                     మిగతా వచ్చేవారం.

 

 

 

 

జై భీమ్‌ డ్రమ్‌..రిథమ్ ఆఫ్ బహుజన్స్‌!

ఒమ్మి రమేష్‌బాబు

 

1. ఒక అద్భుతం..

2015 మే 3వ తేదీ రాత్రి. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆర్ట్స్‌ కాలేజీ మైదానం బాగమతి తారామతి ప్రాంగణంగా పేరు మార్చుకుంది. భీమ్‌ డ్రమ్‌ అనే వినూత్న ఆర్కెష్ట్రాకి వేదికగా మారింది. రిథమ్ ఆఫ్ బహుజన్స్‌ అన్నది ఆ కార్యక్రమ ట్యాగ్‌లైన్‌. అదే ఇప్పుడు ప్రత్యామ్నాయ సాంస్కృతిక, రాజకీయాలకు దారిచూపబోతున్న టార్చిలైట్‌.

రిధమ్ ఆఫ్ బహుజన్స్‌ అనేది ఒక కొత్త ప్రకటన. నవీన భావావేశపు వెల్లువ. ఉద్విగ్నభరిత సంబరం. అగ్రకులేతర అసంఖ్యక సమూహాల పాదాల జడి. లబ్‌డబ్‌లబ్‌డబ్‌ చప్పుడుగా మారిన డప్పుల పెనుప్రకంపన. చాతీలో వేడిపుట్టించిన గిటార్ వైబ్రేషన్. కదంతొక్కించిన కీబోర్డ్‌ హోహోహోరు. నరాల తంత్రుల్లోకి చిమ్మిన నల్లని నెత్తుటి కేరింత. ఆ రాత్రి ఆ గానాబజానా దళితం దళితం దళితం అని దళిత శతకోటిని దద్దరిల్లేలా ధ్వనించింది. యువతని దరువేయించింది. ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య వంటి మేధావినే హైలయ్యగా మార్చి ఆడీ పాడించింది.

అవును.. ఆ రాత్రి ఓయూ ప్రాంగణం కొత్త ఉద్యమానికి తెరతీసింది. కొత్త అజెండాకి పల్లవిగా మారింది. కొత్త దర్శనానికి చూపుని పదునెక్కింది. ఆ రాత్రి… చీకటి కూడా తన నలుపుని చూసుకుని మరొక్కసారి మనసారా మురిసిపోయింది. నిశి మెరుపుల ఆకాశాన్ని ప్రశంసిస్తూ నేలతల్లి ఉరిమింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక నల్ల తటాకంగా మారారు. వారి మనస్సుల్లో నల్లకలువలు విరబూశాయి. బ్లాక్ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అని ఐలయ్య నినదిస్తే అక్కడ చేరిన గొంతులన్నీ ఏకమై ఆ నినాదాన్ని అందిపుచ్చుకున్నాయి. ఆ రేయి ఒకానొక జాగృదావస్థకి పీఠికగా మారింది.

ఇదంతా 3వ తేదీ సాయంత్రం నుంచి నడి రాత్రి వరకూ సాగిన భీమ్‌ డ్రమ్‌ మహిమ. నలిగంటి శరత్ అనే ఒక బక్కపల్చని కారునల్లాటి యువకుడు చేసిన మాయ. ఉన్నదున్నట్టు చెప్పాలంటే- ఉస్మానియానే “శరత్‌ మానియా”గా మార్చేశాడు. ప్రత్యామ్నాయ సాంస్కృతిక, సామాజిక, విద్యా, రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వాగ్గేయకారులను, అతిథులను, బహుజన నేతలను రిథమ్‌ ఆఫ్‌ బహుజన్స్‌ కార్యక్రమంలో ఏకం చేశాడు. విభిన్న సంస్థల ప్రతినిధులతోపాటు పలు విద్యార్థి సంఘాల నేతలు కూడా పెద్ద సంఖ్యలో ఆర్కెష్ట్రాతో గొంతు కలిపారు. భిన్నత్వం ఉన్నప్పటికీ బహుజనతత్వం ముందు ఐక్యసంఘటన సాధ్యమేనని దీనిద్వారా శరత్‌ నిరూపించాడు. సంఘ పరివర్తన ద్వారా బహుజన రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడమే నిజమైన వాగ్గేయకారుడి లక్ష్యం అని ప్రకటించాడు. ఇందుకు స్ఫూర్తినిచ్చేలా డయాస్‌ని డికరేట్‌ చేశాడు. గౌతమ బుద్దుడు, పెరియార్‌ రామస్వామి, జ్యోతిరావ్‌ పూలే, సావిత్రీబాయ్‌ పూలే, అంబేద్కర్‌, కెజీ సత్యమూర్తి అలియాస్‌ శివసాగర్, కాన్షీరామ్‌, మైకేల్ జాక్సన్‌, మారోజు వీరన్న, బెల్లి లలిత తదితర స్ఫూర్తిప్రదాతలు ఫ్లెక్సీ మీద ఆశీనులై ఆద్యంతం ఆ కార్యక్రమాన్ని తిలకించి పులకించిపోయారు.
2 నేపథ్య స్వరం…

ఓయూ క్యాంపస్‌లో జరిగిన భీమ్‌ డ్రమ్‌ని కట్టెకొట్టెతెచ్చే చందంగా చెప్పడం అంటే కుట్రతో సమానం. ఎందుకంటే అది ఒక చారిత్రక సందర్భం. ఒక మార్పుకి సంకేతంగా నిలవబోతున్న నూతన కూర్పు. ఆ కార్యక్రమానికి కర్త కర్మక్రియ నలిగంటి శరత్‌. చాలామందికి ఆ యువరక్తపు నవతేజం పరిచయమే అయినా రెండు ముక్కల్లో మళ్లీ చెప్తాను. నలిగంటి శరత్‌ చమర్‌ అనే ఆ యువకుడు దళిత్‌ బహుజన్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక ఉద్యమకారుడిగా, రచయితగా బాగా పాపులర్‌ అయ్యాడు. సాంసృతిక సైనికుడి అవతరించాడు. అతనిదొక విలక్షణ స్వరం. మెరిసే నల్లని మేనిచ్ఛాయతో సంధించిన విల్లులా ఉంటుంది రూపం.

ఉస్మానియాలో బీఫ్‌ ఫెస్టివల్‌ జరిగినా, ఇఫ్తార్‌ పాటతో హిందూ- ముస్లింలతో అలాయి బలాయి పాడించినా… అది అతనికే చెల్లింది. ‘బీఫ్‌ ఈజ్‌ సీక్రెట్‌ ఆఫ్‌ మై నాలెడ్జి’ అనే అతని గీతం ఇతర రాష్ట్రాలకు కూడా పాకిపోయింది. నలిగంటి శరత్‌కి స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉంది. తన వర్ణం, వర్గం గురించిన స్ఫృహ కూడా కావలసినంత ఉంది. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో ఎంఐఎం శరత్‌కి తమ పార్టీ టిక్కెట్‌ ఇచ్చి అంబర్‌పేట అభ్యర్థిగా పోటీలో నిలిపింది. అంబర్‌పేట నియోజకవర్గం జనరల్‌ సీటు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పోటీచేసిన స్థానం. నలిగంటి శరత్‌ దళితుడు. అప్పటికి శరత్‌ ఓయూలో పరిశోధక విద్యార్థిగా ఉన్నాడు. ఆ ఎన్నికల్లో కిషన్‌రెడ్డికి చుక్కలు కనిపించిన మాట వాస్తవం. నలిగంటి శరత్‌ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయితేనేం… తన సత్తా ఏమిటో చాటుకున్నాడు. ఇది జరిగిన కొద్ది నెలలకే అంటే గత సెప్టెంబర్‌ మాసంలో శరత్‌ రూముపై దాడి జరిగింది. అతని పుస్తకాలు, బట్టలు, సర్టిఫికెట్లు సహా అన్నింటినీ తగులబెట్టారు. పగలనకా రేయనకా ఎంతో శ్రమపడి పిహెచ్‌డి కోసం అతను తయారుచేసుకున్న రాతప్రతి కూడా ఆ ఘటనలో కాలి బూడిదయ్యింది.

ఈ దుర్మార్గాన్ని ఎవరు చేసి ఉంటారో విడమరిచి చెప్పాల్సిన పని లేదు. శరత్‌ కట్టుబట్టలతో మిగిలాడు. సహజంగా ఇలాంటి సంఘటనలు జరిగితే.. పిల్లలు కుంగిపోతారు. నిరాశకి గురవుతారు. ధైర్యం కోల్పోతారు. కానీ శరత్‌ నిలబడ్డాడు. అదే క్యాంపస్‌లో నిలబడ్డాడు. భయపడితే బతుకెక్కడ…? అందుకే మరింత బలంగా, మనోనిబ్బరమే శిఖరంగా మారినట్టు నిలబడ్డాడు. అతనికి మేథావులు, అధ్యాపకులు, విద్యార్థులు అండగా నిలిచారు. అప్పుడెప్పుడో జార్జిరెడ్డి… ఇదిగో మళ్లీ ఇప్పుడు శరత్‌ అనిపించుకున్నాడు. (జార్జిరెడ్డిని భౌతికంగా అంతం చేయగలిగారు కానీ అతని భావాలను మాత్రం అంతంచేయలేకపోయారు) అతనికి చెడు చేయాలనుకున్న వారు మాత్రం కలుగుల్లో దాక్కున్నారు. భీమ్‌ డ్రమ్‌ కార్యక్రమం ద్వారా శరత్‌ తన శక్తి ఏమిటో చాటుకున్నాడు. దళిత, బహుజన, ఆదివాసీ, ముస్లిం, మహిళల రాజకీయాధికార లక్ష్య ప్రకటన చేశాడు. దాని సాంస్కృతిక అభివ్యక్తే భీమ్‌ డ్రమ్‌..!

sarat1

3. దళిత సాంస్కృతిక దర్శనం

భీమ్‌ డ్రమ్‌ ఒక విలక్షణ ప్రయోగం. అభ్యుదయ, విప్లవ, జానపద, తాత్వగీత, కవ్వాలీ రాగాల సమ్మేళనం. బహుభాషలలో సాగిన స్వరమాలిక. ఈ సందర్భంగా పాడిన పాటలు, ఆలపించిన రాగాలు, దరువుకి తగ్గట్టుగా విద్యార్థి బృందం లయబద్ధంగా వేసిన అడుగులు… ఒకదానికొకటి చేర్పుగా ఒక కూర్పుగా మారాయి. మరొక్కసారి మరొక్క పాట అని అడిగిమరీ పాడించుకున్నారు ఆహూతుల చేత. బీఫ్‌ యేంతమ్‌, బఫెల్లో సోల్జర్‌ గీతాలు “రిథమ్‌ ఆఫ్‌ బహుజన్స్‌” కాన్సెప్టుని ప్రతిఫలించాయి. గొడ్డు మాంసం తిన్న బుద్ధుడు, జీసస్‌, ఐన్‌స్టీన్‌, కారల్‌ మార్క్స్‌, అంబేద్కర్‌లే ఈ ప్రపంచాన్ని మార్చగలిగారనీ, వారే తమకు ఆదర్శప్రాయులనీ కంచ ఐలయ్య ఈ వేదిక మీదనుంచి విస్పష్ట ప్రకటన చేశారు.

అక్షరాలు ఉన్న చోట ఆలయాలా అని హేళనగా ప్రశ్నించారు. ఇకపై దళిత, బహుజనుల కళాకారులు నిండు వస్త్రధారణతోనే ప్రదర్శనలు ఇవ్వాలని ఐలయ్య పిలుపునిచ్చారు. ఇంగ్లీష్‌ చదువుల అభ్యాసం, దేశ విముక్తి అనే లక్ష్యం తమ ముందున్న కర్తవ్యాలని చెప్పారు. ఫ్యూడల్‌, మతోన్మాదశక్తులను ఎదుర్కొంటూ ఈ ఆశయ సాధన కోసం పునరంకితమవుతామని అన్నారు. ఉత్పత్తి కులాలు ఏకమైతే అధికారం తమదే అన్న ధీమాను వ్యక్తంచేశారు. ఈ కొద్ది మాటలు కూడా ఆటపాటల మధ్య ఆటవిడుపుగా చెప్పినవే. ప్రధాన వక్తలుగా వచ్చిన కొద్దిమంది మినహా మిగతా అందరూ పాటలతోనే తాము చెప్పదలుచుకున్నది చెప్పారు.

భీమ్‌ డ్రమ్‌ జరుగుతుందని తెలిసి… ఇందులో పాల్గొనడానికి పలు సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా వచ్చారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డి నుంచి మార్పు కళామండలి వ్యవస్థాపకులు ప్రత్యేకంగా విచ్చేసి అంబేద్కర్‌, ఫులేలపై పాటలు పాడారు. తన పాటతో అంబేద్కర్‌ని జయరాజ్‌ అద్భుతంగా ఆవిష్కరించాడు. ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న మరోసారి దళిత చిందేశాడు. భీమ్‌ డ్రమ్‌ ఈవెంట్‌ కోసమే కామ్రేడ్‌ మిత్ర రాసిన గీతాన్ని విమలక్క బృందం గానం చేసింది. ధీమ్‌ సాంగ్‌గా స్కైబాబా రాసిన కవ్వాలీ ఓయూ క్యాంపస్‌లో అలాయి బలాయిని మళ్లీ ఆడించింది. భీమ్‌ బోలోరె మీమ్‌ కొ లేకే మీమ్‌ బోలోరె భీమ్‌ || భీమ్‌ || ఖాందా మిలాలే – దిల్‌ సె లగాలే || ఖాందా || బోలోరె బోలో భీమ్‌ భీమ్‌ భీమ్‌ || అంటూ సాగిన ఆ గీతానికి అక్కడున్న ప్రతి ఒక్కరూ కోరస్‌ ఇచ్చారు. జిలుకర శ్రీనివాస్‌, కోట శ్రీనివాసగౌడ్‌, పసునూరి రవీందర్‌, గుర్రం సీతారాములు,సూరేపల్లి సుజాత వంటి దళిత థింకర్స్‌, రైటర్స్‌ కార్యక్రమంలో హుషారుగా పాల్గొని ఊపునిచ్చారు. కొత్త చూపుని అందించారు.

ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే… ఓయూ సాక్షిగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇంతటితో ఆగబోవడం లేదు. ఇదే తరహా కార్యక్రమాలను తెలంగాణలోను, ఇతర రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాల్లో కూడా నిర్వహించాలని నలిగంటి శరత్‌ ప్రభృతుల ఆలోచన. విద్యార్థి, యువజనుల ముందు తమ ప్రణాళికను ఉంచాలనీ, కవిగాయక బృందాలను కదిలించి రిథమ్‌ ఆఫ్‌ బహుజన్స్‌లో కలుపుకు రావాలనీ వారి తాపత్రయం. తదనంతర కాలంలో దీనినొక రాజకీయ అభివ్యక్తిగా తీర్చిదిద్దాలన్నది వారి సంకల్పం. శరత్‌ అనే మొండిఘటానికి, ఐలయ్య అనే జగమెరిగిన దళిత మేధావి తోడవడంతో సమీప భవిష్యత్‌లోనే ఇందుకు వారు ఉద్యుక్తులు అవుతారన్న నమ్మకం కలుగుతోంది. ఇదీ మొత్తంగా భీమ్‌ డ్రమ్‌ అనే సాంస్కృతిక మహాప్రదర్శన తాలూకు అంతస్సారం…!

2009లో ఉస్మానియా విద్యార్థుల గర్జన తెలంగాణ ఉద్యమాన్ని ఏ మలుపు తిప్పిందో చూశాం. 2015 మే 3న కూడా ఉస్మానియాలో రిథమ్‌ ఆప్‌ బహుజన్స్‌ పేరుతో విద్యార్థులు గర్జించారు. దీన పరిణామ ప్రభావాలను ముందు రోజుల్లో చూడబోతాం.

*

మనిద్దరి దేహాల మీదుగా…

ప్రసూన రవీంద్రన్

 

PrasunaRavindranరాధ ఉలిక్కిపడింది. తననెవరో గుసగుసగా పిలిచిన భావన. చాలా దగ్గరగా వచ్చిపిలిచినట్టు. చెవి పక్కన చెంపల మీదుగా జారి ఒంపు తిరిగిన కురులు కూడా చిన్నగా వణికాయ్.
అప్పటివరకూ నల్లనయ్యను తలుచుకుంటూ , కూనిరాగాలు తీస్తూ చిలికిన వెన్న జాగ్రత్తగా మట్టి కుండలోకి తీసిపెడుతున్నదల్లా రెపరెపలాడుతున్న హృదయంతో తలెత్తి చుట్టూ చూసింది. ఎవరూ లేరు… ఎప్పటిలాగే ఉన్నాయ్ పరిసరాలు.
తిరిగి తన పనివైపు దృష్టి సారించింది కానీ ఏదో అలజడి మనసంతా. ఆమెకు తెలీకుండానే అంతకంతకూ వేగవంతమవుతూ ఎదని ఊయలూపుతోంది ఊపిరి. బుగ్గలు బరువెక్కి , ఎరుపెక్కి ఏదో పరవశం పెదవుల్లోకి కూడా పాకి వణికిస్తోంది.

త్వరగా పని ముగించుకుని ముందు గదిలోకి వెళ్ళి గుమ్మానికానుకుని నిలబడి ఆకాశం వైపు చూసింది. నిండు చంద్రుడు కొంటెగా నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఏవిటో అర్ధంకాలేదు. ఇప్పుడే.. ఈ క్షణంలోనే నల్లనయ్యని చూడాలని ఆమె మనసు ఉవ్విళ్ళూరింది. కానీ ఎలా? ఈ సమయంలో వెళితే అమ్మ ఏమంటుందో. తల తిప్పకుండానే ఓరగా తల్లి వైపు చూసింది. చుట్టుపక్కల వారితో కలిసి ముచ్చట్లలో ఉందావిడ.

తిరిగి ఆకాశం వైపు చూసింది. అంతవరకూ లేనిది ఎక్కడి నుండి వచ్చాయో నల్లమబ్బులు. వేగంగా కదిలిపోతున్నాయ్. అప్పటిదాకా వెన్నెల్లో వెలిగిపోయిన పరిసరాలన్నీ కృష్ణవర్ణాన్ని పులుముకుని ఆమెకేదో చెప్పాలని చూస్తున్నట్టుగా అనిపించాయ్. చల్లటి గాలి తనువుని తాకి ఆమె పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది. ఎక్కడెక్కడి పూల పరిమళాలనో పట్టుకొచ్చి గాలి ఆమెని సాంత్వన పరచాలని చూసింది కానీ, ఆమె పరిస్థితి మెరుగవలేదు.

ఎక్కడినుంచో సమ్మోహన వేణు గానం తనని పిలుస్తున్నట్టుగా వినపడింది. అంతే, ఇక ఆమె తన ఎరుకని మరిచిపోయింది. మెరుపు వేగంతో కదిలింది.
“ఈ సమయంలో, ఈ వాతావరణంలో ఎక్కడికమ్మా …” అంటున్న తల్లి మాటలు రాధ చెవులకి వినపడలేదు.
రాధ తల్లి సరిగ్గా గమనించి ఉంటే రాధ అలా వెళ్ళడం వల్ల కదిలిన ఆమె జడ కుచ్చుల సవ్వడిలోనో, పద మంజీరాల కులుకుల్లోనో , పొడవాటి చెవి జూకాల ఊపులోనో ఆమెకి సమాధానం దొరికేసి ఉండేది.

ఏదో మాయ కమ్మినట్టుగా యమునా తీరంలోని ఆ పచ్చిక బయలుకేసి నదిలా కదిలింది రాధ.
ఆమె పరిమళాన్ని అల్లంత దూరంనుంచే ఆఘ్రాణించి లిప్త కాలంపాటు మురళీ గానాన్ని ఆపాడు కృష్ణుడు. అతని కళ్ళలో యమున వలపుగా మెరిసింది. చెంపల్లో తామరలు విచ్చుకుని రాలి ఒక విధమైన కెంపు మెరుపులతో ఆ ప్రదేశాన్ని వెలిగించాయ్.

పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకున్న రాధ అలా కృష్ణుడిని చూస్తూనే శిలలా నిలబడిపోయింది. రెప్ప మరచిన ఆమె కన్నుల నీలిమల్లో చంద్రోదయాలయ్యాయి. అమె కళ్ళలోంచి దూకుతున్న వెన్నెల వెలుగు, విశ్వ మోహనుడి తనూ వర్ణంతో కలిసి ఆ ప్రదేశమంతా అలౌకికమైన, అవ్యక్తమైన వర్ణంతో శోభిల్లింది. అక్కడి నీరూ, చెట్టూ, చేమా, పూలూ , తుమ్మెదలూ అన్నీ పరవశంతో ఉలిక్కిపడ్డాయ్.

తన్మయంగా కృష్ణుడిని చూస్తూ నెమ్మదిగా నడిచి వెళ్ళి ఆతని ఒడిలో వాలిపోయింది రాధ. ఆ మానస మనోహరుడి కన్నుల్లోకి ప్రేమగా చూస్తూ అంది-

“నిన్ను చూడగానే నాలో కలిగే ఈ ప్రేమ
ప్రపంచాన్ని ముంచేసేలా విస్తరిస్తుంటే
కృష్ణా…
కాలం కవిత్వమైపోయి
మనిద్దరి దేహాల మీదుగా ప్రవహిస్తున్నట్టు లేదూ… “

*

వర్గీకరణ  వ్యథ 

 ఎండ్లూరి సుధాకర్ 

 

”వర్గీకరణ పేరిట

నోరెత్తితే నాలుక కోస్తాం

నామ రూపాలు లేకుండా చేస్తాం

ఏ పార్టీ అయినా

ఏ నాయకుడికైనా ఇది తప్పదు ”*

ఈ మాటలు

తూటాలు పేల్చే ఉగ్ర తాలిబాన్లవి కావు

దళితుల తలలు నరికే అగ్ర సైతాన్లవి కావు

మా వాళ్ళవే

మాలో వాళ్ళవే

‘కావడి కుండల్లా కలిసుందాం

అన్నదమ్ముల్లా విడిపోదాం’

అన్నవాళ్లవే

ఇంగిత జ్ఞానం

ఇంగ్లీషు జ్ఞానం వున్న వాళ్ళవే

‘బుద్ధి’స్టులు  పచ్చి టెర్రరిస్టుల్లా మాట్లాడుతున్నారు

దయతో న్యాయం చెప్పండి మీరైనా

నాలుగు ముద్దల్ని

నలుగురం పంచుకుందామంటాము మేము

కాదు కుండ మాకే కావాలంటారు వాళ్ళు

మేము ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం

మాకు మెరిట్ వుంది పోటీ పడమంటారు వాళ్ళు

ఈ పంతం పంతుళ్ళ ముందు ఏమైందో గానీ

 మా అంతం చూసే దాకా వదిలి పెట్టడం లేదు వాళ్ళు

ఏమడిగాం మేము  ఎ బి సి డి లే కదా

ఎవరి మానాన వాళ్ళం బతుకుదామనే కదా

ఎంగిలి మెతుకుల కోసం

ఎగబడుతుంటే ఏం చేయాలో చెప్పండి

ఈనాటిదా ఈ కథ ?

కామధేనువుని కోసుకు తిన్నప్పటినుంచి

కయ్యం కాలు దువ్వుతూనే వుంది

మెత్తని చియ్యలు వాళ్ళు తిన్నారు

ఉత్త ఎముకలు మాకు మిగిల్చారు

చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ

చెప్పకుంటే ద్రోహం మిగుల్తుంది

ఏ జాంబపురాణమో విప్పండి

జాతిపితలు నిజాలు చెప్తారు

సూటిగా అడుగుతున్నాను

 సోదరులారా! నిజం చెప్పండి

ఏనాడైనా

ఒక పాకీ మీలోకి నడిచి వచ్చాడా ?

మీతో చేతులు కలిపి

ఐక్యవేదికపై  పూలమాలై వికసించాడా ?

ఏ రోజైనా

ఒక గోసంగి గోస విన్నారా ?

ఎడారిలాంటి  కుల బిడారులో

ఒక గొడారిని కలుపుకున్నారా ?

ఏ హోదా లేని స్మశానంలో

జీవచ్చవంలాంటి  కాపరిని కన్నారా ?

ఏ ఒక్కరైనా మీ పక్కన ఉన్నారా ?

నిజమే సుమా !

‘సంచారమే ఎంతో బాగున్నది’

ఒక్క సంచార జాతి వాడైనా

మీ పంచన నిలబడ్డాడా ?

తెల్లటి బట్టలతో కనబడ్డాడా ?

ఏ రెల్లి చెల్లైనా

మీ వేదిక మీద గొంతు వినిపించిందా  ?

ఏ డక్కలి పిల్లైనా నీలిజెండాతో కనిపించిందా?

ఎక్కడ వినిపిస్తాయి సమైక్యతా రాగాలు?

ఎప్పుడు వెదజల్లుతాయి

మల్లె మాలల పరాగాలు ?

ఈ శతాబ్దపు పెద్ద అబద్ధాలు

ఒకటి సమైక్యత

రెండు ఐక్యవేదిక

కడుపు కోసుకుంటే కాళ్ళ మీద పడుతుంది

మేము తలలు వంచుకుని

వేల సంవత్సరాలుగా చెప్పులు కుడుతూనే వున్నాం

ఒక్క సారి తలెత్తే సరికి

ఎక్కడికో చేరిపోయారు

ఎస్కిమోల్లాగా మేము మంచు గుహల్లో  వుంటే

ఎస్కలేటర్ల మీద

 పార్లమెంటుకు తరలిపోయారు కదా

ఏరోజైనా మాకు బోధించారా ?

మమ్మల్ని సమీకరించారా ?

పోరాటాలకు బాటలు వేశారా ?

రెప్ప పాటులోనే తెప్ప తగలేశారు కదా

చూస్తూ ఉండగానే రిజర్వేషనంత ఎత్తుకి ఎదిగి పోయారు

ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క అమృత భాండం

మా చేతుల్లో ఖాళీ కుండలు

ఒక సుదీర్ఘ నిద్ర తర్వాత

ఒక కొత్త సూర్యోదయం తర్వాత

దండోరా ధర్మ ఘంటికలు మోగిస్తే

కడుపు కాలి మాట్లాడితే

కన్నీటి నాల్కల మీద

కారం చల్లుతారా ?

ఆకలి బతుకుల మీద

మేకులు కొడతారా ?

బువ్వ తినాల్సిన వారసుల్ని

భ్రూణ  హత్యలు చేస్తారా ?

కలిసి ఉందాం

కలిసి తిందాం అంటే

కత్తులు దూస్తారా ?

నాల్కలు కోస్తారా ?

ఒక్కసారి బాబా సాహెబ్

చూపుడు వేలు వైపు చూపు సారిస్తారా !

అంబేద్కర్ సాక్షిగా

వర్గీకరణ రథాన్ని

ముందుకు తీసుకెళ్లమంటున్నాడు

మీరూ వస్తారా ఆనందంగా రండి

ఉపకులాలతో  బాధిత గళాలతో

హస్తిన వైపు రథాన్ని మళ్ళిద్దాం !

ఏదో ఒక రోజు ఎర్రకోటలో

నీలిపతాకం ఎగరక పోదు !

[ ఆంధ్ర జ్యోతి : *మార్చి 28న ఏలూరులో జరిగిన ‘మాలల సింహగర్జన’ సభలో కారెం శివాజీ వ్యాఖ్యలు ]

ఆ ఆరుగురేనా?

 

 

అప్పుడు:

 

దేశ రాజధానిలో ఇండియాగేట్ దగ్గర

నిర్భయకు న్యాయం జరగాలంటూ ప్రశాంతంగా సంఘర్షిస్తున్న వేలాది స్త్రీ పురుషులను

లాఠీలతో, బుల్లెట్లతో, వాటర్ కానన్లతో మానభంగం చేసారు

 

వీడియో  పాఠాలు కొన్ని :

 

యీ దేశానిది  ఘనమైన సంస్కృతి..   యిందులో ఆడవాళ్ళకు స్థానం లేదు.

:న్యాయవాది వువాచ

 

ప్రాణాలు కాపాడుకోవాలంటే నోరు మూసుకుని చెయించుకోవాలి గాని నోరెత్తకూడదు

వీడియోలో రేపిస్టు మాట్లాడుతున్నడా లేక నేను అద్దంలో చూస్తున్నానా?

భుజాలెక్కడ?

: చాలామంది సమస్య.

 

యిప్పుడు:

 

మీ మానాలను కప్పి కాపాడుతున్నామంటూ

వీడియో ప్రసారాన్ని నిర్బంధించి

మీ కళ్ళు చెవులు నోళ్ళు మూసి

వొక్కసారిగ

సమస్త దేశంలోని

ఆడా-మగా  అందరిని లింగ వివక్ష లేకుండా

సమానంగా

మానభంగం చెయడం జరిగింది.

చట్టం నిర్వచనంలోకి రాని దానికి శిక్షా లేదు.

 

స్వగతం:

 

ఆ నిర్భయను మానభంగం చేసినవారు ఆ ఆరుగురేనా?

 – పరేశ్ ఎన్ దోశి

 

 

    ప్రేమోత్సవం

                               1797324_1554574958090172_7329323992269709774_n

సాంధ్య రాగం పిలిచే వరకూ

సూర్యుడి ప్రేమని నిండా కప్పుకుని నిదురిస్తుంది చీకటి

 

ఆకాశాన్ని ప్రేమిస్తూ

తన ఆరాధనంతా పూవుల్లోనో, పళ్ళలోనో

ఏదీ లేకుంటే తన దేహంలోనో నింపుకుని

ప్రేమకి నిర్వచనమవుతుంది చెట్టు

 

రాళ్ళని అలంకరించే సెలయేట్లోనూ

విశ్వమోహన రహస్యాల్ని గుండెల్లో దాచుకున్న లోయల్లోనూ

మట్టి పొత్తిళ్ళలో గుర్తింపుకి నోచుకోని చిట్టి రాళ్ళలోనూ

అన్నిట్లోనూ ప్రేముంది.

కారణాల్లేకుండానే ప్రేమ పంచగల దమ్ముంది.

 

మనిషికి మాత్రం

కాలమంతా ప్రేమమయం కావాలనేమీ లేదుగానీ

నియంత్రిత నైసర్గిక ప్రపంచాన్ని దాటి

శిఖరాగ్రం మీద కాసేపు

తన గుండె చప్పుడు తాను వినడానికీ

నక్షత్రాల వెలుగు లిపిలో మనసు వ్రాసుకోవడానికీ

అరణ్య పుష్ప సుగంధాల్లో స్నానించి

స్వప్న గ్రంధాల్ని ఆవిష్కరించుకోడానికీ

ఓ కారణం తప్పకుండా కావాలి.  

 -ప్రసూన రవీంద్రన్ 

(painting: Mamata Vegunta)

కవిసంగమం మూడో మైలురాయి!

kalankariతెలుగు కవిత్వంలోకి ఈ కాలపు వాళ్లు రావటంలేదు,ముప్పై అయిదులోపు వయసువాళ్లు రావటం లేదు. ఇదీ ఈ మధ్య కాలంలో సాహిత్య కార్యక్రమాల్లో చాలావరకు వినిపించే మాటలు. నిజమే ననిపించేది దానికి కారణం. బయట అనేక సంస్థలు నిర్వహించే సమ్మేళనాల్లో లబ్దప్రతిష్టులైన కవులు,అంతో ఇంతో పేరున్న కవులు, సాహితీ వేత్తలు మాత్రమే పాల్గొనేవారు.ఇలా నిండిపోయిన సభల్లో కొత్త గొంతుకలు కనిపించేవికావు. కచ్చితంగా కరణాన్ని అంచనాకట్టాలంటే స్థలాభావమే ఎక్కువ.ఉన్న సమయంలో కొత్తవాళ్లకు సమయాన్ని కేటాయించాలంటే నిర్వాహకులకు కష్టమే. ఇప్పటికి కవిత్వం బతుకుతుంది.రేపటి విషయం ఏమిటి ?అనే ప్రశ్న చాలామందిని తొలిచేది. నిజానికి తెలుగు మరుగున పడుతోందో అని బాధపడేవాళ్లతో బాటు.కవిత్వం మరుగున పడుతోందనే వారిసంఖ్యా లెక్కించదగిందే.

బాగా అర్థం చేసుకుంటే ఎక్కడైన స్థలాభావమే ఇప్పటిసమస్య.ఆన్ లైన్ మాధ్యమం ఒకటి చేరువయ్యాక అన్ని తరాలను కలిపే అవకాశమొకటి వచ్చింది.కొన్ని తరాల కవిత్వాన్ని ఒక దగ్గర చేర్చేందుకు కవిసంగమం తెరమీదకు వచ్చింది.ఈ తొమ్మిది ఫిబ్రవరి నాటికి కవిసంగమం నడకకు మూడేళ్లు.చాలావరకు సంస్థలు ఆర్ద్రలో పుట్టి పుబ్బలో పోయేవే అనే సామేతకు దగ్గరివే.ఇలాంటి సాహసంలో “కవిసంగమం” మొదటిదనలేం కాని మూడుపువ్వులు ఆరుకాయల్లా వికసించినవాటిలో మొదటి స్థానంలో ఉంటుందనటంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. కవిసంగమం నడక వెనుక కవి యాకూబ్ కృషి గమనించదగింది.కేవలం తెలుగుకు సంబంధించిన మూడుతరాలను మాత్రమే కాదు. భారతీయ తెలుగేతరభాషల్లో లబ్దప్రతిష్టులైన శాహితీ వేత్తలుకూడా కవిసంగమం వేదిక పంచుకోవడంలో ప్రధానంగా యాకూబ్ ఆలోచనలు హర్షించదగినవి. అతనికి సాయంగా ఉన్న మిత్రుల నిబద్దతనుకూడా అభినందించవలసిందే.

సంవత్సరం వరకు కవిత్వం గ్రూప్ గా నడచిన కవిసంగమం భారతీయభాషల కవులను వేదికపై పరిచయం చేసింది.మొదటి వార్షికోత్సవం నాటికి సుభోధ్ సర్కార్ అతిథిగా హాజరయ్యారు.రెండవ వార్షికోత్సవానికి శీతాశు యశశ్చంద్ర ,కాస్త ముందుగా జరిగిన ఈసంవత్సరపు వేడుకల్లో రజతసల్మ పాల్గొన్నారు.మధ్యకాలంలో ఒక కార్యక్రమంలో చేరన్ రుద్రమూర్తి తో పరిచయకార్యక్రమాన్ని,ఈ సంవత్సరం సింధీకవి లక్ష్మణ్ దూబే తో పరిచయాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమాన్ని పున:పున:చూడడానికి యూట్యూబ్ లోనూ కార్యక్రమాలను చేర్చి తాముగాహాజరుకాలేని ఇతరప్రాంత సాహితీ మిత్రులకు ఈ అవకాశాన్ని కలిగించింది.

జనవరి ఇరవైఏడు 2013 నుండి ప్రారంభమైన కవిసంగమం “లెర్నింగ్ ఇన్ ప్రాసెస్”కార్యక్రమం సుమారు ఇప్పటివరకు ఒకటిన్నర సంవత్సరాలపాటు నిరాటంకంగా నడచి మూడుతరాలను ఒకదగ్గరికి చేర్చి తరాలమధ్య ఉండే అంతరాన్ని దూరం చేసింది.వరవర రావు,నగ్నముని,నిఖిలేశ్వర్,దేవీప్రియ,అమ్మంగి వేణుగోపాల్,మొదలైన లబ్దప్రతిష్టులైన కవుల్ని కొత్తతరానికి ,కొత్తతరాన్ని మిగతాకవులకు పరిచయం చేసింది.ఈ మార్గంలో స్థలాభావాన్ని ఒక నిర్ణీతమార్గంలో దూరం చేయగలిగింది. అంతే కాదు యువత కవిత్వంలోకి రావటం లేదన్న మాటని అసత్యంగా నిరూపించింది. ఇప్పటికే కవిసంగమం ద్వారా కవితా రచన ప్రారంభించి కొంత అనుభవాన్నిసమకూర్చుకున్న యువతరం పుస్తకాలను ముద్రించుకుని తమనడకకు సార్థకతను కలిగించుకున్నారు.కవిసంగమం సాధించిన లక్షాలలో ఈ అంశం గమనించదగింది.

వృత్తిరీత్యా,ఇతరకారణాలతో తెలుగునేలకు దూరంగాఉన్న తెలుగు కవులతోకూడా కొత్తతరాన్ని కలిపింది. ఇందులో భాగంగా “మీట్ ది పోయట్”కార్యక్రమంలో నారయణ స్వామి వెంకట యోగి,అఫ్సర్(27 జూలై)కృష్ణుడు (7 డిసంబర్)మొదలైన కవులతో పరిచయాన్ని సంభాషణను నిర్వహించింది. పుస్తకముద్రణల్లో భాగంగా రెండవసంవత్సరం నూటా నలభైనాలుగుమందికవుల కవిత్వంతో పుస్తకాన్ని తీసుకువచ్చింది.

నిరంతర సాహిత్యచర్చలకోసం గతంలో సాహిత్యంతో స్ఫూర్తివంతమైనపరిచయాలుగల కవులు,విమర్శకులు,అనువాదకులతో రోజువారీశీర్శికలను నిర్వహిస్తోంది.సీనియర్ కవులసలహాలను ఎప్పటికప్పుడు కొత్తవారికి చేర్చడంతోపాటు,కొత్తగారాస్తున్నవారిలో దొరలే తప్పుల్ని తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి నౌడూరి మూర్తిగారు(కవిత్వతో ఏడడుగులు)కాసుల ప్రతాప రెడ్డి (కవిస్వరం) వేణుగోపాల్ (కవిత్వంతో ములాఖాత్)సత్య శ్రీనివాస్(మట్టిగూడు)అబ్దుల్ వాహెద్ (ఉర్దూకవిత్వ నజరానా)శ్రీనివాస్ వాసుదేవ్(The winged word)అన్నవరం దేవేందర్(తొవ్వ)అఫ్సర్(కరచాలనం)తో పాటు సిరా,రాజారాం తుమ్మచెర్ల(నేను చదివిన కవిత్వ సంపుటి) మొదలైనవాళ్ళు  శీర్శికలు నిర్వహించారు.ఇందులో భాగంగా ఉర్దూకవి ఫైజ్ అహ్మద్ ఫైజ్.జీవితం-కవిత్వం(అబ్దుల్ వాహెద్ రచన)ఎం.నారాయణ శర్మ(ఈనాటికవిత-కవిత్వ విమర్శ)ముద్రించి పుస్తకముద్రనవైపునడిచింది.మూడుతరాల కవిత్వాన్ని ఒకవేదికనుంచి అందించడమేకాక భవిష్యత్తులోని రెండుమూడుతరాలనుకూడా కవిసంగమం పరిచయం చేసింది.రక్షితసుమ “దారిలోలాంతరు”ను ఆవిష్కరించుకుంది.కమలాకర్,మరికొంతమంది పాఠశాల విద్యార్థులు కవిసంగమం తోటలో వికసిస్తున్న రేపటి కవితా కుసుమాలు.

ఈనడకను గమనిస్తున్న వారెవరైనా కవిసంగమం తీసుకువచ్చిన కవితాస్పృహను గుర్తించగలుగుతారు.ఇంత నిబద్దమైన నిర్వహణలొ ఉండే సాధకబాధకాలు అందరూ గుర్తించగలిగేవే.వీటిని అధిగమించాల్సిన అవసరం ఉంది.కవుల్ని, కవిత్వాన్ని మాత్రమే ఆధారం చేసుకున్న నడక మరింత శక్తివంతంగా ముందుకుసాగాల్సి ఉంది.అందుకు ఈ మూడేళ్ళమైలురాయే మంచిపాఠంగానిలుస్తుంది.

ఎప్పటికైనా కవితాత్మకస్పృహను అందుకోలేనికవులను దారికితెచ్చుకోవాల్సిన అవసరమూ ఇప్పుడు కవిసంగమం భుజాలపై ఉంది.మరిన్ని తరాలనుకలుపుతూ కవిసంగమం జీవనదిలాప్రవహించాల్సిన అవసరం ఉంది.ఈ పచ్చని చెట్టును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదికూడా.

-ఎం.నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

 

 

 

 

 

 

కవిసంగమం ఎందరినో ఒకచోటికి చేర్చింది: కవి యాకూబ్ 

మూడేళ్ళ కవిసంగమం ప్రయాణ అనుభవం ఎలా ఉంది?

జ. తెలుగులో కవిత్వానికి కొత్తవేదికగా కవిసంగమం ఏర్పాటు చేసుకున్నాం. ఫేస్‌బుక్‌ లో వచనకవిత్వం గురించి, మరీ ముఖ్యంగా కవిత్వసృజన, సంబంధిత అంశాల గురించి నిరంతర సంభాషణ కొరకు ఒక వేదికగా ఏర్పడిన సమూహం. కవిత్వసృజన, కవిత్వపఠనం, కవిత్వ సంబంధిత అంశాలు – ఇవన్నీ అవగాహన చేసుకుంటూ ముందుకు సాగేందుకు వీలుగా ప్రతినెలా ‘‘కవిసంగమం’’ సీరీస్‌ సభలు ‘‘పోయెట్రీ వర్క్‌ షాపుల్లా” జరుగుతున్నాయి. వీలయినప్పుడల్లా కవిత్వానికి సంబంధించిన అనేక అంశాలను కవిసంగమం గ్రూప్‌ వాల్‌ మీద పోస్టు చేయడం, నెలనెలా కార్యక్రమాల్లో ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ ‘‘లెర్నింగ్‌ ఇన్‌ ప్రాసెస్‌’’ మార్గంలో సాగుతోంది .

కవిసంగమం ప్రారంభంలోని ఈ దశను ఇప్పుడు గుర్తు చేసుకోవడం ఎంతో హాయిగా, సంతోషంగా ఉంది.

ఫిబ్రవరి 9, 2012 – కవిసంగమం మొదలయ్యింది. ఎంతోమందిని కలుపుకుంటూ సాగింది. ఇవ్వాళ ఫేస్‌ బుక్‌ కవితావేదికగా నిలబడింది. అనేక సాహిత్యసందర్భాల్ని సృష్టించింది. కొత్తగా రాసున్నవాళ్ళు ఎందరో ఇవాళ తమదైన ముద్రను ఏర్పరుచుకున్నారు. చర్చలు, సూచనలు, సందేహాలు, సందోహాలు -వీటన్నిటి మధ్య తమనుతాము ప్రూవ్‌ చేసుకున్నారు. చేసుకుంటున్నారు. ఆ మార్గంలో సాగుతున్నారు. కవిసంగమం ఎందరినో ఒకచోటికి చేర్చింది.

ఆగష్టు 15, 2012 న ఇఫ్లూ లో జరిగిన ‘‘కవిసంగమం పోయెట్రీ ఫెస్టివల్‌’’ ఒక గొప్ప ప్రయోగం. ఆంధ్రజ్యోతి, పాలపిట్ట, దక్కన్‌ క్రానికల్‌, హిందూ వంటి పత్రికలూ ఈ కృషిని కొనియాడాయి. అలాగే ఒక ప్రయత్నంగా, ఒక ప్రయోగంగా 144 కవితలతో ‘‘కవిసంగమం-2012 ’’ కవితా సంకలనం వెలువడిరది . ఇందులో తొట్టతొలిగా ముద్రణలో కన్పించినవారు ఎనభై మందికి పైగానే వర్థమాన కవుల కవితలున్నాయి. ‘కవితత్వాలు’ పేరుతో యశస్వీసతీష్  ఫేస్బుక్లో రాస్తున్న కవుల పరిచయ పుస్తకం ప్రచురించారు. 2014లో ’’సోషలిస్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్‘‘ పేరుతో వాహెద్ రాసిన ఫైజ్ కవితలు జీవితం గురించిన పుస్తకాన్ని, ’’ఈనాటి కవిత‘‘ పేరుతో ఎం.నారాయణశర్మ రాసిన 75 మంది కవుల కవితల విశ్లేషణా పుస్తకాన్ని ప్రచురించాం.

***

2012 లో బెంగాలీ కవి సుబోధ్‌ సర్కార్‌ అతిధిగా పాల్గొని కవిసంగమం కాన్సెప్ట్‌ ను చూసి ముచ్చటపడ్డాడు. గొంతెత్తిన కొత్తకవుల కవిత్వంతో ఉక్కిరిబిక్కిరే అయ్యాడు. అప్పటివరకూ కవిత్వంలో లేని పేర్లేన్నో ఇవాళ కవిత్వరంగంలో వినబడుతున్నాయి. ఆ తర్వాత  వచ్చిన ప్రసిద్ద తమిళకవి చేరన్‌ రుద్రమూర్తి చేసిన ప్రసంగాలు, చదివిన కవిత్వం మనవాళ్ళు అనువదించి వేదికపై చదివిన ఆయన కవితలూ- ఇదంతా ‘‘లెర్నింగ్‌ ఇన్‌ ప్రాసెస్‌ ’’గా ఎంతో ఉపయోగపడ్డాయి.

కవిసంగమం ఫేస్‌బుక్ గ్రూపులో 3000 పైగా సభ్యులున్నారు.ప్రతి రోజు కవితలు వాలుతు వుంటాయి. అలానే ప్రతిరోజూ, రోజుకొక అంశానికి సంబంధించిన వ్యాసాలుంటాయి. ఇప్పుడు కవిసంగమం కవిత్వానికి సంబంధించిన గ్రంధాలయం.
9-2-2012 నుంచి నేటి వరకు తెలుగు సాహిత్యానికి ఎందరో నూతన కవుల్ని పరిచయం చేసింది. ఈ నూతన కవుల్ని కేవలం అంతర్జాలం మాధ్యమానికే పరిమితం చేయకుండా పాత తరానికి కొత్త తరానికి మధ్య కవిత్వ వారధి అయ్యింది. ఈ బాటలో వచనకవిత్వం అనుబంధిత అంశాలపై నిరంతర సంభాషణ కొనసాగుతుం ది. అందులో భాగంగా వర్క్ షాపులు కవిత్వానికి సంబంధించిన సమాచారాన్ని పంపిణీ చేయడం, ప్రముఖ కవులతో ముఖాముఖి ద్వారా కవిత్వ రచన గురించిన విషయాలు నేర్చుకుంటూ లర్నింగ్ ఇన్ ప్రాసెస్ మార్గాన్ని సృష్టించింది.
1779260_10203144783201536_2074735339_n

 

  1. ఫేస్బుక్ గ్రూప్ గానే కాకుండా ప్రత్యక్షంగా వివిధ కార్యక్రమాల ద్వారా కవిసంగమం తీసుకొచ్చిన చైతన్యానికి ముఖ్యంగా ఈ తరం నుంచి ఎలాంటి స్పందన చూస్తున్నారు?

జ. ముఖ్యంగా కవిత్వ పండుగల వల్ల ఇతర భాషలకు చెందిన ప్రముఖ కవులను కొత్తతరం కవులు కలుసుకునే వాతావరణం ఏర్పడింది. దానివల్ల చాలా మందికి నేర్చుకునే అవకాశం లభించింది. మీకు తెలుసు, కవిత్వం నేర్పడానికి విశ్వవిద్యాలయ కోర్సులేవీ ఉండవు. కవిత్వం రాయాలన్న తపన ఉన్నవారికి ఇలాంటి సందర్భాలు అవసరమైన లెర్నింగ్ అవకాశాలు కల్పించాయి. నెలనెల జరిగే పొయట్రీ మీట్ ల ద్వారా పాతతరం కవులు, కొత్త తరం కవులు కలుసుకోవడం వల్ల సీనియర్ల నుంచి కొత్తతరం కవులు నేర్చుకునే అవకాశాలు లభించాయి. తెలుగు కవిత్వంలో ఇది ఒక చక్కని వాతావరణాన్ని ఏర్పరచింది. అన్నింటికి మించి, హైదరాబాద్ బుక్ ఫెయిర్లో కవిసంగమం పేరుతో ఒక స్టాల్ తీసుకుని నడిపాము. అక్కడ కేవలం కవిత్వ పుస్తకాలు మాత్రమే అమ్మకానికి ఉంచాము.

తెలుగు కవులు చాలా మంది తమ పుస్తకాలు తీసుకొచ్చి స్టాల్ లో ఉంచారు. తెలుగులో కవిత్వం కొని చదివేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారని ఆ స్టాల్ నిరూపించింది. ఆ పదిరోజుల్లో మేము దాదాపు 40 వేల రూపాయల పుస్తకాలు అమ్మగలిగాము. కవులకు వారి పుస్తకాలు అమ్మకానికి పెట్టే ఒక వేదికనివ్వగలిగాము. ఇవన్నీ ఫేస్ బుక్ కు ఆవల జరిగిన కార్యక్రమాలే. నిజానికి ఫేస్ బుక్ కవులను పరోక్షంగా కలిపింది. వారి కవిత్వంతో పరిచయం ఏర్పడేలా చేసింది. కవిత్వం రాయాలనుకుంటున్న వారికి కవిసంగమం ఫేస్ బుక్ గ్రూపు ఒక వేదికగా ఉపయోగపడింది. ప్రాధమికంగా నేర్చుకునే అవకాశాలు కల్పించింది . ఆ తర్వాత కవిసంగమం చేపట్టిన నెలవారి సమావేశాలు, కవిత్వపండుగలు, బుక్ ఫెయిర్లలో స్టాల్ నిర్వహణ వంటి కార్యక్రమాలు కవులను ప్రత్యక్షంగా కలుసుకునే, ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకునే, ఒకరి నుంచి మరొకరు నేర్చుకునే అవకాశాలు కల్పించాయి. జయహో కవిత్వం ‘అని అందరితో అన్పించగలుగుతున్నాం.

  1. ఇతర భాషల కవులని ఆహ్వానించి, వారి గొంతు వినిపించడం ఒక ప్రయోగం. దాన్ని మన కవులు ఎలా స్వీకరిస్తున్నారు?

పరభాషా కవుల అనుభవాలు, అక్కడి కవిత్వ ధోరణులు, కవిత్వ వాతావరణం గురించి మనవారికి ఈ కార్యక్రమాల ద్వారా అవగాహన కలిగింది.  వారిని వినేందుకు,ముచ్చటించేందుకు ,కలుసుకునేందుకు ఎక్కువ సంఖ్యలోనే హాజరు అవుతున్నారు. ఆ ఆసక్తి ఆశాజనకమైన మార్పే. అప్పటికప్పుడు కవులు తమకు ఇతర భాషల్ని వినడం ద్వారా ఏం ఒనగూడిందో చెప్పకపోవొచ్చుకానీ, ఖచ్చితంగా ఆ ప్రభావం మాత్రం ఉంటుంది. ఏదో ఒక స్థాయిలో కవిత్వం అనే ప్రక్రియ సీరియస్ నెస్ ని అర్థం చేసుకోగలుగుతారు .

ఇతర భాషలలో ఇటువంటి కార్యక్రమాలు రెగ్యులర్ గా జరుగుతుంటాయి. తెలుగునేలమీద ఇటువంటి అనుభవం రమారమిగా లేదనే చెప్పాలి. ఒక రకపు కవిత్వ సభలకు అలవాటుపడి పోయాం. ఇతర భాషల కవుల్ని పిలిచే కార్యక్రమం ద్వారా ఇక్కడి కవిత్వ వాతావరణంలో క్రొంగొత్త తీరును ప్రతిష్టించాలని కూడా ప్రయత్నం. ఈ ప్రయత్నం ఫలితాల్ని ఇస్తున్నట్టే కన్పిస్తుంది. ఇటీవలి బుక్ ఫెస్టివల్ లో కవిత్వ సంకలనాల అమ్మకం ఒక కొలమానంగా చూపవచ్చేమో !

  1. కవిసంగమం భవిష్యత్ కార్యక్రమాలు ఏమిటి?

జ. భవిష్యత్తులో మరిన్ని కవిత్వ కార్యక్రమాలు ఫేస్బుక్ బయట కూడా ఏర్పాటుచేయాలని అనుకుంటున్నాము. ముఖ్యంగా అనేకమంది కొత్త కవులు రాస్తున్న పుస్తకాలకు ప్రచురణ వేదిక ఒకటి ఏర్పాటు చేయాలని, వారి పుస్తకాల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నాం. తెలుగులో కవిత్వాన్ని ప్రోత్సహించే వాతావరణం ఏర్పాటు చేయాలన్నదే మా అభిమతం. కవిత్వానికి మరింత ఊపు,ఉత్సాహం తీసుకురావాలన్నదే ప్రధాన ధ్యేయం. నిరంతరం కవిత్వం కోసం కవిత్వ సందర్భాల్ని సృష్టిస్తూ కవిత్వాన్ని సజీవంగా ఉంచాలని ప్రయత్నం.

*

 

 

సామాన్యుడి కరవాలం ఆర్కే లక్ష్మణ్!

with r k laxman

కొంతమంది కాలగర్భంలో కలిసిపోరు. కాలం చంకనెక్కి కూచుంటారు. కొన్ని తరాల పాటు బతికే ఉంటారు.

పౌరాణికాలు అంటే ఎన్టీయారు, అందమైన అమ్మాయి అంటే బాపుగారులాగే కార్టూన్ అంటే ఆర్కే లక్ష్మణే. ఇంత వయసొచ్చి, ఇంత పెద్ద పేపర్లో పని చేస్తున్నా కొన్ని సందర్భాల్లో “నేను పేపర్ కార్టూనిస్టుని” అని పరిచయం చేయగానే… “అంటే ఆర్కే లక్ష్మణ్ లాగానా.. నాకు ఆయన బాగా తెలుసు” అన్న వ్యక్తుల్ని అనేకసార్లు చూశాను. కార్టూనిస్టుకు పర్యాయపదం ఆయన. కార్టూనిస్టుకు ఉండాల్సిన అన్ని లక్షణాలు.. పరిశీలన, విషయ పరిజ్ఞానం,

వ్యంగ్యం, కరవాలం లాంటి  రేఖలు… అన్నింటికీ మించి రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద contempt (తూష్ణీభావం) పుష్కలంగా కలిగిన సంపూర్ణ వ్యంగ్య చిత్రకారుడు.

కార్టూనిస్టుగా ఆయన నా గురువు అని చెప్పను కానీ, కార్టూన్ ఎలా ఉండాలో ఆయన్ను చూసి అర్థం చేసుకున్నా. ఒకరోజు ఆలస్యంగా వచ్చే Times of Indiaలో ఆయన తాజా కార్టూన్ ను అపురూపంగా చూసుకున్న సందర్భాలు ఎన్నో.

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మీద ఈ రెండు కార్టూన్లు ఒక రకంగా ఆయన ధోరణిని ప్రతిబింబిస్తాయి. ఇందిర మీద కార్టూన్ చూడండి. ఆ నిలబడ్డ ఏబ్రాసి ముఖాలు, ఇందిరా గాంధీ posture ఒక అత్యంత ప్రతిభావంతుడికి మాత్రమే సాధ్యం.

ఇప్పుడవి అనేక కార్టూన్లలో ఒకటి అనిపించొచ్చు. కానీ, అది అచ్చులో వచ్చిన సందర్భం, timing పడి పడి నవ్వించాయి.

r k laxman 1

50కి పైగా ఏళ్ళ పాటు నిరంతరంగా ఆయన చేసిన పనిని తూకం వేయడం ఇక్కడ సాధ్యం కాదు. ఆయన గురించి నాకున్న complaint.. యాభై ఏళ్ళ పాటూ ఒకే ధోరణిలో కార్టూన్లు వేయడమే. అందరి జీవితాల్లో లాగే కళాకారుడి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి. అనుభవాలు, చదువు, సమాజం కళాకారుడి కళ మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. వాటి తాలూకు ఎదుగుదలో, క్షీణతో కళలో కనపడి తీరుతాయి.

r k laxman 2

ఆర్కే లక్ష్మణ్ లో ఆ మార్పు దాదాపు శూన్యం. ఆయన అభిప్రాయాలు కానీ, ధోరణి కానీ మారలేదు. అందుకే ఆయనను అర్థం చేసుకోవడం కష్టం కాదు. నాకీ కార్టూన్ అర్థం కాలేదు అని ఎవరూ అన్న సందర్భమే లేదు. ఆయన బలహీనత అని నేననుకున్నదే ఆయన గొప్ప బలం. ఆయన సామాన్యుడి కార్టూనిస్టు.

-సురేన్ద్ర

విదూషక బలి

 

"నీకు ఉజ్జోగమిస్తాను కానీ, నీ.. నీ.. టై రంగు నాకు నచ్చలేదు’’

“నీకు ఉజ్జోగమిస్తాను కానీ, నీ.. నీ.. టై రంగు నాకు నచ్చలేదు’’

కత్తికంటే కుంచె శక్తిమంతమని మరోసారి తేలింది. ఆ వెర్రిబాగుల కార్టూనిస్టుల కుంచెలను మూయించడానికి నీకు ఏకంగా కలాష్నికోవ్ రైఫిళ్లు, షాట్ గన్లు, రాకెట్ లాంచర్లు కావాల్సి వచ్చింది. విదూషకులు కదా, పాపం తమ వెక్కిరింతలకు ప్రాణాలనే పణంగా పెట్టాల్సి వస్తుందని తెలుసుకోలేకపోయారు !

వాళ్లేం చేశారు? ‘నా మతాన్ని, నా ప్రవక్తను కించపరిచారు’ అంటావు, అంతేకదా. కానీ వాళ్లు నువ్వు నరనరానా ద్వేషించే అమెరికా వాడిని, వాడి యూరప్ తొత్తులనూ పరమ అసహ్యంగా గేలి చేశారు కదా. నీ మతదేశాల్లోనే కాకుండా లోకంలోని కష్టజీవులందరి శ్రమఫలాలను దోచుకుంటున్న కేపిటలిస్టుల ముఖానా కాండ్రించి ఉమ్మేశారు కదా. నువ్వు మండిపడే క్రైస్తవ మతపెద్దల బట్టలనూ విప్పేశారు కదా. ఒక్క క్రైస్తవాన్నేనా.. యూదుమతాన్నీ, జాతిపిచ్చి మతాన్నీ, జనాన్నిఆరళ్లుపెట్టే సామ్రాజ్యవాద మతాన్నీ, అవినీతిరాజకీయ మతాన్నీ, మెట్రోసెక్సుమత్తు మతాన్నీ, బాసిజపు మతాన్నీ, నాటోదాడుల మతాన్నీ వాంతికొచ్చేలానూ ఎండగట్టారు కదా. ఇవన్నీ నీకు తెలియదనుకోను. నిజం చెప్పు, నువ్వు కూడా ఆ విదూషకుల బొమ్మలను నీ తుపాకీ మడమపై ఉంచుకుని చూసే వేళ ముసిముసిగా నవ్వుకోలేదా?

ఫ్రాన్స్ లో నీ మతం వాళ్లపై వేధింపులు పెరుగుతున్న మాట నిజమే. రైట్ వింగూలూ, నయా జాత్యున్మాద నేషనల్ ఫ్రంట్లూ జడలు విప్పుతున్నదీ, నీవాళ్లను గెంటేయాలని, కొత్తవాళ్లను రానివ్వకూడదని వెర్రిగా అరుస్తున్నదీ నిజమే. చమురు కోసం నీ మతదేశాలపై, అక్కడి నీ అమాయక ప్రజలపై ఫ్రాన్స్ సహా చప్పన్నారు పడమటి దేశాలు దాడులు చేస్తున్నదీ నిజమే. నువ్వు చిదిమేసిన ఆ  కార్టూనిస్టులు తెలిసో తెలియకో తమ పిచ్చి బొమ్మలతో  ఆ దేశాలకు వకాల్తా పుచ్చుకున్నట్లు అనిపించిందీ నిజమే…

అందుకు పగతీర్చుకోడానికి ఆ పిచ్చుకలపై తుపాకీ ఎక్కుపెడతావా? పోనీ ఆవేశంలో పొట్టనబెట్టుకున్నావులే అని సరిపెట్టుకుందామనుకున్నాను, కానీ వీలుకాలేదు. మొన్నటికిమొన్న పెషావర్ ఆర్మీ స్కూల్లో నువ్వు ముక్కుపచ్చలారని 130 మంది పిల్లల నెత్తురు కళ్లజూసినప్పుడు నీకు గట్టిగానే చెప్పాను కదా, చెవికెక్కలేదా? ఆ నెత్తురింకా ఆరకముందే మరింత అమాయకపు నెత్తురును ఒలికించేశావు కదయ్యా!

Karnika Kahen

సహనం నశిస్తోంది మిత్రమా. నీది పెడదారి అని గోబెల్స్ లు చేస్తున్న ప్రచారం నిజమేనేమోనని నమ్మాల్సి వస్తుందని భయంగా ఉంది. నీతో కొన్నిపేచీలు ఉన్నా దుర్మార్గపు మహాకాయపు రాక్షస గోలియత్ ను వడిసెలతో ఎదుర్కొంటున్న నీ సాహసాన్ని చూసి ముచ్చటపడ్డాను. నీకు రాళ్లందిస్తూ సాయంగా ఉందామనుకున్నాను. కానీ ఇక సాధ్యం కాదేమో. నీ కసిలో ఉన్మాదం పాళ్లు పెరిగింది. నీ ప్రతిఘటన పక్కదారి పట్టింది. నీ గురి పూర్తిగా తప్పింది.

ఆ నెత్తురొలికిన కుంచెల సాక్షిగా ఓ మాట చెబుతున్నాను, బాగా విను. కళ్లు మరింత బాగా తెరువు. గురి చెదరనీకు. శత్రువెవడో, మిత్రుడెవడో, తటస్థుడెవడో మరింత బాగా తెలుసుకో. ప్రాణాలు కాపాడుకోవడానికే తుపాకీ పట్టినవాడివి కనక ప్రాణం విలువ నీకు బాగా తెలుసు. అందుకే నీది ధర్మాగ్రహమంటున్నాను. వ్యర్థ బలులను అల్లా కూడా ఒప్పుకోడు. విదూషకుల బలులను అసలెంతమాత్రం ఒప్పుకోడు.. ! ! !

(ప్యారిస్ లో ఈ నెల 7న వ్యంగ్యపత్రిక ‘షార్లీ హెబ్దో’ కార్యాలయంపై దాడిలో బలైన ప్రధాన సంపాదకుడు, కార్టూనిస్టు షార్బ్(47), కార్టూనిస్టులు కాబూ(76), హనోర్, వోలిన్ స్కీ(80), కాలమిస్టులు, పత్రికా సిబ్బంది, ఇతరులకు నివాళిగా..)

                                                              –  పి.మోహన్

Balachander – A Eulogy

 చిత్రరచన: బంగారు బ్రహ్మం

 

ismail“జీవితం సినిమా కాదు”

-ఇది ప్రతి ఒక్కరూ విన్న డైలాగే, కానీ కొన్ని జీవితాలు సినిమాలను చూసి నడక సాగిస్తాయి, కొన్ని జీవితాలు సినిమా కథలుగా మారతాయి. నా విషయంలో మొదటిదే నిజమయ్యింది. ‘మరోచరిత్ర’ అనే సినిమా, నా జీవితంలోని కీలక మలుపులకు-అప్పుడు నేను తీసుకొన్న నిర్ణయాలకు కారణభూతమయ్యింది. ఆ సినిమా కథ పుట్టింది ఓ మేధావి మస్తిష్కంలో. ఇప్పుడు ఆ వ్యక్తి కానరాని తీరాలకు సాగిపోయారు.

బాలచందర్ ఇక లేరు!

ఏ మనిషయినా భౌతికంగా ఇక మనకు కనబడరు అంటే ఆ భావనే మనకు బాధ కలిగిస్తుంది. అంతే కదా… కానీ జీవితంలో ఒక్కసారైనా చూడని మనిషి పోతే దు:ఖం ఎందుకు కలుగుతుంది? ఆ మనిషి ఏదో ఒక రూపంలో మనల్ని ప్రభావితం చేసి ఉంటారు కాబట్టి . నా వరకు అలా నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులలో బాలచందర్ ఒక్కరు.

తెలుగు, కన్నడ, తమిళ సినీరంగాల్లో వందకు పైగా సినిమాలకు రచయితగా పనిచేసి, ఎనభై పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో ‘మరోచరిత్ర’, ‘ఆకలిరాజ్యం’, ‘అంతులేని కథ’, ‘ఇది కథ కాదు’, ‘రుద్రవీణ’ వంటి కళాఖండాలను అందించిన దిగ్దర్శకుడాయన. అలాగే చలనచిత్ర పరిశ్రమకు ఒక ‘కమల హాసన్’ ను, ఒక ‘రజనీ కాంత్’ను అందించిన కళాస్ప్రష్ట. ఆ మధ్య ఓసారి నా మార్కెట్ విలువ కొన్ని వందల కోట్లు అన్నారాయన…ఈ ఇద్దరినీ గుర్తుపెట్టుకొని.
తన కథలలో నాయకులకు కాకుండా కథకే పెద్ద పీట వేసిన వ్యక్తి. సాధారణ వ్యక్తుల్లోని అసాధారణ ప్రజ్ఞను గుర్తించి, దాన్ని సానబెట్టి ప్రకాశింపచేసిన మార్గదర్శి. ఇందుకు మరో ఉదాహరణ ‘మరోచరిత్ర’    కోసం ఆయన ఎంపిక చేసిన ‘అభిలాష’. పెద్ద పెద్ద కళ్లున్న ఈ పదో తరగతి చదివే అమ్మాయిని ‘సరిత’ గా పరిచయం చేసారు. అద్భుతమైన నటనే కాకుండా మరెంతో అందమైన వాచకం కలిగిన ఈమె, ఆ తర్వాత  ఎందరో హీరోయిన్లకు తన గాత్రాన్ని అరువిచ్చింది.
  ‘కన్నెపిల్లవని కన్నులున్నవని’ , ‘సాపాటు ఎటూ లేదు, పాటైనా పాడు బ్రదర్’ , ‘అరె ఏమిటి లోకం’, ‘తాళి కట్టు శుభవేళా’ , ‘మౌనమే నీ భాష ఓ మూగమనసా’ , ‘ ఏ తీగ పువ్వునో..’, ‘జూనియర్ …జూనియర్… అటు ఇటు కాని హృదయము తోటి’… వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు రాసే అవకాశం తన కథల ద్వారా “ఆచార్య ఆత్రేయ” గారికి కల్పించారు.

తన కథల్లో తొంగిచూసే నిజాయితీ, ఆ కథ ఎలాంటిదయినా ప్రతి సినిమాను ఓ ‘cult classic’గా నిలబెట్టే సత్తా ఉన్న దర్శకుడు బాలచందర్ గారు. సమస్యల వలయంలో చిక్కుకున్నా, చెరగని మధ్యతరగతి మందహాసాన్ని తెరకెక్కించిన ఘనుడు. ఇప్పుడు ఆ విలువలు మనం గుర్తించకపోయినా వాటిని వెండితెరపై అజరామరం చేసిన సృజనాత్మక ఋషి.

 

పుట్టిన ప్రతి వారు ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకోక తప్పదు. కానీ తనకంటూ ఓ స్థానమేర్పరచుకొని, తన ఆలోచనల ద్వారా పది మందిని ప్రభావితం చేయడం కొద్ది మందికే దక్కే అదృష్టం. కళకు పరమావధి అదే. మామూలు ‘సినిమా’ను  గొప్ప కావ్యాల సరసన, సాహిత్యం సరసన నిలబెట్టగలిగే దమ్మున్న దర్శకుడు ఇక లేడు.

Sir, we are going to miss you, but I celebrate your life today. adios!

-ఇస్మాయిల్ పెనుకొండ

చిత్రం: బంగారు బ్రహ్మం

మాండొలిన్ ఇప్పుడు వొంటరి మూగ పిల్ల!

         srinivas-01

మాండొలిన్ తీగల మాయాజాలానికి తెర పడింది. కణకణంలో కర్పూర పరిమళాల తుఫానుల్ని రేపే కమనీయ వాద్యమొకటి పైలోకాలకు పయనమైంది. ఏ తంత్రులనుండి వెలువడే రాగాలను వింటే వసంత సౌఖ్యాలు మన చెవులనూ మనసునూ కమ్ముకుంటాయో, ఏ చేతివేళ్లు తీగలమీద విద్యుల్లతల్లా నర్తిస్తుంటే స్వరఝంఝలు ఉవ్వెత్తున ఎగసి నాట్యమాడుతాయో, ఏ నాదవైభవం నిండిన నదీతరంగాల మీద తెప్పలా తేలిపోతుంటే జీవనసార్థక్య భావన హృదయపు లోతుల్లోకి ఇంకిపోతుందో, ఆ తీగల చేతుల తరంగాల మెస్మరిజం మనకిక లేదు.

పాలకొల్లులో ప్రభవించిన పసిడిరాగాల పాలవెల్లీ. నీ మరణవార్తకన్న పిడుగుపాటు ఎంత మృదువైనది! బ్రతుకుబాటలో మధ్యలోనే కూలిన సంగీత శిఖరమా. నీ మాండొలిన్ స్వరాల విందుకు దూరమైన అసంఖ్యాక రసికుల దురదృష్టాన్ని ఏమని వర్ణించడం. నీ పాదాలకు ప్రణమిల్లితే తప్ప నివాళి అన్న పదానికి నిజంగా అర్థం వుందా. సరస్వతీ పుత్రుడా, శయనించు హాయిగా స్వర్గసీమలోని శాంతిపవనాల నడుమ.

*         *         *

మాండొలిన్ శ్రీనివాస్ ప్రతిభకు నోరెళ్లబెట్టని సంగీత రసికులుండరంటే అది అతిశయోక్తి కాదు. అసలు మాండొలిన్ అనేది ఒక పాశ్చాత్యసంగీత వాద్యం. దానిమీద పాశ్చాత్య సంగీతాన్ని పలికించడమంటే ఏమో అనుకోవచ్చు. కాని శుద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నిసర్గసౌందర్యంతో – అదీ అత్యంత పిన్న వయసులో – ధారాళంగా జాలువారించటం ఊహకందని ప్రతిభాపాటవాలను సూచించే విషయం. పూర్వం ఈమని శంకర శాస్త్రి గారు కమ్ సెప్టెంబర్ సినిమాలోని ఇంగ్లిష్ పాటలను వీణ మీద పలికించటం గురించి సంగీత రసికులు ఉత్సాహంగా మాట్లాడుకునేవారు.

మాండొలిన్ శ్రీనివాస్ సంగీతాన్ని ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్లు మళ్లీమళ్లీ వింటూ నాదసాగరంలో ఓలలాడానో లెక్క లేదు. నళిన కాంతి రాగంలో ఆయన వాయించిన ‘మనవి యాలకించ’ అద్భుత కౌశలానికి నిదర్శనం. కలియుగ వరదన (బృందావన సారంగ రాగం) అనే మరో కృతి అత్యంత మనోహరమైనది. రేవతి రాగంలో ఒక జావళిని కూడా ఆయన గొప్పగా వాయించాడు (ఈ రాగానికి హిందుస్తానీ శైలిలో బైరాగీ భైరవ్ అని పేరు). మార్గళి సంగీతోత్సవంలోనో లేక త్యాగరాజ ఆరాధనోత్సవంలోనో ఒకసారి ఒకే వేదిక మీద శ్రీనివాస్, అతని అన్న అయిన రాజేశ్ ఇద్దరూ కలిసి యుగళవాద్య కచేరీ ఒకటి చేసారు. కచేరీ మధ్యలో తన తమ్ముడు శ్రీనివాస్ పలికించిన అద్భుత తంత్రీనాదానికి ముగ్ధుడైన రాజేశ్ వెంటనే అతనికి సల్యూట్ చేయడం రెండుమూడేళ్ల క్రితం యూ ట్యూబ్ లోని విడియో క్లిప్ లో వీక్షించాను. ఆ విడియో మాత్రమే కాక మరికొన్ని మంచి విడియోలు శ్రీనివాస్ వి ఇప్పుడు యూ ట్యూబ్ లో లేవు. కారణం తెలియదు. శ్రీనివాస్ వాయించిన మంచి నంబర్స్ ను వరుసగా పేర్కొంటే ఒక పెద్ద జాబితా తయారవుతుంది. స్వరరాగ సుధా (శంకరాభరణం), సిద్ధి వినాయకం (మోహన కల్యాణి), మామవ సదా జనని (?కానడ), సరసిజాక్ష (కాంభోజి), నిరవతి సుఖద (?కదన కుతూహలం), ఇంతకన్నానందమేమి (బిలహరి), రఘువంశ సుధాంబుధి (కదన కుతూహలం), దరిని తెలుసుకొంటి (శుద్ధ సావేరి) నారాయణతే నమో నమో (బేహాగ్), నగుమోము (అభేరి), బంటు రీతి (హంసనాదం), గజవదన – ఇలా ఎన్నెన్నో.

అంతటి అనన్య ప్రతిభను సొంతం చేసుకోవటం మానవమాత్రుల వల్ల అయ్యే పని కాదనిపిస్తుంది. ఆయన మరో రెండుమూడు దశాబ్దాల పాటు జీవించి, అతని బ్రతుకు సాఫీగా సాగివుంటే భారతరత్న పురస్కారాన్ని కూడా దక్కించుకునేవాడేమో.

                                                                  –  ఎలనాగ

elanaga

 

 

 

స్త్రీల సాహిత్యంలో సరికొత్త చైతన్యం ప్ర.ర.వే.

banner31

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక – ప్ర.ర.వే- ఇటీవల ఒక సాహిత్య చైతన్య కెరటం. వెల్లువలా రచయిత్రులని సమీకరించిన మేలుకొలుపు గీతం. ప్రాంతీయ స్థాయిలో మొదలైన ఈ వేదిక ఇప్పుడు జాతీయస్థాయిలో జయకేతనం ఎగరేయబోతోంది. ఈ విజయోత్సవ వేళ వేదిక నేతలతో సారంగ ముఖాముఖి.

1. ప్రప్రరవే మొదలుపెట్టి ఎంత కాలమయింది? ఈ సదస్సు లో ఎంత మంది సభ్యులున్నారు?

unnamedపుట్ల హేమలత :

2008 జనవరి 10,11తేదీల్లో అనకాపల్లి లో జరిగిన చర్చావేదిక ప్రరవే’ ఏర్పాటుకు నాంది పలికింది .
ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి రచయిత్రుల్ని అనకాపల్లి ఆహ్వానించి రెండు రోజులు చర్చలు జరుపుకున్నాం. ఆ సభల్లో స్త్రీవాద ఉద్యమాలు , స్త్రీలకు సంబంధించి అన్ని అస్తిత్వ వాదాలను గుర్తించి కలిసి పని చేయటం, స్త్రీల పై జరుగుతున్న దాడులకి వ్యతిరేక పోరాటాలు చేయటం , రచయిత్రులంతా ఎవరి అస్తిత్వాల్ని,భావజాలాన్ని వాళ్లు కాపాడుకుంటూ ఒకే వేదికపై కలిసి పని చేయటం అనే అంశాలపై సాధ్యా సాధ్యాల గురించి మాట్లాడుకోవటం జరిగింది . అనేక చర్చలు, అభిప్రాయాల అనంతరం దామాషా పద్దతి ప్రకారం అన్ని వర్గాల నుంచి అధ్యక్షులు, కార్య వర్గ సభ్యుల్ని ఎన్నుకోవటం జరిగింది . ఆ తాత్కాలిక కమిటీని ‘ మనలో మనం’ అని పిలుచుకున్నాం . దాన్నే ‘ ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక’గా రూపొందించుకొని ఇప్పటి వరకు విజయ వంతంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం . ఇప్పటికి ఈ వేదికలో వంద మంది వరకూ సభ్యులున్నారు. ఈ జాతీయ సదస్సు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరింతమంది సభ్యులు పెరుగుతారు. దీని ఫలితంగా స్త్రీల సమస్యలపై మంచి అవగాహన , కార్యక్రమాలు , ఆలోచనాత్మకమైన సాహిత్యం వెలువడే అవకాశం వుంది.

 

dscn0414

2. ప్రఇప్పటి వరకూ వేదిక ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించింది ?

DSC04676మల్లీశ్వరి :

2009 జనవరి 10,11 తేదీల్లో అనకాపల్లి లో మొదటిసారిగా ” సవాలక్ష సవాళ్ళ మధ్య భిన్న అస్తిత్వాలు – ఒక ఉమ్మడి ఆకాంక్ష ”, ” గతానుభవాలు ఎలాంటివైనా ఆశ లెపుడూ నిత్య నూతనమే ” అన్న ఆశతో అవగాహనతో ఉత్తరాంధ్ర రచయితలు, బుద్ధిజీవులు మనలో మనం నిర్వహణ కమిటీగా ( కె. ఎన్. మల్లీశ్వరి, కె. అనురాధ, ఇ పి యస్ భాగ్యలక్ష్మి, వర్మ, నారాయణ వేణు ) ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రచయిత్రులతో సంభాషణ చేసారు. అందరి ఆలోచనలూ ఒక్కటి కావడంతో వందమందికి పైగా రచయిత్రుల చర్చల ఆలోచనల అనంతరం మనలో మనం తాత్కాలిక కమిటీ ఏర్పడి కాత్యాయనీ విద్మహే ప్రతిపాదనను అంగీకరించి ఒక సంవత్సరం పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాహిత్య సదస్సులను నిర్వహించింది.

 

IMG_0109

దళిత , తెలంగాణా స్త్రీల అస్తిత్వ సాహిత్యం పై వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో, ముస్లిం, రాయలసీమ స్త్రీల అస్తిత్వ సాహిత్యం పై కడప యోగి వేమన విశ్వ విద్యాలయంలో, బిసి,క్రైస్తవ మైనార్టీ, కోస్తాంద్ర స్త్రీల సాహిత్యంపై గుంటూర్ నాగార్జున విశ్వవిద్యాలయంలో సదస్సులను జరుపుకుని తిరిగి ఉత్తరాంధ్ర చేరుకొని , గిరిజన , ఉత్తరాంధ్ర స్త్రీల అస్తిత్వ సాహిత్యం పై ఆంధ్ర విశ్వవిద్యాలయం లో సదస్సుని నిర్వహించాము. అదే రోజు 2010 ఫిబ్రవరి 28వ తేదీన మనలో మనం తాత్కాలిక కమిటీ రద్దయ్యి ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పడింది. రంగనాయకమ్మ తో చర్చా కార్యక్రమం , అరుంధతీ రాయ్ తో గోష్టి లాంటి వాటితో పాటు నరసాపురం వై ఎన్ కళాశాలలో , రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయంలో, వరంగల్ కాకతీయలో ముమ్మారు, ఒంగోలులో, ఇంకా అనేక చోట్ల స్త్రీల సాహిత్యంపై అనేక రచయిత్రుల సహకారంతో సదస్సులు నిర్వహించుకున్నాము. ఇదంతా ఒకవైపు అకడమిక్ గా జరిగిన కృషి అయితే మరోవైపు దేశ వ్యాప్తంగా జరుగుతున్న అనేక సామాజిక ఉద్యమాలతో స్త్రీల సాహిత్యాన్ని అనుసంధానించాలన్న ఆశయంతో కొంత కృషి చేసాము . ముజఫర్ నగర్ మారణ కాండ, నిర్భయ ఘటన , వాకపల్లి అత్యాచార ఉదంతం, సోంపేట కాల్పుల ఘటన ,లక్షిం పేట దళితులపై దాడి, ఉత్తరాంధ్ర లో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనుల పోరాటాలకు సంఘీభావంగా నిలబడటం, రాష్ట్రవ్యాప్తం గా మైనింగ్ కి వ్యతిరేకంగా పోరాడటం , రాష్ట్ర విభజన సమయంలో ఒక చర్చా కార్యక్రమం ద్వారా రెండు ప్రాంతాల రచయిత్రులూ కలిసి మాట్లాడుకుని చిన్న చిన్న అపోహలను తొలగించుకుని తమ ప్రణాళికలో రాసుకున్నట్లుగానే తెలంగాణా ఏర్పాటును స్వాగతించడం లాంటి కార్యక్రమాలు జరిగాయి. కొత్త తరాన్నిగుర్తించడంలో భాగంగా ఉత్తరాంధ్రలో ఇంపాక్ట్ స్టడీ సర్కిల్ ఏర్పాటుకి తన పూర్తి సహకారాన్ని అందించింది సాహిత్యం ప్రధాన రంగం కనుక సామాజిక చలనాలను వివిధ ప్రక్రియల ద్వారా అక్షర బద్ధం చేయడం, వీధినాటకాల ద్వారా సామాన్య ప్రజలకు చేరువలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాము. రచనా శిల్పం మీద కొంత చర్చ ,కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో దాని మీద కూడా ధ్యాస పెడతాము.

3. ప్ర ప్రరవే ప్రచురణల వివరాలు చెప్తారా?

DSC04676మల్లీశ్వరి :
ప్రచురణ రంగంలో ప్రరవే అవసరానికి,ఆసక్తికి,బాధ్యతకి తగినంత కృషి చేసిందని చెప్పలేము. కానీ తన ఆర్ధిక శక్తికి మించి ప్రచురణలు చేసింది. వివిధ సెమినార్లు,వివిధ సాహిత్య సామాజిక సందర్భాల్లో ఇంచుమించు 300 వందల వరకూ వ్యాసాలు వెలువడ్డాయి. కథ, కవిత్వం లాంటి సృజనా తక్కువేమీ కాదు.
ఇప్పటి వరకూ 5 పుస్తకాలు ప్రరవే ప్రచురణలుగా వెలువడ్డాయి.

కవిని – పోరాడితేనే రాజ్యం -తెలంగాణా ఉద్యమ గాధలు
మల్లీశ్వరి – మల్లీస్వరం – సాహిత్యవ్యాసాలు , కాలమ్స్
మల్లీశ్వరి – ఓల్గా నవలలు – ప్రభావశీలత – పరిశోధనా గ్రంథం
అనిశెట్టి రజిత, బండారు విజయ – ముజఫర్ నగర్ మారణ కాండ- నిషిద్ధ మేఘాల్లోకి మా యాత్ర
అనిశెట్టి రజిత,కొండేపూడి నిర్మల,శివలక్ష్మి, టి.నళిని,కె. సుభాషిణి సంపాదకులుగా – అగ్నిశిఖ – స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి రచయిత్రుల స్పందన –
సంకలనం

4. ప్ర ఇప్పటివరకు రాష్ట్ర స్థాయి లో ఉన్న ప్రరవే ఇప్పుడు జాతీయ స్థాయి కి ఎదిగిందని ఈ సదస్సు ప్రకటన వివరాలు చూస్తె తెలుస్తోంది . ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ స్థాయి లో సమావేశాలు నిర్వహించటం ఇదే మొదటి సారా?

dscn0573కాత్యాయని విద్మహే :

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ట్ర స్థాయి నిర్మాణం గా ప్రారంభం అయిందే కానీ రాష్ట్రానికి పరిమితం కాదు . ప్రజాస్వామిక చైతన్యంతో తెలుగులో రాస్తున్న స్త్రీలు ప్రపంచం లో ఎక్కడ ఉన్నా దీనిలో సభ్యులు కావచ్చు . వేదిక లక్ష్యాలకు ,విలువలకు అనుగుణం గా తమ తమ ప్రాంతాలలో పని చేయవచ్చు . ఇతర రాష్ట్రాలలోని తెలుగు రచయిత్రులతో పరిచయాలు పెంచు కొనాలని ,అక్కడ వేదిక శాఖలు ఏర్పడేలా చూడాలని ముందు నుండి అనుకుంటున్నదే . అయితే అందుకు సమయం ,సందర్భం తెలంగాణా రాష్ట్రం ఏర్పడటం తో కలిసి వచ్చాయి. 2014ఏప్రిల్ లోఒంగోలు లో జరిగిన రెండవ మహా సభలో రెండు రాష్ట్రాలకు రెండు శాఖలు ఏర్పడటంతో ఇది జాతీయ స్థాయి వేదిక అయింది . ఢిల్లీ సాహితీ మిత్రుల సహకారం తో ఇప్పుడిలా జాతీయ స్థాయిలో మొదటిసారి సమావేశాలు నిర్వహించ గలుగుతున్నాం .

 

1078762_311578862328506_6767211798998622755_o

5. ప్రఈ జాతీయ సదస్సు లో ఓల్గా, మృణాళిని, కుప్పిలి పద్మ, ఎం. విమల లాంటి వారు తప్ప మిగతా వారంతా మీ ప్రరవే సభ్యులే కదా! సాధారణం గా ప్రరవే సభ్యులు కాని రచయితలకు మీ సదస్సు లలో పాల్గొనే అవకాశం ఉంటుందా?

dscn0573కాత్యాయని విద్మహే :

అవును . ప్రరవే సభ్యులే . ఆసక్తి తో, ఉత్సాహంతో, ప్రరవే నిర్మాణం లో భాగమై పనిచేస్తున్న వాళ్ళను స్త్రీల సాహిత్య అధ్యయన విశ్లేషణలో సుశిక్షితులను చేసుకొనటం ,మరీ ముఖ్యంగా ఆదిశలో కొత్త తరాన్ని తయారు చేసుకోనటం అవసరం అని వేదిక భావిస్తుంది . అందుకే ఒక్కొక్క సమావేశం లో కొందరు సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తుంది .సాధారణం గాఒక సదస్సు అనుకున్నప్పుడు ఆయా అంశాలలో నిష్ణాతులైన వారిని గుర్తించి ఆహ్వానించటం జరుగుతుంది . వాళ్ళను వినటం ద్వారా ప్రరవే సభ్యుల జ్ఞాన చైతన్యాలు వికసిస్తాయి అని మా నమ్మకం . ప్రరవే సభ్యులు కాని వాళ్ళు ఆ రకం గా మా సదస్సులలో పాల్గొంటుంటారు .

6. ప్రఈ భారతీయ భాషల స్త్రీల సాహిత్యం అనేది విశాలమైన అంశం. దాన్ని ఒక రెండు రోజుల సదస్సు కు కుదించటం కొంత ఇబ్బందికరమైన విషయమే . అయినప్పటికీ ఇందులో తమిళం, కన్నడం , ఒరియా లాంటి ముఖ్యమైన భాషల స్త్రీల సాహిత్య ప్రస్తావన లేకపోవటం ఒక ప్రధాన లోపం గా కనిపిస్తోంది. మీరేమంటారు?

unnamedపుట్ల హేమలత :
ఈ ప్రశ్నకి సమాధానం మీ ప్రశ్న లోనే వుంది కల్పన గారూ! రెండు రోజుల వ్యవధిలో జరుగబోయే అయిదు సమావేశాల్లో బెంగాలీ , హిందీ. మలయాళం, మరాఠీ , తెలుగు భాషల సాహిత్యాన్ని పరిచయం చేస్తున్నాం .ఈ సభల్ని డిల్లీ తెలుగు సంఘం వారు , ప్రజా స్వామిక రచయిత్రుల వేదిక, కేంద్ర సాహిత్య
అకాడెమీల సంయుక్తం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం .
ఈ సభల ముఖ్యోద్దేశ్యం తెలుగు మహిళల సాహిత్యాన్ని, భావజాలాన్ని,వివిధస్త్రీవాదఉద్యమసాహిత్యాన్ని మన తెలుగు రచయిత్రుల గళం తోనే దేశ రాజధాని వేదిక మీద వినిపించటం . ఆ ప్రాంతానికి తగినట్టుగా మరాఠి , బెంగాలీ , హిందీ భాషా సాహిత్యాల పరిచయంకూడా జరుగుతుంది . దక్షిణాది నుంచి తెలుగు మలయాళం భాషల సాహిత్యం ఎలాగూ ఉంది . భారత దేశంలో అన్ని ముఖ్యమైన భాషలలోను స్త్రీల సాహిత్యం విస్తృతంగా వచ్చింది. ఆ మాటకొస్తే అస్సామి , ఉర్దూ భాషల్లో కూడా బోలెడంత స్త్రీ సాహిత్యం ఉంది .ఏ భాషలో స్త్రీవాద సాహిత్యం వచ్చినా అధ్యయనం చేసి తీరాల్సిన విషయమే.
మీరుచెప్పిన దక్షిణాది భాషల సాహిత్యాన్ని ఈ సదస్సులో ఇప్పటికి పెట్టలేక పోవటం పెద్ద లోటే అనిపించినా కూడా ప్రరవే భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు అనేకంచేపట్టగలదని భావిస్తున్నాను.అప్పుడు తప్పని సరిగా అన్ని భారతీయ భాషలలో సదస్సులు ఏర్పాటు చేసే ఉద్దేశం వుంది .

7. ప్ర గతం లో స్త్రీవాద ఉద్యమ తోలి దశ లో అన్వేషి, అస్మిత లాంటి సంస్థలు స్త్రీల అస్తిత్వ సాహిత్యం కోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహించాయి. మంచి పుస్తకాలు ప్రచురించాయి. వాటికి, ప్రరవే కి సిద్దాంత పరంగా కానీ, ఇతరత్రా గానీ ఎలాంటి పోలిక లేదా వైరుధ్యం ఉన్నది?

DSC04676మల్లీశ్వరి :
అన్వేషి అస్మిత లాంటి సంస్థలు ప్రచురించిన పుస్తకాలు స్త్రీవాద సాహిత్యానికి,ఉద్యమానికి చాలా దోహదపడ్డాయి. విస్మృత చరిత్రలను వెలికితీయడంలో కొత్త తోవలను నిర్మించాయి. స్త్రీవాదాన్ని ఒక ప్రాపంచిక దృక్పథంగా తెలుగు సమాజానికి పరిచయం చేసాయి.

మిత్ర సంస్థల మధ్య పోలికలు, వైరుధ్యాలన్న ప్రశ్నే కొంత ఇబ్బందికరం. ప్రరవే నిర్మాణయుతమైన స్వతంత్ర సంస్థ. ఇప్పటి వరకూ రచయిత్రుల సొంత ఖర్చుతో నడుస్తున్నది. సెమినార్ల నిర్వహణకు విశ్వవిద్యాలయాలూ,కొన్ని కళాశాలలు, ప్రభుత్వ సాహిత్య సంస్థలు, ప్రజాసంఘాలు, సాంస్కృతిక సంస్థల సహకారం తీసుకున్నాము. ఇక్కడ రచయిత్రులు తమకీ, తమ సంస్థ అంతర్గత నిర్మాణానికీ సమాజానికీ,తమ రచనకీ మాత్రమే జవాబుదారులు.

అట్లాగే పార్లమెంటరీ రాజకీయ పార్టీల సభ్యులు , స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అయిన రచయిత్రులకి ప్రరవేలో సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంటుందని నాలుగేళ్ళ కిందటి ప్రణాళికలో రాసుకున్నాము. పాటిస్తున్నాము.

ప్రరవే నిర్మాణం విభిన్నమైనది. జండర్ అస్తిత్వం సమాన సూత్రంగా అణచివేతకి గురైన అస్తిత్వాలకు ఉప అస్తిత్వాలకు దామాషా ప్రాతినిధ్యం ఉండటం వల్ల స్త్రీల మధ్య సమానత్వ సాధనకి బీజాలు పడతాయి అన్నది ఒక అవగాహన. స్త్రీవాదం అన్న మాట స్త్రీలందరి సమస్యలనూ రిప్రజెంట్ చేసేలా లేదని, వాడుకలో దాని పరిధి తగ్గిందన్న విమర్శతో దళిత రచయిత్రులు కొంత చర్చ చేస్తున్నారు.

8. ప్ర మరో ముఖ్యమైన ప్రశ్న –మీ సదస్సు టైటిల్ భారతీయ భాషల స్త్రీల సాహిత్యం నిన్న –నేడు – రేపు. కానీ సదస్సు వివరాలు చూసినప్పుడు కేవలం “ నిన్న “ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు ఉంది. సదస్సు లో ఆఖరి సమావేశం మాత్రమే “ వర్తమాన స్త్రీల సాహిత్యం నేడు- రేపు” కు సంబంధించినది. అందులో వక్తల ప్రసంగ అంశాలు చూస్తే ఒక ప్రధాన లోపం స్పష్టం గా కనిపిస్తోంది. స్త్రీల అస్తిత్వ సాహిత్యం అందులోని సాదృశ్య వైరుధ్యాలు , దళిత స్త్రీల సాహిత్యం, మైనార్టీ స్త్రీల సాహిత్యం, రేపటి స్త్రీల సాహిత్యం, కొన్ని ప్రతిపాదనలు. అస్తిత్వ సాహిత్యం అంటే అందులో వర్తమాన స్త్రీల సాహిత్యం లోని అన్నీ ప్రధాన ధోరణులు వస్తాయి. అయినప్పటికీ ప్రత్యేకంగా దళిత, మైనార్టీ స్త్రీల సాహిత్యం ప్రముఖంగా చర్చించటం బావుంది. కానీ వర్తమాన సాహిత్యం లో ప్రక్రియలకు ( అంటే కథ, కవిత్వం, నవల లేదా సాహిత్య విమర్శ) సరైన చోటు కనిపించటం లేదు . అలాగే సాహిత్య విమర్శా అనేది ప్రధాన అంశం. స్త్రీల సాహిత్యం బలాబలాలు సరైన సాహిత్య విమర్శ వల్లనే తెలుస్తుంది. స్త్రీల సాహిత్య విమర్శ కొంత బలహీనంగా ఉన్నప్పటికీ ఈ సదస్సు లో అసలు స్థానం కల్పిం చకపోవటం గురించి మీరేమంటారు?

 

dscn0573కాత్యాయని విద్మహే :

భారతీయ భాషలలో స్త్రీల సాహిత్యం; నిన్న -నేడు -రేపు అనే శీర్షికతో సదస్సునిర్వహిస్తూ నిన్నకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారేమిటి అన్న్స్ది మీ ప్రశ్నలలో ఒకటి . స్త్రీల సాహిత్య చరిత్ర గతిని నిరూపించటం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. నిన్న అంటే ప్రాచీన యుగమని ,నేడు అంటే ఆధునిక యుగం అని నిర్వచించుకొని ఈ రెండు యుగాలలో వచ్చిన సాహిత్యం ప్రాతిపదికగా రేపటి స్త్రీల సాహిత్య స్వరూప స్వభావాలను సంభావించాలనే తలంపు తో రూపొందించిన సదస్సు ఇది.
ఆధునిక యుగ స్త్రీల సాహిత్యాన్ని విస్తృతి దృష్ట్యా 1857నుండి 2000ల సంవత్సరం వరకు- రెండు సమావేశాలలో చర్చిస్తున్నాం . 2000వరకు సాహిత్యం అంటే అందులో నేటి సాహిత్యం ఉంటుంది కదా! ఇక మిగిలినది 14 సంవత్సరాల కాలం . ఈకాలపు సాహిత్యాన్ని కూడా కవిత్వం ,కధ ,నవల,నాటకం, అని
ప్రక్రియ పరం గా చర్చిస్తే బాగుండేదని మీరు అంటారు . బాగానే ఉండేది కానీ రేపటి సాహిత్యం గురించి ఊహలు ,ప్రతిపాదనలు చేయటానికి అది సరిపోదు . మొత్తంగా స్త్రీల సాహిత్య ధోరణులు ,స్త్రీల సాహిత్యంలో సాధారణంగా ఉండే అంశాలు ,ప్రత్యేకతలు ,దృక్పధాలు ,వాటిల్లోని వైవిధ్యం తెలియటం అవసరం .

గత పది పన్నెండేళ్ళ గా వీటి గురించిన చర్చ సంఘర్షణ ,సంవాదమూ తీవ్రం గ జరుగుతున్నది కనుక ఆ వైవిధ్యం పై దృష్టి పెట్టి ఈ చివరి సమావేశాన్నిఈ విధం గా ఏర్పాటు చేసాం . ఒక సదస్సు కు రూపకల్పన చేసేటప్పుడు వీలయినంతవరకు ఇంతకు ముందు జరిపిన అంశాలు పునరావృత్తం కాకుండా చూసుకుంటాము . 2012 లోప్రరవే మహాసభ సందర్భంగా రెండు దశాబ్దాల (1990-2010) స్త్రీల సాహిత్యం పై- కొందరు రచయిత్రులను ఎంపిక చేసుకొని వారి సాహిత్య విశ్లేషణ లతో – సదస్సునిర్వహించాం . అలాంటి సదస్సులు ఇంకా అనేక మంది రచయిత్రుల రచనలను పరిచయం చేస్తూ జరగాల్సే ఉంది . ప్రస్తుత సదస్సు చట్రంలో అందుకు అవకాశం లేక పోయింది . దళిత బహుజన మైనారిటీ స్త్రీల సాహిత్యం పై పత్రం ఉంది కదా !అందువల్ల లోటు ఉండదనే అనుకుంటాను .

స్త్రీల సాహిత్య విమర్శకు ఈ సదస్సు లో చోటు లేక పోవటం గురించి అడిగారు … స్త్రీల సాహిత్య విమర్శ శ్రద్ధ పెట్టాల్సిన ప్రక్రియ అని మేము కూడా భావిస్తాం .” రెండు దశాబ్దాల స్త్రీల సాహిత్య గమనం గమ్యం అనే సదస్సు (2012)లో స్త్రీల సాహిత్య విమర్శ పై మూడు పత్రాలకు అవకాశం కల్పించాం కూడా . అయితే ఈ సదస్సును సృజన సాహిత్య ప్రక్రియలకే పరిమిత చేసాము . వ్యాసం , విమర్శ ఆలోచనకు సబంధించినవి కనుక వాటిపై ఎప్పుడైనా ప్రత్యేకం గా సదస్సు నిర్వహించాలని అనుకుంటున్నాం .

 

9. ప్ర గత కొద్ది కాలం గా కొందరు రచయిత్రులు స్త్రీ వాద ముద్ర కు దూరం గా ఉండటానికి ఇష్టపడుతున్నారు. అదే తరహాలో రచనలు చేస్తున్నారు కూడా. మరి అలాంటి వారి సాహిత్యానికి మీ సదస్సు లో చోటు ఇచ్చినట్లు నాకు కనిపించలేదు. మీరేమంటారు?

unnamedపుట్లహేమలత :

ప్రరవే సదస్సులో పాల్గొంటున్న రచయిత్రులంతా స్త్రీవాద ముద్ర ఉన్నవారే అని మీరు చెప్పకనే చెప్పారు :) స్త్రీవాద సాహిత్యాన్ని అర్ధం చేసుకోవటంలో సంప్రదాయక పాఠకుల్లోకి ఒక విరుద్ద భావజాలం ప్రవేశించిందేమో అనిపిస్తుంది.శరీర స్పృహ , లైంగిక స్పృహ , స్వతంత్ర భావజాలం వంటి అంశాలు పత్రికల్లో పదే పదే బహిరంగ చర్చకి రావటం ,ఆధునికులు ,అభ్యుదయ వాదులే తీవ్ర విమర్శలు చేయటం వల్ల రచయిత్రులు స్త్రీవాదులమని చెప్పుకోవటానికే భయ పడుతున్నారు . అందువల్లే నేను రచయిత్రిని అని చెప్పుకోవడానికి గర్వ పడేవారు , స్త్రీవాదిని అని చెప్పుకోవటానికి సిగ్గు పడుతున్నారు . తరతరాలుగా స్త్రీల అంగాంగ వర్ణనల్ని,శృంగారాన్ని సాహిత్యం పేరుతో చదువుతున్న సాంప్రదాయ వాదులకి ఈ తరం స్త్రీలు శరీర స్పృహతో తమ మనోద్వేగాలను కవిత్వీకరిస్తే అది వాడ కవిత్వం , నీలి కవిత్వం లా కనిపించింది.మనిషికి శరీరమూ, మనసూ వేర్వేరు కాదు. స్త్రీకి కూడా అంతే. శరీరపు ఉద్వేగాలు, బాధలూ కవిత్వానికి పనికి రావంటే గృహ హింస , ఆసిడ్ దాడులు, చంపి తగలబెట్టటం వంటి చర్యలతో ఎంతో మంది స్త్రీల శరీరాల్ని హింసించినప్పుడల్లా లింగబేధం మరిచి ఎందుకు ఉద్యమాలు చేస్తున్నాం?

దళిత బహుజన , మైనార్టీ స్త్రీల అస్తిత్వ సాహిత్యం రావటం మొదలయ్యాక వారి రచనల్లో కొత్త వస్తువు , ధోరణులు చోటు చేసుకున్నాయి.అట్టడుగు సమాజంలోని స్త్రీల మట్టి బ్రతుకులూ,ఇంటా బయటా అణచివేతలూ ,కాయకష్టం, ఆకలి పోరాటాలూ తమ సొంత గొంతులతో వినిపించారు. ఈ సాహిత్యం చదివి స్త్రీని అర్ధం చేసుకున్న వారు స్త్రీవాదులమని చెప్పుకోవటానికి సిగ్గుపడరు. ఇప్పుడు ప్రరవే తరపున మేము నిర్వహిస్తున్న సదస్సులన్నింటి లో అస్తిత్వ స్త్రీవాదాలు కేంద్రంగా ఎన్నో పత్ర సమర్పణలు జరిగాయి . పత్రాలు సమర్పించిన వారితో పాటు , పాల్గొన్న వారు కూడా స్త్రీ వాదం పై ఒక అవగాహన ఏర్పరుచుకుంటున్నారు . ఆ స్పృహ తో రచనలు చేయటం కూడా జరుగుతూ ఉంది . ప్రతి రచయిత్రీ తన రచనల్లో ఏదో సందర్భంలో తన ఆత్మ గౌరవాన్నీ , హక్కుల్నీ ప్రశ్నించి తీరుతుంది. అందుకని ప్రరవేలో అన్ని వర్గాల రచయిత్రులూ ఉన్నారనే భావిస్తున్నాను.

 

 

Kalpana profile2ఇంటర్వ్యూ : కల్పనారెంటాల

The Controversial Bard: U. R. Anantha Murthy

Nandana Reddi

Nandana Reddy

 

Udupi Rajagopalacharya Ananthamurthy or Ananthu as I affectionately called him was one of the Bards of Indian polity. Not unlike William Shakespeare, the Bard of Avon, he commented on events, ridiculed fundamentalism and mocked authority. From his deeply embedded Socialist convictions he examined modern times through the lens of Democracy. He questioned all things and analysed all motives in the belief that it would lead to a deepening of democracy. On January 26, 2014 he said; “…everything is politics. In a democracy, one has to constantly respond…it is not about what is right in the eternal sense. We’ll have to do some things that are right at the moment. But that is politics and we’ll have to do what is right.” He believed that the role of a watch dog was not a duty that can be abdicated by anyone irrespective of who they were.

 

Our paths first crossed in 1967. I was 15 and though my parents were not in politics they had many friends in the Socialist Party that shared their political beliefs, but also their love for art, music and literature. One day over lunch at our home Shantaveri Gopal Gowda, a long time friend of Ananthamurthy’s and the one who introduced him to Lohia Socialism and shared his passion for Kannada literature, told the story of Ananthamurthy’s novel, Samskara to Dr. Lohia and Madhu Limaye. He said that Ananthu was a Lohia follower [though he had never met Lohia in person]. My parents Sneha and Pattabhi were struck by the story and decided to make it into a film. Dr. Lohia encouraged them and with the help of many talented friends the film was made[1] and Ananthu became a part of the ‘Family Pattabhic’.

 

Interestingly ‘Samskara’ the novel was inspired by a film. When Ananthamurthy was in England he went to see “The Seventh Seal” by the celebrated Swedish Director Ingmar Bergman with his teacher Malcolm Bradbury. Thought it didn’t have subtitles he ‘experienced’ the film and could relate to the plague, the atmosphere of death and the indecision of the Protagonist. There had been a plague in his hometown and he remembered how the upper casts were treated by the doctor while the Dalits were not.

 

Ananthu was intrigued by the fact that time was so linear in the West while in India they ran spirally like an archaeological site where the layers of time were sandwiched together as Ananthu said; “You in England or Europe in order to create the medieval ages, you have to go back to a library and collect all information. But the medieval times are already there in me. They are there in my mother. I can see and feel the 18th century in my mother and the 10th century in my grandmother. Different times in Europe are simultaneously present in India. As we walk the road, we are simultaneously walking the different times[2].

 

Malcolm Bradbury challenged Ananthu to write and apparently the novel ‘Samskara’ was written as my father said; “in four furious days, synchronising with the four day time lapse in the novel. A very great part of the novel reads like a film script. The details and mannerism of the Brahmins are so graphic and visual possibly, due to the influence of the film on the novel. Besides these superficial similarities the novel is brilliantly original.[3]” He wrote it in 1965.

 

The book created a literary sensation in Karnataka and when the film was banned by the Censor Board it sparked a major political controversy. It was finally released in 1970 and won the National Award for Best Film and several International Awards including the Bronze Leopard at Locarno. A. K. Ramanajan Professor of linguistics at the University of Chicago saw the film and said; “If I had seen this film in Chicago, I would have danced in the streets with joy!” In 1976 he translated Samskara into English and began using it as course material. The film was path breaking and ushered in the parallel cinema movement in South India and took Ananthu to the International Stage.

 

Interestingly the controversy around the book was after its publication while the controversy generated by the film died out after its release. My father felt that this had something to do with the treatment of the story in the film. “One major departure of the film from the novel is the later half. In the novel the burning of Narayanappa’s body, takes place halfway through. In a way, the story ends half way through the novel” wrote my father in his paper ‘Literature and Film’. He said; “The interest in the novel is sustained by Praneshacharya meeting Putta and undergoing experiences the exact opposite of his earlier experiences. His previous religious ritualistic Brahminical world is contrasted with the amoral physical world of the Non-Brahmins, with its cock fights, prostitutes and sensual entertainment. The novel’s interest is further sustained by the devise of dramatic irony and black humour where the Brahmins prepare for an elaborate funeral for a non-existing body, which has already been spirited away by the Muslims.” He felt that this will not work in the film. “Both the novel and the film start with the problem of the dead body. If the dead body is disposed of half way through the film as in the novel, the film will lose interest. In the novel, literary devices like dramatic irony could be made use of to keep interest. Not so in the film. The film starts with the conflict of to burn or not to burn the body of Narayanappa. The conflict is resolved in the very end when Praneshacharya returns back to the village to do the cremation. Thus the interest is sustained till the very end.

 

According to Sri A.K.Ramanujan who translated Samskara into English, Samskara is a novel of decadent Hinduism. This is exemplified by the Madhva Brahmin Community’s concern with materialism and greed and their internecine quarrels. Even Praneshacharya, though inspired by noble motives, is forever in the grip of indecision and scarcely shows any leadership. The dead body is a symbol of decadent Hinduism and the Brahmin community is unable even to dispose of it, where as the Muslims cart it away in a jiffy and cremate it. When we made the film, we had no doubt that the Muslims stealing the body and burning it should totally be omitted. There arose a big literary controversy when the book was released. We did not want that to become a communal controversy when the film is released, besides the censors would have certainly objected to it. We tried to tone down the literary controversy that the novel was anti Madhva by ennobling the character of Praneshacharya in the film. Praneshacharya in the book discusses his inner feelings of guilt of doing secretly what Narayanappa did brazenly, but he is unable to tell anyone. In the film by his open confession to Putta, his stature rises immeasurably. The film has a positive ending and Praneshacharya redeems himself by his open confession of his guilt and his new determination to act; that is to cremate the dead body.

 

Strangely ‘Samskara’ has several associations with the lives of both Ananthu and my father. It brought them together, not only on the artistic plane but politically as well. They were both writers with strong political moorings in socialism. They were good friends. When my father was alive they would visit eachother at least once a month to discuss their latest ideas or work. Invariably, the personal intertwined with the intellectual as they both drew heavily from their life experiences. They had much in common and yet were very different beings. Their life in a way mimicked their art – or was it the other way around?

 

Ananthamurthy is considered one of the pioneers of the ‘Navya (new) movement’ in Kannada literature that began with his novel ‘Samskara’ that was a scathing attack on decadent Hinduism and critic of Brahmanism, its superstitions and hypocrisies. My father is considered the father of modern Telugu Poetry as he rebelled against the sweet, rhythmic poetry of Tagore under whom he studied at Shantiniketan and wrote instead about the squalor and filth of Calcutta city.

ANANTHAMURTHY

They both fell in love and married Christians – Ananthu made that a political statement; while my father never did. We, even as their children, were never conscious of the fact that our parents not belonging to the same religion was a daring and courageous step to take in those times. Marrying the person you loved was just the right thing to do!

 

Ananthu who was born on 21 December, 1932 in the village of Melige, in Tirthahalli taluk in Shimoga District, grew up in an orthodox Madhava Brahmin family as the grandson of a priest. His schooling began in a traditional Sanskrit school before he went to the University of Mysore and to Birmingham, England, for a doctorate in English on a Commonwealth Scholarship where he was awarded a doctorate in 1966 for his dissertation on ‘Politics and Fiction in the 1930’s’.

 

The amalgam between politics and his literary expression began early and as he grew older developed into a literary activism very few writers have achieved in history. In a TV interview he stated that “We should not be politically correct – then we are NOT correct. If there are enough people who can swim against the tide, then democracy is safe. Hence political correctness which places all value on the majority is a wrong thing. Even one voice is enough, because ideas have a way of living… We should be able to say whatever is unpleasant…[4]

 

Ananthu was greatly influenced by Lohia’s writings and that was another thread that bound us. Just before Indira Gandhi promulgated a State of Emergency, we saw a lot of Ananthu. My father and mother were shooting ‘Chanda Marutha’ [Wild Wind], an uncanny prediction of things to come. Then my mother passed away after eight months in jail. Ananthamurthy wrote her obituary in which he said; “It is hard to believe that Snehalata is dead at the age of forty-four. She will remain a vivid memory for ….. people from all walks of life: socialist leaders and intellectuals, theatre artists from India and abroad, writers and above all many young people still searching for a meaning and purpose in life. She ….. could never tolerate injustice and ugliness. …..she is one of the martyrs of our age. By her manner of life and death she has redeemed us who have had to live in a state of sin, because of our quietism and indifference in the face of evil.

 

This was perhaps a turning point in Ananthu’s life. The Emergency strengthened his convictions and he became the most vocal secular, socialist voice Karnataka has seen in recent years. Ananthamurthy was greatly influenced by Mahatma Gandhi and Shakespeare during his childhood, which shaped his political and social conscience. He was also a close associate of stalwarts of socialist movement, like Jayaprakash Narayan, Madhu Limaye and Shanthaveri Gopala Gowda.

 

After the Emergency during the Chickmagalur elections where I campaigned against Mrs. Gandhi, Ananthu had been campaigning too and when I was beaten by the police and lay in a semiconscious state he visited me. He was the person who accompanied me back home from the hospital to Bangalore at night shining a torch on my face so the crowds that had gathered could see me.

 

In 2013, he made a statement that in the Mahabharata it is described how the Brahmin community used to eat beef, but this was claimed as baseless by several prominent people like the Pejavar Mutta Swamijee and the Vishwesha Thirtha Swami, Udupi. The Pejavar Mutta also requested Ananthamurthy to reconsider his statement, as it hurt sentiments of a caste, but Ananthamurthy ignored his request.

 

He set off another controversy when he denounced the politics of Gopalkrishna Adiga even though he considered him to be one of the leading poets. He believed that being left of centre was better than being right of centre and that it was important to say these things out loud.

 

Many people create controversies, some unknowingly, some to stay in the news and most out of stupidity, not so in Ananthu’s case. These were not just spontaneous acts based on emotion, not principled responses to situations – even though that may have been the original motivation – but well thought out calculated and sculpted political interventions designed to cause ripples of controversy and debate. This also ensured that the space for democratic dissent remained intact.

 

The controversies reached a new height during the recent elections, when he said he does not want to live in an India where Modi rules. In a telephonic interview with CNN-IBN from his hospital bed in Bangalore, he said; “I won’t live in a country ruled by Narendra Modi. When I was young, I used to criticise Prime Minister Nehru. But, his supporters never attacked us. They always respected our views. Modi supporters are now behaving like Fascists. They are behaving like the Fascists in Germany during Hitler. I don’t want to see a man like Modi in the chair, where once a man like Nehru sat and ruled. I am too old and unwell. If Modi becomes the PM, it will be a big shock to me. I won’t live[5].”

 

Ananthu was gracious enough to attend a screening of Samskara just three weeks before he passed away. He came and spent two hours interacting with Tom Cowan the Australian cinematographer of Samskara, the audience and the press. On the dais he whispered to me about Modi. He was concerned that Modi would bring about a “shift in our civilization.” He said; “I have a feeling that we are slowly losing our democratic rights or civil rights, but much more than that when there is a bully we become cowards.” I added that we were already in a state of emergency, but only this time, Modi did not have to promulgate it – he was doing it through the brute force of his election mandate.

 

That was the last time we met. He was his charming and affectionate self though one could see the strain his illness was having on him. I spoke to him a couple of times after, inviting him to lunch at home, but he could not make it as he was in hospital that day undergoing dialysis.

 

During the last months he often joked about his illness and the extreme cleanliness it imposed on him and those around and compared it to the ‘Madi’ or cleanliness he had to observe in his orthodox Brahmin home as a child where he could not touch anything without washing and bathing

 

The day he died, I went to visit him in hospital with another close friend Dr. Ratna, not knowing that a few hours later he would be no more. He was on a ventilator, but looked so peaceful and serene. We did not want to disturb him so we spent time with Ester, the children and grand children. The doctor’s prognosis was positive, so we left with the hope that he would recover as he had done so many times before. After all he was a fighter!

 

By the time I reached home we got the news that he was no more. He had threatened to leave India if Modi came to power and some members of the Sangh Parivar had bought him a ticket to Pakisthan. Ananthu then recanted his statement and said; “That was too much to say because I can’t live anywhere except India.” Ananthu decided his own departure – not by an Emirates flight, but his own.

 

I said my goodbyes to Ananthu in the privacy of his home the evening he died. I did not want to share that moment with the large crowds that would be part of the State Honours. Ester was inconsolable and I was at a loss for words. What can you say to a partner of more than 50 years, one who cared and watched over him? Despite her own ailments she guarded and protected Ananthu zealously. She was his strength and foundation. Ananthu could not have done what he did without her. Though this was rarely recognized, Ester is the reason for the person Ananthamurthy is.

 

Many were surprised that his last rights were performed according to religious convention. Though Ananthu broke all traditions, his fascination for the spiritual was deeply imbedded and perhaps his inner strength came from this. My father was the same and this was not a contradiction, but an intellectual rejection of the negative aspects of organised religion while pursuing the search for a greater truth.

 

Now Ananthu is in good company – my father and mother, Lankesh, Lohia, Gopal Gowda, Madhu Limaye, Karanth and Ramanujan and many others with whom I am sure he is debating our predicament here in this world.

 

Farewell my dear friend and God speed. May your journey to the other world be safe and adventurous and your search of answers exciting. May the mysteries of the universe unfold and your explorations take on another dimension. We thank you for your legacy – we who remain, will try and keep it alive by taking the struggle forward.

 

[1]T. Pattabhi Rama Reddy /”What Life Has Taught Me” – Deccan Herald November 13 1993
[2] The Inner World of U. R. Ananthamurthy/An interview by Arvind Radhakrishnan, Editor-in-Chief of The Bangalore Review (TBR) and Sudeep Reguna, Executive Editor of TBR/link
[3] T. Pattabhi Rama Reddy/ “Literature and Film”/ Paper presented at the International Seminar on Indian literature and film, September 24-26, 1992 and published in Abhinandana Gandham.

 

 

[4] Interview with Girish Nikam, anchor and senior journalist, in the programme To the Point for Rajya Sabha TV

[5]Telephonic interview with CNN-IBN

 

About Nandana Reddy:

Daughter of Pattabhi, well-known Telugu poet. Pattabhi was also well-known for making the film”samskara.”

Also, Nandana is one of the founders of the Concerned for Working Children (CWC) and is now the Director Development, while heading the consultancy wing Dhruva. She was the Chairperson of the International Working Group on Child Labour (IWGCL).

ఒక శ్రీశ్రీ, ఒక పాణిగ్రాహి, ఒక చెరబండరాజు తరవాతి తరం…

నీవెవరు?

  • పాంచభౌతిక విగ్రహులు

    ఏమని చెప్పగలరు!

    జీవితకాలంలో

    ఒక్కసారైనా

    ధ్వనించే అడగని ప్రశ్న?

    అందుకేనేమో

    కొన్ని కవితాతరువులు

    ఆకాశపు వేర్లతో

    ఫల-పుష్పభరిత

    బాహువులను మనవైపు సారిస్తాయి.

    ఒక రూమీ

    ఒక కబీర్

    ఒక సిద్దయ్యగురువు

    ఓ దేవీప్రియా…

     

    – పున్నా కృష్ణ మూర్తి

 ~~~

 దేవిప్రియ జీవన దృశ్యాలు ఇవిగో ఇక్కడ:

Devipriya_slideshow_final

 

నా పుట్టినరోజుదేముంది

ఒక కాడ్వెల్ తరువాత

ఒక శ్రీశ్రీ తరువాత

ఒక పాణిగ్రాహి తరువాత

ఒక చెరబండరాజు తరువాత

పుట్టినవాణ్ని నేను

-దేవిప్రియ

(అరుదైన ఈ స్లైడ్ షో అందించినందుకు దేవిప్రియ గారికీ,  పున్నా కృష్ణ మూర్తి గారికి షుక్రియా)

Devi priyatarangalu_1

పున్నా కృష్ణ మూర్తి

పున్నా కృష్ణ మూర్తి

వచనాన్ని నిండుగా ప్రేమించిన మాస్టారు చేరా

Image - Copy (2)

చేకూరి  రామారావు గారి  చేరాతలంటే భలే  యిష్టం – అని  త్రిపురనేని  శ్రీనివాస్  కి చెప్పాను.

అప్పుడు శ్రీను మాస్టార్ గారి భలే ఆసక్తిగా చెప్పారు. అప్పటికి శ్రీను విజయవాడ లో వుండేవారు. హైదరాబాద్ లో వున్నప్పటికి చేరా మాస్టార్ ని  సభల్లో చూడటం , పలకరించటం  తప్పా సాహిత్యం గురించి  మాటాడింది లేదు. వొక  రోజు ఆంద్రజ్యోతి ఆదివారం అనుబంధం వుత్తరాల పేజిలో  మసిగుడ్డ కథ మెచ్చుకొంటూ  చేరా మాస్టార్ రాసిన వుత్తరం వుంది. శ్రీనుతో  ‘అరే భలే  రాసారే’ అంటే ‘స్పార్క్ ని  బాగా పట్టుకొంటారు’ అన్నా.

ఆ వుత్తరం సంతోషంతో  పాటు బాధ్యతని తీసుకొచ్చినట్టు అనిపించింది.అదే శ్రీనుతో చెపితే గట్టిగా నవ్వి నీకే కాదు యెవరికైనా  ఆ స్పృహ వుండాల్సిందే అన్నాడు.  ఆయన గమనిస్తుంటారు. ‘మాస్టార్  మెచ్చుకోపొతే బాగుండదు కదా’ అని మనసుకి అనిపించింది. “మనసుకో దాహం పుస్తకాన్ని చేరాతల్లో పరిచయం చేద్దామని రాసాను. జ్యోతికి పంపిద్దాం అనుకుంటుండగా ఆ కాలమ్ యిక ముందు రాదని తెలిసింది. కాని యీ వ్యాసాన్ని ప్రచురణకి యిస్తాను” అని ఫోన్  చేసి చెప్పారు.

‘అగాధ నీలిమ’ కథ వచ్చినప్పుడు కథ మొత్తాన్ని వొక వాతావరణంలోకి  తీసుకెళ్ళి కథ స్థాయిని  భలే పెంచావ్… యీ టెక్నిక్  నీ కథలకి చాలా బాగా అమిరింది’ అని  మాస్టార్ అన్నప్పుడు అవే 24 గంటలు కదా అందరికి. వచ్చినవన్ని చదువుతారు. అంతకు ముందు వచ్చినవి చదువుతారు. ప్రపంచ సాహిత్యాన్ని చదువుతారు. సభలకి వస్తారు ,మాటాడతారు. శ్రోతగా వస్తారు. స్నేహితులతో గడుపుతారు. యింట్లో నేలపై పరచిన బేతం చర్ల  టైల్స్ ని  యెంత బాగా పరిచారో చెపుతారు. వంట చెయ్యగలరు. ముఖ్యంగా మనుష్యులని రోజు కలుస్తుంటారు. టైం మేనేజ్ మెంట్  భలే  చేస్తారు – అంటే మొదట్నుంచి  అలా అలవాటైపోయింది అంటారు. మాస్టర్ గారి స్నేహంతో  నాకు రంగనాయకి గారు అమ్మ అయ్యారు.  సంధ్య తో  స్నేహం. హేమంత్ ని మాస్టర్ ని చూస్తుండటం భలే వుండేది. చేరాగారి  అబ్బాయి క్రిస్ నాకు యిష్టమైన స్నేహితుడు. యింటికి యెప్పుడు వెళ్ళినా సాహిత్యం, కమ్మని ఆహారం తో సంతోషమే సంతోషం.

మాస్టార్గారి ఫెమినిజం గురించి చాలా విలువైన విషయాలని  చెప్పేవారు. ఫెమినిస్ట్ థీయరి, ఫిలాసఫిని  బాగా  అర్ధం  చేసుకోడానికి మాస్టర్ చెప్పే విషయాలు , ఆయనతో సంభాషణ  చాల  వుపయోగపడేవి.  Instant Life కధ పై మాస్టర్ రాసిన  విశ్లేషణ నాకెంతో అపురూపం. అలానే ‘శీతవేళరానీయకు’ పై  ఆయన స్పందన నాకెంతో యిష్టం.

వచనాన్ని ప్రేమించే మాస్టార్ ,భాష – సాహిత్యం  శిఖరమంత యెత్తున తెలిసిన మాస్టర్, తెలుగు సాహిత్యానికి – భాషకి చేసిన మేలు అనంత ఆకాసమంతా.

ఆకాశం యెప్పుడు మనకి కనిపిస్తూనే వుంటుంది. అంత మాత్రాన మనకి ఆకాశం పూర్తిగా తెలుసని కాదు. యెప్పటికప్పుడు కొత్తగా ఆకాశాన్ని తెలుసుకొంటున్నట్టు మాస్టార్  రాసిన పుస్తకాలన్నీ మళ్ళిమళ్ళి చదువుకొంటుండాలి.

నిన్న మాస్టార్ గది షల్ఫ్ లో అనేకానేక పుస్తకాలు అటుయిటు వాలి వున్నాయి నిరంతరం చదువుతున్నట్టు… అంతే కాకుండా కొత్తవాటికి చోటిస్తు…!!!!

-కుప్పిలి పద్మ

భూమి స్వప్నాన్ని శ్వాసించిన తెలంగాణ కవిత్వం

10177289_10203107554362740_688223332954052141_n

నిజాయితీగా చెప్పాలంటే, తెలంగాణ కవిత్వం గురించి నాలుగు మాటలు సాధికారికంగా వ్రాసే శక్తి నాకు లేదు. జూన్ 2 వ తేదీన, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన ‘తెలంగాణ రాష్ట్రం’ ఏర్పడబోయే సందర్భంగా, జూన్ 1 వ తేదీ రాత్రి 9 గంటల నుండి రాష్ట్ర ఆవిర్భావ ఘడియల వరకు కొనసాగేలా తెలంగాణ కవి గానం ఒకటి, మిత్రులు హైదరాబాద్ సారస్వత పరిషత్ హాలులో ఏర్పాటు చేస్తున్నారు. ఒక కవిత్వ విద్యార్థిగా, తెలంగాణ లోని వరంగల్ అనే ఊరిలో పుట్టి పెరిగిన వాడిగా, తెలంగాణ కవిత్వం నన్నెలా చుట్టుముట్టిందో, తెలంగాణ కవిత్వాన్ని నేనెట్లా అర్థం చేసుకున్నానో క్లుప్తంగా చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నం ఈ వ్యాసం!    

హైదరాబాద్ రాష్ట్రంలో సజీవంగా వున్న తెలుగు కవిత్వం ఊసు లేకుండా వెలువడిన ‘వైతాళికులు’ సంకలనానికి జవాబుగా సురవరం ప్రతాప రెడ్డి వెలువరించిన ‘గోల్కొండ కవులు’ కాలం నుండి, ‘ఇప్పుడు తెలుగు కవిత్వం అంటే తెలంగాణా కవిత్వమే’ అన్న కాలం దాకా ‘తెలంగాణా కవిత్వం’ చేసిన ప్రయాణం అబ్బుర పరుస్తుంది. మరి, ఆ శక్తి తెలంగాణ కవిత్వానికి ఎవరిచ్చారు? నిస్సందేహంగా, తెలంగాణ జీవితమే తెలంగాణ కవిత్వానికి ఆ శక్తిని ఇచ్చింది. తరాలుగా కొనసాగుతోన్న తెలంగాణ తండ్లాట తెలంగాణ కవిత్వానికి ఆ ఆత్మను ప్రసాదించింది.

కొన్ని వందల ఏళ్ళ పాటు సాంస్కృతిక, ఆర్ధిక దోపిడీకి గురయిన తెలంగాణ, తనను తాను విముక్తం చేసుకోవడం కోసం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సాయుధ పోరాటంలోకి దిగింది. ప్రజా ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ఎక్కడ మొదలైనా పాటే వాటి మొదటి ఆయుధం. తమ శ్రమనీ, తమ శ్రమని దోచుకునే వాళ్ళ మోసాలనీ మరిచిపోయెందుకు సామాన్యులు పాటనే ఆసరా చేసుకున్నారు. తెలంగాణ కవులు కూడా పాటనే ఆశ్రయించారు. ‘బండెనక బండి కట్టి’ అని ఆగ్రహించినా, ‘పల్లెటూరి పిల్లగాడా’ అని దుఃఖించినా, పాటే తెలంగాణ కవిత్వ మాధ్యమం అయింది.

వచన కవిత, కథ, నవల లాంటి సాహితీ ప్రక్రియలు ఐరోపీయ దేశాల నుండి దిగుమతి చేసుకున్నవి. బ్రిటిష్ పాలన లో వున్న కారణంగా, ఇంగ్లీష్ చదువుకూ, సాహిత్యానికీ చేరువైన అప్పటి మదరాసు రాష్ట్రం లోని తెలుగు సాహిత్య సృజనకారులు ఆ ప్రక్రియలలోకి సహజంగానే ప్రవేశించగలిగారు. అయితే, ఉర్దూ చదువు, అది కూడా కొన్ని ఉన్నత వర్గాలకే పరిమితమైన సమాజం లాంటి పరిమితులు ఉన్నప్పటికీ తెలంగాణ కూడా ఆ సాహితీ ప్రక్రియలలోకి ప్రవేశించింది.

 

//2//

సుదీర్ఘ కాలం పీడనకు గురి కావడం వలన, తెలంగాణ జీవితం లో సహజంగా వున్న ‘సామూహికత’ లక్షణం వలన, తాము స్వీకరించిన ఆధునిక సాహితీ ప్రక్రియలలో కూడా ప్రజా పోరాటాలని ప్రధాన వస్తువుగా చేసుకుని, తమ ప్రజల భాషలో వ్యక్తీకరించారు తెలంగాణ కవులు. పీడితులెప్పుడూ స్పష్టంగానే మాట్లాడతారు. అందుకే, మాటలకు అనవసరమైన పూతలు పూసి, మెరుపులు అద్ది ఆ మాటల వెనుక దాక్కోవడం లాంటి శుద్ధ కళా నైపుణ్యాలు తెలంగాణ కవులు ఔపోసన పట్టలేక పోయారు. అందుకే, పాటలో ధ్వనించే స్పష్టత తెలంగాణా కవితలోనూ ధ్వనిస్తుంది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కవి పలికింది అందుకే!

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, భారత దేశ స్వాతంత్ర్యం, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణం తదనంతరం తెలంగాణ కవి, కవిత్వ భాషకు సంబంధించి, కవిత్వ వ్యక్తీకరణలకు సంబంధించి కొత్త పరీక్షలను ఎదుర్కొన్న కాలం. స్వాతంత్ర్యమైతే వొచ్చింది గానీ, ఊళ్ళల్లో ఇంకా కొనసాగుతోన్న దొరల పెత్తనం, అప్పుడప్పుడే యూనివర్సిటీ చదువులు చదువుతున్న తెలంగాణా కవిని ఆందోళనకు గురి చేసింది. అందుకే, 1969 లో ఉధృతంగా వొచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం గణనీయమైన స్థాయిలో కవిత్వాన్ని సృష్టించలేక పోయింది. దాదాపు అదే కాలంలో తెలంగాణ లోకి అడుగిడిన నక్సలైటు ఉద్యమాలు, దానికి ముందే ఆవహించిన శ్రీ శ్రీ కవిత్వం, తెలంగాణ కవిని విప్లవ కవిత్వం వైపు నడిపించాయి.

దరిదాపు 80 ల వరకూ, ‘తెలంగాణ కవి అంటే విప్లవ కవి’ అన్నంతగా తెలుగు సాహిత్యం లో ఒక ముద్ర పడి పోయింది. ఇక్కడ గమనించ వలసిన అంశం ఏమిటంటే, ఈ కాలంలో కూడా తెలంగాణ కవులు, దొరల పెత్తనం కింద, పోలీసు క్యాంపుల కింద నలిగిపోయే తన ఊళ్ళ గురించే కవిత్వం రాసారు. ఆ కవిత్వం కూడా, ఏ అర్థం లేని / అవసరం లేని రూపకాల చాటునో కప్పి పెట్టకుండా సాగింది. తెలంగాణ సాయుధ పోరాట వారసులుగా, ఇట్లాంటి విప్లవ కవిత్వం రాయడం ద్వారా తమను తాము ప్రజా ఉద్యమాలలో మమేకమైన వాళ్ళుగా చూసుకున్నారు తెలంగాణ కవులు!

ఎనభైలలో వొచ్చిన స్త్రీ, దళిత వాదాలు, ‘అందరూ కలిసి చేసే పోరాటం లోనే అందరి విముక్తి ‘ అన్న విశ్వాసం పట్ల అవిశ్వాసాన్ని ప్రకటించి, అస్తిత్వ ఉద్యమాలను మొదలు పెట్టాయి. కాస్త అటూ ఇటూగా అదే సమయంలో, తెలంగాణ లోని కొందరు బుద్ది జీవులు, ‘తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు – అది వెనుకకు నెట్ట బడిన ప్రాంతం’ అన్న స్పృహను తెలంగాణ సమాజంలోకి ప్రవేశపెట్టారు. తదనంతర కాలంలో, ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష’ రాజకీయ రూపం తీసుకుని, తెలంగాణ తెలుగు భాషకు జరుగుతోన్న అవమానం, సంస్కృతి పట్ల అవహేళన, వనరుల దోపిడీ మొదలైన అనేక అంశాలను ఆధారాల సహితంగా చర్చకు పెట్టడం మొదలు పెట్టడం ప్రారంభించారు.

 

//3//

ఇట్లా మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత, తెలంగాణ కవిత్వం గొప్ప సౌందర్యంతో వెలిగిపోయింది. తెలంగాణ కవిత్వం, ఎట్లాంటి శషభిషలూ లేకుండా తన జీవ భాషతో పలికింది. సరళం గానే ఉంటూ, గంభీరమైన అంశాలను స్పృశించింది. దాపునే నది పారుతున్నా, ఫ్లోరోసిస్ బారిన పడుతోన్న తన ఊళ్ళ దుఃఖాన్ని పలికింది. వందల ఏళ్ళు పదిలంగా దాచుకున్న తన భాష ని గేలి చేయడాన్ని సవాలు చేస్తూ పలికింది. తనకే ప్రత్యేకమైన తన పండగల సౌందర్యాన్ని పలికింది. మొత్తంగా, తెలంగాణ కవిత్వం తెలంగాణ జీవితాన్ని ఆవాహన చేసుకున్నది.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా పాటే ఆకాశంలోని సూర్యుడిలా వెలిగిపోయినా, పాట వెలుగు స్పృశించ లేని వేదనని తెలంగాణ కవిత్వం స్పృశించింది. ‘మత్తడి’, ‘పొక్కిలి’, ‘మునుం’ లాంటి బృహత్ సంకలనాలు ఇందుకు దాఖలా ! ఇదే సమయంలో ఒక వైపు తెలంగాణ ఆకాంక్షకు మద్దతు తెలుపుతూనే, రేపటి తెలంగాణ లో తమ అస్తిత్వాన్ని నిలిపుకోవాలనుకునే తెలంగాణ దళిత, బహుజన, ముస్లిం ల ఆకాంక్షని కూడా తెలంగాణ కవిత్వం వ్యక్తం చేసింది. బహుశా, ఈ కాలంలో వెలువడిన తెలంగాణ కవిత్వాన్ని కొంతమేర ఆఫ్రికన్ కవిత్వంతో పోల్చి చూడవోచ్చునేమో!

ముఖ్యంగా, 2009 లో ప్రకటన చేసి, కేంద్ర ప్రభుత్వం వెనక్కి వెళ్ళిన తరువాత పెరిగిపోయిన యువకుల ఆత్మహత్యల నేపథ్యంలో వెలువడిన తెలంగాణ కవిత్వం ప్రత్యేకమైనది. వాళ్ళ ఆత్మ త్యాగాలను చూసి దుఃఖించింది. అట్లాంటి యువకులకు ధైర్యం చెప్పింది. వికృత క్రీడలతో తెలంగాణ ప్రకటనలతో ఆడుకున్న రాజకీయాల పట్ల ఆగ్రహం ప్రకటించింది.

ఆగ్రహానికి, దూషణకి సంబంధించి, 2009 ముందు వరకూ దాదాపుగా పరోక్ష ప్రస్తావనలకే పరిమితమైన తెలంగాణ కవిత్వం, ఆ తదనంతర కాలంలో ప్రత్యక్ష ప్రస్తావనలలోకి దిగింది. ఈ కాలంలో వెలువడిన ఒకానొక సంకలనానికి పేరు ‘క్విట్ తెలంగాణ’ !

ఇక ఇప్పుడు తెలంగాణ వొచ్చింది. తెలంగాణ ప్రకటించిన రోజున తెలంగాణ కవులు గొప్ప ఉత్సవ సంరంభంతో కవిత్వం రాసారు. నెరవేరిన తమ ప్రజల ఆకాంక్షలని, అమరులైన యువకుల త్యాగాలను శ్లాఘిస్తూ కవిత్వం చెప్పారు. ఇక ఇక్కడి నుండి తెలంగాణ కవిత్వం ప్రయాణం ఎటువైపు?

చరిత్రని చూస్తే అర్థమయే విషయం – తెలంగాణ కవులు ఎప్పుడూ తమ భూమి పుత్రుల వైపే వున్నారు. తమ భూమి స్వప్నాన్నే తమ కవిత్వంలో శ్వాసించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ కవులు, స్టేట్ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతీ కాలంలోనూ ‘యాంటీ-స్టేట్’ గానే వున్నారు. తెలంగాణ ఉద్యమాల వారసత్వంగా వొచ్చిన ఆ జీవ లక్షణం కొనసాగుతుందనే అనుకుంటున్నాను. అదే సమయంలో, తెలంగాణ కవిత్వం, కొంగొత్త రూపాలతో వెలువడుతూ ముందుకు సాగుతుందనీ ఆశ పడుతున్నాను –

 

-కోడూరి విజయ కుమార్

vijay

ఇంకో జీవితంలోకి మార్క్వెజ్!

1

A kind of emptiness in his life had begun there. From then on he had been unable to distinguish, to remember what events were part of his delirium and what were part of his real life.

పందొమ్మిదేళ్ళ వయసులో మార్క్వెజ్ రాసుకున్న మొట్ట మొదటి కథలో వొక వాక్యం అది.

తను రాసుకున్న మొదటి వాక్యాలతో పదే పదే ప్రేమలో పడడం ఏ రచయితకైనా ఎంత ఇష్టంగా వుంటుందో, అంత కష్టంగానూ వుంటుంది. ఆ వాక్యాల నునులేతదనంతో పాటు వాటిలోని అమాయకత్వం అతన్ని ఎప్పుడూ గుచ్చి గుచ్చి చూస్తుంది. తనకి తెలియకుండానే అతను ఆ వాక్యాల్ని తిరగ తొడుక్కుంటూ వుంటాడు, కాని, ఎప్పుడూ వొక కొత్త చొక్కా తొడుక్కునే పిల్లాడిలాగా సంబరపడిపోతుంటాడు. అలాంటి కొన్ని సంబరాల కలయిక – మార్క్వెజ్ ఇప్పటిదాకా గడిపిన జీవితం! అతని ఇంకో జీవితం ఇప్పుడు మొదలవుతుందని నమ్ముతున్నాను కాబట్టి, నా లోకంలో మార్క్వెజ్ కి మరణం లేదు.

ఇవాళ సాయంత్రం మార్క్వెజ్ కన్ను మూశాడని తెలిసిన తరవాత ఆ పందొమ్మిదేళ్ళ వయసు నించి ఇవాల్టి ఎనభయ్యో ఏడు దాకా అతని ప్రయాణం ఏమిటా అని ఆలోచిస్తూ వొక రకమైన అస్థిమితత్వంలోకి జారిపోయాను. ప్రతి వాక్యాన్ని వొక అందమైన జ్ఞాపకంగా చెక్కే శక్తి వున్న మార్క్వెజ్ నిజానికి ఈ రెండేళ్ళ కిందటి నించి వొక్క జ్ఞాపకాన్నీ తలచుకోలేని విస్మృతిలోకి జారిపోయాడు, అల్జీమర్స్ అనే దయలేని వ్యాధి వల్ల!

“What matters in life is not what happens to you but what you remember and how you remember it.”

మార్క్వెజ్ రాసిన ఆ వాక్యం నిన్నటి నించీ విపరీతమైన ఉద్వేగంతో నా లోపల చప్పుడు చేస్తోంది. ఈ చప్పుడు వొక్కో సారి నా చెవుల్ని ఇంకే చప్పుడూ వినలేని స్థితిలోకి తీసుకు వెళ్తోంది. నన్నురకరకాల తలుపుల్లోంచి మార్క్వెజ్ అనే వొక అనేక గదులూ తలుపులూ కిటికీలూ వున్న విశాలమైన సౌధంలోకి లాక్కు వెళ్తోంది.

140417170605-01-gabriel-garcia-marquez-horizontal-gallery

       2     

మొదటి వాక్యాలు రాస్తున్నప్పుడు అతని వయసు పందొమ్మిది. అతని మొదటి వాక్యాలు చదువుతున్నప్పుడు నాకూ పందొమ్మిదే!

కాఫ్కాలూ, కామూలూ, ఇలియాస్ కానెట్టీలూ, పదే పదే చదివే షేక్స్పియర్ మాక్బెత్ లూ, బైరాగి కవిత్వాలలోంచి మళ్ళీ రాస్కల్నికోవ్, హామ్లెట్లూ, డాలీ రేఖలలో కూడా దాక్కున్న అసంబద్ధ వాక్యాలూ, త్రిపుర అనే దేశంలో వొంటరి సంచారాలూ తెగ సందడి చేసే ఆ పందొమ్మిదేళ్ళ అమాయకత్వపు అంతిమ దినాల్లో- బెజవాడ గాంధి నగర్ “ప్రబోధ” బుక్ సెంటర్లో అనుకోకుండా దొరికిన One Hundred Years of Solitude – ఆ యవ్వన కాలపు బైబిల్.

నండూరి సుబ్బారావు గారు “నమిలి మింగిన నా ఎంకి” అని ఎందుకన్నారో అప్పుడే అర్థమైంది. ఈ నవల నన్ను నమిలి మింగేసిందో, నేను ఆ వాక్యాల్ని నమిలి మింగానో తెలియదు. కాని, రాసే వాక్యం మీద చచ్చేంత మమకారాన్నీ, సంశయాన్నీ నింపిన నవల అది.

ఆ తరవాత చాలా కాలం తరవాత Love in the Time of Cholera చదివి, కొన్ని నిద్రలేని రాత్రులు గడిపాక మార్క్వెజ్ ని తట్టుకునే శక్తి పోయింది నాకు! జీవితానికి మరీ అంత సున్నితత్వం అవసరమా అనే సందిగ్ధంలో పడిపోవడం అప్పుడే మొదలయింది. సున్నితత్వాన్ని మించిన యుద్ధం లేదని ఎక్కడో నేను రాసుకున్న వాక్యానికి మూలం ఆ నవలలో, ఆ నవల చుట్టూ నేను అల్లుకున్న మాయా వాస్తవికతలో వుంది.

కాని, సున్నితత్వాన్ని నిశ్శబ్దంతో కానీ, కృత్రిమమైన మౌనంతో గాని ఆట్టే కప్పెట్టలేమని కూడా అప్పుడే అర్థమవడం మొదలైంది. నా లోపల నేను చేసుకుంటూ పోతున్న యుద్ధంలో నాతో నేనే తలపడే సన్నివేశంలో నేను మాత్రమే రాసుకోగలిగే వాక్యంలో మాత్రమే నాకు విముక్తి వుందని మార్క్వెజ్ నాకు నేర్పడం మొదలు పెట్టాడు. కచ్చితంగా అప్పుడే నాకు ఇంకా చదవాలి చదవాలి ఈ సున్నితత్వపు అంతు చూడాలి అన్న కసిని పెంచుకుంటూ వెళ్ళాడు. Love in the Time of Cholera అనే నవల యాభై ఏళ్ళ తరవాత ఎప్పుడో మళ్ళీ పుట్టుకొచ్చే, ఉబికి వచ్చే ప్రేమ గురించి అనుకుంటాం కాని, నిజానికి ఆ నవలలోపలి అసలు కథ ఈ సున్నితత్వపు పునర్జన్మ కాదా!?

అవును – అనే నా సమాధానం, ఎలాంటి సంశయం లేకుండా!

 

3

images

అయితే, మార్క్వెజ్ తో నా అసలు సిసలు సహప్రయాణం 1995 తరవాతనే!

ఆ ఏడాది మార్క్వెజ్ కథలు Strange Pilgrims ఇంగ్లీషు అనువాదం నా కంట పడింది. వొక ఆదివారం పొద్దున్న బెజవాడ అలంకార్ సెంటర్లో సైడ్ వాక్ మీద పరచుకున్న పుస్తకాల మధ్య రికామీగా తిరుగుతున్నప్పుడు Strange Pilgrims పుస్తకం అట్ట నన్ను నిలబెట్టేసింది.

అప్పట్లో ఉద్యమం ఏమిటంటే: కొత్తగా తెచ్చిన పుస్తకం రెండు రోజుల్లో వేడివేడిగా చదివేయాలి. చదివాక అందులో వున్న వాక్యాలు వొక నోట్ బుక్ లో తిరగరాసుకోవాలి. ఇంకో వారం తరవాత ఆ వాక్యాలు మళ్ళీ చదువుకొని, వాటిని తెలుగులోకి తర్జుమా చేసుకోవాలి. మళ్ళీ చదువుకోవాలి. చదువుకుంటూ నిద్రపోవాలి. నిద్రలో ఆ వాక్యాల్ని కలవరించాలి. ఇవన్నీ జరక్కపోతే ఆ రచయితకి నా లోకంలోకి వీసా లేదు.

కాలేజీలో వున్నప్పుడు మహాకవి టాగూర్ గురించి నాకొక థియరీ వుండేది. టాగోర్ గొప్ప కవీ కాదు, మంచి నవలా రచయిత అంత కంటే కాదు, గొప్ప కథకుడు అని! అలాగే, శరత్ మంచి కథకుడు కాదు, గొప్ప నవలా రచయితా అని! అలాగే… అలాగే, త్రిపుర అసలు కథకుడు కాదు, మనకి తెలియని/ మనల్ని ప్రక్రియ పేరుతో నిరంతరం మోసపుచ్చే రహస్య నవలా రచయిత అని!

Strange Pilgrims చదివాక- అలాంటి థియరీ కనిపెట్టేసాను. అప్పుడు కొంత కాలం నా వాదమూ తగవూ ఏమిటంటే, మార్క్వెజ్ నవలా రచయిత కంటే ఎక్కువగా గొప్ప కథకుడు అని!

మార్క్వెజ్ వొక కొత్త రకం భాష వాడుతున్నాడని, వొక కొత్త రకం వాస్తవికత మాట్లాడుతున్నాడని మనకి కచ్చితంగా అర్థమైతే, అతని అన్ని ప్రాణాల అసలు చిలక Strange Pilgrims లో వుందని మీరు కూడా వొప్పుకుంటారు. ఈ పన్నెండు కథలు రాయడానికి అతనికి పద్దెనిమిదేళ్ళు పట్టిందట. అంటే, ఆ కథల్లో ఎన్ని ప్రాణాలు పొదిగాడో అర్థమై వుండాలి కదా! అందులో మొదటి కథ 1970లలో వొక కలలో పుట్టిందట. ఆ కలలో మార్క్వెజ్ కి అంత్యక్రియలు..దోస్తులంతా వచ్చారట. అంతా అయిపోయాక ఎవరి దారిని వాళ్ళు వెళ్లిపోతున్నప్పుడు, తను కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు మార్క్వెజ్. అప్పుడు వొక చెయ్యి అతన్ని బలంగా వెనక్కి లాగి, “you’re the only one who can’t go!” అన్నదట. అంతే! మార్క్వెజ్ అక్కడే వుండిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు మార్క్వెజ్ కి అర్థమైంది: చనిపోవడం అంటే స్నేహితుల్ని మళ్ళీ కలవలేకపోవడం అని!

స్నేహితుల్ని కలవలేని ఆ వెలితిలోంచి పుట్టిన కథలు ఇవి. వ్యక్తిగతంగా నాకు ఈ కథలు ఎందుకు నచ్చాయంటే, మార్క్వెజ్ ఇతర రచనల్లో అతని దుఃఖం చాలా transparent గా కనిపిస్తుంది. కాని, ఈ కథల్లో ఆ దుఃఖాన్ని ఏ చేరుమాలుతోనూ దాచుకోలేనితనం కనిపిస్తుంది. అది అప్పుడే చెంప మీద జారి, ఆరిపోడానికి ససేమిరా నిరాకరించే తడి చుక్కలా గోరువెచ్చగా అనిపిస్తుంది ఈ కథల్లో!

వున్న వూళ్ళోనే దిగడిపోయిన మనిషికి వాస్తవికత అన్ని కోణాలూ అర్థమవుతాయని అనుకోను. వలసపోయిన కళ్ళకి కొత్త చూపుల రెక్కలు వస్తాయి. తన దేశానికి దూరంగా వుండి, తనకి తానూ, తన వాళ్ళూ, ఆ పరదేశంలోని వాళ్ళు కూడా పరాయీగా, లేదంటే కొంత ఎడంగా కనిపిస్తున్నప్పుడు మార్క్వెజ్ ఈ కథలు రాసుకున్నాడు. ఆ దూరపు దుఃఖంలో తన వూరికి తను ఎంత దగ్గిరగా వుండాలనుకుంటున్నాడో ఆ ఎడబాటు బాధలోంచి తనకోసమే రాసుకున్న కథలు ఇవి. అవి, కొన్ని క్షణాల్లో నావి అనిపించాయి అంటే, ఆ క్షణాల్లో నేనూ మార్క్వెజ్ తరహా వాస్తవికతలోకి వెళ్ళిపోయానన్న మాట!

ఎలాంటి వాస్తవికత ఇది?! వినండి మార్క్వెజ్ ఏమంటున్నాడో!

True memories seemed like phantoms, while false memories were so convincing that they replaced reality.

నా మిత్రులు చాలా మందికి తెలుసు, నా ఆలోచనల ప్రయాణం మార్క్స్ తో మొదలయింది, మరీ ముఖ్యంగా : The philosophers have only interpreted the world, in various ways; the point is to change it. అన్న వాక్యం. ఇది నా నోట్ పుస్తకాల్లోనూ, ఖమ్మం గోడల మీద ఎర్రెర్రగా రాసుకున్న రోజులన్నీ గుర్తే!

కాని, ఎంతో కొంత లోకాన్ని చూశాక, ఎన్నో కొన్ని పుస్తకాల్ని చదువుకున్నాక, ఎన్నో సంభాషణల తరవాత నాకు అర్థమైందేమిటంటే: మార్పు సుదూర లక్ష్యమనీ, అసలు వాస్తవికతనే ఇంకా సరిగ్గా అర్థం చేసుకోవాల్సి వుందనీ! వేయి పూలలో కనీసం వొక పది పూలయినా పూర్తిగా వికసిస్తే చాలు అని!

తన మరణానికి మరుసటి రోజు – మార్క్వెజ్ మళ్ళీ అదే చెప్తున్నాడు నాకు!

ఈ వాస్తవికతకి నేనెప్పటికీ వొక strange pilgrimని!

 – అఫ్సర్

ఈ పొద్దుని నిలబెట్టుకుందాం !

Hyderabad_CITY_Page_758745e

57 ఏండ్ల కల భౌగోళికంగా నెరవేరుతున్న సందర్భంలో తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు మొదటి నుండి ఒక స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. అది తెలంగాణ వచ్చే వరకు ఎంత పని ఉంటుందో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కవులకు, రచయితలకు అంతకు మూడిరతల సృజనాత్మక పని ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ కవులు మొదటి నుంచి ప్రజల పక్షం వహించి తమ తమ నిర్మాణాత్మక ప్రక్రియలను కొనసాగించడం వలననే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో దోపిడీదారులు, దోపిడీకి లోనైనవారు, వివిధ విభిన్న భావాలు ఉన్నవారు కలిసి పని చేశారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరెవరి భావజాలాలకనుకూలంగా వారి వారి శిభిరాల్లోకి  వెళ్లిపోతారు. అంతిమంగా ప్రజలపక్షం వహించి రచనలు చేసేవారే మిగిలిపోతారు. అంటే రాజ్యానికి వ్యతిరేకమైన పక్షంగా తిరిగి కవులు తమ పాత్రను మరింత బాద్యతాయుతంగా నిర్వర్తించాల్సి ఉంటుంది.
నిజంగా 57ఏండ్లలో ఆధిపత్యవాదులు తెలంగాణలో భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలను విపరీతమైన విధ్వంసానికి లోనుచేశారు. ఇవాళ్ల అది ఎంతదూరమచ్చిందంటే తెలంగాణ మైలురాjైున 1948 సెప్టెంబర్‌ 17ను మరిచిపోయి 1956 నవంబర్‌ 1వ తేదీని యాదికుంచుకునే దుస్థితి ఏర్పడిరది. కారణం పాఠ్యప్రణాళికలన్నీ, వాచకాలన్నీ ఆధిపత్యవాదుల, బ్రాహ్మణ్యవాదుల భావజాలాలతో నిండి ఉండడం.
అంతేకాక ప్రపంచీకరణ విధానాలకు తెలంగాణ ప్రాంతాన్ని ప్రయోగశాలగా మార్చారు. సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. అందువలన రైతుల, నేత కార్మికుల ఆత్మహత్యల పరంపర అంతూదరీ లేకుండా జరుగుతూనే ఉన్నాయి. గత 13సంవత్సరాలుగా  బౌగోళిక తెలంగాణను కోరుకుంటున్న రాజకీయపక్షాలు వాస్తవంగా ఆధిపత్యవాదులు ప్రధాన కాంట్రాక్టర్లయితే వారికి ఉపగుత్తేదారులుగా ఈ వర్గాలే మొదటి నుంచి పనిచేస్తూ వచ్చాయి. అందువలన, తిరిగి ఈ వర్గాలే ఆవిర్భవించనున్న తెలంగాణ రాష్ట్రానికి అధిపతులైతే తెలంగాణ సామాన్య ప్రజలకు అణచివేత వర్గాలకు పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. ఇది సుస్పష్టం. మళ్లీ తెలంగాణ ఉద్యమానికి ప్రాణవాయువైన కవులు, మేధావులు, వివిధ సామాజిక వర్గాల సంఘాలు అధికార రాజకీయ పక్షాల మోసాలను, కుట్రలను, ముసుగులను బహిరంగపరిచే ప్రతిపక్షపాత్రను నిర్వహించి, ప్రజలను మరో పోరాటానికి సంసిద్ధుల్ని చేయాల్సివుంది.

09-jukanti-300జూకంటి జగన్నాథం

 

 

*******

 

తెలుగు వారికి రెండు రాష్ట్రాలున్నాయని సంతోషించాలో, ఒక్కటిగా ఉన్న కుటుంబం ముక్కలయ్యిందని బాధ పడాలో తెలియని అయోమయ స్థితి. ఈ విభజన వల్ల ఎవరు లాభపడతారో, నష్టపోతారో చెప్పలేం కానీ కోల్పోయింది మాత్రం తెలుగుజాతి గౌరవం.

అయినా అమెరికాలో స్థిరపడ్డ నాలాంటి వారికి రాష్ట్రాలతో పని లేదు, కేవలం భాషా, సాహిత్యాలతో తప్ప. జననీ, జన్మభూమి లాంటి పెద్ద మాటలు వల్లించే హిపోక్రసీ లేకపోవడం వలన కలిసున్నా, విడిపోయినా మనుషులు ద్వేషించుకోకుండా ఉంటే చాలని ఆశిస్తాను. సరిహద్దులు నేలకే కానీ, మనుషులకుండకూడదన్న విజ్ఞత తెలుగు వారికుంటే చాలు.  ఆకలి పుట్టని మనిషి, అన్యాయం జరగని నేలా ఈ భూమ్మీద  లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు రచయితలు వ్యక్తుల మీదా, ప్రాంతాల మీద దృష్టి మళ్ళించకుండా తెలుగు సాహిత్య కృషికి శ్రమిస్తే దాన్ని మించిన ఐక్యత లేదు.

–సాయి బ్రహ్మానందం గొర్తి

స్కైబాబా

స్కైబాబా

గంగా జమున తెహజీబ్ కొనసాగాలి: స్కైబాబా

ఎట్టకేలకు తెలంగాణ కల సాకారమైంది.ముస్లింలకు సంబంధించి ఇప్పుడే అసలైన పోరాటం మొదలుకావాల్సిన అవసరముంది..

తెలంగాణా సాధన ఉద్యమంలో ముస్లింలు తమ వంతు పాత్ర పోషించారు.  పెద్ద సంస్థ అయిన జమాతే ఇస్లామీతో పాటు ఎన్నో సంస్థలు, వ్యక్తులు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కవులు తమ గొంతు కలిపారు. ‘రజ్మియా’ తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం (67 మంది తెలుగు+ఉర్దూ కవులు), జఖ్మీ ఆవాజ్ (స్కైబాబ), సవాల్ (అన్వర్) తదితర వ్యక్తిగత సంపుటులు తెలంగాణ పై వొచ్చాయి. మొదటి నుంచి కిరికిరీలు చేసిన ఎం ఐ ఎం కూడా చివరికి TRS సభ్యుల కన్నా బాగా అసెంబ్లీలో మాట్లాడడం తెలిసిందే.
తెలంగాణ వల్ల ముస్లింలకు ఏమిటి లాభం అని చాల మంది మనసులో ఒక ప్రశ్న తొలుస్తూ ఉండవచ్చు-
ఎక్కువ కాలం ముస్లిం రాజుల పాలనలో ఉండటం వలన తెలంగాణ వారి సంస్కృతి ప్రాచ్య (ఓరియంటల్ ఇరాన్, ఇరాక్, టర్కీ వగైరా) దేశాల సంస్కృతితో ప్రభావితమైంది. కాబట్టి ఇక్కడి భాష, వేషధారణ, ఆహారపు అలవాట్లు, నిద్ర, కళలు, సాహిత్యం అన్నీ కూడా ప్రాచ్య దేశాలను పోలి ఉంటాయి. అలాగే హైదరాబాద్ స్టేట్ తెలంగాణలో మత కలహాలు అనేవి జరగలేదు. ముస్లింలు-ముస్లిమేతరులు కలిసి మెలిసి జీవించే గంగా జమున తెహజీబ్ కొనసాగుతూ వొచ్చింది. ఆ పరిస్తితి మళ్ళీ పెంపొందించుకునే- ఇరు మతాల వారిలో సోదర భావం పెంపొందించుకునే అవకాశం వొచ్చింది.
అలాగే సుమారు 15 శాతం ఉన్న ముస్లింల ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉంది. అందుకు సరైన డిమాండ్స్ పెట్టాలి. 12% రిజర్వేషన్ కలిపిస్తామని, ముస్లిం ని ఉప ముఖ్యమంత్రిని చేస్తామని KCR వాగ్దానాలు చేసి ఉన్నారు.. వాటిని నెరవేర్చేలా వొత్తిడి తేవాలి. ఉర్దూ ను రెండవ అధికార భాషగా అమలుచేయాల్సి ఉంది. ముఖ్యంగా ఆక్రమణలకు గురైన వక్ఫ్ భూములను తిరిగి ముస్లింలకు ఇప్పిస్తూ వాటిని ముస్లిం ల పురోభివృద్ధికి ఉపకరించే ప్రణాళికలు రూపొందించాలి.
-స్కైబాబ

***

ఎన్ని దశాబ్దాల ఆకాంక్ష ఇది! ఈ చారిత్రక విజయం ఉత్తేజకరం, గర్వకారణం. అంతిమంగా విజయం ప్రజలదే అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ.  ఎన్ని వెన్నుపోట్లు, ఎంత అణచివేత, ఎందరి పోరాటం, ఎందరి త్యాగాలు! అంతులేని ఆశ నిరాశాల మధ్య, ఉత్సాహ నిరుత్సాహలతో ఎన్ని వేసవుల, ఎన్ని వసంతాల నడక ఇది!

ఈ విజయంలో విద్యార్ధుల, బుధ్ధీజీవుల, రచయితల, కవుల, లాయర్ల, జర్నలిస్టుల పాత్ర గొప్పది. వాళ్ళే లేకపోతే ఉద్యమం ఏనాడో ఆగిపోయి వుండేది. మందగించి వుండేది.

ఉత్తరాంధ్రకి చెందినవాడిగా, తెలంగాణ నాకెలా కనిపిస్తుంది? ఇక్కడ సగం జీవితం గడిపిన వాడిగా ఇది నాకు కొత్త ఎలా అవుతుంది? ఒక్క రోజూ నన్ను పరాయివాడిగా చూడలేదు ఈ నేల. ఎన్నో ప్రజా పోరాటాలను కన్న ఈ నేల ఇంకోలా ఎలా వుండగలదు?
దశాబ్దాల బంధనాల నుంచి కలిగిన ఈ విముక్తి నిజానికి పాక్షికమే, ప్రధానంగా భౌగోళికమే. ఇక నిజమైన విముక్తి విశ్వవ్యాప్తమై వున్న, ఆగని దోపిడీ నుంచే. ఈ పోరాటం ఆగిపోకూడదు. ఈ స్పూర్తి కొనసాగాలి.
—కూర్మనాథ్
***

చిన్న తెలంగాణా పల్లెలో పుట్టిన నేను పైచదువులకు వేరే ప్రాంతాలకు వెళ్ళినపుడు, తెలంగాణా భాష/యాస లో మాట్లాడాలంటే కాస్త బెరుకుగా అనిపించేది. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ భాష అంత మర్యాదపూర్వకమైన భాష కాదన్న అపప్రద అప్పట్లో ఉన్న కారణంగానేమో, అమ్మ నేర్పిన నా భాషలో నేను మాట్లాడటానికే భయపడాల్సిన దుస్థితి ఏర్పడేది. నా భాషను యాసను ఆంధ్రా మిత్రులు ఎద్దేవా చేసిన సందర్భాలూ లేకపోలేదు. మనిషి సాటి మనిషితో మాట్లాడటానికి ఆ మనిషి పుట్టి పెరిగిన ప్రాంతం ఎందుకు అడ్డం వస్తుందోనని అనుకునేవాణ్ణి. పోయిన పదేళ్ళలో భాషా పరంగా సాహిత్య ధోరణుల్లో, రచయితల్లో వచ్చిన మార్పును చూసినపుడు, తెలంగాణా అస్తిత్వ సాహిత్యం బోనం ఎత్తుకుని నింగిని తాకేట్టు నిలబడ్డ సందర్భాన్ని చూసినపుడు గర్వంగా అనిపించింది. భాషను, యాసను ఒకరు తొక్కేస్తే పోయేది కాదనిపించింది.

 మట్టివాసన ఎక్కడైనా ఒకేలా పలకరిస్తుంది. కవిత్వపు మొలకై మొలిచే కవికి, కవిత్వం పుట్టుక, కవిత్వం నేపథ్యం అంతా మట్టితోనే ముడివడి ఉన్నప్పుడు, ఆ మట్టి ఏ నేలదైతే నేఁ?  ప్రాంతాలకు అతీతంగా కవిత్వాన్ని ప్రేమించే వాళ్లకి కొత్తగా మొలిచిన ఈ కంచే అడ్డంకి కాదు కదా? తెలంగాణా రాష్ట్రం ఏర్పడగానే నేను రాసే తెలుగు అక్షరాలు ఉన్నఫళంగా మారిపోవు కదా? కవి అన్న పదంలోనే ఒక స్వేచ్ఛ ఉంటుంది. కవి నిర్భయంగా ఎక్కడికైనా పోవచ్చు. అన్ని ప్రాంతాల, జాతుల, ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలనూ ప్రతిభింబించే కవిత్వం స్వేచ్ఛగా రాయవచ్చు. తమ భావాలని, బాధలని, అనుభవాలని, అనుభూతులని ఎవరి భాషలో, యాసలో వాళ్ళు రాసినప్పుడే అది పండుతుంది.

 ఆంధ్రాకి, తెలంగాణాకి కిరీటం ఒక్కటే. అది తెలుగు. ఆ కిరీటంలో గౌరవంగా తలెత్తుకుని నిలబడ్డ రెండు సాహిత్య అస్తిత్వాలు ఆంధ్రా, తెలంగాణా. రెండింటినీ గౌరవిద్దాం.

–రవి వీరెల్లి

***

తెలంగాణా ఉద్యమానికి నేను సజీవ సాక్షిని. 1969 లో హైదరాబాద్ లో మా తాతగారి ఇంటి అద్దాలు భళ్ళుమని పగిలాయి. వాటిలోంచి కనబడిన మంటలు , రెండేళ్ల వయసున్న నన్ను వెనక వైపునుంచి గోడ దాటించటం..మొత్తం గుర్తుంది. అప్పుడు వదిలేసిన ఇంటికి,ఊరికి , ప్రాంతానికి తాతగారు తిరిగి ఉండటానికి వెళ్లనేలేదు. ఆ ఊరు మనది కాదు అనుకున్నారు, కోపం తో కాక ఒకానొక వైరాగ్యపు జ్ఞానం తో.వారి సంస్కృతి కొంత వేరు, ఉద్వేగాలు చాలా వేరు, భాష మరింత వేరు. సీమాంధ్ర లో జిల్లా జిల్లా కీ మాండలికం మారినా అక్కడ ఉర్దూ లాగా మరొక భాష ఇక్కడ మిళితమై పోలేదు.
అన్ని ఏళ్లుగా అణిగిఉన్న ఉద్యమం తిరిగి అతి బలోపేతంగా తలెత్తటం వారి గుండెచప్పుడుల నిజాయితీ కి చిహ్నం అని నేను , నావంటి చాలా మంది సీమాంధ్రులూ అనుకున్నారు. సుదీర్ఘమైన సమైక్య ఉద్యమం అటువంటి వారందరినీ ఇంచుమించి ‘ కన్వర్ట్ ‘ చేసేసింది. బిల్ ఆమోదించిన తర్వాత తెలంగాణా నాయకులు అందరి ముఖాలలో, విపరీతమైన ఆనందం, తృప్తి. ఆమోదించకపోయి ఉంటే సీమాంధ్ర నాయకుల ముఖాలు అలా వెలిగిపోయి మాత్రం ఉండేవి కాదు.
సమైక్య ఉద్యమం లో చాకచక్యంగా ఇక్కడ మరపింపజేసిన అంశం ఏమిటంటే పొట్టి శ్రీరాములు గారి దీక్ష ఆంధ్ర రాష్ట్రం కోసం. అది సీమాంధ్ర జిల్లాలు మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోవటానికి చేసిన ఉద్యమం. ఇంకొక ముఖ్యమైన సంగతి- ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసేందుకు కేంద్రం ఒప్పుకున్నా కూడా మద్రాస్ నగరం కోసం శ్రీరాములు గారి దీక్ష కొనసాగించబడింది. [కావాలనే ఇక్కడ పాసివ్ వాయిస్ ఉపయోగిస్తున్నాను ] ప్రతిసారీ సీమాంధ్ర ప్రజకి ఇదే దౌర్భాగ్యం ఏర్పడుతోంది. తమది కాని ఒక నగరాన్ని తమది అనుకుని దానికి అంకితమయిపోవటం…ఎవరి సొమ్ము వారు తీసుకోబోతే ఏడ్చి గగ్గోలు పెట్టటం.
ఆంధ్ర రాష్ట్రపు రాజధాని కావలసిన నడిబొడ్డు నగరం విజయవాడ , అప్పటి  కులాల సమీకరణాలలో అది వీలుపడలేదు.  ఇవాళ సీమాంధ్ర వారికి సొంతమని  చెప్పుకోగలిగిన  మహానగరం లేకుండా పోయింది. . అయినా మించిపోయినదేమీ లేదు,ఒక వైపునుంచి కష్టపడి పనిచేసి పైకి ఎదగటంగానూ మరొక వైపునుంచి వాణిజ్య దృక్పథం గానూ  కనబడే ఆ  లక్షణం ఈ  ప్రజలకి పుష్కలంగా ఉంది. ఇవాళ మొదలెడితే మరొక మూడు నాలుగేళ్లలో ఒకటి కాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి…మూడు మహా నగరాలు ఆవిర్భవిస్తాయి. హిందీ తర్వాత ఏ భారతీయ భాషకీ లేని గౌరవం ఇవాళ తెలుగుకి దక్కిందని ఎందుకు అనుకోకూడదు? మనవి తెలుగు అధికారికంగా మాట్లాడే రెండు రాష్ట్రాలు, కాదా?

–మైథిలి అబ్బరాజు

————————————————————————————

రెండు పిడికిళ్లు చూసిన ఆనందం

 

నాకు నచ్చింది.

అవును నాకు నచ్చింది.

ముక్కలైన రాష్ట్రం కనిపిస్తోందేమో మీకు

మొక్కవోని చైతన్యం కనిపించింది నాకు

మీరెప్పుడైనా బిగించిన పిడికిలిని చూశారా?

నేను చూశాను.

ఒకేసారి బిగిసిన పిడికిళ్లు రెండింటిని చూశాను

సమస్యల అగాధంలో నుంచి ఎగసిపడ్డ రెండు అలలను చూసాను

 

సరిహద్దు రేఖలు మారిపోయే సందర్భం

చాలామందికి కొత్తేమీ కాదు

పోయిన దఫా మ్యాప్ మారిన జ్ఞాపకానికి ఇంకా షష్టిపూర్తైనా కాలేదు..

ఇప్పుడు ఇంకోసారి

ఇంకో మార్పు కాలం గుప్పిట్లో దాగుందేమో? ఎవడు చూసొచ్చాడు?

ఇసుకలో గీతలు గీసినంత సులభంగా హద్దులు గీయడం తెలిశాక

ఆకారంలో మార్పు అనివార్యమే

 

నేనెక్కడ పుట్టానన్నది ఇప్పుడు ప్రశ్నే కాదు

ఎవరు గెలిచారన్నది అసలు సమస్యే కాదు.

ఎలుగెత్తిన ప్రతి గొంతులో

రాజకీయ రాగాలను కలిపేవాళ్ళు మనిద్దరికీ పరిచయమేగా

అన్నదమ్ములు పంపకాలకొస్తే

పాడి ఆవు నువ్వే తీసుకోమని ఇద్దరినీ ఉసిగొలిపే స్వార్థం వాళ్ళది

వాళ్ళ కుటిలత్వాన్ని ఏ సరిహద్దురేఖలు ఆపలేవని మనిద్దరికీ తెలుసు

ఇప్పటిదాకా ఇద్దరం కలిసి ఒక్కణ్ణి తిట్టాము

ఇప్పుడు తిట్టిపోసుకోడనికి నీకో నాయకుడు, నాకో నాయకుడు.

 

అందుకే నాకో మాటివ్వు తమ్ముడూ

బిగించిన పిడికిలి పట్టు సడలనివ్వనని చెప్పు..

ఎగసిన అలలను పల్చబడనీనని నమ్మబలుకు

ఎందుకంటే పోరాడిసాధించుకోవాల్సినవి ఇంకా చాలా వున్నాయి

అక్కడైనా ఇక్కడైనా..!! నీకైనా నాకైనా !!

-అరిపిరాల సత్య ప్రసాద్

————————————————————————————————————————————————————

కొమరంబీం ఎగరేసిన నెలవంక జెండా

ఒక ప్రాంతం ఒక ప్రజా సమూహం తమ అస్తిత్వం ప్రశ్నార్థకమౌతున్న సందర్భంలో తన మూలాలు హరించబడుతున్న కాలంలో తన వనరులు దోపిడీకి గురవుతున్న వేళ తన గొంతు పరాయిదవుతున్న రోజున తన సంకెళ్ళను తెంచుకునేందుకు సర్వస్వమూ ఒడ్డి పోరాడే యుద్ధ సమయం ప్రపంచమంతా వ్యాప్తమవుతున్న సందర్భంలో అది తెలంగాణా కావచ్చు కళింగాంధ్ర కావచ్చు రాయల సీమ కావచ్చు ప్రత్యేకించి తెలుగు ప్రజలలోనే అనేక ఏళ్ళుగా ఒక ప్రాంతం వారి అధీనంలో కొన్ని వర్గాల ఆధిపత్యంలో మగ్గుతున్న ప్రజలు దశాబ్దాలుగా తమ అస్తిత్వ పోరాటాన్ని జరుపుతున్నారు.

నేడు తెలంగాణా ప్రజలు తమ ఆరు దశాబ్ధాల అస్తిత్వ పోరాటంలో పాక్షికంగా విజయం సాధించారు. రాబోతున్న భౌగోళిక తెలంగాణాను ఆహ్వానిస్తూనే తెలంగాణా ప్రజలు తమ ఈ విజయాన్ని సంపూర్ణం చేసుకొని పూర్తి స్వేచ్చా స్వాతంత్య్రాలతో తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూనే వర్గరహిత ఏ ఆధిపత్యమూలేని పీడనలేని సమసమాజం కోసం  జన తెలంగాణా ఏర్పాటు దిశగా ముందడుగు వేయాలని వేలాదిమంది యువతీ యువకుల బలిదానాలు వృధాకారాదని తమ ఆటా పాటా మాటా నిలుపుకుంటూ  కొమరంబీం ఎగరేసిన నెలవంక జెండా స్వేచ్చా రెపరెపలు దశ దిశలా వ్యాప్తి కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ విజయాభివందనాలు అర్పిస్తు…

ఓ సుదీర్ఘ స్వప్నం
రెప్పలపైనున్న కంచెలను తెంచుకుంటూ
సాకారమవుతున్న వేళ
శరభ శరభ దశ్శరభ శరభ
అంటూ ప్రభంజనంలా స్వేచ్చా పతాకాన్ని చేబూని
అమరుల నెత్తురింకిన నేలతల్లి విముక్తి గీతాన్నాలపిస్తూ
జయహో తెలంగాణమా జయ జయహో జన తెలంగాణమా

-కెక్యూబ్ వర్మ

_____________________________________

స్త్రీ సాహిత్యకారులు పుట్టుకొస్తారు!

తెలంగాణ సాహిత్యకారులకు ఇది శుభపరిణామం.
ప్రస్తుతం వేళ్ళ మీద లెక్కపెట్టే అంతమందే స్త్రీ రచయితలు ఉండడం తెలంగాణ ఎంత వెనుకబడి ఉందో తెలియజెబుతోంది.

స్వతంత్ర తెలంగాణలో స్త్రీల సాహిత్యం వెల్లివిరుస్తుంది.ఇపుడు కొద్దిమందే ఉన్నా మరింతమంది స్త్రీ సాహిత్యకారులు పుట్టుకొస్తారు.

మంచి సాహిత్య సృజన జరిగే అవకాశముంది.స్త్రీ విద్య వృద్ది చెంది స్త్రీలు సమానావకాశాలు అందిపుచ్చుకుంటారు. తెలుగు, ఉర్దూ భాషల సాంగత్యం పెరుగుతుంది.
తెలుగు వారికి రెండు రాష్ట్రాలు ఉండడం ఆరోగ్యకరమైన పోటీకి వీలు కలుగజేస్తుంది.

— షాజహానా

————————————————————————-

A tale of one city

తెలంగాణ విభజన కోసం 1969, 1972 లలో  ఉద్యమాలు జరిగినా 2009 నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం ప్రజలు, మేధావుల దృష్టిని ఆకర్షించింది.

అన్ని జీవనదులు ప్రవహిస్తున్నా తెలంగాణ భౌగోళికంగా ఎత్తులో వుండడం వల్ల నీరు దిగువలో వున్న  సీమాంధ్రకు వెళ్ళి పోతోందని, కృష్ణ  గోదావరి నదుల కాచ్మెంట్ ఏరియా ఎక్కువ  ప్రాంతం  తెలంగాణకు కేవలం  18.20% నీటి వాటానే  లభిస్తోందని  తెలంగాణ వాదులు నిలదీస్తున్నారు. బ్రిటీష్ వారి హయాములో ఆంగ్ల విద్యను అభ్యసించిన సీమాంధ్రులు రాష్ట్ర సెక్రెటేరియేట్లో అన్ని ముఖ్య ఉద్యోగాలను  చేజిక్కించుకున్నారని  చేస్తున్న ఆరోపణలలో  నిజం లేకపోలేకపోలేదు.

తెలంగాణ వాదం న్యాయమైనది కాదని చెప్పలేము. ఎన్నోసార్లు ఇదే కాంగ్రెస్  చేతుల్లో, ఈ కాంగ్రెస్ నాయకుల చేతుల్లో  తెలంగాణ ప్రజా మోసపోయింది. ‘ పెద్దమనుషుల ఒప్పందం’మొదలుకుని  తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు అంతా ఇంతా కాదు.

అయితే ప్రభుత్వం ఈ వ్యవహారం పట్ల సరిగ్గా వ్యవహరించలేదనేది వాస్తవం. తెలంగాణకు న్యాయం చేస్తామంటూనే శ్రీ కృష్ణ  కమిటీ వేసి నివేదికను పట్టించుకోకపోవడం, మీ పోరాటం మీరు చేసుకోండంటూ సీమాంధ్రులను రెచ్చగొట్టడం, మీ హక్కులకోసం వుద్యమించండంటూ తెలంగాణ వారిని పురిగొల్పడం, హస్తిన నుంచి  కాంగ్రెస్ ప్రతినిధులను దించి ఉద్రిక్తతలు  పెంచి పోషించడం  కొన్ని చెడ్డ ఉదాహరణలు మాత్రమే.

విభజన  తెలంగాణకు ఎంతవరకు లాభిస్తుందో తెలియదుగానీ  సీమాంధ్రులకు ఏ రకంగా ఉపయోగ పడదనే చెప్పాలి. వున్న రాజధాని  పోతుంది, కొత్త రాజధాని ఎక్కడో చెప్పరు, అసెంబ్లీ భవనం, సౌకర్యాలు పోతాయి, హైకోర్ట్ భవనం పోతుంది, సెక్రటేరియేట్ వదిలిపోవాలి, హైదరాబాద్లో  ప్రభుత్వ ఆస్తులు వదిలిపోవాలి. పైపెచ్చు  నీళ్ళ సమస్యలు, భౌగోళిక  సరిహద్దుల సమస్యలు, నిప్పులా రాజుకోనున్న పోలవరం ముంపు గ్రామాలు, మొదట మొదటగా 7 వేల కోట్లతో రెవెన్యూ లోటు.ఏ ఒక్క సమస్య పట్ల నైనా  సీమాంధ్రుల  పట్ల  కేంద్ర ప్రభుత్వం సానుకూల వైఖరి అవలంభించింది  లేదు.

రెడ్డి వెలమ భూస్వాములకు వ్యతిరేకంగా 1946 నుంచి 1951 వరకు హైదరాబాదు ప్రాంతంలో  కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా  తెలంగాణ రైతాంగ పోరాటం చేసింది. ఇప్పుడు ఆ పార్టీ రెమ్మలము కొమ్మలమని  చెప్పుకుంటున్న కమ్యూనిస్టులు రెడ్డీ వెలమల ఆధిపత్యంలో  జరుగుతున్నా తెలంగాణ ఉద్యమానికి  మద్దతు నివ్వడం, తెలంగాణ రైతాంగ పోరాటాన్ని  సైన్యాన్ని దింపి అణిచి వేసిన  కేంద్ర ప్రభుత్వం అవే కుల నాయకత్వానికి  వంత పాడడం  ఆశ్చర్యం.

స్వాతంత్ర్యం రాక  ముందే  చివరి గవర్నర్ జనరల్ గా  వచ్చిన  లార్డ్ మౌంట్ బాటన్  రెండు మూడు సంవత్సరాలపాటు  నదీజలాలు, ఆశ్విక దళాలు, సంపద, వనరులు, నగదు, ఆభరణాలు, కట్టడాలు, వారసత్వ సంపదలు, భౌగోళిక సరిహద్దులు మొదలైన వాటిమీద అవిశ్రాంతంగా కృషి చేసి, చక్కటి హొమ్ వర్క్ చేసి  దేశ విభజనకు  సహకారాన్ని అందించారు.
ఎటువంటి హొమ్ వర్క్ చెయ్యకుండా  మార్కెట్లో  కూరగాయల్ని వేరు చేసినట్లు  చేపట్టిన అతి పెద్ద విభజనకు  ఆంద్ర ప్రదేశ్ ఒక చెడ్డ ఉదాహరణ.

ధాన్యాగారంగా, అన్నపూర్ణగా  భాసిల్లుతున్న కోస్తా జిల్లాలు  బీడు భూములుగా మారతాయని  ఆందోళన  పడుతున్న ప్రజల  మనోభావాలను పట్టించుకోకపోవడం,  ఉద్యోగాలకు  కల్పవృక్షంగా మారిన హైదరాబాద్ ను సీమాంధ్రులనుంచి వేరుచేయ్యాలనుకోడం, బుల్దోజ్ చేసైనా సరే ఒక్క  పూటలో విభజన చెయ్యాలనడం  చరిత్ర క్షమించలేని  నేరం.

శాతవాహనుల పాలన తర్వాత  అధికారంలోకి వచ్చిన కాకతీయుల పాలనలో ఒకే గొడుగు కిందకు వచ్చిన తెలుగు ప్రజకు ఎంత కష్టం!

-తుల్లిమిల్లి విల్సన్ సుధాకర్

పిడిబాకులుగా మారే పూలు ఇనాక్ వాక్యాలు!

సృజన, పరిశోధన, విమర్శన రంగాల్లో తనదైన ముద్రవేసిన గొప్ప సాహితీవేత్త ఆచార్య కొలకలూరి ఇనాక్‌. ఆయన చిన్న చిన్న వాక్యాల్ని రాస్తారు. దీనితో పాటు సరళ సుందరంగా రాస్తారు. దీర్ఘసమాసాల్ని ప్రయోగించడానికి ఇష్టపడరు. సృజన సాహిత్యంలోనే కాదు, విమర్శ, పరిశోధన రచనల్లోనూ అలాగే రాస్తారు. ఇనాక్‌ గారి ‘‘భవాని’’ కథల్ని సమీక్షిస్తూ, మొట్టమొదటిసారిగా ఆయన తెలుగు వాక్య రచనాశైలిని ఆచంట జానకిరాం ప్రశంసించగా, ఆర్‌.ఎస్‌. సుదర్శనం తదితరులు ఆ విషయాన్ని బాగా ఫోకస్‌ చేసేవారు. గంగిశెట్టి లక్ష్మీనారాయణగారి అభిప్రాయంలో చెప్పాలంటే ‘ఇనాక్ గారు రాసిన వాక్యాలు  పూలలా ఉంటూనే, పిడిబాకులుగా మారతాయి’’[1] ఇనాక్ గారి కథలు చదివిన వారికి ఈ సత్యం  తెలుస్తుంది.

ఇనాక్‌ గారు‘‘ తెలుగు వ్యాసపరిణామం’’ పై డాక్టరేట్‌ కోసం పరిశోధన చేస్తూ, తెలుగు వచనతత్త్వాన్ని బాగా గుర్తించారు. ప్రాచీన వాఙ్మయంలో పద్యం అనుభూతిని ఆవిష్కరించడంలో ప్రముఖ పాత్ర పోషించగా, గద్యం ఆలోచనకి ప్రాధాన్యాన్నిచ్చింది. ఆధునిక కాలంలో మానవుడు ప్రధానంగా బుద్ధిజీవికావడంతో గద్యం ప్రాచుర్యంలోకి వచ్చిందని సమన్వయించారు. 1970 నుండి1972 మధ్యలో ఈ పరిశోధన పూర్తి చేశారు. అప్పటికే కవిగా, కథకుడుగా, నాటకరచయితగా అనేక రచనలు చేశారు. వీరి పరిశోధనలో తెలుగు వ్యాసపరిణామాన్ని సృజన, విమర్శన వ్యాసాలుగా విభజించారు. దీనిలో ‘‘హృదయం ప్రధానమైన, కాల్పనికత కలిగి, రచయిత వ్యక్తివ్వం వల్ల, అసంపూర్ణంగా ` చాలా వరకు ఆంగ్ల వ్యాస లక్షణ సంబంధిగా గోచరించిన వచన రచనలు సృజన వ్యాసాలు’’ అన్నారు[2].  అయితే, సృజన వ్యాసం ఉపన్యాసంగా ప్రసిద్ధమయినా, ప్రమేయమనో, సంగ్రహమనో, వచనకావ్యమనో ప్రారంభమయినా, కథలు గాథలుగా రూపొందినా, మరే పేరుతో పిలవబడినా, విస్తృతంగానే ఆవిర్భవించిందన్నారు. ఇక్కడ వచనకావ్యం, కథలు సృజన వ్యాసంలోకే చేరతాయా? అనే సందేహాలు రావొచ్చు.వీటికి చాలా రచనలను సమన్వయించి చూపారు.

hyf05Rangarajan_HY_1507985g

గురజాడ ‘మాటా మంతీ’, మునిమాణిక్యం నరసింహారావు ‘‘ఇంటావిడతో పోట్లాట’ వంటివి చదువుతుంటే కథల్లాగే అనిపిస్తుంది.అలాగని ఆధునిక కథానిక లక్షణాల్ని సమన్వయించడానికి కుదరదు. అప్పుడు వీటిని ఏమని పిలవాలి?  చలం ‘‘మ్యూజింగ్స్‌’’, ప్రేమలేఖలు’’, సంజీవ్‌దేవ్‌ వ్యాసాల్ని చదువుతుంటే,వాళ్ళ జీవితానుభవాల్ని వివరిస్తున్నట్లే ఉంటుంది. వీటిని ఆత్మకథలనవచ్చా? అదీ కుదరదు. మరేమని పిలవాలి? కృష్ణశాస్త్రి, బుచ్చిబాబు వచనరచనలు కూడా ఇలాగే ఉంటాయి. వీటిలో కొన్ని వ్యాసాల్ని చదువుతుంటే చక్కని వచనకవిత్వం చదివిన అనుభూతికి లోనవుతుంటాం. అలాగని వీటి వచనకవిత్వంగా భావించలేం. అలాగే జి.వి.సుబ్రహ్మణ్యం గారి  కొన్ని వ్యాసాలు ఆలంకారిక వర్ణనలతో ఉంటుంటాయి. ఆరుద్ర ‘‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’’ ప్రారంభించడమే కథలా ఉంటుంది.[3] పరిశోధనలో ఇదొక నూతన సమన్వయం. వ్యాసం కేవలం మేథోగతమనుకునేవాళ్ళకిది కొత్త ఆలోచనను రేకెత్తించినట్లే.

అమెరికాలో Paul Dawson, “Creative Writing and the New Humanities’’ పేరుతో డాక్టరేట్‌ అందుకున్నాడు. దీనిలో మేథోగతమైన అంశాలెలా సృజనగా బహిర్గతమవుతుంటాయో విశ్లేషించాడు. ఈ గ్రంథం 2005లో వచ్చింది. దీన్ని చదువుతుంటే, ఇటువంటి సృజన విషయంలో కొత్తసిద్ధాంతం ఇనాక్‌ గారి సిద్ధాంత గ్రంథంలో 1970 నాటికే చెప్పారనిపించింది. రచనల్లో పోలికలున్నట్లే, ఆలోచనలు కూడా కలిసే అవకాశం ఉంది. అందుకే పండితులు ‘‘సంవాదిన్యో మేధావినామ్‌ బుద్ధయ:’’ అని అన్నారు[4]. ప్రతిభావంతుల ఆలోచనలు ఒకదానితో ఒకటి పోలి ఉండొచ్చన్నమాట!

వ్యాసంలో ‘సృజన’ హృదయాన్ని దగ్గరకు చేరుస్తుంటే, సృజనలో ‘ఆలోచన’ వైయక్తికానందాన్ని వ్యవస్థీకృతం చేయడానికి పనిచేస్తుంది. ఒక కథో, ఒక కావ్యమో, ఒక నాటకమో చదివినప్పుడు పాఠకుడు మొదటి వైయక్తికానందాన్ని అనుభవించాలంటే, పాత్రతోనో, వర్ణనతోనో, వస్తువుతోనో తాదాత్మ్యం చెందగలగాలి. దానితోనే ఆగిపోతే, దాని ప్రయోజనం తాత్కాలికమే. అది పాఠకుణ్ణి వెంటాడాలి. శ్రోత చెవుల్లో పదేపదే వినిపించాలి. అప్పుడే అది నిజంగా హృదయగతమైందనుకోవచ్చు.నిజంగా హృదయగతం కావడమంటే, ఆలోచనామృతం కావడమే.ఆచార్య ఇనాక్‌ గారి సృజనాత్మక రచనల్లో ఈ లక్షణం కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. వీటిని ఇనాక్‌గారు రాసిన ఏ రచనలోనైనా గమనించవచ్చు.

మునివాహనుడు (1976) ఒక సంగీతరూపకం. కానీ, వ్యవహారంలో నాటకమంటున్నారు. పౌరాణికం, చారిత్రకేతివృత్తాల సంగమం.తిరుప్పాణ్‌ ఒక భక్తుడు. అంతకంటే ముందు అతణ్ణి సమాజం పుట్టక వల్ల అంటరానివాడనిపిలిచింది. అస్పృశ్యుడు కావ్యనాయకుడుగా లక్షణగ్రంథాలు అంగీకరిస్తున్నాయా? అదీ ఒక పౌరాణిక, చారిత్రక నాటకంలో కుదురుతుందా? పోనీ, అస్పృశ్యుడైన తిరుప్పాణ్‌ భక్తికి పారవశ్యం చెందిన శ్రీరంగనాథుడ్ని నాయకుడు అనుకోవాలా? భక్తిని రసంగా అంగీకరిస్తున్నారా? ధనంజయుడు,హేమచంద్రుడు మొదలైన వాళ్ళు భక్తిని భావంగానే పరిగణించాలి తప్ప, రసం కాదన్నారు. రూపగోస్వామి, మధుసూధనసరస్వతి మాత్రం భక్తిని రసంగా భావించాలని వాదించారు. చిత్రద్రవము స్థాయీభావంగా మొదటివారు, భగవత్ రతిని రెండవారు భక్తికి స్థాయీభావంగాను వివరించారు. భక్తి రసానికి అలంబన విభావం భగవంతుడు, ఆయన చరిత్ర ఉద్దీపన విభావం, భగవంతుని ఆకారాన్ని చూడడం, అతణ్ని గురించే మననం చేసుకోవడం వల్ల కలిగిన భావమే రతిగా పరిణమిస్తుందనీ, ఆ సమయంలో నేత్రాది వికారాలు అనుభావములనీ, నిర్వేద,శంక,హర్షాదులు వ్యభిచారీభావాలవుతాయనీ వివరించారు. భగవంతునిలో లీనమైపోవడమే నిజమైన భగవద్రతికి సంపూర్ణమైన స్థాయి కలగడమౌతుంది. అదే నిజమైన రసస్థితిగాను చెప్పారు. దీన్ని అనుసరించి చూస్తే, తిరుప్ఫాణ్‌ శ్రీరంగనాథునిలో లీనమైపోతాడు. తిరుప్ఫాణ్‌ తన భక్తితో లోకసారంగమునిని జయిస్తాడు. కాబట్టి దీనిలోని రసం వీర రసంలోని ఒకటైన ధర్మవీరాన్ని, భక్తినీ కలిపి ధర్మవీరంగా గానీ, భక్తిధర్మవీరంగా గాని చెప్పవలసి ఉంటుంది!

‘‘మునివాహునుడు’’ నాటకంలో రచయిత సృజనీకరించిన కొన్ని పేర్లను జాగ్రత్తగా పరిశీలించాలి. వేదదత్తడు, దేవదత్తుడు, లోకసారంగముని సమాజస్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతీకాత్మకంగా పెట్టినవి. నాటకరంగంలో విశేషంగా పరిశోధన చేసిన పరిశోధకులు ఈ నాటకాన్ని ప్రాచ్చ, పాశ్చాత్య లక్షణాల్ని సమన్వయించదగినవని ప్రశంసించినా, వాటిని సమన్వయించాల్సిన అవసరం ఇంకా కనిపిస్తుంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడుదశాబ్దాల తర్వాత కూడా అస్పృశ్యులుగానే నిరాదరణకు గురౌతున్న దళితుల పరిస్థితిని ప్రతిఫలించిన నాటకంగా దీన్ని చెప్పుకోవాలి.నాటకమంతా విన్న తర్వాత లేదా చూసిన తర్వాత లేదా చదివిన తర్వాత లోకం దళితుల్ని ఎలా చూస్తున్న వాస్తవాన్ని అర్థంచేసుకుని, ఆలోచనలో పడతారు. ఈ నాటకంలో పాటలు, పద్యాలు, సంభాషణలు రచయిత ప్రతిభాపాటవాల్ని అనేకపార్శ్వాల్లో చూపిస్తుంది. అన్నింటికీ మించి వస్తువులో, దాన్ని నడిపిన తీరులో పాఠకుణ్ని ఆలోచింపజేస్తుంది. నాటకాంతం అయ్యేసరికి ఆ వాదనతో అందరూ హృదయపూర్వకంగా  అంగీకరించకతప్పనిపరిస్థితి! చదువుకుని, అధికారంలోకివచ్చినా మళ్ళీ అటువంటి సమస్యనే ఎదుర్కొంటున్న దళితుడు ఎలాంటి ఆవేదనతో బతుకుతున్నాడో ‘‘కులవృత్తి’’ కథ (2006) తెలుపుతుంది. స్వాతంత్య్రం వచ్చిన మరో మూడు దశాబ్దాల తర్వాత జరిగిన సమీక్షలా ఈ కథ మనకి అనిపిస్తుంది.

inak1

లేనిదాన్ని ఉనికిలోకి తీసుకురావడాన్ని సృజనాత్మక శక్తి అంటారు. కేవల కల్పన అనేదానికంటే భిన్నంగా సామాజిక వాస్తవిక అంశాల్ని కళాత్మకం చేయడంలోనే కవికి ఉన్న నిజమైన ప్రతిభ ప్రస్పుటమౌతుంది. ఆదిఆంధ్రుడు కావ్యం మౌలికంగా సృజనవ్యాపారానికి సంబంధించిందే. అయినా, దానిలో ఒక చారిత్రక పురుషుని కథని నిక్షిప్తం చేశారు. ఈ కావ్యం రాయడానికి ఆధారాల్ని సంపాదించిన తర్వాత కవి ఇలా వ్యాఖ్యానించారు[5]. ‘‘కాల్పనికుడుగా, జానపదగాథా నాయకుడుగా, అనాదరణకు గురైన రాయుడి జీవితం చారిత్రకంగా కనిపించసాగింది’’ ఈ కావ్యాన్నీ, అంతకుముందు మునివాహనుడు నాటకాన్నీ శ్రీకారంతోనే ప్రారంభించారు. కానీ, ప్రయోగాలతో మలుపులు తిప్పారు. క్రీ.శ. 1767 ప్రాంతానికి చెందిన భుజంగరాయుడి కథ ‘‘ఆది ఆంధ్రుడు’’ కావ్యం(2008). గుంటూరు దగ్గర్లోని చింతపల్లి, అమరావతి గ్రామాల్ని రాజధానులుగా చేసుకొని పరిపాలించిన వాసిరెడ్డి వెంకటాద్రినాయుడి ఆస్థానంలో సేనానిగా సేవలందించినవాడు భుజంగరాయుడు. అతడు మాదిగల వారసుడు. వెంకటాద్రినాయుడు చెంచుల్ని ఊచకోత కోసినప్పుడు, ఆయనతో వద్దని వాదించిన వీరుడు. దళితుల ప్రతిభాపాటవాలకు ఆదర్శప్రాయడు.వీరుడుగానే కాకుండా, కవిత్వం చెప్పడంలోను ప్రతిభావంతుడు.

ఈభుజంగరాయుని వంశానికి చెందిన వాళ్ళే రూపొందించిన పూర్ణకలశమే నేటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వలాంఛనంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు, శాసనాధారాలు ఉన్నాయి. దీన్ని తయారు చేసిందొక చర్మకారుడు. అతడి పేరు విధిక. విధిక తర్రడిపేరు నాగన. అతనికొడుకు పేరు నాగన. నాగన కొడుకు భుజంగరాయుడు. ఆచార్య నాగార్జునుడి కాలం నాటి పూర్ణకలశం కొద్ది మార్పులు చేర్పులతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ లాంఛనంగా కొనసాగుతుందంటే, నాటికే మాదిగల కళానైపుణ్యమెలాంటిదో తెలుస్తుందని గొప్ప ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించే కావ్యమిది. దీన్ని విశేషమైన పరిశోధన చేసిన తర్వాతనే కావ్యంగా మలిచారు. ఇదే పరిశోధన సృజనగా మారడమంటే. ఆధునిక తెలుగు సాహిత్యంలో,  ప్రత్యేకించి దళితసాహిత్యానికి నవ్యచైతన్యాన్ని అందించేదిశగా వెలువడిరదీ పద్యకావ్యం. 505 పద్యాల్లో, 27 శీర్షికలుగా ఈ కావ్యాన్ని వర్ణించారు ఇనాక్ గారు.

క్రీ.శ.1761లో జన్మించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, గుంటూరు దగ్గర్లోని అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఆతని ఆస్థానంలో ఉండే సైన్యాధిపతుల్లో భుజంగరాయుడు కూడా ఒకడని చరిత్రచెప్తున్న వాస్తవం. ఈ వాస్తవిక సంఘటనలకు జానపదేతివృత్తాన్ని మిళితం చేసి కావ్యం నిండా దళితసౌందర్యం గుభాళించేలా వర్ణించారు కవి. దళితుల్ని ఈ కావ్యం ఆత్మగౌరవంతో నిలబెడుతుంది. దళితులెలా తమ సాహిత్యాన్ని నిర్మించుకోవాలో ఈ కావ్యం ఒక మార్గాన్ని చూపుతుంది. ఇది దళితుల వారసత్వసంపదను, చరిత్రను, సంస్కృతిని వేనోళ్ళా కీర్తించేలా చేస్తుంది.

‘‘ఆది ఆంధ్ర ప్రాచీనాంధ్రుల్ని చెప్పటానికి వాడుతున్నారు. ఆదిద్రావిడ, ఆది కన్నడిగ వంటి పదాలతో ఆదిమవాసుల్ని గూర్చి చెప్పటానికి భారతీయులు సిద్ధమయ్యారు. ఈ పదాలు ప్రాచీనాలు కావు, ఆర్వాచీనాలు’’ (పుట: 35) అని కావ్యనామౌచిత్యాన్ని ప్రస్తావించారు కవి. ఇది వాస్తవమని చరిత్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఆది ఆంధ్ర అనేది ఒక ఉద్యమస్ఫూర్తితో పెట్టుకున్న ఆలోచనాత్మకమైన పేరు. దళితులు ఈ దేశమూలవాసులని నినదించేపేరు. గాంధీజీలాంటి వాళ్ళు హరిజనులని పేరుపెడితే ఒప్పుకునేది లేదని దాన్ని వ్యతిరేకించిన ఉద్యమం నుండి వచ్చిన ఆత్మగౌరవ నినాదమది.

దేశవ్యాప్తంగా వచ్చిన బ్రాహ్మణేతర ఉద్యమాలు, ముఖ్యంగా మద్రాసు ప్రెసిడెన్సీలో 1916నుండీ చేసిన ద్రావిడ             ఉద్యమం దళితుల ఆత్మగౌరవాన్ని పెంచింది.‘‘ ద్రవిడ ఉద్యమం ఆది ద్రావిడులు (తమిళం మాట్లాడే అంటరానివాళ్ళ కొత్తపేరు) అనే నూతన గుర్తింపునకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆది ద్రావిడులు తమంతట తాము జాతి, ప్రాంతపరమైన గుర్తింపులను సృష్టించుకునేందుకు  దారిచూపింది. ఉదాహరణకు ఆది ఆంధ్రులు (తెలుగు మాట్లాడే అంటరానివాళ్ళు), ఆది కర్ణాటక వంటివి ఈ గుర్తింపునకు ప్రాతిపదికలు. దళితులలో తామే ఈ దేశంలోని అసలు మూలవాసులం, భూమిపుత్రులం అన్న నమ్మకం. ఆది ఆన్న మాట వెనుకవున్న అర్థం యిదే. భాషాపర/ప్రాంతరమైన ఈ పేరును ప్రభుత్వం ఆ తదనంతరం గుర్తిందింది.  1931 మద్రాసు జనాభా లెక్కల ప్రకారం మాల మాదిగలు సుమారు ఆరు లక్షల మంది ఆది ఆంధ్రులుగా తమను తాము పరిగణించుకున్నారు’’ అని ‘ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర’ ( 2007: 74)లో యాగాటి చిన్నారావు వివరించారు[6]. ఈ పరిణామం 1917లో చేసిన ఒక తీర్మానం ద్వారా జరిగిందని దళిత ఉద్యమకారుడు గౌతమ్‌ వెల్లడిరచారు (అదే: 74)

1917 నవంబరు 4నుండి 6వతేదీవరకు బెజవాడ(విజయవాడ)లో మొట్టమొదటి ప్రాదేశిక పంచమ సదస్సు జరిగింది. భాగ్యరెడ్డివర్మ, సుండ్రు వెంకయ్య మొదలైన దళితనాయకులు ఆ సదస్సులో పాల్గొన్నారు.మొదటిరోజు అధ్యక్షోపన్యాసంలో భాగ్యరెడ్డివర్మ అంటరానివాళ్ళే ఈ దేశమూలవాసులని ప్రకటిస్తూ, ఇకపై పంచమలుగా కాకుండా ‘ఆది ఆంధ్రులు’గా పరిగణించాలని తీర్మానించారు. ఆనాటి నుండే కోస్తా ఆంధ్ర ప్రాంతంలో దళితులు ఆది ఆంధ్రుగా మారిపోయి, తమది ఆది ఆంధ్రోద్యమంగా భావించారని చరిత్ర చెప్తోంది[7].                ఇవన్నీ చూసినప్పుడు అందుకనే  కావ్య రచయిత ఆచార్య కొలకలూరి ఇనాక్‌  ‘ఆది ఆంధ్రుడు’ అనే పేరు అర్వాచీనమని పేర్కొన్నారని స్పష్టమౌతుంది. ఆదిఆంధ్రుడు అనిపేరు పెట్టడంలో ఈదేశమూలవాసులను స్పురింపజేస్తూనే, దళితుల ఆత్మగౌరవాన్ని నినదించే ప్రయత్నంగా కనిపిస్తుంది.

‘‘వసుచరిత్ర’’ ప్రబంధకారుడు శుభమూర్తిపై ఆచార్య ఇనాక్ గారు చేసిన మరో మౌలికమైన పరిశోధన. ఇది పరిశోధన గ్రంథమైనా, విమర్శక దృక్పథం ఉండటం వల్ల దీన్ని పరిశోధనాత్మక విమర్శ గ్రంథంగా పిలవడం సమంజసం. పరిశోధనలో సాధారణంగా అన్వేషణ, ఏదైనా ఒక కొత్తవిషయాన్ని బయటపెట్టడం, సిద్ధాంతాన్ని స్థాపించడం లేదా ఒక విషయాన్ని సూత్రీకరించడం ముఖ్యం. వీటిలో అంతర్భాగంగానే కనిపిస్తున్నా, గుణ,దోష విశ్లేషణ, నిర్ణయ ప్రకటన విమర్శలో ప్రధానంగా చూడాలి.

పరిశోధనలో కనిపించే  అన్వేషణ, సమాచార సేకరణ విమర్శలో అంతగా కనిపించవు. లభించిన సమాచారాన్ని విశ్లేషించి, తులనాత్మకంగా పరిశీలించి, తనదైన దృష్టితో వ్యాఖ్యానించి, అది గుణమో, దోషమో ఒక నిర్ణయాన్ని ప్రకటించడం విమర్శస్వభావం. ఈ రెండు స్వభావాలు సంతరించుకుంటే దాన్ని పరిశోధనాత్మక విమర్శ అనొచ్చు. అలా రెండు లక్షణాల్ని సంతరించుకున్న గ్రంథం ‘‘శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం’’(1996). తన పేరు శుభమూర్తి, మూర్తికవి అని ‘వసుచరిత్ర’ కారుడు చెప్పుకున్నా, అతణ్ణి ‘‘భట్టుమూర్తి’’, ‘‘రామరాజభూషణుడు’’ అని నాటి నుండి నేటి వరకూ పండితలోకం పిలవడంలో ఒక శూద్రుణ్ని కవిగా గాని, అతని పేరుతో గాని పిలవడానికిష్టపడని వర్ణాధిక్యాన్ని సోదాహరణంగా నిరూపించారు. శుభమూర్తిలో కవిలోకం పట్ల దళిత, బహుజనులు అలవరుచుకోవలసిన ప్రతిఘటన చైతన్యాన్ని గుర్తించేలా గ్రంథాన్ని సాధికారికంగా రాశారు.

పరిశోధనాత్మక స్పర్శతోనే  రాసిన మరో విమర్శ గ్రంథం ‘‘ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం’’ (1996) తెలుగు వ్యాసం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే, ఈ రంగంలో చేసిన ఇనాక్‌ గారి వ్యాసపరిణామాన్ని ఎలా పేర్కొంటారో, అలాగే ఆధునిక సాహిత్యాన్ని విమర్శించేందుకున్న నూతన సూత్రాల్ని ప్రతిపాదించిన ఈ గ్రంథాన్నీ పేర్కొనదగిన పుస్తకం. మార్క్సిజం గాని, కేవల మానవతావాదంతో గాని విమర్శించడానికి వీల్లేని పూర్తి దేశీయ విమర్శ పద్ధతిలో మాత్రమే విమర్శించదగినది దళితసాహిత్యం. తాను దళితసాహిత్యంపై పరిశోధన చేస్తూ, విద్యార్థుల చేత కూడా చేయిస్తూ వస్తున్న క్రమంలో వెలువడిన ఆణిముత్యాల్లాంటి విమర్శపద్ధతుల్ని ప్రతిపాదించారు. సాహిత్యవిమర్శకు తెలుగు సాహిత్యం అందించిన మహోన్నత వారసత్వసంపదగా దీన్ని చెప్పుకోవచ్చు.

సాహిత్య విమర్శలో ఆంగ్లేయుల ఇమేజినేషన్‌ నే తనదైన పద్ధతిలో చెప్పి, దానికి సామాజిక కోణాన్ని అందించి కట్టమంచి రామలింగారెడ్డి విమర్శకు ఆధునికతను ఇచ్చాడు. మళ్ళీ విమర్శకు అంతటి గౌరవాన్నిచ్చిన పరిస్థితి ఆచార్య ఇనాక్‌ గారికే చెందుతుంది. మార్క్సిజంలోని ఆర్థికాంశాల్ని, దేశీయతాభూమికతో రూపొందిన అంబేద్కర్‌ కులనిర్మూలనా చైతన్యాన్నీ మేళవించి సాహిత్యాన్ని సమన్వయించినప్పుడే స్త్రీవాద, దళిత సాహిత్య విలువల్ని శాస్త్రీయంగా అంచెనా వేయగలమని నిరూపించారు. అంతవరకూ చర్చలో కొచ్చిన వస్తు, రూపాలు, నిబద్ధతలతో పాటు నిమగ్నత, నిబిడితలను ప్రతిపాదించారు. తాను రాసే రచనల్లోని జీవితానికి వ్యతిరేకమైన జీవితం ఉంటే రచయితకు నిబద్దత ఉన్నట్లు కాదు. రాసే వస్తువుతో తాదాత్మం చెందడమనే నిమగ్నత సాహిత్యానికి విలువల్ని అందిస్తుంది. తాను రాసే వస్తువుకీ, తన జీవితానికీ అవినాభావ సంబంధమున్నట్లైతేనే నిబిడితతో కూడినట్లవుతుంది. ఈ మూడు లక్షణాలు సమ్మేళనంతో సాహిత్య విమర్శ చేయడమనేది ఇనాక్‌ గారితోనే ప్రారంభమైంది. ఆ సూత్రమే ప్రధానకేంద్రంగా స్త్రీవాద, దళిత సాహిత్య విమర్శ చేయగలిగితేనే అది శాస్త్రీయమైన విమర్శపద్ధతి అవుతుంది. లేకపోతే స్త్రీవాద, దళిత సాహిత్యాల్ని సంస్కరణ, మానవతావాద, మార్క్సిస్టు పద్ధతుల్లో విమర్శించించినట్లే అవుతుంది.

ఇలా పరిశోధనలోను, విమర్శలోను ఒక మైలురాయిగా నిలవదగిన స్థాయిలో కృషిచేసిన ఇనాక్‌ గారు సృజనాత్మక సాహిత్యంలోనూ తనదైన ముద్ర వేయగలిగారు. తెలుగులో చక్కని, చిక్కని, చిన్న చిన్న వాక్యాల్లో అందంగా రాయడమెలాగో తెలుసుకోవాలంటే ఇనాక్‌గారి వచన రచన చూడాల్సిందే. సృజనాత్మక రచనల్లో మునివాహనుడు, ఊరబావి, తలలేనోడు, కులవృత్తి వంటి రచనలు ఆయన మాత్రమే రాయగలరనిపిస్తుంది.. ఇలా ఆచార్య కొలకలూరి ఇనాక్‌ గారి సాహిత్యాన్ని లోతుగా విశ్లేషించుకుంటేనే ఆయన సాహిత్య తత్త్వం వెల్లడవుతుంది. ప్రధానజీవన స్రవంతికి దూరంగా జీవిస్తున్న దళితుల్లో ఆత్మగౌరవాన్ని రగుల్గొల్పడం ఆయన సాహిత్యంలో గుర్తించాల్సిన అత్యంత ముఖ్యమైంది. అది కథలు, నాటకాలు, కావ్యాలు, కవితలు, వ్యాసాల ద్వారానే కాకుండా చక్కని ఉపన్యాసం ద్వారా కూడా సమర్థవంతంగా నిర్వహించగలిగారు.

ఆధారాలు:

1. ఆచార్య కొలకలూరి ఇనాక్‌  షష్టిపూర్తి సన్మాన సంచిక, 1999

2. ఇనాక్‌, కొలకలూరి. తెలుగు వ్యాసపరిణామం. 1980

3. ఇనాక్‌, కొలకలూరి.ఆదిఆంద్రుడు . హైదరాబాద్‌: జ్యోతి గ్రంథమాల. 2008

4.యాగాటి చిన్నారావు, ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర’ ,  హైదరాబాదు బుక్ ట్రస్టు, 2007



[1] ఆచార్య కొలకలూరి ఇనాక్‌  షష్టిపూర్తి సన్మాన సంచిక, 1999:25

[2] తెలుగు వ్యాసపరిణామం 1980: 172

[3] ఆరుద్ర, సమగ్ర ఆంధ్రసాహిత్యం రచనను ఇలా మొదలు పెట్టారు. ‘‘ అనగనగా ఒక ఈగ ఇల్లలుక్కొంటూ తన పేరు మరిచిపోయిందట.‘ పేదరాశి పెద్దమ్మ! పేదరాశి పెద్దమ్మ కొడుకా! కొడుకు చేతి గొడ్డలీ!.. నాపేరేమిటి? అని ఎందరెందరినో పేరు పేరునా వరసపెట్టి అడిగిందట.. ‘‘ సమగ్ర ఆంధ్రసాహిత్యం (తొలిముద్రణ,) సికింద్రాబాదు: యం.శేషాచలం అండ్‌ కంపెనీ, 1965:1

[4]సూర్యనారాయణ శాస్త్రి, సన్నిధానం. ( వివరణ కర్త). కావ్యాలంకార సంగ్రహం, సికింద్రాబాదు:యం.శేషాచలం అండ్‌ కంపెనీ, 1976:123

 

[5] ఆదిఆంద్రుడు 2008 : 14

[6] ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర’  2007: 74

[7] ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర, 2007: 114

 – డాక్టర్  దార్ల వెంకటేశ్వర రావు

149210_460277764346_7996594_n

గృహ హింస – కొలకలూరి ఇనాక్ కథ

(ఆచార్య కొలకూరి ఇనాక్ కు పద్మశ్రీ లభించిన సందర్భంగా ఆయన రాసిన ” గృహహింస” కథ ను పునర్ముద్రిస్తున్నాము.)

 సాయంకాలం పెందలాడే ఇంటికి వస్తూ డజను అందమైన పార్శిల్ ప్యాకెట్లు తెచ్చి డబుల్‌కాట్ నిండా పరచిపెట్టాడు కృష్ణమూర్తి. అంతకు ముందే నిద్రలేచిన సరళ ముఖం కడుక్కొని వచ్చి వాటిని చూసి కంపెనీనుంచి భర్త ముందుగా వచ్చినందుకు మురిసిపోతూ “ఇవ్వి?” అంది.

“నీకే!” అన్నాడు.

ఒక పార్శిల్ విప్పింది. కోతి బొమ్మ. ఊలుది. తోక మూరెడు. ముందు కాళ్ళు పొడుగు,వెనక్కాళ్లు కురచ. ఇటువంటి బొమ్మే తాని అత్తవారింటికి వ తెచ్చుకుంది. రెండు ముంగాళ్ళు మెడచుట్టూ, తోక నడుం చుట్టూ చుట్టుకుని కోతిని వీపుమీద కూర్చోబెడితే, అది ముఖంపెట్టి ముద్దిస్తూ ఉంది.

మిగతా పార్శిళ్ళు విప్పింది సరళ. టెడ్డీబేర్! ఎంత బాగుందో! స్కూలుకెళ్ళే పాప గాజుబొమ్మ! ముచ్చటగా వుంది. పల్లెపడుచు! ప్లాస్టిక్ బొమ్మ! కళ్లెంత చక్కగా ఆర్చుతుంది! మూస్తూ తెరుస్తూ వుంది.

ఆనందంగా వాటి వంక చూస్తూ –

“ఎందుకివన్నీ?”     “నువ్వాడుకోవడానికి!”     “నువ్వున్నప్పుడు నీతోనే ఆడుకోవడం!”     “నేను కంపెనీకి పోయినప్పుడు?”

“మీ బొమ్మలతో ఆడుకుంటా! అయినా ఒకేసారి ఇన్ని బొమ్మలెందుకు” అంటూ షోకేసులో సర్దింది.

 

* * *

 

ఆ రోజు సాయంకాలం త్వరగా వచ్చి మంచమంతా పాకెట్లు పెట్టి సరళను నిద్రలేపాడు కృష్ణమూర్తి.

ఆమె కళ్లు నులుముకుంటూ, ఆవులిస్తూ చీర సరిచేసుకొంటూ, తల సవరించుకొంటూ, కళ్ళూ మూస్తూ తెరుస్తూ భర్తను “వచ్చేశారా” అంటూ వాటేసుకొంది. ఆమెను వాష్‌బేసిన్ దగ్గరకు తీసుకుపోయి, ముఖం కడిగి, తల జుట్టు వెనక్కు పెట్టి టవలు ముఖం, చేతులుల్, మెడ తుడిచి, మంచం దగ్గరకు తీసుకువచ్చి, వాటిని చూపించాడు కృష్ణమూర్తి.

“ఏవిటీ?” అంది.

 

“చూడు” అన్నాడు.

విప్పసాగింది. మైసూర్‌పాక్! మెత్తగా తన పెదవిలాగా వుంది. కొరికింది. కొరికించింది. హల్వా! బుగ్గలాగా వుంది. రుచి చూసింది. చూపించింది.

బందరు లడ్డు! జవజవలాడుతూ వుంది. పట్టుకొంటే పగులుతుందా అనిపించింది. పగిలి కిందపడకుండా కొరికింది. భర్తకు ఎంగిలి తినిపించింది.

“ఇంక తినలేను” అంది.

“తినాల్సిందే” అన్నాడు.     “కష్టం బాబూ!”     “ఇద్దరం కష్టపడదాం!”     అన్ని పాకెట్లు విప్పింది. మిగతావి రుచి కూడా చూడలేదు. “ఇన్నా? ఒకేసారా? ముఖం మొత్తదా?” అంది.     “నీకు స్వీట్లు ఇష్టం కదా!”     “ఇష్టమని – ఇన్నా?”     “రోజంతా తింటూ వుండు”    “కడుపా? చెరువా?” అనడిగి “కడుఫే!” అని నవ్వింది.     ఆమె నవ్వుకి వంత నవ్వాడు కృష్ణమూర్తి.

* * *

 

ఆరోజు మధ్యాహ్నమే ఇంటికొచ్చాడు కృష్ణమూర్తి. వస్తూ అయిదుగురు ఆడవాళ్ళను తీసుకొచ్చాడు. ఒక్కక్కరు ఒక్కొక్క గోనెసంచి తెచ్చారు. ప్రతి గోనె తడిగా వుంది. నీటిబొట్లు పడుతున్నాయి.

ఆడవాళ్ళు గోనెసంచులు బెడ్‌రూంలో దించి నిలబడ్డారు. భోజనం చేసి ఆవులిస్తూ పడుకోబోతున్న సరళ భర్తను, బస్తాలనూ, స్త్రీలనూ చూసి అడిగింది.

“ఏమిటి?”         “చూడు!” అన్నాడు.         ఆడవాళ్ళు బస్తాల్లో ఉన్నవాటిని అయిదు సిరిచాపల మీద కుమ్మరించి వాటి ముందు కూర్చున్నారు.

మల్లెలు! బొండుమల్లెలు! సన్నజాజులు! గులాబీలు! సరళ చప్పున మల్లెలు దోసిళ్ళతో ఎత్తుకుంది. బొండుమల్లెలు గుండెలకు హత్తుకుంది. సన్నజాజులు చెక్కిళ్ళకు తాకించుకుంది. కనకాంబరాలు స్వర్ణాంబరాలు లాగ తీసి చూసింది. గులాబీలు చూస్తూ కూర్చుండిపోయింది. కృష్ణమూర్తి ఆమెనే చూస్తున్నాడు. పూలు తెచ్చిన స్త్రీలు పూలు మాలలు కడుతున్నారు. చెండులు, దండలు కడుతున్నారు.

“ఏం ఫంక్షనూ?” దీర్ఘం తీసింది.

“శ్రీమతి సంతోష ఫంక్షన్”

 

“అంటే?”

“అవన్నీ నీకే!”         “నాకా?”         “ఊ నీకే!”         “ఇన్నా?”         “అన్నీను!”         “ఏం చేసుకోను”         “తల్లో పెట్టుకో! మెళ్ళో వేసుకో! మంచం మీద పరుచుకో! దేవుళ్ళకు వేసుకో! ఇంకా మిగిలితే-”         “ఆ మిగిలితే?”         “ఫ్రిజ్‌లో పెట్టుకో”         “పూలు – ఫ్రిజ్‌లోనా?”

సరళ నవ్వుతూ వుంది. ఎంత చక్కగానో నవ్వింది. పూలులాంటి నవ్వు. పరిమళం లాంటి నవ్వు. పరవశం లాంటి నవ్వు. గదంతా వ్యాపించిన నవ్వు. సరళ కరిగిపోతున్న మంచుముక్కలా, మంచి ముత్యంలా, మధుర దృశ్యంలా నిలబడింది. కృష్ణమూర్తి తనివితీరా సరళ సుందర రూపం చూస్తూ పులకించిపోయాడు.

* * *

 

కృష్ణమూర్తి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. కోట్ల వ్యాపారం. కోటానుకోట్లు లాభం. లెక్క తెలియనంత ఆస్తి. పిచ్చిపట్టే సంపద. ఏం చేసుకొంటారు?         ఎం.బి.ఏ. తర్వాత వ్యాపారం చూసుకుంటూ క్షణం తీరిక లేకుండా వుంటున్నాడు. పెళ్ళయి సంవత్సరమైనా ఇంటి ముఖం చూడకుండా కంపెనీ పనులతో తలమునకలై వుండేవాడు కృష్ణమూర్తి. తల్లిదండ్రులకు కొడుకులో వచ్చిన ఈ మార్పు అర్థం కావటం లేదు.

* * *

 

        మర్నాడు కంపెనీకి పోయి గంట కూడా ఉండకుండా ఇంటికి తిరిగి వచ్చాడు కృష్ణమూర్తి. అతడి కారుతో పాటు వ్యాను వచ్చింది. వ్యానులోంచి నలుగురు సేల్స్మేన్లు ఇద్దరు స్త్రీలు వచ్చారు. వ్యాన్లోని ప్యాకెట్లు దించి ఇంట్లోకి తెచ్చి ఒక్కొక్కటిగా పడకగదిలో చాపలమీద పరిచారు. 

            అన్నీ చీరలు! జాకెట్ గుడ్డముక్కలు! 

                సరళ చూసి మురిసిపోయింది. చీరలు విప్పింది. కొన్ని తీసి పక్కన పెట్టింది. కొన్ని ఎదమీద వేసుకుని చూసింది. మంచిరంగులు. చాలా వెరైటీలు. 

       “ఎవరికి?” 

 

       “నీకే!” 

 

       “బంధువులకు పంచాలా?” 

 

       “నువ్వే కట్టుకోవాలి!” 

 

       “అన్నీనా?” 

 

       “అన్నీ!” 

 

       “కొన్ని సెలక్ట్ చేసుకొంటాను!” 

 

       “అన్నీ సెలక్ట్ చేశాను!” 

 

       “ఇన్నా!” 

 

       “ఆ! ఒక్కొక్క రంగు, ఒక్కొక్క వెరైటీ చొప్పున తెచ్చాను. ఏ రంగు, ఏ వెరైటీ రెండోది ఉండదు” 

 

       “మీ టేస్ట్ గ్రేట్”

 

“థాంక్స్!”

“రంగులు బాగున్నాయి”        “థాంక్స్!”        “పల్లు ఎక్సలెంట్!”        “థాంక్స్!”        “వెరైటీలు సుపర్బ్”        “థాంక్స్!”        “అసలు మీరే నచ్చారు”        “థాంక్స్!”        “వీళ్ళు?”        “సేల్స్ మేన్లు!” వాళ్ళు వెళ్ళిపోయారు.        “వీళ్ళు?”        “టైలర్స్!” వాళ్ళు నిలబడిపోయారు.        “కుట్టుమిషన్లు తెచ్చుకొన్నారు”        “ఎందుకు?”        “ఇక్కడే కుడతారు. ఇష్టమైనట్లుగా కుట్టించుకో!”        “ఎప్పుడు వేసుకోవాలి?”        “రోజూ!”        “ఎన్ని?”        “రోజుకు నాలుగైదు!”        “సరా?”        “సరే!”        “ఒకదానిమీద మరొకటి – ఒక చీరమీద మరొకటి, అంతేనా?”        “సరే!”        “ఎందుకూ?”        “సంతోషం కోసం!”        “నువ్వు కట్టుకోవాలి సరళా నా ఆనందం కోసం”        “నాకోసం కాదా?”        “నీకోసం కూడా – నీకోసమే! నీకే!”

 

* * *

 

మర్నాడు పొద్దుపోయేదాకా కృష్ణమూర్తి ఇంటికి రాలేదు. ఆత్రంగా ఎదురుచూస్తున్న సరళ అతడి కారు హారను వినబడగానే గబగబ మెట్లుదిగి కృష్ణమూర్తికి ఎదురు వెళ్ళి పోర్టికోలో దిగుతున్న అతని బ్రీఫ్‌కేసు తీసుకుంది.         “ఇవాళ ఏమీతేలేదా?”         “రా”         “రా”         “ఎందుకింతసేపు?”         “రా”         వాళ్ళు బెడ్‌రూంలో చేరగానే జ్యూయలరీ షాపు వాళ్ళు నలుగురు మోయగలిగినన్ని బాక్సులు తెచ్చి మంచమ్మీద విడివిడిగా పెట్టారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఏమిటివన్నీ అన్నట్లు నొసలు ఎగరేసింది.

 

“నగలు!” అన్నాడు.         చకచకా విప్పింది. ఒక్కొక్కటీ చూసింది. అన్నీ మంచం మీద పేర్చి తదేకంగా పరికించింది. బంగారు ఆభరణాలు. వజ్రాలు పొదిగినవి. ముత్యాలు, రత్నాలు కలిపి చేసినవి – మెడకు, ముక్కుకు, చెవికి, తలకు, చేతులకు, నడుముకు అలంకరించుకొనే ఆభరణాలు. అవన్నీ వేసుకొంటే అందమైన సరళ ఒంగిపోయి గూనిది అవుతుంది. వాటి బరువు గ్రాముల్లో కానీ, వాటి విలువ వేలల్లో కానీ చెప్పడం కుదరదు.         “ఎన్ని కేజీలు?”         “ఇంచుమించుగా వంద!”         నగలు వేసి చూసుకోసాగింది సరళ. మెడ – అద్దం, ముక్కు – అద్దం, చెవి – అద్దం, తల – అద్దం, మూతి – అద్దం, శరీరమంతా – అద్దం, ఆభరణాలన్నీ – అద్దం, వేసుకొని, చూసుకొని, అద్దంలో చూసుకుని, అటు తిరిగి, ఇటు తిరిగి, అలసి పోయి, మంచం మీద కూలబడి రొప్పడం మొదలు పెట్టింది సరళ.

 

“ఎందుకండీ ఇన్ని?”         “అలంకరించుకో”         “ఎన్నని?”         “కొన్ని కొన్ని!”         “ఎప్పుడెప్పుడు?”         “బుద్ధి పుట్టినప్పుడు”         “ఇన్ని నగలతో వీధిలోకి రాలేను”         “ఇంట్లోనే ఉండు”         “ఇంట్లో ఉండటానికి ఇన్ని నగలా?”              “ఇష్టమైతే వేసుకో, లేకుంటే దాచుకో”         “దాయడానికి నగలెందుకు?”         “వేసుకో!”         “ఎన్నని?”         “అన్నీ!”         “ఎప్పుడు?”         “ఎల్లప్పుడూ!”         “నేనూ మనిషినే!”         “దేవతవు!”

* * *

 

సరళ పొద్దున్నే లేస్తుంది. రోజుకొకలా చీర కట్టుకుంటుంది. బుద్ధి పుట్టినన్ని నగలు అలంకన్రించుకుని భర్తను ఆదరంగా కంపెనీకి పంపుతుంది. వెంటనే నగలు తీసివేస్తుంది. చీర మారుస్తుంది. సుఖంగా ఉండే నూలు చీర కట్టుకొంటుంది.

సాయంకాలం భర్త వచ్చే సమయానికి పట్టుచీర కట్టుకొంటుంది. అలమారాడు నగలు పెట్టుకొంటుంది. తల నిండా పూలు పెట్టుకొంటుంది. ఇంటినిండా స్వీట్లు వుంచుతుంది. మంచం దగ్గర పండ్లు వుంచుతుంది. పడకగది నిండా బొమ్మలు షోకేసులో ఉంచి, గోడలమీద విలువైన పెయింటింగులు అలంకరిస్తుంది.         వీళ్ళిద్దరి పరిస్థితి చూసి కృష్ణమూర్తి తల్లిదండ్రులు శుభవార్త చెబుతారని ఎదురుచూశారు. ఎంతకీ చెప్పడం లేదు. వాళ్ళు ఉండబట్టలేక అడగనే అడిగారు. కోడలు సిగ్గుపడింది. సిగ్గుపడింది కాబట్టి శుభమే అనుకొన్నారు.         “పిల్లల తల్లివి కాబోతున్నదానివి మెట్ల మీద ఎగురుతూ, దూకుతూ దిగొద్దు, ఎక్కొద్దు” అన్నారు.         నవ్వింది. ఐనా అలాగే మెట్లెక్కుతూ దిగుతూ వుంది.         “అదేం?” అంటే         “అదేం లేదు” అంది.         “అదేం?” అంటే         “అదేమో” అంది.         “పెళ్ళయి సంవత్సరం దాటింది. ఇంకా అదేమో అంటావేంటి?” అని అత్తామామలు సరళని నిలదీశారు. అప్పుడే వచ్చాడు కృష్ణమూర్తి.         “ఇంతదాకా నన్నుగురించి ఆయన ఆలోచించలేదు. పదిరోజుల్నుంచి ఇలా నన్ను ఆనందింపజేస్తున్నారు. పాపం ఆయనకు తీరుబడేది?” అంది.

అత్తా మామలే కాదు, భర్త కూడా బిత్తర పోయారు.

 

* * *

 

        ఆ రోజు నుంచి కృష్ణమూర్తి కంపెనీకి పోలేదు. సరళ చెంగు వదల్లేదు. రాత్రంతా గదిలో మాటలు, పాటలు. నిద్రలేదు. పగలు భర్త బయటికి పోయినప్పుడే సరళకు నిద్ర. పగటి నిద్రకోసం అతనౌఅ ఆఫీసుకు పోతున్నాడు. కంపెనీలో ఎమ్.డి నిద్రపోవడం ఏమిటని వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు.

చీరలు, నగలు సింగారించుకొని సరళ, భర్తతో వీధిలోకి పోతుంది. అవీ ఇవీ కొనే నెపంతో రోడ్లన్నీ నడచీ, ఎక్కీ దిగీ అలిసిపోయి ఇల్లు చేరుతున్నారు. అది లాకీగా లేదని మానేసి, ఇద్దరూ కార్లో పోయి చైనీస్ హోటల్లో తిని, తేనుస్తూ ఇంటికి చేరి ఆయాసపడుతున్నారు. అదీ కాదంటే ఫష్టు షో లేదా సెకండ్‌షో సినిమా చూసి ఇంటికొచ్చి పడుకుంటున్నారు.

ఇవేవీ బాగాలేవని ఇంటిపట్టునే వుండి సరళకు తినిపిస్తూ పళ్ళరసాలు తాగిస్తూ వున్నాడు కృష్ణమూర్తి.         “నా ఆరోగ్యం బాగుంది” అంది సరళ.         “నువ్వు సుఖంగా ఉండాలి” అన్నాడు కృష్ణమూర్తి.         పెళ్ళయిన మొదటిరోజుల్లో హనీమూన్‌కు పొమ్మంటే కంపెనీ పనుల తొందర వల్ల భార్యను తీసుకుపోలేక పోయాడు, కృష్ణమూర్తి. అందుకు బదులుగా హనీమూన్‌కు పోదామని భార్యతో అంటే “ఇప్పుడొద్దు బాగుండదు” అంది. సరే తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, గుళ్ళు, గోపురాలు అని తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, భద్రాచలం తీసుకెళ్ళి తిప్పి తీసుకువచ్చాడు.         పూరి, కాశీ, ప్రయాగ, హరిద్వార్, బదరీనాథ్,కేదారనాథ్ చూపించి తీసుకొచ్చాడు.         అంతటితో ఆగకుండా సింగపూర్, మలేషియా, బర్మా, సిలోన్, థాయ్‌లాండ్, రష్యా, చైనా, కెనెడా, అమెరికా, ఆస్ట్రేలియా తిప్పి తీసుకువచ్చాడు.         “ఇన్ని ప్రయాణాలు, ఇంత వేగంగా, ఇంత దూరం, ఇన్ని విధాలుగా, ఇంత నిర్విరామంగా నేను చేయలేను”         అలసి పోయి ఇంటికి వచ్చారు. మర్నాడు పొద్దున్నే భార్యను చూసి బిత్తరపోయాడు కృష్ణమూర్తి.

 

“ఇన్ని చీరలు నేను కట్టను!”         “ఏం?”         “ఇన్ని నగలు నేను పెట్టుకోను”         “అంటే”         “ఇన్ని స్వీట్లు నేను తినలేను. ఇంత ప్రయాణం నేను చేయలేను. ఇన్ని సినిమాలు నేను చూడలేను. ఇన్ని బొమ్మలతో నేను ఆడుకోలేను. ఇన్ని పేయింటింగులు నేను గోళ్ళమీద పెట్టలేను. ఇంత మెలకువ నాకు వద్దు. నేను నిద్రపోవాలి”         కృష్ణమూర్తి బిత్తర పోయి చూశాడు.

 

“ఒక బొమ్మ ఇస్తే ఆనందం. అన్ని బొమ్మలు ఒకేసారి ఎందుకు? ఒక స్వీటు తినిపిస్తే ముచ్చట. అన్నా? అజీర్ణం కాదూ! ఒక పూవో, మాలో తెచ్చి తలలో పెడితే సంతోషం. గోతాలకొద్దీ పూలా? తృప్తిగా ఒక చీర! ఒక జాకెట్టు సంతోషం. అన్నా? వెగటు కాదూ! ఒక నగ – ప్రేమ. ఒక ఊరు, ఒక తీర్థం, ఒక క్షేత్రం. సంతృప్తి! అన్ని చోట్లా! అంత ప్రయాణమా? అంత తిరుగుడా! అలిసిపోమూ! విసుగు కాదూ! పిచ్చి పట్టదూ! నాకేమీ వద్దు!”

 

“మరేం కావాలి?”

“నా ఇష్టం వచ్చినట్లు పదిరోజులు నన్నిట్లా వుండనివ్వండి. పాటలు వద్దు. సినిమాలు వద్దు. చీరలొద్దు. నగలొద్దు. పదిరోజులు నిద్రపోనివ్వండి. మీరు నా ప్రక్కనే వుండండి.”         “తిండి, తీర్థం?”

“నాకేమీ ఇవ్వద్దు. మీరేమీ కల్పించుకోవద్దు. నా ఇష్టం వచ్చినట్లు నన్ను ఉండనివ్వండి”

 

“మరి నేను?”         “నా వెంట వుండండి. నేను కోరినట్లు నేను చెప్పినట్లు చేయండి. నాకు నిశ్శబ్దం, ప్రశాంతత, ఏకాంతం కావాలి. నాకు శూన్యం కావాలి. ఏమీ వద్దు. ఏమీ లేని తనం కావాలి. ఏమీ లేకుండా వుండాలి”         కృష్ణమూర్తి భయం భయంగా చూశాడు.

సరళ ఏమీ తినలేదు. తాగలేదు. పాటల్లేవు. మాటల్లేవు. శబ్దం లేదు. శూన్యం. నిద్రపోయింది.

 

రెండు రోజులు మూసిన కన్ను తెరవకుండా పడుకున్న మనిషి లెవకుండా నిద్రపోయింది సరళ. బుద్ధి పుట్టినప్పుడు లేచి రెండు బిస్కెట్లు తిని, మీళ్ళుతాగి మళ్ళీ పడక. మళ్ళీ నిద్ర. ఏ సుఖాలూ కోరుకోవడంలేదు. ఏ సంతోషమూ పొందడం లేదు. ఏ చీరలు, ఏ నగలు, ఏ పూలూ ఏమీ వద్దు.         నిముషంలో పళ్ళు తోముకుంటుంది. అర్థ నిమిషంలో నీళ్ళు పోసుకొంటుంది. పావు నిమిషంలో మంచం మీద పడుతుంది. మరి రోజంతా లేవదు. లేపినా లేవదు. కూర్చోబెట్టినా కూర్చోదు. బట్టలు మార్చుకోదు. నూనె పెట్టుకోదు. ముఖం కడుక్కోదు. పౌడరు రాసుకోదు. అలంకరించుకోదు. కూర్చోదు. పడుకొనే వుంటుంది. నిద్రపోతూనే వుంటుంది.         “ఇది ఏమైనా జబ్బా?” కృష్ణమూర్తి భయం.         ఫామిలీ లేడీ డాక్టర్ని పిలిపించారు. వచ్చి పరీక్షించింది. అంతా నార్మల్, ఏమీ లేదని వెళ్ళిపోయింది.         స్త్రీల స్పెషలిస్టును పిలిపించాడు. పరీక్షలు అన్నీ చేసి “ఆమెను స్వేచ్చగా ఉండనివ్వండి” అంది.

సైకియాట్రిస్టును రప్పించి పరీక్షలు చేయించాడు. సమస్య ఏమీ లేదని వెళ్ళిపోయాడు.

 

మళ్ళీ ఫ్యామిలీ లేడీ డాక్టరును అర్థించాడు. ఆమె వచ్చి చూసి, “కొందరంతే!” అని అంది.

కృష్ణమూర్తికి కోపం వస్తూ ఉంది. తల్లి దండ్రులు కూడా సరళ గురించి పట్టించుకోవడం లేదు. రెండు వారాల తర్వాత ఒక రోజు నిద్ర లేచి భర్తను చూస్తూ “దగ్గరే ఉన్నారు కదా! అంతే చాలు” అంది.         కృష్ణమూర్తి వొళ్ళు మండింది. “ఎంత చాలు?”         సరళ నవ్వింది. సరళంగా, సరసంగా నవ్వింది.         ఉండబట్టలేక అడిగాడు. “ఎందుకిట్లా ఉన్నావు?”

ఆమె బదులుచెప్పకుండా “మీరు ఎందుకట్లా ఉన్నారు?” అని ప్రశ్నించింది.

 

“ఏమీంది నీకు?”

“మీకేమైంది?”         “ఈ రెండు వారాలు నన్నేడిపించావు”         “నాలుగు నెలల నుంచి మీరు నన్నేడిపించారు”         కృష్ణమూర్తి శూన్యంగా సరళ వైపు చూశాడు.         “పెళ్ళయిన సంవత్సరమంతా మీరు బాగానే వున్నారు. ఈ నాలుగు నేలలనుంచి మీరెందుకింత గందరగోళంగా ప్రవర్తించారు?” అడిగింది.         అతను ఆలోచించుకోసాగాడు.         “ఈ మధ్య గృహహింస చట్టం వచ్చింది. తెల్సా?”         “తెలుసు. అందుకే సంతోష పెడదామని”         “అంతకు ముందు సంవత్సరమంతా?”         “సుఖంగా లేవు!”         “అంటే?”         “కష్టంగా వున్నావు!”         “అంటే?”         “నేను నిన్ను పట్టించుకునే వాణ్ణి కాదు. కంపెనీ పనులతో తలబద్దలు కొట్టుకొంటూ, నువ్వు వున్నా లేనట్లుగానే నా తలనొప్పులు నేను పడుతూ నిన్ను అశ్రద్ధ చేస్తూ వచ్చాను. నీపట్ల తగిన శ్రద్ధ చూపించక పోవడం గృహహింసే! నువ్వు నాది గృహహింస అని పోలీసులకు చెబితే, నన్ను వాళ్ళు అరెస్టు చేయవచ్చు”         “అందుకని?”

“నీకిష్టమని బొమ్మలు, స్వీట్లు, పూలు, బట్టలు, నగలు కొని ఇచ్చాను. పుణ్యక్షేత్రాలు, తీర్థాలు తీసుకుపోయాను. దేశవిదేశాలు అన్నీ తిప్పి చూపించాను. నీకు కావలసినవన్నీ సమకూర్చాను. కొట్టక, తిట్టక వేధించక కట్నం డబ్బు ఇంకా తెమ్మని సతాయించకపోతే గృహహింస లేనట్లే! కిరసనాయిలు పోసి కాల్చి చంపకపోతే గృహహింస లేనట్లే కదా!” అన్నాడు కృష్ణమూర్తి. “కష్టాలు తీరకపోవడమే కాదు, సుఖాలు, సరదాలు కొత్తకోడలికి ముఖ్యం. అవి లేకపోతే గృహహింసే!” అన్నాడు.

 

“పెళ్ళయిన సంవత్సరమంతా నేను సుఖంగానే వున్నాను. ఇటీవలే నాకు గృహహింస ప్రారంభమైంది. ఇప్పుడు పోలీసులకు రిపోర్టు ఇవ్వాలి” అంది.

“అయ్యో అదేమిటి సరళా?”         “మీరు నాకు ఏమి ఇస్తే సుఖంగా వుంటానని అనుకున్నారో అవన్నీ ఇచ్చారు. అవి నాకు కావాలో వద్దో మీరు ఆలోచించలేదు. వాటిని నేను భరించలేకపోయాను. భరించలేకపోతే బాధే! బాధ కలిగితే హింసే! తేనె స్పూనుతో చప్పరిస్తే రుచి. తేనెతో స్నానం రోత! నాకు మీ ప్రేమ రోతగా మారింది. మీరు పెట్టిన ఈ గృహహింస మీద పోలీసులకు రిపోర్టు ఇస్తాను”         “వద్దు సరళా! నువ్వేం చేయమంటే అది చేస్తాను” కృష్ణమూర్తి అదోలా నవ్వాడు.         సరళ పకపకా నవ్వింది.         అత్తా మామలు పైకి వచ్చి “సరళా నీ ఆరోగ్యం భద్రం! డాక్టర్లు అందరిదీ అదేమాట” అన్నారు.         “మెట్లమీద ఎగురుతూ, దూకుతూ ఎక్కనూ, దిగనూ సరేనా?” అంది నవ్వుతూ.         “సరేగాని, అదేకదా?” అడిగారు వాళ్ళు.         “అదే!” అంది సరళ.

“అదే అంటే?” కృష్ణమూర్తి అడిగాడు. అదేమిటో తల్లిదండ్రులుకానీ, భార్యకానీ చెప్పలేదు. చెప్పమని భార్యను బతిమాలుతున్నాడు కృష్ణమూర్తి.

 

 

 

వేదనలోంచి ఒక వేకువ నాదం: అమిరి బరాకా!

barakaweb1-master675

 

ఏప్రిల్ 16, 2009. మా యింటి దగ్గరి లాబిరింథ్ బుక్స్ నుండి ఈ-మేల్ వచ్చింది. తెరిచి చూడగానే  నా కళ్ళు మెరిసాయి. వావ్ అనుకున్నాను. అమిరి బరాకా తో సమావేశం. ఆ రోజు సాయంత్రమే! యెంత గొప్ప అవకాశం. యెన్నాళ్ళకు చూడబోతున్నాను బరాకా ను!

కొన్ని దశాబ్దాలుగా అమెరికన్ సమాజాన్ని, సాహిత్యాన్ని అత్యంత ప్రభావితం చేసిన గొప్ప కవీ, విప్లవకారుడూ బరాకా ను కలిసే  అవకాశం కలుగుతోంది. అమిరి బరాకా అమెరికన్ సమాజాన్ని, సాహిత్యాన్నే కాదు ప్రపంచవ్యాప్తంగా సాహిత్యం పై ప్రభావం చాలానే నెరపారు. ఒక రెండేళ్ళ కింద నిఖిలేశ్వర్ ఇక్కడికి వచ్చినప్పుడు ‘ప్రాణహిత’ సాహిత్య పత్రికకు ముఖాముఖి సందర్భంగా చాలా సేపు మాట్లాడుకున్నాం. దిగంబర కవుల పై అలెన్ గింస్ బర్గ్ ప్రభావం గురించి అడిగినప్పుడు ‘ నిజానిక్ గింస్ బర్గ్ కంటే మాపై అమిరి బరాకా ప్రభావం యెక్కువ వుంది’ అన్నారాయన. అంతకు ముందు వినడమే కానీ అమిరి బరాకా గురించి యెక్కువ చదవలేదు.

నిఖిల్ చెప్పాక  అమిరి బరాకా కవిత్వాన్ని జీవితాన్ని చదివి,  యితన్ని యిన్ని రోజులూ యెందుకు కనుక్కోలేదా అని ఆశ్చర్యపోయాను. అట్లా లాబిరింథ్ కు అమిరి బరాకా వస్తున్నాదని తెలియగానే ఎగిరి గంతేసి బయలుదేరా. దాదాపు ఒక 100 మంది దాకా వచ్చారా సమావేశానికి అమెరికా లో అది చాలా పెద్ద సంఖ్యే! అదీ గురువారం సాయంత్రం. సభను ప్రారంభిస్తూ నిర్వాహకులు బరాకాను మాట్లాడమని ఆహ్వానించారు. మాలో ఒకరుగా కూర్చున్న బరాకా (అప్పటి దాకా నేను గమనించనే లేదు) లేచి వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టారు.

సాధారణంగా నల్ల వాళ్ళు ఒడ్డూ , పొడుగూ పెద్దగా ఉండి భారీ శరీరాలతో, కొంత ప్రత్యేకంగా వుంటారు. కానీ ఈయన చూస్తే చిన్న శరీరంతో, వయసుతో కొంచెం వంగిన శరీరంతో చాలా సాదా సీదాగా ఉన్నారు. కొన్ని దశాబ్దాల అలుపు లేని పోరాటం, ఉద్యమాలూ, అకుంఠిత దీక్షా, అసమాన సమాజం పట్ల ఆయన ఆగ్రహమూ – అనీ ఆయన ముఖ వర్ఛస్సు లో స్పష్టంగా కనబడుతున్నాయి. చాలా మామూలుగా మొదలైన ప్రసంగం మెల్ల మెల్లగా ఒక ప్రవాహంగా మారి అలుపెరుగని ఆవేశపు మాటల జలపాతమై ఒక గంట సేపు సభికుల ని తీవ్ర ఉద్విగ్నతకు గురి చేసింది.

ప్రస్తుత సమాజమూ, సాహిత్యమూ, ప్రపంచవ్యాప్తంగా 9/11 తర్వాత పరిస్థితులూ, పోరాటాలూ, సామ్రాజ్యవాదమూ, వీటన్నింటి నేపథ్యం లో మార్క్సిజం ప్రాసంగికత (అంతకు ముందు సంవత్సరమే ప్రపంచాన్ని సామ్రాజ్యవాద ఆర్థిక సంక్షోభం తీవ్రంగా కుదిపేసి కోట్లాది ప్రజానీకం జీవితాలని అతలాకుతలం చేసింది) – బరాకా ప్రసంగంలో  అనేక అంశాలని తడుముతూ చివరగా “ఈ సంక్షోభాలకూ, అసమానతలకూ, దుర్భరమైన దోపిడీ పీడనలకూ మార్క్సిజమే సరైన మార్గం” అంటూ ముగించారు. ఆయన మాట్లాడిన తర్వాత అనేక ప్రశ్నలు సభికులనుండి – ఆయన ప్రసంగం గురించీ , ఆయన 9/11 తర్వాత రాసిన పద్యం గురించీ – చాలా ఓపికగా సమధానాలు చెప్పాడు.

ప్రశ్నలన్నీ అయ్యాక నేనాయన దగ్గరికి వెళ్ళాను. ముందు నన్ను నేను పరిచయం చేసుకుని, మన తెలుగు సమాజం గురించీ, సాహిత్యం గురించీ, పోరాటాల గురించీ, కవిత్వం మీద ఆయన ప్రభావం గురించీ చెప్పాను. ఆయన ముఖంలో ఒక గొప్ప వెలుగు, కరచాలనం చేయడానికి చెయ్యి జాపాను. ఆయన ఆనందాన్ని ఉద్వేగాన్ని పట్టలేక నన్ను కౌగలించుకున్నారు. ‘ అద్భుతం. చాలా సంతోషం. ఈ విషయాలు వింటుంటే నాకు ఇంకో నూరేళ్ల జీవితం  జీవించాలనిపిస్తుంది’ అన్నారాయన. ఆయన పుస్తకం ‘బ్లూస్ పీపుల్ ‘ పైన  ‘ For Swami – Unite & Struggle’  అని రాసి సంతకం చేసి ఇచ్చారు. ‘మళ్ళీ కలవాలి మనం’ అనుకుంటూ వెళ్ళిపోయారాయన.

కార్పోరేట్ పని గంటల చక్రాల్లో నిరంతరం నలిగిపోయే అమెరికా జీవితం లో ఆయన్ని మళ్ళీ కలవడం కుదరలేదు. యిప్పుడు కలుద్దామనుకున్నా ఆయన లేరు. జనవరి 9 న ఆయన కనుమూసారు. ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సార్లు ఆయన ఆరోగ్యం బాగా లేదని విన్నాను. యిప్పుడనిపిస్తోంది ‘యెట్లా అయినా వీలు చేసుకుని ఒక్క సారి కలిసి వుంటే బాగుండేదని’. ఆయన్ని కలిసి, మాట్లాడి, కౌగలించుకున్న ఆ సాయంత్రమే పదే పదే గుర్తుకొచ్చి కళ్ళల్లో సన్నటి నీటి తెర. కోల్పోతే గానీ విలువ తెలిసిరానివి అనేకం జీవితంలో .

2ea12e92479c089aad5256bcd3207ccf

డిప్రెషన్ తరవాతి తరం

అమిరి బరాకా , 1930 ల తీవ్ర ఆర్థిక మాంద్యం కాలం లో (Great Depression) 1934 లో నూవార్క్ , న్యూ జెర్సీ లో ఎవెరెట్  లీ రాయి జోన్స్ గా ఒక దిగువ మధ్య తరగతి కుటుంబలో పుట్టారు.  నాన్న కోయెట్ లీ రాయి జోన్స్ పోస్టల్ కార్మికుడు, లిఫ్ట్ ఆపరేటర్ గా చిన్నా చితకా పనులు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. అమ్మ ఆన్నా లోయిస్ ఒక సామాజిక కార్యకర్త. బాల్యం నూవార్క్ లో, బారింగర్ హై స్కూల్ లో చదువు తర్వాత రట్గర్స్ యూనివర్సిటీ లో స్కాలర్ షిప్ తో ప్రవేశం దొరికినా, అక్కడి సామాజిక, సాంస్కృతిక వివక్షల్ని చూసి వాషింగ్టన్ లోని హోవార్డ్ యూనివర్సిటీ లో చేరారు. అక్కడ తత్వ శాస్త్రం, మతం ప్రదాన అంశాలుగా ఉన్నత విద్యను ప్రారంభించినా,  పట్టా తీసుకోలేదు. తర్వాత న్యూ యార్క్ లోని కొలంబియా లో తిరిగి ఉన్నత విద్యను కొనసాగించినా అక్కడా పట్టా తీసుకోలేదు.

కమ్యూనిస్టు అనే నెపం తో

1954 లో అమెరికా వైమానిక దళం లో చేరిన బరాకాను  కమ్యూనిస్టు అనే నెపం తో కమాండింగ్ ఆఫీసర్ బహిష్కరించాడు. (అది అమెరికా లో కమ్యూనిస్టు వ్యతిరేక మెక్ – కార్థీ దుష్ట కాలం). US Airforce నుండి బహిష్కరించబడడమే బరాకా కు మంచిదైంది. తర్వాత ఆయన న్యూ యార్క్ గ్రీన్ విచ్ విలేజి కి మకాం మార్చారు. ఆ రోజుల్లో గ్రీన్ విచ్ విలేజి అమెరికాలో అత్యంత ప్రగతిశీలమైన ప్రాంతం. ఉన్న స్థితి  ని ధిక్కరించి, సామాజిక మార్పు కోరే సాహిత్యం, కళలూ, సామాజిక పోరాటాలూ అలలలుగా కెరటాలుగా వెల్లివిరిసిన ప్రాంతం. బరాకాకు అక్కడ బీట్ తరం కవులు, కళాకారులు , బ్లాక్ మౌంటేన్ కవులు, న్యూ యార్క్ స్కూల్ కవులు పరిచయమయ్యారు. జాజ్ సంగీతం పరిచయమైంది.

మార్పు కోరే సాహిత్యమూ, రాజకీయాలూ పరిచయమయ్యాయి. అంతే ఆయన ఇంక వెనక్కి తిరిగి చూసింది లేదు. హెట్టీ కోహెన్ తో పెళ్ళీ ఇద్దరు అమ్మాయిలూ … హెట్టీ తో కలిసి ఒక ప్రచురణశాల స్థాపించారు. బీట్ కవులు అలెన్ గింస్ బర్గ్ , జాక్ కెరాక్ ల రచనలు ప్రచురించారు. బీట్ కవులతో ‘యూగెన్’ అనే త్రైమాసిక పత్రిక ప్రారంభించారు. తానూ బీట్ కవుల్లో ఒకడై కవిత్వం రాసారు. ‘కల్చర్ ‘ (kulchur) అనే సాహిత్య, కళ ల పత్రికకు సంపాదకీయం వహించారు. అమెరికా చరిత్రలో మొట్టమొదటి సారి నల్లవారి సంగీతం గురించి, వేర్ల నుండి చరిత్రను వివరిస్తూ, అద్భుతమైన సామాజిక విశ్లేషణ తో బరాకా రాసిన ‘బ్లూస్ పీపుల్ : నీగ్రో మ్యూసిక్ ఇన్ అమెరికా’ అనే పుస్తకం అత్యంత విలువైనది. అది రాసేటప్పటికి ఆయన ఇంకా లీ రాయి జోన్స్ గానే అందరికీ తెలుసు.

లీ రాయి జోన్స్ గా ఆయన రాసిన డచ్ మన్ అనే నాటకం గొప్ప నాటకంగా పేరు తెచ్చుకుంది. అమెరికా అంతటా సుప్రసిద్ధమైంది. న్యూ యార్క్  సబ్ వే లో ఒక తెల్లజాతి స్త్రీ , నల్ల జాతి పురుషుడి మధ్య  దూషణ లతో సాగే సంభాషణ ను,  సందర్భాన్ని, దచ్ మన్ లో  బరాకా అద్భుతంగా నాటకీకరించారు. శ్వేత జాత్యహంకార సమాజం బోను లో చిక్కుకు పోయిన ఆ ఇద్దరి పరిస్థితి ని బరాకా అద్భుతంగా సామాజిక కోణం లో విశ్లేషిస్తూ నాటకీకరించారు. , ఆ కాలంలో ఇతర నాటక రచయితలు ‘సహజవాదం’ తో రాస్తుంటే బరాకా సింబాలిజం వాడుతూ  తన నాటకంలో ఉద్వేగాన్ని పలికించడం కోసం అనేక ప్రయోగాల్ని చేసి తన కాలం కన్నా తాను ముందున్నానని నిరూపించారు.

1959-60 లో క్యూబా ప్రయాణం బరాకా జీవితంలో పెను మార్పు తీసికొచ్చింది. ఆయన సాహిత్య సామాజిక జీవితం లో అదొక మైలు రాయి. క్యూబా లో ఇతర దేశాల రచయితలతో, ముఖ్యంగా పేదరికానికీ, దోపిడీ పీడనల వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మూడవ ప్రపంచ దేశాల రచయితలతో ఆయన సమావేశమయ్యారు. ఆయా రచయితల రచనలు, వారి దేశాల్లో ఉన్న సామాజిక స్థితిగతులూ తెల్సుకున్నారు. అక్కడ పరిచయమైన జేమ్  షెల్లీ అనే మెక్సికన్ రచయిత బరాకా ను ఒక సూటి ప్రశ్న వేసారు ‘ నీ చుట్టూ సమాజం లో కోట్లాది మంది ప్రజలు ఆకలితో తిండి లేక మాడుతూ ఉంటే నీకు ఇంకా రాయడానిక్ వేరే వస్తువు కావాలా?’ – బరాకా తన సాహిత్యం గురించీ , కవిత్వం గురించీ పునరాలోచనలో పడ్డారు. అక్కడి నుండీ ఆయన మౌలిక దృక్పథం మారింది.

BARAKA

బ్లాక్ పాంథర్స్ ఉద్యమం

సామాజిక స్పృహా రాజకీయ దృక్పథమూ ఆయన సాహిత్యం లో ప్రదానమయ్యాయి. అప్పటిదాకా రూపం మీద విపరీతమైన శ్రద్ద పెట్టి శిల్పం లా చెక్కుతూ రాసిన బరాకా తన రాతలని ఎక్కుపెట్టిన రాజకీయ అస్త్రాల్ని చేసారు. డైనమైట్లు పేల్చారు. డచ్ మన్ నాటకంలో,  అమెరికా తెల్ల సమాజం పట్ల  పెరుగుతున్న తన అసంతృప్తినీ , అవిశ్వాసాన్నీ ప్రకటించిన బరాకా తన తర్వాత సాహిత్యంలో ఆ సమాజం పట్ల తిరుగుబాటు ప్రకటించారు. తనదైన ఒక కొత్త సమాజాన్ని కలలు కని దాన్ని నిర్మించేందుకు తాపత్రయపడ్డారు. అప్పుడు ఉధృతంగా జరుగుతున్న నల్ల జాతీయవాద ఉద్యమమూ, బ్లాక్ పాంథర్స్ ఉద్యమం తో ప్రభావితమై న్యూ యార్క్ లోని హార్లెం కు మకాం మార్చారు.

తనదైన అస్తిత్వం, సమాజ నిర్మాణం కోసం బరాకా,  క్రమేణా బ్లాక్ నేషనలిస్టు (నల్ల జాతీయవాద) ఉద్యమంలో భాగమయ్యారు. నల్ల జాతీయవాద సాహిత్య కళా సాస్కృతిక నిర్మాణం కోసం నడుం కట్టారు. అప్పటికే తీవ్రమైన బ్లాక్ పాంథర్స్ (నల్ల చిరుతల) ఉద్యమం తో మమేకమయ్యారు. మాల్కం ఎక్స్ తో సన్నిహిత సంబంధాలు యేర్పర్చుకున్నారు. నల్ల జాతీయుల ప్రదర్శనలో పాల్గొన్న బరాకాను FBI పోలీసులు తీవ్రంగా హింసించారు. దాదాపు చనిపోతారనే అనుకున్నారంతా! కానీ ఆ సంఘటన తర్వాత కోలుకున్న బరాకాలో పోరాట పటిమ ఇంకా తీవ్రమైంది. మరింత రాటుదేలారాయన.

1965 లో మాల్కం ఎక్స్ తో జరిపిన ఒక సుదీర్ఘ సంభాషణలో బరాకా తన కొత్త రాజకీయ సాహిత్య సాంస్కృతిక అస్తిత్వాన్ని కనుక్కొన్నారు. మాల్కం ఎక్స్ తో బరాకా తో  సమావేశం తర్వాత కొన్ని వారాలకే మాల్కం ఎక్స్ హత్య జరిగింది. మాల్కం అంతిమయాత్రలో ఒక ముస్లిం ప్రీస్ట్ లీ రాయి జోన్స్ కు అమిర్ బరకత్ అని పేరు పెట్టాడు. తర్వాత ఆ అరబ్ పేరును ఆఫ్రికనైజ్ చేసి స్వాహిలి భాషలో దాన్ని అమిరి బరాకా కా మార్చుకున్నారు. నల్ల జాతీయవాద సాహిత్య సాంస్కృతిక సైనికుడిగా మారిపోయారు. నల్ల జాతి కళలకు సాహిత్యానికి, సంస్కృతికీ ఒక కొత్త అస్తిత్వాన్ని , తమని బానిసలుగా మార్చిన అమెరికా శ్వేతజాతి సంకెళ్ళ నుండి బయటపడి ఒక నిజమైన ఆఫ్రికన్ నల్ల జాతి అస్తిత్వాన్ని, రాజకీయంగానూ, aesthetical గానూ, నిర్మించేందుకు ఉద్యమించారు.

బీట్ తరం కవుల నుండి తనని తాను వేరు పడేందుకు, నల్ల జాతీయత తన కొత్త అస్తిత్వంగా మలుచుకునేందుకు తీవ్రమైన కృషి చేసారు. బ్లాక్ ఆర్ట్స్ నేషనల్ మూవ్ మెంట్ కు నాయకత్వం వహించారు. కవిత్వమూ, నవలలూ, కథలూ, నాటకాలూ, సంగీత విమర్శా, ఇట్లా అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసారు. ఒక సాహిత్య కారుడిగానే కాదు రాజకీయ సాంస్కృతిక ఉద్యమకారుడిగా బరాకా అలుపెరుగని పోరాటం చేసారు. ఈ క్రమంలో FBI బరాకా ను అమెరికా లో ఒక ఎదుగుతున్న నాయకుడిగా, నల్ల జాతి తీవ్ర శక్తిగా అంచనా వేసింది.

అయితే క్రమంగా బరాకా నల్ల జాతీయవాద ఉద్యమానికున్న పరిమితులని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. కేవలం నల్ల జాతీయులే కాదు ప్రపంచవ్యాప్తంగా అశేషప్రజానీకం పేదరికంలో మగ్గిపోతూ దుర్భరమైన దోపిడీ పీడనలకు గురవుతున్నదని, వీటన్నింటికీ శ్వేతజాత్యహంకారం కన్న పెద్ద శత్రువేదో ప్రపంచ ప్రజలని వెంటాడి వేటాడుతున్నదని బరాకా గుర్తించారు. ఆ శత్రువు పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాదమనీ, దానికి విరుగుడు మార్క్సిజం లో ఉన్నదని గుర్తెరిగారు. 1970 ల నుండీ బరాకా కేవలం నల్ల జాతీయులతోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పీడిత ప్రజలతో తనను తాను గుర్తించుకున్నారు. మమేకమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పీడిత ప్రజల పోరాటాలతో identify అయ్యారు. సంఘీభావం ప్రకటించారు. సాహిత్యాన్ని సృష్టించారు. క్రియాశీలకంగా కూడా తనవంతు పాత్ర నిర్వహించారు. నూవర్క్ నగరంలోనూ , హార్లెం లోనూ, అమెరికా లోని ఇతర నగరాల లోనూ రాజకీయ ఉద్యమాల్లోనూ, హక్కుల ఉద్యమాల్లోనూ,  చివరి ఊపిరి దాకా క్రియాశీలమైన ప్రాత్ర నిర్వహించారు. మార్క్సిజం పట్ల, మూడవ ప్రపంచ దేశాల్లోని పీడిత ప్రజల పోరాటాల పట్లా తన మమేకతను చివరి ఊపిరి దాకా వీడలేదు..

న్యూ జెర్సీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్థాన కవి పదవిని యేర్పాటు చేసి, ఆయనను 2002 లో ఆస్థాన కవిగా నియమించింది. అయితే ఆయన 9/11 దాడుల మీద రాసిన ఒక పద్యం పెద్ద దుమారాన్ని సృష్టించింది. ‘యెవడొ అమెరికా ను పేల్చేసాడు’ అనే శీర్షిక తో ఆయన రాసిన పద్యం ఇలా సాగుతుంది:

 

యెవడో అమెరికాను పేల్చేసాడు

                   ఆఫ్ఘనిస్థాన్ లో యెవడొ అనాగరిక అరబ్
పేల్చేసాడు అన్నారు …

                       …..

                 యెవడు అందరికనా పెద్ద టెరరిస్టు

                యెవడు బైబిల్ ను మార్చాడు

                యెవడు అందరికన్నా యెక్కువమందిని హత్య చేసాడు

                యెవర్నీ పట్టించుకోకుండా తన స్వార్థం కోసం
యెవడు అందరికన్నా దుర్మార్గాలు చెయ్యగలడు

                యెవడికి సామంత రాజ్యాలున్నయి

                యెవడు ప్రపంచం లో అందరికన్నా
యెక్కువ భూమిని దొంగిలించాడు

                యెవడు ప్రపంచాన్ని క్రూరంగా పాలిస్తూ
అంతా మంచే  చేస్తున్నానంటూ పాపాలు మాత్రమే చేస్తాడు

                యెవడు యెవడు యెవడు
ఆ ముష్కరుడెవ్వడు…

 

అయితే ఈ పద్యం లో ఒక చోట ఆయన రాసిన వాక్యాలు ఇజ్రాయీల్ కు వ్యతిరేకంగా ఉన్నాయంటూ ఆయనను ‘anti-semitist’ అని దూషించారు. న్యూ జెర్సీ ప్రభుత్వం ఆయన పదవిని రద్దు చేసింది. అయితే ఆయన తాను రాసిందాన్ని వెనక్కి తీసుకోలేదు. 9/11 అమెరికా దాడుల వెనక కుట్ర ఉన్నదని తాను అనుకుంటున్నాననే అన్నారు. తన మీద ఎన్ని అభాండాలు మోపినా, యెన్ని వివాదాల్లో ఇరికించినా, అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడంలో , పోరాడడంలో కించిత్తైనా రాజీ పడలేదు. తాను నమ్మిన పీడిత ప్రజల విముక్తినీ , అందుకు మార్గదర్శీ కరదీపికా ఐన మార్క్సిజాన్ని జీవితాంతమూ విడిచిపెట్టలేదు.

ఆయన్ని కలిసింది ఒక్క సారే అయినా, నాకు  ఒక జీవితకాలం జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్ళారు. తన వెచ్చని కరస్పర్శలో, ఆత్మీయ  ఆలింగనం లో తన జీవితాంతం పడ్డ తపననూ, ఆరాటాన్నీ అందించిపోయారాయన. అమెరికా కూ,  మొత్తంగా ప్రపంచ పీడిత ప్రజలకూ ఒక అపురూపమైన వేదనాభరితమైన సౌందర్య సంపద అమిరి బరాకా! జీవితాంతమూ, చివరి ఊపిరి దాకా  అవిశ్రాంతంగా పోరాడిన ఆయన కనుమూసాక మాత్రం,  ప్రశాంతంగా యెలా వుండగలరు? పీడిత ప్రజలకు నిజమైన విముక్తి కలిగి, అసమాన సమాజం అంతమయ్యేదాక ఆయనకు శాంతి కలుగుతుందనుకోను – జీవితంలోనైనా మృత్యువులోనైనా !

నారాయణ స్వామి వెంకట యోగి

నారాయణస్వామి వెంకట యోగి

వర్తమాన కథకి ఒక వరం!

         వరలక్ష్మి మంచి  కథకురాలు  ( story writer ) మాత్రమే కాదు.. ఆమె ఉత్తమశ్రేణికి చెందిన కథాకారిణి ( story teller )కూడా. కథను రూపవంతంగా,సౌందర్యవంతంగా ,ఆలోచనాత్మకంగా అందివ్వడమొక్కటే కాకుండా పఠిత హృదయంలోకి పూవులోనికి పరిమళాన్ని ప్రవేశపెట్టినట్టు కథయొక్క ప్రాణప్రదమైన కథనాన్నీ, ఆత్మనూ విభ్రమపూర్వకమైన సంలీనతతో గ్రాహ్యపర్చడం ఒక మంచి కథాకారుడు చేయగల పని. అలా చేయగల్గితే కథ శ్రోత/పాఠకుడి హృదయంలో ఒక ముద్రగా స్థిరపడి, జ్ఞాపకమై శాశ్వతమైపోతుంది చిరకాలం. కథను సరళంగా, ఆసక్తికరంగా చెప్పగల్గడం ఒక గొప్ప కళ. అది కొద్దిమందికిమాత్రమే సాధ్యమయ్యే రసవిద్య. శైలి,శిల్పం,యితరేతరమైన సాంకేతిక రూప విన్యాసాలను అక్షరాలకూ , వాక్యాలకూ, అలంకారాలుగా కూర్చి , ‘కథ ‘ను ఒక భారీ సాహిత్యభూషణంగా అందివ్వడంకూడా ఒకరకమైన విలక్షణతే కావచ్ఛు.

varalaxmi

కాని నిరలంకారమైన వచనం, నడక, ప్రస్తావనలతో,కథాంశంతో ఒట్టి కొబ్బరినీళ్ళ స్వచ్ఛతవలె కథను పఠితకందివ్వడం అంత సులభమైన పనికాదు. కాగా అది కేవలం కొద్దిమంది, కొంతకాలమే.. కొన్ని సందర్భాలలోమాత్రమే చేయగల మార్మిక నైపుణ్యం. ఒక పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ఒక సి. రామచంద్రరావ్ (వేలు పిళ్ళై )కొంతకాలం మంచి కథాకారులుగా   పాఠకుల్లో  ‘ ఇంకిపోయే’రీతిలో కొన్నికథలను రాశారు. కాని వాళ్ళే అంత అందంగా,జీవవంతంగా యిప్పుడు  కథలను  చెప్పలేకపోతున్నారు.  కాబట్టి మంచి కథను సరియైన సరళ సౌందర్యంతో,జిగితో, బిగువుతో కొందరు మాత్రమే,కొంతకాలమే నిర్మించి అందిస్తారని భావించవచ్చనిపిస్తోంది. ఐతే  ఉత్తమ కథా నిర్మాతలైన కొందరు సఫల తెలుగు కథకుల రచనలను అనుశీలించినపుడు అత్యధిక పాఠకుల మన్ననలు పొందిన కథలన్నీకూడా సమాజంలోని అధిక సంఖ్యాకులైన పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు,వాళ్ళ నిశ్శబ్ద వేదనలు,పోరాటాలు,నిస్సహాయతలు, అనివార్యతల్లోనుండి మాత్రమే నీటిఊటవలె పుట్టుకొచ్ఛినట్టు  స్పష్టమౌతోంది. ఐతే రచయిత తన టార్గెట్ ( లక్ష్య ) పాత్రల జీవితాల్లోకి అధ్యయనాత్మక దృష్టితో స్వయంగా ప్రవేశించి తరచి తరచి పరిశీలించినపుడు మాత్రమే శరీరంలోకి జీవంవలె.. కథలో ప్రాణం ప్రేరితమౌతుంది.

 

అప్పుడే కథ సార్వత్రికతను పొంది స్ఫోరకమై పాఠకుల హృదయాలను జయించడం మొదలెట్టి శాశ్వతమౌతుంది . ఐతే ,కథయొక్క అతి గోప్యమైన ఈ నిర్మాణ రహస్యం వరలక్ష్మికి బాగా తెలుసు. ఇది ఆమెకు అత్యంత సహజసిద్దంగా సంక్రమించిన విద్య. ఈ విషయం వరలక్ష్మియొక్క ఏ కథను చదివినా ఇట్టే సులభంగా తెలుస్తుంది ఎవరికైనా. ఇంతవరకు కేవలం మూడు కథా సంపుటాలను మాత్రమే వెలువరించి రసజ్ఞులైన కథాప్రియులకందించిన వరలక్ష్మికథలు మంత్రసాని.,ప్రత్యామ్నాయం,చిన్నమామయ్య,బాంధవ్యం,గమనం,ఖాళీ సంచులు,మట్టి-బంగారం,గాజు పళ్ళెం ..ఇలా ఒకటా రెండా..ఎన్నో ఉత్తమ కథల పరంపరం. తొంభైల్లోనుండి .. రెండువేల ఏడువరకు వరలక్ష్మి తెలుగు కథా రంగంలో  ‘ స్టార్ రచయిత్రి’ . క్రికెట్లో సచిన్,కోహ్లీ వలె తెలుగు కథారచనా క్షేత్రంలో..బ్యాట్ పట్టుకుంటే సెంచరీలవలె..ఈమె ఏదైనా కథల పోటీకి కథ రాసిందంటే తప్పనిసరిగా ఏదో ఒక బహుమతే. తన మూడు కథా సంపుటాల్లోని నలభై ఏడు కథల్లో ముప్ఫై రెండు కథలు పోటీల్లో బహుమతులు సాధించినవేనని తెలుసుకుంటే ఆశ్చర్యంతో పాటు విభ్రమం కల్గుతుంది.

ఐతే..  ఈ విద్య వరలక్ష్మికి ఎలా అబ్బింది,ఈ కథా సృష్టి నైపుణ్యం ఎలా ఈమె హస్తగతమైందీ.. అంటే.. ఆమె మాటల్లోనే —

పుట్టినప్పట్నుంచీ ఇప్పటివరకూ కేవలం పల్లెటూరి జీవిత సౌందర్యాన్నిఅనుభవిస్తూ, సాధారణ మనిషియొక్క మూలాల్లోకి తొంగిచూస్తూ..పొలంలో ఉన్న నాన్నకు అన్నం పట్టుకెళ్ళి దారితప్పి గట్లన్నీ తిరిగి తిరిగి ఎక్కెక్కి ఏడ్చి, నాన్న గొంతెత్తి పాడిన పద్యం మార్గం చూపించగా గమ్యాన్ని చేరి నాన్న భుజంమీద వాలిపోయిన ఆనందాలు.. అమ్మ ఎప్పుడూ సన్నని గొంతుతో పాడే ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘పాటలు.. కన్పించిన ప్రతి చెట్టునూ,పుట్టనూ ప్రేమించి పరవశించి రాసుకున్న కవిత్వాలు, ఊరి మార్గాలన్నింటా విరిసి మురిసిన తురాయి చెట్ల ఎర్రని అటవీ సౌందర్యాలు. . అక్కడ్నుండి ఎదుగుతున్నకొద్దీ అవగాహనలోకొచ్చిన , రక్త సంబందీకుల్లోనే కొరవడిన ప్రేమలు,ఆ ప్రేమలకు దూరమై విలపించే స్త్రీలు, విలాపంలోనూ మానవత్వాన్నీ,క్షమనూ వదలలేని స్త్రీల బలహీనతలు..కూడు పెట్టని కులవృత్తులు,సామాన్యుని బతుకుతెరువుని లాక్కుంటున్న ఆర్ధిక విధానాలు,ప్రపంచీకరణ పెనుతుపానులో పల్లెలు నిర్వీర్యమౌతున్న విధ్వంసకర దృశ్యాలు.. హింసతో ప్రజ్వరిల్లుతున్న ప్రపంచ రాజకీయాలు కంటనీరు తెప్పిస్తూండగా … అని రచయిత్రి రాసుకున్న ‘ నా మాట’ లోని..ఈ సందర్భాలన్నీ.. వరలక్ష్మి కథలకు వస్తువులుగా , ప్రాణవాయువులుగా రూపొందాయి. అందుకే ఆమె కథలన్నీ.. దాదాపు విషాద జీవిత శకలాలను విడమర్చి చూపి కంటతడిపెట్టించేవీ,హృదయాన్ని విలవిల్లాడించేవీ.. అంతిమంగా  దుఃఖోద్విగ్న మహా దివ్యానుభూతిని సిద్దింపజేసేవీ.

pho-3

‘ ప్రత్యామ్నాయం’ కథలో కోతినాడించి జీవించే సిద్దప్ప, ఒక అవిటి శిష్యుడు..శవప్రాయపు మనసున్న భార్య ఈరి,అంగవైకల్యంగల రెండు ఫీట్ల ఎత్తున్న అనాకారి కొడుకు..ఒక కోతి..ద్రిమ్మరి జీవితం..ఇదీ నేపథ్యం.

ఈ బడుగుజీవుల జీవవంతమైన పలుకుబడుల భాషను పట్టుకుంది వరలక్ష్మి. ఈ సంభాషణ చూడండి.

‘ థూ నీయమ్మ.. సూసి సూసి కోతి నా కొడుకుని కన్నావుకదే..ఈడికి పదారేళ్ళు ముడ్డికిందికొచ్చాయంటే ఎవడైనా నమ్ముతాడా అసలు.?’ అన్నాడు సిద్దయ్య.

‘ సాల్లే నీ తాగుబోతు మొకానికి ఇంతకన్నా అందమైన కొడుకు పుట్టేత్తాడేటి.? తెల్లారి లేత్తే నీ మొకం,నువ్వాడించే కోతి మొకమేకదా దర్సినాలు..ఇంకేటవుద్దిమరి !’ అని తిప్పికొట్టింది ఈరి.

ఐదు పేజీల ఈ చిన్న కథ ‘ ప్రత్యామ్నాయం’లో తాగుబోతు సిద్ధయ్య అనూహ్యంగా చచ్చిపోయి ,కోతిని ఎవరో దొంగిలించుకుపోతే..బతుకుతెరువు ఎలాగో అని దుఃఖంతో  విలవిల్లాడ్తున్న ఈరి  ముందు అంగవికలుడైన కొడుకు కోతి గొలుసును తన మెడలో ధరించి ఒక కొసను తల్లి చేతికిచ్చి ‘ నన్ను కోతిలా ఆడించి బతుకమ్మా’ అని సంజ్ఞ చేసినపుడు.. ముగింపు పాఠకుని గుండెను పిండేస్తుంది. దుఃఖం సముద్రమై పోటెత్తుతుంది

‘ బాంధవ్యం’ కథలో.. మరణంకు సమీపంలో ఉన్న తండ్రి .. కూతురు శ్యామల.. వృద్ధాప్యం..నిస్సహాయత,అనివార్యత. ..అంతిమంగా  ఒక దీర్ఘనిట్టూర్పును మిగిల్చే ముగింపు.

‘ చిన్న మామయ్య’ కథలో.. చిన్నప్పట్నుండీ తనను ఆడించి, స్నేహించి,తోడుగా పెరిగి.. పెళ్ళి చేసుకోవాలని తలచి గాఢంగా.. అజ్ఞాతంగా ప్రేమించి..బీదరికంవల్ల  పెళ్ళి సాధ్యం కాక..వనజను కోల్పోయిన చిన్నమామయ్య జీవితమంతా పేదరికంలో,దరిద్రంలో,బతుకు పోరాటంలో ఓడి ఓడి..కడకు మురికివాడలోని కాలువప్రక్క దీనాతిదీనంగా చచ్చిపోతే..కేవలం మానవత్వంతో.. ఎక్కడో ఓ  మూల దాగిఉన్న రవ్వంత తడితో శవాన్ని చూడ్డానికి వెళ్ళిన వనజ..దుఃఖంతో  తిరిగొస్తూంటే..ఎవరో బిచ్చగానివంటి పిల్లవాడు ఒకడు పరుగెత్తుకొచ్చి చిన్నమామయ్య బాపతు చిన్న కాంపస్ బాక్స్ అంతటి పాత ప్లాస్టిక్ పెట్టెనందిస్తే.. దాంట్లో..ఎప్పుడో.. ఎవర్నో అడిగి తెచ్చిన డబ్బా కెమెరాతో తీసి..   ఫోటో రాలేదని తనతో చెప్పి.. జీవితాంతం పదిలంగా దాచుకున్న తన పాత    ఫోటో.. అప్పుడప్పుడు తనను కలిసినప్పుడు దారిఖర్చులకని యిచ్చిన చిల్లర డబ్బులు..పాత నోట్లు ..నాణేలు..

ఎందుకో హృదయం కరిగి..  మనసు  పగిలి  దుఃఖంతో నిండిపోతుంది.

‘ ఈ జీవితాలు ఇలా ఎందుకున్నాయి’ అని నిశ్శబ్ద రోదన ఆవహిస్తుంది.

matti bangaaram

అలాగే..’ మల్లెపువ్వు’ కథలో..  మల్లెపువ్వువంటి మణిరత్నం.. విధికృతంగా ప్రాప్తించిన మొగుడు యాకూబ్.. ఇద్దరు పిల్లలు డేవిడ్,రోజీ.. దిక్కుమాలిన మొగుడితో వేగలేక వదిలేసి   నర్స్ గా   ఒంటరి జీవితం.. పిల్లలను పెంచుతూ.. డేవిడ్ ను ఇంజనీర్ , రోజీని డాక్టర్ చేసి.. చివరికి యిద్దరిచేతా ఈసడింపబడి,గాయపడి..  దుఃఖితగా   మిగిలి.. రచయిత్రి మణిరత్నంను.. వాడి నలిగినా మల్లెపువ్వుతో పోల్చి చెబుతూ.. ముగింపు గాఢ దుఖంతో తల్లడిల్లజేస్తుంది.

‘ ఖాళీ సంచులు’ కథలోకూడా అంతే..దుర్గ,తమ్ముడు వెంకటేష్, మరదలు శారద,జీవితంలో కలిసి విడిపోయిన కుప్పుసామి..  అన్నీ మనముందు కదలాడే,మనకు బాగా తెలిసిన మనుషులే పాత్రలై.. చివరికి.. ‘ ఈ జీవితాలు ఇలా కాకుండా.. ఇంకోలా ఉంటే ఎంత బాగుండు..’ అన్న ఏదో ఒక భాషకందని  మౌనక్షోభ.. గాఢ విషాదం.

అలా అని .. వరలక్ష్మి ఏ కథలోనూ పలాయనాన్నీ, ఓటమినీ, నిస్సహాయమైన లొంగుబాటునూ సమర్థించి చెప్పలేదు.  అన్ని కథల్లోనూ ‘ మన జీవితం మన చేతుల్లోనే ఉంది.. సరిగ్గా గుర్తించి నిన్ను నువ్వు పునర్నిర్మించుకో ‘ అనే ఉదాత్తమైన సందేశాన్నే అందించింది బాధ్యతతో. ఈమె కథల్లో చాలావరకు తన ముగింపు తామే వెదుక్కుని గమ్యాన్ని చేరుతాయి పాత్రలు.. ధైర్యంగా,ప్రతిఘటిస్తూ, సచైతన్యంగా.

వరలక్ష్మి కథల్లోని ప్రత్యేకతలను ఉల్లేఖిస్తే.. అవి.,

1. ఉత్తమశ్రేణి కథకు ప్రధాన లక్షణమైన ఉత్కంఠభరిత ఆరంభం.

2.గోదావరి జిల్లాలల్లోని ప్రజల జీవిత విధానం,నుడికారం,ముఖ్యంగా బడుగు వర్గాల్లోని అలవాట్లు ..బతుకు..వీటిపట్ల  సమగ్రమైన అవగాహన.

3.ఒట్టి ఊహ కాకుండా.. వాస్తవ జీవితాల్లోకి రచయిత్రి ప్రవేశించి ,అధ్యయించి చేసిన జీవవంతమైన సృజన.

4.నిపుణుడైన శ్యాం బెనిగల్,గోవింద్ నిహలాని,సంతోష్ శివన్ వంటి చేయి తిరిగిన చిత్ర దర్శకులవలె..కథా సన్నివేశాలను పఠితముందు రూపుకట్టించడంలో అద్భుతమైన ప్రతిభ.

5.కథలకు నిరలంకార రూప సౌందర్యాన్ని కూరుస్తూనే కథలు బహిర్ అంతర్ వర్చస్సుతో వర్ధిల్లేట్లు నిర్మించి పాఠకుడికి వివేచనార్థం కొంత ఖాళీ ( space )ను వదిలి ‘ open ended ‘ గా ముగించి తన కథలకు ‘ఉత్తమ’ స్థాయిని సాధించి పెట్టడం.

.        6. అన్నింటినీ మించి..నిర్మలాకాశం  మహా సౌందర్యవంతమైనట్టు ..నిరాడంబరతతో కథను నడిపించి ..క్లుప్తతతో , సరళతతో ఉన్నతిని చేకూర్చడం.,

ఇవీ వరలక్ష్మి విశిష్టతలు.

అరవై ఎనిమిది కవితలతో 2003 లో వరలక్ష్మిది ఒక కవితా సంపుటి వెలువడింది. అది ‘ ఆమె’.ఇందులోని కవితలన్నీకూడా ఈమెను మంచి భావుకురాలిగా మనకు పరిచయం చేస్తాయి.

‘ కొబ్బరి   చెట్ల ఆకులు / నీడల  కళ్ళతో ఎదురుచూపులు చూస్తూ /చిరుగాలి అలికిడైనా/ఉలికులికిపడ్తున్నాయి. ‘…యిలా ఉంటుంది నడక. ప్రకృతిని  అక్షరాల్లో ప్రతిక్షేపించడం ఇది.

ప్రస్తుతం ‘ విహంగ’ వెబ్ పత్రికలో ‘ జ్ఞాపకాలు’ రాస్తున్న వరలక్ష్మిని చదువుతున్నవారికి భిన్న బాల్య స్మృతుల్లో కరిగిపొతూండడం అనుభవమే.

ఇప్పటికే ‘ చాసో’ పురస్కారం,’ రంగవల్లి’ పురస్కారం,అజో-విభో అవార్డ్, తానా, ఆటా బహుమతులు, తెలుగు విశ్వవిద్యాలయ కథా పురస్కారం వంటి ఎన్నో అవార్డ్ లను పొంది ప్రసిద్దురాలైన కె.వరలక్ష్మికి ఇప్పుడీ ప్రతిష్టాత్మకమైన ‘ సుశీలా నారాయణరెడ్డి సాహితీ ( జీవిత సాఫల్య ) పురస్కారం ‘ విలక్షణమైన కథకురాలికి విశిష్ట  గౌరవమే. అభినందనలు.

కారణాలు తెలియదుగాని.. ఈ మధ్య వరలక్ష్మి కథలు ఎక్కువగా రాస్తున్నట్టు లేదు. మంచి కథకులు రాయకపోవడం కథాప్రియులైన పాఠకులను నిరాశపర్చడమౌతుందేమో . అలసట కల్గినపుడు విరామం కొద్దిగా అవసరమే..  కాని విరమణ తగదు. ఆమె ఆలోచించాలి..     మళ్లీ   మంచి కథలు రావాలి వరలక్ష్మినుండి.

 

( 17 జనవరి,2014 న రవీంద్రభారతి, హైదరాబాద్ లో  ప్రతిష్టాత్మక ‘ సుశీలా నారాయణరెడ్డి సాహితీ పురస్కారం ‘ స్వీకరించబోతున్న సందర్భంగా..,)

 

                                                                                                                                                                                         – రామా చంద్రమౌళి

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

కోపం జ్వరానికి ‘టాబ్లెట్’ మందు!

yandmuri

చిన్నచిన్న కారణాలకి మీకు తరచూ కోపం వస్తుందంటే దానికి కారణం ఎదుటి మనిషి కానీ, సందర్భం కానీ అయి ఉండదు. అది ఆర్థికపరమైన ఇబ్బందో, లేదా దగ్గరవాళ్ళతో చెడిపోయిన బాంధవ్యమో కావచ్చు. కోపం ఒక జ్వరమైతే దానికి మందు కూడా ఉంది. ఇదే ‘ఫీవర్ అండ్ టాబ్లెట్’ కాన్సెప్టు. ఈ టెక్నిక్ అవలంబిస్తే సగం కోపం తగ్గిపోతుంది.

అతడు ఒక తెలివైన, అందమైన యంగ్ ఎగ్జిక్యూటివ్. పేరు రాకేష్. వయసు పాతిక. జీతం 75 వేలు. ఏ దురలవాట్లూ, వ్యసనాలూ లేవు. అందంగా, అంతకన్నామించి హుందాగా వుంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అతడు పెళ్ళికి  ప్రపోజ్‌ చేస్తే ‘నో’ చెప్పే అభ్యంతరాలు సాధారణంగా ఏ అమ్మాయికీ వుండవు.!

అతడు తన వితంతు తల్లితో కలిసి జీవిస్తున్నాడు. వాళ్ళిద్దరూ తల్లీ కొడుకుల్లా వుండరు. స్నేహితుల్లా వుంటారు. దాదాపు ప్రతివిషయమూ అతడు తల్లితో చెప్తాడు. అటువంటిది క్రమక్రమంగా మారిపోయాడు. వారం రోజుల్లో విపరీతమయిన మార్పు వచ్చింది. తిండి తగ్గిపోయింది. చిరాకు ఎక్కువైంది. ప్లేటు తోసేస్తున్నాడు. తల్లిపై విసుక్కుoటున్నాడు.

అతడిని అంత కలవరపరిచే విషయం ఏమైవుంటుందా అని తల్లి అతడి స్నేహితుల దగ్గర ఎంక్వయిరీ చేసింది. అప్పుడొక సంగతి బయటపడింది. వాళ్ల ఆఫీసులో త్వరలో జరగబోయే రిట్రెంచ్‌మెంట్ గురించి అతని తోటి ఉద్యోగస్తుడు ఆమెతో చెప్పాడు. నష్టాల దృష్ట్యా ఆఫీసులో స్టాఫ్‌ని తగ్గించి వేస్తున్నారు. అందులో రాకేష్ కూడా వుండొచ్చు.

ఇలా విషయం నాన్చితే లాభంలేదని ఆమె ఒకరోజు అతడిని మందలించింది. మాట మీద మాట పెరిగింది. వారి వాదనలు తారాస్థాయికి చేరుకున్నాయి. “….ఉంటుందో లేదో తెలియని ఉద్యోగం కోసం నిద్రా, భోజనం మానేయటం మంచిది కాదు బాబూ. ఉద్యోగం పోయినా పర్వాలేదులే…” అంటూ ఓదార్చడానికి ప్రయత్నించింది. కొడుకు నిర్ఘాంతపోయాడు. అంత కోపంలోనూ నవ్వొచ్చింది. ఎందుకంటే, ఈమాత్రం ఉద్యోగం తనకి ఎక్కడైనా దొరుకుతుందని అతడికి తెలుసు.

“నా దిగులుకి కారణం నా ఉద్యోగం అని నీకెవరు చెప్పారు?” అన్నాడు. ఈసారి విస్మయం చెందటం తల్లి వంతయింది. అసలు కారణం అతడు చెప్పటం ప్రారంభించాడు.

అతని చిరాకుకి కారణం అదికాదు.   అతడు పనిచేసే ఆఫీసు ఎదురు బిల్డింగ్‌లో స్వప్న అనే మల్లెతీగ స్టెనోగ్రాఫర్‌గా పనిచేస్తోంది. ఆమె గగనజఘన. నితంబిని. ‘చాలెంజ్’ అనే మా సినిమాలో సరస్వతీపుత్రుడు వేటురివారు ఒక పాట వ్రాశారు. మందగమన, మధుర వచన, గగన జఘన, సొగసు లలనవే… అని! గగనం అంటే ‘శూన్యము’ అనీ, గగనజఘన అంటే ‘నడుము లేనిది’ అనీ అర్ధం. నితంబిని అంటే ఎత్తైన పిరుదులు కలది. నితంబినులు సహజంగా మందగమనులు. కానీ కవి కల్పనలో, గగనజఘనలు కూడా మందగమనలు అవటం ఒక గొప్ప ప్రయోగం. తెలుగు మర్చిపోతున్న యువతకి మన భాషలో ఉన్న సొగసులు చెప్పటం కోసమే ఈ అప్రస్తుత ప్రసంగం.  తిరిగి సబ్జెక్ట్‌ లోకి వస్తే…

ఆమె తనకి అన్ని విధాలా సరిపోతుందనుకొన్నాడు. ఆ విషయమై ఆమెతో మాట్లాడాలని  లంచ్‌కి ఆహ్వానించాడు. పెళ్ళికి ముందు సినిమాలూ, పార్కులూలాంటి డేటింగ్ విధానాన్నిఅతను నమ్మడు. మర్యాదపూర్వకంగా లంచ్‌కి ఆహ్వానించి, తన ఇష్టం గురించి అక్కడ చెప్పాలనుకున్నాడు. “మీరు నాతో లంచ్‌కు వస్తారా?” అని అతడు అడుగుతుండగానే ఆమె కఠినమైన స్వరంతో “తరువాత మాట్లాడతాను” అంటూ ఫోన్ ‘టప్‌’మని పెట్టేసింది. ఆ తరువాత మళ్ళీ ఫోన్ చేయలేదు.

అదీ సంగతి.

Picasso-rug-femme-au-chapeau-1-768x1024

అంతా విన్న అతడి తల్లి నమ్మలేనట్లు ‘ఇంత బలహీనమయిన మనసా నీది’ అన్నట్టుగా అతడి వైపు చూసి, “ప్రేమించిన అమ్మాయి  కాదంటే భోజనం మానేసి ఏడుస్తావా?” అని అడిగింది.

“నేనామెను ప్రేమించలేదు. పెళ్ళి జరుగుతుందో లేదో తెలియకుండా ప్రేమించేసేటంత బలహీనత నాలో లేదు. ఆమె కూడా ఇష్టపడితే, నా ఇష్టాన్ని ప్రేమగా మార్చుకుందామనుకున్నాను. అంతే.”

“మరెందుకు బాధ?”

“నా అహం బాగా దెబ్బతిన్నదమ్మా! ఆమెని మర్యాదగా మధ్యాహ్నం లంచ్‌కి పిల్చానే తప్ప రాత్రి ‘పబ్’కి కాదు! కనీసం డిన్నర్‌కి కూడా కాదు. ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా. అంత విసురుగా మొహం మీద కొట్టినట్టు ఫోన్ పెట్టెయ్యటం ఎందుకు?” సున్నితమైన చోట దెబ్బతగిలినట్టు అన్నాడు. అదీ కథ.

మనసుకి దెబ్బ తగిలింది. నిజమే. కానీ దాన్ని తల్లి మీద కోపంగా చూపించటం ఎందుకు? దీన్నే  ఫీవర్ అంటారు. ఫీవర్ అంటే  జ్వరం. అందరూ అనుకొనే జ్వరం కాదు. మానసికశాస్త్రంలో దానికి మరో అర్థం వుంది. F అంటే ఫ్యాక్ట్  (నిజం), E – అఫెక్ట్  (ప్రభావం), V-వెంటిలేషన్  (బహిర్గతం) , A-ఎమోషన్ (భావోద్రేకం), R- రిజల్ట్ (ఫలితం).

పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనిషి మెదడుకి చేరుకునేది రియాలిటి (వాస్తవం). మెదడు దాన్ని ఎలా స్వీకరిస్తుంది అనేది ఎఫెక్టు (ప్రభావం). రోడ్డు పక్కన రాయి వుండటం వాస్తవం. దాన్ని ఒకరు కాలితో తన్నవచ్చు. మరొకరు భగవంతుడిగా పూజించి ప్రార్థించవచ్చు. చైనా దేశపు షాంగై నగరంలో క్యాడ్బరీస్ చాక్లెట్ మధ్యలో జీడిపప్పు అద్దినట్టూ తేలు పెట్టి అమ్ముతారు. అక్కడ దానికి చాలా డిమాండు. మనకి..?

వాస్తవం ఒకటే. ప్రతిస్పందన వేరు. ‘ఫీవర్’ లో రెండో అక్షరం E కి అంత ప్రాముఖ్యత  వుంది.

దాని తరువాత అక్షరం V. వెంటిలేషన్. తన మీద పడిన వాస్తవపు ప్రభావాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క  విధంగా బహిర్గత పరుస్తారు. కొందరు కోపంతో అరుస్తారు. కొందరు ఏడుస్తారు. మరి కొందరు తమ చీకటిగుహల్లోకి  నిశ్శబ్దంగా వెళ్ళిపోతారు. దాన్నే ఎమోషన్ అంటారు. కొందరు వ్యక్తుల్లో దీని తీవ్రత ఎక్కువ వుంటుంది. ఎమోషన్స్(E) ని (భావోద్వేగాలు) కంట్రోలులో పెట్టుకొకపోతే రిలేషన్స్(R) దెబ్బ తింటాయి. రాకేష్‌కీ అతడి తల్లికీ ఆ విధంగానే కలిగింది. ‘మూలం’ అమ్మాయి తిరస్కారం. దాని ప్రభావం ‘తల్లిపై అసహనం’. మరి దీనికి పరిష్కారం?

టాబ్లెట్. ఈ జ్వరానికి విరుగుడే TABLET. ఫీవర్‌ని తగ్గించే టాబ్లెట్ కాదు. దీని అర్థం వేరే. T అంటే టేబిలింగ్ (అమర్చు), A- ఆక్సెస్ (విశ్లేషించు), B- బ్రౌజ్ (వెతుకు), L- లొకేట్ (పట్టుకో ), A- ఎన్‌కౌంటర్  (చంపు), T- టెర్మినేట్ (శాశ్వతంగా నాశనం చెయ్యి).

బుద్దుడి యోగము కూడా ఇదే! రోగము- కారణము- ఔషధము- నాశనము! మన భావోద్రేకాలకీ, మూడ్ బావోలేకపోవటానికి, దుఃఖానికీ, కోపానికీ, అసహనానికీ కారణం వేరే ఎక్కడో వుండవచ్చు. ముందు దాని మూలాన్ని వెతికి పట్టుకోవాలి. దానికోసం తన సమస్యలన్నిటినీ టేబిల్‌పై పరచి చూడాలి. రాకేష్ బాధకి కారణం అతడి తల్లి అనుకొన్నట్టు ఉద్యోగభయం కాదు. ప్రేమ విఫలం. టేబ్లింగ్ చేయటం అంటే అదే. ఒక్కొక్క కారణాన్నీ ఆవిధంగా విశ్లేషించి, అసలు దాన్ని పట్టుకోవాలి.

కారణం అమ్మాయే! సందేహం లేదు. కానీ ప్రేమ తిరస్కరించటం కాదు. అమర్యాదగా ఫోన్ ‘టప్’ మని పెట్టెయ్యటం! అతడి అహం అక్కడ దెబ్బతిన్నది. అంతవరకూ అతడితో అంత అమర్యాదగా ఎవరూ ప్రవర్తించలేదు. అతడి సంస్కారానికి అదొక దెబ్బ, అందుకే అది తలచుకొని అతడెంతో కుమిలి పోయాడు. అతడికి అంత కోపం రావటానికిగల పరిస్థితులన్నిటినీ సమీకరించి చూడాలి (Table). ఆ విధంగా మూలకారణపు అసలు అంశాన్ని బ్రౌస్  చేయాలి. లొకేట్ చేసి ఎన్‌కౌంటర్ చేసెయ్యాలి! విషయం తెలియకుండా నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపినా ఏం లాభం? సమస్య అలాగే ఉంటుంది. బాధ  మిగిలిపోతుంది. దానికన్నా అటోఇటో తేల్చేసుకోవటమే మంచిది కదా! చాలా మంది సమస్యని తేల్చరు. పరిష్కారం అంటే భయం! సమస్యకి దూరంగా నిలబడి బాధపడుతూనే వుంటారు. దీన్నే ‘ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ‘ అంటారు. ఆ అమ్మాయి ఆఫీసుకి ఫోన్ చేసి విషయం ఏమిటో కనుక్కోమని కొడుకుని తల్లి వత్తిడి చేసింది (Access). అతడా అమ్మాయి ఆఫీసుకి వెళ్ళాడు. అయితే ఆ అమ్మాయి ఆఫీసులో లేదు. పది రోజులు సెలవు పెట్టింది. బహుశా పెళ్ళికోసం అయివుంటుంది అనుకొన్నాడు.

“నాతో లంచ్‌కి  రావటం ఇష్టం లేకపోయినా, ఇప్పటికే వివాహం నిశ్చయమై పోయినా, ఆ విషయం మామూలుగానే చెప్పొచ్చుకదా ! నేనొక విలన్‌ని  అయినట్టు అలా మొహంమీద విసురుగా ఫోన్ పెట్టెయ్యటం దేనికి?” అని అడగాలని అతడి ఉద్దేశం.

ఇంటి దగ్గర వివరాలు కనుక్కుంటే ఆమె హాస్పిటల్‌లో ఉందని తెలిసింది (Browse). ఆలస్యం చేసే కొద్దీ దిగులే మిగుల్తుందనీ, నిరంతరం దుఃఖం కన్నా- అటోఇటో తేల్చుకొని, ఆ  దుఃఖకారణాన్ని నిర్మూలించటం మంచిది కదా (Locate), వెంటనే వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడదామని (Encounter) అతని తల్లి ప్రోత్సహించింది. వాళ్ళు హాస్పిటల్‌కు వెళ్ళారు(Terminate).

అతడిని చూడగానే ఆమె మొహం విప్పారింది. అతను ఫోన్ చేసినప్పుడే, అతని మనసులో ఆలోచన ఆమెకి తెలిసిపోయింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈలోపు బాస్ ఇంటర్‌కమ్‌లో అర్జెంటుగా డిక్టేషన్ తీసుకోవటానికి పిలవడంవల్ల కంగారుపడి “తర్వాత మాట్లాడతాను” అని ఫోన్ పెట్టేసింది. ఆమె గొంతులో ఆ రోజు కనపడిన తొందరని అతడు తిరస్కారంగా అపార్ధం చేసుకున్నాడు. ఫోన్ పెట్టేసిన అమ్మాయి ఆకాశంలో పక్షిలా ఎగురుతూ క్రిoదమెట్లు చూసుకోలేదు. జారిపడడంతో కాలు విరిగి ఆస్పత్రిలో జాయిన్ అయింది. తల్లీకొడుకులు వెతుక్కుంటూ వెళ్ళినందుకు సినిమా లెవెల్లో కధ సుఖాంతమయింది.

ఇతరుల్ని మనం అపార్థం చేసుకుంటే వారిపై మనకి వచ్చేది కోపం. మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే కలిగేది ‘దుఃఖం’. కోపమూ, దుఃఖమూ మనిషికి వచ్చే మానసిక రోగాలు.

దేవుళ్ళు సైతం కోపానికి అతీతులు కారు. శివుడు ఆగ్రహిస్తే ఎదుట ఉన్నది ఎంతటి వారైనా శాపం తప్పదు. మహా విష్ణువు సైతం భావావేశానికి లోనయి మొసలి బారి నుండి ఏనుగును కాపాడే తొందరలో సిరికిన్ చెప్పడు… శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు. ఆయుధాలను సైతం తీసుకువెళ్ళడం మర్చిపోయాడు.

భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంటే బీ.పీ. వస్తుంది. అలా అని వాటిల్ని అధికంగా ప్రదర్శిస్తే హార్ట్ ఎటాక్ వస్తుంది. కోపాన్ని ప్రదర్శించకపోతే కొన్నికొన్ని సందర్భాల్లో అవతలివారు మనల్ని అసమర్ధులుగా జమకట్టే ప్రమాదం ఉంది. కానీ ప్రదర్శించటంవేరు, అనుభవించటంవేరు. ఐదు ప్రశ్నలు వేసుకుంటే భావోద్వేగ నియంత్రణ సాధ్యమే.

1. ఎందుకు నాకీ కోపం?

2. నాది కోపమా లేక నిస్సహాయతా?

3. నాకు తరచూ ఈ మధ్య ఇటువంటి స్థితి కలుగుతోందా?

4. ఇలా కాకుండా నేను ఇంకో రకంగా ప్రతిస్పందించే అవకాశం ఉందా?

5. నేనిప్పుడు ప్రవర్తిస్తున్న విధానాన్ని రేపు నా అంతరాత్మ ఒప్పుకుంటుందా?

ఈ ఐదు సూత్రాలు అమలు జరిపి చూడండి. క్రమక్రమంగా మీ ప్రవర్తనలో ఒక అద్భుతమైన మార్పు మీకే తెలుస్తుంది.

– యండమూరి వీరేంద్రనాథ్

 

ఆత్మలో కవిత్వం వున్నవాళ్ళు రాసిన కథలు ఇవి!

మళయాళ కథా ప్రస్థానం – 1

Secular Theatre in Kerala

నేడు కథ  అంటే ,ఏ సాహితీవేత్త కాని విమర్శకుడు కాని ఉద్దేశించేది ఒక శతాబ్ధానికి అటో ఇటో పుట్టిన కథ  , లేకపోతే కథానిక అనే సాహిత్య ప్రక్రియగురించే. కాని అతిపురాతన కాలంనుంచే  కథలు ఉన్నాయి.బి. సి 320 నుంచి  సమాజంలో కథ లు  చలామణి లో ఉన్నాయి  అనేదానికి రుజువులు కనబడుతున్నాయి . బి.సి. 320 కి చెందిన ‘’ఇద్దరు సోదరులు’’ అనే కథ ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు మనకు లభ్యమైన కథ ల్లో అతి పురాతనమైనదని చెప్పాలి .బి. సి. ఆరో శతాబ్దంలో గ్రీకు రాష్ట్రంలో ప్రాచుర్యంలో వుండేవని నమ్మే ఈసోపు కథ లు ,బుద్ధుని పూర్వ జన్మల గురించని నమ్మే జాతక కథలు  [563—483 బి. సి .] ఏ. డి. 300 –500 కి మధ్య కాలంలో రచింపబడినవి అని అనుకుంటున్నపంచతంత్ర కథలు మొదలైనవాటిని  ఆధునిక కథ లుగా పరిగణించలేం .  కాని కధావిర్భావానికి అప్పుడే బీజం పడిందని చెప్పాలి. మనిషి మాట్లాడటం ప్రారంభించాక తన అనుభవాలను ఇతరులకు తెలియపరిచాలని అనుకున్న నిమిషమే కథావిర్భావ  ముహూర్తం. నిజం చెప్పాలంటే ఒక వ్యక్తి తాలూకు జీవితానుభవాలనూ ఆలోచనలనూ ఇతరులకు చెప్పాలనే తపన నుంచే కథ పుట్టుకొస్తుంది. ఎదురుగా  ఉన్నవాడికి మౌక్తికంగా చెప్పవచ్చు –కాని లేనివాడికి అక్షర బద్దం చేసి చెప్పాలి . అందువల్ల కథ అనేది రచయిత తన జీవితానుభవాలగురించి  తన ఎదుట లేని పాఠకుడి తో జరిపే సంభాషణ కథ అని  కూడా భావించవచ్చు—కాని ఏకపక్షీయమైన సంభాషణ.

ప్రాంతీయ భారతీయ భాషల్లో నేడు మనం కథ అని కాని కధానిక అని కాని వ్యవహరించే సాహిత్య ప్రక్రియ ప్రారంభమైనది 19 వ శతాబ్దపు చివరి దశలో కాని,  ఇరవయో శతాబ్దపు ప్రారంభం లో  కాని మాత్రమే అనేది వివాదరహితమైన వాస్తవం. దక్షిణాది భాషల విషయంలో కూడా ఇది నిజమే. మలయాళ భాషలో సాహిత్య విమర్శకి సాహిత్య పత్రికకి పునాది వేసిన.సి. పి. అచ్యుత  మీనోన్ [1863 –1933] సారధ్యంలో వెలుబడిన విద్యావినోదిని అనే మాస పత్రికలో1891 లో  వెలుబడిన ‘’వాసనా వికృతి’’ అనే కధ మలయాళ భాషలో వెలువడిన తొలి కథ. ఈ కథ వ్రాసినవారు వెంగయిల్ కుంజీరామన్ నాయర్.[1869 –1914]. ఈ కథ వారసత్వం అనే పేరుతో  తెలుగులో  అనువదింపబడింది . కధాకేరళం అనే సంకలనంలో ఈ కధ లభ్యం [అనువాదకుడు –ఎల్. ఆర్. స్వామి]. ఇది ఒక దొంగ కథ. వారసత్వంగా దొంగతనం చేయటం అలవరిచుకున్న ఒకడు , రాజ్యంలో పోలీసు వ్యవస్ద ఏర్పడటంవల్ల ఊరిలో ఉండలేక మదిరాసుకి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు తను దొంగలించిన నగల పెట్టె తన ప్రేయసికి ఇచ్చి వెళ్తాడు. అందులోని ఒక ఉంగరం  ఆమె అతని  తొడుగుతుంది. మదరాసులో  దొంగతనాలు చేయకుండా మంచిగా బ్రతగాలని అనుకుంటాడు . కాని అందగత్తే అయిన  ఒక వేశ్యను అలా చూస్తూ నిలబడినప్పుడు ఆ ఉంగరం  ఎవరో కొట్టేస్తారు.పోలీసుకి ఫిర్యాదు చేస్తాడు . అందువల్ల పోలీసు అతన్ని పట్టుకుంటారు . ఆరు నెలల శిక్ష అనుభవించిన తరువాత జైల్ బయటికి వచ్చిన అతడు చెప్పుకున్నదే ఈ కథ .

రెండో కథ ‘’చెడుఅదృష్టం ‘’కూడా ఇతడు వ్రాసినదే. తిండికి కూడా లేని ఒక యువకుడు ధన వంతుడుగా మారిన జీవిత యాత్రని చిత్రీకరిస్తోంది ఈ కథ. మాతృసామ్య వ్యవస్ధలో వున్న అలనాటి ఉమ్మిడి కుటుంబాల సజీవ చిత్రీకరణ ఈ కథ. ‘’సెంట్రల్ జైల్ తప్ప గొడవలు లేని ఉమ్మిడి కుటుంబాలు వేరే ఎక్కడా  లేవు ‘’మొదలైన అలనాటి సామాజిక జీవనానికి అద్దం పట్టేఎన్నో మాటలు కథ ప్రారంభంనుంచి కనబడుతాయి.ఈ రెండు కథ లూ చాలా చిన్నవే. సుమారు అయిదు పేజీలు వుండవచ్చు. నాటకీయమైన ఎత్తుగడతో కూడిన కథ లు ఇవి. రెండు కథలూ బ్రతుకులోని చీకటి కోణాలను చూపిస్తున్నాయి. మొదటి కథ లో కథానాయకుడు స్వయంగా తన కథ చెబుతునాడు –రెండో కథ లో రచయిత కథ చెపుతాడు . రెండో కథ లో రచయిత ప్రత్యక్షంగా సమాజాన్ని విమర్శిస్తూన్నాడు. రెండు కథ ల్లోనూ సామాజిక నేపధ్యం ప్రస్ఫుటంగా కనబడుతుంది .పాఠకుకులను కూర్చోపెట్టి చదివించేవే ఈ రెండు కథలూ.

A house hotel boat on the backwaters in Kerala

మలయాళ కథ సాహిత్యంలోని ఈ తొలి దశ 1925 వరకు సాగింది. ఈ దశలో  కథ రచన  చేసినవాళ్ళలో ముఖ్యలు ఏడుగురు. మొదటి కథ బయిటికి వచ్చాక రెండు కథలు వ్రాసారు ఒడువిల్ కుంజీకృష్ణ మీనోన్ [1869—1916] .చాలా నిడివిగల కథ లు వ్రాసాడు ఇతడు –సంభాషణల నిడివి కూడా ఎక్కువే ఉంటాయి . వర్ణనలు కూడా ఎక్కువే ఇతని కధల్లో.కాని ఒక కథ లో నాయిక మనో సంఘర్షణను అత్యద్భుతంగా వర్ణించాడు అతడు. ఇతని మొదటి కధ 1902 లో అచ్చైంది. మదిరాసు మైసూర్ పట్నాల నేపధ్యంలో కధలు వ్రాసాడు ఇతడు.

అంబాడి నారాయణ పొడువాల్ [1871—1936] వ్రాసిన రెండు కధల్లో జీవితావగాహన ,హాస్యం ,వ్యంగధోరణి మొదలగు అంశాలు కనబడుతాయి. వర్ణనలతో కూడిన ఇతని కధల్లో తుది మలుపు గోచరిస్తుంది.

సి. ఎస్. గోపాల పణిక్కర్ [1872—1930]హాస్య రసాత్మకమైన కధలు వ్రాసారు. మూర్కొత్తు కుమారన్[1874—1941] వ్రాసిన రెండు కధలూ చిన్నవే . ఆధునిక మలయాళ కధల స్వభావం ప్రస్ఫుటంగా కనబడేది కే. సుకుమారన్[1876—1956] అనే రచయిత రచనలలోనే. ఇరవై ముప్పై పేజీల కధలు అతనివి.అయినా ఆసక్తిగా చదివించేవి అవి. దానికి కారణం కధలో కనబడే తుది మలుపే. పరోక్షం గా సామాజిక స్దితిగతులను విమర్శించాయి ఈ కధలు. ‘’పరాయివాడి బిడ్డ ‘’అనే కధ అయితే నేటి అంకురం సినిమాలంటిదే . ఈ కధలో రెల్వే స్టేషనుకి వెళ్ళిన ఒక యువకుడికి ఒక యువతి ఒక చిన్న పిల్లని ఇచ్చి కాస్త చూసుకో అని చెప్పి మాయమవటం అతడు ఆ పిల్లను ఇంటికి తీసుకురావటం భార్య అతన్ని అనుమానించటం అలా అలా సాగుతుంది కధ.మానవ స్వభావాన్నిఅతి వాస్తవికంగా చిత్రీకరించటమే కాక స్త్రీ హృదయానికి అద్దం పడుతుంది ఈ కధ. నేడూ ఇలాంటివి జరగవచ్చు అనిపిస్తుంది మనకు ఈ రోజు కూడా ,ఆ కధలు చదువుతే . కిట్టుణ్ణి నాయర్ 1882—1959] రసిక రంజిని అనే మాసపత్రిక కోసం వ్రాసిన ‘’అప్పున్ని మూప్పీల్ నాయర్ అనే కధ అలనాటి ఉమ్మిడి కుటుంబాల్లో నెలకొన్న పగ కక్ష తీర్చుకోవటం మొదలగు అంశాలను అతి తక్కువ నిడివిలో చిత్రీకరించిన కధ. తొలి నాటికధా రచయితల్లో ప్రస్తావించవలసిన మరో పేరు ఎం. ఆర్. కే. సి. [1881 –1939 ]

తొలి దశలో వచ్చిన కధల్లో ఎక్కువ కధలు విద్యావినోదిని అనే పత్రికలోనే వెలుబడ్డాయి. సామాజిక దృక్పదం కలిగిన కధలతో పాటు హాస్య వ్యంగ్య రచనలు కూడా కనబడుతాయి. తొలి నాటి కధలను ఆధునిక మలయాళ కధలతో కలిపే శృంఖలాలుగా నిలిచిన వారు ఇ. వి. కృష్ణ పిళ్ళ [1894 –1938],వి. టి. భట్టతిరిపాడ్ [1896—1982]భవత్రాధాన్ నంబూతిరిపాడ్[1902 –1944]. ఇ. వి. కృష్ణ పిళ్ళ గారి కధలు కేళీ సౌదమ్ అనే పేరుతో నాల్గు సంపుటాలుగా ప్రచురిపబడ్డాయి. కధ చెబుతూనే అప్పుడప్పుడు పాఠకులతో  స్వయంగా సంభాషించే శైలి ఇతనిది. అంతే కాక శైలి ప్రౌడ గంభీరం కూడా. వర్ణనలప్పుడు అలంకారాలతో కూడిన సాహిత్య భాష వాడినప్పట్టికి సంభాషణ లో వాడుక భాషే వాడాడు ఇతడు. మానసిక సంఘర్షణలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తాడు ఇతడు.

నంబూద్రి కుటుంబాల్లోని స్త్రీల దురవస్థలే వి. టి. భట్టతిరి పాడే, కీ భవత్రాధాన్ నంబుద్రి కీ  కధా వస్తువులు. అంత: పురంలో మగ్గిపోయే  నంబూద్రి స్త్రీల విషాదాన్ని కళాత్మకంగా చిన్న చిన్న  మాటలతో చిత్రీకరించారు వి. టి. స్వభావికత ఉట్టిపడే సంభాషణ రచన భవత్రాధాన్ నంబూద్రి ప్రత్యేకత. . అతని కధల్లో కధ చెప్పేది రచయితే. సంభాషణలు ద్వారా , కధా పాత్రల ఆలోచనలు ద్వారా పాత్రల మనసు బహిర్గతం  చేస్తాడు అతడు.

పలుగురు ప్రముఖ కధా రచయితలు రచన చేసిన 1925 నుంచి 1960 వరకు మలయాళ కధల రెండో దశగా పెరుకోవచ్చు. జాతీయంగానూ అంతర్జాతీయంగానూ పేరు ప్రఖ్యాతులు గడించిన రచయితులు  రచన చేసారు ఈ కాలంలో. కారుర్ నీలకండ పిళ్ళ [1898—1975], పి. కేశవ దేవ్[1904—1983], లలితాంబిక అంతర్జనం [1909—1987 ],వైకం మహమ్మద్ బషీర్[1910—1994], పోంకున్నాం వర్కి[1910—2004], తకళి  శివశంకర పిళ్ళ,[1912—1999 ], ఎస్. కె. పొట్టేకాడ్[1913 –1982], పి. సి. కుట్టికృష్ణన్[ఊరూబ్ –1915 –1979]పులిమాన పరమేశ్వరన్ పిళ్ళ[1916—1947],నాగవళ్లి ఆర్. ఎస్. కురుప్ [1917—2003], ముట్టత్తు వర్కి[1917 –1989],వెట్టూర్ రామన్ నాయర్,కే.సరస్వతి అమ్మ[1919—1975], టి. కె. సి.వడుతల[1921—1988] మొదలైనవారు ఈ కాలంలో రచన చేసినవాళ్ళల్లో ప్రఖ్యాతులు. ఎన్. పి. చెల్లప్పన్ నాయర్ [1903—1972], ఈ. ఎం. కోవూర్ [1906—1983] ఎం. ఎన్,గోవింధన్ నాయర్[1910—1997] చెరుకాడ్[ 1914—1976] ,ఎం.గోవింధన్[1919 –1989]. ఐ.కె.కె. ఎం. మొదలగు కధా రచయితలు కూడా ఈ కాలంలో రచన చేసినవాళ్ళే.

ఈ కాలంలో ,అంటే 1925 నుంచి 1960 వరకు వున్న కాలంలో కేరళలో సజీవమైన ఒక సాంస్కృతిక వాతావరణం ఉంటేది. 1927లో సమస్త కేరళ సాహిత్య పరిషత్తు రూపు దిద్దుకుంది. పరిషత్తు వార్షిక సమావేశాలు సాహిత్య సంస్కృతిక రంగాల్లో ఒక కదలిక సృష్టించింది. 1937 మూడు ముఖ్య సంఘటనలకు సాక్షిగా నిలిచింది. అవి తిరువితాంకూరు మహా రాజు వారి [మొదటిలో నేటి కేరళ ,తిరువితాంకూరు ,కొచ్చి మలబార్ అని మూడు ప్రాంతాలుగా ఉండేవి ]క్షేత్ర ప్రవేశ ప్రకటన, తిరువితాంకూరు విశ్వ విద్యాలయ  స్థాపన ,సజీవ సాహిత్య సమితి స్థాపన మొదలైనవి ఆ మూడు. 7 సంవత్సరాలు తరువాత 1944లో ఆ సాహితి సంస్ద అభ్యుదయ సాహిత్య సమితిగా మారింది. రచయితుల మొదటి సహాయ సహకార సంఘం 1945లో స్థాపించబడింది. 1946లో కేరళ సంస్కృతిక చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిన గ్రంధాలయ సంస్ధ ఏర్పాటైంది .

భారతీయ రాజకీయాలను కూడా కుదిపి వేసే రోజులు అవి. 1920నుంచే రాజకీయ తలంలో గాంధీజీ సాన్నిధ్యం ప్రస్ఫుటంగా కనబడటం మొదలైంది. గాంధీజి సాన్నిధ్యం భారతీయ రాజకీయానికి కొత్త చూపు రూపు ఇచ్చింది. రౌలెట్ అక్టుని వ్యతిరేకించమని గాంధీజీ ఇచ్చిన పిలుపుని మన్నించి లక్షల కొద్ది జనం నిరసనగా రోడ్డెక్కారు  1919లో. అహింస ,సత్యాగ్రహం నిరాహార దీక్ష, సహాయ నిరాకరణ మొదలైన ఆశయాలు ప్రజల ఆలోచనల్లోకి పాకాయి. ఈ ఆలోచనల ప్రతిధ్వనులు తిరువితాంకూర్ ,కొచ్చి మలబార్[ అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సి లో ఒక భాగం ]ప్రాంతాల్లో కూడా వినబడ్డాయి. ఈ కాలంలో జాతీయం గానూ అంతర్జాతీయంగానూ నెలకొన్న వాతావరణం,  జరిగిన సంఘటనలు,  ప్రపంచ మహాయుద్ధం ,స్వాతంత్ర సమరం తద్ఫలితంగా ఏర్పడిన దేశ విభజన వగైరాలు రచయితలను ప్రభావితం చేసాయి. అంతే కాదు స్వాతంత్రానంతర కాలంలో సాయుధ విప్లవం ,ఆ తరువాత పొరపాటు గ్రహించి ప్రజాసామ్య మార్గం అవలంబించి కమ్మునిస్టు పార్టి అధికారం కైవసం చేసుకోవటం [1957 ,ఏప్రిల్ 5] .ఆ తరువాత ఒక అపూర్వ ప్రజా పోరాటం వల్ల [విమోచన సమరం]ప్రభుత్వాన్ని తొలగించడటం ఆ తరువాత ఎన్నికలో కమ్మునిస్టు పార్టి గెలవకపోవటం మొదలైన సంఘటనలు సామాజిక జీవితంలో కల్లోలాలు  సృష్టించాయి. ఈ సామాజిక సంఘటనల కుదుపు కొంత వరకు జీర్ణించుకున్న వారే ఆ కాలంలో రచన చేసిన కారూర్ ,కేశవ దేవ్ ,బషీర్ వర్కి, తకళి, మొదలైన రచయితలు.

కధా స్వభావాన్ని బట్టి పరిగణిస్తే ,కారుర్ లలితాంబిక ,బషీర్ ,ఊరూబ్ మొదలైనవారిని ఒక చోట కట్టవచ్చు. కేశవ దేవ్ వర్కి, తకళి –ముగ్గురూ ఒకే గూటికి చెందినవారు. పొట్టేక్కాడ్,స్వరస్వతి అమ్మ,వెట్టూర్ రామన్ నాయర్, నాగవల్లి,ముట్టత్తు వర్కి, టి. కె. సి. వడుతల  మొదలగువరు మరో రో కోవకి చెందినవారని చెబుతునారు సాహిత్య చరిత్రకారులు.

మలయాళ కధా సాహిత్యంలో ఎలా చూసిన అగ్రగణ్యుడు కారుర్. ప్రభుత్వ అధ్యాపకుడుగా  బ్రతుకు గడిపిన అతడు ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించలేదు . కాని సమకాలీన సమాజం తాలూకు గుండె సవ్వడి నిజాయితితో చిత్రీకరించాడు తన కధల్లో. అతనికి ఆంగ్ల పరిజ్ఞానం లేకపోవటం వల్ల ఆంగ్ల ప్రభావం అతని కధల్లో అసలు కనబడదు.ఇంచు మించి 500 కధలు రాశాడు ఇతడు. అతని మొదటి కధ 1932 లో అఛైన భర్తృవాత్సల్యం. ఇరవై సంపుటాలు వెలువరించారు  –ఇతని కధల్లోని పాత్రలు సగటు మనుషులే. మామూలు మనుషుల రోజువారీ జీవితంలోని చిన్న చిన్న సంఘటనలే కధలకు ఇతివృతం. అపూర్వమైన రచనాశిల్పమూ తొణికిసలాడే మానవీయత ఇతని కధల ప్రత్యేకతలు. అధ్యాపకుల జీవితం గురించి అతడు వ్రాసిన కధలు చాలా ప్రసిద్ధం. ఈ కధలు కొంత’’ ఐరనీ ’ కొంత అతిశయోక్తి మిళితం చేసి వ్రాసారు,కారూర్. తన కధలకు నాటకీయ ప్రారంభం ఇస్తాడు ఈ రచయిత. మధ్యాహ్న భోజనం అనే కధ దీనికి ఉదాహరణ [ఈ కధ తెలుగులో లభ్యం –కధా కేరళం సంకలనం అనువాదకుడు –ఎల్. ఆర్. స్వామి ] ఇరవై ఎనిమిది గంటలు ఏమి తినక ,తినడానికి లేక ,పని చేసి అలసిపోయిన అధ్యాపకుడు ఒకవిద్యార్ధి [అతడు రెండు మూడు గంటలక్రితం ఏదైనా తినివుండవచ్చు] తెచ్చుకున్న అన్నం పొట్లం విప్పి తింటాడు. అలనాటి బడిపంతుల హృదయ విదారక స్దితినికాక ,అలనాటి దుర్భిక్షం గురించి కూడా పాఠకులకు  తెలియచేస్తుంది ఈ కధ. అలనాటి ఆకలి వత్సరాలను  చిత్రీకరించే కధలు ఎన్నో వ్రాసారు కారూర్. అతడే ఎప్పుడూ కధ చెబుతాడు. సంభాషణలు అతని కధలకు ప్రాణం. సంఘటనలుద్వారా  కధా పాత్రల  ప్రత్యేకతల గురించి తెలియపరిస్తాడు. రచయితే మన పక్కన కూర్చుని మనకు కధ చెపుతున్నడనే అనుభూతి కలుగుతుంది అతని కధలు చదువుతువుంటే.

లలితాంబికా అంతర్జనం

లలితాంబిక అంతర్జనం :

సాహిత్య రంగంలో కవయిత్రిగా అడుగు పెట్టారు లలితాంబిక అంతర్జనం[1919—1987] .చెప్పదలచుకున్నది మొత్తం కవిత్వంలో చెప్పలేక పోవటం వల్లనే ఆమె కధలు వ్రాయటం ప్రారంభించారు.బాధలు భరించే ఆత్మల పట్ల తనకున్న సానుభూతియే తను రచన చేయడానికి  కారణం అని ఆమె ఒక సందర్భంలో ప్రస్తావించారు. నంబూద్రి సమాజంలోని దురాచారాలను తేట తెల్లం చేసారు ఆమె. ముఖ్యంగా నంబూద్రి యువతుల దురవస్థను చక్కగా చిత్రీకరించి సమాజానికి అవగాహన కల్పించారు. 1966 లో ఆమె ఇలా వ్రాసారు’’ఒక మారుమూల పల్లెలో కర్షక కుటుంబంలో పుట్టి పొలాల మధ్య జీడి మామిడి తోటల మధ్య ఎదిగిన నాకు కాళీ ,నీలి ,అలగన్ [దళిత వర్గానికి చెందినవారి పేరులు ] మొదలగువారు ఫాషన్ కోసం స్వీకరించిన పాత్రలు కావు. ఆ పల్లె ప్రకృతి తో పాటు నా ప్రకృతిలో ఒక భాగమై మారిన మంచి స్నేహితులు. అంతర్జనాల బ్రతుకుకన్నానేను  ముందు తెలుసుకున్నది వాళ్ళ బ్రతుకు గురించే ‘’. ఈమె వ్రాసిన మొదటి కధ [ముసుగులో]నంబుద్రి సమాజంలో నెలకొన్న బహు బార్యత్వం గురించి ,ఆ సమాజంలోని ఆడపిల్లలను ,అతి చిన్న వయసులోనే నాల్గో పెళ్ళిగానూ అయిదో పెళ్ళిగానూ ముసలివాళ్ళకిచ్చి చేయటం ,భర్త ఇంటిలో సవతులతో వంట ఇంటిలోనే మొగ్గే వాళ్ళ జీవితం వగైరాలు చిత్రీకరించారు. 1938లో ఈమె వ్రాసిన మనోవిశ్లేషణాత్మక కధ చాలా ప్రసిద్ధం. కధ పేరు ‘’ప్రతీకార దేవత’. ఈ కధ కేరళ లో పెద్ద సంచలనం సృష్టించింది. ఇందులోని నాయిక నువ్వూ  ఒక లంజయేగా అనే మాట భరించలేక వెలయాలుగా మారుతుంది. కాని ఆమె మాటలు గమనార్హం ‘’జనం చూడనీ –మగాళ్ళే కాదు స్త్రీలు కూడా దిగ జారవచ్చని –న్యాయంగా ఆలోచిస్తే నంబూద్రి సమాజంలో వెలి వేయవలసినది మగాళ్లను కదా ‘’[ఒకొక్కరూ నాల్గైదు వివాహాలు చేసుకోవటమే కాక కొందరిని ఉంచుకునేవారు కూడా ]castme out if you will

ఈ కధ వ్రాసినప్పుడు రచయిత్రి వయసు ముప్పైకన్నా తక్కువే.

మాతృత్వపు మధిరిమ గురించి బాలల నినిష్కల్మషం  గురించి కూడా కధలు వ్రాసి వున్నారు ఈమె. రాజకీయ పరిణామాలు వల్ల భూసవరణ చట్టం వల్ల నిరుపేదలుగా మారిన  ఎందరో నంబుద్రి జమీందార్ల బ్రతుకులు కూడా ఈమె కు  కధా వస్తువే.  ‘ఒక మాటలో చెప్పాలంటే ఆమె బ్రతికిన నాటి సమాజపు [ముఖ్యంగా నంబుద్రి సమాజం ] గుండె సవ్వడి ఈమె కధల్లో వినబడుతుంది  .

Vaikom_Muhammad_Basheer

వైకోమ్ మహమ్మద్ బషీర్

వైకం మహమ్మద్ బషీర్ : మలయాళ సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం బషీర్ ది  . ఇతని కధలు ,నవలలు చాలా ఎక్కువగానే వివిధ భాషల్లోకి అనువాదం చేయబడింది కనుక ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యాభిమానులకు బషీర్ అపరిచితుడు కాదు. ఇతని కధలకు నిడివి ఎక్కువ. నవలైనా , నవలికలైనా  ,కధ లైనా  ఇంచు మించు ఒకే పరిమాణంలోనే ఉంటాయి. భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంచరించి జీవితం తాలూకు చీకటి కోణాలు స్వయంగా చూసి అనుభవించినవాడు బషీర్. కాని ఆశ్చర్యం ఏమిటంటే అతను వ్రాసిన కధలన్నీ తనకీ తన కుటుంబానికీ పరిచయమున్నవారిదే. అతని కధల్లో కనబడే  హాస్యం  అప్పుడప్పుడు సరిహద్దు దాటి పరిహసించటం వరకు చేరుతుంది. కాని ఆ హాస్యం  అతను తన మీద కూడా ప్రయోగించు కొంటూ  వుంటాడు. మానవీయత అతని ఏ కధలోనైనా  తేట తెల్లమవుతుంది. సునాయసంగానూ స్వాభావికంగానూ ప్రవహించే సుమధుర భాష అతని రచనల ఆస్తి. బషీర్ గారి ఏ ఒక కధ వివరించాలన్నా ,వ్యాసం నిడివి  దాటిపోతుంది కనుక ,బషీర్ రచనలన్ని [ఇంచుమించు ] తెలుగులో లభ్యంకనుక ఆ పని చేయటం లేదు. ముస్లిం జీవితవిధానాలు ఇతని కధల్లో ఎక్కువగా ప్రస్ఫుటమవుతాయి.

ఉరూబ్ [పి.సి. కుట్టి కృష్ణన్]కధను భావగీతానికి దగ్గరగా చేర్చిన రచయిత. మనిషిలో వున్న మంచితనం గురించిన అచంచల విశ్వాసం అతని కధల్లో కనబడుతుంది. ప్రతి మనిషి ఏదో రకంగా సుందరి లేకపోతే సుందరుడు అని నమ్మాడు అతడు. జీవితపు ప్రసాద మధుర భావాల్లో మునిగి తేలేది అతనిమనసు. అందహీనమని వ్యవహరించే వాటిలో కూడా అందం కనిపెట్టే ,దేనిని నిస్సారమని పరిగణించని దృకోణంఅతనిది. నిండు సానుభూతి ఈ దృకోణం కి కారణం. వేసిన వేషాల మీద కోపం తెచ్చుకోవటం అర్ధరహితమని అతని ఉద్దేశ్యం.ఇతని కధల్లో ప్రకృతి కధా నేపధ్యంగా కలిసిపోతువుంటుంది.

సామాజిక పరిణామాలను లక్ష్యంగా భావించి అవసరమైతే ఆ పరిణామాల గురించి కొంత చెప్పవచ్చు అనే అభిప్రాయం కలిగిన రచయితలు ,పి. కేశవ దేవ్,పొంకునం వర్కి,తకళి, మొదలైనవారు. కమ్మునిస్టు పార్టీకి ప్రచురణ కర్తగా ,కేరళలో సాంస్కృతిక ట్రేడ్యూనియునుల వేదికల పై మొదటిసారిగా తన గళం విప్పాడు కేశవదేవ్. కాని సోవియటు యూనియనులో కార్మిక సర్వాధిపత్యం స్టాలిన్ అనే ఒక వ్యక్తి స్వేచ్చాధిపత్యంగా మారటం గమనించి కమ్యునిజానికి  వీడ్కోలు పలికి కమ్మ్యూనిస్టు వ్యతిరేకుల వర్గంలో చేరారు. పొంకున్నం వర్కి వైతే తన వామపక్ష భావ జాలంతోనే కొనసాగాడు. కాని తకళి గురించి ఇవి రెండూ చెప్పలేము. వామపక్ష పద జాలం వైపు మొగ్గున్నవాడే తకళి. కాని వంద శాతం వామ పక్ష పదజాల వాది కాదుఅతడు. వామ పక్షాలను విమర్శించినప్పుడు కూడా వ్యతిరేకుల గుంపులో ఉంటేవాడు కాదు..ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా నిలిచాడు అతడు. కాని ఒకటుంది. ఈ ముగ్గురు రచయితలు సమాజంలోని అట్టడుగు వర్గాల జీవిత సమస్యలు గురించి  వాదించినవాళ్లే –వాళ్ళజీవితాలు మెరుగు పరచటం కోసం నిలబడినవాళ్ళే –ముగ్గురూ మంచి కధా రచయితులే కాక గొప్ప నవలా రచయితలు  కూడా.

పి. కేశవ దేవ్.;[1904—1983]

ఇతడు రచించిన ఎక్కువ కధలకు ఇతివృతం మధ్య తరగతి వాళ్ళ అట్టడుగు వర్గం వాళ్ళ జీవితమే. ఆకలి బాధల గురించి కాని దరిద్రం గురించికానీ బషీర్ కాని తకళి కాని ఇన్ని కధలు వ్రాయలేదు. జమీందారులకు  ,పెట్టుబడుల దారులకు వ్యతిరేకంగా పొర వదలి లేచే అట్టడుగు వర్గ పు పాత్రలు ఇతని కధల్లో కనబడుతాయి. అధికారుల ప్రభుత్వాధికారుల అణిచివేతకి గురై ప్రాణం కోల్పోయిన వారి చిత్రీకరణ కూడా ఉంటుంది. వీళ్ళ వ్యక్తి గత  బంధాల పట్లే రచయిత శ్రద్ధ .ఏ కధ నైనా  ఒకే ఒక ఆశయం కోసం వ్రాసాడు దేవ్ . కుల మతాలకు అతీతంగా ఆలోచించే పాత్రలు ఇతని  కధా పాత్రలు.సంఘటిత శ్రమ శక్తియొక్క ఎదుగుదల ,  రాజకీయ కక్ష సాధింపులు వగైరాలు చిత్రీకరించే కొన్ని కధలు కూడా వ్రాసి వున్నాడు కేశవ దేవ్. కుల మత సంఘటనలకు అతీతంగా వ్రాసిన రెండు కధలు ‘’నాయర్ –ఇళవ గొడవ మరియు ’గుస్తి ‘’చాలా చిన్న నిప్పు రవ్వలు పెద్ద మంటగా మారే విధానాన్ని చిత్రీకరిస్తున్నాయి ఈ కధలు.వ్యక్తి నుంచి ప్రారంభమయే పగ అగ్నిగా మారి సమాజాన్ని ఎలా మింగేస్తుందో చూపిస్తాడు దేవ్ ఈ కధలల్లో. రాజకీయంగా విభేదించేవాళ్ళు సొంత పార్టీ వాళ్ళైనా చంపే హత్యల రాజకీయానికి వ్యతిరేకంగా వ్రాసిన కధ ‘’చంపకు ,తమ్ముడు చంపకు ‘’. అతడు 1965లో [అప్పడు అతని వయసు అరవై ] వ్రాసిన  స్వర్గంలో ఒక సైతాన్ అనే మనోవిశ్లేషణాత్మక కధ కూడా చాలా ప్రసిద్ధం.

పోంకున్నాం వర్కి : పెట్టుబడిదార్ల వ్యవస్థ,జమీందారివ్యవస్థ , పౌరోహిత్యపు వ్యవస్థ [క్రిస్టియన్ సమాజంలో ]మొదలగు మూడు వ్యవస్థలను శక్తి వంతంగా ప్రతిగటిస్తూ రచన చేసాడు  పోంకున్నాం వర్కి. ఇతడు అభ్యుదయ రచయితుల మార్గం అనుసరించాడు. యేసు ప్రేమను మార్క్స్ మానవీయతను ఒకటిగా భావించాడు  . స్వభావికంగానే పెత్తందార్లను పౌరోహిత్యాన్ని పెట్టుబడిదార్లను ఘోరంగా విమర్శించాడు. అందువల్ల వాళ్ళందరూ అతనికి వ్యతిరేకులుగా మారారు. ఏం చెప్పాలి అనేది ఎలా చెప్పాలి అనేదానికన్నా ముఖ్యంగా భావించాడు అతడు. అతడు ఒక సారి అన్నాడు’’రోడ్డు మీద జరిగే దోపిడి గురించి వ్రాసినప్పుడు కొన్ని పరుష మాటలు పడివుండవచ్చు. ఎవ్వరినైనా ఆక్షేపించే బదులు బాగు చేయాలనేదే నా కోరిక. ‘’

‘’నా నిరసన ప్రకటించటం కోసమే నేను రచయితగా మారాను నిరసన తెలుపవలసిన విషయాలు ఉన్నాయి,నాకు “ . నిజమే, నిరసన అతని కధలకు ప్రాణం

Thakazhi_1

తగలి శివశంకర పిళ్ళై

తకళి శివశంకర పిళ్ళ : [1912 -1999]

జీవితసమస్యలు గురించి వ్రాసిన కధకుడే తకళి కూడా . కాని నిరసన ప్రదర్శించడంలోనూ సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించడంలోనూ వర్కి వెళ్ళినంత దూరం వెళ్ళడు తకళి . తన ఏ కధలోనైనా ఒక ప్రశ్న అంతర్లీనంగా ఉంటుందని తకళియే చెప్పారు ఒక సారి. మోపోసొ ,చెకోవ్ స్టీఫాన్ స్వైగ్ మొదలగు పాశ్చాత్య రచయితుల ప్రభావం తకళి లో వుందనేది నిజం. కాని ఈ ప్రభావం కధా కదన రీతికి మాత్రమే పరిమితం.అతనికి తనదైన జీవిత దృకోణం ఉంది. మానవ సంబంధాల్లోని దైన్యానికి కారణం దారిద్రమే అని అతని నమ్మకం. వరద అనే కధ చాలా ప్రసిద్ధమైనది [తెలుగులో లభ్యం ] మానవ మనస్తత్వాన్ని విశ్లేషించిన మరో మంచి కధ ‘’మిలిటరివాడు’’ తకళి రచించిన ఎక్కువ కధలకు కుట్టనాడు నేపధ్యం [కుట్టనాడు –వరి సుభిక్షంగా పండే భూమి గల ఒక చిన్న ప్రాంతం.] తగళి పేరు వినగానే ఎవ్వరికైనా వెంటనే గుర్తు వచ్చేది అతని నవలలే.  కాని తకళి గొప్ప కధా రచయిత కూడా .

ఈ కాలంలోనే తమదైన ప్రత్యేక రచనా వ్యక్తిత్వంతో సాహిత్యానికి సేవ చేసిన మరి కొందరు కూడా వున్నారు. వాళ్ళలో ముఖ్యడు ఎస్. కె. పొట్టేకాడ్. [1913—1982]. తకళిలా కాని ,దేవ్ లా కాని నిరసనతో మండిపడి  అరవలేదు ఇతడు . ఇతరులుకు కోపం వచ్చే చోట అతనికి కొంత తమాషా అనిపించేది. భారత దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా కూడా పలు చోట్ల సంచారిలా తిరిగిన ఇతడు ప్రకృతి వైవిధ్యాన్ని ,మానవ జీవిత వైవిధ్యాన్ని దర్శించిన రచయిత. అందువల్లనే ఇతని కధలో కనబడెంత వైవిధ్యం గల కధాపాత్రలు ,కధా నేపధ్యం ఇతర కధా రచయితుల రచనల్లో కనబడవు. కధా నిర్మాణంలో దేవ్ కన్నా తకళి కన్నా ఎక్కువ శ్రద్ధ తీసుకొనేవారు .  అద్భుతమైన కొస మెరుపు ఉంటుంది కధల్లో. చాలా నిడివిగల కధలు ఇతనివి .రెండు మూడు దశాబ్దాల్లో నడిచే కధని కూడా కధగా వ్రాసారు ఇతడు . పుళిమాన అనే అతడు వ్రాసిన కధలు కవి వ్రాసిన కధలు. ఒక భావ గీతంలా ఉంటాయి అతని కధలు.  కధా వస్తువు అతి తక్కువే ఉంటుంది ఇతని కధల్లో. అతి చిన్న వయసులో చనిపోయిన ఈ కధా రచయిత [1916—1947]ఆ తరం రచయితుల ముందు ఉంటేవాడు.

నాగవళ్లి [1917—2003] నవలలూ కధలూ రచించారు. సామాజిక విమర్శ అతని రచనల్లోని అంతరార్థం . మనకు రోజు ఎదురయే జీవిత సంఘటనలకు హాస్యం జోడించి జీవితముయొక్క ఐరనీ   బోధపడే విధంగా వ్రాస్తాడు నాగవళ్లి. అతని ఒక పాత్ర ఇలా అడుగుతుంది ‘’నాకు అర్ధం కావటం లేదు. శాశ్వతమైన దివ్య ప్రేమకి నశ్వరమైన శరీరమూ లౌకికమైన వివాహమూ ఎందుకు ? ’’నిరుపేద కుటుంబాల్లోని [ఏ కులానికి చెందినదైనా ]సంఘటనలను ఆధారం చేసుకొని రచన చేసిన కధకుడు వెట్టూర్. కాని అట్టడుగు వర్గంవారి కధలు హాస్య రసంతో మిళితం చేసి వ్రాసిన రచయిత టి. కే. సి.వడుతల. [1921-1988 ]. పులయ [మాల ]సమాజానికి చెందిన వారి స్వప్నాలు ,స్వప్న భంగాలు,పులకింతలు ,ధర్మ సంకటాలు ఇతని కధల్లో నిండా కనబడుతాయి .  కుట్టనాటి మాలను  ఆవిష్కరించిన తకళి  కాని , మాల సమాజానికి చెందినవారిని రైతు కూలీల నాయకులుగా ఆవిష్కరించిన తోప్పీల్ భాసి కాని [ప్రముఖ నాటక రచయిత –తులాభారం తెలుగులో మనుషులు మారాలి ,రచయిత ] చిత్రీకరించిన దానికన్నావాళ్ళ జీవిత సమస్యలూ సంకీర్ణతలూ చిత్రీకరించ గలిగాడు ఈ రచయిత . క్రైస్తవులుగా మతం మార్చుకున్న మాలల ధర్మ సంకటాలను వివరించి ఇతడు వ్రాసిన కధ చాలా ప్రసిద్ధం .

హాస్య కధలు :

తమ హాస్య కధలతో మలయాళ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కధకుల ఆవిర్భావం కూడా ఇంచుమించి ఈ కాలంలోనే. ఎన్. పి. చెల్లప్పన్ నాయర్ [1903 –  1973],ఎం.న్.గోవిందన్నాయర్[19101997],ఆనందకుట్టన్[1920 –2000]మొదలైనవారు ముఖ్యలు. ఈ రచయితల్లో జీవితపు సంక్లిష్ట కోణాలకు హాస్యం మిళితం చేసి శక్తి వంతంగా రచన చేసిన వారు చెల్లప్పన్ నాయర్. అతి తక్కువ రచనలే చేశాడు ఇతడు. సహృదయుడైన ఒక మాన్యుడు జీవితంలోఇంకివున్న హాస్యం దర్శించి మనకు చెబుతునట్లు ఉంటాయి ఇతని కధలు. ఆనందకుట్టన్ రచించిన కధలు పూర్తి గ్రామ్య భాషలో ఉంటాయి. అతని హాస్యం వెనక సామాజిక విమర్శ దాగివుంటుంది. పి. కె.రాజ రాజ వర్మ 1907 –1987 ]వేళూర్ కృష్ణన్ కుట్టి కూడా [1927—2003]ఈ కోవకి చెందిన రచయితులే. దేవ్ ,తకళి కాలఘట్టానికి ఆధునిక మలయాళ కధకు పునాది వేసిన ఎన్. పి. మహమ్మద్,టి. పద్మనాభన్, మాధవికుట్టి [కమలాదాస్ ]ఎం. టి. మొదలగు కధకులకు మధ్య ఒక లింకు లా వర్తించే గొప్ప కధకులు కోవిలన్ [1923]జి.వివేకానందన్ [1923-1999],పొంజీకర రాఫీ [1924 -1993 ]పారపురత్ [1924-1981]నందనార్ [1926-1974 ]కే. టి. మహమ్మద్ 1929—2008 ]  పట్టత్తు విల కరుణాకరన్ [1926 -1985 ]మొదలైనవారు .

నందనార్ ,కోవిలన్, పారపురత్ ,–ఈ ముగ్గురికి మిలిటరీ కధల రచయితలుగా కూడా గొప్ప కీర్తి లభించింది మిలిటరీ జీవితానికి సంబంధించిన కధలు ఎన్నో రచించి ప్రజలకు జవానుల జెవితం గురించి వాళ్ళ కుటుంబ జీవిత సమస్యల  గురించి మంచి అవగాహన కల్పించారు వీళ్ళు . కధకుడుకన్నా గొప్ప నాటక రచయితగా ప్రసిద్ధుడు కే.టి.మహమ్మద్.

రాజకీయ విషయాలు ఇతివృత్తంగా స్వీకరించి మంచి కధలు రచించిన కధకుడు పట్టత్తు విల కరుణాకరన్. వామ పక్ష భావ జాలాన్నే కాదు అన్ని రాజకీయ భావ జాలాన్ని ప్రశ్నించే ధోరణి అతని కధల్లో కనబడుతుంది . రచనా పరమైన సాహసాలు చేయటంలో ముందు ఉండేవాడు అతడు .

( వచ్చే వారం ఆధునిక మళయాళ కథ )

LR-SWamy-240x300— ఎల్. ఆర్. స్వామి

స్త్రీవాద విమర్శలో కాత్యాయని కొత్త దారి!

కాత్యాయని విద్మహే

కాత్యాయని విద్మహే

(కాత్యాయనీ విద్మహే గారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు సందర్భంగా)

తెలుగునాట స్త్రీవాద సాహిత్య విమర్శ అనగానే గుర్తుకు వచ్చే అతి కొద్ది విమర్శకుల్లో కాత్యాయని విద్మహే ఒకరు. స్త్రీవాదమంటే విదేశాలనుండి దిగుమతి చేసుకున్న వాదంగానే ఇంకా అనేకమంది వ్యాఖ్యానిస్తుండగా, స్త్రీల జీవితాల్లోని ఆరాట, పోరాటాల చరిత్ర ఈనాటిది కాదు,సంప్రదాయ సాహిత్య కాలం నాటికే వుందని సహేతుకంగా నిర్ధారించి, సాధికారికంగా చెప్పిన విమర్శకురాలు విద్మహే. ప్రాచీన సాహిత్యం పవిత్రతని నెత్తిన పెట్టుకోడమో, లేదా పరమ ఛాందసమని తీసిపారెయ్యడమో కాకుండా ఒక సమన్వయంతో, సదసద్వివేచనతో ప్రాచీన సాహిత్యాన్ని ఆధునిక దృష్టికోణం నుండి చూడాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ దిశగా తన విమర్శనా మార్గాన్ని ఎన్నుకున్నారు విద్మహే.ఈవిధంగా చేయడం వల్ల అటు ప్రాచీన సాహిత్యానికి, ఇటు స్త్రీవాద విమర్శకు ఆమె సరైన న్యాయం చేయగలిగారు. కాత్యాయని లాంటి విమర్శకులు చేసిన ఇలాంటి కృషి వల్ల ‘దేశీయ స్త్రీవాదచైతన్యం’ మూలాలు తెలుకునే వీలు కలుగుతోంది. అయితే ఈ దిశగా తరువాత స్త్రీవాద విమర్శకులెవరూ పెద్దగా కృషి చేసినట్టు కనిపించడంలేదు.

రెండు దశాబ్దాల పైబడి తెలుగు సాహిత్య విమర్శలో కాత్యాయని చేస్తున్న కృషి ప్రముఖంగా చెప్పుకోదగ్గది. కేవలం సమీక్షాత్మకంగా కాకుండా,’లోనారసి’ విశ్లేషణ చేయడం ఆమె విమర్శలో ప్రధానమైన లక్షణం. ఈ లక్షణమే ఆమెకు, ఆమె విమర్శకు ఒక విశిష్టత చేకూర్చగలిగింది.

కాత్యాయని సాహిత్య విమర్శ కృషి ని రెండు పాయలుగా విశ్లేషించి చూడటం అవసరం. స్త్రీవాద సాహిత్య విమర్శ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టినా అంతకుందు ఆమె చేసిన కృషి మరింత ముఖ్యమైంది. కవులు, కవిత్వ విమర్శల ఆకర్షణల నుండి తప్పుకొని తథ్భిన్నంగా కవిత్వేతర సాహిత్య ప్రక్రియలైన కధ,నవల మీద దృష్టి నిలిపి ఏకాగ్రతతో కృషి చేసిన, చేస్తున్న విదుషి విద్మహే. 1977లో ఎమ్మే పూర్తి చేసి ఆధునిక సాహిత్యంలో మరీ ముఖ్యంగా నవల,కథానిక ప్రక్రియల మీద అభిరుచితో పరిశోధన ప్రారంభించారు విద్మహే.సాహిత్య చరిత్ర నిర్మాణంలో భాగంగా ఆమె వివిధ వాఙ్మయ జీవిత సూచికలు రూపొందించారు. కొడవటిగంటి కుటుంబరావు వాఙ్మయ జీవిత సూచిక, నవలా రచయతల పరిచయ విమర్శనల సూచిక ఈ కోలోనివే. కాత్యాయని 1986లో రూపొందించిన కొ.కు.వాజ్మయ జీవిత సూచిక విశేష కృషిగా చెప్పుకోవాలి.

1980లో కొ.కు. చనిపోయిన తర్వాత మొదలెట్టి కనీసం ఆరేళ్ల పాటు పరిశోధించి ఆమె ఈ సూచిక తయారుచేశారు. ఈ సూచిక తయారీ అంతా ఒక ఎత్తు, దీని కోసం ఆమె తయారు చేసిన క్షేత్ర పర్యటన మరో ఎత్తు. ముఖ్యంగా ఈ పుస్తకానికి కాత్యాయని రాసిన పీఠిక ప్రముఖంగా పేర్కొనతగినది. ఇలాంటి విస్తృతమైన కృషినే ‘తెలుగు నవలా, కథానికా విమర్శనా పరిణామం’లో కూడా చూడవచ్చు.

1995లో ప్రచురితమైన ఈ పుస్తకం మొదటి అరవై పేజీలు కధ,నవలాసాహిత్య విమర్శనా పరిణామం చెపుతుంది.తెలుగు లో మొదటి నవల ఏది లాంటి చర్చల్ని తిరగతోడకుండా ప్రస్తుత సాహిత్య సందర్భంలో వచన సాహిత్యానికి సంబంధించిన దృక్పథాంశాల్ని ఈ పుస్తకం చర్చల్లోకి తీసుకు వచ్చింది. తెలుగు సాహిత్య ప్రపంచంలో కథ,నవల ప్రక్రియలపై కలిగిన చైతన్యాన్ని చరిత్రాత్మకంగా రికార్డు చేయడం ఈ పుస్తకం సాధించి్న విజయం.

వీటికంటే ముందు 1986లో అనంతపురం లోని ‘కదలిక’ పత్రిక నుంచి పునర్ముద్రించిన ‘తెలంగాణా పోరాట తెలుగు కధ-నవల’ అనె పెద్ద వ్యాసం ప్రస్తుత సాహిత్య సందర్భంలో ప్రత్యేకించి పేర్కొనతగినది.తెలంగాణా పోరాట సందర్భాన్ని కథ, నవల సాహిత్యంలో ఎలా వ్యక్తీకరించాయన్నది ఈ వ్యాసంలో ఆమె చెప్పారు.అప్పటి రైతాంగ పోరాటంతొ, ఇప్పటి జీవన పోరాటాన్ని సరిపోల్చుతూ వచ్చిన కధల్ని కాత్యాయని విశ్లేషించారు. తెలంగాణ వాస్తవికతని, సాహిత్యంలో దాని ప్రతిఫలనాన్ని మన కళ్ళ ముందుంచే ఈ వ్యాసం అప్పటికంటే ఇప్పుడు మరింత ఉపయోగకరమైందని చెప్పవచ్చు.

ఈ పరిశోధనాత్మక రచనలన్నింటిని ఒక్క సారిగా చదవడం మొదలుపెడితే, కాత్యాయని విద్మహే సాహిత్య దృక్పథం ఏమిటో మనకు స్పష్టమవుతుంది.మొదటి నుంచి కూడా చరిత్ర దృష్టి నుంచి సాహిత్యాన్ని విశ్లేషించే విమర్శకురాలిగా ఒక ప్రత్యేక రచనని ఎలా విశ్లేషించవచ్చో చూపించే ప్రయత్నం చేశారు మరో విమర్శ పుస్తకం’చివరకు మిగిలేది:మానసిక జీవన స్రవంతి నవలావిమర్శ’(1987)లో. స్త్రీవాద దృక్పధం నుంచి కాత్యాయని రాసిన మొదటి విమర్శ గ్రంధం బహుశా ఇదే కావచ్చు. ముఖ్యంగా ఒక పురుష పాత్రకు ఫెమినిస్టు దృక్పధాన్ని ఆపాదించి, విశ్లేషించడం ఈ అధ్యయనంలో విశేషంగా చెప్పు కోవాలి.

ఆ తర్వాత నుంచి కాత్యాయని విమర్శ దృక్పధంలో మార్పు వచ్చింది. ఈ మార్పుకు దర్పణం 1998లో వచ్చిన ‘సంప్రదాయ సాహిత్యం-స్త్రీవాద దృక్పధం’.ఆమే స్వయంగా చెప్పుకున్నట్టు ‘సామాజిక,సాంస్కృతిక రంగాల్లో ఉద్యమ స్థాయిలో ప్రచారంలోకి వచ్చిన స్త్రీవాద భావజాలం, యూనివర్శిటి పరిశోధనా రంగంలోకి చొచ్చుకొచ్చిన మహిళా జీవన అధ్యయన విధానం’ రెండూ కాత్యాయని సాహిత్య జీవిత దృక్పధాన్ని ప్రభావితం చేశాయి. ప్రధానంగా ఈ పుస్తక రచన ఆమెలో వచ్చిన గాఢమైన మార్పుని చూపిస్తుంది.

ప్రాచీన సాహిత్యంలో స్త్రీ-పురుష సంబంధాల విశ్లేషణ, వాటిని స్త్రీవాద దృక్పధం వెలుగులో చూడడం ఈ పుస్తకం వుద్దేశ్యం.భారతంలో భార్యాభర్తృ సంబంధాలతో మొదలై, మహిళావాద భూమిక నుంచి కావ్య శాస్త్ర దర్శనం వరకూ ‘మిరుమిట్ట్లు గొలిపే కొత్త ప్రతిపాదనవలతో’ ఈ విశ్లేషణ సాగుతుంది.సాంప్రదాయ సాహిత్యంలో కనిపించే స్త్రీల జీవితానికి వెనుక వుండే కనపడని పితృ స్వామిక హింసా రూపాలను, ఆ సాహిత్యంలోని కధ నిర్మాణాన్ని,మాటలను,సంభాషణలను బట్టి ఎంత సమగ్రంగా తెలుకునే వీలుందో అన్వేషిస్తాయి ఈ వ్యాసాలు. స్త్రీవాద విమర్శ దిశను మార్చిన రచన ఇది. నిజానికి ఈ పుస్తకంలోని ఒకొక్క వాక్యం విస్తృతంగా చర్చించతగినదే. ఈ వ్యాసాల్లోని ఆలోచనలు ప్రసరించే వెలుగులోసంప్రదాయ సాహిత్యం మన ముందు కొత్త అర్థాల్ని స్పురింప చేస్తుంది. బహుశా ఈ విధమైన రచన కాత్యాయని లాంటి కొద్దిమంది మాత్రమే చేయగలరేమో!

(‘ఈమాట’ వెబ్ పత్రిక సౌజన్యంతో)

Kalpana profile2– కల్పనా రెంటాల

బోలెడు కరుణ…కొంచెం ఆగ్రహంతో…!

25VZVIJREG2WRIT_25_1309849e

(ప్రసిద్ధ కథా రచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి 75 వ పుట్టిన రోజు : డిసెంబర్ 15)

ఓ బోయవాడు బాణం వదిలాడు. పూర్వాశ్రమంలో దొంగగా బతికిన ఓ వ్యక్తి అక్కడ నిలబడి జంట పక్షుల్లో ఒకటి నేలకొరగడం చూశాడు. తోడు కోల్పోయిన రెండో పక్షి కన్నీరులో కరిగాడు. కరుణరసాత్మకమైన ఓ కావ్యానికి బీజం పడింది. ఇది మనందరికీ తెలిసిన వాల్మీకి కథ. జాగ్రత్తగా గమనించండి. వాల్మీకికి అప్పుడు కలిగిన భావన కేవలం కరుణేనా? బాణం వేసిన బోయవాడి మీద కోపం రాలేదా? ప్రాణాలని కబళించి మిగిలిపోయినవారికి విషాదాన్ని మిగిల్చే మృత్యువు మీద ఆగ్రహం కలగలేదా? ప్రేమ జంట తనని వీడిపోయిందని ఏడుస్తున్న పక్షి కన్నీరు తుడవలేని అశక్తతని తలుచుకోని వాల్మీకికి అసహనం కలగలేదా? ఒకవేళ అలాంటి ఆగ్రహం, అసహనం కలిగివుంటే వాల్మీకి రాసిన కావ్యం ఎలా వుండేది?

నేను చెప్పనా?

అప్పుడు కూడా రామాయణం కరుణరసాత్మకంగానే వుండేది. ఆ వాల్మీకి పెద్దిభొట్ల సుబ్బరామయ్య అయితే. ఆగ్రహానికీ కరుణకు ఏమిటీ సంబంధం? తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నమైనా చెయ్యాలి. ఎలా? పెద్దిభొట్ల కథలు చదవాలి. “ద్రణేవుడు” ఎవరు? ఎవరో వుండే వుంటారు. వెతకాలి. వెతుకుతూనే వుండాలి. తెలుసుకుంటే జ్ఞాని అవుతాడు. తెలుసుకోలేనివాడు “ఇంగువ” అంటే ఏమిటో ఎరగని వాడిలా జీవితాన్ని చాలిస్తాడు. ముగిసిపోయేది కాదు జీవితం అంటే, తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తావే అదీ జీవితం అంటే..

అలా కాదు నీకు తెలిసిందే ప్రపంచం అనుకుంటావా… ఆల్ రైట్… గాటానికి కట్టిన ఎద్దులా గిరా.. గిరా.. గిరా… బావిదాటని కప్పలా బెక బెక బెక బెకా…! తనకు తెలియని కొత్త ప్రపంచం ఒకటుందని, అందులో కనుచూపు సాగినంత మేర “నీళ్ళు” వుంటాయని తెలియని వాడు ఏమౌతాడు? మంచినీళ్ళు కనిపిస్తే అవురావురంటూ తాగుతాడు. గంటలుగంటలు స్నానాలు చేస్తాడు. చివరికి ఓ ముహూర్తాన నీళ్ళలోనే పడి చస్తాడు. మరి అతను తెలుసుకోవాల్సిందేమిటి? ఓ వూరిలో నీళ్ళు లేక ఛస్తుంటే మరో వూర్లో నీళ్ళలో మునిగి చస్తుంటారు. ఈ వైరుధ్యాన్నే తెలుసుకోవాలి. ఈ వైరుధ్యం పేరు కూడా జీవితమే.

అయితే ఈ జీవితం గురించి మనకి చెప్పేది ఎవరు? నేను చూడని కొత్తకోణం వైపు బైనాకులర్స్ పెట్టి చూపించేది ఎవరు? ఒక పుస్తకం. ఒక జిజ్ఞాస. ఒక ప్రశ్న. ఇదిగో అలాంటి ప్రశ్నలన్నింటినీ తలకెత్తుకోని తిరిగే పెద్దమనిషి ఒకాయన వున్నాడు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య అంటారు ఆయన్ని. మృత్యువుని రక్తం రంగులో కళ్ళారా చూసినవాడు. తల్లిప్రేమని అభద్రత రూపంలో అనుభవించిన వాడు. కష్టాన్ని కన్నీటి రుచిలో తెలుసుకున్నవాడు. జీవితం అంటే కషాయం అని కనిపెట్టిన మానసిక శాస్త్రవేత్త. ఆ కషాయాన్ని ఏ మిశ్రమాలలో కలపాలో తెలుసుకున్న సరికొత్త రసవాది. కథ అనే అంబులపొదిలో అక్షయతూణీరాల్లాంటి పాత్రల్ని పెట్టుకోని మనసుని కరుణాస్త్రబద్ధుల్ని చేయగల విలుకాడు.

కవిసామ్రాట్ దగ్గర శిష్యరికం చేసినవాడు పోనీ కవిత్వం రాసి వుండచ్చుగా? కథని పట్టుకున్నాడు. కథ ఆయన్ని పట్టుకుంది. కథల్లో వర్ణన చూడండి. ఒకో కథలో ఒకలాగ వుండే వాతావరణం చూడండి. నిప్పుల మీద నుంచి వీస్తున్నట్లుగా వేడిగాలులు, బాగా బలిసిన ఏనుగుల్లా మబ్బులు, వాన జల్లులు, ముసురు పట్టడాలు, గుడ్డివెన్నెలలు, తెల్లటి వెండి కంచంలాంటి చంద్రుడు, వేప చెట్లు అబ్బో.. ఇంకా చాలా వున్నాయి. ఇవన్నీ కథలోకి వచ్చి ఏం చేస్తున్నాయి? చదివిస్తున్నాయి. అంతే. ఏ వాక్యాన్ని విత్తనంగా వేస్తే ఏ అనుభూతి మొలకెత్తుతుందో తెలియడమే రచన. అదే కదా కావాల్సింది.

వుద్యోగంలో చేరాల్సినరోజే ఎగ్గొట్టి “పథేర్ పాంచాలి” చూసినవాడు పోనీ సినిమా అయినా తీసుండచ్చుగా? లేదు. మళ్ళీ కథలోకే వచ్చాడు. సినిమా చూపించాడు. కావాలంటే అయన రాసిన తొలి కథల్లో ఒకటైన “భయం” (1960) చూడండి. ఓ పిల్లవాడు గోడగడియారం బద్దలుకొట్టాడు. నాన్న వస్తే బెత్తం విరిగేట్లు కొడతాడని భయం. అదే కథ. అంతే కథ. ఆ పిల్లాడి భయం చెప్పాలంటే వాడి మనసులో దూరి తెరలు తెరలుగా వున్న భయాన్ని పొరలు పొరలుగా వ్యాక్యాలలో చెప్పాలా? ఊహు.. అలా కాదు. ఎండ, ఎండుటాకులు, టెలిగ్రాఫ్ తీగలమధ్య చిక్కుకున్న గాలిపటాలు, వీధి చివర తోలుతిత్తి వొత్తుతుంటే వచ్చే ’గుఫ్ గుఫ్’ చప్పుడు, మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్న ముసల్ది, దూదేకులవాడు ఏకుతున్న దూది, ఓ ఇంటి పంచాలో ఓ చిన్నపిల్ల వూదుతూ పగలగొట్టిన బెలూన్, ఆ చప్పుడుకి ఏడ్చిన చంటిపిల్లాడు… ఏమిటిదంతా? సంబంధంలేనివేవో చూపిస్తూ ఆ పిల్లాడి మనసులో భయాన్ని పరిచయం చేస్తాడు. ఈయనెవరు సైకాలజిస్టా? దాదాపు అలాంటిదే – స్కూల్ మేష్టరు.

“నేను ఏదీ టెక్నిక్ ప్రకారం రాయలే”దని. “కథకి మేథమేటిక్స్” వుండదని చెప్పిన రచయితేనా రాసింది? అవున్నిజమే. ఆయన టేక్నిక్ అనుకోని రాయడు. అది రాసిన తరువాత ఆ టెక్నిక్ గురించి మనం తెలుసుకుంటాం.

కథలన్నీ కరుణరసం అన్నామా? మరి మనసుల్ని తాకేవి, పిండేవి, కాల్చి నుసి చేసేవి రాసాడా? అదీ లేదు. మరేం చేశాడు?చెప్పదల్చుకున్నది మూడు పేజీలలో తేల్చేశాడు. ఆ మూడు పేజీల్లోనే ఓ సస్పెన్స్ థ్రిల్లర్ తయారు చేశాడు. కరుణరసాత్మకమైన కథలో ఓ సస్పెన్స్ థ్రిల్లర్? ఇదెలాగా? అదలాగే. ఏ వాక్యమైతే కథకి మూలమో ఆ వాక్యాన్ని గుండెకి దగ్గరగా పెట్టుకోని, షో చెప్పేముందు విసిరే ట్రంప్ కార్డులా విసిరి కథ ముగిసిందంటాడు. అదేమి చిత్రమో మన మనసులో కథ అప్పుడే మొదలౌతుంది. “అన్నదాత సుఖీభవ” కథ చూడండి. పురుషోత్తం అనే వ్యక్తి కథ చెబుతుంటాడు. ఎక్కడో సత్రంలో తప్పక అన్నదాన పంక్తిలో భోజనం చెయ్యాల్సివచ్చిన సంగతి అది. తీరా తిన్నాక అక్కడ బోర్డుమీద వున్న పేరుని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నానంటాడు. ఆ పేరేమిటో చెప్పడు. ఆ తరువాత మూడు పేరగ్రాఫుల సమయం గడిచాక, పక్కనున్న మిత్రుడు అడిగితే గాని ఆ పేరు ఎవరిదో పాఠకుడికి తెలియదు. ఆ తరువాత లైనుకి కథ అయిపోతుంది. ఇది కొసమెరుపుతో ముగించడం కాదు. ఒక మెరుపుని కొసదాకా లాక్కొచ్చి పడేయడం. ఆయన రాయడానికి కలం వాడుతారా? ఉలి వాడుతారా? తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఎలా?మధ్యతరగతి జీవితాలని కాచి వడబోసిన కషాయం కనిపెట్టిన కథకుణ్ణి తెలుసుకోవద్దూ? అర్థంకాని లిపిలో దేవుడు రాసిన జీవితమనే కావ్యాన్ని అలతి తెలుగుపదాలలోకి మార్చిన అనువాదకుణ్ణి తెలుసుకోవద్దూ? అగ్రవర్ణం అని పిలవబడే జాతిలోకూడా అస్పృశ్యుడైన దళితుణ్ణి పరిచయం చేసిన మనిషిని గురించి తెలుసుకోవద్దూ? ఆటల్ని కూడా కథలుగా మార్చగలిగిన రచయితని తెలుసుకోవద్దూ? మీరే చెప్పండి – తెలుసుకోవాలా లేదా? మరింకెందుకాలస్యం తెలుసుకోండి –

ఇంతకీ ఇంగువ ఏమిటి? తెలుసుకున్నారా? “అది చెట్టు నుంచి వొస్తుందా? ఏదైనా రసాయనిక పదార్థమా? లేక ఒక రకం రాయి వంటిదా? అది గాక ఏదన్నా జంతువుకు సంబంధించినదా?” తెలుసుకున్నారా?లేక తెలియకుండానే..???

(ఒక కథకుణ్ణి నేను ఎందుకు అభిమానిస్తున్నాను అన్న ప్రశ్నకి నేను వెతుక్కున్న జవాబులే రాశాను తప్ప సమీక్షలు చేసే అర్హత నాకు లేదని నా విశ్వాసం – రచయిత)

– అరిపిరాల సత్య ప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

అరిపిరాల సత్యప్రసాద్

ఇది అనామకురాలు, గాయత్రీ దేవుడి తో ముఖాముఖి!

 Dr Gayatridevi

ఔను, మీరు సరిగ్గానే చదివారు.
అనామకుడి “రమణీయం” 2006 లో ప్రచురణకి నోచుకుంది.

పుస్తకాన్ని ఇతరులకి అంకితం ఇవ్వడం ఒక సంప్రదాయం.  దాన్నిఛేదించాడు ఈ అనామకుడు.  తనకే అంకితం ఇచ్చుకున్నాడు.  ఆ అంకితం ఎలా ఇచ్చుకున్నాడో తన మాటలలో చూద్దాం!

” (గాయత్రీ)  దేవి,

నేనైన నీకు

నీవైన నేను

(రామం) బావ”

అందుకని విడదీయలేము.  అంత రమణీయంగా ఉంది వారి జీవితం.  కాబట్టీ ఇద్దరితోను కలిపి కూడా ఒక ముఖాముఖి!  ఆమె ఐన అతను. అతను ఐన ఆమె.  అమె అనామకుడు. అతను డా.గాయత్రీ దేవి.

గాయత్రీదేవి ఉషశ్రీ పెద్దమ్మాయి.  వైద్యం, చిత్రలేఖనం, రచనావ్యాసంగం – మూడు గుర్రాల స్వారీ.  రచనావ్యాసంగంలో ఆయుర్వేద పుస్తకాలు వ్యాసాలతోపాటు అడపాదడపా కథలు. అందులో కొన్ని హాస్యం, కొన్ని అ-హాస్యం.  వాటినీ వీటినీ కలిపి ఓ పుస్తకంలా వేస్తున్నారు.

అంతకుముందు ప్రచురణలు – ప్రకృతివరాలూ, అమ్మాయీ అమ్మా అమ్మమ్మా, నాన్నగారి అసంపూర్ణరచన పూరణ, ఎవరితో ఎలా మాట్లాడాలి—అన్ని రంగాలలో చేస్తున్న కృషికి గుర్తింపుగా భరతముని ఆదర్శమహిళా పురస్కారం, ముంబయి ఆంధ్రమహాసభ ఉత్తమ మహిళా పురస్కారం. పత్రికల ద్వారా, టీవీ ద్వారా తెలుగు వారికి సుపరిచితం.

 

Qఅనిల్: తన రచనలు మీరు చదువుతారా?

అనామకుడు:తను తెలుగులో రాసిన కధలూ, వ్యాసాలూ చదువుతాను. తను రాసిన ఆయుర్వేదపరమైన పుస్తకాలూ వ్యాసాలూ నేను చదవలేదు. అలాగని చదవలేదనీ చెప్పలేను. ఒక్కోసారి వాటి ఎడిటింగ్ పని నాకు అప్పగిస్తుంది. అప్పుడు చదువుతాను.

Qఅనిల్మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రాస్తారు?

 అనామకుడు: నేనెక్కువ చదువుతాను. తక్కువ రాస్తాను. తనకి నెలనెలా రాయాల్సిన శీర్షికలు ఉంటాయి. తన పుస్తకాలూ వ్యాసాలూ జనానికి అవసరమైనవీ, ఉపయోగించేవీ.

Q అనిల్: మీకు రచనాసక్తి ఎలా కలిగింది?

 

అనామకుడు: నాకు పద్యాలు రాయాలన్న మక్కువ చిన్నప్పుడే కలిగింది. ఆ ఆసక్తికి కారణం – మా నాన్నగారూ మా పదో తరగతిలో మా తెలుగు మాస్టారూ. పద్యాల మీద ఇష్టం తర్వాత తర్వాత కధల మీదకి మళ్ళింది.

 

Qఅనిల్మీరు కలిసి రాయరా? చాలా మంది భార్యాభర్తలు ఆ పని చేస్తారు కదా?

 

అనామకుడు: లేదు. అది కుదిరే పని కూడా కాదు. ఒకే ఒక్క కధని ఇద్దరం రాసినట్లు ఉంటుంది. కథ తనది. కథనం నాది. పేరు ఎవరికి ఎవరు అని గుర్తు.

 

Qఅనిల్: ఐతే ఇద్దరూ కలిసి సాహితీ వ్యాసంగం చెయ్యలేదనే అనుకోవాలి.

అనామకుడు: కలిసి రాయలేదు కానీ ఇద్దరి రచనలకి ఒకరి సాయం ఇంకొకరికి ఉంది. కొత్తగా ఓ ప్రయోగం చేస్తున్నాం. ఇద్దరం చెరో పుస్తకం వేస్తున్నాం. నా పుస్తకానికి తను ముందు మాట రాస్తే తన పుస్తకానికి నేను రాసాను.

 

Qఅనిల్:ఏమిటా పుస్తకాలు?

 

అనామకుడు: తను రాసిన కధల్లో ఎక్కువ హాస్య కధలు ఉన్నాయి. కొన్ని హాస్యం కాని కథలూ ఉన్నాయి. అవీ ఇవీ కొన్ని ఏరి హాస్యాహాస్య కథలు అని వేస్తోంది.

ముగ్గురు కలిసి నవ్వే వేళల...

ముగ్గురు కలిసి నవ్వే వేళల…

Qఅనిల్: ఎప్పుడు విడుదల?

అనామకుడు: విడుదల అని మేమేం కార్యక్రమం పెట్టుకోవడం లేదు. ఇంతవరకూ నా పుస్తకం దేనికీ అలా చెయ్యలేదు కూడా. ఐతే నవంబర్ పదకోండో తేదేన ఆన్లైన్ సైట్లో దొరికేలా చేస్తున్నాం. అదే విడుదల.

 

Qఅనిల్: చివరిగా ఏదన్న మాట చెప్తారా?

 

అనామకుడు: తన పుస్తకాలు చాలా మార్కెట్లో ఉన్నా మొదటిసారిగా కథలపుస్తకం వేస్తోంది. అదీ పెళ్ళిరోజుకి. అందుకు గాయత్రీదేవికి శుభాశీస్సులు.

 

Qఅనిల్: తన రచనలు మీరు చదువుతారా?

 

గాయత్రి: చదవను. ఎందుకంటే తను రాసిన ప్రతి రచనా ఎక్కడికైనా పంపించడానికి ముందు నాకు చదివి వినిపిస్తాడు. తను ఎకనామిక్స్ మీదో ఫైనాన్స్ మీదో రాసిన పుస్తకాలో వ్యాసాలో తను వినిపించడు. నేను చదవను.

 

Qఅనిల్: మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ రాస్తారు?

 

గాయత్రి: ఏమో తెలియదు. నేనే ఎక్కువ రాస్తానేమో. ఐతే నేను రాసేవి ఎక్కువ ఆయుర్వేద వ్యాసాలూ పుస్తకాలూ ఉంటాయి. తనవి కధలూ, పద్యాలూ, నవలలూ, నాటికలూ – వాటిలో క్రియేటివిటి ఎక్కువ ఉంటుంది.

Hasya Hasya kathaluFrontCoverTitlePageW

Qఅనిల్: మీకు రచనాసక్తి ఎలా కలిగింది.

 

గాయత్రి: మా నాన్న ఉషశ్రీ నిరంతరం రాస్తూనే ఉండేవారు. అదే నాకూ వచ్చుంటుంది.

 

Qఅనిల్: మీరు కలిసి రాయరా? చాలా మంది భార్యాభర్తలు ఆ పని చేస్తారు కదా?

 

గాయత్రి: కలిసి రాయలేదు కానీ తన కథ ఒకదానికి నేను బొమ్మ గీసాను. ఆ కథ పేరు తల్లి. అలానే తను రాసిన పద్యాలకి నేను బొమ్మలూ, నేను గీసిన బొమ్మలకు తను పద్యాలూ – వేసానూ, రాసాడూ. ఆంధ్రప్రభలో ప్రచురించబడ్డాయి.

 

అనిల్: ఐతే ఇద్దరూ కలిసి సాహితీ వ్యాసంగం చెయ్యలేదనే అనుకోవాలి.

 

గాయత్రి: కలిసి పుస్తకాలు వేస్తున్నాం. ఐతే ప్రింట్ పుస్తకాలు కాదు. డిజిటల్ పుస్తకాలు.

 

Qఅనిల్: ఏమిటా పుస్తకాలు?

 

గాయత్రి: తను తొంభైల్లో రాసిన రెండు నవలికలు ఉన్నాయి. ఒకటి – ఓ మొగ్గ పువ్వవుతోంది. రెండోది – ఎరుపు తెల్లపోతోంది. ఈ రెండవ నవలనే సినిమా తియ్యాలని ఓ నిర్మాత పిలిచారు కానీ, బావకి కుదర్లేదు.

 

Qఅనిల్: ఎప్పుడు విడుదల?

 

గాయత్రి: మా పెళ్ళిరోజున. అది నవంబర్ పదో పదకొండో. నవంబర్ పది అర్ధరాత్రి ఒంటిగంటకి ముహూర్తం. అందుకే రెండురోజులూ మా పెళ్ళి రోజులే.

 

Qఅనిల్: చివరిగా ఏదన్న మాట చెప్తారా?

 

గాయత్రి: తనవి చాలా పుస్తకాలు తెలుగులో ఇంగ్లిషులో ప్రచురించబడ్డాయి. ఒక్కటి కూడా తను ప్రచురించింది కాదు. ఓ విధంగా ఈ పుస్తకం తను వేస్తున్న మొదటి పుస్తకం. నేనేం చెప్తాను – శుభాకాంక్షలు తప్ప.

 

(గాయత్రి గారి రచనల కోసం: http://kinige.com/kbrowse.php?via=author&name=Dr.+Gayatri+Devi&id=21)

”లోకానికి పొలిమేరన నీ లోకం నిలుపుకో!”

మంజువాటిక

devulapalli1

” నిను కానక నిముసం మనలేను, నువు కనబడితే నిను కనలేను ” అని చిన్నప్పుడు విన్నప్పుడు ఏ  వైరుధ్యమూ తట్టలేదు. కొన్నేళ్ల తర్వాత ” నాలో నిండిన నీవే నాకుచాలు నేటికి, మోయలేని ఈ హాయిని మోయనీ, ఒక్క క్షణం ” అంటే అర్థమయినట్లే ఉండేది.

కృష్ణశాస్త్రి గారు విడిగా  కవిగా పరిచయమయేనాటికి పదమూడేళ్లు నిండాయి నాకు. ” కృష్ణపక్షమ్మొకటె నాకు మిగిలె ” …ఈ వాక్యాలు నా లోపలి దేనికో ఆకృతినిచ్చినట్లు అనిపించింది , ప్రాణస్నేహితురాలిని వదిలి ఉండటం అనే తీవ్రమైన దుఃఖం లో ఉన్నప్పుడు .అది  ఇప్పుడు తలచుకున్నా అవమానంగా ఏమీ అనిపించదు. ఆత్మీయులకి దూరం కావటం కంటె శోకమన్నది లేదని ఈ నాటికీ తోస్తుంది, విధి అనుమతించినన్నాళ్లూ  అహర్నిశలూ చూస్తూ ఉండగలగటం కన్న కోరుకోవలసిన ఆనందమేమీ  లేదు, ఎప్పటికీ.

ఈ మధ్య బుజ్జాయి  గారు రాసిన ‘ నాన్న-నేను ‘ చదివాక కృష్ణశాస్త్రి గారి దృక్పథం తెలిసింది.

” నావలె అతడున్మత్త భావమయశాలి, ఆగికోలేడు రేగు ఊహలనొకింత ! ఇంత చిరు గీతి ఎద వేగిరించునేని పాడుకొనును, తాండవనృత్యమాడుకొనును ”  ఈ మాటలు ఇంచుమించు మూడు దశాబ్దాలు నా జీవితపు టాగ్ లైన్ లు గా ఉండేవి. ఆ రెపరెపలాడిపోయేతనమే నడుపుతూ ఉండేది నన్ను, అలా గాలికి కొట్టుకుపోతూనే  ఉండేదాన్ని.నేల మీద నిలిపేందుకూ  వేరే రచయితలు  ప్రయత్నిస్తూ  ఉండేవారు, కాని  కాలు నిలిస్తేనా !

శాపగ్రస్తులమయి ఈ ప్రపంచంలోకి రావలసి వచ్చిందని అనుకోని మనో జీవులు  ఉంటారా ?   దిగిరావటం దిగిపోవటమేననే ఊహాపోహల కాలమది.

పదిహేడేళ్లు వచ్చేనాటికి అమృతవీణ, మంగళ కాహళి, వ్యాసాల సంపుటులు నాలుగూ విడుదలయాయి. ఆ వచనం ఎంత మార్దవంగా,  రుచిరార్థ  సమ్మితంగా ఉండేదని ! శ్రీశ్రీ గారు రాసిన వ్యాఖ్యానంతో వచ్చాయి అవి. ” ఇక్షుసముద్రం ఎక్కడుందో చూశారా  ” అని మొదలవుతుంది అది. ఆస్వాదానికి ఆహ్వానంతోబాటు చిన్న అవమానమూ ఉంది అక్కడ ” ఇంకా మీరు కోరుకునే ఎన్నో మసాలాలున్నాయి ” అనే మాటల వెనక. అది శ్రీ  శ్రీ ఉద్దేశించారో లేదో నాకు తెలియదు. కృష్ణశాస్త్రి గారి కవిత్వపు, సామీప్యపు ఇంద్రజాలానికి బలంగా లోనయి బయటపడినవారిలో శ్రీ శ్రీ ఒకరని అప్పటికి తెలియదు.

కవితాప్రశస్తి  వ్యాసాలలో ‘ కరుణ ‘ అనేది చాలా కాలం ఊపివేసేది. దుఃఖించేవాడి  గురించి ” అతను తెలిసిపోతాడు , అతని దగ్గర చెప్పులు వదలి తల దించుకుంటాము ” అంటారు. అంతకన్న చెప్పవలసినది లేదు.లిరిక్  శిల్పం అనే వ్యాసమూ నాకు చాలా ఇష్టం. మంత్రపుగవాక్షాల  గురించీ, ప్రమాదభరిత సాగరాల గురించీ కీట్స్ కవితా పంక్తుల  పరిచయం అక్కడే .

కవి పరంపర అనే వ్యాసాల వరసలో ” నా కంటికి తిక్కన్న గారు పొడుగ్గా ఉంటా డు ‘ లాంటి వాక్యాలతో పదచిత్రాలతో ఆయా కవుల రూపురేఖా విలాసాలని బొమ్మ కట్టి చూపటమెంతగా ఆకర్షించేదని ! మహావ్యక్తులు సంపుటం లో చిత్త రంజన్   దాస్ గారి గురించిన వ్యాసం బలంగా, లోతుగా ఉంటుంది.ఆయన రచన కి  బహుశా కృష్ణశాస్త్రి గారే చేసిన అనువాదం ” ఆశకు కూడా అతీతమయిన కష్టాలు  పడటం, రాతిరి కన్నా మృత్యువు కన్నా నల్లని అన్యాయాలను సహించటం  ” అని మొదలయే గీతం గా నన్ను పరిపాలించింది అప్పటిలో.

మన నాయనమ్మ కంటే కొన్నిసార్లు మనకి గాంధారి ఎంత బాగా తెలుస్తుందో చెబుతారు ఇంకొక చోట, ఇతిహాసాల గురించిన  ప్రస్తావనలో.

పొద్దున్నే లేవలేని నా బద్ధకానికీ పద్యం ఎప్పటికీ సమర్థింపు

” తల్లిరేయి, ఆమె చల్లని యొడిపైని నిదురపొమ్ము

నిదుర నిదుర కొక్క కల వెలుంగు పసిడి జలతారు అంచురా

మేలుకొనకు కల వేళ, తండ్రి ! ”

అమృతవీణ దినదినాహారం అప్పుడు. గుంటూరు లో అరుదుగా దొరికే సిం హాచలం  సంపంగి పూరేక్కలు దాచుకున్నాను ఆ పుటలలో, ఉన్నాయి ఇంకా. ప్రేమ లోని, అర్పణ లోని ఎన్ని మన స్స్థితులను  చెప్పారో ఆయన అందులో. ” చిన్ని పూవు పదములపై ఒకటే, కన్నీటి చుక్కలాపై రెండే ” అనే ఏకాంత దర్శనం ఒకసారి, ” తెలివిమాలి నా హృదయపు తలుపు మూసి ఉన్నఫ్ఫుడు తొలగదోసి ద్వారము , లోపలికి రావలయు ప్రభూ, మరలి వెడలిపోకుమా” అని ఏమరపాటు ని  ఎలాగ  పట్టించుకోరాదో ఇంకొకసారి, ” మాట తీసుకొని నాకు మౌనమొసగినావు, మౌనమందుకొని నీకు గానమీయమంటావు! నా కంఠము చీకటైన ఈ కృష్ణ రజని తుదిని నాకయి నీ చెయి సాచిన నా కానుక ఇంతే కద, ఈ కొంచెపు పాటే కద ” అనే నిష్టూరపు ఒప్పుదల మరి ఒకసారి.

ఆ రోజులలోనే మొదటిసారి మల్లీశ్వరి  చూడగలిగాను. ఏమో, అందరూ ఏమేమి అంటారో నాకు తెలియదు, అది కృష్ణశాస్త్రి గారి కృతి నాకు, అంతే… కనీసం ప్రధానంగా.

నల్ల కనుల నాగస్వరం మోగుతూనే ఉంది…. వెండివెన్నెల గొలుసులకు వ్రేలాడిన రేయి ఊయల ఊగుతూనే ఉంది….

స్వాప్నికలోకానికి ఈవల ఎన్నో జరిగితీరుతాయి తప్పదు, నాకూనూ. ఆ   గాటంపుకౌగిలి వదలి కనులు వేరేలా తెరచిచూడవలసిందే. నా లోపలి నన్ను పదిలపరచుకుంది వారివలన. వారే చెప్పిన మాటలు … అవకాశం దొరుకుతూనే పిల్లలని వినమనే మాటలు, జీవనసంరంభం  నడిమధ్యని నిలవలేవు,  దూరమయి నిభాయించుకోలేవు , అందుకే

” లోకానికి పొలిమేరన నీ లోకం నిలుపుకో ! ”

 

( నవంబర్ 1దేవుల పల్లి కృష్ణ శాస్త్రి జయంతి సందర్భంగా )

maithili—మైథిలి అబ్బరాజు

ఇప్పటి కవిత్వానికి కొన్ని తూకం రాళ్ళు!

kasula

( కవిత్వ విమర్శకుడు కాసుల లింగా రెడ్డి కి సాహితీ గౌతమి వారి ‘బొందుగుల అహల్య-సుందరరావు’అవార్డు ప్రదానం 19 న)

*

ఇలా అంటే చాలా మంది మిత్రులకి కోపంలాంటిది రావచ్చు కాని, అనకుండా ఉండలేకపోతున్నా. అతికొద్ది కాలంలో తెలుగులో కవిత్వ విమర్శ అనేది పూర్తిగా కనుమరుగు కావచ్చు. కారణాలు మీకు తెలియనివి కావు.

వొక పదేళ్ళ క్రితమో, పదిహేనేళ్ళ క్రితమో కవిత్వాన్ని తూచే రాళ్ళు లేవని అనుకునే వాళ్ళం. అసలు ఆ రాళ్ళు అవసరమా అన్న కొత్త ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది.  అంతర్జాల మాయాజాలం వల్ల, తక్షణ స్పందనలు శ్రుతి మించిపోయి, కాస్త నిలకడగా వొక మాట అందాం అనే స్పృహ క్రమంగా తగ్గిపోతోంది, ముఖ్యంగా కవిత్వరంగంలో!

వొక కవితని వొకటికి రెండు సార్లు చదివి, కాస్త ఆలోచించి, మాట్లాడదాం అనే ఆలోచనకి విలువ లేకుండా పోతోంది. ఈ స్థితిలో అయితే పొగడ్తలూ కాకపొతే తెగడ్తలూ, మరీ నాసిగా చెప్పాలంటే, ఎదో వొక విధంగా అది పరస్పర పొగడ్తల వొప్పందంగా  మారిపోవడం తప్ప ఇంకో స్థితి కనిపించడం లేదు.

ఇలాంటి స్థితిలో కవిత్వ విమర్శని తన రంగంగా ఎంచుకొని, ఆ రంగంలో తనదైన వొక దారిని ఏర్పరచుకుంటున్న కాసుల లింగా రెడ్డి అరుదయిన కవిత్వ విమర్శకుడిగా కనిపిస్తున్నాడు నాకు.

తను స్వయంగా కవిత్వం రాస్తున్నప్పటికీ, ఇతరుల కవిత్వాన్ని విశ్లేషించడంలో లింగారెడ్డి చూపించే బ్యాలన్స్ అతన్ని మిగిలిన విమర్శకులకు భిన్నంగా నిలబెడ్తుంది.

కవిత్వాన్ని ఆషామాషీ వ్యవహారంగా భావించడం లేదు లింగారెడ్డి. ‘నువ్వు కవిత్వం ఎందుకు రాస్తున్నావనే’ మొదటి ప్రశ్నకీ, ‘కవిత్వ విమర్శ ఎందుకు రాస్తున్నావనే’ రెండో ప్రశ్నకీ లింగారెడ్డి దగ్గిర రెండు  వేర్వేరు సమాధానాలు లేవు. ఆ రెండీటికి అతనిచ్చే సమాధానం వొక్కటే. ఆ రెండీటికి మధ్యా వైరుద్ధ్యం చూపించలేకపోవడం లింగారెడ్డిలో వున్న అందమయిన బలహీనతలాంటి బలం!

తన విమర్శ వ్యాసాల పుస్తకం ‘ఇరువాలు’లో లింగారెడ్డి అంటున్నాడు.

“రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను. ఈ ఉండలేని తనం ఎందుకంటే నాకు ఈ సమాజంతో నాకు అనేక పేచీలున్నాయి. ఈ పేచీల్లో నా వాదన వినిపించేందుకు నా తరఫున నియమించుకున్న లాయర్ నా కవిత్వం.”

రాయకుండా ఉండలేను కాబట్టి రాస్తున్నాను అని ఎవరైనా అంటారు కాని, ఆ తరవాతి వాక్యంలో లింగారెడ్డి కనిపిస్తాడు. అతని ముక్కుసూటి వ్యక్తిత్వం కనిపిస్తుంది. మనలో చాలా సాధారణంగా స్థిరపడి వున్న అభిప్రాయం ఏమిటంటే, వాదన వినిపించేట్టు అయితే వచనమే రాయాలని! కవిత్వాన్ని మనం కేవలం తక్షణ భావోద్వేగ ప్రకటనకే సరిపుచ్చుకుంటూ వచ్చాం కాబట్టి! నిజానికి తక్షణ భావోద్వేగాలలో కూడా వాదనలే వుంటాయి. కాని, అది అంత తేలికగా వొప్పుకోం గాక వొప్పుకోం.

ఉద్వేగాన్ని మించిన విలువ ఇవ్వడం మొదలెడితే కవిత్వం ఏదో ప్రమాదకరమయిన సామగ్రిగా మారిపోతుందన్న ఆందోళన ఈ స్థిరపడి వున్న “కవిత్వ వాదం”లో వినిపిస్తుంది. కాని, అలాంటి ప్రమాదాలతో ఆడుకోవడమే అసలుసిసలు కవిత్వం. అలాంటి ప్రమాదాలని సృష్టించడమే అసలుసిసలు కవిత్వ విమర్శ చేయాల్సిన పని. గత కొద్ది కాలంగా లింగా రెడ్డి కవిత్వ విమర్శకుడిగా చేస్తున్న పని అదే.

lingareddi

లింగారెడ్డి కవిత్వ విమర్శలో అనివార్యంగా రాజకీయ చర్చలు కనిపిస్తాయి. రాజకీయ స్పర్శ లేని సాహిత్యం అతనికి వొంటబట్టదు. అంత మాత్రాన్న ఇతరేతర ధోరణులకు గుడ్డిగా వుండడం అతని లక్షణం కాదు. కవిత్వం అనే పలుకు వుందంటే దాన్ని బంగారంగా కళ్ళకి అద్దుకుంటాడు. ఆ తరవాత అందులో లోతుల్లోకి వెళ్లి, లోపాలూ దోషాలూ నిర్మొహమాటంగా చెప్తాడు. తన కవిత్వ విమర్శ వ్యాసాలకు ‘ఇరువాలు’ అని పేరు పెట్టడంలోనే తన ధోరణి ఏమిటో స్పష్టంగా చెప్పుకున్నాడు లింగారెడ్డి.

ఇరువాలు అంటే రెండు సార్లు.  అది వ్యవసాయ పదం. కవిత్వ వ్యవసాయానికి కూడా అదను చూసి వాడిన పదునైన పదం. నేలని వ్యవసాయ యోగ్యం చేయడంలో – అంటే దున్నడంలో- వుండే రెండు కీలక ప్రక్రియల్ని కవిత్వ విమర్శకి అన్వయిస్తున్నాడు లింగారెడ్డి. నాకు అర్థమైనంత మటుకు అది కవిత్వం చదివే విధానాన్ని అలవాటు చేసే ప్రయత్నంగా చూస్తున్నాను.

ఏ కవితని అయినా రెండు సార్లు చదవడం అనేది ideal. మొదటి సారి చదివినప్పుడు ఆ కవితని అనుభూతిస్తాం. అది అభిరుచిని మొలకెత్తించే ప్రక్రియ. రెండో సరి చదివినప్పుడు అది ఆ అభిరుచిని పెంచే ప్రక్రియ, అంటే- ఆ చదివిన కవితలోని సారాన్ని ఇంకించుకునే ప్రయత్నం. ఈ రెండో దశలో ఎవరికి వాళ్ళు భిన్నమయిన సారాంశాలని గ్రహించవచ్చు. భిన్నమయిన అభిప్రాయాలు ఏర్పడేది కూడా రెండో పఠనంలోనే! ఈ రెండు పఠనాలు ఇప్పటి స్థితిలో అరుదయి పోయాయని నా ఆందోళన. బహుశా, ఈ రెండు పఠనాల మేలు ఎంతటిదో చెప్పడానికే లింగారెడ్డి తన పుస్తకానికి ఈ శీర్షిక పెట్టుకున్నాడని నేను అర్థం చేసుకున్నా.

ఈ పుస్తకంలో లింగారెడ్డి వ్యాసాలు స్వభావ రీత్యా  కొన్ని సమీక్షలు, కొన్ని విమర్శలు. కొన్ని కవిత్వ సంపుటాలూ సంకలనాల మీద రాసినవి. కొన్ని ఇప్పటి ధోరణుల మీద రాసినవి. అసలు ఇతర విమర్శకులు ఎవరూ పట్టించుకోని విలువైన పుస్తకాలూ, కవిత్వ అంశాలని కూడా తీసుకొని, వాటి మీద లోతయిన చర్చ మొదలెట్టడానికి లింగా రెడ్డి ప్రయత్నించాడు. అవి చదివాక- మనం లింగారెడ్డి అభిప్రాయాలతో ఏకీభవిస్తామా లేదా అన్నది పక్కన పెడితే, ఇలాంటి వొక విమర్శకుడు మనకి తక్షణం కావాలి అనిపిస్తుంది. వర్తమానం చీకట్లో అతను వెలిగిస్తున్న దీపపు కాంతి విలువైందనీ అనిపిస్తుంది. కాని, వొక్క మాట అనకుండా ఉండలేను.

లింగా రెడ్డి తన విమర్శని వొక సైద్ధాంతిక కోణం నించి చేస్తున్నాడన్న విషయాన్ని పూర్తిగా గౌరవిస్తూనే, ఆ విమర్శకి అప్పుడప్పుడూ తను వాడుతున్న పరిభాష ఇంకా కొంచెం సరళం కావాలని అనుకుంటున్నా. కొన్ని సార్లు విపరీతమయిన jargon లింగారెడ్డి చెప్పాలనుకుంటున్న/ మనతో పంచుకోవాలనుకుంటున్న ఆలోచనలకి అడ్డంకి గా మార్తుంది. సైద్ధాంతిక నిబద్ధతకీ, jargon కీ సంబంధం లేదని లింగా రెడ్డి గుర్తించాలి. ఆ గుర్తింపు తోడయితే లింగా రెడ్డి విమర్శ భూమార్గం పట్టి, మనందరి ఆలోచనల్లో కొత్త కాంతిని ప్రవేశ పెడ్తుంది.

అదలా ఉంచితే:

ఇవాళ లింగా రెడ్డి  విమర్శ వ్యాసాల సంపుటి “ఇరువాలు” కి లభిస్తున్న ప్రశంసలూ,  పురస్కారాలూ విమర్శకుడిగా అతను చేస్తున్న పనికి వొక legitimacy ని ఇస్తున్నాయి. అతని మార్గం కొందరికైనా నచ్చుతోందన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. అది మున్ముందు వొక మార్గంగా ఏర్పడవచ్చన్న సంకేతాన్ని చూపిస్తున్నాయి.

-అఫ్సర్

ఇరువాలు on Kinige: http://kinige.com/kbook.php?id=1501&name=Iruvalu

 

బాపూరమణల బళ్ళో ఓ బుడుగు కథ ..!

ఎమ్వీ రాంప్రసాద్

ఎమ్వీ రాంప్రసాద్

 

 

 

 

 

 

 

అనగా అనగా అనగా…..

అనగా నా చిన్నపుడు నానారు నన్ను బళ్ళో పడేదాం అనుకున్నారు.

“బడులు కాని బడులు

తెలుగు పలుకుబడులు రా

విశ్వదాభిరామ వినురవేమ”

అని నమ్మిన కారణాన, నన్ను తీసికెళ్ళి తెలుగు పలుకుబళ్ళో పడేశారు. నాకు మొదట తెలిసిన తెలుగు పలుకుబడి అంటే – నవోదయ బుక్ హౌస్. విజయవాడ. మరి బుడుగూ, సీగానపెసూనాంబ, అప్పారావూ, వీళ్లందరినీ కలిసింది మొదటిసారి అక్కడే!

175-248_muthyala-telugu-m

 

నా ఐదో ఏట – మా నానారిని ఎంకరేజీ చేదామనీ- “పోనీ ముత్యాలముగ్గు సినిమా తీయరాదురా అండీ” అనేశా మా నానారితో . అంతే వెంఠనే బ్భయప్పడిపోయి, తన ఉజ్యోగానికి సెలీవ్ పెట్టి, నిఝం జట్కా మీద మెడ్రాస్ పరిగేఠుకెళ్ళీపోయి సిన్మా మొదలెట్టేశారు.

అన్నట్టు, ఎంకరేజీ అంటే మనకి లాబం వచ్చే పని చెయ్యమని పక్కవాళ్ళని ముందుకు తోయడం ట! మా బాబాయి చెప్పాడు.

ఏం, నానారు మెడ్రాస్ వెళ్తూంటే, ఓ సారో ప్ఫదిసార్లో మేమూ నానారి  చొక్కా పట్టుకుని మెడ్రాసెళ్ళిపోయేవాళ్ళం సెలవుల్లో.

“ఇంతమంది ఉన్నపుడు ఎంచక్కా రైల్లో వెళ్ళాలమ్మా బుడుగూ, జట్కా అయితే, ముప్ఫయ్యో, డెబ్భయ్యో రోలు పడుతుందీ” అన్నారు కదాని. “పోన్లే రైలోనే వెళ్దాం” అని రష్చించేశాను.

కానీ మరి మా నూజివీడుకి మా ఊరి రైలు స్టేషను  చాలా దూరంగ ఉంది కదా! ఎలాగా! (ఎందుకూ అంటే పట్టాలకి దగ్గిరగా ఉండాలనిట .. ఖద విను)

ఏం, అయినా అక్కడ అన్ని రైళ్ళూ ఆగవుట!

” ఓ రెండు జళ్ళ సీతని నించోపెడితే సరి. అన్ని రైళ్ళూ ఈలేసుకుంటూ అవే ఆగుతాయి.” అని నేను అవుడియా చెప్పాను. ఎవరూ విన్లేదు.

హు! వీళ్లకి అవుడియాలు రావు. మనం చెప్తే కాదులేమ్మా బుడుగూ అంటారు.

కాదులే అంటే వాళ్లకి అర్ధం కాలేదనీ, ఆ మాట ఒప్పుకోమూ, అని అర్ధం ట, బాబాయి చెప్పాడు. వాడింకా బోల్డు చెప్తాడ్లే!

ఏం అంచాత మేం విజయవాడ వెళ్ళి అక్కడ రైలెక్కాలన్నమాట. అలా విజయవాడ వెళ్ళినపుడల్లా నవోదయ’లో మాకిష్టమయిన మజిలీ కాసేపు. ‘నవోదయ’లో ఎంచక్కా ఓ రాక్ నిండా బుడుగూ, ఇంకో దాన్లో టామ్ సాయర్లూ, ఇంకోదాన్లో హక్‌లూ వాడి హక్కులూ.. ఇంకా బోళ్ళూ పుస్తకాలన్నమాట. కళ్లు చెదిరిపోయేవి. కొత్త పుస్తకాల గుబాళింపు గమ్మత్తుగ ఉంటుంది లే..

‘బుడుగు’ తీసుకుని బొమ్మలు ఫీడు గా చదివేస్తుంటే, అక్క చూసి జాలిపడి కథ చదివి వినిపించేది. (ఆనక నేనూ చదవడం నేర్చుకున్నాలే ప్పది రోలకో, డెబ్భై రోలకో)

555392_500712493357918_147827536_n

ఏం, ఇంతలో నవోదయ రామ్మోహన్రావ్‌గారు నవ్వుతూ _

“దామ్మా బుడుగూ ఇంద నారాయణ కొట్లో పకోడీలు తినూ” అని ఆయన ఆఫీసు్‌లోకి పిలిచేవారు.

ఎలాగా ఇపుడు?

ఓ పక్క బుక్సూ _

ఇంకో పక్క పకోడీసూ _

బోల్డు సేపు ఆలోచించి, పకోడీలు ఆసాస్వితం, బుక్సు సాస్వితం అని నిట్టూర్చేవాడిని. (అసాస్వితం అంటే గబుక్కుని అయిపోయేవిట , సాస్వితం అంటే బోల్డు రోజులు ఉండేవిట)

అంటే, ముందు పకోడీసు తినేస్తే, బుక్సు ఆనకైనా చదూకోవచ్చు అని అర్ధం అన్నమాట.

మెడ్రాసూ – బాపూ రమణీయం – ఖద

 

ఏం. మెడ్రాస్ వెళ్ళిపోయామా, అక్కడ బాపూరమణగార్ల ఇంట్లో ఉండేవాళ్లమన్న మాట! అక్కడ ఇంతమంది పిల్లలం ఉన్నామా!

(“ఎంతమంది? నువ్వు చెప్పలేదుగా! బుడుగూ!”

“అయితే చదువు “తోక కొమ్మచ్చి” బై అనూ ముళ్ళపూడి ‘అను’ రమణగారమ్మాయి. ‘అను’ మా అమ్ములు”)

ఏం ఇంతమంది ఉన్నామా – గెస్టులూ, ఇష్టులూ . ఇంకా బోళ్ళుమంది.

mullapudi budugu

భగ్యవతీ ఆంటీ మమ్మల్నందరినీ బీచికీ, ఇంకా బోలెడు షికార్లకీ తిప్పేవారు. తిరిగీ, తిరిగీ, అలిసి, సొలసి ఇంటికొచ్చేసరికి, శ్రీదేవీ ఆంటీ మాకందరికీ భోయనాలూ..

పిల్లలందరూ వరసాగ్గా కూచుని.. ఏం . భలే ఉండెదిలే! అల్లరి టుది పవరాఫ్ అల్లరి.

బీచ్‌లూ, షికార్లూ వీటిల్లో మాతోపాటు నానారు లేరన్న సంగతి ఎప్పుడో సాయంకాలం గుర్తొచ్చి

“అమ్మా నానారేరమ్మా” అనడిగితే .. పెద్దాళ్ళతో కబుర్ల హడావిడీలో ఉన్న అమ్మ

“వాళ్ళు కథ మీద కూర్చున్నర్లే ఆ గదిలో” అనేసి మళ్ళీ కబుర్లలో పడిపోయేది.

‘కథ మీద కూచోటం’ అంటే నాకర్ధం కాలేదు.

సర్లే అని ఆ గది గుమ్మం దగ్గిరకెళ్ళి తొంగి చూశా.

బాపూరమణగార్లూ, నానారు ఇంకొన్ని ఫ్రెండ్సులూ సుబ్బరంగా నేల మీదే కూచున్నారు. కథా లేదూ ఏమి లేదు!

అదే సంగతి ఆనక నానారితో చెప్పాను.

“వాళ్లు నేల విడిచి సాము చేయరు” అని వెళ్ళిపోయారు. ఇదీ నాకర్ధం కాలేదు.

హ్మ్మ్ .. ఏంటో ఈ పెద్దాళ్ళు!!

 

ఫోటో వివరాలు -ఎడమ నుంచీ  కుడికి   ( కూర్చున్న వారు ) శ్రీ యుతులు కనుమూరి వెంకట రామరాజు, ముళ్ళపూడి వెంకట రమణ, ఎమ్వీయల్, బాపు,నవోదయ రామ్మోహనరావు గార్లు (నుంచున్న వారు) శ్రీ యుతులు  బివియెస్ రామారావు,  నండూరి రామ్మోహనరావు గార్లు

ఫోటో వివరాలు -ఎడమ నుంచీ కుడికి: ( కూర్చున్న వారు ) శ్రీ యుతులు కనుమూరి వెంకట రామరాజు, ముళ్ళపూడి వెంకట రమణ, ఎమ్వీయల్, బాపు,నవోదయ రామ్మోహనరావు గార్లు, (నుంచున్న వారు) శ్రీ యుతులు బివియెస్ రామారావు, నండూరి రామ్మోహనరావు గార్లు

‘వంట + ‘ఒంట’ బట్టిన వొకాబులరీ ఖద

 మిత్రులతోనూ, అపుడపుడు ఇంట్లోనూ సరదాగా నానారు రమణగారి భాష మాటాడుతుండేవారు. అంచాత మా ఇంటిల్లిపాదికీ అదే విద్యాభ్యాసం. బుడుగు భాష, అప్పారావు భాష, ముత్యాలముగ్గు కంట్రాక్టరు భాష వగైరాలు సమయం సందర్భం బట్టీ.

సోదాహరణముగా వివరింపుము అని మీరంటే గనక, ఓ ఖద (చిన్నదేలే  భయపడకు)

కొత్తావకాయ పెట్టిన రోజుల్లో అమ్మ ఆవకాయ కాకుండా, వేరే ఏదైనా కూర వడ్డించబోతే..

“మహత్తరమైన ఆవకాయ కాకుండా అల్పమైన ఈ కూరలేల?”  అన్న భావన   బట్వాడా చేయటానికి

“ధిక్ అబ్బీ! యామి శిశువా” అని రాజాధిరాజు సైతాను భాష వాడేవారు.

అలాగ రమణగారి భాష మా జనజీవన స్రవంతిలోనే కాక భోజన జీవన స్రవంతిలో కూడా కలిసిపోయి వంట_ఒంట బట్టింది.

———————

” అఋణకిరణుడు కనుచూపు మేరలోకి రాగానే ఋణకిరణాలవాడు పాలిపోయి పారిపోయాడు…” అన్న రమణగారి “ౠణానందలహరి” ప్రారంభవాక్యంలో కథా నేపధ్యం, ఋణహృదయం, బోలెడు  హాస్సెంతో బాటు – సైన్సు సంగతులు కలగలసిపోయి (రమణగారి సాహిత్యంపై సమగ్ర పరిశోధన) చదివితేగానీ, నా చిన్ననాట అర్ధం కాలేదు.

“సూర్యుడు సముద్రం నించీ నీళ్లు అప్పుగా తీసుకుని మళ్లీ వర్షంగా భూదేవికి అప్పిస్తున్నాడు..” అన్న అప్పారావు థీరీ ‘వాటర్ సైకిల్’ అన్న పదిమార్కుల ప్రశ్న వీజీగా గుర్తెట్టుకోవడానికి ఉపయోగపడింది.

ఈ మేజిక్కులు,  నా ఇంజనీరింగ్ చచువులో ఫార్ములాలు అలావోకల్’గా బట్టీ పట్టడానికి ఆస్సెం గుళికలు మిళాయించమని అవుడియాలు ఇచ్చాయి.

పిల్లలకోసం బాపూరమణలు ఇష్టపడీ ఎంతో కష్టపడీ తీసిన వీడియోపాఠాలు ప్రజలకి అందేలా చేయమని శ్రీ ప్రభుత్వం వారిని ప్రార్ధిద్దాం. వీటిలో ముందు తరాల బుడుగులకి ఎంతో లాభం..

————————

“ఆయ్ మరేనండయ్యా! బాపూరమణలు శానా సినేమా కతలూ, వీడియో కతలూ చెప్పేశారు. ఆ బైగినెస్సులో జనాలకి కనీసం రెండు ‘ల’కారాల దాకా మిగిలింది.

‘లె’ర్నింగూ, ‘లా’ఫింగూ” అని ముక్తాయించాడు ము.ము.కాంట్రాక్టరు.

——————

 ముగింపు బిగిన్‌పు

“కొయ్ కొయ్ నా రాజా!”

మీ నానారిని  సిన్మా తీయమని నువు ఎంకరేజీ చేశావా – అదీ నీకు అయిదేళ్లప్పుడు!!

అసలు నువు రాసిందంతా రమణగారి భాష కాపీ” అన్నారు చదివిన కొందరు ప్రజలు.

“మీరు భలే తెలివైనవాడులు!! కనిపెట్టేశారు !! రాతలూ కోతలూ – వారు లేకుండా వేరు శాయంగల పరమహంసలు!

నాకు తెలుసు. అసలు బాపూరమణల్ని కాపీ కొట్టీనంత మాత్రాన్నే తెలుగుభాష ఇంకో ప్ఫదో, డెబ్భయ్యో, పదమూడే ఎక్కంలోని చివరి నెంబరన్ని ఏళ్లు – వాళ్లంత ధీమాగా బతికేస్తుందని, కాపీకొట్టని నా సొంత అభిప్రాయం.

అదియునూ గాక

ఆత్మఖద అంటేనే నికార్సైన ఆత్మస్తుతితో కల్తీలేని పరనింద అన్నారు మా గురువులు రమణారు. మరిహనేం మనకి ‘పవరాఫ్‌టర్నామా’ ఇచ్చేసినట్టే గదా! త్రివిక్రముడు శీనన్న చెప్పినట్టు

మాకు మాత్రం ఆత్మలుండవా ? వాటికీ కథలుండవా? అంచాత వేస్కున్నా నాకు నేనే వీరతాళ్ళు.

———————–

అయితే ఒకటి మాత్రం పచ్చినిజం. కాదు కాదు పండు నిజం.. పండిన నిజం.. మా నానారు నా ఐదోఏట నన్ను బాపూరమణల బళ్ళో పడేసి – గబుక్కున ‘పెన్’చేశారు.

చిన్నపుడు మేం ఆడుకున్న వాళ్ళింటి ముందరి చెట్టు సాక్షిగా!

నేటీకీ గుబాళిస్తున్న నాటి పూల సువాసన సాక్షిగా!!

-రాం ప్రసాద్

( ఎమ్వీయల్  ( 21 సెప్టెంబర్  1944 – 23 జనవరి  1986) వృత్తి రీత్యా తెలుగు అధ్యాపకులు. ప్రవృత్తి  రీత్యా  రచయిత .  ముత్యాల ముగ్గు చిత్ర నిర్మాత గా   , ఆంధ్రజ్యోతి లో ప్రశ్న – జవాబుల శీర్షిక  ‘యువజ్యోతి ‘ నిర్వాహకులుగా ప్రసిద్ధులు.  యువతరం మార్గ దర్శకత్వం, సాహిత్య ప్రచారం  ధ్యేయం గా ఆంధ్ర దేశం అంతటా 

ప్రసంగాల పన్నీటి జల్లులు కురిపించిన వారు. 

మరిన్ని వివరాలు ఈ బ్లాగు లో –

ఈ హార్టికల్ రచయిత ఎమ్వీయల్ గారి అబ్బాయి.  కార్టూన్ బొమ్మ: బ్నిం)