Archives for October 2014

వెల్చేరుకి పురస్కారం

10409687_4754888485411_4191795819559649700_n

డయాస్పోరా కథ ఇంకా పసిబిడ్డే!

Gorti

ఉత్తరమెరికా నుండి మొట్ట మొదటి తెలుగు కథ 50ఏళ్ళయిన సందర్భంగా “అమెరికాలో తెలుగు కథ” అన్న అంశంపై ప్రసంగించమని వంగూరి చిట్టెన్ రాజు గారు అడిగారు. ఆ సభలో ప్రసంగమే ఇది.

అమెరికాలో తెలుగు కథ అంటే అమెరికా రచయితలు రాసిన తెలుగు కథా, లేక అమెరికా జీవితం గురించిన తెలుగు కథా అన్న సందేహం వచ్చింది. అమెరికా జీవితం గురించే వారి భావన అయ్యుంటుందని నేను భావించి – ప్రస్తుత అమెరికా జీవిత తెలుగు కథ – దాని బాగోగులూ – భవిత గురించి నా పరిశీలన మీ అందరితో పంచుకుంటాను.

అమెరికాలో తెలుగు కథ పుట్టి ఏభయ్యేళ్ళు దాటినా అమెరికా తెలుగు కథకి ఒక రూపం, గొంతూ వచ్చింది గత పదిహేనేళ్ళుగానే అని చెప్పాల్సి వుంటుంది. అది కూడా ఇంటర్నెట్ సాంకేతిక మాధ్యమం వచ్చిన తరువాత డయాస్పోరా తెలుగు కథ అన్నది అందరి నోళ్ళల్లోనూ నలిగింది. అంతవరకూ తానా, ఆటాలకి సావనీర్లలో కథలు వచ్చినా అవన్నీ కథలుగా గుర్తించడం అన్నది తెలుగు కథా సాహిత్యకారులకి పట్ట లేదు. అడపాదడపా ఒకరిద్దరి పేర్లు వారికి తెలిసినా తెలుగు కథలో డయాస్పోరా అన్న సరికొత్త పాయని గుర్తించింది 1998, 99ల తరవాతనే!

దీనికి మొదటి కారణం కంప్యూటర్ సాంకేతిక ప్రగతి. అమెరికాలో తెలుగువారి సంఖ్యం పెరగడానికీ, సాహిత్య రంగం కొత్త పద్ధతుల్లో పాఠకులకి చేరవేయడానికీ ఇంటర్నెట్టే ముఖ్యకారణం. అప్పటి వరకూ ఎవరైనా కథ రాయాలంటే చిత్తు ప్రతి నుండి అచ్చుప్రతిలో కాగితానికి ఒక వైపునే రాసి ఇండియాలో పత్రికలకి పంపాలి. ఆ పత్రికలు వాళ్ళు అచ్చేస్తారో, చెత్త చేస్తారో తెలియని కాలం. ఇంటర్నెట్ సాహిత్య మార్గాన్ని సుగమం చేసింది. ఈమెయిల్ ద్వారా సరాసరి కథ పంపే మార్గం అయ్యింది. తెలుగులో టైపు చేసుకోవడానికి అనేక సాఫ్ట్వేర్లు వచ్చాయి. ఈ దరిలో చాలామంది కొత్త రచయితలు కలంపట్టారు, నాతో సహా!

వలసదారులతో ఏర్పడ్డ అమెరికా దేశంలో అనేక డయాస్పోరా కమ్యూనిటీలున్నాయి. చైనీస్, ఆఫ్రికన్లు, స్పానిష్ వాళ్ళు, ఐరిష్ వాళ్ళనీ వీరిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఉన్న ఊరునీ, కన్నవాళ్ళనీ, దేశాన్ని వదిలి ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టడంటే అంత తేలికయిన విషయం కాదు. భాషా పరంగా, సాంస్కృతిక పరంగా అనేక ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ నిలదొక్కుకొనీ తమకంటూ ఒక ప్రత్యేక ఉనికిని చాటుకోవడం ఈ డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేక లక్షణం.

అంత వరకూ అమెరికా కథగా చెలామణీ అవుతూ వస్తున్న తెలుగు కథకులకి డయాస్పోరా అన్నది అన్వయించి, ఆ స్పృహ కల్పించింది వేలూరి వేంకటేశ్వరరావు గారు. అసలు డయాస్పోరా అంటే ఏవిటి? “The word diaspora often invokes – the imagery of traumas of seperation and dislocation, and this is certainly a very important aspect of the migratory experience. But diaspora are also potentially the sites of – hope and new beginnings. They are contested cultural – and political terrains – where individual and collective memories collide, reassemble and reconfigure.” – అని లండన్ యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ – Avtar Brah – “Cartographies of Diaspora” పుస్తకంలో చెప్పిన మాటలివి.

గత వందేళ్ళుగా డయాస్పోరా మీద కొన్ని వందల వ్యాసాలూ, పుస్తకలూ వచ్చాయి. ఎన్నో సిద్ధాంతలూ, ప్రతిపాదనలూ, చర్చలూ జరిగాయి. వాటిలో ఈ మధ్య పుట్టుకొచ్చిందే – Third Space Theory. ఈ పదాన్ని సృజన లేదా కోయిన్ చేసింది – Oxford University లో హోమీ.కె.భాభా అనే ఒక ఇండియన్ ప్రొఫెసరు. ఈ డయాస్పోరా కమ్యూనిటీల గురించి చెబుతూ – The diasporic communities occupy a unique interstitial third space, which enables negotiation and reconfiguration of different cultures through hybrid interactions. Third Space Theory explains the uniqueness of each person, actor or context as a “hybrid”.

దీన్ని బట్టి చూస్తే డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేకత – మిశ్రిత జీవనం; ఏకత్వంలో భిన్నత్వం.

వీరికి రెండు కాదు – మూడు ప్రపంచాలు – మొదటి రెండూ, సొంత, వలస దేశాలయితే మూడోదే ఈ “కొత్త జాగా”. ఆ జాగాలో ఊపిరి పోసుకున్నదే డయాస్పోరా సాహిత్యం. ఈ మూడో జాగాలో రెండు పార్శ్వాలున్నాయి. ఒకటి తమదైనా డయాస్పోరా అనుభవాలకి సాహిత్య రూపం ఇవ్వడం. రెండోది – తమ సాహిత్యాన్ని వలస దేశానికి చేరవేయడం.

మొదటిది అమెరికా కథకులు చేస్తున్నారు. రెండోది – వెల్చేరు నారాయణ రావు గారు లాంటి వారు చేస్తున్నది. అంటే – మన సాహిత్యాన్ని ఇక్కడి భాషలో అంటే ఇంగ్లీషులోకి అనువదించి మన సాహిత్యాన్ని అందించడం. మొదటి చాలా తేలిక. రెండోది అతి కష్టమైనది.

ఈ డయాస్పోరా లక్షాణాల్లో మొదటి నుండి పదివరకూ ఒకటే ఉంటుంది. అది – నాస్టాల్జియా (మాతృదేశపు జ్ఞాపకాలు). మిగతావి ప్రధానంగా మూడు వర్గాలు – 1) ఎన్నేళ్ళు వలస ఉన్నా పరాయి వాళ్ళమే అన్న భావన 2) భాష, సాంస్కృతుల సంఘర్షణ 3) విలువలు, ఉనికి, ఉమ్మడితనం, దృఢమైన ఏకత్వ నిరూపణ

కారణాలు ఏమయితేనేం, సాధారణంగా డయాస్పోరా కమ్యూనిటీలన్నిటిలో ఈ పైన చెప్పిన అన్నిలక్షణాలూ కనిపించాల్సిన అవసరం లేదు. ఏ కొన్నిలక్షణాలు ఉన్నా, దానిని డయాస్పోరా గా చెప్పవచ్చు.

మాతృదేశం వదిలి వలస వచ్చిన కొత్తలో ప్రతీ ఒక్కరినీ cognitive dissonance ఆవరించుకొని ఉంటుంది. cognitive dissonance అంటే – cognitive dissonance is the mental stress or discomfort experienced by an individual, who confronted by new information that conflicts with existing beliefs, ideas, or values. రెండు విభిన్న సంస్కృతులూ, నమ్మకాల మధ్య ఊగిసలాడే డోలాయమాన స్థితి. ఈ సంఘర్షణకి అంతర్లీనగా సంస్కృతీ, అలవాట్లే హేతువులు అయ్యే అవకాశం చాలా వుంది.

ఈ సంఘర్షణలో – కొంత అస్పష్టతా, గందరగోళమూ, అపార్థమూ లేదా విబేధం ఏర్పడచ్చు. ఇవి కాకుండా కొంత ఉద్రిక్తతా, అఘాతం కూడా కలగవచ్చు. ఇవన్నీ వేరే జాతులు – అంటే అమెరికాలో ఉండే అమెరికన్లూ, ఆఫ్రికన్లూ, స్పానిష్ వాళ్ళూ, చైనీయులు, వంటి వారితో కలిసినప్పుడు కలగుతాయి. కేవలం మనుషుల మధ్యే కాకుండా వస్తుగతంగా కూడా ఉండచ్చు.

imagesX3953B67

ఈ లక్షణాల కలబోత వల్ల ఒక కొత్త మిశ్రిత జాగా ఏర్పడుతుంది. దాన్నే హైబ్రిడ్ స్పేస్ అని కూడా అంటారు. డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేకత ఈ మిశ్రిత జాగా – కేవలం వారికొక్కరికే పరిమితమైన ప్రపంచం. అందులో అనుభవాలూ, జ్ఞాపకాలూ వారికే సొంతం. అందుకే డయాస్పోరా అన్నదానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. డయాస్పోరా అనుభవాల్లోంచే కొత్త సాహిత్య రూపం వెలిసింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇక్కడ అమెరికాలో ఉన్న మనలాంటి వాళ్ళకి రెండు ప్రపంచాలు కాదు. ముచ్చటగా మూడున్నాయి. రెండు ప్రాంతాల సాహిత్యాలకి వారధిగా ఉంటూ మనకి మనం ఏర్పరుచుకున్న కొత్త సాహిత్య వాతావరణం ఈ తెలుగు డయాస్పోరా! ఇంటర్నెట్ రాక మునుపు కొంతమంది డయాస్పోరా కథలూ, అనుభవాలూ రాసినా అవి పదిమందికీ, ముఖ్యంగా తెలుగునాట అంతగా ఎవరికీ అవగాహన లేదు. ఇప్పుడు ప్రతీ పది తెలుగు కుటుంబాలకి ఒకళ్ళు అమెరికాలో ఉన్నారు. అందువల్ల వాళ్ళకీ అవగాహన పెరిగింది. తద్వారా ఇక్కడి సాహిత్యాన్ని కూడా గుర్తించడం మొదలయ్యింది. ముఖ్యంగా ఇంటర్నెట్ ఈ తెలుగు డయాస్పోరా వేదికయ్యింది. వాళ్ళకీ ఇక్కడి అలవాట్లూ, పద్ధతులూ జీవన విధానంపై కొంత అవగాహన ఏర్పడింది. అందువల్ల ఇక్కడి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన సాహిత్యాన్ని అర్థం చేసుకోడం సులభం అయ్యింది. ప్రపంచపు డయాస్పోరా సాహిత్యంలో ప్రత్యేకంగా చెప్పుకో తగ్గవి – మొదట ఆఫ్రికన్లూ, రెందు స్పానిష్ వాళ్ళూ. వీళ్ళు కాకుండా చైనీస్, వియత్నమీస్ వాళ్ళూ ఉన్నారు. భారత దేశాన్ని తీసుకుంటే ఎక్కువ డయాస్పోరా సాహిత్యం వచ్చింది పంజాబీలో. వాళ్ళ తరువాతే మిగతా వారిది. దక్షిణ భారత దేశం తీసుకుంటే డయాస్పోరా కథా సాహిత్యంలో తెలుగువాళ్ళే ముందున్నారు. ఇప్పటివరకూ నాకు లభించిన వివరాల ప్రకారం సుమారు నూట ఏభైకి పైగా డయాస్పోరా కథలు వచ్చాయి. ఉజ్జాయింపుగా సుమారు 50 మంది పైగా కథకులు కనిపించారు. వారిలో విరివిగా కొంతమంది రాస్తే, ఒకటి రెండు రాసినవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఈ నూట ఏభై కథల్లో 90 శాతం 1995 తరువాత వచ్చినవే ఎక్కువ. నేను కేవలం కథలు గురించే మాట్లాడుతున్నాను, వేరే సాహిత్య ప్రక్రియల గురించి కాదు. **

అమెరికా డయాస్పోరా కథల్లో తరచుగా కనిపించే వస్తువులు

0) ఇక్కడి రూల్సునీ, పద్ధతుల్నీ అవహేళన లేదా వెక్కిరించిన హాస్య రచనలు 1) అమెరికా చెత్త – ఇండియా గొప్ప 2) ఇక్కడి వయలెన్స్, టెర్రరిజం 3) పెళ్ళి, డేటింగ్ కల్చర్ లేదా వివాహేతర సంబంధాలు 4) కుటుంబ సమస్యలు – ముఖ్యంగా పిల్లల పెంపకం, ఇండియాలో తల్లి తండ్రులకి ఆసరా 5) ఇండియా తిరిగి వెళ్ళి పోవడం. 6) స్త్రీల గృహ హింస

అక్కడక్కడ ఒకటో, రెండో వేరే అంశాల మీద కథలు వచ్చినా స్థూలంగా ఈ కథాంశాలు దాటి ముందుకెళ్ళ లేదు. ముందుకెళ్ళక పోవడానికి కారణాలు కూడా ఉన్నాయి.

అమెరికాకి తెలుగు వారి వలస సంఖ్య గణనీయంగా పెరిగింది గత 16, 17 ఏళ్ళగానే! మిగతా జాతుల్లాగ అంటే చైనీస్, వియత్నమీస్, స్పానిష్ వాళ్ళల్లా సమాజంలో అన్ని తరగతుల విభిన్న వ్యక్తులూ ఇండియా నుండి ఇక్కడికి వలస రాలేదు. వచ్చిన వాళ్ళందరూ సరాసరి ఉద్యోగానికో, లేదా పై చదువుకో వచ్చిన వాళ్ళు తప్ప వేరే రకం వాళ్ళు కాదు. గత పదహారేళ్ళుగా వలస వచ్చిన తెలుగువాళ్ళల్లో 90 శాతం పైగా పెద్ద పెద్ద జీతాలకి వచ్చిన వాళ్ళే!

ఇక్కడున్న తెలుగువాళ్ళు అమెరికన్ మధ్య తరగతి వాళ్ళకంటే పైనే ఉన్నట్లు లెక్క. అంటే “యెబవ్ మిడిల్ క్లాస్” క్రిందకి వస్తారు. వీళ్ళందరికీ అమెరికా వ్యవస్థ లేదా జీవితంలో భాగం కావడం అన్న అవసరం లేదు.

ఎందుకంటే – ఉదయాన్నే ఆఫీసుకెళ్ళడం – సాయంత్రం రావడం – ఇంటికొచ్చి డిన్నర్ చేసి రాత్రి ఆగడో, దూకుడో సినిమా చూసుకోవడం – వీలయితే ఇండియాలో సొంత వాళ్ళని పలకరించుకోవడం – ఇంకాస్త టైము దొరికితే గ్రేట్ ఆంధ్రా సైటుకెళ్ళి గాసిప్ చదవడం – ఇవే రోజువారీ దినచర్య. వీకెండ్ వస్తే గ్రోసరీ, లేదా బర్త్ డే పార్టీలూ, మాల్స్ చుట్టూ ప్రదక్షిణాలూ ఇవి దాటి ఉండవు.

అందువల్ల వీళ్ళకి అమెరికన్ సమాజంలో భాగం అవడం కానీ, లేదా వారి జీవితాలతో సంబంధం ఏర్పరచుకోవడం కానీ చాలా చాలా తక్కువ. పోనీ పనికెళ్ళినప్పుడయినా వేరే వాళ్ళతో సంబంధం ఉంటుందా అంటే అదీ తక్కువే! అక్కడా ఇదే ఇండియన్ గ్యాంగ్! కొద్ది చైనీయులూ, మరికొంతమంది అమెరికన్లూ! వీరితో కలిసి మెలిసి తిరిగేదీ తక్కువే!

అందువల్ల ఇక్కడి అమెరికన్ సమాజంలో వుండే సమస్యలూ, తద్వారా వచ్చే ఘర్షణలూ, మంచి చెడ్డలూ తెలిసే అవకాశం సున్నా! ఇప్పుడు చెప్పినవన్నీ కథా రచయితలకీ వర్తిస్తాయి. అందువల్ల వారు రాసే కథలు కానీ, కథా వస్తువులు కానీ, పైన చెప్పిన అంశాలు దాటి వెళ్ళడం లేదు. కథా వస్తువు నేపథ్యం మాత్రమే అమెరికా అవుతోంది తప్ప మిగతాదంతా అచ్చమైన ఇండియా జీవితమే!

పేరుకి డయాస్పోరా కథ అనుకుంటున్నాం, అంతే తప్ప కథకి నేపథ్యం అమెరికానే అవ్వాల్సిన అవసరం లేని కథలు కూడా వున్నాయి. అదేకథ అమలాపురం, ఆముదాల వలసలో అయినా చక్కగా చెల్లుతుంది.

ఇది చాలా విచారించదగ్గ విషయం. మిగతా డయాస్పోరాలు, అంటే చైనీస్, మెక్సికన్ డయాస్పోరాల్లో వచ్చిన సాహిత్య వైవిధ్యం మన తెలుగు కథకి లేదు. ఎందుకంటే – మనకి ఒక స్థాయి మనుషులతోనే ప్రతీ రోజూ ప్రతిస్పందన ఉంటోంది. ఈ పరిస్థితి మారి తెలుగు కథా రచయితలు మరింత లోతుగా ఇక్కడి అధ్యయనం చేస్తే మంచి కథలు వచ్చే అవకాశం ఉంది. ** ఇహ ఈ అమెరికా తెలుగు కథలు వండి వార్చే రచయితల్ని చూస్తే – నాలుగు తరగతులుగా కనిపిస్తారు:

1) ఇక్కడి వాళ్ళు ఇక్కడి జీవితం గురించి రాసేవాళ్ళు 2) ఇక్కడి వాళ్ళు అక్కడి జీవితం లేదా అనుభవాలు గురించి ఎప్పడం ( ఇదే ఎక్కువ ) 3) అక్కడి వాళ్ళు ఇక్కడి సందర్శకులుగా వచ్చి ఇక్కడి జీవితం గురించి రాసేవాళ్ళు ఇవి కాకుండా నాలుగో కేటగరీ వుంది. ముందు ఈ మూడా చర్చించాక నాలుగోది చూద్దాం. ముందు చెప్పిన మొదటి రెండింటితే పేచీ లేదు. ఎందుకంటే ఇక్కడున్నవాళ్ళకి ఇక్కడి జీవితం బాగానే తెలిసే అవకాశం ఉంది. తెలుగునాట పెరిగి చదువుకున్నారు కనుక అక్కడి జీవితం గురించీ బాగానే తెలుస్తుంది. కాబట్టి ఆ కథల్లో కనీసం 80 శాతమయినా సాధికారత ఉండే అవకాశం చాలా ఎక్కువ.

అసలు పేచీ అల్లా మూడోది – అంటే అక్కడి వాళ్ళు నెలకో రెణ్ణెల్లకో, మహా అయితే మూణ్ణెల్లకో అమెరికా వచ్చి – ఇక్కడి జీవితాన్ని కాచి వడబోసినట్లుగా కథలు రాయడం.

కేవలం కథలే కాదు, నవలలూ, ట్రావెలాగ్లూ, చాలా వచ్చాయి. 1) అమెరికాలో ఉండే తెలుగు వారికి డాలర్లు తప్ప ఏం కనిపించవు. 2) ఎంతో యాంత్రికంగా, ఆర్టిఫిషీల్ గా బ్రతుకారు. 3) పగలు కారూ, రాత్రి గుర్రమ్మీద స్వారీ చేస్తారు. 4) రోజూ మంచి నీళ్ళ బదులు మందు తాగుతారు. 5) వాళ్ళందరివీ డొల్ల జీవితాలే తప్ప ప్రేమా ఆప్యాయతలు వుండవు. 6) ఇక్కడున్న పిల్లలు తల్లితండ్రుల్ని పట్టించుకోరు. (అక్కడికేదో ఇండియా కుటుంబాల్లో తల్లి తండ్రుల్ని మహా ప్రేమగా చూస్తున్నట్లు. ఒకే వూళ్ళో ఉండి తల్లి తండ్రుల్ని పట్టించుకోకపోయినా అక్కడ పరవాలేదు. చెల్లుతుంది కూడా)

ఈ విధంగా సాగుతాయి ఆ కథాంశాలు. ఈ కథలు చదివి అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళందర్నీ పాఠకులు రాక్షసుల్లా పరిగణించే ప్రమాదం ఉంది. ఈ కేటగిరీ కథకుల్ని Diaspora Story Visitors అనచ్చు. ఇహ నాలోగోదీ, చిట్ట చివరిదీ – ఇక్కడ అంటే అమెరికాలో ఒక్క సారీ కాలు మోప కుండా ఇక్కడి జీవితం గురించి రాసే అక్కడి వాళ్ళు. నా దృష్టిలో ఇది అత్యంత ప్రమాదకరమయిన గుంపు. వీరి సాహిత్య సేద్యానికి ఆయువు పట్టు ఇంటర్నెట్. రాత్రిబవళ్ళు నెట్టులో దున్నేసి కథలు రాసేస్తారు. అవి అచ్చుకూడా అయిపోతాయి. ఖర్మా కాలి – నా లాంటి వాళ్ళు ఎవరైనా అదేవిటని ప్రశ్నిస్తే – అంతే – సరికొత్త ప్రపంచ యుద్ధానికి తెర తీసిన వాళ్ళమవుతామన్నమాట. వాళ్ళు రాయకూడదని కాదు. రాసినదానికి సాధికారత ఉండాలి కదా? పది శాతం మించి కూడా ఉండదు, ఆ రచనల్లో! ఇంటర్నెట్ వచ్చి కొత్త రచయితల్నే కాదు, సరికొత్త రచనా రీతుల్ని కూడా మోసుకొచ్చింది. ఇలా రచనలు చేసే వాళ్ళని Distance writers లేదా దూరసంచార కథకులు అనచ్చు.

ఈ విధంగా అమెరికా తెలుగు కథ సరికొత్త పుంతలు తొక్కుతూ ఇంటెర్నెట్ క్లౌడ్ మీదుగా ఎగురుతోంది. ఆశ్చర్యకరమయిన విషయం ఏవిటంటే – వలస జీవితమ్మీద వచ్చిన కథల్లో ఇక్కడ అమెరికాలో ఉన్న పోజిటివ్నెస్స్(positive aspects) మీద కథలు ఒకటో, రెండో వచ్చాయంతే! మనం అందరం సొంతూరిని, కుటుంబాలనీ వదిలేసి ఇన్ని వేల మైళ్ళ దూరం వచ్చి హాయిగా గడుపుతున్నామంటే కారణం ఇక్కడ ఉండే positiveness వలనే! నేను అమెరికా వచ్చాకా చాలా మంచి పద్ధతులు అలవర్చుకున్నాను. మొట్టమొదటిది – Time management – అంటే టైముని మేనేజ్ చెయ్యడం కాదు. మన టైముకీ, ఇతరుల కాలానికీ విలువనివ్వడం. ఉదాహరణకి – మీరెప్పుడైనా అమెరికన్ల పార్టీలకి వెళితే తెలుస్తుంది. అందరూ ఠంచనుగా టైం పాటిస్తారు. అనీ పద్ధతిగా ఉంటాయి. అలాగే – పదిమందితో కలిసి TEAM గా పనిచేయడం. ఇలా చెప్పడానికి చాలా ఉన్నాయి. అమెరికా వచ్చిన ఈ ఇరవయ్యేళ్ళల్లో ఒక్కసారి కూడా నేను లంచం ఇవ్వలేదు. ఇంకా – ఇక్కడ ఎంతో మంది వ్యాపారాలూ గట్రా చేస్తున్నారు. ఇండియాలో మనకి పక్క రాష్ట్రం వాళ్ళ పొడే గిట్టదు. అలాంటిది వేరే దేశాల వాళ్ళు వలస వస్తే మన ఇంత open గా ఉండగలమా? ఏమో – నాకు డౌటే!

ఇలాంటి అంశాలమీద కథలు అంతగా రాలేదు. వచ్చిన కథల్లో చాలా భాగం వ్యంగ్యంగా, హాస్యంగా, ఎగతాళి చేస్తూ వచ్చినవే! ఈ నేపథ్యం మారి మంచి కథలు రావాలి.

ఉదాహరణకి – చాలా కాలం క్రితం అంటే దాదాపు పదేళ్ళ క్రితం ‘ఒంటరి విహంగం’ అన్న కథొకటి రాసాను. భార్య పోయిన తరువాత ఇండియా నుండి ఓ పెద్దాయన కొడుకు దగ్గరకి అమెరికా వస్తాడు. కూతురు కూడా ఇక్కడే ఉంటుంది. కొడుకు ఒక సారి తను పనిచేసే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఓ అమెరికన్ పెళ్ళి రిసప్షెన్ కి తండ్రిని కూడా తీసుకెళతాడు. ఆ అమెరికన్‌కది రెండో పెళ్ళి. మొదటి పెళ్ళంతో విడాకులు తీసుకొని ఒంటరితనం భరించలేక పెళ్ళి చేసుకున్నాడని కొడుకు తండ్రికి పెళ్ళి కెళుతూ చెబుతాడు. కొంతకాలం ఇక్కడున్నాక తండ్రి ఇండియా వెళిపోతాడు. ఇండియా వెళ్ళిన తరువాత అతనికి హార్ట్ ఎటాక్ వస్తుంది. సరిగ్గా అదే సమయానికి అమెరికాలో కోడలి ప్రసవం రావడంతో కొడుకు ఇండియా వెళ్ళడు. కొన్ని పరిస్థితుల వల్ల అది కాస్తా వాయిదా పడుతూ వస్తుంది.

సరిగ్గా అదే సమయంలో తనకి అనారోగ్యం చేసినప్పుడు సాయం చేసిన ఒకామెను తండ్రి పెళ్ళి చేసుకుంటున్నాడనీ విషయం తెలుస్తుంది. కొడుకూ, కూతుళ్ళిద్దరూ పెళ్ళిని తిరస్కరిస్తూ తండ్రిని ఆడిపోసుకుంటారు. చివరి దశలో తనెందుకు పెళ్ళి చేసుకోవల్సి వచ్చిందో చెబుతూ ఉత్తరం రాస్తాడు తండ్రి. కొడుకు ఆయన ఉత్తరాన్ని అంగీకరించక చెత్త బుట్టలో పడేస్తాడు. స్థూలంగా ఇదీ కథ.

ఈ కథ చదివాక అందరూ ముసలి వయసులో తండ్రి పెళ్ళి అవసరమని కొందరూ, అవసరం లేదని ఇంకొందరూ వ్యాఖ్యలు చేసారు తప్ప ఇది ఒక డయాస్పోరా జీవితంలో ఎదురైన సంఘర్షణగా ఒక్కరంటే ఒక్కరు వ్యాఖ్యానించ లేదు. దృష్టి అంతా తండ్రి మీదకీ, ఆయన సమస్య మీదకీ మళ్ళింది తప్ప కొడుకు తండ్రిని అంగీకరించక పోవడానికి కారణం రెండు సంస్కృతుల ఘర్షణగా ఎవరూ గుర్తించ లేదు. ఆ ఘర్షణలో అతను తన పాత అభిప్రాయం వైపే వంగాడు. కథలో కొడుకు పాత్ర #cognitive dissonance# మానసిక స్థితికి ఉదాహరణ. ఇండియాలో ఉన్న పాఠకులని వదిలేస్తే అమెరికాలో ఉన్న పాఠకులూ, కథకులూ ఇది డయాస్పోరా కథ అని చెప్పడానికి సాహసించలేదు. ఈ ఒక్క కథేకాదు, చాలామంది కథకుల రచనలకీ ఇదే పరిస్థితి వుంది. ఇది చాలా దురదృష్టకరమైన అంశం.

ఇప్పుడే ఇలా ఉంటే తెలుగు డయాస్పోరా కథ భవిష్యత్తు ఎమీ అంత ఆశాజనకంగా కనబడడం లేదు నాకు. ఇంతకు ముందు చెప్పినట్లు తెలుగు డయాస్పోరా ఇంకా శైశవ దశలోనే ఉంది. ఇప్పటివరకూ వలస వచ్చిన వాళ్ళు చాలా మందికి తెలుగు సెకండ్ లాగ్వేజ్ గానో లేదా తెలుగు మీడియం లోనో చదువుకున్నారు. అందువల్ల మా తరంలో వలస వచ్చిన వాళ్ళకి తెలుగుతో సంబంధం పోలేదు. ఎంత ఇంగ్లీషు మాట్లాడినా, తెలుగులోనే అంటే మాతృభాషలోనే ఆలోచనలు ఉంటాయి. అవే మెదడు తర్జుమా చేసి ఇంగ్లీషులో చెప్పేస్తుంది. కానీ 2000 తరువాత వచ్చిన చాలా మందికి తెలుగు చదవడం రాయడం వచ్చినా, తెలుగు భాషతోనూ, ముఖ్యంగా సాహిత్యంతో సంబధం తెగిపోయింది. అందరివీ ఇంగ్లీషు మీడియం చదువులే! ఒకళ్ళొ ఇద్దరికో తెలుగు రాయడం, చదవడం వచ్చు. అందులో వెతికితే కొంతమంది రాయడం పైన ఆసక్తి ఉండచ్చు. అందువల్ల ఇక్కడికొచ్చిన యంగ్ తెలుగు జెనరేషన్ కథకులు తయారయ్యే అవకాశాలు చాలా తక్కువ. పోనీ కొత్తగా వచ్చే వాళ్ళతో ఆశాజనకంగా కనిపిస్తోందా? అంటే అదీ లేదు.

ముందు ముందు రాబోయే వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వాన్నం. వారు పేరుకి తెలుగువాళ్ళే కానీ, తెలుగు రాయడం, చదవడం రాని వాళ్ళు. ఇప్పటికే తెలుగు పాఠకుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని అనుకుంటూ ఉంటాం. ఇలాంటి వారు అమెరికా వలసవస్తే తెలుగులో రాయాల్సిన అగత్యమూ, అవసరమూ కనిపించడం లేదు. ఇప్పుడున్న పాతిక లేదా అయిదు పదుల తెలుగు కథకులే, అంటే నాలాంటి వాళ్ళు, ముసలితనం వచ్చే వరకూ కథలు రాస్తూ ఉండచ్చు. ఇవన్నీ ఆలోచిస్తే కొత్త కథకులు తయారయ్యే అవకాశాలు మృగ్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఇప్పుడున్న తెలుగు డయాస్పోరా కొత్త కథకుల్ని తయారు చేసుకోవాలి. కొత్త కథకులకి మార్గమూ, అవకాశమూ కలిగించాలి.

దానికి వంగూరి ఫౌండేషన్, లేదా ఇతర సంస్థలు తానా, ఆటా దోహదం కలిగించాలి. తెలుగు కథని పరిపుష్టం చేసుకోవడానికి సాహిత్య సమావేశాలూ, వర్క్షాపులూ, చర్చలూ వంటివి తరచుగా నిర్వహించాలి. అలాగే సావనీర్లకే అమెరికన్ తెలుగు కథా రచయితల్ని పరిమితం చెయ్యకుండా ఇక్కడ వచ్చిన డయాస్పోరా కథల్లో కొన్ని మంచివి ఏరి ఒక పుస్తకంగా తీసుకువస్తే బావుంటుంది.

అలాగే డయాస్పోరా రచనలమీద వచ్చిన సమీక్షలూ, విమర్శా కూడా పెరిగే అవకాశమూ, పరిస్థితులూ కలిగించాలి. తెలుగు సాహిత్యం అంటే ఆంధ్రా నుండి దిగుమతి చేసుకునే స్థాయి నుండి మనకి మనమే ఒక కొత్త సాహిత్య ప్రపంచాన్నీ అభివృద్ధి చేసుకోవాలి. డయాస్పోరా కథ మనకే సొంతమయినా మూడో జాగా. దానికి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరి సహకారమూ, కృషీ అవసరం.

 -గొర్తి సాయి బ్రహ్మానందం

కాసింత సంతోషం!

 

గదినిండా చీకట్లు మాత్రమే పొర్లి, పొంగుతున్నప్పుడు

అవును, కచ్చితంగా అప్పుడే

కాసింత సంతోషంగా వున్నప్పటి వొకానొక పూర్వ క్షణపు దీపాన్ని మళ్ళీ వెలిగించు.

ఆ వెలుగులో నువ్వేమేం చేసి వుంటావో

వొక్క సారి- కనీసం వొక్కసారి- వూహించు.

 

మరీ పెద్దవి కాదులే, చిన్ని చిన్ని సంకేతాలు చాలు.

 

1

బహుశా మండుటెండ విరగబడే మధ్యాన్నంలో నువ్వు

వూరిచివర చెరువుని వెతుక్కుంటూ వెళ్లి వుంటావ్

శరీరాన్ని గాలిపటం చేసి ప్రతినీటి బిందువులోనూ వొక ఆకాశాన్ని దిగవిడుచుకొని

రంగురంగులుగా ఆ నీటి వలయాల్లోకి ఎగిరిపోతూ వుండి వుంటావ్.

 

యిప్పుడు అంతగా గుర్తు లేదేమో కాని,

ఆ చెరువుతోనూ ఆ ఆకాశమూ నువ్వూ వొకే భాషలో మాట్లాడుకొని వుండి వుంటారు,

వొకరిలోకి ఇంకొకరు తొంగి చూసుకొని వుంటారు నీటిలోపలి చందమామలా.

 

2

పల్లె రాదారి మీద ముగ్గురు నలుగురు పిల్లలు యీ లోకాన్ని బేఖాతర్ చేసేస్తూ

కబుర్ల సముద్రంలో మునకలు వేస్తూ వెళ్తున్నప్పుడు

వాళ్ళల్లో యెవరిదో వొక పసిచూపులోకి చెంగున గెంతి

నీ బాల్యపు చేలన్నీ పెద్ద పెద్ద అంగలతో దాటేసి వుంటావ్ వెనకెనక్కి-

 

యిప్పుడు అసలేమీ గుర్తు లేదేమో కాని,

అప్పుడు నీ వొంటిమీది పెద్దరికపు పొరలు రాలిపోయి

నువ్వు మళ్ళీ నగ్నంగా నిలబడే వుంటావ్,

ఆ పిల్లలు నీ ముందు నిలువుటద్దాలై నిలిచినప్పుడు-

 

ఎవరికీ చెప్పలేకపోవచ్చు కానీ

నువ్వు ఎంత దిగులుపడ్తున్నావో

వొక్కో సారి రాత్రీ పగలూ తెలియని కాలాల్లోకి యెలాగెలా జారుకుంటూ వెళ్ళిపోతున్నావో

అటు ఇటు ఎటు మళ్ళినా ఏడుపువై ఎలా పగిలిపోతున్నావో తెలుసు కాని-

 

కాసింత సంతోషంగా వున్నప్పుడు

కచ్చితంగా ఆ క్షణంలో నువ్వూ నేనూ యిద్దరు పిల్లలమై రెండు వూహలమై

వూయల వూగామే అనుకో,

అప్పుడు యీ దేహాలూ ఈ నిజాలూ గాలికన్నా తేలిక.

 

యిప్పుడు నువ్వు కనీసం వొక సంతోషపు అలలో,

అలలోపలి సంతోషపు కడలిలో

కొంచెమే అయినా సరే,

తేలిపో.

యిప్పుడు నువ్వు కనీసం వొక దీపం కళ్ళల్లో

కళ్ళలోని వెల్తురు నీడల్లో

కొంచెమే అయినా సరే,

వెలిగి రా!

4

జీవితం ఎప్పుడూ ఉత్సవమే కానక్కర్లేదు

కాసింత సంతోషపు చిన్ని సంకేతమైనా చాలు!

అఫ్సర్

ఏది రాయాలి? ఏది వదిలెయ్యాలి?

myspace

ఏది రాయాలి? ఏది వదిలెయ్యాలి? రాయగలమని చెప్పి తోచినవన్నీ రాసేయ్యాలా? సహజమైన ఫ్లో రాకపోయినా ఏదన్నా అనుకుంటే కృతకంగానైనా ఏదో ఒకటి రాసేయ్యాలా? ఇలాటి సందేహాలు ఎన్నో వస్తాయి రచయితలకు. వేధిస్తుంటాయి అనుక్షణం. కథావస్తువులు, పాత్రలు, సంభాషణలు వెంటాడుతూనే వుంటాయి.

రచయితలకి గీటురాయి ఏంటి? ఏది కొలమానం? నావరకు నాకు గురూగారు రావిశాస్త్రి గారు చాలా చక్కటి మాట చెప్పారు — ఏది రాసినా ఏ మంచికి అపకారం జరుగుతుందో, ఏ చెడుకు ఉపకారం జరుగుతుందో చూసుకొమ్మని. ఇది ఆయన రాసిన ‘రావిశాస్త్రీయం’లో వున్నది. ఆయన్ని ఒకటి రెండుసార్లు కలుసుకున్నా ఎక్కువ మాట్లాడే అవకాశం కలగలేదు.

కానీ కాళీపట్నం రామారావు మాస్టారుతో ఎన్నోసార్లు ఎంతో సేపు మాట్లాడే అవకాశం కలిగింది. రచయితలకు ఆయన సూచించిన స్కేలు ఇంకా చిన్నగా, సూటిగా వుంది. లేదా, రావిశాస్త్రిగారు చెప్పినదానికి దోహదం చేస్తుంది.

“నువ్వు సత్యానికి, ఇంకా ప్రజలకు జవాబుదారీ అని గుర్తుపెట్టుకోవాలి,” అని.

ఇప్పుడు కారా మాస్టారి గురించి ఎందుకు అంటే, ఆయనకు 90 ఏళ్ళు నిండిన సందర్భం. ఆయన గురించి అందరూ మాట్లాడుకునే ఓ సందర్భం. ఇంకో సందర్భం కూడా వుంది అది చివర్లో చెప్తాను.

సరిగ్గా ఏ కథావస్తువు గురించో గుర్తులేదు గాని, ఏదో వస్తువు గురించి ఆయన సలహా తీసుకుందామని ప్రస్తావించాను. ఫలానా సందర్భం గురించి, ఫలానా విధంగా చెప్దామని అనుకుంటున్నానని వివరిస్తున్నాను. కాసేపు నిశ్శబ్దంగా వుండిపోయారు, కళ్లుమూసుకుని. అది ఆయన స్వభావం, ఎవరైనా . నిమ్మళంగా ఆలోచించడానికి కావచ్చు.

“నువ్వు ఎలా చెప్పదలుచుకున్నావో చెప్పకు. కానీ, ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. ఏదో సత్యాన్ని అనుకుని దాన్ని నిజం చెయ్యడానికి కథ రాయకు. సమాజాన్ని గమనించు. జీవితాన్ని చదువు. నీకు ఎక్కడైనా నువ్వకున్నసత్యం రూఢి అయిందనిపించిందనుకో కథ రాయి. అంతేకాని నువ్వు నమ్మిన భావజాలాన్ని ఎలాగైనా సపోర్టు చెయ్యాలని మాత్రం రాయకు,” అన్నారు.

“నువ్వు సత్యానికి, ఇంకా ప్రజలకు జవాబుదారీవి అని గుర్తుపెట్టుకో. నువ్వు నమ్మిన భావజాలాన్ని వదిలిపెట్టకు. నువ్వు గమనించిన విషయం రాస్తే నీకు ఇబ్బంది అనుకుంటే రాయడం మానేయి. ఒక కథ ఆగిపోతుంది. అంతే. కానీ, నువ్వు రూఢి చేయలేని సత్యాన్ని సత్యంగా మార్చి చెప్పకు,” అన్నారు.

ఇవే కాదు కాని, ఈ అర్ధం వచ్చే మాటలు అన్నారు. సత్యంపట్ల, ప్రజలపట్ల జవాబుదారీగా వుండటం అన్న మాట నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే అది కేవలం నా రచనలకే కాదు, నా వృత్తికి కూడా ఎంతో ఉపయోగపడ్డది ఎన్నో సార్లు.

ఒక ఉదాహరణ చెప్తాను. బేగంపేట ఎయిర్ పోర్ట్ శంషాబాద్ కి మారే ప్రక్రియను చాలా దగ్గరగా కవర్ చేశాను. ఉద్యోగుల నిరసనలూ, కొత్త ఎయిర్ పోర్టు యాజమానుల పధకాలూ, ఉపయోగాలూ, అనార్ధాలూ ఎన్నో వార్తలు రాశాను. కానీ, సెర్వీసులు కొత్త ఎయిర్ పోర్తుకి మారిన రోజు ఓ హ్యూమన్ ఇంటరెస్ట్ వార్త రాద్దామనుకున్నాను. మా వాళ్ళని ఎలర్ట్ కూడా చేశాను. స్టోరీ పెగ్ లిస్ట్ లో పెట్టాను.

కానీ పాత ఎయిర్ పోర్టు చుట్టుపక్కల వున్న పిల్లలూ, పెద్దలూ విమానాల్ని ఎలా మిస్ అవుతున్నారో తెలుసుకు రాద్దామని. ప్రధాన వార్తల పని అవగొట్టుకుని అక్కడ ఇళ్లకు వెళ్ళేను కదా, అక్కడ తెలుసుకున్న విషయాల్ని చూసి దిమ్మ తిరిగిపోయింది. పిల్లలూ, పెద్దలూ ఎవరూ అక్కడి విమానాల్ని మిస్ కాలేదు. సరికదా అందరూ, చాలా అనందంగా వుండడం చూశాను. ఇక ఈ జన్మకి ఈ నరకంనుంచి విముక్తి కలగదేమోనని పెద్దవాళ్లూ, హాయిగా పొద్దున్నపూట నిద్రపోతున్నామని చిన్నవాళ్లూ ముక్తకంఠంతో చెప్పేరు. ఇది నేను ముందు ప్రోపోజ్ చేసిన వార్తకి పూర్తిగా భిన్నంగా వుంది. కానీ, వాస్తవం ఇంకోలా వుంటే చూస్తూ చూస్తూ అబధ్ధం ఎలా రాస్తాం?

***

కారా మాస్టార్ని ఇప్పుడు నేను తలుచుకోడానికి రెండో కారణం – కథల పట్ల ఆయనకున్న ప్రేమ, ఆపేక్ష. కథే ఆయన ఊపిరి. కథ కాకుండా ఇంకేదైనా ఆయన మాట్లాడడంగాని, వినడంగాని నేను ఎపుడూ చూడలేదు. దాదాపు డెబ్బై ఏళ్లపాటు కథే జీవితంగా, కథ మాత్రమే జీవితంగా బతకడం సామాన్యమైన విషయం కాదు.

మొన్నీ మధ్య ఫోన్లో మాట్లాడుతూ, “విశాలాంధ్ర వాళ్ళు వేసిన ఉత్తరాంధ్ర కథల పుస్తకంలో నీ కథ వుంది. ఈసారి కనిపించినపుడు దాని నేపధ్యం చెప్పాలి,” అన్నారు. నాకైతే ఆ పుస్తకం వచ్చినట్టు కూడా తెలీదు. ఇంత వయసులో కూడా కొత్తగా వస్తున్న పుస్తకాలని సంపాదించడం, చదవడం నాకైతే ఎంత ఆశ్చర్యo, సిగ్గూ వేసాయో. అప్పటికప్పుడు ‘నవోదయా’కి వెళ్ళి (విశాలాంధ్ర షాపులు ఆడిట్ కోసమని మూసేశారు కొన్ని రోజులు) చూశాను కదా, 1028 పేజీలున్న పుస్తకంలో 110 కథలున్నాయి!

అంతే కాదు, ‘దిద్దుబాటు’ కంటే ముందు వచ్చిన 87 కథల గురించీ, రాబోయే ఆ సంకలనం గురించీ, దానికి తాను సజెస్ట్ చేసిన ‘దిద్దుబాట’ అనే టైటిల్ గురించి చాలా ఉత్సాహంగా మాట్లాడారు.

ఏదో హాబీలాగానో, ఖాళీ వున్నపుడు ఎవరికో ఏదో ఫేవర్ చేస్తున్నట్టు రాయడమో చేసే నాలాటి కొందరికి కారా మాస్టారు గారి దగ్గర ఎంతో నేర్చుకోవాలి. అది ఒక జీవనవిధానం కాకుండా వుంటే, రాయడం అనేది ఓ passion ఎలా అవుతుందీ?

  • -కూర్మనాథ్

క్షమ

క్షమ

Smilebox_3704884

‘‘మనతో ఒచ్చేయి మన ఆలోచనలు, ముందు తరాలకి మిగిలేయి మనం చేసే పనులు.  ఆలోచనలకి ఉపయోగపడే పనులు తోడయితే అదే మంచి’’.
ఇదేం కొటేషన్‌రా బాబు మనిషి, మనిషికీ మంచికినే దానికి అర్థం వేరు కదా అనుకుంటా లోపలికి తొంగి చూశా.
‘‘లోవ్‌’’
‘‘ఏం చేస్తన్నావు క్షమా’’
‘‘గోడలు అలుకుతున్నా, కూచ్చో’’
లుంగీ, కొద్దిగా ఒదులుగా ఉండ చొక్కా, జుట్టంతా పైకి మడిచి, ఛామన ఛాయ చేతులకి ఎఱ్ఱెఱ్ఱని మట్టి పూసుకుని ఏటి మట్టిపయిన కొండ మట్టి అలుకులాగా ఉంది.
‘‘ఏంటి ప్రయోగమా, మళ్ళీ కొత్తయ్యా’’
ప్రకృతిలో దొరికే సహజ పదార్ధాలతో ఇళ్ళు కట్టటం గురించి, ఆస్ట్రేలియాలో ప్రదర్శన దానికి ఈ ప్రయోగాలు.
‘‘ఎప్పుడు ఎలతావు, ఉత్తమ్‌ (కొడుకు) ఎట్టా ఉన్నాడు’’.
‘‘ఎక్కడో ఆడతా ఉంటాడు, నిమ్మ ఛాయ్‌, అంది’’
‘‘కాదు, నువ్వు చేసే పుదీనా ఛాయ్‌, సరేగానీ ఎప్పుడూ ఖాళీగా ఉండవా’’.
‘‘అరవైల తరవాత, చేద్దాం అన్నా పనీ ఉండదు, చెయ్యటానికి ఉత్సాహం కూడా తగ్గుద్ది’’.
‘‘ఉత్తమ్‌ చదువు ఎక్కడ’’
‘‘నాకు రోజూ బడికి పంపటం, పొద్దినే లెగిసి పరిగెత్తుత్తా పిల్లలు బడికి ఎల్లటం నచ్చదు.  వాడు నాతో ఎక్కువ సమయం గడపలేడు.  ఆళ్ళకన్నా చదువు నేనే బాగా చెబుతాను.  అందుకే ఇంట్లో ఇంగ్లీషు, హిందీ, ఫ్రెంచ్‌ నేర్పుతున్నాను.  తోట పనిచేసే ‘గిరిటం’ దగ్గిర తెలుగు, కన్నడ నేర్చుకుంటన్నాడు.  అయినా పదిహేడేళ్ళకి కదా మన పిల్లలు ఏం చదవాలి అనేది నిర్ణయించుకునేది.  ఇప్పుడు వాడి వయసు పన్నెండే కదా’’.  ఏంటీ అప్పుడే పన్నెండేళ్ళ వాడయ్యాడా నిన్నో మొన్నో నువ్వు హంపి వచ్చినట్టుగా ఉంది.
‘‘అవును నాకు కూడా’’.
అప్పుడే ఇద్దరు విదేశీయులతో ఉండ పది మంది భారతీయ విద్యార్థుల బృందం బొంబాయి నించీ ఒచ్చింది.  నాఎంక తిరిగి నువ్వు ఛాయ్‌ తాగు.  ఆగదిలో కాసేపు పడుకో, పెయింటింగ్స్‌ ఉన్నయ్యి చూడు, అక్కడే రంగులు కూడా ఉండయ్యి, బోర్‌ కొడితే ఏదన్నా గియ్యి అని ఎల్లింది.

***

గట్టమీదున్న రాతికొండమీద రెల్లు గడ్డితో ఏసిన గుడిసె, చుట్టూ చిన్నచిన్నగా పెరుగుతున్న మహాగని చెట్లు, ఆటి మజ్జలో నేలంతా కప్పేసిన కొండపిండి పొట్టు తీగ మొక్కలు, అక్కడక్కడా సబ్జా మొక్కల వగరు వాసన, సూర్యుడి కూకే ఎలుగు ప్రత్యర్థిలాగా పోటీ పడతా నాతో ఆడతంది.  బ్లాక్‌కాఫీని తాగటం కన్నా, వాసన ఎక్కువ పీలుత్తా రాతిపయిన కూచ్చున్నా.  ఎనక నించీ హాయ్‌ అనే మాట ఇనిపిచ్చింది.  ఇరవై అయిదేళ్ళ మహిళ, నా దగ్గిరకి వచ్చింది, పొట్ట ఎత్తుగా ఉంది.
‘‘నేను ఇప్పుడు ఆరునెలల గర్భవతిని, నాకీ ప్రకృతి, ఊరు నచ్చింది. ఎవరో ఒకళ్ళు పుట్టేదాకా ఉండాను.  నచ్చితే జీవితం అంతా ఇక్కడే.  ఇక్కడి మనుషులయిన మీ సహాయం కావాలి’’.
ఎంతో ముచ్చటేసింది.  మళ్ళీ అనుమానం, భయం.  గుట్ట కిందకి చూత్తే ‘మహింద్రా బొలెరో’ ఉంది.  డ్రైవరు కూడా లేడనుకుంటా, స్వంతంగా నడుపుకుంటా ఒచ్చినట్టుంది.  రిజిష్ట్రేషన్‌ చూత్తే యమ్‌.హెచ్‌. అని ఉంది.
‘‘సరే స్వాగతం, మీకూ, మీపుట్ట బోయే బిడ్డకీ’’.
‘‘అలసిపోయాను భోజనం చేసి పడుకోవాలి’’.
కిందకి ఒచ్చి ఆమె సామానుకోసం చూశాను.  కారులో చేతి సంచి నిండా డబ్బులు, పెద్ద నారసంచి లో బ్రెష్‌లు, పెయింటింగ్‌ స్టాండులు, క్యాన్వాస్‌లు, బట్టలు లేవు. ఒక లుంగీ షర్టు       ఉండయ్యి.  రెండు మరాఠీ కవితల పుస్తకాలు, మరాఠీ మహిళనుకుంటా.
‘‘బట్టలు రేపు ఎల్లి కొనుక్కుంటా.  వేడినీళ్ళూ, భోజనం కావాలి అని డబ్బులు, కెమెరా చేతికిచ్చి అరగంటలో తిని పొడుకుంది’’.
‘‘ఎవరు? ఎందుకొచ్చింది, గర్భిణి?   పైగా ఒక్కటి? అర్థం కాలేదు’’ సాయంత్రం ఏడుగంటలకి పొడుకుంది, పొద్దిన ఏడుకి లెగిసింది.
‘‘తీరిందా అలసట’’
‘‘మసాలా ఛాయ్‌ ఇత్తే’’
‘‘ధుని దగ్గిర కూచ్చో, ఏడిగా ఉంటది, ఐదు నిమిషాల్లో ఛాయ్‌ తెత్తా’’
‘‘దగ్గిరలో బట్టల షాపు ఏదయినా ఉందా’’
పనోడితో ఎల్లి కొన్ని పొడుగు గౌన్లు, అరడజను కుర్తా ఫైజమాలు, కొన్ని లుంగీ చొక్కాలు తెచ్చుకుంది.
రొండు రోజులు పని లేకుండా గడపాలని ఉంది, నాతో గడపగలవా?  సరే అంటే ఆరొండు రోజులూ వంట పనిలో చెయ్యేసింది.  పాత శివాలయం శుభ్రం చేశాము, నదిలో ఈత, చేపలు పట్టి కాల్చుకు తిన్నాము.  తిరిగి, తిరిగి అలసిపోయి సాయంత్రం ఇంటికి బయలుదేరాము.  అప్పుడే నాలుగు ఉబ్బ చినుకులు ఆకాశం నించీ రాలినయ్యి.  మట్టి భలే కమ్మటి వాసన వత్తంది, నేలని మట్టిని చూత్తా ఉంది.
‘‘ఏంటి చూత్తన్నావు’’
‘‘మట్టి వాసన కడుపులోకి ఎల్లింది.  నా కడుపులో బిడ్డ కోరిక, కొద్దిగా తినాలనిపిత్తంది’’
నల్లచీమల పుట్టమీద ఎఱ్ఱమట్టి తీసి కొద్దిగా ఇచ్చాను, నోట్లో ఏసుకుని చప్పరిత్తంది.
‘‘క్షమా నికేరంగులంటే ఇష్టం’’
‘‘మట్టి, భూమి మీద ఎన్ని రకాల మట్టుంటే అన్ని రంగులు, మట్టి వర్ణాల కన్నా అద్భుతమయినయ్యి ఇంకేం ఉంటయ్యి.  ఎక్కడ మనుషులు అక్కడే మరణం తరవాత మట్టిగా మారతారు.  అందుకే మన పెద్ద వాళ్ళు మన్ను చేసిన భూమంటే మనకి ప్రేమలెక్కువ.  నానా చెత్తా మనం ఏసినా తనతో దోపుకుని, కుళ్ళించుకుని, తనలా స్వచ్చంగా మార్చుకునే భూమి రూపాలు, హోయలు అంటే ఇష్టం’’.
మట్టే కాదు దానితో ప్రయెగాలన్నా ప్రాణం.  స్థానికంగా దొరికే వస్తువులతో ఇళ్ళు కట్టుకోటం, అంటే చాలా ఇష్టం.
‘‘అయితే నాకో ఇల్లు కట్టి పెట్టు’’.
‘‘అయితే కనీసం నువ్వు నాతో రొండునెల్లన్నా గడపాలి.  నీ మనస్సు దానితత్వాన్ని బట్టీ ఇల్లు రూపం తీసుకుంటది’’.
‘‘వాస్తుని నమ్ముతావా క్షమా’’?
‘‘వాస్తు కన్నా గాలీ, ఎలుగూ పడటం, ప్రకృతిని నాశనం చెయ్యక పోవటం ముఖ్యం’’.

***

Smilebox_3704888

మరసటిరోజు పొద్దిన్నే కెమోరా, పెన్సిలు, కాయితాలతో తయారయ్యింది.
‘‘ఎవరన్నా తోడు కావాలా’’
నచ్చిన వాళ్ళని తప్ప ఎవరినీ భరించలేను, ఒంటరిగానే ఇష్టం.  సాయంత్రం చాలా స్కెచ్‌లు, ఫొటోలు తెచ్చింది.  నమూనాల చిత్రాలు, పదిపేజీల నోట్సు తెచ్చింది.
‘‘క్షమా మాపొలాలు చూత్తావా, బహుశా ఓ వందేళ్ళ నించీ సాగు చేత్తన్నాం అనుకుంటా.  తరతరాలుగా మావాళ్ళంతా వ్యవసాయాన్నీ, భూమిని దున్నటాన్నీ వ్యసనంగా చేత్తన్నారు.  చేల నిండా ఎన్నో చిన్న చిన్న శిల్పాలు, గుడులు ఉండయ్యి.  గుడి అంటే నాలుగు లేక ఆరు స్తంబాలపై కప్పులు.  అరటి, కొబ్బరి, వరి పంటల చేలల్లో ఇయ్యన్నీ గమ్మత్తుగా ఉంటయ్యి’’.
‘‘అయితే రేపు ఎలదాం’’
మరసటి రోజు పొద్దిన్నే తన జీప్‌ రెడీ చేసింది.  దాంటో చాలా సరంజానూ ఉంది.  స్టాండు, కెమెరా రకరకాల పెన్నిళ్ళు (సీసపు కడ్డీలు) కాయితాలు.
‘‘ఇయ్యన్నీ ఎందుకు’’?
‘‘బొమ్మలెయ్యటానికి, ఎందుకంటే నేను మొదట చిత్రకారిణిని, తరవాతే అన్నీ’’
‘‘చాలా ఆసక్తిగా, సౌందర్యంతో చిటపటలాడతన్నట్టుగా అనిపిత్తన్నావు’’ అన్నాను.
తిరిగివచ్చి భోజనం చేసి నిద్దర పోయింది.  మరురోజు పొద్దిన్నే స్టాండు, కాయితాలు రంగులూ తీసుకుని కొండ కిందకి ఎలతా, నాపెయింటింగ్‌లకి మోడల్‌గా ఉంటావా అంది.
‘‘నేనా’’
‘‘నువ్వే, బ్యాక్‌ డ్రాప్‌ ఏసేస్తాను.  భోజనం తీసుకుని వచ్చెయ్‌, సాయంత్రం తిరిగి వద్దాం, ఏదన్నా మట్టిరంగుల్లో ఉండ నూలు చీర అయితే మంచిది లేదా ఆకాశ నీలం’’ ఆగకుండా ఎల్లిపోయింది.  మధ్యాహ్ననికి నేనూ కొండ దిగాను.  రొండు చీరలతో, నీళ్ళు సుడులు తిరిగి నున్నపడిన రాళ్ళు, ఎన్నో ఆకారాలు తీసుకున్నయ్యి.  అటు లోయా, ఇటు కొండకీ మధ్య, గుహా లో స్టాండు, అవతల పక్క నది రాతి గోడ కట్ట ఇంకో భాగం, అక్కడ నించీ య్యూ చాలా బాగుంది.  నాకు కనపడలేదు, తన ఎట్టా కనిపెట్టాందబ్బా అనుకున్నా.
‘‘లోవ్‌’’
‘‘హా… రా… తొందరగా బట్టలు తీసెయ్‌, నీలం చీర చుట్టుకో అదీ కొన్ని భాగాలు మాత్రమే కప్పుకో, అలంకరణ ఏమీ వొద్దు, జుట్టు రాతిపయిన వొదిలేసెయ్‌, జుట్టు పయిన  నీలాంబరాలు పోస్తాను.  గుహ బయట నీలపు ఆకాశం, కింద నీలం రంగు నీరు, మొత్తం నీలమే’’.  ‘‘అంటే రోరిక్‌’’ లాగానా, అది హిమాలయాల్లో సాధ్యం, కానీ ఇక్కడ ఎఱ్ఱమట్టి గాలి, నారింజ కొండలు, కనకాంబరపు వెలుగు మొత్తం మారిపోద్దేమో.
‘‘చిత్రకారిణిని నేను నువ్వుకాదు, పనికి సహకరించు’’
సరే అని చీరని కప్పుకుని రాతిపయిన ఒక కాలు మడిచి ఆలోచనలో కూచ్చున్నా.  స్తనాలపయిన చీర కొద్దిగా కిందకి దించు అంది.  నది అవతల ఒడ్డుపయిన దృష్టిపెట్టి కూచ్చోమని చెప్పింది.  కానీ కదులుతూ ఉన్నా, చిరాకుగా ఏంటి, ఎందుకు కదిలావు, అసహనంగా ఉండావు, ఇవ్వాళ కనీసం అవుట్‌లైన్‌ అన్నా తెద్దాం అనుకున్నా… చెయ్యి పెట్టి అవతల రాతి గుహని చూపిచ్చా.  ఒక విదేశీ స్త్రీ, పురుషుడు శృంగారంలో మునిగి తేలతన్నారు.  ‘‘అది అది’’ …
‘‘నువ్వు నేనూ కళాకారులం, సమాధి స్థితికి ప్రస్తుతం వారసులం, చేసే పని తప్ప చేస్టలు ముఖ్యం కాదు,  నీ స్థనాల ఒంపుల్లో మాతృత్వపు మధురిమలు, నీ నడుం గీతల్లో వయస్సు పెంచే అనుభవాల తాత్వాకత, నీ రెండు కాళ్ళు ముక్తి, విముక్తి తప్ప నాకంటికి ఏమీ కనిపిచ్చదు.  నువ్వు కూడా స్త్రీ రహస్య దేహాన్ని, దాని తాత్వికతని నాకు చూపించటానికి ప్రయత్నించు, మాములు మహిళలా ప్రవర్తించకు’’.
పదకొండు గంటలపాటు అమెలో నేను లీనమై, ఆమె కుంచగా మారి, ఒక రూపంగా కుదురుకున్నాం.

***

Kadha-Saranga-2-300x268

అట్టా రొండు మూడు నెలలు బొమ్మలు గీత్తానే ఉంది.  ఆటితో పాటు ప్రకృతి పదార్థాలయిన సున్నం, మట్టి, బెల్లం, చింతగింజలు, కోడిగుడ్డు, పేడ, ఇసక, వంటి వాటితో రకరకాల గూడుల్లాగా, గిన్నెల్లాగా కట్టి ఆటికి బెజ్జాలు పెట్టి ఎండపెట్టింది.  ఆటిని చల్లటి నీళ్ళలో, ధుని (హోమం) దగ్గిర ఉంచి ఆటి వేడిని ధర్మామీటరుతో కొలిచి నమోదు చేసుకునేది.  పెద్ద ఫ్యాను దగ్గిర ఉంచి గాలి చొరబడే వేగం చూసేది, కొన్నిటిని రాళ్ళతో పగలకొట్టింది, మళ్ళా ఆపొడిని నీళ్ళలో కరిగించేది.  అట్టా కొన్ని వందలసార్లు ప్రయోగాలు చేసింది.
బాగా ఒళ్ళు చేసింది, పొట్టకూడా కిందకి జారింది.  అదోవింత అందంతో నిండి  ఉంది. పార్లర్‌ కి ఎల్లి జుట్టు బ్లంట్‌ కట్‌ చాలా కురచగా చేయించుకుంది.  గోళ్ళు కత్తిరిచ్చుకుంటంది.  తన పక్కనే బండ మీద కూచ్చున్నా.
‘‘ఏంటి ప్రసవానికి సిద్దమవుతున్నావా’’ ?
‘‘అవును మరణానికి కూడా’’
‘‘అట్టా మాట్లాడకు, నీ చిన్ని ప్రాణికి భూలోకం తరుపున నేను మొదట స్వాగతం చెబుతున్నాను.  వాడు పుట్టంగానే ఎత్తుకోవటానికి ఈచల్లని చేతులున్నయ్యి’’ అని పొట్టపయిన చేయివేశాను.  బిడ్డ కూడ నన్ను పలకరిచ్చినట్టయ్యింది.
‘‘నీతో చాలా మాట్టాడాలి అంది క్షమ’’
‘‘మాట్టాడుదువు గాని కానీ నీకు ఎన్నో నెల రేపు ఒకసారి డాక్టరు దగ్గిరకి ఎలదాం’’.
‘‘సరే కానీ నేను పొట్టలో బిడ్డతో ఇక్కడకి వొచ్చాను.  నువ్వు కనీసం ఎవరు? ఏంటి అని కూడా అడగలేదు, పెళ్ళయ్యిందా, లేదా లాంటి పిచ్చి ప్రశ్నలు, మొగుడు ఏమయ్యాడు లాంటియ్యి అడక్కుండా చాలా హుందాగా ఉండి అండ అయ్యావు.  ఎప్పుడూ ఒక లక్షరూపాయలు స్త్రీకి బ్యాంక్‌లో ఉంటే ఒక మగాడు తోడున్నట్టు అనుకునే దాన్ని, కానీ నీలాటి మహిళ తోడుంటే అమ్మ ఉండట్టే, కాని ఒకటి చెప్పు ఏం చూసి నన్ను నీదగ్గిర అట్టి పెట్టుకున్నావు … ఎలా ఏమీ ప్రశ్నించకుండా ఉండావు.  దీనికి సమాధానం చెబితే నాగురించి చెప్పి ప్రసవానికి ప్రశాంతంగా బయలుదేరతాను’’.
కొంచెం కష్టం, అయినా చెబుతాను, ఈ ప్రపంచంలో ఒకరోజు కాకపోతే ఒకరోజయినా దేని గురించయినా నిర్వచించవచ్చు.  కానీ ఒక్కదానికే అర్థం, నిర్వచనం, కొలత, లెక్కలు వెయ్యలేనిది, అది స్త్రీ, ఆమె ప్రవృత్తి.  మొదటిగా నువ్వునాకు నచ్చింది మహిళ కావటం, ఇక ఇంతెత్తు పొట్టతో ఒంటరిగా అంత దూరం నించీ రాటం అబ్బరం, అదీ ఈ భూమిని మెచ్చి ఒక గర్భిణి వచ్చి ఉంటాననటం, ఏప్రదేశంకి చెంది ఉండావో, ఇవ్వాళ నా అథిది అవ్వటం నాపుణ్యం.  నువ్వు ఎవరివయినా కావచ్చు, ఇప్పుటికి మాత్రం నాబిడ్డవే.  నువ్వు చిత్రాలు వేస్తే చూసి మురిశాను, పాటలు పాడితే విన్నాను.  హాస్యం ఆడితే నవ్వాను, నువ్వు కడుపులో నీదయిన బిడ్డని మోస్తంటే అంతే ఇష్టపడ్డాను.  మిగతావన్నీ ఓర్చుకున్నదాన్ని నీగర్భం గురించి అసలు ప్రశ్నించటానికి నేనెవరు.  దానికి కర్త, కారణాల అన్వేషణ అనవసరం.  ఏప్రాణికయినా బిడ్డల్ని కనే హక్కు ఉంది.  కావలసిందల్లా నాకూ నాలాంటి వాళ్ళకి నిన్ను భరించటం, ఓర్చుకోవటం.  ఒక్క నిన్ను ఓర్చుకుంటే నీతోపాటు ఇంకో ప్రాణి ప్రాణం పోసుకుని ఆనందం ప్రవాహం లాగా మారుద్ది.  ఏనుగు పాదాలకింద పడిన గులాబీని తియ్యాలా ఒదలాలా అంటే కొంచెం సాహసం చేసయినా తీసి అపురూపంగా రొండు చేతుల్తో పట్టుకోవాలి.  నువ్వు ఇంత సాహసంగా బిడ్డని కనాలనుకున్నావంటే దాని ఎనకాల ఏదో పెద్ద గాథలు, కతలు, ఉండయ్యనుకోను, కానీ తప్పకుండా మాతృత్వం, మమకారం ఉండయ్యని అర్థం అయ్యింది.  క్షమా నువ్వునానించీ వేరుకాదు.  నా స్వరూపానివే.  నేను చెయ్యలేని ఈపని నువ్వుచేస్తన్నందుకు గర్వంగా ఉంది.  అయినా చిన్న కథ చెబుతాను.
‘‘మా అమ్మ గర్భిణిగా ఉన్నప్పుడు నాన్న అనుకోకుండా మాబందువులు మరణిస్తే ఊరికి ఎల్లాల్సి ఒచ్చింది.  అప్పుడు నావయసు ఆరేళ్ళ మాఅమ్మకి నెప్పులు మొదలయినయ్యి.  చిన్నగా నాతో వేడి నీళ్ళు, బ్లేడు, దారం, అన్నీ పెట్టిచ్చుకుని తనే మంచం వాల్చుకుని చాలా ధేర్యంగా నేను చూస్తావుండగానే మాతమ్ముణ్ణి కన్నది.  అస్సలు బాధ పడలేదు.  మనం పరిస్థితులని అనుకూలంగా అల్లుకోవాలి.  నీకు ఈ సమయంలో తోడు, అండ నేనవటం గొప్పకాదు.  జంతువులయినా గర్భిణికి సహాయం చేత్తయ్యి.  అందరి అమ్మలూ బిడ్డలకి చనుపాలిచ్చే పెంచుతారు.  ఎవరూ విషం చుక్కలు తాగిచ్చరు.  నేనూ అమ్మపాలు శాంతంగా తాగే పెరిగాను.  నువ్వు కూడా నీ బిడ్డకి అట్టాగే స్వాగతం చెప్పాలి.  మన బాధలో చిరాకులో బిడ్డల మీద అస్సలు పడకూడదు.  స్త్రీలంతా తల్లుల్లాగా మారి చల్లిని చేతులతో బిడ్డలకి లాలి పొయ్యాలి, అని ఆగి తనవయిపు చూశా.  నిదానంగా నాఒడిలో తలని దూర్చి పడుకుంది, కాస్సేపు తరవాత,
‘‘నువ్వు నిండు మనిషివి కనకే మోడల్‌గా తీసుకున్నాను.  నాకే కాదు చాలా మంది స్త్రీత్వన్నీ, స్త్రీ తత్వాన్నీ పంచుతూనే ఉండు’’.
‘‘పంచుతాగానీ బిడ్డ పుట్టంగానే ఎవరికయినా విషయం చెప్పాలా’’?

‘‘చాలా తెలివయిన ప్రశ్న, చెప్పాలి.  మరణస్థితికి అటూ, ఇటూ అని తెలిసినా తెగిచ్చేదే ఈస్థితి క్రిస్టఫర్‌కి చెప్పాలి.  ఒక వేళ అటూ, ఇటూ అయితే అతను వచ్చేదాకా శిశువుని కాపాడి అతనికి అందిచ్చు’’.
‘‘నీకేంకాదు, నేనున్నా నీ కోసం’’.
జరకూడదు, జరగదు, జరిగితే జాగ్రత్త కోసం.  మాది మహారాష్ట్రలోని నాగపూర్‌.  కొన్ని పదుల సంవత్సరాల కింద వలస ఎల్లిన తెలుగు కుటుంబం.  బందువులంతా ఆంద్రాలో, మేం మహారాష్ట్రలో తెలుగు మాట్టాడతా, చదవటం, రాయటం మరాఠీలోనే.  అమ్మా, నాన్నా చాలా స్వేచ్ఛగా పెంచారు.  ముఖ్యంగా నాన్నకి ఇష్టంతో, నమ్మిన, శ్వేచ్ఛా జీవితాన్ని ఎవరికి వాళ్ళు ఎంచుకోవాలనేది ఆయన సిద్దాంతం.
నాగపూర్‌లో బాల్యం, కాలేజీకి బొంబాయి, మంచి ఖరీదయిన కాలేజీలో చదువు, నాన్న పోలీసు శాఖ ఉద్యోగి, డబ్బుకి కరువు లేదు.  చిత్ర లేఖనం చిన్నప్పటినించీ నేర్చుకున్నా.  చిత్రాలు రాయటంలో తదేకదీక్ష.  చదువుకన్నా ఈచదువే లోకంగా మారిపోయింది.  రొండో లోకంగా చిత్ర లేఖనం, ఖాళీ దొరికితే క్యాన్వాస్‌కి అంటుకుపోయేదాన్ని.  మాధ్యమ కళ (మీడియం ఆర్ట్‌) ని బాగా అభ్యసించేదాన్ని.  సంవత్సరం తేడాతో అమ్మా, నాన్న మరణం, అన్నయ్యకి కార్ల పందేల గొడవ.  చిత్రాలు రచించటంలో పూర్తిగా లీనమయ్యాను.  ఎంత అంటే ఎవరన్నా పెడితేనే తినలేదని తెలిసేది.  పక్కన ఏం జరిగినా పట్టిచ్చుకోనంతగా లీనమయ్యాను.  ఒక స్నేహితురాలు ప్రదర్శన పెట్టింది.  అందరూ బాగానే కొన్నారు.  అలాగే విదేశాల్లో కూడా ప్రదర్శించాను.  నిదానంగా ఫ్రాన్స్‌ చేరుకున్నాను.  కళలకి, కళాకారులకి, పర్యాటకులకి, కొత్తదనానికి నిర్వచనం ఫ్రాన్స్‌.  అక్కడ గ్యాలరీలో ఇండియన్‌ ఆర్ట్‌ కింద కొన్ని చిత్రాలు ఉంచాను.  రెండు మూడు అమ్ముడయినయ్యి కొన్నిటిని కొంత డబ్బు కట్టి పక్కన పెట్టుకున్నారు.  ఒంటరిగా కూచున్నాను, చలి ఎక్కువగా ఉంది.  పొడవు చేతుల కోటులో వళ్ళు కప్పుకుని టీ తాగుతున్నాను.  ఇదేం చలిరా బాబూ ఫ్రాన్స్‌లో వాళ్ళు ఎట్టా బతుకుతున్నారా అనుకుంటన్నా.
‘‘హాయ్‌, నా పేరు క్రిష్టఫర్‌, మీ బొమ్మలు చూశాను, మామూలు భారతీయుల ఆధ్యాత్మిక    చిత్రాలలా కాకుండా స్వేచ్ఛ, ధైర్యం తిరుగుబాటు ధోరణి ఎక్కువగా ఉన్నయ్యి.  నాకు బాగా నచ్చినయ్యి’’.
‘‘థ్యాంక్స్‌, ధన్యురాలిని’’
‘‘నేనూ చిత్రకారుణ్ణే, మీ చిత్రాలు చూసి కలిశాను, మీరు నా చిత్రాలు చూడండి.  దక్షిణ వరండా గది నెం.2లో ఉన్నయ్యి, రేపు కలుద్దాం, ఈలోపు నచ్చితే పిలవండి’’ అని కార్డ్‌ ఇచ్చి వెళ్ళిపోయాడు.
మనిషి తెల్లగా రాగిరంగుజుట్టు, పిల్లకళ్ళు, సరళరేఖ లాంటి దుస్తులిన్న బట్టి ఐరోపా వాసి అనుకున్నా, నాబసనించీ మరురోజు ప్రదర్శనశాలకి ఎలితే అతను గుర్తొచ్చాడు.  దక్షిణం ఏపుకి నడిచాను, ఎనక్కి తిరిగి నిలబడి ఉన్నాడు.
‘‘హాయ్‌’’
‘‘ఓ దుర్గా’’
‘‘ఏంటీ’’ ?
‘‘దేవత దుర్గా, ఐలైక్‌ హర్‌ పవర్‌’’
నవ్వాను, అతని చిత్రాలు చూడమని సాదరంగా ఒంగి మరీ రొండు చేతులతో ఆహ్వనించాడు.
వాటిని చూస్తామాయలో పడిపోయాను. సన్నని రేఖలతో రేఖా గణితంలో (జామెట్రికల్‌) కలిసిపోయినయ్యి.  రంగుల మిశ్రమంతో అద్భుతాలు ఆవిష్కరణకి, కష్టం, సుఖం, ముఖం పయిన అనుభవాల మడతలు, ఆనందం, వెలుగు, చీకటి, రాత్రి, పగలు, కలిమి, శాంతం, క్రూరత్వం, రోడ్డు, ఊరిని, ఇంటిని చూసిన విధానం అబ్బా ఎంత సరళమయిన రేఖలతో గీశాడు.  ఒక గీత ఆత్మతో ఒంకలు, ఒంకలుగా గీస్తే ఇంత అందమయిన చిత్రంగా మారతయ్యి అని అతన్ని చూసినాక తెలిసింది.  ఆమైకంలో ఓ రొండుగెంటలు ఉండిపోయా …
రాత్రి భోజనానికి రండి, భారతదేశాన్ని వినాలి అన్నాడు.
ఇంటికెల్లాను, పెద్ద ఇంటో ఒక్కడే ఉన్నాడు, బటర్‌ చికెన్‌, రోటీ, ఖీర్‌, బిర్యానీ వండాడు.
‘‘అమ్మో, అబ్బా ఆకలి, కడుపు నిండా తినాలి, ఇన్ని ఎలా వచ్చు’’?
‘‘భారత్‌ నారెండో ఇల్లు’’
చాలా సేపు మాట్టాడుకుంటా తిన్నాము.  చాలా నగరాల గురించి మాట్లాడాడు.  ముఖ్యంగా హంపి తనక్కడ ఎంత హాయిగా బొమ్మ లేసుకున్నదీ చెప్పాడు.  అలా చిత్రాల ప్రదర్శన నెలరోజులు జరిగింది.  కళాకారులం కదా, సున్నిత మనస్సులు, ఎన్నో మాటల పంపకాలు, జ్ఞాపకాల సంచుల గుమ్మరింతలు, ఇద్దరిలో ఒకరికి నచ్చినయ్యి ఒకరం ఏరుకున్నాం, కలుసుకున్నాం, కరిగిపోయాం, ఒకటయ్యి అర్థనారీశ్వరతత్వంలో ఓచిత్రంగా మారిపోయాం. నేను భారత్‌ బయలు దేరాల్సిన రోజు వచ్చింది.  చాలా సేపు కలిసి గడిపాం.
తనకీ మనస్సులు కలవటమే ముఖ్యం, బందాలలో ఇమడటం కన్నా భావనలకోసం వేచి చూట్టం, చూడాలి అనుకున్నప్పుడల్లా కలుద్దాం, ఎవరికి వాళ్ళు హాయిగా స్వేచ్ఛగా విడిపోయాం, అలా చాలాసార్లు కలిసాం.  ఓ మూడేళ్ళలో పదిసార్లనుకుంటా, అతని సహచర్యంలో తడిసి ముద్దయి అది నాపొట్టలో పిండంగా మెలకెత్తింది.  అమ్మా, నాన్నా ఇద్దరూ ఈరూపం తీసుకుని ఉంటారని పిచ్చింది. అతనికి ఇష్టమయిన హంపీలో గడపాలని, అతను ఎల్లిన చోటకల్లా ఎలతా ఉంటే తను దగ్గిర లేడు అనే భావమే లేదు.  ఫోన్లలో, ఉత్తరాల్లో జాగ్రత్తలు చెబుతా ఉంటాడు.  అంతగా అవసరం అంటే వస్తానంటాడు.  కానీ అతని స్వేఛ్చని హరించి మన సంస్కృతిలో బందీని చెయ్యటం నాకు ఇష్టం లేదు.  నాకెవరు పుట్టినా తనకి ఇష్టమే.  ఏదయినా ఆపదనాకు జరిగితే బిడ్డని అతను వచ్చేదాకా కాపాడు. తను తీసుకెల్లి తప్పకుండా చూసుకుంటాడు…. అని రెండు ఫోన్‌ నెంబర్లు నాచేతిలో పెట్టింది.
పొద్దిన్నే నెప్పులు మొదలయినయ్యి, నెప్పుల్లో కూడా కారు నడిపింది.  ఆకాశం, భూమి ఏకమై భాదపడినట్టుగా నెప్పులు పడిరది.  పదకొండుగంటలకి బుద్దపౌర్ణమినాడు బాబు పుట్టాడు, వాడు ఎంత బాగున్నాడో, నర్సులు స్నానం చేయించినాక పోలియో చుక్కల కోసం తీసుకెలతన్నా….
‘‘హాయ్‌, నేను క్రిష్టఫర్‌’’ అని ఇనపడిరది.
బిడ్డని అతని చేతుల్లో ఉంచి కళ్ళతోనే సంతోషాన్ని తెలిపి నవ్వేశాను, క్షమ అతన్ని పట్టుకుని చాలాసేపు ఉండిపోయింది.  మూడోరోజు ఇంటికి వచ్చి పనిలో పడిపోయాం.  క్రిష్టఫర్‌ ఏదో దేశంలో ప్రదర్శన ఉంటే ఎల్లిపోయాడు.  ఆమె ఏపని చేస్తన్నా, ఎక్కడికి ఎల్లినా, వీపు మీదో, చెట్టుకి యాలాడతానో ఉయ్యాలలోనో బాబు ఉండేవాడు.  బుద్ద పౌర్ణమి రోజున పుట్టినందున వాడికి ‘‘ఉత్తమ్‌’’ అని పేరు పెట్టింది.
ఆలోచనలనించీ తేరుకుని చూస్తే మాటలు ఇనపడతన్నయ్యి.
‘‘క్షమా క్రిష్టఫర్‌ ఎప్పుడొస్తాడు’’? అన్నా
‘‘తెలియదు’’
‘‘ఉత్తమ్‌ అడగట్లేదా’’
‘‘ఉత్తమ్‌ నావాడు, నేను కన్నాను, నాకోసం, ఈబందాలు, కట్టుబాట్లు, కావాలంటే భారతీయుణ్ణే వరించేదాన్ని’’.
‘‘కేవలం నాకు బిడ్డకావాలి, అదీ నా ప్రపంచంలో ఒక భాగం కావాలి, దానికి క్రిష్టఫర్‌ సహకారి అంతే’’.
‘‘దటీజ్‌ క్షమా, ఒక మీడియం ఆర్ట్‌’’.

sindhu-1_336x190_scaled_croppమన్నం సింధుమాధురి
8790906686

ఓ దిగులు గువ్వ

 1

ఏమీ గుర్తు లేదు..

తెలిసిన పాటే ఎందుకు పాడనన్నానో
తెలీని త్రోవలో
తొలి అడుగులెందుకేశానో
గాలివాన మొదలవకుండానే
గూటిలో గడ్డి పరకలు పీకి
గువ్వ ఎందుకలా ఎగిరిపోయిందో..

2

రెల్లుపూల మధ్య నడుస్తూ
పాటల్ని పెనవేసుకోవడం గుర్తు
వెన్నెల రవ్వలు విసురుకుంటూ
సెలయేరు వెనుకగా నవ్వడం గుర్తు
పల్లవి కూడా పూర్తవని పాటకి
మనం కలిసి చరణాలు రాసుకున్న గుర్తు
కాలం ఆశ్చర్యపోయి
అక్కడే ఆగిపోవడమూ గుర్తు.

3

చుక్కలు నవ్వితే మెచ్చనిదెవరు కానీ
చీకటెప్పుడూ భయమే
ఎటు కదిలినా కూలిపోయే వంతెన మీద
ప్రయాణమెప్పుడూ భయమే
ఒక్క మాట వేయి యుద్ధాలయ్యే క్షణాల్లో
పెదాల మీద సూదులు గుచ్చే నిశ్శబ్దమన్నా..
నీ పాట నా చుట్టూ గింగిర్లు కొట్టదంటే
బరువెత్తిపోయే ఈ బ్రతుకన్నా…

4

పూవులన్నీ రాలిపోయాక
మధువు రుచి గుర్తొచ్చేదెందుకో
ఆకాశమంత స్వేచ్ఛ కోరి రెక్కలల్లార్చాక
గూటి నీడ కోసమింత తపనెందుకో
ఒక్క దిగులుసాయంకాలం,
చీకటి లోయల వైపు తోస్తున్నదెందుకో..

అంతా అర్థమయీ కానట్టుంది..
ఏం కావాలో
ఏం కోల్పోవాలో…

5

శిశిరం
ఆఖరి ఆకు కూడా రాలిపోయింది
గుండెలోనూ గొంతులోనూ విషాదం
ఒక్కమాటా పెగలనంటోంది
ఎందుకలా అనిపిస్తుందో ఒక్కోసారి-
ఈ దిగులంతా ఓదార్పని
లోలో జ్వలిస్తోన్న మాట నిజమే కానీ,
ఇది కాల్చేయదనీ..

               -మానస చామర్తి

నీలాంటి నిజం

jaya

 

 

 

 

 

 

నిజం నీలాంటిది

వేళ్ళూనుకున్న మర్రిలా

వూడల వూహలు వేలాడేస్తుంది

కొన్ని ఇంద్రజాలాలు మొలకెత్తుతాయి

పాలపుంతల ఆకాశమిస్తాయి

అదే గొడుగని

పరవశపు పచ్చిక కి నారు వేసే లోగా

అరచేతిలో వేపవిత్తు ఫక్కుమంటుంది!

చేదు మంచిదే….

కొంత బాల్యాన్ని అట్టిపెట్టుకో

కొద్ది దూరమైనా నమ్మకానికి అమ్మవుతుంది

లోపలి దారుల్లో తచ్చాడే కృష్ణబిలాన్ని పలకరించు

దానికి తెలిసిందల్లా

వటపత్రశాయిలా

అరచేత్తో పాదాన్ని నోటపెట్టుకున్న ఆ’మాయ’కమే…

మరపు మన్ను చల్లుకొచ్చే కాలం

యే విశ్వరూపం కోసం సిద్ధమవుతోందో…

బాలకృష్ణుడవ్వని మనసు

భూగోళమంతటి నిజాన్ని

పుక్కిటపట్టగలదు…

చేదుకీ నిజానికీ చెదలు పట్టదన్నంత నిజం ఇది..

-జయశ్రీ నాయుడు

Ismail “Door”

Ismail poetThe Telugu poem rendered into English here is “Talupu” by Ismail, the pen name of Mohammed Ismail (1928), without a doubt one of the great poets from Andhra Pradesh, who gained his prominence with his humanistic and evocative poetry. From bits and pieces I read about Ismail, I gather that early on in his life Marxism and Sri Sri influenced him, but he grew away from them into a more nuanced poet with a clear affinity for nature and life and how they intertwine. Just to show you how bewitched I am with his poetry, see my translations of his two other poems–నూతిలో తాబేలు and పద్య సమాధిhere in The Caravan Magazine. Telugu originals for both these poems can be read from ఈమాట Magazine – రాత్రి వచ్చిన రహస్యపు వాన.

Upset with me
Suddenly opening the door
You left

For bursting open
The door I closed long ago for your sake,
And letting in sunshine and air
Many thanks

[Telugu original below, from ఈమాట Magazine – రాత్రి వచ్చిన రహస్యపు వాన]

తలుపు

నా మీద అలిగి
భళ్ళున తలుపు తెరచుకుని
వెళ్ళిపోయావు నీవు.

నీకై ఎన్నడో మూసుకున్న తలుపును
బార్లా తెరిచి,
గాలీ వెలుతురూ రానిచ్చినందుకు
బోలెడు థాంక్సు.

ఆదివాసీల ఉత్తేజిత ఊపిరి – కొమురం భీం

unnamed

ఒక చారిత్రక జీవితం తాలుకూ అన్ని ఛాయలను స్పృశించుకుంటూ ఒక నవల రాయడం లోని కష్టాలు ఎన్నో. వాస్తవాన్ని, కల్పనలను, వక్రీకరణలను నింపుకున్న రాశులలోంచి నిజాలను రాబట్టుకోవడం అంత సులభమైన పనేం కాదు.

1910 తరువాత నిజాం నవాబులు అటవీ చట్టాల తీసుకురావడం, వాటి వల్ల గోండులు, కొలామ్ లు మొదలగు ఆదివాసులు జీవితాలలో వచ్చిన పెను మార్పులలో నుంచి ఉద్భవించినదే కొమురం భీం చరిత్ర.

దీన్ని ఒక కొలిక్కి తెచ్చి  ఒక వాస్తవ ప్రజా పోరాట యోధుడిని మిగతా ప్రాంత ప్రజలకు పరిచయం చేయడం కోసం, నేల కోసం పరితపించే వాళ్లల్లో ఒక స్పూర్తిని నింపడం కోసం అల్లం రాజయ్య గారు, మరియు సాహు గారు, చరిత్రకారులు కాకపోయినప్పటికి  హేమన్ డార్ఫ్ నివేదికలు, ప్రభుత్వ రికార్డులు, గోండులతో కలసి మాట్లాడి తెలుసుకున్న విషయాలు, భీం దగ్గర ముఖ్య అనుచరుడిగా పని చేసిన కొమురం నూరు చెప్పిన విషయాల ఆధారంగా తమ తొలి చారిత్రక నవలను ప్రతిభావంతంగానే తీర్చిదిద్దారు అని చెప్పుకోవచ్చు.

స్థానిక షావుకారులు, అధికారులు, దొరల వంచనకు గురైన కుటుంబాలకు చెందిన సాధారణమైన గోండు బాలుడు, ఎలా తిరుగుబాటు జెండా ఎగరవేసాడో, హత్యచేసి, పారిపోయి,దేశమంతా తిరిగి, ఎక్కడ చూసిన అదే దుర్మార్గాలతో విసిగిపోయి, మన్నెం పోరాట స్ఫూర్తితో, తిరిగి తన ప్రాంతానికే తిరిగివచ్చి పోరాటం చేసిన క్రమాన్ని తెలుసుకోవాలంటే  ఈ నవల ఒక్కసారైన చదవాల్సిందే. ముందు మాటలో వరవరరావుగారు, ఈ పుస్తకాన్ని చెంఘిజ్ ఖాన్,స్పార్థకస్ లతో పోల్చినా, దీన్ని చదవగానే నాకు గుర్తొచ్చిన పుస్తకం  ఏడుతరాలు. అది నేరు బానిసత్వానికి ప్రతీకగా నిలిస్తే, బానిసల కంటే హీనంగా తోటివాడు ఎలా దోచుకోబడతాడో వివరించిన పుస్తకం ఇది.

అల్లం రాజయ్య

అల్లం రాజయ్య

15సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమయ్యే కొమురం భీమ్ చరిత్రను ప్రధానంగా ఐదు భాగాలుగా చేసి చూడవచ్చు. ( పుస్తకంలో అధ్యాయాలు చేయలేదు. ఇది కేవలం నా ఆలోచన మాత్రమే, మార్పులు చేర్పులు ఎవరైన సూచించగలరు)

1915 – 1920 ( భీం వయస్సు 15 – 20ల మధ్య)

ఆదిలాబాద్ జిల్లా, అసిఫాబాద్ ప్రాంతంలో సంకేపల్లి గూడెం లో గోండుల జీవన విధానాన్ని పరిచయం చేస్తూ ఈ నవల మొదలవుతుంది. అడవిలో చెట్టు పుల్లలు విరిచినా వేళ్లు తెగ్గోట్టే జంగ్లాత్తోల్లు(అటవీ అధికారులు) అరాచకాలు, నిత్యం అటవీ జంతువులతో పోరాడుతూ కాపాడుకున్న పంటలను వడ్డి లెక్కలతో మాయ చేసి మోసం చేసే మైదాన షావుకార్లు చేసే వంచనలు సహిస్తూ, పేన్కు (దేవుడు) మీద నమ్మకంతో సాగిపోతున్న గోండుల (భీం) జీవితంలో అతని తండ్రి చిన్ను మరణం ఒక  పెద్ద కుదుపవుతుంది.  సంకేపల్లి లో పంటలు సరిగా పండక పోవడంతో ఆ ప్రాంతాన్ని వదిలి, ధనోరా ప్రాంతంలో నర్దేపూర్ గూడెన్ని నిర్మించుకొంటారు. పోడు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని అడవులను నరికి, సాగు చేస్తారు. పంటలు కోతకొచ్చిన సమయంలో ఆ ప్రాంత పట్టేదార్ నంటూ వచ్చిన సిద్దిక్ తో జరిగిన గొడవలో, భీం సిద్దిక్ ను తలపగలగొట్టి చంపేసి, భయంతో అక్కడ నుంచి పారిపోతాడు. పోలీసులు కోపానికి సర్దేపూర్ గూడెం, పంటలు సర్వనాశనమై, భీం చిన్నాయనలు, అన్నలు, మిగిలిన గోండులు చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెదిరిపోతారు.

1920 – 1925 ( భీం వయస్సు 20 – 25 ల మధ్య)

బలార్షా మీదుగా చంద్రపూర్ చేరుకున్న భీమ్ అక్కడ జాతీయవాదులు రహస్యంగా నడిపే ఓ ప్రెస్ లో పనిచేస్తాడు. అక్కడే కొద్దిగా చదవడం, రాయడం నేర్చుకుంటాడు. కొద్ది రోజులకే పోలీసులు ఆ ప్రెస్ మూసేయడంతో రైల్వే స్టేషన్లో మేస్త్రీల మాటలు విని అస్సాం తేయాకు తోటల్లో కూలీగా పనిచేయడానికి వెళ్తాడు. అక్కడ అత్యంత హేయమైన బతుకుల్ని చూస్తూ, అనుభవిస్తూ, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తీసుకురాబడే కూలీల కథలను వింటూ భారంగా రోజులు దొర్లిస్తాడు. హిందీ, ఉర్దు మాట్లాడటంలో కొంత నేర్పు సంపాదిస్తాడు. అక్కడే ఓ మిత్రుని ద్వారా మన్నెం దొర అల్లూరి గురించి తెలుసుకుని, ఉత్తేజితుడవుతాడు. అక్కడ జరిగిన ఒక తిరుగుబాటులో పాల్గొని, నిర్భంధించబడి, అక్కడి నుండి తప్పించుకొని పారిపోయి,. కాకాన్ ఘాట్ లోని తన అన్నల దగ్గరికి తిరిగి చేరుకుంటాడు.

1925 – 1935 (భీం వయస్సు 25 – 35 ల మధ్య)

దేవడం లచ్చుపటేల్ దగ్గర పాలేరుగా చేరి అతనికి అత్యంత నమ్మకస్తుడిగా వుంటాడు. సోంబాయి, పైకు బాయి లను వివాహం చేసుకుంటాడు. భీం జీవితంలో ఇదొక ప్రశాంతమైన అధ్యాయంగా చెప్పుకోవచ్చు. (అతని సంతానం గురించి వివరాలు పుస్తకంలో ఇవ్వలేదు.) లచ్చుపటేల్కు చెందిన భూ లావాదేవీలలో (తెల్లచొక్కలతో) అధికారులతో మాట్లాడి ఒక కేసును గెలిపిస్తాడు. ఇది గొండులలో భీం ప్రతిష్టను పెంచుతుంది.

1935 – 38 ( భీం వయస్సు 35 – 38 ల మధ్య)

భీం చిన్నాయనలు కుర్దు, యేసులు ప్రజలను కూడదీసి బాబేఝరి ప్రాంతంలో అడవులు నరికి, పన్నెండు గూడెంలను నిర్మించుకొని, ప్రభుత్వంతో పోరాటం సాగిస్తూ,అధికారులతో వ్యవహరించడానికి ఉర్థూ బాగా తెలిసిన భీం ను, రాత పనికి మహదును నియమించుకుంటారు. ఈ పోరాట క్రమంలో భీం నాయకునిగా ఎదగడం, ఆ పన్నెండు గ్రామాలలో ఒక సమాంతరమైన ప్రభుత్వాన్ని జోడెన్ ఘాట్ ప్రధానకేంద్రంగా భీం నడిపించగలుగుతాడు. ఇక్కడే భీం మూడో పెళ్లిని చేసుకుంటాడు.  అధికారులను, పోలీసుల ఆగడాలను ఎదుర్కోవడం, వారిని పారద్రోలడానికి ఒక చిన్న సైన్యాన్ని కూడా సమకూర్చుకోగలుగుతాడు. కొంత మంది సన్నిహితుల సలహా మేరకు నిజాం నవాబుని కలవాలని హైదరాబాద్ వచ్చి, రాజు దర్శనం దొరకకపోవడం తో అవమానంగా భావించి తిరిగి వచ్చే లోగానే పోలీసులు జోడెన్ ఘాట్ ను, అక్కడి పొలాలను నాశనం చేస్తారు. ఇది పూర్తి స్థాయి పోరాటానికి భీం ను ఉసిగొల్పుతుంది.

సాహు

సాహు

1938 – 1940( భీం వయస్సు 38 – 40 ల మధ్య)

బర్మార్లు( ఒక రకమైన తుపాకులు) తయారు చేసుకుని,  పోలీసులకు దీటైన సమాధానం ఇస్తూ గోండు రాజ్యస్థాపన దిశగా భీం పయనిస్తాడు. 50 మంది సైనికుల దాడిని తిప్పికొట్టి విజయం సాధిస్తారు. చర్చలకు వచ్చిన సబ్ కలెక్టర్ 12 గ్రామాల ప్రజాలకు పట్టాలిచ్చి, అప్పులు మాఫీ చేస్తానన్నా భీం రాజ్యాధికారానికే కట్టుబడడంతో అవి విఫలమవుతాయి. ఆశ్వయుజమాసం ,శుద్దపౌర్ణమి,.గోండులకు అత్యంత పవిత్రమైన దినం, 1940 సెప్టంబర్ 1 న మూడు వందల మంది నిజాం సైనికులు జరిపిన దాడిలో, కుర్దుపటేల్ అనే గోండు చేసిన ద్రోహంతో  భీం మరణిస్తాడు. స్వయంపాలనకై కలలు కన్న ఓ వీరుడి స్వప్నం కల్లలైన రోజు, రక్తం చిందించి,నేలకొరిగిపోయిన రోజు అది. ఆ తరువాతి ఘటనలలో ఆ పన్నెండు గ్రామాల ప్రజలు చెల్లచెదురైపోతారు.

ఇది జరిగి ఇప్పటికి దాదాపుగా 75 సంవత్సరాలు కావస్తుంది. కాని నేటికైనా గోండులు వంటి ఆదివాసీల బతుకుల్లో ఏమన్నా మార్పులు వచ్చాయా, వారి సమస్యలేమన్నా తీరాయా, అనేది ప్రశ్నార్దకం కావడం సిగ్గుపడాల్సిన విషయమే.

అడవిలో వుంటే తిండి కావాలి, తిండి కావలంటే అడవి నరకాలి, పంటలేయాలి, అది చేస్తే పట్టేదార్లో, జంగ్లాతోల్లో వస్తారు, వాళ్లు అడిగిందంతా ఇవ్వాలి., ఇస్తే ఆకలికి చస్తాం,.ఇవ్వకుంటే వాండ్లు చంపుతరు., కొట్లాటకు బోతేనేమో ఇలా పారిపోవాలి అంటూ భీం ఒక చోట చెబుతాడు.

వాళ్లకి ఇప్పటికైన భూములకు పట్టాలిచ్చి, కొత్త వ్యవసాయ పద్దతులు నేర్పి, పాఠశాలల్లో కాస్తంత చదవు నేర్పిస్తే వారి జీవితాలు మారతాయేమో. ప్రస్తుత వారి పరిస్థితి పట్ల నాకు ఎలాంటి అవగాహన లేకుండా వ్యాఖ్యానించడం కూడా సరికాదు,. కాని భీముడి సంతానంగా చెప్పుకునే గోండుల జీవితాలలో వెలుగులు నిండాలనే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

ఆదివాసీ ప్రచురణలు, జోడెన్ ఘాట్ వారు 83,93 ప్రచురణల తరువాత 2004 లో ఈ పుస్తకాన్ని మళ్లీ ముద్రించారు,. తరువాత మరో ఎడిషన్ వచ్చిందేమో నాకు తెలియదు. తెలుగులో వెలువడ్డ మంచి పుస్తకాలలో ఇది ఒకటి, వీలైతే ఖచ్చితంగా చదవండి. వెల ఇరవైరూపాయలు, 238 పేజీలు.(2004 ఎడిషన్)

– భాస్కర్ కె

జాగ్రత్త లేనివాడు

MythiliScaled

ఒకానొకప్పుడు యెరెవాన్ అనే  నగరం లో  లో ఒక   వ్యాపారస్తుడు ఉండేవాడు.   అతనికి పెద్ద జబ్బు చేసింది. ఇక ఎంతో కాలం బతకనని తెలిసి కొడుకుని దగ్గరికి పిలిచి ” బాబూ ! మహారాజుల దగ్గర కూడా ఉండనంత ఐశ్వర్యాన్ని సంపాదించాను. అదంతా అనుభవిస్తూ నా వ్యాపారం కొనసాగించు. పొరబాటున కూడా టిఫ్లిస్ నగరానికి మాత్రం వెళ్ళకు ” అని హెచ్చరించాడు.

తర్వాత భార్యని పిలిచి తన గది  తాళం చెవి ఇచ్చి ” మన అబ్బాయి అబ్దల్   ఒకవేళ డబ్బంతా పోగొట్టుకుని బీదవాడైతే నా రహస్యాలని అతనికి చెప్పు ” అని చనిపోయాడు.

ఆ తర్వాత కొన్నాళ్ళకి  అబ్దల్ నలభై ఒంటెల మీద  సరుకులు వేసుకుని వర్తకం కోసం బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రి ఒక చోట విడిది చేసి ఉండగా ఇద్దరు మనుషులు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని అటువైపుగా వచ్చారు. వాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అబ్దల్ కి జాలేసి వాళ్ళని పిలిచి భోజనం పెట్టించి  కొత్త బట్టలు ఇచ్చి ఏమైందని అడిగాడు.

” అయ్యా ! అది చెప్పకూడదు ” అన్నారు వాళ్ళు. అబ్దల్ చెప్పమని బలవంతం చేశాడు.

చివరికి వాళ్ళు ఇలా అన్నారు ” మాది కపన్ నగరం .మేమూ నీవంటి వర్తకులమే. మా దగ్గరా చాలా ధనం ఉండేది. కొన్ని రోజుల క్రితం మేము టిఫ్లిస్ నగరానికి వెళ్ళాం. ఆ రాజుగారి కూతురు జగదేక సుందరి అని విని ఆమెని చూడాలనుకున్నాం. ఒకసారి ఆమెని గాజు అద్దాలలోంచి చూడటానికి నలభై బంగారు నాణాలు ఇవ్వాలట. అలాగే ఇచ్చి ఒకసారి చూశాం. మళ్ళీ మళ్ళీ , ప్రతిరోజూ చూడాలనిపించేది. అలా రోజూ మా దగ్గర ఉన్న  సరుకంతా రాజుకే ఇచ్చేస్తూ రోజూ ఆమెని చూసేవాళ్ళం.

ఒకసారి చూశాక తిరిగి చూడాలనుకోకుండా ఉండటం మానవమాత్రులెవరికీ అయే పని కాదు. ఆమె అందం అంతగా ఆకర్షిస్తుంది.

ఎనభై ఒంటెల మీద తీసుకెళ్ళినదంతా ఖర్చయిపోయి, ఇదిగో, ఇలా అయిపోయాం. నువ్వు మంచివాడివిలా ఉన్నావు. మేము నీకు ఎదురు పడకుండా ఉంటే బావుండేది. నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదు, టిఫ్లిస్ కి మటుకు వెళ్ళకు ”

 

అంతా విని అబ్దల్ ఏమీ అనలేదు. మర్నాడు వాళ్ళిద్దరికీ గుప్పెడు బంగారునాణాలు ఇచ్చి పంపేశాడు. ఎంత వద్దనుకున్నా ఆ నగరానికి వెళ్ళాలనే అతనికి గట్టిగా అనిపించింది. ఒకసారి చూసి వచ్చేస్తే ఏమవుతుందిలే అనుకున్నాడు. వెళ్ళనే వెళ్ళాడు.

 

మొదటిసారి జగదేకసుందరిని చూస్తూనే ప్రేమలో పడిపోయాడు. ఆమెని పలకరించాలనీ , ఒప్పించి పెళ్ళాడాలనీ రోజూ వెళ్ళి తన డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఆమెకి తన మాటలు వినిపించినట్లే  లేదు. ఆ అద్దానికి అటువైపునుంచి  ఎవరూ కనిపించరని అతనికి తెలియలేదు.

ఇక చేసేదేమీ లేక యెరెవాన్ కి తిరిగి వెళ్ళి తల్లితో జరిగిందంతా చెప్పాడు. తండ్రిమాట పెడచెవిని పెట్టి అక్కడికి వెళ్ళినందుకు ఆమె కొడుకుని చెడామడా తిట్టింది. అబ్దల్ క్షమించమనీ మరి ఇంకెప్పుడూ వెళ్ళననీ బతిమాలుకున్నాడు. మళ్ళీ వ్యాపారం చేసి తండ్రి పేరు నిలబెట్టేందుకు పెట్టుబడి కావాలి కదా ! అందుకని తండ్రి తనకు ఇచ్చిన తాళం చెవితో ఆ రహస్యపు గది తలుపు తెరిచి  ఒక చిన్న సంచీని పట్టుకొచ్చింది.

story1

” అబ్దల్ ! ఇదిగో, ఇందులో నువ్వు నలభై రాగినాణాలు పెడితే తెల్లారేసరికి అవన్నీ బంగారు నాణాలుఅవుతాయి

. జాగ్రత్తగా వాడుకో ” అని అతనికి ఇచ్చింది.

పదిరోజులు అలా చేసేసరికి నాలుగు వందల బంగారు నాణాలు పోగయాయి. వాటితో కొత్తగా సరుకులు కొని అబ్దల్ మళ్ళీ వ్యాపారం చేస్తానని బయలుదేరాడు. అయితే కొన్నాళ్ళకే తల్లికి ఇచ్చిన మాట మర్చిపోయాడు. టిఫ్లిస్ నగరానికే వెళ్ళాడు. రోజూ నలభై బంగారు నాణాలు ఇచ్చి రాజకుమారిని చూస్తూనే ఉన్నాడు. ఆ రాజు అతని డబ్బు ఎంతకీ అయిపోకపోవటం కనిపెట్టి ఒక రోజు అతన్ని పిలిచి కబుర్లలో పెట్టాడు. వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని అబ్దల్ అడిగాడు.

” ఓ ! దానికేం ! తప్పకుండా …నీ తరగని ధనం రహస్యం ఏమిటో చెబితే అలాగే ఆమెతో నీ పెళ్ళి జరిపిస్తాను ” అని టక్కరి రాజు చెప్పేసరికి అబ్దల్ నమ్మి సంచి సంగతి చెప్పేశాడు. మాయమాటలతో సంచీ తీసేసుకుని రాజు అబ్దల్ ని వెళ్ళగొట్టాడు. అబ్దల్ కి చాలా ఏడుపు వచ్చింది. వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి ” బుద్ధొచ్చిందమ్మా ! నాన్న ఇచ్చింది ఇంకేమీ లేదా నీ దగ్గర ? ఇస్తే బాగుపడతాను ఈ సారి ” అని వేడుకున్నాడు. ఈ సారి తల్లికి కోపం అంత తొందరగా తగ్గలేదు. పెట్టిందేదో తిని ఇంట్లోనే పడిఉండమంది. రెండు మూడు నెలలయినా అబ్దల్ ఆమెను బతిమాలుతూనే ఉన్నాడు. చివరికి కరిగి, తల్లి ఈ సారి ఒక టోపీ తెచ్చి ఇచ్చి

” ఇది తలమీద పెట్టుకుంటే ఎవరికీ కనబడవు. పోయినదాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి ” అని గట్టిగా చెప్పి పంపించింది.

story2

ఇకనేం ! అతను ఆ టోపీ పెట్టుకుని ఎవరికీ కనిపించకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. రాజభవనం కనుక భోజనానికి కొరత లేదు, ఎక్కడో ఒక చోట నిద్ర. అయినా కొంతకాలానికి ఎవరో అదృశ్యంగా అక్కడ ఉంటున్నారని చెలికత్తె లు కనిపెట్టి రాజుకు చెప్పారు. రాజుకి ఇది అతనేనేమోనని అనుమానం వచ్చి ” నువ్వెవరో తెలిస్తే కదా, నా కూతురితో పెళ్ళి చేయటానికి ” అని ఆశ పెట్టాడు. అబ్దల్ టోపీ తీసి ప్రత్యక్షమయ్యాడు. రాజు ” నువ్వు వెళ్ళినదగ్గర్నుంచీ తప్పు చేశానని నా కూతురు నా మీద కోపంగా ఉంది. నీ కోసం వెతికిస్తూనే ఉన్నాను. రేపే మీ పెళ్ళి ! ‘’ అని నమ్మించాడు . పెద్ద విందు ఏర్పాటు చేశారు. అబ్దల్ భోజనం లో మత్తు మందు కలిపి తినిపించారు.   స్పృహ పోగానే టోపీ తీసేసుకుని సేవకులతో అతన్ని ఊరవతల పడేయించారు. రాజకుమారికి ఇదంతా ఏమాత్రం ఇష్టం లేదు. తనని అబ్దల్ నిజంగా ప్రేమిస్తున్నాడని అర్థమై తనూ అతన్ని ప్రేమించింది. కానీ తండ్రి చేసే పనులని అరికట్టటం ఆమె వల్ల కాలేదు.

మర్నాడు పొద్దున మెలకువ వచ్చిన అబ్దల్ కి అంతా అల్లకల్లోలంగా అనిపించింది. రాజు మాటలు ఎలా నమ్మగలిగాడో తనకే అర్థం కాలేదు. ఇంటికి వెళితే తల్లి ఏమంటుందోననే భయం తో వెళ్ళలేకపోయాడు. వేలికి ఉన్న ఉంగరం అమ్మి కొన్నాళ్ళు గడిపాడు. ఆ డబ్బు ఖర్చయిపోయాక చివరికి వెళ్ళక తప్పలేదు. కొడుకు తెలివి తక్కువ తనానికీ దురదృష్టానికీ ఆమెకి దుఃఖం వచ్చింది. ఇక ఏమన్నా లాభం ఉండదనుకుందో ఏమో, అబ్దల్ ని పెద్దగా కోప్పడలేదు.

నాలుగు రోజులు పోయాక  తనే ఒక కొమ్ము బూరా తెచ్చి ఇచ్చి ” ఇదే మిగిలింది. దీన్నీ పోగొట్టు కున్నావంటే మనం బిచ్చమెత్తుకోవలసి వస్తుంది , మన మొహాన దేవుడు అదే రాస్తే తప్పించలేం. కానీ ప్రయత్నించు ” అని కొడుకుతో అంది.

ఆమె చెప్పినట్లు ఇద్దరూ ఊరి బయటి కొండ మీదికి ఎక్కిన తర్వాత  అబ్దల్ దాన్ని ఊదాడు. జెమాజెట్టీ ల లాంటి సైనికులు  లెక్కలేనంతమంది ఎక్కడినుంచో వచ్చేశారు. ” దొరా ! ఏమి సెలవు ? ” అని అబ్దల్ ను అడిగారు. ప్రస్తుతానికి ఏం అక్కర్లేదని   ఇంకో వైపునుచి  బూరా ఊదితే వాళ్ళు మాయమైపోయారు.

 

” వీళ్ళకి అసాధ్యమైనదేమీ లేదు, నీకు అన్నీ చేసిపెడతారు. ఆ టిఫ్లిస్  నగరాన్ని కూడా  జయించగలరు. ఆ పని చేయి ” అని తల్లి చెప్పి పంపించింది.

అబ్దల్ వెళ్ళి  టిఫ్లిస్ నగరం బయట కొమ్ము బూరా ఊదాడు. సైనికులకి  నగరాన్ని  ముట్టడించమని ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే జరిగింది. నగరం లో ప్రజలు భయపడిపోయి రాజుకి మొర పెట్టుకున్నారు. రాజు దూతలని పంపి ఏం కావాలని అడిగించాడు.

” యుద్ధం ! యుద్ధానికి వచ్చాను ” అని గర్జించాడు అబ్దల్.

రాజు అక్కడికి  వెళ్ళి  ” ఇదిగో ! ఇప్పుడే నా కూతుర్ని తీసుకుపోయి పెళ్ళి చేసుకో ” అని ఆమెని అక్కడికి రప్పించాడు. అబ్దల్ రెండో వైపునుంచి ఊది సైన్యాన్ని పంపించేశాడు. బూరా జేబులోనే పెట్టుకున్నాడు. అయితే పెళ్ళి కోసమని స్నానం చేసేందుకు దుస్తులు పక్కన పెట్టవలసి వచ్చింది. అతన్ని రహస్యంగా వెంబడిస్తున్న రాజు గూఢచారి చటుక్కున దాన్ని దొంగిలించి రాజుకి తెచ్చి ఇచ్చాడు. తర్వాతి కథ మామూలే. ఈ సారీ ఓడిపోయిన అబ్దల్ కి ఇంటికి వెళ్ళబుద్ధి పుట్టలేదు. తండ్రి దాచిఉంచినవన్నీ అయిపోయాయి. తల్లికి మొహం చూపించలేడు.

 

అక్కడికి దగ్గరలో సముద్రపు రేవు ఉంది. ఒక ఓడ దూరదేశాలకి బయలుదేరబోతూ ఉంది. అబ్దల్ అందులో పనివాడుగా చేరాడు. ఓడ ప్రయాణిస్తూ ఉండగా తుఫాన్ లో చిక్కుకుని  ముక్కలైపోయింది. అదృష్టవశాత్తూ అబ్దల్ కి ఏమీ కాలేదు. ఈదుకుంటూ  ఒక ఒడ్డుకి చెరాడు. అదొక దీవి. మనుషులెవరూ లేరుగానీ పుష్కలంగా పళ్ళ చెట్లు ఉన్నాయి. వాటితో ఆకలి తీర్చుకుంటూ కొంతకాలం గడిపాడు. ఒక రోజున రెండు ఆపిల్ చెట్లు పక్కపక్కనే కనిపించాయి. ఒక చెట్టు పండు కోసి తిన్నాడు. కాసేపటికి గాడిదగా మారిపోయాడు. ” ఓహో, నా దురదృష్టం ఇంకా పూర్తి కాలేదన్నమాట ” అన్న దిగులు లో మునిగిపోయాడు. కడుపునింపుకోవటం తప్పదు కనుక గడ్డి మేస్తూ బతకవలసి వచ్చింది. అలా ఇంకొక రోజున  అక్కడే రాలిపడిన ఇంకొక ఆపిల్ తిన్నాడు. మళ్ళీ మనిషి రూపం వచ్చేసింది.

” ఎందుకైనా పనికొస్తాయి ” అనుకుని రెండు రకాల పళ్ళూ కోసి విడి విడిగా దాచిపెట్టాడు. చివరికి ఒకనాడు దూరంగా ఒక ఓడ వెళుతూ కనిపించింది. అబ్దల్ చేతులు ఊపుతూ అరుస్తూ , ఆ ఓడలో వాళ్ళకి తను అక్కడ ఉన్నానని తెలిసేలా చేశాడు. ఓడ అక్కడికి వచ్చి అతన్ని ఎక్కించుకుంది. నావికులు అబ్దల్ కథ  విని జాలిపడి అతను కోరినట్లుగా  టిఫ్లిస్ నగరపు రేవు లో దించారు.

 

పళ్ళు అమ్మేవాడిలాగా మారువేషం వేసుకుని రాజభవనం దగ్గరికి వెళ్ళాడు. రాజకుమారి అతని దగ్గర మొదటి రకం ఆపిల్ పళ్ళు కొంది. ఆమె తినేలోపునే అతను తప్పించుకున్నాడు. తిన్నవెంటనే  వెంటనే జగదేకసుందరి కాస్తా గాడిదగా మారిపోయింది. అంతా గగ్గోలు పెట్టారు.

రాజు ఎంత చెడ్డవాడైనా కూతురి మీద అతనికి చాలా మమకారం. ఎక్కడెక్కడి వైద్యులనీ మంత్రగాళ్ళనీ పిలిపించి ఆమెని మామూలుగా చేయించటానికి ప్రయత్నించాడు. ఎవరూ చేయలేకపోయారు. రాజుకి ఆందోళన ఎక్కువైపోయింది. ఆఖర్న వైద్యుడి వేషం వేసుకుని అబ్దల్ వెళ్ళాడు.

 

” నేను మీ అమ్మాయిని ఎప్పటిలాగా చేయగలను. అయితే రెండు షరతులు. మొదటిది ఆమెని నాకిచ్చి పెళ్ళి చేయాలి. రెండోది నేను అడిగిన వస్తువులన్నీ నాకు ఇచ్చేయాలి, అవి మీ దగ్గర ఉన్నవే ”

 

నగరం లో పెద్ద మనుషులని పిలిపించి ముందే ఒప్పందం రాసుకున్నారు.

story3

 

” ముందుగా కపన్ నగరం వర్తకులనుంచి మీరు తీసుకున్న ఎనభై ఒంటెల మీది సరుకులు. తర్వాత  యెరెవాన్ యువకుడి నుంచి దొంగిలించిన డబ్బు సంచీ, టోపీ, కొమ్ము బూరా. ఇంకా అతని ఆస్తి- నలభై ఒంటెల మీది సరుకులు ”

 

రాజుకి అవన్నీ ఇచ్చేయటానికి ఎంతమాత్రం మనసొప్పలేదు. కానీ తప్పలేదు. తన కూతురు మనిషిగా మారాక మాత్రమే అవన్నీ ఇస్తానని ఒప్పుకున్నాడు. అన్నిటినీ తెప్పించి ఉంచమన్నాడు అబ్దల్.

 

రెండో రకం ఆపిల్ తినగానే రాజకుమారి మనిషిగా అయిపోయింది.

” నన్ను పెళ్ళాడటం నీకిష్టమేనా ? ” అని అసలు రూపం తో కనబడి అడిగాడు అబ్దల్. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. రాజు తెప్పించి ఉంచినవన్నీ అప్పటికప్పుడు తీసేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా యెరెవాన్ కి బయల్దేరి వెళ్ళాడు.గొప్ప వైభవం తో ఇంటికి వెళ్ళి

 

” అమ్మా ! పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించాను. అదనంగా ఈమెని నీ కోడలిగా తెచ్చాను ” అని తల్లికి అన్నీ చూపించాడు. ఆమె అప్పటికే అబ్దల్ మళ్ళీ ఓడిపోయి ఉంటాడనీ ఇక తనకి కనబడడనీ నిరాశ చేసుకుంది. ఇప్పుడు ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కబురు చేసి వర్తకులిద్దరినీ పిలిపించి అబ్దల్ వాళ్ళ ఆస్తిని వాళ్ళకి అప్పగించాడు. అంతా విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. త్వరలోనే అబ్దల్ కీ జగదేకసుందరికీ పెళ్ళి జరిగింది. వాళ్ళు చాలాకాలం సుఖంగా జీవించారు.

రాజకుమారి ఎప్పుడైనా తండ్రిని చూసేందుకు టిఫ్లిస్ నగరానికి వెళ్ళేది కానీ అబ్దల్ మళ్ళీ అక్కడ అడుగు పెట్టలేదు.

  • ఆర్మీనియన్ జానపదకథ

[టర్కిష్  లో అబ్దల్ అంటే నిర్లక్ష్యంగా ఉండేవాడు అని అర్థం. ఈ మాటను అరబిక్ లో సాధువులకి కూడా ఉపయోగిస్తారు]

‘ఎగిరే పావురమా!’ – 17

egire-pavuramaa17-banner

 

తాత కన్ను మూసి రెండు నెల్లవుతున్నా, బాధ నుండి తేరుకోలేక పోతున్నాను.

పిన్ని, బాబాయి, రాములు బేషరుతుగా నన్ను ఆదరించారు. ఎవ్వరూ నా మీద కోపతాపాలు చూపించలేదు. చంద్రం పిన్ని, బాబాయి నా విషయాలన్నింటా సాయం చేస్తున్నారు. రోజుకోసారన్న కొట్టాంకి వచ్చి నా బాగోగులు చూస్తుంటుంది పిన్ని.

 

నాకు తోడుగా నాకోసం కొట్టాంలోనే ఉంటున్న రాములు కళ్ళల్లో, చేష్టల్లో నాకు కాస్త ఓదార్పు దొరికింది. నా పట్ల అదే మునపటి చనువుతో ప్రేమగా మసులుతుంది ఆమె.

**

‘పాలెం వచ్చిన కాడినుండి, నా మనస్తాపాల్లోనే సమయం గడిచింది.   ఏనాడూ రాములు మంచిచెడ్డలు కనుక్కోలేదు’ అనిపించింది.

తాత ఆఖరి శ్వాసవరకు అన్ని విషయాల్లో – తాతకి తోడుగా ఉంది రాములే నని చెప్పింది పిన్ని. ఇప్పుడు గుళ్ళో కూడా ఎన్నో పనులు చక్కబెడుతూ, అజమాయిషీ చేసేది కూడా రాములేనట.

నిద్రబోయే ముందు, కొట్టాం తలుపు వేసొస్తున్న రాముల్ని పిలిచి పక్కన కూచోమన్నాను.

కృతజ్ఞతా భావంతో నా కళ్ళు చమర్చాయి. ఆమె రెండు చేతులు నా చేతుల్లోకి తీసుకున్నాను.

‘తాతకి నీవు దగ్గిరుండి సేవ చేసినందుకే కాదు, ఇప్పుడు నాకు తోడుగా ఉంటున్నందుకు నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని సైగలతో తెలియజెప్పాను రాములుకి.

 

“పిచ్చిపిల్లా, నువ్వింకా చిన్నదానివే గాయత్రీ. పెద్ద మాటలు ఎందుకులేరా?

అయినా అట్టాగంటే, మరి సత్యమన్న నాకు చేసిన మేలుకి నేనేమనాలి? ఎన్నో తడవలు నన్నాదుకున్నాడు. ఆ రుణమే నేను తీర్చుకుంటున్నా అనుకో,” అంది రాములు.

‘ఇంతకీ నీ జీవనం ఎలా సాగింది? కోవెల్లో మళ్ళీ కొలువు ఎప్పటినుండి చేస్తున్నావు?’ అడిగాను రాములుని.

 

ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది రాములు.

“ఏమనాలిరా గాయత్రీ, అంతా నా తల రాత. నా మామకి ఆరోగ్యం బాగోక నేను అప్పట్లో ఊరెళ్ళిన ఇషయం నీక్కూడా తెలుసుగా.

రెండున్నరేళ్ళకి పైగానే దగ్గరుండి పసిపిల్లాడికిమల్లే సేవ చేసినా, మామని కాపాడుకోలేక పోయాను. రోగం ముదిరి నా చేతుల్లోనే చనిపోయాడు మామ.

ఆ బాధ ఓ ఎత్తైతే, భరణం ఇవ్వలేదన్న కోపంతో వాడిని నేనే చంపానని నింద మోపి పోలీసు కేసు పెట్టింది నా సవితి,” ఓ క్షణం మౌనంగా ఉండిపోయింది.

“సత్యమయ్య, పూజారయ్య తంటాలు పడి వకీలు సాయంతో నా సమస్యని ఓ కొలిక్కి తెచ్చారు. ఈడ కొలువులో పెట్టారు. నాకు డబ్బు సాయం కూడా చేసి నిలబెట్టారనుకో,” అని వివరించింది.

రాములు కూడా తన జీవితంలో ఎంతగానో నష్టపోయిందని, ఆమె మాటల్లోనే తెలిసింది.

విని బాధపడ్డాను.

కాని మనిషి మాటతీరులో, నడవడిలో, వేషభాషల్లో మార్పు తెలుస్తుంది.   మునుపు లేని పెద్దరికం వచ్చేసింది….

**

పొలం కౌలుకిప్పించాడు రాంబాబాయి. తాత పింఛను రాడం మొదలైంది. కొట్టాంలో చాలా మటుకు అన్ని పనులు నేనే చేసుకుంటున్నా, మనిషి సాయం ఉండాలంటూ రాగిణి అనే ఆయాని పనిలో పెట్టింది పిన్ని.

నా మటుకు నాకు ఏదైనా చదువో, కొలువో ఉండాలనిపిస్తుంది.

ఉమమ్మని, పూజారయ్యని జ్ఞాపకం చేసుకున్నాను. వాళ్ళని చూడాలని ఉన్నా, నా అంతట నేను వెళ్ళడానికి ఎందుకో ధైర్యం చాలడం లేదు.

‘ఉమమ్మ నన్ను రమ్మని పిలిస్తే బాగుణ్ణు’ అనుకున్నాను మనస్సులో. కబురంపినా చాలు, ధైర్యం వస్తుంది. నా పావురాళ్ళని చూడాలనుంది.

‘నా చదువు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది’ అనుకున్నాను.

**

కోవెల నుండి తెచ్చిన ప్రసాదాలు కంచంలో పెట్టి నా పక్కనొచ్చి కూచుంది రాములు.

కోవెల ఊసులు చెప్పసాగింది…..

 

ఇంతలో, “గాయత్రీ,” అంటూ కొట్టాం తలుపు తీసుకొని పిన్ని లోనికొచ్చింది.

ఆమె కూచోడానికి తన పక్కనే పీట వేసి, తెచ్చిన ప్రసాదం కాస్త పిన్నికి కూడా పెట్టింది రాములు.

 

ప్రసాదం తింటూ, “నీకోసమే వచ్చా రాములు. పొద్దున్న నీ స్నేహితురాళ్ళు కలిశారు. వాళ్ళు చెప్పిన పెళ్లి సంబంధం సంగతి ఆలోచించావా? అడిగింది పిన్ని.

“అతన్ని, నేనూ చూసాను. అన్ని విధాల మంచి సంబంధం అంటున్నారు.

నువ్వు కలుస్తానంటే మనింటికైనా వస్తాన్నాడంట పెళ్ళికొడుకు. కలిసి మాట్లాడు. నచ్చితే పెళ్లి చేసుకుని హాయిగా బతికేయచ్చు కదా. మరి ఏమంటావ్?” అడిగింది పిన్ని రాముల్ని.

 

“చూద్దాములే చంద్రమ్మా, నాక్కాస్త సమయం కావాలి,” అంది రాములు తలొంచుకుని.

“దేనికి సమయం? మరీ ఆలస్యం చేయకు. త్వరగా ఆలోచన కానీయ్. నీకు నెల రోజులు సమయం ఇస్తున్నాం,” నవ్వింది పిన్ని.

 

వాళ్ళ మధ్య స్నేహభావం మెండుగా ఉందని అర్ధమయ్యి బాగనిపించింది. ఎంత కాలంగానో ఒకరికొకరు తెలిసినా, ఈ మధ్య తాత అనారోగ్య విషయంగానే వీళ్ళిద్దరూ దగ్గరయ్యారనిపించింది.

సుబ్బీ, మాణిక్యం, చంద్రం పిన్ని కూడా రాములు పెళ్ళి ప్రయత్నాల్లో ఉన్నారని అర్ధమయ్యింది.

‘అయితే, రాములు పునర్వివాహం కూడా మంచి పరిణామమే’ అనిపించింది…..

egire-pavurama-18

**

రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి.

వెంట తెచ్చిన పుస్తకాలు దులిపి తిరగేస్తున్నాను.

 

గోవిందు అప్పట్లో నాకు తెచ్చిచ్చిన తెలుగు నవల చదువుతూ, వాకిట్లో కూచున్నాను.

 

సాయంత్రం ఎనిమిదింటికి ఇల్లు చేరుతూనే నాకు కమ్మని కబురందించింది రాములు.

పూజారయ్య, ఉమమ్మ నా గురించి అడిగారని. నన్ను వచ్చి కలవమన్నారని చెప్పింది.

తాత పోయిన ఆరు నెలలకి, నేను ఎదురు చూసిన ఆ పిలుపు ఆఖరికి రానే వచ్చింది.

అంటే సరిగ్గా నేను తిరిగి తాత గూడు చేరిన ఆరు నెలలకి నన్ను కోవెలకి రమ్మన్నారు పూజారయ్య, ఉమమ్మ. చాల సంతోషమైంది.

 

“మన కోవెల ఎంతలా అభివృద్ధి పొందిందో చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. నువ్వు వచ్చినప్పుడు చుస్తావుగా! రేపే బయలుదేరు. మనం పొద్దున్నే వెళితే నీ వెంటే ఉండడానికి నాకు సమయముంటుంది,” అంది రాములు ఉషారుగా…

 

పరితప్త హృదయంతో, తల్లివొడి చేరబోయే బిడ్డలా ‘శ్రీ గాయత్రీ కోవెల’ లో అడుగు పెట్టబోతున్న ఆనందంతో నిద్రే పట్టలేదు ఆ రాత్రి…

**

మరునాడు పెందరాళే, చిన్నప్పటిలా తలార స్నానం చేసి, తడి జుట్టు ముడేసి కోవెలకి తయారయ్యాను.

తాత పటానికి దణ్ణం పెట్టుకున్నాను.

చంద్రం పిన్నికి చెప్పి రాములుతో బయలుదేరాను.

**

మేము వెళ్ళేప్పటికి, అమ్మవారి అభిషేకం ముగించుకొని గుడి మెట్ల మీద కూచునున్నారు పూజారయ్య, ఉమమ్మ. దగ్గరగా వెళ్ళి పూజారయ్య పాదాలంటి నమస్కరించాను. వారికాడ నా దుఃఖం ఆగలేదు. ఉమమ్మ నన్ను దగ్గరికి తీసుకుని సముదాయించింది.

 

“బాధపడకమ్మా గాయత్రీ, మీ తాత ఆపరేషనదీ అయిన కొంత కాలానికి కోలుకొని బాగానే ఉన్నాడు. రోజంతా గుళ్ళోనే గడిపేవాడు. వద్దని వారించినా ఎంతో పని చేసేవాడు. నీ గురించే ఆలోచించి, ఆవేదన చెందేవాడు. వాడి మనస్సుని కాస్త వేదాంతం వైపుగా మళ్ళించాలని ప్రయత్నించాను,” అని పూజారయ్య ఓదార్పుగా మాట్లాడారు.

 

నా భుజం మీద చేయి వేసింది ఉమమ్మ. “ఏయ్ గాయత్రి, బాధపడకు.

నువ్వు మాకు ఎప్పటికీ మా చిన్న గాయత్రివే. మూడేళ్లలో ఎంతో జీవితాన్ని చూశావు. కాస్త ఎదిగావు. ‘చక్కనమ్మ చిక్కినా’ అన్న సామెతగా కొండపల్లి బొమ్మలా ఉన్నావు,” అంది ప్రేమగా.

ఆమె ఆప్యాయతకి నా కళ్ళల్లో నీళ్ళు నిండాయి.

 

“ఇక్కడ నీ కోసం అదే స్థానం, అదే అరుగు, అదే కొలువు అలాగే ఉన్నాయి. కోవెల్లో అన్ని సదుపాయాలు ఇంకా మెరుగయ్యాయి. కాకపోతే అప్పట్లో ఇక్కడ నువ్వు చేసింది స్వచ్చంద సేవే.

ఇకముందు కోవెల సిబ్బందితో పాటుగా జీతం పుచ్చుకునే ఓ కార్మికురాలువి,” అంటూ నన్నాట పట్టించింది ఉమమ్మ.

నా మనస్సు కృతజ్ఞతతో నిండిపోయింది.

“అసలు మన కోవెల ఎంతగా మారిందో అంతటా తిరిగి చూడు,” అంది ఆమె మళ్ళీ..

 

“రేపు మంచి రోజే, పదింటి వరకు శుభఘడియలున్నాయి. పొద్దున్నే మన కోవెల పుస్తకాలయానికి పనికి వచ్చేయమ్మా, గాయత్రి,” అన్నారు పూజారయ్య.

 

“కోవెలకి కలిసొచ్చిన కొత్త భూములు, తోటల నుండి మొదలెట్టి చుట్టూ చూపిస్తాను ఉమమ్మా,” అని నా చేయందుకుంది రాములు.

**

అమ్మవారి కోవెల్లో నుండి ఆవరణలోకి అడుగు పెట్టిన నాకు రాములు అన్నట్టుగానే ఎన్నో మార్పులు – చేర్పులు తోచాయి.

 

రావి చెట్టు కింద పూజసామాను, పుస్తకాల అమ్మకాలకి చక్కగా అలమారాలు అమర్చారు. అరుగుని మరింత విస్తరించి…విశాలమైన అరుగు ఎత్తుమీద, రావిచెట్టు చుట్టూరా ఓ అద్దాల స్టాల్లా తయారు చేసారు. ఇప్పుడు దాన్ని ‘శ్రీ గాయత్రి పుస్తకాలయం’ అంటారు. లోపల కూడా దీపాలతో వెలిగిపోతుంది.

పొద్దున్న తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటలవరకు వస్తువుల అమ్మకాలు జరుగుతాయి. రాములు అజమాయిషీలోనే ఉంది అక్కడి వ్యవహారం. ఓ పెద్దాయన మాత్రం పుస్తకాలయం అమ్మకాలు, లెక్కల విషయాల్లో సాయంగా ఉన్నాడు.   పొద్దున్నే స్టాల్, గుడి ఆఫీస్ తలుపులు తెరిచి, ఆఫీసు పని, మళ్ళీ రాత్రి క్లోజింగ్ వరకు ఆయనే చేస్తాడట..

అరుగులకి పక్కగా పావురాళ్ళకి ప్రత్యేకంగా స్థలం కేటాయించి చుట్టూ జల్లి అమర్చారు. అందులో ఓ పక్కగా గింజలకి, నీళ్ళకి కూడా ఏర్పాటు చేశారు.

ఎప్పటిలా రెండు సార్లు వచ్చి గింజలు తిని, కాసేపు తచ్చట్లాడి దూసుకొని పోతాయట పావురాళ్ళు. కోవెల్లోకి వాటి రాక, వాటి ఉనికే ఆలయానికి గొప్ప మేలు చేసిందని జనం అంటున్నారంట.

తోటలో ఇప్పుడు మరెన్నో రకరకాల పువ్వులు పూయిస్తున్నారు. పూల దిగుబడి కూడా రెట్టింపయ్యిందంట. పూల విషయంలో సాయం చేయడానికి రమణమ్మ ఉందంట. దండలు అందంగా కడుతుందంట.

గుడిలోని దేవుని మూర్తులకి ఇవ్వంగా మిగిలిన వాటిని కర్వేపాకు, కొబ్బరిచెక్కలతో పాటు కోవెల బడ్డీలో, అమ్మకాలకి పెడుతుందంట….

 

నాయుడన్న కూడా కనపడ్డాడు. ఎంతో ఆప్యాయంగా నా కాడికి వచ్చి పలకరించాడు. యోగక్షేమాలు అడిగి కనుక్కున్నాడు.

పంతులుగారికి పని సాయం చేసే కృష్ణ కనబడ్డాడు. కాస్త పెద్దవాడయ్యాడు. ఇప్పుడు పదవ తరగతి చదువుతూ, పంతులుగారి కాడ పౌరోహిత్యం చేస్తున్నాడంట.

**

పోతే, కోవెల పరిధిలోకి ఓ ముఖ్యమైన చేరిక ‘సమాజ సంక్షేమ సేవ’ అని అర్ధమయ్యింది. అందుకోసం ఆవరణలో ప్రభత్వం వారి సహకారంతో ‘స్త్రీ సంక్షేమ సంస్థ’కి గాను ఓ కట్టడం, దానికి ఆనుకొని మరో చిన్న ‘ఫలహార శాల’ నిర్మించబడ్డాయి. సంస్థ హాల్లో కనీసం వంద మంది జనం పడతారు. గుడికి సంబంధం లేకుండా దాని ద్వారం రోడ్డు వైపుకే ఉంది.

ఉమమ్మ ఆధ్వర్యంలో జరిగే ఆ సంస్థ కార్యక్రమాల బాధ్యతలు రాములు, కృష్ణ కూడా పంచుకుంటారంట.

ఏడాదికి రెండు సార్లు అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, బీదవారికి ఉచిత వైద్యచికిత్స చేస్తుందట ఆ సంస్థ.

**

అంతటా తిరిగి చూసాక, మేము అరుగుల మీద పుస్తకాలయం కాడ కూచున్నాము.

“ఇక నీ పావురాలని చూసి, పంతులుగారిని కలిస్తే పనయినట్టే. రేపటినుంచి ఎలాగూ ఇక్కడే ఉంటావుగా,” అని రాములు అంటుండగానే, బారులు తీరిన పావురాలు దూసుకొచ్చి మమ్మల్ని దాటుకొని వెళ్లాయి. మేము వాటిని అనుసరించాము.

తిన్నగా వాటికని కేటాయించిన స్థలంలో కాసేపు విహరించి, గింజలు తినేసి, వాటినే గమనిస్తున్న మా మీదగా ఆకాశంలోకి ఎగిసిపోయాయి.

 

నా చిన్నతనంలో ఆ పావురాల రాకపోకలు నాకెంత ఆనందాన్నిచ్చేవో గుర్తొచ్చింది.

నాకు పక్కగా వచ్చి నా భుజం మీద తట్టింది రాములు.

“నా ప్రకారంగా నువ్వూ ఓ పావురానివే గాయత్రీ. అమాయకురాలివి. ఏదో బాధతో గూడు వీడినా, నీ తాత ఆశీర్వాదం, దేవుని దయ వల్ల ఓ శాంతి పావురంలా తిరిగి నీ గూడు చేరడం నాకు సంతోషంగా ఉందిరా,” అంటూ కళ్ళు తుడుచుకొంది, రాములు.

నిజమే అన్నట్టు తలూపాను.

**

“ఏమ్మా గాయత్రి,” అన్న పంతులుగారి పిలుపుకి ఇద్దరం వెను తిరిగాము. “పూజ ముగించి, నువ్వు వచ్చావని తెలిసి ఇటుగా వచ్చాను. ఏమంటున్నాయి నీ పావురాలు? అడిగాడాయన నవ్వుతూ.

చేతులు జోడించి నమస్కరించాను.

 

“బాగున్నావా తల్లీ?” అని అడిగాడాయన ఆప్యాయంగా.

“ఇప్పటికీ తాత పోయిన దుఃఖంలో ఉన్నావు. మనస్సుని కుదుట పరుచుకో తల్లీ. అంతా దైవేచ్ఛ,” , “నా ఆశీస్సులు నీకెప్పుడు ఉంటాయి,” అన్నాడు పంతులుగారు.

 

తాత మాట వింటూనే నా కళ్ళల్లో నీళ్ళు నిండడం గమనించి, మాట మార్చాడాయన. మాతో పాటు పుస్తకాలయం దిశగా నడిచాడు.

“నీవు ఇక్కడ కొలువు చేయబోతావని విన్నాను. చాలా సంతోషం గాయత్రి,” అన్నాడాయన. “చూశావా? ఉమమ్మ అదృష్టరేఖే మన కోవెల వృద్ధికి ఎలా కారణమయిందో. ఆమె ఎంచుకున్న చదువులు, సరోజినీ గారి చేయూత, వారి ప్రోత్సాహం అన్నీ కలిసొచ్చాయనుకో.

ప్రభుత్వ దేవాదాయ పరిషత్తు వారు, అభివృద్ధికి మన కోవెలని కూడా ఎన్నుకోబట్టి, ఇదంతా సాధ్యమయింది. లేదంటే, మన కోవెల్లో ఇంత మందికి ఉపాధి కల్పించగలగడం మాటలు కాదుగా! ఇదంతా మనందరి పూర్వజన్మ సుకృతం తల్లీ,” అన్నాడాయన.

 

నిజమేగా!, ఔనని తలూపాను.

ఆయన కాడ సెలవు తీసుకుని ఇంటి దారి పట్టాను.

**

పనిలో జేరడానికి పోద్దున్నే కోవెలకి బయలుదేరాను.

శ్రీ గాయత్రి పుస్తకాలయం లో అడుగుపెట్టగానే ‘నాలుగేళ్ల తరువాత మళ్ళీ ఈ కోవెల్లో నేను’ అని అనుకుంటూ తాతని తలుచుకున్నాను.

 

తాత ఆత్మకి శాంతి కలిగించే కార్యాలు చేసి, ఆయన ఋణం తీర్చుకోవాలని ఆలోచిస్తూ, కొత్తగా వచ్చిన పూజావస్తువుల డబ్బా విప్పి సర్దడం మొదలెట్టాను.

కాస్త దూరంలోనే వెనుక నుండి ఉమమ్మ మాట వినబడింది. వెను తిరిగి చూసాను. పాలనురుగు లాంటి తెల్లని జరీ అంచు చీర కట్టుకొని ఓ అప్సరలా ఉంది ఉమమ్మ.

 

కాసేపటికి నా ఎదురుగా వచ్చి, చేతిలోని మల్లెచెండు నాకందిస్తూ, “గాయత్రీ, ఆరువారాల్లోనే నీ ఎనిమిదో తరగతి పరీక్షలు. శ్రద్ధగా చదవాలి మరి,” అని గుర్తు చేసింది.

“ఈ పరీక్షలు పాస్ అయిపోతే, సమయం తీసుకొని పదో తరగతి పబ్లిక్ పరీక్షలకి సిద్ధమవ్వచ్చు,” అంటూ నేను సర్దుతున్న పూజా పుస్తకాల నుండి రెండింటిని చేతిలోకి తీసుకుని బయటకి నడిచింది…

 

సమయానికి ఉమమ్మ నాకు చదువు విషయం గుర్తు చేసింది. ‘తాతకి నేను చదువుకోడం చాలా ముఖ్యం అని చటక్కున తోచింది. అదే చేస్తా.’ తాత కోసం ఏమి చేయాలా అని అనుకుంటున్న నాకు నా నిర్ణయం సంతోషమనిపించింది.

ఉమమ్మ వెళ్ళిన దిశగా చూస్తే, చేతిలోని పుస్తకం తిరగేస్తూ రాములుతో మాట్లాడుతుంది ఆమె.

నా వంక చూసి, రమ్మని పిలిచింది.

అప్పుడే వచ్చిన గుమస్తా గారికి చెప్పి, రద్దీ ఏమీ లేకపోవడంతో, వెళ్ళి వాళ్ళకి కొద్ది దూరంలో కూచున్నాను.

 

ఉమమ్మని “పెళ్ళి పనులన్నీ అవుతున్నాయా?” అని సైగలతో అడిగాను.

 

“ఈ సైగలు కొద్దికాలానికి మాటల్లోకి మారుతాయేమోలే గాయత్రి. ఆ ప్రయత్నంగానే వైద్యుల్ని సంప్రదిస్తున్నానని చెప్పడానికే పిలిచాను. జరపవలసిన వైద్య పరీక్షలన్నీ త్వరలో చేయించుదాము. నీ అవిటితనం పోయి, నీ నోటివెంట వచ్చే మాట వినాలని మీ తాత ఎంత అల్లాడిపోయాడో కదా! అసలు సత్యమయ్య కోసమే ఈ విషయంగా నా గట్టి ప్రయత్నమనుకో, ” అంటూ క్షణం సేపు మౌనంగా ఉండిపోయింది ఉమమ్మ.

 

“ఓహ్, మర్చిపోయాను,” అంటూ తన పర్సు నుండి వెండి కాలి పట్టాలు తీసి, రిపైర్ చేసిమ్మంటూ రాములుకందించి, నా వంక చూసిందామె.

”నా పెళ్ళి పనుల గురించి అడిగావా? అన్నీ బాగానే జరుగుతున్నాయి. మన గుడిలోనేగా పెళ్ళి. అన్ని పనులు నాన్నగారు, మల్లిక్ చూస్తున్నారులే,” అంటూ నవ్వేసింది ఉమమ్మ.

 

మా మాటలు వింటున్న రాములు గబుక్కున అందుకుంది.

“అయినా అంతా ఉమమ్మ కనుసైగల్లోనే నడుస్తారు. ఆమె ఆడింది ఆట, పాడింది పాటరా గయిత్రీ. మల్లిక్ బాబు మొన్ననే అమెరికా నుండి తిరిగొచ్చాడు.

అంత దూరాన ఉండగానే మన ఉమమ్మంటే నిండా ప్రేమలో పడిపోయాడు. అక్కడినుంచే అన్నీ కుదేర్చేసుకొని ముహూర్తాలు కూడా పెట్టించేశాడనుకో,” అంది నవ్వుతూ రాములు.

 

ఉమమ్మ ముఖం సిగ్గులతో నిండిపోయింది.

“సరేలే, అతిగా నీ కబుర్లు,” అంటూ కసిరిందామె.

ఇంతలో, మా పావురాలు అందంగా దూసుకొచ్చాయి. పూజాసామాగ్రి కోసం భక్తులు రావడంతో, నేను అటుగా నడిస్తే, దానా డబ్బాతో రాములు, ఉమమ్మ పావురాలని అనుసరించారు…

**

పుస్తకాలయం సర్దుతూ దూరాన్నించే రాములు, ఉమమ్మల్ని గమనించాను కాసేపు.

ఉమమ్మ, తాననుకున్నది సాధించుకొంది. హైదరాబాదుకి కూడా వెళ్లి రెండేళ్లు ‘ప్రత్యేక విద్యావిధానం’ లో ఉత్తీర్ణురాలై ఉపాధ్యాయ పట్టా పొందిందంట. సరోజినీ గారి ప్రోత్సాహంతో, ప్రభుత్వం వారి సహకారంతో, గుడి ఆవరణలోనే   ‘మహిళా సంక్షేమ సంస్థ’ ప్రారంభించి, సమాజసేవ చేస్తున్న ఆమెని చుట్టూ గ్రామాల్లోని వారు ఎంతో గౌరవిస్తున్నారట.

 

ఉమమ్మ పెళ్ళి చూడ్డానికి, ఇప్పుడు ఊరంతా ఎదురు చూస్తుంది. పెళ్లయ్యాక ఉపాధ్యాయినిగా పనిచేస్తూనే ఇక్కడ పాలెంలోని ‘స్త్రీ సంక్షేమ సంస్థ’ కూడా నిర్వహిస్తుందంట.

ఇకపోతే, ఉమమ్మకి కాబోయే భర్త కూడా, మాకు ఆప్తుడైన డాక్టర్. మల్లిక్ గారే. గుంటూరులో ‘శారద సత్య స్పెషాల్టీ హాస్పిటల్ ’ ద్వారా పేదలకి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారంట.

 

‘ఉమమ్మ నాకు తెలిసినప్పటి నుండి ఇతరులకి సేవ చేయాలన్న తపనతో మసలడం, నా లాంటి వారి అదృష్టమే అనుకుంటాను. ఆమెకి తగిన భర్తని, చక్కటి జీవితాన్ని ప్రసాదించింది ఆ తల్లి గాయత్రి అమ్మవారు.

 

“మళ్ళీ వస్తాను గాయత్రి. మొదలెట్టి పరీక్షలకి చదువు, మళ్ళీ మళ్ళీ పునరీక్షించు, వింటున్నావా?” అంటూన్న ఉమమ్మ మాటలకి ఆమె వంక చూశాను. ‘అలాగే’ అన్నట్టు తలాడించాను.                                                            (ఇంకా ఉంది)

 

పెద్రో పారమొ-7

pedro1-1

పొద్దుటి ఎండకి నా జ్ఞాపకాలు వెలిసిపోతూ ఉన్నాయి.
అప్పుడప్పుడూ మాటల శబ్దాలు విన్నాను. తేడా గమనించాను. ఎందుకంటే అప్పటిదాకా నేను విన్న మాటలన్నీ నిశ్శబ్దమైనవి. శబ్దమేదీ లేదుగానీ అర్థం తట్టేది. కలలో మాటలు విన్నట్లు నిశ్శబ్దంగా.
“ఎవరయి ఉంటాడు ఇతను?” ఆమె అడుగుతూంది.
“ఎవరికి తెలుసు!” అతను బదులిచ్చాడు.
“ఎందుకొచ్చాడో ఇక్కడికి?”
“ఎవరికి తెలుసు!”
“వాళ్ల నాన్న గురించి ఏదో అన్నట్లు గుర్తు.”
“నేనూ విన్నాను.”
“దారి తప్పాడంటావా? ఒకసారి దారి తప్పామని కొందరు వచ్చారు గుర్తు ఉందా? లాస్ కంఫైనెస్ అనే ఊరి కోసం చూస్తున్నామంటే నీకు తెలియదని చెప్పావు”
“అవును, గుర్తుందిలే. నన్ను పడుకోనియ్! ఇంకా తెల్లవారలేదు.”
“తెల్లారుతూనే ఉంది. నిన్ను లేపాలనే నీతో మాట్లాడుతూంది. తెల్లారకముందే గుర్తు చేయమని అన్నావు, నేను గుర్తు చేస్తున్నాను. లే!”
“నన్నెందుకు లేపుతున్నావు?”
“నాకు తెలియదు. లేపమని నాకు రాత్రి చెప్పావు. ఎందుకో చెప్పలేదు.”
“అదే కారణమయితే నన్ను పడుకోనియ్. రాత్రి అతను వచ్చినప్పుడు ఏమన్నాడో గుర్తుందిగా? తనను నిద్రపోనివ్వమని. అతని నోట్లోంచి వచ్చిందంతా ఆ ముక్కే.”

 

గొంతులు దూరంగా పోతున్నట్టున్నాయి. మాసిపోతూ. ఊపిరి తిరగనివ్వకుండా చేసినట్టు. ఎవరూ ఏమీ అనడం లేదు. అది కల.
కానీ కాసేపయ్యాక అది మళ్ళీ మొదలయింది.
“అతను కదులుతున్నాడు. లేవబోతున్నాడనుకుంటాను. మనల్ని ఇక్కడ చూస్తే ఏవో ప్రశ్నలన్నీ అడుగుతాడు.”
“అతనేం అడుగుతాడు?”
“అతనేదో మాట్లాడాలి గదా! కాదా?”
“అతన్ని వదిలెయ్! బాగా అలసిపోయి ఉండాలి.”
“నువ్వలా అనుకుంటున్నావా?”
“ఇక చాలించు తల్లీ!”
“చూడు, కదులుతున్నాడు. ఎట్లా ఎగిరెగిరి పడుతున్నాడో చూడు. లోపలేదో అతన్ని కుదిపేస్తున్నట్టు. నాకు కూడా అలా అయింది కనక నాకు తెలుసు.”
“నీకేం అయింది?”
“అది.”
“నువ్వేమంటున్నావో నాకు తెలియడం లేదు.”
“అతన్ని అట్లా చూసినప్పుడు నువ్వు మొదటిసారి నాకు అది చేసినప్పుడు నాకేమయిందో గుర్తుకు వచ్చింది. అంతకంటే ఏమీ చెప్పలేను . అది నన్నెంత బాధించిందీ, అది చేసినందుకు ఎంత చెడ్డగా అనిపించిందీ..”
“అది అంటే?”
“నువ్వు అట్లా చేయగానే నాకనిపించిందీ, నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఎట్లా సరిగ్గా చేయనిదీ..”
“మళ్ళీ మొదలుపెట్టావా? నువ్వు పడుకుని నన్ను పడుకోనివ్వు!”
“నువ్వే అడిగావు గుర్తు చేయమని. నేను అదే చేస్తున్నాను. ఓరి దేవుడా, నువ్వు నాకేం చెప్పావో అదే చేస్తున్నాను. లే! నువ్వు లేచే సమయమయింది.”
“నన్నొదిలేయి తల్లీ!”
అతను నిద్రపోయినట్టున్నాడు. ఆమె మెత్తటి గొంతుతో తిడుతూనే ఉంది.
“అదుగో తెల్లగా తెల్లారిపోయింది. ఎంత వెలుతురుగా ఉందో చూడు. ఇక్కడినుంచి అతను కనిపిస్తున్నాడంటే అంత వెలుతురు ఉండబట్టే కదా! కాసేపట్లో ఎర్రగా పొద్దు పైకొస్తుంది. అది నీకు నేను చెప్పనవసరం లేదు. అతనేదో తప్పు చేసి ఉండాలి. మనం లోపలికి రానిచ్చాం. ఈ ఒక్క రాత్రికే అయినా సరే, అతనికి ఆశ్రయమిచ్చాం. ముందుముందు లేనిపోనివి మన తలకు చుట్టుకుంటాయి. చూడు అతనెంత దొర్లుతున్నాడో కుదురుగా పడుకోకుండా. గుండెలమీద పెద్ద బరువు పెట్టుకుని ఉండాలి.”
వెలుతురు ఎక్కువవుతూంది. దినం నీడల్ని పారదోలుతూంది. వాటిని చెరిపేస్తూంది. నిద్రపోతున్న దేహాల వేడితో నేను పడుకున్న గది వెచ్చగా ఉంది. పొద్దుటి ఎండ నా కనురెప్పలపై వాలడం తెలుస్తూంది. నాకు వినిపించింది:
“అతను శపించబడ్డట్టు కొట్టుకుంటున్నాడు. దురాత్ముడి ఆనవాళ్ళన్నీ కనపడుతున్నాయి. లే డోనిస్, అతన్ని చూడు. చూడు అతను ఎట్లా తన్నుకులాడుతూ అటూ ఇటూ దొర్లుతున్నాడో! చొంగ కారుస్తున్నాడు. చాలా మందినే చంపి ఉండాలి. నువ్వు చూడను కూడా చూడడంలేదు.”
“పాపం! పడుకో.. మమ్మల్ని పడుకోనివ్వు.”
“నాకు నిద్ర పట్టకపోతే ఎట్లా పడుకోను?”
‘లేచి పో అయితే. నన్ను సతాయించకుండా ఎక్కడికన్నా పో!”
“పోతా. పోయి నిప్పు రాజేస్తా. పోతూ ఏం పేరో అతన్ని వచ్చి నీ పక్కనే నా చోట్లో పడుకోమంటా.”
‘అదే చెప్పు అతనికి.”
“కాదులే. నాకు భయం.”
“అయితే మమ్మల్ని వదిలేసి నీ పని చూసుకో!”
“పోతున్నా!”
“ఇంకా దేనికి ఆగావు?”
“పోతున్నా.”
ఆమె మంచం మీదినుంచి లేవడం వినిపించింది. ఆమె నగ్న పాదాలు నేలను తాకిన చప్పుడు. నా తల మీదుగా దాటుకుంటూ పోయింది. నేను కళ్ళు తెరిచి మూసుకున్నాను.
మళ్ళీ కళ్ళు తెరిచేసరికి పొద్దు బాగా పైకెక్కింది. నా పక్కనే మట్టి కప్పులో కాఫీ ఉంది. తాగడానికి ప్రయత్నించాను. కాసిని గుక్కలు మింగాను.
“మా దగ్గర అదే ఉంది. ఏం చేయను? ప్చ్! కొద్దిగానే ఉంది. అన్నిటికీ కొరతగానే ఉంది. ఎంతో కొరతగా.”
అది ఒక స్త్రీ గొంతు.
“నాగురించి చింతించకండి.” ఆమెకి చెప్పాను. “నాగురించి చింత ఏమీ వద్దు. నాకలవాటే. ఇక్కడి నుంచి బయటికి ఎట్లా వెళ్ళాలి?”
“ఎక్కడికి పోతున్నావు?”
“ఎక్కడికయినా.”
“బోలెడు దారులున్నాయి. ఒకటి కోంట్లాకి వెళుతుంది. ఒకటి అక్కడ్నుంచి వస్తుంది. ఒకటి తిన్నగా కొండల్లోకి పోతుంది. ఆ కనపడేది ఎక్కడికి పోతుందో నాకు తెలియదు.” పడిపోయిన కప్పు స్థానంలో రంధ్రం గుండా పైకి చూపిస్తూ అంది. “ ఇంకొకటి మెదియాలూనా మీదుగా పోతుంది. మరొకటి ఊరంత పొడుగూ పోయేదుంది. అది అన్నిటికంటే పొడవయింది.”
“అయితే నేను అటునుంచే వచ్చి ఉండాలి.”
“ఎటు పోతున్నావు?”
“సయులా వైపు.”
“నా మతి మండ. ఇంకా సయులా అటు వైపనుకున్నాను. అక్కడికి వెళ్ళాలని ఎన్నాళ్లనుంచి అనుకుంటున్నానో. అక్కడ చాలా మంది జనం ఉంటారని చెప్తారు.”
“మిగతా చోట్ల లాగే.”
“మరే! ఇక్కడేమో మేం ఒంటరిగా ఉన్నాము. ఒక్క పురుక్కి కూడా మొహం వాచి ఉన్నాం.”
“మీ ఆయన ఎక్కడికి పోయాడు?”
“మా ఆయన కాదు, అన్న. ఆ సంగతి ఎవరికీ తెలియడం ఇష్టం లేదు తనకి. ఎక్కడికి పోయాడో! దూడేదో ఈ చుట్టుపక్కల తప్పించుకు తిరుగుతుంటే దాని కోసం పోయినట్టున్నాడు. నాకు చెప్పడమయితే ఆ మాటే చెప్పాడు.”
“ఇక్కడ ఎన్నాళ్ళ నుంచీ ఉంటున్నారు?”
“ఎప్పటినుంచో! మేం ఇక్కడే పుట్టాం.”
“అయితే నీకు డలోరిస్ ప్రెసియాడొ తెలిసే ఉండాలే!”
“డోనిస్ కి తెలుసేమో! జనాల గురించి నాకంతగా తెలియదు. బయటికి ఎప్పుడూ వెళ్ళను. శాశ్వతంగా ఇక్కడే ఉన్నట్లు ఉంటుంది. అన్నాళ్ళు కాదులే కానీ, నన్ను తనదాన్ని చేసుకున్నప్పటి నుంచీ. అప్పటినుంచీ ఇక్కడే ఉండిపోయాం. ఎవరయినా చూస్తారని భయం. తను నమ్మడు కానీ నామొహం చూసి ఎవరయినా దడుచుకోరా?” నడిచి వచ్చి ఎండలో నిలుచుంది. “ నా మొహం చూడు.”
అది మామూలు మొహం.

Pedro_Páramo
“ఏం చూడమంటావు?”
“ నా పాపం కనపడటం లేదా? ఊదారంగు మచ్చలు కనపడటం లేదా? అదింకా బయటే. లోపల నేనొక బురద సముద్రాన్ని.”
“ఇక్కడ ఎవరూ లేనప్పుడు ఇక నిన్నెవరు చూస్తారు? ఊరంతా తిరిగాను కానీ ఒక్కరూ కనపడలేదు.”
“కనపడలేదని నువ్వనుకుంటున్నావు కానీ ఇంకా ఇక్కడ కొందరున్నారు. నీకు ఫిలోమెన కనపడలేదా? డరోటియా, మెల్క్విలాడెస్, లేకపోతే ముసలి ప్రెడెన్సియో? ఇంకా సొస్టేనెస్ వాళ్ళంతా బతికే ఉన్నారు కదా! విషయమేమిటంటే వాళ్ళు ఇళ్ళ దగ్గరే ఉంటారు. పగలంతా ఏం చేస్తారో తెలియదు కానీ, రాత్రుళ్ళు తలుపులు వేసుకుని లోపలే ఉంటారు. ఇక్కడ రాత్రులన్నీ దయ్యాలతోటే నిండి ఉంటాయి. ఆ ఆత్మలన్నీ వీధుల్లో నడిచివెళ్ళడం నువు చూడాలి. చీకటి పడగానే అవన్నీ బయటకు వస్తాయి. ఎవరికీ వాటిని చూడాలని ఉండదు. అవి చాలా ఉంటాయి, మేమా కొద్దిమందిమి. వాళ్ళు పాప ప్రాయశ్చిత్త లోకం నుంచి బయటపడేందుకు ప్రార్థన చేయడానికి కూడా ప్రయత్నించం. అన్ని ప్రార్థనలు మావద్ద లేవు. ఏదో దైవప్రార్థన, తలా నాలుగు మాటలు.అది వాళ్ళకు ఏమూలకి? వాళ్ళ పాపాలపైన మా పాపాలు. బతికి ఉన్నవాళ్ళవెవరమూ దైవకృప కలిగి లేము. సిగ్గుతో నిండిన కళ్ళను ఎత్తి చూడలేము. సిగ్గు సాయపడదు. కనీసం బిషప్ చెప్పిన మాట అదీ. ఆ మధ్య దీవెనలివ్వడానికి వచ్చాడు. నేను వెళ్ళి అన్నీ కన్ ఫెస్ చేశాను.
“’నేను నిన్ను క్షమించలేను,’ అన్నాడు.
“’సిగ్గుతో నా వొళ్ళంతా చితికిపోతూంది.’
“’అది సమాధానం కాదు.’
“’మా ఇద్దరికీ పెళ్ళి చేయండి!’
“’విడివిడిగా బతకండి!’
“నేనతనికి చెప్పడానికి ప్రయత్నించాను. బతుకు మమ్మల్ని కలిపింది. పశువుల్లా తరిమింది. ఒకళ్ళమీదికొకళ్ళని బలవంతాన తోలింది. మేమెంతో వొంటరిగా ఉన్నాము, ఇద్దరమే మిగిలాం. మళ్ళీ ఎట్లాగో ఊళ్ళోకి కొంతమంది వచ్చారు. అతను ఈసారి వచ్చేసరికి దీవెనలివ్వడానికి ఎవరో ఒకరు ఉంటారని చెప్పాను.”
“’ఎవరి దారిన వాళ్ళు పోండి. మార్గాంతరం లేదు.”
“’మరి మేమెలా బతకం?’
“’అందరూ బతికినట్టే.’
“మొహం గంటు పెట్టుకుని కంచరగాడిదనెక్కి వెళ్ళిపోయాడు, వెనక్కి తిరిగి చూడకుండా. ఇక్కడేదో శాపగ్రస్త దృశ్యాన్ని వదిలి పోతున్నట్టు. అతను మళ్ళీ తిరిగి రాలేదు. అందుకే ఈ చోటంతా ఆత్మలు ముసురుకొని ఉన్నాయి. క్షమాపణ దొరకకనే చనిపోయిన నిమ్మళం లేని ఆత్మలగుంపులు. జనాలకి క్షమాపణ ఎటూ దొరకదు, అందులోనూ మా మీద ఆధారపడి ఉన్నప్పుడు. అతను వస్తున్నాడు. వినిపిస్తుందా?”
“అవును. వినపడుతుంది.”
“అది అతనే!”
తలుపు తెరుచుకుంది.
“దూడ దొరికిందా?” అడిగింది.
“తిరిగి రాకూడదని దాని బుర్రకెక్కినట్లుంది. దాని అడుగుజాడలు దొరికాయి. తొందరలోనే ఎక్కడుందీ కనుక్కుంటాను. రాత్రికి పట్టుకుంటాను.”
“మళ్ళీ రాత్రికి ఒంటరిగా వదిలి పోతావా?”
“పోవలసివస్తుందేమో!”
“నావల్ల కాదు. నువు నాతో ఉండాలి. అప్పుడే నాకుహాయిగా ఉంటుంది. రాత్రిపూట.”
“కానీ ఈరాత్రికి దూడ కోసం వెళ్ళాలి.”
“నాకిప్పుడే తెలిసింది.” అడ్డు తగిలాను. “మీరిద్దరూ అన్నా చెల్లెళ్లని.”
“నీకిప్పుడే తెలిసిందా? నాకు చాలాకాలం నుంచీ తెలుసు. అందులో నువు వేలు పెట్టకు. జనాలు మాగురించి మాట్లాడుకోవటం నాకిష్టం లేదు.”
“నేను అర్థం చేసుకోగలనని చెప్పటానికే ప్రస్తావించాను. అంతే.”
“అర్థం చేసుకునేదేమిటి?”
“ఏం లేదు.” చెప్పాను. “క్షణక్షణానికీ నాకు అర్థమవడం తగ్గుతూ ఉంది.” ఇంకా జతకలిపాను. “ నాకు కావలసిందల్లా నేను బయలుదేరిన చోటుకి తిరిగి వెళ్లటమే. మిగిలిన కాస్త వెలుతురూ పోకముందే బయలుదేరాలి.”
“నువ్వాగటం మంచిది.” అతనన్నాడు. “పొద్దుటి దాకా ఆగు. తొందరగా చీకటి పడుతుంది. ఈ దారుల్లో తప్పిపోతావు. రేపు పొద్దున నీకు సరైన దారి చూపిస్తాను.”
“సరే.”

 

కప్పుకున్న రంధ్రంలోంచి పిట్టల్ని చూస్తున్నాను. సందెవేళ చీకటి దారులు మూసేలోపు గుంపు కట్టి పోతున్నాయి. దినాన్ని తీసుకువెళ్లడానికి వస్తున్న గాలి కొన్ని మబ్బుల్ని అప్పటికే చెదరగొట్టింది.
తర్వాత శుక్రనక్షత్రం బయటికి వచ్చింది. మరి కాసేపటికి చంద్రుడూ.
అతనూ, ఆమే దగ్గరలో లేరు. వరండాలోంచి వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేప్పటికి చీకటి పడిపోయింది. కాబట్టి వాళ్లు వెళ్ళిపోయాక ఏం జరిగిందో వాళ్ళకు తెలిసే అవకాశం లేదు.
ఇదీ జరిగింది:
వీధిలోంచి ఒక స్త్రీ వచ్చింది. పురాతనమైన ఆమె ఎంత సన్నగా ఉన్నదంటే చర్మం బొమికెలకు అతుక్కునిపోయింది. తన పెద్ద కళ్ళతో గది చుట్టూరా కలయజూసింది. ఆమె నన్ను కూడా చూసే ఉండొచ్చు. బహుశా నేను నిదరపోతున్నాననుకుందేమో! సరాసరి మంచం దగ్గరికి వెళ్ళి దాని కిందనుంచి ట్రంకు పెట్టె బయటికి లాగింది. డాని లోపలంతా వెతికింది. కాసిని దుప్పట్లు చంక కింద పెట్టుకుని నేనెక్కడ నిద్ర లేస్తానో అన్నట్టు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ పోయింది.
ఊపిరి బిగబట్టి, ఆమెవేపుకు కాకుండా ఎటో చూడడానికి ప్రయత్నిస్తూ బిర్రబిగుసుకుని ఉండిపోయాను. చివరికి తల తిప్పడానికి కాస్త ధైర్యం కూడదీసుకుని ఆమె వంక చూశాను.శుక్రతార చంద్రుడితో కలుస్తున్న దిశలో.
“ఇది తాగు” నాకు వినిపించింది.
తల తిప్ప సాహసించలేకపోయాను.
“ఇది తాగు. నీకు మంచే చేస్తుంది. ఇది నారింజ పూల తేనీరు. నువు వణుకుతున్నావు కనుక భయపడుతున్నావని నాకు తెలుసు. ఇది నీ భయాన్ని తగ్గిస్తుంది.”
చేతులు గుర్తు పట్టాను. కళ్ళెత్తి చూశాక మొహాన్నీ గుర్తు పట్టాను.ఆమె వెనక ఉన్న అతను అడిగాడు: ”ఒంట్లో బాగా లేదా?”
“నాకు తెలియదు. మీకెవరూ కనపడని చోట నాకు మనుషులూ, వస్తువులూ కనపడుతున్నాయి. ఇప్పుడే ఇక్కడికి ఒకామె వచ్చింది. ఆమె వెళుతుండగా మీ కళ్ళపడే ఉండాలి.”
“దా!” తన భార్యతో అన్నాడతను “ అతన్ని ఒంటరిగా వదిలేయి. మర్మయోగిలా మాట్లాడుతున్నాడు.”
“అతనికి మంచం ఇద్దాం. చూడు ఎట్లా వణికిపోతున్నాడో. జ్వరం తగిలిందేమో!”
“అతన్ని పట్టించుకోకు. ఇట్లాంటి వాళ్ళు మనల్ని ఆకట్టుకోవడానికి కావాలనే ఈ పరిస్థితి కొని తెచ్చుకుంటారు. మెదియాలూనా దగ్గర ఒకతను నాకు తెలుసు. దైవాంశ ఉందని చెప్పుకునే వాడు. అతనికి ఆ దైవాంశ చెప్పనిదేమిటంటే అతనెంత అబందరగాడో వాళ్ళ అయ్యగారికి తెలియగానే వాడికి చావు మూడిందని. వాళ్ళు ఒక ఊరినుంచి ఇంకో ఊరికి పోతూ బతుకు గడిపేస్తారు ‘దేవుడు ఏం ఇవ్వదలచాడో కనుక్కోవడానికి’. కానీ అతనికి ఇక్కడ తినడానికి ఒక్క మెతుకు కూడా దొరకదు. చూడు వణకడమెట్లా ఆపాడో! మన మాటలు వింటున్నాడు.”

కాలం వెనక్కి తిరుగుతున్నట్లుంది. తార మళ్ళీ చంద్రుడి వద్దకు చేరుతూంది. చెదిరిన మేఘాలు. పిట్టల గుంపులు. అప్పుడు అకస్మాత్తుగా మిట్టమధ్యాహ్నపు వెలుతురు.
గోడలపై మధ్యాహ్నపు ఎండ పరావర్తనమవుతూంది. బండరాళ్ల మీద నా అడుగులు చప్పుడు చేస్తున్నాయి. గాడిదలు తోలేవాడు అంటున్నాడు “పైకి చూడు దోనా ఎదువిజస్! నువ్వింకా బతికుంటే.”
అప్పుడొక చీకటి గది. నా పక్కనే గురక పెడుతున్న ఒక స్త్రీ. ఆమె కల కంటున్నట్టో, లేక మెలకువగా ఉండే నిద్రపోతున్నట్లు చప్పుడు చేస్తూనో ఉన్నట్లు ఊపిరి హెచ్చుతగ్గులుగా పీలుస్తూంది. ఎప్పుడూ ఎండలో వేయక ఉచ్చ కంపు కొడుతున్న గోతం సంచులు పరిచిన రెల్లుమీద కప్పి ఏర్పాటు చేసిన పక్క. ఒక మొద్దు మీదో ఊలు చుట్ట మీదో జీను మెత్తని చుట్టి చేసిన దిండు. అది చెమటకంపు కొడుతూ రాయిలా గట్టిగా ఉంది.
నగ్నంగా ఉన్న స్త్రీ కాళ్ళు నా మోకాళ్ళకు తగులుతున్నట్లు తెలుస్తూంది. నామొహం మీద ఆమె ఊపిరి. ఆ రాయి లాంటి దిండును ఊతం చేసుకుని లేచి కూచున్నాను.
“నువు నిద్రపోలేదా?” ఆమె అడిగింది.
“నిద్ర పట్టడం లేదు. పగలంతా పడుకున్నాను. మీ అన్న ఎక్కడ?”
“ఎక్కడికో పోయాడు. ఎక్కడికి వెళతానన్నాడో నువుకూడా విన్నావు కదా? ఈరాత్రికి ఇక రాకపోవచ్చు.”
“అయితే వెళ్ళాడా? నువు వద్దని చెబుతున్నా?”
“అవును. తను ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చు. వాళ్లంతా అలాగే చేస్తారు. ‘నేనక్కడికి పోవాలి; ఇటు వెళ్లాలి.’ ఎపుడో చాలా దూరం , తిరిగి రావడం అంత తేలిక కానంత దూరం పోతారు. తను పైకి చెప్పకపోయినా నన్ను నువ్వు చూసుకుంటావని వదిలేసి పోయుంటాడు. తన వీలు తను చూసుకున్నాడు. తప్పిపోయిన దూడ ఒక సాకు. చూస్తూండు. ఇక తిరిగి రాడు.”
“నాకు కళ్ళు తిరుగుతున్నాయి. గాలి కోసం బయటకు వెళుతున్నాను.” అందామనుకున్నాను. బదులుగా అన్నాను. “కంగారు పడకు. అతను తిరిగి వస్తాడు.”
నేను మంచం దిగేసరికి ఆమె అంది.
“కుంపట్లో బొగ్గుల మీద నీకు కాస్త ఉంచాను. అంత ఎక్కువ లేదు కానీ నువు మరీ పస్తు ఉండకుండా ఉంచుతుంది.”
ఎండు ఆవు మాంసపు ముక్కా, కొన్ని వేడి రొట్టెలూ కనిపించాయి.
“అంతే నాకు దొరికింది,” వేరే గదిలోంచి ఆమె మాటలు నా చెవిన పడ్డాయి. మా అమ్మ చస్తూ వదిలివెళ్ళిన రెండు మంచి దుప్పట్లు మా చెల్లికి ఇచ్చి ఇవి తెచ్చాను. అవి మా మంచం కింద దాచాను. అవి తీసుకు వెళ్ళడానికే వచ్చి ఉంటుంది. డోనిస్ ఎదురుగా నీకు చెప్పదల్చుకోలేదు కానీ నువ్వు చూసింది ఆమెనే. బాగా భయపెట్టినట్టుందిగా!”
ఒక నల్లటి ఆకాశం, నిండా నక్షత్రాలు. చంద్రుడి పక్కనే అన్నిటికంటే పెద్ద నక్షత్రం.

“నామాట వినపడటం లేదా?” లోగొంతుకతో అడిగాను.
ఆమె గొంతు బదులిచ్చింది: ”నువ్వెక్కడ?”
“నేను ఇక్కడ, నీ ఊరిలో, నీ మనుషులతో. నేను కనపడటం లేదా?”
“లేదు కొడుకా, నువు నాకు కనపడటం లేదు.”
అన్నిటినీ ఆవరిస్తూ ఉంది ఆమె గొంతు. ఎక్కడో దూరంలో మాయమవుతూంది.
“నాకు నువు కనపడటం లేదు.”

 

నేను ఆమె నిద్రపోతున్న గదికి తిరిగి వెళ్ళి చెప్పాను.
“నేను ఈ మూలన పడుకుంటాను. ఆ మంచమెటూ రాయంత గట్టిగా ఉంది. ఏమన్నా అయితే నన్ను లేపు.”
“డోనిస్ తిరిగి రాడు.” ఆమె అంది. “తన కళ్ళు చూస్తే తెలిసిపోయింది. ఎవరన్నా వస్తారని ఎదురుచూస్తూ ఉన్నాడు తప్పించుకుపోవచ్చని. ఇప్పుడు నా బాగోగులు నువ్వే చూడాలి. చూడవా? నన్ను చూసుకోవా? నా పక్కనే పడుకుని నిద్రపో!”
“ నాకిక్కడ బాగానే ఉంది.”
“ ఇక్కడ ఈ మంచంలో ఇంకా బాగుంటుంది. అక్కడ నల్లులు నిన్ను బతికుండగానే పీక్కు తింటాయి.”
నేను లేచి ఆమె పక్కలోకి దూరాను.

(సశేషం)

అమ్మ…దేవత…జయలలిత…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

నాకు ఇక్కడ ఒకసారి వర్తమానంలోకి రావాలని బలంగా అనిపిస్తోంది…

అలాగని నేనిప్పుడు ప్రస్తావించబోయే అంశాలు, గత కొన్ని వ్యాసాలుగా చర్చిస్తున్న అంశంతో సంబంధం లేనివి కావు. మన పురాచరిత్రకూ; లౌకిక, పారలౌకికతలతో జమిలిగా అల్లుకున్న మన సంక్లిష్ట మనస్తత్వానికీ, చర్చించబోయే అంశాలకూ ఏదో ముడి ఉందనుకుంటున్నాను. లోపలికి వెడుతున్నకొద్దీ అది ఎలాంటిదో అర్థమవుతుందేమో చూద్దాం.

తమిళనాడు, పురాచరిత్రకోణంనుంచి నాలో ప్రత్యేకమైన కుతూహలం రేకెత్తిస్తూ ఉంటుంది. ఆ రాష్ట్రం పురాచరిత్రకు స్పష్టమైన వర్తమాన ప్రతిబింబంలా అనిపిస్తుంది. అవినీతి ఆరోపణలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత రెండోసారి జైలుకు వెళ్ళి పదిహేనురోజులు ఉండిరావడమే చూడండి… ఆమె జైలుకు వెళ్లినప్పుడు అభిమానులు, అనుయాయుల నిరసనతో రాష్ట్రం అట్టుడికింది. ఆ నిరసనలో కోపమే కాక, దుఃఖం కూడా ఉంది. భవిష్యత్తు గురించి భయం కూడా ఉండచ్చు. తమ నాయకుడు/నాయకురాలు ఇలాంటి విషమపరిస్థితిలో చిక్కుకున్నప్పుడు అభిమానులు ఆత్మహత్యకు సైతం పాల్పడడం తమిళనాడులోనే ఎక్కువగా చూస్తుంటాం. ఈసారి కూడా ఆత్మహత్యలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఎవరూ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని జయలలిత విజ్ఞప్తి కూడా చేశారు. సరే, రాజకీయనాయకులు చేసే అలాంటి విజ్ఞప్తిలో, ‘తనకు ఇంత అభిమానుల బలం ఉంది సుమా’ అని ఇతరులకు చేసే ఒక హెచ్చరికా ఇమిడి ఉంటుంది, అది వేరే విషయం.

జయలలిత అశేష అభిమానుల దృష్టిలో కేవలం ముఖ్యమంత్రి కాదు, ఆమె ‘అమ్మ’. జనానికి నిత్యజీవనభారాన్ని ఎంతో కొంత తగ్గించే కొన్ని జనప్రియ(పాపులిస్ట్) పథకాలను ఆమె అమలు చేశారు. ఆవిధంగా ఆమెను ‘అమ్మ’ అని పిలుచుకోవడంలో అభిమాన, ఆత్మీయతలతోపాటు ఆరాధనాభావం కూడా కలగలసి ఉంటుంది. అంటే, అమ్మ అక్షరాలా ‘దేవత’ అయిపోతుంది. ఆమె సాక్షాత్తు అమ్మ, దేవత అనే భావన జనంలో ఎంత బలంగా ఏర్పడిపోతుందంటే; ‘ముఖ్యమంత్రి’ అన్న లౌకిక నామం ఆ అభిమానపు వెల్లువలో కొట్టుకుపోతుంది. అంతేనా? ముఖ్యమంత్రి చట్టబద్ధంగా, నీతినిజాయితీలతో, జవాబుదారీ పాలన అందించాలన్న భావనకూ అదే గతి పడుతుంది. ‘అమ్మ’ తమను చల్లగా చూసినంతవరకూ ఆమె వ్యక్తిగత నీతినిజాయితీలు ఎలా ఉన్నా జనానికి అనవసరం.

నేనిక్కడ కేవలం జయలలితనే వేలెత్తి చూపించడం లేదు. ఆమె స్థానంలో ఆమెలా జనాభిమానాన్ని పొందిన ఎవరున్నా ఇదే జరుగుతుంది. లౌకిక ప్రపంచానికి చెందిన పాలకునిలో వ్యక్తిగత లోపాలు ఎన్ని ఉన్నాసరే, తమ భౌతికజీవితానికి మేలు చేసే పనులు చేసినప్పుడు అతనికి/ఆమెకు పారలౌకిక ప్రపంచానికి చెందిన దేవుడు/దేవతతో అభేదం కల్పించి విగ్రహంగా మార్చడం తరతమ భేదాలతో దేశమంతటా ఉంది. కాకపోతే, తమిళనాడు జనాలలో మాత్రం ఇది మరింత పతాకస్థాయిలో వ్యక్తమవుతుంటుంది. తాము అభిమానించి ఆరాధించేవారికి ఆలయాలు నిర్మించడం కూడా అక్కడే ఎక్కువ. మన రాష్ట్రంలోనూ ఇటీవల ఇలాంటి ధోరణులు కనిపించినా తమిళనాడే దీనికి తగిన నమూనా అనిపిస్తుంది.

ఈ మనస్తత్వ మూలాలు ఎక్కడున్నాయని వెతుకుతూ వెనక్కి వెడితే, బహుశా మనం పురాతన వ్యవసాయ నాగరికతకు చెందిన నగరరాజ్యాల దశకు చేరుకుంటాం. ఆనాటి జనం నగర దేవతకు గుడి కట్టుకుని ఆమె చుట్టూ తమ లౌకిక, పారలౌకిక జీవితాన్ని గాఢంగా అల్లుకునేవారు. ఆ దేవత కోసం ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధంగా ఉండేవారు. పరిపాలన అంతా దేవత పేరు మీదే జరిగేది. వ్యవసాయభూములకు దేవతే యజమాని. భూముల పంపకానికి దేవాలయమే కేంద్రంగా ఉండేది. అన్నవితరణా అక్కడే జరిగేది. తమకు జీవనోపాధిని కల్పించేది, అన్నం పెట్టేది దేవతే కనుక అందులో లౌకికం, పారలౌకికం అన్న తేడాకు అవకాశమే లేదు.

ఆ ఛాయలే కాలం కల్పించిన వేల సంవత్సరాల హద్దులను దాటుకుంటూ తమిళనాడులోకి ఇప్పటికీ ప్రవహిస్తున్నాయా అనిపిస్తుంది. ఇక్కడ జయలలిత రూపంలో పాలక స్థానంలో ఉన్నది మనిషి కావచ్చు; కానీ ఆమె దేవతలానే తమకు పని కల్పించి, అన్నం పెట్టినప్పుడు దేవతే అవుతుంది. ఇదంతా కేవలం ఊహాప్రాయంగా తీసుకొచ్చిన పోలిక కాదు. ఈజిప్టు, మెసపొటేమియా, ఏజియన్, సింధు నాగరికతల నాటి నగర రాజ్యాల ఉమ్మడి వారసత్వం ప్రత్యేకించి దక్షిణభారతంలో, అందులోనూ తమిళనాడులో నేటికీ గజ్జె కడుతోందనడానికి అనేక చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి. దానిని అలా ఉంచి, గత కొన్ని వ్యాసాలుగా చర్చించుకుంటున్న విషయానికి పరిమితమై చెప్పుకుంటే; రాజ్యం విస్తరిస్తూ కేంద్రీకృత అధికారం అనే అంకుశం జనజీవితంపై బిగుసుకుంటున్నకొద్దీ , ఆర్థిక అసమానతలు, బానిసత్వం, పీడన పెరిగిన కొద్దీ జనం తమను ఈతిబాధలనుంచి గట్టెక్కించే ఇష్టదేవతల కొలుపులూ పెరుగుతూవచ్చాయి. దాంతోపాటే, నగరరాజ్యాల కాలంవరకూ కొనసాగిన సమష్టి ఆరాధనా పద్ధతుల స్థానంలో వ్యష్టి(వ్యక్తిగత) ఆరాధనా పద్ధతులూ అడుగుపెట్టాయి. రోమన్ల కాలంలో ఆ పరివర్తన ఎలా ఎందుకు జరిగిందో త్వరలోనే చెప్పుకోబోతున్నాం.

ఇక్కడ ఇంకొకటి గమనించాలి. లౌకికమైన ముఖ్యమంత్రి లాంటి పదవికి, పారలౌకికమైన దేవత హోదాకు మధ్య హద్దులు చెరిగిపోవడం; దాంతోపాటే లౌకికమైన అవినీతి తదితర బలహీనతలు కూడా పారలౌకికమైన గంగలో కలసి పోవడం కేవలం చదువుసంధ్యలు లేని అట్టడుగువర్గాల ఊహలోనే సంభవిస్తాయని అనుకోవద్దు. ధనవంతులు, విద్యావంతులలోనూ ఇదే ధోరణి ఉంటుంది. కాకపోతే అట్టడుగువర్గాలలో ఇది నాటుగానూ, మోటుగానూ వ్యక్తమైతే; మిగతావారిలో నాజూకుగానూ, మెరుగుపెట్టిన భాషలోనూ వ్యక్తమవుతుంది.

నా కీ సందర్భంలో ఒక వ్యక్తిగతమైన విషయం గుర్తుకొస్తోంది.

***

నాకప్పటికి ఇరవయ్యేళ్లు దాటాయేమో! మా ఊళ్ళో ఉన్నప్పటి సంగతి. ఓ రోజు నేను నిద్ర లేచేసరికి, మా ఇంటి దక్షిణం వైపు దొడ్లో మా నాన్నగారు, మా పినతండ్రిగారు దంతధావనం చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ మాటలు కిటికీలోంచి నా చెవిన పడ్డాయి. వారిద్దరూ కంచి పరమాచార్యకు చాలాకాలంగా చాలా దగ్గరి అనుయాయులు. మా పినతండ్రిగారు వృత్తిరీత్యా పౌరాణికులు. ఆయన సహజమైన తన కథనచాతుర్యంలో భక్తి తన్మయత్వాన్ని రంగరించి ఒక ముచ్చట చెబుతున్నారు. నాన్నగారు ఊకొడుతూ వింటున్నారు. నేను కూడా ఆసక్తిగా వింటూ ఉండిపోయాను.

“అన్నయ్యా, ఏం జరిగిందో విన్నావూ? చెన్నపట్నం(మా పినతండ్రిగారు మద్రాసును ఎప్పుడూ చెన్నపట్నం అనే అనేవారు)లో ఆ చెట్టియార్ లేడూ! నువ్వూ వినే ఉంటావు. కోటీశ్వరుడు. తస్సదియ్య, గుర్రప్పందాల మీద సంపాదించాడు. చాలా వ్యాపారాలు పెట్టాడు. దొంగనోట్లు అచ్చేస్తాడని కూడా చెప్పుకుంటారు. అయితేనేం, శ్రీవారికి(కంచి పరమాచార్యకి) పరమభక్తుడు. ఏమైందో, గుర్రప్పందాలు కలసి రావడం మానేశాయి. వ్యాపారాల్లో నష్టం వచ్చింది. దాంతో లబోదిబో మంటూ శ్రీవారి దగ్గరకు పరుగెత్తాడు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. శ్రీవారు అంతా విన్నారు. కాసేపు మౌనంగా ఉండి, ఆ తర్వాత “మీ ఇంట్లో ఎక్కడైనా పత్తిచెట్టు ఉందా?” అని అడిగారు. అతను ఆశ్చర్యపోతూ, “ఉంది” అన్నాడు. “వెంటనే దాన్ని తీయించు. నీకు కలసివస్తుంది” అని శ్రీవారు అన్నారు. వాడు అలాగే చేశాడు. దాంతో వాడికి మళ్ళీ దశ ఎత్తుకుంది.”

ఈ ముచ్చట చెబుతున్నప్పుడు ప్రధానంగా ఆయన దృష్టిలో ఉన్నది చెట్టియారూ, అతని గుర్రప్పందాలూ, దొంగనోట్లూ, వ్యాపారాలూ కావు. అతనికి సలహా ఇచ్చి గట్టెక్కించిన కంచి పరమాచార్యులవారి మహిమా, వారి మీద తన భక్తిప్రపత్తులూ…

నాది ఉడుకు రక్తం. దానికితోడు ఆధునికమైన వాసనలు. ఇది వినగానే చాలా కోపం వచ్చింది. గుర్రప్పందాలు ఆడేవాడి మీదా, అందులోనూ దొంగనోట్ల ఆరోపణ ఉన్నవాడి మీదా కంచివారు అనుగ్రహం ఎలా చూపిస్తారనుకున్నాను. మా పినతండ్రి గారి స్పందన, నా స్పందన గీత గీసినట్టు ఎలా వేరైపోయాయో చూడండి! పారలౌకికానికి చెందిన కంచివారి మహిమావిశేషాన్ని ఒత్తి చెప్పడం మీదే ఆయన ఆసక్తి. చెట్టియారు అంత డబ్బు ఎలా సంపాదించడన్న లౌకిక విషయం మీద ఆయనకు పెద్ద ఆసక్తీ లేదు, పట్టింపూ లేదు. కానీ నా తక్షణ స్పందన చెట్టియారు మీదా, అతను సంపాదించిన పద్ధతి మీదే, అంటే లౌకికం మీదే!

చెప్పొచ్చేదేమిటంటే, భారతదేశం ఇప్పటికీ మా పినతండ్రిగారి దగ్గరే భద్రంగా ఉంది, నా దాకా(నా లాంటి చాలామంది దాకా) రాలేదు.

ఆ తర్వాత చాలాకాలానికి ఆవేశం తగ్గి ఆలోచించిన కొద్దీ ఆయన స్పందనలో కూడా ఒక సహేతుకత, ఒక తర్కమూ లేకపోలేదనిపించింది. అంటే, ఇప్పుడు నేను ఉభయస్పందనలకు మధ్య ఒక తటస్థ పాత్ర తీసుకుంటున్నాను. ఎలాగంటే, చెట్టియారులో కూడా లౌకికం, పారలౌకికం అనే రెండు కోణాలు ఉన్నాయి. లౌకిక కోణంలో అతడు చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ ఉండవచ్చు. దానిపై నిఘా ఉంచి దోషి అని తేలితే అతనిని శిక్షించవలసింది లౌకిక యంత్రాంగం, అంటే ప్రభుత్వం. పారలౌకిక కోణానికి వస్తే, అతడు కంచి పరమాచార్యులవారికి భక్తుడు. ఆయనను నమ్ముకున్నవాడు. కనుక అందుకు ప్రతిగా కంచివారు అతన్ని కష్టాల నుంచి గట్టెక్కించారన్నమాట! ఇలా అన్నానని, కంచివారి చర్యనో, లేదా పత్తి మొక్క ఇంట్లో ఉండకూడదన్న నమ్మకాన్నో నేను వ్యక్తిగతంగా సమర్థిస్తున్నానని అనుకోవద్దు. ఇందులో నా వ్యక్తిగతానికి తావులేదు.

ఇంకొంచెం స్పష్టంగా అర్థమయ్యే ఉదాహరణతో కూడా దీనిని చెప్పుకోవచ్చు. ఒకతను అవినీతిమార్గంలో సంపాదించి స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని గుట్టలకొద్దీ దాచుకున్నాడనుకుందాం. అతను ఏ విదేశాలకో వెళ్లదలచుకుని విమానంలో టిక్కెట్టు బుక్ చేసుకుంటాడు. నువ్వు అక్రమంగా డబ్బు సంపాదించావు కనుక నీకు టిక్కెట్టు ఇచ్చేదిలేదని ఎయిర్ లైన్స్ వాళ్ళు అనరు. అది వాళ్ళ పని కాదు. అనకపోగా, ప్రయాణంలో అతని డబ్బుకు సరితూగే వసతులన్నీ కల్పించి అతన్ని ఎంతో మర్యాదగా చూస్తారు. అతని డబ్బు ఎలాంటిదన్నది పట్టించుకోవలసింది ప్రభుత్వమూ, అందులోని ఆదాయం పన్ను శాఖ మాత్రమే.

కానీ ఆ లౌకిక వ్యవస్థ ఉండవలసినంత బలంగా ఉండదు. ఎందుకు ఉండదంటే, ఆ వ్యవస్థను నడిపేవారు కూడా ఆ తానులో ముక్కలే కనుక. లౌకిక వ్యవస్థ చొరడానికి సాహసించని పారలౌకికపు హద్దులు ఉంటాయన్న సంగతి మనకు బాగా తెలుసు. మన అనుభవంలో లౌకికం, పారలౌకికం కలసిపోవడమే కాదు; లౌకికాన్ని, పారలౌకికం పూర్తిగా లోబరచుకుంటుంది. లౌకికంగా మనం తప్పు పనులు ఎన్నైనా చేయవచ్చుగాక, పారలౌకికం వాటిని ప్రక్షాళన చేసేస్తుంది. కనుక మన అంతిమ హద్దు లౌకికం కాదు, పారలౌకికం మాత్రమే. ఇదేదో నేను విమర్శదృష్టితో అంటున్న మాటగా దయచేసి పొరబడవద్దు. కేవలం చారిత్రక తటస్థ దృష్టితో అంటున్నది. ఇంకా చెప్పాలంటే, ఈ పారలౌకిక ప్రాబల్యం మనకు క్రీస్తుశకానికి పూర్వంనుంచీ ఇప్పటికీ పదిలంగా వస్తున్న చారిత్రక వారసత్వం.

ఇంకోవైపు నుంచి చూడండి…ఇది వర్తమానంతో నేరుగా ముడిపడి ఉన్న చాలా గంభీరమైన విషయమే తప్ప, ఆషామాషీ విషయం కాదని మీకే అర్థమవుతుంది. ఎలాగంటే, ఇప్పుడు మన దేశం అవినీతితో మహాయుద్ధం చేస్తోంది, లేదా చేస్తున్నాననుకుంటోంది. పాలకులు మారితేనో, లోక్ పాల్ లాంటి (లౌకిక) వ్యవస్థలలోనో దీనికి పరిష్కారం ఉంటుందనుకుంటోంది. కానీ నా ఉద్దేశంలో దీనికి పరిష్కారం పారలౌకిక ప్రపంచాన్ని శాసించే లోకపాలకుడైన ఆ భగవంతుడి చేతుల్లో తప్ప ఇంకెవరి చేతుల్లోనూ లేదు.

క్షమించాలి…ఈ విషయంలో నేనంత ఆశావాదిని కాదు.

***

ఎంతమంది గమనించారో కానీ, లౌకిక, పారలౌకికతల పద్మవ్యూహంలో పడి గిజగిజలాడిన చరిత్ర పాశ్చాత్యసమాజాలకూ ఉంది. అంతేకాదు, అది ప్రాచ్య(తూర్పు)మతాల పుణ్యమంటూ వారు ఆడిపోసుకోవడమూ ఉంది. ప్రాచ్య మతాలు అన్నప్పుడు మనవే కాక, ఈజిప్టు, మెసపొటేమియా తదితర ప్రాంతాల మతాలు కూడా వస్తాయి. తేడా అల్లా ఆ పద్మవ్యూహంలోంచి బయటపడడానికి పాశ్చాత్యసమాజాలు ప్రయత్నించాయి. ‘పారలౌకికం’ అనే సరిహద్దు రాయిని అతి కష్టం మీద పెకలించి, వెనక్కి జరిపి, ఆ చోట్లో ‘లౌకికం’ అనే సరిహద్దు రాయిని ప్రతిష్టించుకున్నాయి. రెండింటి మధ్య సమతూకం తేవడానికే కాక, లౌకికం వైపు ఒకింత ఎక్కువ మొగ్గు చూపించాయేమో కూడా. ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే, పారలౌకికత కన్నా ముందు మనం జీవించే ఈ లౌకిక జగత్తును మరింత వాసయోగ్యం చేద్దామన్నది వారి ఆలోచనగా కనిపిస్తుంది. ఈ విషయంలో ప్రాచ్య, పాశ్చాత్యుల మధ్య ఉన్న దృష్టిభేదాన్ని ఎత్తి చూపిన పాశ్చాత్య రచయితలు కొందరు గుర్తొస్తున్నారు కాని, సర్ జేమ్స్ ఫ్రేజర్ ను ఒక్కరిని ఉదహరించుకుందాం. పనిలో పనిగా ఆయన ప్రాచ్య మతాల ప్రభావం యూరప్ ను పాడుచేసిందని ఒక రాయి కూడా విసిరాడు. తన Golden Bough అనే బృహద్రచనలో ఇలా అంటాడు:

Greek and Roman society was build on the conception of the subordination of the individual to the community, of the citizens to the state; it set to the safety of the commonwealth, as the supreme aim of conduct, above the safety of the individual whether in this world or in a world to come. Trained from infancy in this unselfish ideal, the citizens devoted their lives to the public service and were ready to lay them down for the common good…

All this was changed by the spread of Oriental religions which inculcated the communion of the soul with God and its eternal salvation as the only objects worth living for, objects in comparison with which the prosperity and even the existence of the state sank into insignificance. The inevitable result of this selfish and immoral doctrine was to withdraw the devotee more and more from the public service, to concentrate his thoughts on his own spiritual emotions, and to breed in him a contempt for the present life which he regarded merely as a probation for a better and an eternal…

A general disintegration of the body politic set in. The ties of the state and the family were loosened; the structure of society tended to resolve itself into its individual elements and thereby to relapse into barbarism; for civilization is only possible through the active co-operation of the citizens and their willingness to subordinate their private interests to the common good.

పాశ్చాత్య ప్రభావాలే మన లాంటి ప్రాచ్యదేశాలను పాడు చేశాయని మనం ఇప్పటికీ అనుకుంటూ ఉంటాం. అలాంటిది ప్రాచ్య మతాలే పాశ్చాత్యులను పాడు చేశాయని ఫ్రేజర్ అనడం విచిత్రంగా ఉంటుంది. పైగా పారలౌకికాన్ని లౌకికం భ్రష్టు పట్టించిందని మనం అనుకుంటుంటే, పారలౌకికమే లౌకికాన్ని భ్రష్టు పట్టించిందని ఫ్రేజర్ అంటున్నాడు. ప్రాచ్య మతాలు వెయ్యేళ్ళపాటు యూరప్ సమాజాన్ని నాశనం చేస్తే, చివరికి రోమన్ చట్టాన్ని, అరిస్టాటిల్ తాత్వికతను పునరుద్ధరించడం ద్వారా మధ్యయుగాలనాటికి యూరప్ తిరిగి తనవైన పురాతన కళా సాహిత్యాలు, జీవితాదర్శాలు, ప్రవర్తనాసరళి, ఆరోగ్యవంతమైన, పురుషప్రయత్నంతో కూడిన ప్రాపంచిక దృక్పథంవైపు మళ్లిందని ఆయన అంటాడు. ఆ సందర్భంలో ప్రాచ్య మతాల తీరు గురించి పై వ్యాఖ్యలు చేశాడు. వాటి సారాంశాన్ని ఇలా చెప్పుకోవచ్చు:

వ్యక్తి ప్రయోజనాలకన్నా సమష్టి ప్రయోజనాలు, పౌర ప్రయోజనాలకన్నా రాజ్యం ప్రయోజనాలు ప్రాధాన్యం వహించే విధంగా గ్రీకు, రోమన్ సమాజాల నిర్మాణం జరిగింది. ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ వాటి ఉన్నతోన్నత లక్ష్యం సమష్టి సంపదా, శ్రేయస్సులే తప్ప వ్యక్తిగత సంక్షేమం కాదు. చిన్నతనం నుంచీ నిస్వార్థతను నూరిపోయడం వల్ల పౌరులు ప్రజాశ్రేయస్సుకు తమ జీవితాన్ని అంకితం చేసేవారు. ఉమ్మడి హితం కోసం ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉండేవారు. ప్రాచ్య మతాల వ్యాప్తితో ఇదంతా మారిపోయింది. పరమాత్మలో ఆత్మను లీనం చేయడం, ముక్తిని పొందడం తప్ప ఈ లోకంలో సాధించవలసిన లక్ష్యాలు ఏవీ లేవని అవి నొక్కి చెబుతాయి. దాంతో ఈ లోకంలో అభ్యుదయాన్ని సాధించాలన్న తపనే కాక రాజ్యం ఉనికి కూడా అప్రధానంగా మారిపోయింది. ఈ స్వార్థపూరిత, అనైతిక సిద్ధాంతం భక్తులను సమష్టి హితం నుంచి తప్పించివేసింది. లౌకిక జీవితంపై విముఖతను నూరిపోసింది. లౌకిక జీవితం కేవలం పరలోక జీవితానికి అవసరమైన శిక్షణ పొందడానికి మాత్రమే నన్న భావనను కలిగించింది. దాంతో రాజకీయవ్యవస్థ విచ్ఛిన్నం కావడం ప్రారంభించింది. రాజ్యానికీ, కుటుంబానికి మధ్య సంబంధాలు సడలిపోయాయి. సామాజిక నిర్మాణం వ్యక్తుల స్థాయికి కుదించుకుపోయింది. అది ఆటవిక ధోరణులకు దారితీయించింది. ఎందుకంటే, నాగరికత అనేది పౌరుల క్రియాశీల సహకారంతోనూ, తమ వ్యక్తిగతప్రయోజనాలకు బదులు ఉమ్మడి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడంతో మాత్రమే సాధ్యమవుతుంది.

ఫ్రేజర్ చేసిన ఈ వ్యాఖ్యలు మనలో చాలామందికి కోపం తెప్పించే మాట నిజమే. వీటిలో యూరోపియన్ అహంకారమూ తొంగి చూస్తూ ఉండచ్చు. ఆయన ఇంత గొప్పగా చెప్పుకున్న యూరోపియన్ సమాజం కడిగిన ముత్యమని భావించే అమాయకులు ఎవరూ లేరు. కాకపోతే, మిగతా సంగతులు పక్కన పెట్టి, లౌకికం-పారలౌకికం అనే ఒక్క అంశానికి పరిమితమైనప్పుడు ఆయన మాటలు మనం మొహం చూసుకోడానికి అద్దంలా ఏమైనా ఉపయోగపడతాయా అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవచ్చు.

మిగతా విశేషాలు తర్వాత…

 

 

 

 

 

సిగ్గొచ్చి దాక్కుంది నా చిట్టి చిలకమ్మ !

DSC_0238

సిగ్గు సిగ్గు

ఎవరు నేర్పుతారోగానీ పిల్లలకు, దాచుకున్నముఖంతో వాళ్లు ఎన్నిమాట్లాడుతారో.
దాచుకోవలసింది ముఖమే కాబోలనుకునే ఆ దాగుడు మూతల చిలిపి దృశ్యాలను ఎవరైనా ఇలా తీస్తూ పోతే ఎంత బాగుంటుంది?
మనమూ పిల్లలం కామూ?

గంభీరమైన మన జీవితావరణంలో పిల్లలు వదిలే వలువలు…
మనం అయిష్టంగా ధరించిన వలువలన్నీ వాళ్లను చూస్తుంటే చిరునవ్వుతో సహా జారిపోవూ?
వాళ్లు మన భద్రజీవితపు విలువలను ఈడ్చి పారేసే దయామయులు.

ఇలా చూస్తామో లేదో
చప్పున జాక్కుంటరు.
తర్వాత మన్నలి వెతుక్కుంటరు.
బహుశా చూడాలనే కాబోలు.

ఇదొక అలాంటి కవ్వింతకు ముందరి దృశ్యం.
దృశ్యాదృశ్యం.

నిజంగానే చెప్పుకోవాలి.
ఎవరికైనా భుజాన కెమెరా ధరించి బజార్లోకి అడుగుపెడితే ముందు పిల్లలే తగులుతారు.
ఇరుకిరుకు వీధుల్లో ముందు వాళ్లే మనకి పెద్ద తోవ వదులుతారు.
కానీ పట్టించుకుంటామా?

వాళ్లను దాటేయకుండా ఇలాంటి చిత్రాలు చప్పున చేజిక్కించుకుంటూ వెళితేనే మన బాల్యానికి విలువ.
లేదూ ఆ వీధిని దాటి కూడళ్లను దాటి ఆకాశహర్మాల నీడన మనం పెద్దమనుషులం అవుతాం.
కానీ ఏం ఫాయిద?
సిగ్గు సిగ్గు.

పిల్లలు పెద్దగైనట్టే మనం పెద్దగై కోల్పోయేదే ఎక్కువ.
అందుకే సిగ్గు సిగ్గు అనడం.

అయినా మన ఖార్కానాల్లో, కార్యలయాల్లో మనల్నెవరూ చూడరనుకుంటాం.
కానీ, మనమూ పిల్లలమే చాలా సార్లు. పిల్ల చేష్టలు చాలా ఉంటై మన కార్యాలయాల్లోనూ.

అక్కడా ఒక కెమెరా తప్పక ఉంటుంది.
సిసి కెమెరాలు ఉండనే ఉంటై. కానీ, వాటినీ ఎవరైనీ విప్పదీసి ఇలా పబ్లిష్ చేస్తే ఎంత బాగుంటుంది?
దాచుకోమా మనమూ ఇలా?

కానీ, బాగోదు.
పెరిగాం కనుక వద్దు.

కానీ, ఒకటి మాత్రం నిజం.
పెద్దరికం ఎప్పుడూ పిల్లలంతటి అభిమాన దృశ్యం కాదు.
సహజం కానే కాదు. ఎంత లేదన్నా బాల్యం నిజమైన చ్ఛాయ.

ఇంతకన్నా లేదు,
సిగ్గు సిగ్గు.

-కందుకూరి రమేష్ బాబు

ramesh

తలరాతల ప్రూఫ్ రీడింగ్!

mruthyu30

మృత్యుంజయ్

మృత్యుంజయ్

శాంతి-ఆలోచనా పరుల కథ

karalogo
నిర్వహణ: రమాసుందరి బత్తుల

 

కారా కథల మీద రాయొచ్చు కదా, శాంతి గురించి రాయండి అని మిత్రులు అడగ్గానే ఇపుడు కొత్తగా దివిటీ పట్టడమేమిటి అనిపించింది. బహుశా ఈ కాలపు పిల్లలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవడం కోసం అడిగి ఉంటారనిపించింది. కారా కథలు మానేసిన తర్వాత(సంకల్పం మినహాయింపు) పుట్టిన పిల్లలం. పెద్దల మాటలు విని ఆ కథలు సేకరించి చదవడం తప్ప ఉడుకుడుకు అక్షరాలు చదివే అవకాశం లేదు. చదవడం వరకే అయితే కథ వేరు. కథలపై అభిప్రాయం చెప్పాలంటే మాత్రం స్థలకాలాల ఇబ్బందిని దాటాల్సి ఉంటుంది.

శాంతి 1971 కథ. 71 అంటే ఏమిటో ప్రత్యేకంగా చెప్పాలా! నక్సల్బరీ గాలి శ్రీకాకుళం మీదుగా ఉత్తర తెలంగాణకు వ్యాపిస్తున్న కాలం. శ్రీకాకుళం ఆటుపోట్లమధ్య మిణుకుమిణుకు మంటుంటే ఉత్తర తెలంగాణలో కొలిమంటుకుంటున్న కాలం. సిపిఐ ఎంఎల్‌ ఆవిర్భవించి తొలిఅడుగులు వేస్తున్న కాలం. త్వరలోనే సాధిస్తాం అని ఆ ప్రయాణంలో ఉన్న వాళ్లు చాలామంది నిజంగానే నమ్మిన కాలం. ”కా.రా.గారు, ఐవి కూడబలుక్కుని సమిధలు, సరంజామా సమకూర్చుకుంటున్న” కాలం. కారాగారు సమకూర్చుకున్న సరంజామా ఏమిటో శాంతిలో కనిపిస్తుంది. యజ్ఞం మరి తొమ్మిది కథల్లో కనిపిస్తుంది. శ్రీకాకుళ ఉద్యమానికి అక్షరాండగా రాసిన కథలివి. ఇవి వర్గపోరాట చైతన్యపు కథలు . లోతూ విస్తృతీ ఉన్న కథలు.

కారా మాటలెంత పొదుపుగా సౌమ్యంగా ఉంటాయో రాతలు అంత విస్తారంగా ఘాటుగా ఉంటాయి. వీటిలో కొంత ప్రాపగాండా లక్షణం ఉంటుంది. విషయాన్ని వివరంగా చెప్పేయాలనే తపన ఉంటుంది. అది అప్పటి అవసరం కావచ్చునేమో! “వృత్తాంతం ద్వారా వ్యక్తమయ్యే అసలు విశేషమే కథ” అన్న స్వీయనియమాన్ని నిక్కచ్చిగా నిష్ఠగా పాటించిన రచయితగా కారా ఈ దశలో కనిపిస్తారు. ఏదో ఒక నిర్దుష్టమైన విషయాన్నిప్రతిపాదించడానికో వివరించడానికో సీరియస్‌ ఎజెండా పెట్టుకుని ఈ దశలో వరుసగా కథలు రాసినట్టు కూడా అనిపిస్తుంది. ఒక్కముక్కలో ఆయన కలం కార్యకర్త పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు.

అసమసమాజంలో శాంతి అనే పదం ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు ఉపయోగపడుతుందో వివరిస్తుంది శాంతి కథ. స్టేటస్‌కోయిస్టుల శాంతి మంత్రం వెనుక ఉన్న బూటకత్వాన్ని ఎండగడుతుంది. కథనిండా యజమాని- కార్మిక సంబంధాలపై లోతైన చర్చ ఉంటుంది. బలవంతుడి ఎత్తుగడలు, వాటిని చిత్తు చేసేందుకు బలహీనుల స్థిరచిత్తం, వీరిద్దరి మధ్యలో బ్యూరాక్రసీ తెలివితేటలు ఉంటాయి. జ్ఞానం, తెలివితేటలు, చిత్తశుద్ధి, అంకితభావం వగైరా లక్షణాలు మూర్తీభవించిన కార్మిక నాయకుడు, అన్నింట్లోనూ లౌక్యాన్ని చూపే ‘నిస్సహాయపు’ కలెక్టర్‌, ఎలాగైనా ఈ వ్యవస్థ తనకు అండగా నిలబడి తీరుతుంది అనే నమ్మకమున్న ధనబలశాలి మిల్లు యజమాని- మూడు ప్రధానపాత్రలుగా కథ సాగుతుంది.

ఈ కథ చదువుతున్నపుడు అపుడెపుడో సీఫెల్లో చూసిన క్యూబా సినిమా లాస్ట్‌ సప్పర్‌ గుర్తొచ్చింది. 1976లో వచ్చిన ఈ సినిమాలో చిత్రించిన కాలం పద్దెనిమిదివ శతాబ్ది చివరి రోజులకు సంబంధించినది. చెరుకు తోటల యజమాని, అతని బానిసలు, చర్చి ఫాదర్‌ మూడు కేంద్రాలుగా సాగేకథ. ఇక్కడ స్టీల్‌ మిల్‌ యజమాని అయితే అక్కడ షుగర్‌ మిల్‌ యజమాని. ఇక్కడ కార్మికులు అయితే అక్కడ బానిసలు. ఆధునిక కలెక్టర్ స్థానంలో చర్చి ఫాదర్‌. అందులోనూ శాంతి గురించి స్వేచ్ఛ గురించి చర్చ ఉంటుంది. కాకపోతే చర్చే ప్రధానం కాదు.

రెండు వేర్వేరు దేశాల్లో వేర్వేరు సామాజిక దశలకు సంబంధించిన జీవితాన్ని చిత్రించిన వేర్వేరు కళా ప్రక్రియలైనప్పటికీ బలవంతుడు, లేదా వారి ప్రతినిధి శాంతి మంత్రం పఠించే తీరు దాదాపు ఒకే రకంగా ఉంటుంది. యజమాని ఉదారంగా పన్నెండు మంది బానిసలను పిల్చి తనతో సమానంగా టేబుల్‌పై కూర్చుండబెట్టుకుని లాస్ట్‌ సప్పర్‌ జరుపుకుంటాడు. ఈ సందర్భంగా బానిసలకు- యజమానికి మధ్య జరిగే సంభాషణ, వారి హావభావాలు మర్చిపోవాలన్నా మర్చిపోవడం కష్టం. అంతేనా! యజమాని నదిదాకా తీసుకువెళ్లి వారి కాళ్లు కడిగి ఆ ‘పుణ్య తంతు’ కూడా జరిపించిన రెండు రోజులకే వారి తలకాయలన్నీ పోల్స్‌మీద వేలాడదీయడంలో మనకు ఆ నాటి బలవంతుల శాంతి స్వరూపం అవగతమవుతుంది.

లాస్ట్‌ సప్పర్‌ కూడా విప్లవ సినిమానే. కమ్యూనిస్టు సినిమానే. కానీ తొలిరీల్‌నుంచే ఇది కమ్యూనిస్టు సినిమా అనే ఎరుకను మనకు కలిగించరు. సినిమాలో దర్శకుని హృదయం ఎక్కడ ఉందో అర్ఠమవుతుంది, అంతే! బలవంతుడి శాంతి మంత్రం ఎంత బూటకమో కళాత్మకంగానే చెపుతారు. సినిమా పొడవునా మనం నవ్వుతాము, ఏడుస్తాము. పాత్రల వెంట నడుస్తూనే ఉంటాము. సినిమా సరే, రావిశాస్ర్తి కథలో! ఆ కోవకే చెందిన మరికొందరు గత, వర్తమాన, వర్థమాన రచయితల కథలో!

ఆ రచనలు చదువుతున్నపుడు కాసేపు వారి ఆధీనంలోకి వెళ్లిపోతాం. వారు సృష్టించిన పాత్రల వెంట తిరుగుతూ ఆ భావోద్వేగాల్లో భాగమవుతాం. ఆ పాత్రలతో బంధమేర్పడుతుంది. అలాంటి జీవితమే ఉన్న పాఠకుల జ్ఞాపకాలను కదిపి అలజడి రేపుతారు.రచయిత తాడు పట్టుకుని ఆడిస్తూ ఉంటాడు. మనం కోతుల్లాగా ఆడుతూ ఉంటాము. అది ఆర్ట్‌ మహిమ. శాంతి లాంటి కథలతో వచ్చిన చిక్కేమిటంటే ఇందులోని పాత్రలతో అలాంటి అనుబంధమేదీ ఏర్పడదు. పెద్దమనిషి గంభీరంగా విషయాలు చెపుతూ ఉంటే కాస్త ఎడంగా నుంచొని వింటున్నట్టు ఉంటుంది. ఇలాంటి కథలు మన మనసును పెద్దగా తాకవు. మేధనే తాకుతాయి.

ఇవి మన మేధను పెంచడం కోసం, వర్గపోరాట ద్పృక్పథాన్ని పదును పెట్టడం కోసం రాసిన రాజకీయ కథలు. విశాలమైన అర్థంలో రాజకీయం లేకుండా ఏ కళా ఉండదు. పైగా కారా రాసింది పీడితులకు అవసరమైన రాజకీయాలు. కాబట్టే వామపక్ష శిబిరం చాలా యేళ్లుగా ఎత్తుపీట వేసి గౌరవిస్తున్నది. కాకపోతే కళారూపం సమర్థంగా లేకపోతే అది రాజకీయవాసన గాఢంగా ఉన్న జీవులను తప్ప ఇతర జీవులను అంతగా ఆకర్షించదు. మోనోలాగ్‌గా మారిపోయే ప్రమాదం ఉంది. కారా కథలన్నీ అలాగే ఉన్నాయనే దుస్సాహసం చేయబోను. జీవధారను అలా అనగలమా! నోరూమ్‌ని అనగలమా!

కానీ శాంతి కథలో రాజకీయ చర్చల బరువుకు కళారూపం అణగిపోయిందేమో అనిపిస్తుంది. పాత్రల చిత్రణలో కూడా స్టీరియోటైప్‌ లక్షణం కనిపిస్తున్నది. మందు, విందు, పొందుల కలబోతగా నల్లని బొచ్చుశరీరం కలిగిన ఫ్యాక్టరీ యజమాని చిత్రణే తీసుకోండి. భార్యను పట్టించుకోక ఆమెను లైంగిక అసంతృప్తి అగ్గిమంటకు ఆహుతి చేస్తూ అతను మాత్రం రోజొక అమ్మాయితో కులకడం వంటి లక్షణాలు చూస్తే సాధ్యమైనన్ని “దుర్లక్షణాల’తో అతనిమీద కోపం తెప్పించాలనేది రచయిత వ్యూహంగా కనిపిస్తున్నది. కథాక్రమంలో అతని దోపిడిస్వభావం మీద కోపం తెప్పించవచ్చునుగాని కారా వంటి రచయితకు ఈ అడ్డదారేల! కుప్పబోసినట్టు ఇన్ని “దుర్లక్షణాలు’ లేకుండా కూడా ఫ్యాక్టరీ యజమానులు చాలామంది ఉంటారు. ఆధునిక పెట్టుబడిదారుల్లో అనేకులు మందు, చిందుల జోలికి పోకుండా కార్మికుడి కంటే ఎక్కువ గంటలే పనిచేయవచ్చును. వారు దోపిడీదారులు కాకుండా పోతారా!

సత్యమే శివం సినిమాలో సూటూ బూటూ వేసుకుని డాబుగా ఉన్న మనిషి సూట్‌కేస్‌ కొట్టేసే సీన్‌ ఉంది కదా, అదే సరైన రాజకీయ దృష్టికోణం అవుతుంది. సమాజంలో మంచిచెడులకు, ఎక్కువ తక్కువలకు దర్పణాలుగా స్థిరపడిన స్టీరియోటైప్‌ లక్షణాలను ఉపయోగించుకోవడం స్టేటస్‌ కోయిస్టులకు అవసరం. తాత్కాలికంగా మనకు కూడా ఉపయోగపడినట్టు అనిపించినా దీర్ఘకాలికంగా నష్టం చేస్తాయి. బహుశా ఆనాటికి కథలో చిత్రించిన సమాజం ఇంకా పాతదశలోనే ఉంది కాబట్టి ఫ్యూడల్‌ లక్షణాలు బలంగా ఉన్న సమాజంలో మంచిచెడులు ఇపుడున్న సమాజంతో పోలిస్తే బ్లాక్‌ అండ్‌ వైట్లో కనిపించే అవకాశం ఉంది కాబట్టి అప్పటి అవసరాలకు అనుగుణంగా రాశారు అనుకోవాలా!

సాంఘిక దురాచారాలమీద కాని, కొన్ని ప్రభుత్వ విధానాల దుష్ఫలితాల మీదకాని, వ్యవస్థలో కనిపించే కొన్ని దుర్లక్షణాల మీదకానీ లేక ఇదే కోవకి చెందిన మరేదో అవకరం మీదకాని, మన అభిప్రాయాలను కథగా చెప్పాలనుకుంటాము. కొన్ని పాత్రలను ప్రవేశపెడుతూ మొదటి పేరాని కథలా ఆరంభించి క్రమక్రమంగా కథను ఒక చర్చాగోష్టిలా సాగించి, మన అభిప్రాయాలను ముఖ్యపాత్ర ద్వారా చెప్పించేస్తాం. అలా చేస్తే అది కథ ముసుగేసుకున్న చర్చా వ్యాసమౌతుందిగాని కథ కాదు” అంటారు కారా.

ఈ లక్షణం శాంతి కథలో కూడా జొరబడినట్టు అనిపిస్తుంది. అయితే సౌష్టవం కొద్దిగా దెబ్బతిన్నప్పటికీ కథా రూపమైతే ఉన్నది. కుట్రలాగా కథ కాకుండా పోలేదు. కుట్రను కూడ కథ అనే వారు, ఆ మాటకొస్తే గొప్ప కథ అని కీర్తించే వారు ఉన్నారని తెలుసు. ఎవరి దృష్టికోణం వారిది. దృక్పథం లేకుండా భాషా నైపుణ్యంతోనూ క్రాఫ్ట్‌తోనూ చెమక్కుమనిపించి మాయమైపోయే కథలతో ఇబ్బంది ఉన్నట్టే క్రాఫ్ట్‌ను నిర్లక్ష్యం చేసి కథను రాజకీయ ఉపన్యాస వేదికగా మార్చే కథలతోనూ ఇబ్బంది ఉంటుంది. “కారా సాధారణ పాఠకుల రచయిత కాదు, ఆలోచనాపరుల రచయిత అన్న వల్లంపాటి అన్నపుడు కూడా ప్రశంసతో పాటు సున్నితమైన విమర్శనాధ్వని ఉందేమో అని అనుమానం.

 -జి ఎస్‌ రామ్మోహన్‌

 RAM MOHAN _ FB

 

42 సంవత్సరాల శ్రీరామ్మోహన్ గారు రెండు దశాబ్దాలు పైగానే పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. ఎదురీత, వర్తమానం, వార్త, ఆంధ్రజ్యోతి, ఈటీవీలలో పని చేశారు. ప్రస్తుతం ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నారు. రష్యన్ సాహిత్యాన్ని ఎక్కువగా ఇష్టపడే రామ్మోహన్ గారు దొస్తోవ్ స్కీ , టాల్ స్టాయ్, మార్క్వెజ్ రచనలను ప్రేమిస్తారు. రావిశాస్త్రి, పతంజలీ, నామినీ, పి. సత్యవతి, బండి నారాయణ స్వామి రచనలు ఎక్కువగా ఇష్టపడతారు. మోహనరాగం పేరుతో ఉండే రామ్మోహన్ గారి బ్లాగ్ అడ్రెస్స్ gsrammohan.blogspot.in

 

వచ్చే వారం : అవ్వారు నాగరాజు ‘స్నేహం కధ’ గురించి పరిచయం చేస్తారు

 

శాంతి కథ ఇక్కడ చదవండి:

టెక్నాలజీ మోసం!

10729110_4824236820903_2046762477_n

మృత్యుంజయ్

మృత్యుంజయ్

నియ్యత్‌కు నిదర్శనం ‘ముక్త ‘

kaifiyath

‘గతానికి-వర్తమానానికి’ మధ్య వంతెన చరిత్ర. ఈ చరిత్రను ఇన్నేండ్లు ఆధిపత్య భావజాలం ఉన్నోళ్లు రాసిండ్రు. దాంతోటి అండ్ల తప్పులు దొర్లినయి. ఇప్పుడు తప్పులు సరిజేసి నియ్యత్‌గా నిజమైన విషయాల్నే చెప్పాలె. మొత్తం తెలంగాణ చరిత్రలో అందరికి తెలిసిన సంగతులు చాల తక్కువ. ఇగ స్త్రీల విషయానికొస్తే చరిత్రలో, వివక్ష, విస్మరణ రెండూ ఎక్కువే! ఎనుకట ‘మనకు తెలియని మన చరిత్ర’ పుస్తకం కొంత చరిత్రను, జీవితాల్ని రికార్డు చేసింది. ఇప్పుడు ‘మనకు తెలిసిన చరిత్ర’ కనుమరుగు కాకుండా ఉండేందుకు ‘ముక్త’ సంస్థ ‘‘ ‘అనుభవాలు-దృక్పథాలు’ విముక్తి ఉద్యమాల్లో తెలంగాణ స్త్రీలు’’ పేరిట ఒక సంచిక తీసుకొచ్చిండ్రు. తెలంగాణ మహిళల ఉద్యమ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలు ఇట్ల తీరొక్క పూలతోటి బతుకమ్మను పేర్చినట్టు విషయాల్ని అమర్చిండ్రు. నిజాయితిగ పన్జేసిండ్రు.

హైదరాబాద్‌ తెహజీబ్‌ని పట్టిస్తూ తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషల్లో ఇందులో రచనలున్నాయి. ‘ముక్త’ ఎ తెలంగాణ విమెన్స్‌ కలెక్టివ్‌ ` పేరుకు తగ్గట్టుగానే తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల వారి అనుభవాలను, సాహిత్యాన్ని రికార్డు చేసింది. జైలు డైరీలు పేరుతోటి తొలితరం ఉద్యమకారిణి, చిత్రకారిణి అయిన సంగెం లక్ష్మీబాయమ్మ అనుభవాన్ని, సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న రంగమ్మగారి జ్ఞాపకాన్ని, 1969 ఉద్యమంలో పాల్గొన్న సక్కుబాయి, బి.రమాదేవి, స్వదేశ్‌రాణిల అనుభవాల్ని, ప్రస్తుత ఉద్యమంలో తన పాట, మాట ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న విమలక్క జైలు అనుభవాల్ని స్ఫూర్తినిచ్చే విధంగా రికార్డు చేసిండ్రు. ఇందులో బీసీలకు న్యాయమైన వాటా దక్కింది. గతంలో ఎప్పుడు తెలంగాణ చరిత్ర గురించి చెప్పినా సంగెం లక్ష్మిబాయమ్మ విస్మరింపబడేది. ఆమె ‘నా జైలు జ్ఞాపకాలు’ పుస్తకంగా వెలువడ్డప్పటికీ ఆ విషయం చాలా తక్కువమందికి తెలుసు. తెలిసినోళ్లు కూడా ఆ విషయాన్ని రికార్డు చేసేందుకు, చెప్పేందుకు ఎనుకముందాడిరడ్రు.  తెలంగాణ బిడ్డ ఆంధ్రాలో చదువుకొని అక్కడి ఉద్యమాల్లో పాల్గొని ఆచంట రుక్మిణీ లక్ష్మీపతి, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌లతో కలిసి  గడిపిన జైలు జీవితం గురించి స్ఫూర్తిదాయకంగా ఆమె ఇందులో చెప్పిండ్రు.

mukta-1

ఈ సంచికలో (ఎందుకంటే ముక్త భిన్న పత్రిక సీరిస్‌ -1 అని పేర్కొండ్రు) మేరి మాదిగ రాసిన దీర్ఘకవిత ‘పండ్రాయి’ దళిత జీవితాన్ని కళ్లకు గట్టింది. పండ్రాయి సాక్షిగ మాదిగ స్త్రీల పోరాట చరిత్రకు సాన బెట్టింది. ఆవుకూర, ఎంకటపురం తాళ్లు, యాదగిరిగుట్ట ఎడ్ల అంగడి గురించి చెప్పింది. చెప్పుల కుట్టిన చేతులతోనే నిజంగా చరిత్రను ఇంకా చెప్పాలంటే నేను పుట్టినూరు ‘రఘునాథపురం’మాదిగోళ్ల చరిత్రను చెప్పింది. సన్న చెప్పుల మీది ఉంగుటాలు, ముకురాలు, కప్పు, కప్పు మీది తోలు జెడలు, ఎర్ర రంగు పువ్వులు అద్దిన చెప్పులకు అద్దిన చెమట చుక్కల్ని లెక్క గట్టింది. ఈ చెమటలో మాదిగ ఆడోళ్లకూ భాగముందని చెబుతూ

‘చరిత్రల చెప్పులు మొగోల్లే కుట్టలే

రెండు చేతులు కలిస్తేనే

చెప్పుల జత తయ్యారు

మాదిగ ఆడామెను

గంజిలీగ కంటే

హీనంగా తీసి పారేసే మాదిగ మొగోళ్లకి

సమస్త పురుష ప్రపంచానికి సవాల్‌గా

ఇక మా చరిత్రను మేమే తిరగరాస్తం’’ అంటూ కవిత్వమై నినదించింది.

చిందు ఎల్లమ్మ మీద వనపట్ల సుబ్బయ్య రాసిన కవిత ఈ సంచికకు వన్నె తీసుకొచ్చింది. ఇంకా చెంచుపాట, శ్యామల, కిరణ్‌కుమారి, శ్రీదేవి, రేడియం, గుడిపల్లి నిరంజన్‌ల తెలుగు కవిత్వ ముంది. తస్నీమ్‌ జోహార్‌, నుస్రత్‌ రెహానాల ఉర్దూ కవిత్వం కూడా ఇందులో చోటు చేసుకుంది.

‘బాగోతం ఏడ ఆడ్తె అదే నీ ఊరు

పెంటగడ్డల మీదే నీ నివాసం

బారాబజెకు భాగోతం సురువైతే

భూమి తకతకలెల్లె సిందయ్యి జోకో అంటూ సిగాలు

నీవు గజ్జెలు కట్టినందుకే

భాగోతానికి భాగ్యం దక్కింది

పంచభూతాలు సోకని నేల ఉండొచ్చు

నీ పాటకు వరవసించని మనిషిలేడు

నీ దరువినని జీవిలేదు’’ అంటూ చిందు ఎల్లమ్మకు సుబ్బయ్య నివాళి అర్పించిండు. అలాగే జూపాక సుభద్ర ‘నిస్సాధికారం’, గీతాంజలి ‘ఉయ్యాల’ కతలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ సంచికలో ‘కళ’కు సంబంధించి విలువైన వ్యాసాలున్నాయి. గన్‌పార్క్‌లో ‘తెలంగాణ అమరవీరుల’ శిల్పాన్ని మలిచిన ఎక్కా యాదగిరిరావు మీద వ్యాసమే గాకుండా ఆయన స్వయంగా ‘స్వాతంత్య్రానంతర ఆధునిక భారతీయ శిల్పకళ` తెలుగునాట దాని ప్రతిఫలనం’ పేరిట వ్యాసం రాసిండు. అలాగే చేర్యాల నకాషి చిత్రకళ మీద ఆంగ్లంలో కె.విమల, పెంబర్తి ఇత్తడి కళాకృతులపైన ఎస్‌.వాసుదేవ్‌, వెండితెర తొలినాయికల నెలవు హైదరాబాద్‌ పేరిట అలనాటి హైదరాబాద్‌ హీరోయిన్ల గురించి హెచ్‌.రమేశ్‌బాబుల వ్యాసాలు విలువైనవే గాకుండా మన మూలాల్ని పట్టిస్తాయి. ఇంకా శోధన శీర్షికన ఆరు వ్యాసాలున్నాయి. భాష`జాతి పేరిట కె.విమల, చేనేతపై డి.నర్సింహ్మారెడ్డిల వ్యాసాలు ఇందులో భాగమే.

mukta-2

‘చరిత్రను మలుపు తిప్పిన చైతన్య మూర్తులు’ పేరిట కె.విమల రాసిన సంపాదకీయం తెలంగాణ మహిళలు, వారి ఉద్యమాల చరిత్రను రేఖామాత్రంగానే అయినా విలువైన సమాచారాన్ని రికార్డు చేసింది. తమిళ ముస్లిం రచయిత్రి సల్మను పిలిపించి హైదారాబాద్‌లో సమావేశం నిర్వహించడమే గాకుండా గత ఐదేంద్లుగా తెలంగాణ ఉద్యమంలో మహిళలు నిర్వహిస్తున్న పాత్రను, భవిష్యత్‌ తెలంగాణ ఎజెండాను మేనిఫెస్టో రూపంగానూ, జ్వలిత, అనిశెట్టి రజిత, అఖిలేశ్వరి రామాగౌడ్‌, నీరా కిషోర్‌ల రచనల ద్వారా వెల్లడిరచారు. ఈ కలెక్టివ్‌ వర్క్‌ని బాధ్యతగా నిర్వహించిన ముక్త బృందానికి ముందుగా అభినందనలు.  ఇందులో అచ్చయిన రమాదేవి, సత్యా సూఫి, అమిల, క్రాంతి,భార్గవి, నాగమణి, సుభాషిణిల బొమ్మలు/పెయింటింగ్స్‌ వారి ప్రతిభను పట్టిస్తున్నయి. వీటన్నింటికి మించి 1969 ఉద్యమం నాటి మహిళల ర్యాలీ (హైదరాబాద్‌) ఫోటోని కవర్‌పేజిగా, 1932 నాటి అజాంజాహి మిల్స్‌ (వరంగల్‌)లో పనిచేస్తున్న మహిళల చిత్రాన్ని బ్యాక్‌కవర్‌గా వేయడం సంచిక విలువను మరింతగా పెంచింది.

ఇంత వరకు మహిళలు వెలువరించిన ఏ సంచికల్లో లేని సామాజిక న్యాయం రచయితలు, రచనల ఎంపికలో బలంగా కనిపించింది. ఈ సంచికకు ఆ ఎంపిక వన్నె తెచ్చింది. దళిత, బీసి, ముస్లిం మహిళల గురించి ఇంత లోతుగా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. తెలుగుతో పాటుగా హిందీలో ‘మేరా తెలంగాణ’ వ్యాసం రాసిన స్వదేశ్‌ రాణి, ఉర్దూలో సాదిఖా నవాబ్‌ సాహెర్‌  కవిత కూడా ఇందులో చోటు చేసుకోవడమంటే తెలంగాణలో నివసించే ప్రజలందరికీ ఎంతో కొంత మేరకు ప్రాతినిధ్యం కల్పించడంగా భావించాలి. తెలుగేతరులు కూడా హైదరాబాద్‌ మాది అని గర్వంగా చెప్పుకోడానికి ఇది ఉపయోగ పడుతుంది.

ఈ సంచికలో వెలువడ్డ సుమిత్రాబాయి వ్యాసం గతంలో ఇల్లిందల సరస్వతీదేవి వెలువరించిన ‘తేజోమూర్తులు’ పుస్తకంలోనిది. అయితే వ్యాసం ఎక్కడి నుంచి తీసుకున్నారో ఇచ్చినట్లయితే గతంలో ఆ విషయం వెలుగులోకి తెచ్చినవారిని గౌరవించినట్లవుతుంది. ప్రధానంగా మహిళల చేతే వ్యాసాలు రాయించి వెలువరించి ఉండాల్సింది. యూనివర్సిటీల్లోని విద్యార్థులు ఉద్యమంలో పాల్గొనడమే గాకుండా పత్రికలు కూడా వెలువరించారు. వీరిని కూడా ఇందులో జోడిరచుకున్నట్లయితే సమగ్రత వచ్చేది. అలాగే వివిధ విశ్వవిద్యాలయాల్లో తెలంగాణపై వివిధ రంగాల్లో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో పరిశోధన చేసిన వారున్నారు. వారి అనుభవాన్ని పత్రిక ఉపయోగించుకోలేదు. మధురాలు, లంబాడీలు, కోయలకు సంబంధించిన సాంస్కృతిక, ఉద్యమ జీవితాలు కూడా ఇందులో లేవు. అయితే సిరీస్‌లో ఇది మొదటి భాగం అని పేర్కొన్నారు. రాబోయే సంచికల్లో మరింత తెలంగాణ మహిళా ఉద్యమాల గురించి రికార్డు కావాల్సిన అవసరముంది.

1890వ దశకంలోనే హైదరాబాద్‌ ప్రభుత్వం తరపున ‘మలేరియా కమీషన్‌’ బృంద సభ్యురాలిగా, ఇంగ్లండ్‌ పర్యటించడమే గాకుండా అక్కడ వైద్య విద్యనభ్యసించిన దేశంలోనే తొలి అనస్తీషియన్‌ రూపాబాయి ఫర్దూంజీ గురించి, తెలంగాణలోని అన్ని సంస్థానాల్లో మహిళలు ఎప్పుడో ఒకప్పుడు పాలనా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాలతో బాటుగా, 1904 నాటికే మహబూబియా పాఠశాలలో ముస్లిం బాలికలకు ఇంగ్లీషు విద్య బోధించిన కళాశాల ప్రిన్సిపాల్‌ గురించి, ముంబాయిలో రచయిత్రిగా స్థిరపడ్డ బిల్కీస్‌ లతీఫ్‌, ఢల్లీిలో జర్నలిస్టుగా స్థిరపడ్డ హనీస్‌ జంగ్‌, తొలితరం డాక్టర్‌, రచయిత్రి, ఉద్యమకారిణి టి. వరలక్ష్మమ్మ గురించీ, గోలకొండ కవుల సంచికలో చోటు చేసుకున్న కవయిత్రుల గురించీ వచ్చే సంచికల్లో రచనలు చేసి ప్రస్తుత లోటుని భర్తీ చేసుకోవాలి. ముఖ్యంగా సాయుధ పోరాటంలోనూ, 1969-70ల ఉద్యమ సందర్భంలోనూ మహిళల పాత్ర గురించి ఇప్పటికీ సమగ్రమైన అంచనా లేదు. 69-70 ఉద్యమ కాలంలో అసెంబ్లీలో ఈశ్వరీబాయి, సదాలక్ష్మిలు చేసిన ‘ఫైర్‌బ్రాండ్‌’ ఉపన్యాసాలను సేకరించి పుస్తకాలుగా వేయాలి. సదాలక్ష్మి చిత్రకారిణిగా కూడా ప్రసిద్ధి. ఆమె చిత్రాలు సేకరించి అచ్చేయాలి. ఇది ప్రారంభం. ఈ పరంపర సదా కొనసాగాలి. ఈ పనిని ముక్త టీం చేయగలదు. ఎందుకంటే ఈ టీం సమన్వయంతో, సమైక్యంగా పనిచేస్తోంది. ఈ సమన్వయం సాధించడంలో ప్రధాన బాధ్యురాలు కె.విమలకు అభినందనలు.

                                                                                                                                                               -సంగిశెట్టి శ్రీనివాస్‌

 sangisetti- bharath bhushan photo

 

అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఈ వారమే!

10614218_300362290152515_8326601315087796337_n

 

10628066_300362316819179_131675058726844698_nఅక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం) రెండు రోజులూ  ఉదయం  8 నుండి సాయంత్రం 5 వరకూ హ్యూస్టన్ మహా నగరంలో జరుగుతున్న ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ స్వర్ణోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కు ఇప్పటికే చాలా మంది సాహితీవేత్తలు అనేక నగరాల నుండి నమోదు చేసుకున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మిగిలిన వారందరినీ మరొక్క సారి సకుటుంబ, సపరివారంగా ఆహ్వానిస్తున్నాం.

ఉత్తర అమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ 1964 లో అప్పటి ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడి యాభై సంవత్సరాలు  గడిచిన  సందర్భంగా, ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య ప్రారంభానికి అదే తొలి అడుగుగా గుర్తిస్తూ ఆ అర్ధ శతాబ్ది ఉత్సవాలు ప్రధాన అంశం గా  “తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు”  నిర్వహించబడుతోంది.

ఈ అద్వితీయమైన అమెరికా సాహితీ సదస్సులో పాల్గొనడానికి ఇతర నగరాల నుండి వస్తున్న అమెరికా సాహితీ వేత్తలు కిరణ్ ప్రభ, వేమూరి వేంకటేశ్వర రావు, వేలూరి వేంకటేశ్వర రావు, చెరుకూరి రమా దేవి, అఫ్సర్, కల్పనా రెంటాల, శారదా పూర్ణ, విన్నకోట రవి శంకర్, ఎస్. నారాయణ స్వామి, గొర్తి బ్రహ్మానందం, చంద్ర కన్నెగంటి, మెడికో శ్యాం, శ్యామలా దేవి దశిక, సత్యం మందపాటి, యడవల్లి రమణ మూర్తి, అపర్ణ గునుపూడి మొదలైన వారు. ఇంతటి అమెరికా హేమాహేమీలని అందరినీ ఒకేసారి కలుసుకోవడం, ఒకే వేదిక పై వారి అభిప్రాయాలని వినడం ఒక అపురూప అవకాశం. అంతే కాక భారతే దేశం నుంచి పాపినేని శివశంకర్, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, డా. ముక్తేవి భారతి, ప్రొ. జి. కృపాచారి (దళిత విశ్వవిద్యాలయ ఉప కులపతి), ఆకెళ్ళ రాఘవేంద్ర, కస్తూరి అలివేణి, జి. భగీరధ మొదలైన వారు అక్కడి సాహిత్య పురోగతిని (???) ఇక్కడ మనకి వివరించనున్నారు

10647170_300362460152498_8223353005422413139_n

 

ఈ సదస్సులో ప్రధానాంశాలుగా ఉత్తర అమెరికా తొలి కథకులు స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు గారి సతీమణి లీల గారు & కుటుంబ సభ్యులు ఎడ్మంటన్ (కెనడా) నుంచీ, అమెరికా తొలి కవి & తొలి తెలుగు పత్రిక సంస్థాపకులు స్వర్గీయ పెమ్మరాజు వేణుగోపాల రావు గారి సతీమణి స్వరాజ్య లక్ష్మి గారు & కుటుంబం అట్లాంటా నుంచి విచ్చేసి మన ఆత్మీయ సత్కారం అందుకోనున్నారు. అదే విధంగా అమెరికా మొట్ట మొదటి కథా రచయితలైన చెరుకూరి రమా దేవి, వేమూరి వెంకటేశ్వర రావు, వేలూరి వెంకటేశ్వర రావు గార్లకు, జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించి అమెరికాలో తెలుగు సాహిత్యానికి సముచితమైన స్థానం కల్పించబడుతుంది.  ఈ సందర్భంగా ఉత్తర అమెరికా లో తెలుగు సాహిత్య తొలిదశకం (1964-1974) చరిత్ర నెమరు వేసుకునే ప్రత్యేక ప్రసంగం ఉంటుంది. హైదరాబాద్ నుంచి తొలి సారిగా అమెరికా సందర్శిస్తున్న సీనియర్ రచయిత్రి, సుప్రసిద్ధ సాహితీవేత్త డా. ముక్తేవు భారతి గారు జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు.

ఆత్మీయ వాతావరణలో జరిగే ఈ సాహిత్య సభలకి వచ్చి ఆనందించమని మిమ్మల్ని కోరుతున్నాం. సభలో సాహిత్య విషయాలపై ప్రసంగించ దల్చుకున్న వారు వెనువెంటనే మమ్మల్ని సంప్రదించండి.

ఏ కారణం చేతనైనా మీరు రాలేక పొతే, ఖర్చులతో తలమునకలయ్యే మా ప్రయత్నాలని మీ కనీస  విరాళంతో ఆర్థికంగా సమర్దించమని అర్దిస్తున్నాం.  మా నియమాలని బట్టి,  దాతలందరికీ $145 డాలర్లు విలువ జేసే పుస్తకాలు అందజేయబడతాయి. పోస్ట్ ఖర్చులు మావే! పుస్తకాల వివరాలు ఇందుతో జత పరచిన పూర్తి ప్రకటనలో చూడండి. అలాగే సదస్సు నమోదు పత్రం కూడా జతపరిచాం.

సాహిత్య పోషణకి కనీస విరాళం $50, సముచిత విరాళం $100, ఉదార విరాళం $2500 దాకా విరాళం పంపించడానికి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈ క్రింది లంకె కి వెళ్తే చాలు.

ALL DONATIONS ARE TAX-DEDUCTIBLE IN USA

https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=TQANE7ZAQDXQA

మరిన్ని వివరాలకు ఈ క్రింది వారిని సంప్రదించండి

వంగూరి చిట్టెన్ రాజు  Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com

మారుతి రెడ్డి (కన్వీనర్), President – హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి, maruthi@hotmail.com

Sai Rachakonda: Coordinator:, Phone:  281 235 6641, sairacha@gmail.com

కార్య నిర్వాహక సభ్యులు

C.N. Satyadev, Madhu Pemmaraju, Satybhama Pappu, Santha Susarla, Hema Nalini Tallavajjula, Sitaram Ayyagari, Pallavi Chillappagari, Uma Desabhotla, Sarada Akunuri, Ram Cheruvu, Venkatesh Nutalapati, Raj Pasala, Sudhesh Pilutla, Raghu Dhulipala, Krishna Keerty, Lalitha Rachakonda, Ravi Ponnapalli

If Given a Chance….

                                  Origin (Telugu): Vattikota Alwaru Swamy

                                 Translated from Telugu by:   Elanaaga

 

 

untitled[Vattikota Alwar Swamy is undoubtedly a great storyteller. His mastery over short story is indeed commendable. He is not only a visionary, but also a robust optimist.

His narrative depicts economy of space and characterization. Thus it stands out unique. As a vibrant writer, his creative canvas is full of social realism. The present story, “If Given a Chance”, embodies multiple shades of meaning and a wide spectrum of symbols and images. More particularly, the story has very crucial issues of human concern: 1.The inbuilt injustice in our societal values 2.There is a need for radical revision of criminology, penal code and jail administration 3. Subjugation of woman in a male-dominated society or gender bias 4. Man woman relation in the institution of family 5. War and human wastage

Alwar Swamy tries to redefine independence. It has larger ramifications. In fact, it is not only the national independence but also the individual freedom.

The story is set in a typical Indian home or household. The husband Shastri and his wife Saroja, in their casual conversation, not only unravel their inner motives, but also touch upon the whole gamut of national issues. Against the backdrop of war, how human life undergoes the twists and turns of socio-economic issues. AlwarSwamy considers war as a great global disaster. In his scheme of things, the role of woman takes the front seat. Alwar Swamy foresees a bright and brilliant future for woman. Saroja not only opens window for fresh air and also further breastfeeds her daughter, she gives a tremendous feedback of ideas. She also gives a daring discourse on emerging new woman. She says woman needs to realise her full potential. In fact, woman is also imprisoned in the family of four walls. She can equally prove her mettle on the fighting front.

In the later years, Alwar Swany’s forecast turns out to be true. How present day’s woman is dominating socio-political arena? And further how she most efficiently and effectively is managing the state administration and other transactions? Emancipation and empowerment of woman becomes a deep undercurrent of the story.

Pathan is an Afghan Muslim. The story is too deep for tears. In the yesteryears, the jail administration was so bad that jails proved to be real torture chambers. Since Alwar Swamy himself had undergone the travails of jail life for no fault of his, Pathan was put behind the bars and further condemned to undergo rigorous imprisonment. Finally, he met with a tragic death. Thus, he was alienated from his own family and native roots. Here, Alwar Swamy selected a Muslim to reveal his religious respect and tolerance.

The present story transcends beyond the four walls of house and intersects with contemporary history of larger issues. Pandit Nehru’s cryptic statement turns out to be a great piece of literary work. If given a chance, either man or woman excels and expands into cosmic heights.

Doctor Elanaga is a brilliant translator. He could bring out the body and the soul of the original. His informal style, apt and appropriate phrase, makes the work immensely readable. Doctor Elanaga himself is a poet and writer. This enabled him to translate those turbulent times and history into chaste English.

Alwar Swamy, as a great patriot and writer, envisaged a new independent India where woman should emerge as a powerful force to be more articulate and assertive. Finally, no one gives a chance – it is to be fought and created.]

 

                                                                – Professor P. Lakshminarayana.

 

 * *

 

“Have you read this, dear?”

“Yes, I must have read. But what is it?”

“Pundit Nehru’s speech”

“On what occasion?”

“In Children’s Promotion Association, in Delhi”

“Oh, that one? Yes dear. He explained very nicely. What did you think about Nehru? He is an expert in grasping the ins and outs of issues. Okay. But what is his perspective? Read”

“Listen here. In fact, 85 percent of people serving the sentences in our country’s prisons, are not criminal minded. Even the remaining 15 percent are not criminals by nature. Circumstances rendered them so. An ordinary prisoner serving a jail sentence for the past ten years, is more virtuous than many who are outside prisons”

(Laughs) “Oh, that one?”

Kaum ke gum me dinner khathe hain hukkam ke sath

               Ranj leader ko bahuth hai magar aram ke sath(1)

Saroo! You are becoming more and more invincible day by day. When I read that speech, I see the picture of one person in my mind”

“Is his life so poignant?”

“Poignant? Heart will be blasted”

“In that case, tell. I will listen”

“Shall I tell? It’s the tale of a youth who lost his life quite unjustly. It happened ten years ago”

“Please stop for a while. Before you tell the story completely, I impose a condition”

“What is it?”

“It won’t be good if you shed tears in between and keep on worrying for the next one or two days”

“Saroo! In a way, you are fortunate”

“What a good fortune indeed! Do you mean to say that even my inability to understand you, my living as an ignoramus by not knowing your agonies and staying away from everything is fortune?”

“Yes. For inept fellows who cannot solve their problems, there only lies peace in not understanding the problems. They can pass time as ignoramuses inside a room”

“A wife, who, without understanding her husband’s views and difficulties and not becoming a partner, cannot be joyful as you surmise. It becomes inevitable for us to get influenced by your difficulties and views wittingly or unwittingly. That way we compulsorily become partners in your lives that are filled with restiveness and disquiet. Okay. Let it be. You are very capable my dear. If you want to escape from discussing the actual issue by digressing, you may now proceed to tell about that youth in detail”

“Shall I tell?”

“Yes, of course. But please wait a little. I’ll breast feed our baby Sudha”

 

*         *         *

 

“Saroo! Not all people can discern the rot and ins and outs of the society. It is possible only to those who understand the society fully”

“See, you are digressing again. Put that paper down there and come straight to the actual point”

“I will tell. But you should hold a bridle in your hand and keep pulling it like this at intervals!”

“Once ordered by you, there won’t be any going back of course. I will certainly make use of the power vested in me to the extent of hundred percent”

“Like a monkey getting jaggary. Is it?”

“In fact, you males have suppressed us. Otherwise, we are more efficient than you in all aspects. If you want to disprove my point, give power to us and see. We will show our mettle”

“The Sarojamma who can pull the bridle when I deviate from path, is herself sidetracking, you see”

“Yes indeed. When I said about power to women, you felt that it is sidetracking. Males are males anyhow”

“They are selfish fellows. Aren’t they?”

“No, no. They are not selfish. They are personifications of deities who, by telling sweet words, create hurdles at every step in the name of social restrictions, traditions etc., and when it becomes difficult to withstand, nurse suspicions in their hearts”

“Oho, Sarojamma is getting accustomed to the attitude of lecture it seems”

“However much a woman I may be, am I not the wife of Sri Sri Sri Sri Sri……………..Sastry?”

“That’s alright but where has your bridle gone?”

(Laughs) “How nice is this? Both of us have left the actual issue and resorted to argument. Start at least now”

“Perhaps I have already told about it to you Saroo”

“I don’t remember. Would you wear out if you tell it again?”

(Sets right his tone) “Then listen. Would you bring some water to drink?”

“Would just some drinking water suffice?”

“It seems your eyes are going into sleep mode”

“My eyes? Or yours?”

“Okay. Leave it but give me water to drink. We will think about everything else later”

“Is there a later part also? Take and drink this water”

“Saroo! It’s very sultry dear. Please open that window and switch the light off”

“Oho. It seems Sastry sir’s eyes want to fall asleep”

“Yes. It’s chilly too. Bring that rug”

“What happened to the thing you wanted to tell?”

“I remember that I have already told it to you. It’s that same thing. Hasn’t the Pathan(2) fellow gone mad? In the jail”

“Oh, that thing? So what? Shouldn’t you tell once more?”

“If you are not feeling sleepy, it’s right then. It’s your habit to keep on pestering me till you get sleep. Listen”

“Good heavens. That means sir’s chariot has now started”

“What shall I do? The devotees pulling the chariot are like that. Saroo! If you really want to listen, then I’m starting now”

Sree Ganesaya namaha(3). Okay, start”

“He is a Pathan belonging to a border state”

“If Sastry sir excuses me, I have a plea. When you said border state, I was reminded of Frontier Gandhi(4). It’s pity that nowadays we hear nothing about him”

“Saroo! Your attitude is reminding me that of a gurivinda(5) seed. You, who argue that I often digress, are not allowing me to proceed”

“There are judges who revoked hangings when asked to pardon. There are others who exempt convicts from paying the penalty. But you are behaving like a fascist. This is not good. Please realise that this is the era of democracy. Besides, I am a woman devoid of physical strength. While I am trying to imbibe knowledge from you who is a treasure house of wisdom to get enlightened, to become prudent, to rove as a valiant lady on this great Indian land full of valour and to puff up with pride, why this disgust for you?”

“Sarojamma garu(6)! Stop. Stop your flow of poetry”

“It is the men who stop everything. Women are always progressive. They always march ahead”

“There’s no use in marching without companions. Take at least me with you”

“Okay. The Pathan fellow hailed from a border state. What next?”

“After that…after that….Unable to earn anything for his livelihood, he joined the military”

“Inability to earn means dying without food. Isn’t it? And joining military implies getting ready to die. That means being afraid of one death, he readied himself for another death”

“No Saroo! Not all people who join military die. Not all students who study, pass. And not every patient who takes medicine gets cured. It depends on their fate”

“I opine that one more thing must be added to that”

“What’s it?”

“Not all employees who do their duty necessarily get salaries”

“Oh, you almost killed me with your sentence. Do you mean that they should live just on wind and water?”

“In fact what you are giving me for my drudgery is only that much. Is it not so?”

“The family life and love bond between wife and husband are well above destiny and the life itself. There is an indescribable affection in it. It has no price. Nor can it be explained in words”

“Is it so? Sometimes you remark that this whole world is a single family and all the peoples are its members. As per your tenets of virtue, you who belong to this vast family and me who is a member of your family are carrying out actions without any desire for returns. Then why shouldn’t you work without taking that 1500 Rupee salary?”

“Oho, somehow you want to do away with my job! Saroo! I am not doing the job for the sake of salary. I’m taking salary because I am doing the job”

“But that Pathan has joined the job for salary, O.K. What happened after that?”

“Poor fellow, he was shifted to a very distant place from his native area just after joining his job”

“Like how you had gone to London…Is it?”

“Saroo! It’s not fair to apply everything only to me”

“May peace prevail. Please don’t get angry Sastry garu. Poor woman, that Pathan’s wife…how much mental agony she must have been subjected to? Did he have any children?

“His family comprised an old mother, a ten month old son and a wife. He was the only person for them to fall back upon”

“Pity”

“Some scuffle took place in the military camp. He too had participated in it I believe. Perhaps it’s a very serious scuffle. That Pathan was sentenced to twelve years imprisonment”

“Twelve years! When you spent just two years in jail, I underwent an enormous amount of mental turmoil. Would you say that serving twelve years of sentence in prison is an ordinary thing?”

“No Saroo! It’s not an ordinary thing. It’s unbearable. Just after two months of imprisonment, his heart broke. He didn’t know the state of his family. Nor his family members knew what was happening to him. He suffered a heart break here while they suffered with no money for livelihood there. Whenever there was a chance, he averred that he had not done anything wrong and   beseeched the prison officials to shift him at least to other jail in his native state. Those were the days of war. Who would listen to his plea in the situation of a great war when everyone is preoccupied with life and death? Many months have passed without any outcome. Even his sentence was confirmed in the appeal. (With choked voice) In the end, he went out of his mind”

“Have you started it again? Think that I am dead if you do that. How foolish I am? Why did I ask you to relate the tale at all? Please don’t bring tears to your eyes”

(With choked voice) “Saroo! His figure is still lingering in my mind. He holds a rosary in his hand and doesn’t talk to anybody. Nor does he eat anything or change his dress. If at all he speaks anytime, it’s only a single sentence: “I have not committed any wrong, send me to my home.” In the end, he was considered a mad fellow. There was no end to the beatings and abuses that he received. Not eating food in prison is equal to breaking the rule. The jail employees’ duty is not complete until something is pushed into convict’s mouth….I can’t tell anymore Saroo”

“What must have happened in the end?”

(With choked voice) “He died as an insane fellow. That news alone was conveyed to his family members. But one thing is sure. Had he been given a chance, he would have outshined. Only due to the circumstances, he became like that. Saroo, there is so much meaning in those words of Pandit Nehru. That’s why I felt pained so much. You have brought tears to your eyes too. Yes, every living being that has a heart does the same thing”

 

 

– – –

 

 

1.Kaum ke gum me: During the times of national disasters, officials are eating

dinners in condolence meetings. Leaders have a great sorrow,

but they are well contented. (Lines from Akbar Alahabadi’s

poem)

2.Pathan: The Pashtun man, known Afghan in Persian and Pathan in Hindi – Urdu.

3.Sri Ganeshaya Namaha: A Sanskrit sloka praying Lord Ganesa to remove any

obstacles before starting any major work by Hindus.                                

4.Frontier Gandhi: Khan Abdul Ghaffar Khan. He was a political and spiritual

leader known for his nonviolent opposition to the British rule

in Indian subcontinent.

5.Gurivinda:            A seed which is partly white and partly black. People who don’t

recognise their own deficiencies are usually referred to it.

6.Garu:                     A suffix word used to denote reverence to elderly or great

persons.

 

 

(This is one of the stories from the book ‘Inside the Prison’ which is a translation to Vattikota Alwaru Swamy’s short story book ‘Jailu Lopala’. The book was published by Telangana Bhasha Samskrithika Mandali and it will be released on 25-10-2014 at 10.00 A.M. at Telugu University auditorium, Public Gardens , Nampally, Hyderabad as a part of Vattikota Alwaru Swamy’s birth centenary celebrations)

 

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ఎలా వున్నావ్!

Rekha

మొదటిసారి నువ్వడుగుతావు చూడు

“ఎలా వున్నావ్? ” అని

అప్పుడు చూసుకుంటాను నన్ను నేనొక్కసారి

చాలా కాలం నుంచీ కాలానికి వదిలేసిన నన్ను నేను

అప్పుడు చూసుకుంటాను ,

నీకు ఒక సరైన సమాధానం చెప్పడానికి

అప్పుడు చూసుకుంటాను నా బాగోగులు

“బాగున్నాను “అని నీకు బదులు ఇవ్వడానికి

“ఏవీ నీ కొత్త వాక్యాలు , పట్టుకురా ” అని అడుగుతావు చూడు

అప్పుడు చూస్తాను ఒత్తైన దుమ్ములో ఒత్తిగిలి రంగు మారి

అంచులు చిరిగిన నా పేద కాగితపు పూవుల్ని

వాటి మీద ఆశగా చూస్తూ మెరుస్తూన్న

కొన్ని పురాతన భావాక్షరాలని

అయినా సరే ఎలా నీ చేతిలో పెట్టేది , ఎలాగో

అతి కష్టం మీద ఓ దొంగ నవ్వు వెనకగా దాచేస్తాను

నీ నుంచి రాబోయే మరో ప్రశ్న తెలుస్తోంది

ఎక్కడున్నాయి నా రంగులు, నా కుంచెలు? అని

లోలోనే వెదుక్కుంటాను , తవ్వుకోలేక

తల వంచుకొని నిలబడతాను

వెల్లవెలసిన నా ముఖం చూసి మౌనంగా వుండిపోతావు

మరేదైనా దీనికి సమానమైన శిక్ష ఉంటే బాగుండునేమో కదా !!

ఆ మూలగా తీగలు తెగిన వీణ ,

బీడువారిన పెరడు కూడా నీ కంట పడతాయేమో అని

ఎంత కుచించుకు పోతానని !

నిజమే !

నీవీ వాకిలికొచ్చి విచారించ బట్టి తడుముకున్నాను కానీ ,

నన్ను భూమి మీదకు పంపుతూ నీవు అమర్చిన సహజ కవచ కుండలాలన్నీ

బ్రతుకు పందెంలో ఎప్పుడో తాకట్టు పెట్టేశాను !

మా తండ్రివి కాదూ

ఈ ప్రాణం ఉండగానే మరొక్క అవకాశం ఇవ్వవూ

మిగిలిన సమయంలోనైనా ఆ తాకట్లు కాస్తా విడిపించుకొనేందుకు !!

-రేఖా జ్యోతి

జ్ఞాపకాల యాత్ర

sindhumadhuri
మెడకి కుట్టుకున్న దండ బిగిసి

రక్త నదుల ఎదురెదురు మోత

వళ్ళంతా గాట్ల మాంసం.

కోతలన్నీ  కప్పి ఉంచే  గవురవం

విత్తనాల పండగ మొలకలన్నీ

మొటిమలై  మాడిన నేల మొకం

కబురుల కీటకాల రొదన

భూమీ ఆకాశాలు లాగి తన్తే

మళ్ళీ నీ  నీ జ్ఞాపకాల చూపు

రెప్పల పొరల   కోతకి కన్నీళ్ళ  వణుకు

లోకమంతా  పోయినాక ఎముకల

కోలాటం మోత  బందాలు

ప్రమాణాల  ముళ్ళకంచ కొక్కానికి
ఉగుతున్న గుండె దేగేసిన ముళ్ళ లో

స్వరం స్పర్శా వాతాన పడి

 

ఒకటి పక్కన ఎన్ని సున్నా లలో
శరీరం మట్టి మట్టి శరీరం
 చీల్చే సాయ వ్యవసాయాలు
 తిరిగి కౌగిలి దున్నె తలపులు
కోరికని కడుపులో కుక్కుకుని
నన్ను నరికే కత్తి  నా   వెన్నుపూస
గాలి లో అడతన్న మాసపు కండల రుచీ రంగూ
వేట సింహం దగ్గరకు లక్కుని వాసన చూసి
ఇష్టంగా త్రుప్తి గా  తింటా పోగేసిన
సమాది పునాది ఎముకలు
మూసిన కళ్ళ తో గాయపు
పేడు తడిమి పురుగు పట్టిన
పున్దుని ఎండలో పెట్టీ  కదలికలు
కనపడి నిన్న పడిన వాన  ఉమ్మి ,
మల్లెల జల్లుగా రక్తపు మట్టీ
కాసిని వాసన లేని కనకాంబరాలు
జల్లి oచుకునే  కళే బర  యాత్ర ని
( రైతుబజారు  హక్కుల కోసం పోరాడే తమ్ముడు కర్రి రవీంద్ర సాయి ని,  నమ్మిన స్నేహితులే ఎండ్రిన్ తాగించి చంపేసిన దుర్ఘటన మనసు ని కోసేస్తున్నప్పుడు రాసిన కవిత )
                                                   -మన్నం సింధు మాధురి

ఇది మనిషి కాలం

కె.ఎన్.వి.ఎం.వర్మ

పువ్వులు వాడిపోవడం చూసాం
ఆకులు రాలిపోవడం తెలుసు
చెట్టే చచ్చిపోవడం వయసు మించిపోవడం.
ఒక సందర్భంలో
పూవులు ఆకులు సంగతేమో కానీ
అసలు చెట్టే బతికుందో లేదో
తెలవకపోవడం విషాదం.,
అవును దానికి విపత్తని పేరు
తుఫాను అనీ పిలుస్తారు
హుద్ హుద్ అని నామకరణం కూడా చేసారు.
పంచవర్ష ప్రణాలిక పేరు చెప్పో
హరిత విప్లవం మాటునో
దిగుమతి చేసుకొన్న ఎరువులు
పారిశ్రామిక అభివృద్ది
ప్రపంచీకరణ తెచ్చిపెట్టిన
లెడ్ నిండిన విషమో
అంతా తింటున్నదంతా
పురుగు మందుల ఆహారం
ఈ కాలానికీ
ఓ పేరు పెట్టాలి
కలియుగాన్ని మింగిన ఆకలికి
ఆకలి ఎత్తుతున్న పలు అవతారాలకి
ఇది మనిషియుగం అని సరిపెట్టుకోవాల్సిందేనా!
ఎంత తినాలో
ఏమి తాగాలో
ఎప్పుడు పనిచేయాలో
మరెప్పుడు పడుకోవాలో
ఎన్నడు చావాలో
తెలియని పుట్టుక రోజులివి
పకృతికి మనిషికి సంభందాలు తెగిపోయిన
వేరు కాపురాలివి
పకృతి వికృతి ఏకీకృతాలైన
వికటహట్టహాసాలివి
కొబ్బరిమొక్కకి క్రోటన్సుకి వ్యత్యాసం తెలియని
ఆది ప్రాసలివి
ఇది మనిషి కాలం.
ఇప్పుడు
మొక్క మోడుకావడం వికృతి కాదు
విపత్తులే నేటి ప్రాకృతం.
క.నా.వెం.మ.వర్మ

‘ఎగిరే పావురమా!’ – 16

egire-pavuramaa16-banner

నేను కళ్ళు తుడుచుకొని బాబాయి వంక సూటిగా చూసాను…

‘చూడు రాంబాబాయి’ అన్నట్టు అతని చేతిని వేళ్ళతో తట్టాను..

కమలమ్మని, గోవిందుని చూపిస్తూ – ‘మూడేళ్లగా వీళ్ళతో కలిసున్నానని, బాగానే ఉన్నానని’ సైగ చేసాను….

జేమ్స్ ని చూపించాను…’అతని వద్ద క్యాంటీన్ లో ‘వంటా-వార్పు’ చేస్తున్నానని’ చెప్పాను…

‘ఆ కొలువు చేయబట్టే, నా కాలి చికిత్స జరిగిందని, ఇంకా నాలుగే వారాల్లో చికిత్స కూడా పూర్తవుతుందని’ తెలియజెప్పాను.

నేనిప్పుడు చాలా మెరుగ్గా కదలగలుగుతున్నానని చెప్పాను…

 

తాత ఉత్తరం తీసుకొని గుండెలకి హత్తుకున్నాను. తాత మీద ప్రేమ, బెంగా ఉన్నాయని తెలియజేశాను….

ఆయన రాసిందంతా నేను అర్ధం చేసుకున్నానని తాతకి చెప్పమన్నాను.

నా చదువు కూడా కొనసాగిస్తున్నానని,   నేను అన్నీ ఆలోచించి   మళ్ళీ ఉత్తరం రాస్తానని తెలియజేయమన్నాను. తాతని, పిన్నిని అడిగానని చెప్పమన్నాను.

 

ఆఖరికి, చేతులు జోడించి, ఇక బయలుదేరమన్నాను…

రాంబాబాయి కూడా నాతోపాటే ఏడ్చేశాడు…

నాచేతులు తన చేతుల్లో పట్టుకుని, “సుఖంగా ఉండు గాయత్రి. నీవన్నవన్నీ తాతకి చెబుతాలే,” అని వెనుతిరిగాడు..

బాబాయిని సాగనంపడానికి, గోవిందు వెంట నడిచాడు.

కన్నీళ్ళతో   మసకబారిన   చూపుతో వెళ్లిపోతున్న ఆయన్ని చూస్తుండిపోయాను……..

**

కిచెన్లో – పొయ్యిల మీద గుండిగలో కుర్మాకూర కలుపుతున్నాను. వెనుక నుండి జేమ్స్ గొంతు వినవచ్చింది….

కాసేపటికి నా పక్కకొచ్చాడు.

“నీలో మునుపు లేని ఉషారు, ముఖంలో ఓ వెలుగు కనబడుతున్నాయి గాయత్రీ. పోయిన వారం నీ కాలు వైద్యం ముగిసిందని, డాక్టరమ్మ మన జలజ మేడంకి సమాచారం ఇచ్చారు… ఇకపోతే, రేపటిరోజున మళ్ళీ ఒక్కసారి వెళతావంటగా! చికిత్స కొనసాగింపు కాగితాలమీద నీ సంతకాలు కావాలన్నారంట,”… అన్నాడు.

 

తల వంచుకొని పనిచేసుకుంటూ వింటున్నాను….

మరో నిముషానికి నా ముందుకి వచ్చి నిలుచున్నాడు.

 

“గోవిందుతో నీ పెళ్ళికి సరిగ్గా పది రోజుల టైం ఉంది. చాపెల్ బుక్ చేయించింది కమలమ్మ. మిగతా ఏర్పాట్లు నేనే చెయ్యాలి. నీ వాలకం నాకు అర్ధం అవడంలేదు,” క్షణమాగాడు.

“నేను రెండురోజులు మా ఊరికి పోయొస్తా. వచ్చాక మళ్ళీ కనబడతా. ఈ రెండు రోజుల్లో సరయిన నిర్ణయం చేసుకొని నాకు మంచి వార్త చెప్పాలి నువ్వు. లేదంటే నువ్వు, గోవిందు కష్టపడాల్సి వస్తది,” అంటూ నా భుజాన చేత్తో నొక్కాడు.

వాడి చేయి విదిలించి వెనక్కి తిరిగేప్పటికి పక్క వాకిట్లోంచి గోవిందు లోనికొచ్చాడు.

 

అదాట్టుగా అతను ఎదురుపడ్డంతో, ఒక్కక్షణం జేమ్స్ తత్తరపడ్డాడు.

వెంటనే తేరుకొని, “ఏమిరా గోవిందు, నేను రెండు రోజులు ఊరికి పొతున్నా. రేపు కమలమ్మని తోడిచ్చి గాయత్రిని ఆసుపత్రికి పంపించు.   చిన్న పనే అక్కడ. ఏవో సంతకాలు చేయాలంట.. ఈడ నేను లేనప్పుడు అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకో,” అని ఆర్డర్ వేసి వెళ్లాడు తలతిక్క జేమ్స్.

**

“అక్కా, ఇయ్యాల మార్కెట్ నుండి సామాను దింపాక, గాయత్రిని ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నాడు జేమ్స్. వాడు ఊళ్ళో లేడుగా! ఏవో కొన్ని ఎగస్ట్రా పనులు సెప్పాడులే.   ఆసుపత్రికి పోడం చికిత్సకి కాదంట! ఆడేదో కాగితాల పైన సంతకాల పనుందంట. మేమెళ్ళి తొరగానే వస్తాములే,” అని కమలమ్మతో అంటూ, పొద్దున్నే   రోజూ కంటే ముందే ఇంటినుండి బయలుదేరాడు గోవిందు.

**

డాక్టరమ్మని కలిసి, కాగితాలు సంతకాలు చేసిచ్చాను. ఓ కట్ట కాగితాలు ‘మదర్ తెరెసా’ జలజ గారికిమ్మని నాకందించిందామె.

ఇప్పుడు నా కదలిక మునుపెన్నడూ లేనంత సులువుగానే ఉందని చెప్పాను….

క్రచస్ వాడుతునే ఉండమంది.

ఆమె కాడ శలవు తీసుకొని బయటికి వస్తున్న నాకు ఎదురొచ్చాడు గోవిందు.

“కాసేపు గుడికెళ్ళి కూకుందాము రా,” అంటూ అటుగా తీసుకెళ్ళాడు.

**

గుడిలోకి వెళ్ళగానే, “ముందు మొహాన బొట్టెట్టుకో. ఇయ్యాల నుండి నువ్వు బొట్టు తీసే పనే లేదు,” అన్నాడు గోవిందు.

తలెత్తి నవ్వి ఊర్కున్నాను.

దేవుడి కాడ దణ్ణమెట్టుకుని,  దేవుని కుంకుమెట్టుకొని, ఎదురుగా కాస్త ఎడంగా ఉన్న మెట్ల మీద కూచున్నాము.

గోవిందు వెళ్ళి, తినడానికి పులిహోర ప్రసాదం తెచ్చాడు.

 

“గాయత్రీ, ఈడ ఇయ్యాల బెల్లం పాయసం కూడా ఉంది తెలుసా,” అంటూ మళ్ళీ వెళ్ళి రెండు దొన్నెల్లో పాయసం కూడా తెచ్చాడు.

తిని నీళ్ళు తాగాము.

ఎడంగా కూచున్న గోవిందు, లేచి వచ్చి పక్కన కూచున్నాడు.

“నీతో మాట్లాడాలి గాయత్రీ,” అన్నాడు….

 

‘ఏంటో చెప్పమన్నాను’ నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి…

నాకు ఈ పెళ్ళీ వద్దు, ఇక్కడి జీవనం వద్దు, నా తాత కాడికి వెళ్లిపోతానని నా మనస్సు పడుతున్న ఆవేదన కన్నీళ్ళగా మారింది……..

 

“ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి కావాలో నాకు తెలుసు… కళ్ళు తుడుచుకో,” అని ఆగాడు.

“…చూడు… నీకు ఎంతో అన్యాయం జరిగిపోయింది గాయత్రి… పాపం మీ తాత, పిన్ని, బాబాయి ఎంత కష్టపడ్డారో!… ఏమైనా కమలమ్మ సేసింది పెద్ద తప్పు.. నేను కూడా ఏం సేయలేను. నాదీ తప్పే… ఇక ఆ గుంటనక్క జేమ్స్ ఇషయం కూడా నాకెరకే…

నీ కష్టం, ఇబ్బంది అన్నీ తెలుసు…నాక్కూడా ఈ పెళ్ళీ గిళ్ళీ ఏమీ వద్దు… ఈడనే ఉంటే, ఆ జేమ్స్ గాడు నిన్ను బతకనివ్వడు,” క్షణమాగి సూటిగా నా వంక చూసాడు.

“ఇప్పుడైతే ఊళ్లోనే లేడు. అందుకని,” చెప్పడం ఆపాడు నేనేమంటానోనని..

 

నా కళ్ళకి గోవిందు దేవుడిలా కనబడ్డాడు. ఆగని కన్నీళ్ళే గోవిందుకి   నేను చెప్పగల కృతజ్ఞతలు.

 

“నీ పుస్తకాలు, బట్టలు కూరల సంచీలో పెట్టి తెచ్చాను…

ఆసుపత్రి కాంపౌండులో వాన్ పెట్టి, ఆటోలో రైల్వే స్టేషన్ కెళదాము. గంటలో పాలెంకి రైలుంది. నేను టికెట్లు తీసే పెట్టాను. మీ ఊళ్ళో దిగాక నిన్ను మీ కొట్టాం దారి పట్టించే వరకు నేను తోడుంటాను,” అన్నాడు గోవిందు….

egire-pavurama14

**

అరపూట ప్రయాణమయ్యాక పాలెం చేరాము…..

“మీ తాత కొట్టాంలో ఉంటాడా? లేక గుడిలోనా ?” అంటూ కొట్టాం వైపే మళ్ళించాడు ఆటోరిక్షాని గోవిందు.

పది నిముషాల్లో కొట్టాంకి కాస్త పక్కగా ఆగింది ఆటో.   దిగి గోవిందు వైపు చూసాను. ఏమనాలో తోచలేదు. “ఇక లోనికెళ్ళు,” అంటూ నా బ్యాగు ఆటో డ్రైవర్ భుజాన వేసాడు.

 

కదిలి వెళ్ళి కొట్టాం వాకిట్లో ఆగాను. లోన అలికిడిగానే ఉంది…బ్యాగు లోపల పెట్టి ఆటోడ్రైవర్ వెళ్ళిపోయాడు.

కొద్ది క్షణాలాగి కొట్టాంలో అడుగు పెట్టాను.

**

లోన పదిమంది వరకు జనం ఉన్నారు. చుట్టూ చూస్తే ఎక్కడా తాత జాడ లేదు. ఓ వైపుగా పిన్ని, బాబాయి అటుగా తిరిగి చాప మీద కూచుని, కళ్ళు మూసి చేతులు జోడించి ఉన్నారు. వారికి కాస్త వెనుకగా రాములు కూడా కూచునుంది. సాతానయ్య మంత్రాలు చదువుతున్నాడు. నాకు గుండె జారినట్టయింది. నా కట్టెకాలు సాయంతో మరో నాలుగడుగులు ముందుకేశాను.

అప్పుడు కనబడింది. నేల మీద ముగ్గు మధ్యగా పరచిన బియ్యం మీద తాత పటం పెట్టుంది. పటానికి పూల మాల వేసుంది. పటం ముందు దీపం వెలిగించుంది.

పిన్ని, బాబాయి చేతులు జోడించింది తాత చిత్రపటం ముందని అర్ధమయింది.

గుండెలు పగిలేలా ఆక్రోశించింది నా ప్రాణం. “తాతా ! నీ కోసమే నేనొచ్చాను,

నువ్వు రమ్మన్నావని నేనొచ్చాను,” అని గుండెల్లోంచి బిగ్గరగా కేకపెట్టాను.

నా కేకకి నా గుండెలవిసిపోయాయి. నేలమీద కుప్పలా కూలిపోయాను.

నా ఆసరా కర్రలు కూడా నన్నాదుకోలేక పోయాయి.

కింద పడ్డ నా కర్రల చప్పుడుకి పిన్ని, బాబాయి వెనుతిరిగి చూశారు.

పరుగున నా వద్దకు వచ్చింది పిన్ని…

**

నా కోసం, నా రాక కోసం పరితపించిన తాత, నెల రోజులుగా ఆహారమే తీసుకోలేదంట. ఆరునెల్లగా తాత కంటి చూపుతో పాటు ఆరోగ్యం కూడా బాగా క్షీణించిందంట. తీవ్ర ఆమ్లత వల్ల కడుపు నొప్పితో బాధపడ్డాడంట. ఆఖరి వారం రోజుల పాటు ఏ మందులకీ ఆగని వాంతులతో చాలా నీరసించి చనిపోయాడంట తాత.­­

 

రాత్రింబగళ్ళు బాధతో, దుఃఖంతో గడిపేస్తున్నాను… రాములు, పిన్ని పక్కనే ఉండి ఓదార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

**

తాత చనిపోయి పన్నెండు రోజులయింది. ఇవాళ తాత తద్దినాలు. నిద్రపట్టక, తెల్లారుజామునే లేచి మంచం మీద కూచుండి పోయాను. పదమూడో రోజు కొట్టాంలోనే శాంతిభోజనాలు పెడుతున్నారు పిన్ని, బాబాయి వాళ్ళు.

చంద్రం పిన్ని నా కాడికి వచ్చి, నా మంచానికి ఎదురుగా ఉన్న చెక్క బీరువా నుండి చీర, గాజులు తీసి కట్టుకోమని మంచం మీదెట్టింది.

తలెత్తి పిన్ని వంక చూసాను. పక్కన కూర్చుని నా భుజాల చుట్టూ చేయి వేసింది.

ఇద్దరం దుఃఖాన్ని ఆపుకోలేకపోయాము.

 

పిన్నే ముందు తేరుకుంది.

“తాత నీ పద్దెనిమిదో పుట్టినరోజుకని ఈ చీర కొని ఉంచాడురా, గాయత్రి.

అంతే కాదు. గత మూడేళ్ళగా నీ పుట్టిన రోజుకని చీరలు, గాజులు కొనిపెడుతూనే ఉన్నాడు.

అందుకే తాత ఆత్మశాంతికి ఇయ్యాళ ఇది కట్టుకొని ఈ గాజులేసుకో,” అంది పిన్ని.

 

నాలుగేళ్ళగా నా పుట్టినరోజుకంటూ చీర, సారె కొని ఉంచిన తాత నాపై ఎంత ఆపేక్ష పెంచుకున్నాడో అర్ధమయి కుమిలిపోయాను.

తాత పెద్దదినం అయ్యేంత వరకు, ఓ ప్రాణమున్న శిలలా భారంగా గడిపాను. తాత పట్ల నేను వ్యవహరించిన తీరుకి నాలో గూడుకట్టుకున్న పశ్చాత్తాపం వెల్లువైంది.

**

రాములు నన్ను కనిపెట్టుకొని ఉంటుంది.   వంట చేసి, నాకు చెప్పి పొద్దున్నే గుడికి వెళుతుంది. సాయంత్రం చీకటయ్యాక ప్రసాదాలు తీసుకొనొస్తుంది.

నాకు రోజంతా తోచకుండా అయిపొయింది… బయట కొట్టాం చుట్టూ, రెండు మూడు సార్లు తిరిగొస్తున్నాను…..

 

గత మూడేళ్ళగా, కొట్టాం కూడా మరమత్తులు చేయించి, వీలుగా ఉండేలా కొద్ది మార్పులు చేయుంచాడు, తాతని తెలుస్తూనే ఉంది.

తడికలు తీసి చెక్కలు, పెట్టించాడు.

గదిలో చెక్క బీరువా, పక్కనే నిలువాటి అద్దంతో సహా పెట్టించాడు.

పొయ్యి కాడ స్థలం, ఎనకాతల స్నానాల గది కూడా మెరుగయ్యాయి.

కొట్టాం చుట్టూ రాళ్ళతో అరగోడ కట్టించి చిన్న గేటు, గొళ్ళెం కూడా పెట్టించాడు.

 

అరుగు మీద కూచుని, రాములు తెచ్చిన సనక్కాయలు వోలుస్తుండగా వొచ్చింది చంద్రం పిన్ని.

పొయ్యుకాడ నుండి చాటలో బియ్యం తెచ్చుకుని, ఎదురుగా కూచుంది.

“మెల్లగా నీ దుఃఖాన్ని మరిచిపోవాలి. నీ వెంట బోలెడన్ని పుస్తకాలున్నాయిగా! చదవడం మొదలెట్టు… బాబాయికి చెప్పి ఇంకా పుస్తకాలు తెచ్చుకునే దారి చూద్దాం. సరేనా?” అంది.

అలాగేనని తలూపాను…

 

“అసలు ముఖ్యమైన సంగతి ఒకటుందిరా గాయత్రీ. మీ తాత గురించే. ఈ మూడేళ్ళు, ఆ మాత్రమన్నా ఉన్నాడంటే, ఆ పూజారయ్య చలవేరా. సత్యమన్న పట్ల జాలితో, అతని ఆరోగ్యం పట్ల శ్రద్ధతో, గుడిలోనే నీడ పట్టున పూజాసామగ్రి అమ్మకాలికి కూర్చోబెట్టి, అందుగ్గాను గుడి నుండి జీతం ఏర్పాటు చేసాడాయన.

పింఛను కూడా కలిపితే మెరుగ్గానే బతికాడు తాత. తన తదనంతరం ఆ పింఛను నీకు అందేలా రాసి ఏర్పాటు చేశాడు. కొట్టాంలో ఈ మరమత్తులు కూడా చేయించాడు,” అంది పిన్ని.

 

“అప్పట్లో రాంబాబాయితో నువ్వు వెనక్కి వచ్చేసి ఈడ సుఖంగా ఉంటావని ఆశపడ్డాడు సత్యమన్న. కానీ, నువ్వు రాకపోయేప్పటికి కృంగిపోయాడు పాపం. తన బాధ పైకి తెలీనివ్వలేదు.

“నా చిట్టితల్లి తప్పక తిరిగి వస్తది. తిరిగొచ్చాక మాత్రం, దాని బాధలు పోగొట్టి, దాని ఆశలు తీర్చాలి.

మీరంతా కూడా దాన్ని ఎప్పటిలా ప్రేమగా చూసుకోవాలి,” అని మాకు మంచి చెప్పాడు కూడా. నిన్నొక్క మాట అననివ్వడుగా నీ తాత,” అంటూ కంటతడి పెట్టింది పిన్ని.

**

(ఇంకా ఉంది)

 

అనాది సంభాషణా రూపకం ఆమె!

drushya drushyam-54

ఒకానొక దృశ్యం మనం దైనందిన జీవితంలో ఇమిడిపోయి, అదృశ్యంగా ఉండిపోయిన జీవన ఖండికను మళ్లీ యాది చేస్తుంది. టీకాతాత్పర్యాలు కోరుతుంది. వ్యాఖ్యాన సహిత ప్రవచనం డిమాండ్ చేస్తుంది.

మరొక దృశ్యం ఏమీ చెప్పదు.
రంగులతో మెరుస్తుంది. సుహాసినిగా దర్శనం ఇస్తుంది.
ముక్కెరలా మెరుస్తుంది. గంతే.

అది కిరసనాయిల్ స్టవ్ లేదా బ్యాచిలర్ స్టవ్.
ఇక్కడైతే అది స్టవ్ కాదు. చిన్న ఇడ్లీ బండీ నడిపే ఆమె జీవన సమరం.

కానీ, కాదు.
ఆమె పోస్తున్నది కిరసనాయిలూ కాదు.

ప్రేమ. అభిమానం.
తల్లి ఆమె. భార్య ఆమె. ప్రేయసి ఆమె. స్నేహిత ఆమె.
వదిన, మరదలు. పిల్ల. మనిషి.

నీకూ నాకూ మధ్య ఏ గోడలు లేని, మరే ప్రవర్తనా నియమాలు అడ్డురాని, ఏకైక మాధ్యమంలో ఆమె ఒక నిండు మనిషి. మొబైల్ సంభాషణ వినాల్సిన అవసరం లేదు. ఆమె నిఖార్సయిన ఇండివిడ్యువల్.

లైఫ్.

అలవోకగా చెవికి మొబైల్ ఆనించుకుని స్టవ్ లో కిరసనాయిలు పోస్తున్నఆమె ‘నీ- నా’ కాదు.
తన.

మమత. సమత. దయ. అనురాగ పారవశ్యం.
జీవన లాలస.

పోక రంగు. నీలి రంగు.
ఆకుపచ్చ. నలుపు తెలుపు.
ఆఖరికి మీరొప్పుకున్నా ఒప్పుకోకపోయినా జీవనచ్ఛాయ.

+++

ఒక దరహాసం.
సంభాషణ. దృశ్యాదృశ్యం.

ఆమెను చూశారా?
మళ్లీ మళ్లీ చూశారా?

నేను చూశాను.
వందలు వేల చిత్రాలు తీసి చూశాను.

సంభాషణలో ఆమె సాధించేది, సామకూర్చుకునేది, పొందేది ఎంతో.
చిత్రం వాస్తవం.

అమె ఇప్పుడు పరధ్యానంలో లేదు.
ధ్యాసతోనే రెండు పనులూ చేస్తోంది.

సముఖం.
స్వయంవరం.

+++

జీవన వ్యాపకాల్లో ఇప్పుడు ఆమె ఆమెనే కాదు, అతడు అతడే కాదు, వారు వారే కాదు.
మనిషి ఇప్పుడు ఏకవచనం కానేకాదు. నిజం. మనిషిప్పుడు సహవాసి.

ఎవరి జీవన వ్యాపకాల్లో వారు ఎంత నిమగ్నమైనప్పటికీ, మరెంత ఒత్తిడిలో ఉన్నాగానీ
మనిషి మరొక మనిషి సన్నిధిలో ఉండటం ఇప్పటి దృశ్యం. దృశ్యాదృశ్యం.

+++

ఆమె సామాన్యురాలే.
తనది సామాన్యమైన సంభాషణే అనుకుంటాం.

కానీ, సరసం, పరిహాసం.
సహృదయత, సౌశీల్యం.
సమర్థన, ప్రోత్సహాం.
కోపం, తాపం. ఇంకా ఎన్నో.

మాట్లాడి చూడండి.
మీరు ఎరిగిన మనిషి మీకెంత కొత్తగా అర్థమౌతాడో, లేదా అర్థం చేయిస్తుందో.

తన.
తనతో  మాట్లాడారా?- అదే సంభాషణలోని సౌలభ్యం.
మొబైల్ ఇప్పుడు మానవ సంబంధాలని మానవీయం చేస్తున్న అపురూన వైనం.

ఆమె రంగులు చూడండి. ముక్కెర మెరవడం చూడండి.
పనిలో ఉంది. పాటలోనూ ఉంది.ఏదీ ఆగదు.
జీవితాన్ని క్షణం క్షణం అనుభవంలో వుంచుకోవడం ఒక్క స్త్రీతోనే సాధ్యం.
పరిపూర్ణ జీవన లాలస ఆమె వద్దే పదిలం.

పురుషుడి బిజినెస్ కాదీ చిత్రం.
స్త్రీ పురుషుడిని ఎంగేజ్ చేసే చిత్రం.

పురుషుడంటే ప్రపంచం అనుకుంటే స్త్రీ ప్రకృతి.
ఆమె విశ్వజనీనంగా మాట్లాడుతూనే ఉంది.

వినలేక స్విచ్ఛాఫ్ అవడం సమస్య.
అలా అని ఈ చిత్రం ఆమెదే అనుకోవద్దు.

ఒక సహజమైన జీవనచ్ఛాయకు ఆధునిక రూపం.
అనాది సంభాషణా రూపకం.

దృశ్యాదృశ్యం.
+++అనుకుంటాంగానీ తనలో తాను మాట్లాడుకుంటున్నప్పుడు కూడా మనిషి వ్యక్తి కాదు, సహచరే.
ఏదో ఒక సహజాతం. దాని వలపోత.

ఆమెనే కాదు, అతడ్ని, వారినీ, వీరిని కూడా, చివరాఖరికి మిమ్మల్ని మీరు కూడా చూసుకొని చూడండి.
ఇలాంటి దృశ్యాదృశ్యాల జాడ మీలోని నవయవ్వనాన్నిగుర్తు చేయదూ? గాంభీర్యాన్ని చెదరగొట్టదూ?

మనిషెప్పుడూ వ్యక్తి కాదు.
సాహచర్యంలోనే మనిషి వ్యక్తిత్వం నిండుగా మూర్తీభవిస్తుంది.

ఛాయ చిత్రాలు అవే చూపుతున్నై మరి!

అన్నట్టు, భుజం ఇప్పుడు మీ చెవికి మరీ దగ్గర.
అది సుతారంగా మొబైల్ ఫోన్ ను ఇముడ్చుకుని వయ్యారాలు పోవడం ఒక చిత్తరువే.

ఒకరంటారు, నా చొక్కా అంతా నీ కన్నీళ్లతో తడిసి పోయిందీ అని.
దానర్థం ఇవతలి వ్యక్తి అవతలి వ్యక్తిని ప్రత్యక్షంగా ఓదార్చినట్టు కాదు.
మొబైల్ పరామర్శ. ఆత్మీయ ఆలింగనం.

అవును.
మానవ సంబంధాలన్నీ ఇప్పుడు మొబైల్ బంధాలు కూడా.

ఒప్పుకుంటే మంచిదే. లేదన్నాసరే.
కానీ చూడండి.

ఒక చేయి మునుపటిలా వెనుకాడట్లేదని చూడండి. నిజం.
అది కన్నీళ్లను తుడిచేందుకో, ఆసన్నహస్తంగా మారేందుకో, ఆసరాగా నిలిచేందుకో, ప్రేమగా చుబుకం ఎత్తడానికో పరాకు చూపనే చూపదు.

ఈ జీవన సాదృశ్యం అదే.
కిరసనాయిలు వలే ఒక చక్కటి పరిమళం. ఒద్దికగా కొంచెం కొంచెం ఇటువంటి దృశ్యాలు మీలోకి వొంపాలనే నా  చాదస్తం. చిరునవ్వులు. ధన్యవాదాలూ.

– కందుకూరి రమేష్ బాబు

గాజు కొండ మీద

MythiliScaled

అనగనగా ఒక గాజు కొండ. దాని మీద బంగారపు కోట. కోట ముంగిట్లో ఒక ఆపిల్ చెట్టు. దానికి బంగారు రంగులో  ఆపిల్ పళ్ళు కాసేవి.   కోట లోపల ఒక  వెండి గది. దాని గోడలకి ఆనించి పెద్ద పెద్ద భోషాణాలు, వాటినిండా  వెలలేని వజ్ర వైఢూర్యాలు. అలాంటి గదులు కోటలో చాలా ఉన్నాయిగాని ఈ గదిలో మాత్రం ఒక రాజకుమారి ఉండేది. ఆమె చాలా చాలా అందంగా ఉండేది. నేలమాళిగలనిండా బంగారు కాసులు రాసులు పోసి ఉండేవి. ఒక మాంత్రికుడు ఆమె తండ్రిమీద కోపంతో రాజకుమారిని అక్కడ బంధించి ఉంచాడు. గాజు కొండ పైకి ఎక్కి ఆపిల్  పండు ఒకటి కోసి పట్టుకెళితేనేగాని  కోట తలుపులు తెరుచుకోవని అతను శపించాడు. కోటలోకి ప్రవేశించి రాజకుమారిని పెళ్ళాడి ఆ సంపదనంతా సంపాదించుకోవాలని ఎందరో వీరులు ప్రయత్నించారు. కానీ ఎవరికీ అది సాధ్యం కాలేదు. ఎంత గట్టి పట్టు ఉన్న నాడాలని గుర్రాల కాలి గిట్టలకి తొడిగినా అవి  పైదాకా ఎక్కలేకపోయేవి. నున్నటి గాజుమీద వెనక్కి  జారిపోయి లోతైన లోయలో పడిపోతూ ఉండేవి. ఒక్క వీరుడు కూడా బతికి తిరిగి రాలేదు.

కిటికీ దగ్గరే కూర్చుని ఉండే రాజకుమారికి ఇదంతా కనిపించేది. ఎవరైనా కొత్తగా కొండ ఎక్కబోతూ ఉన్నప్పుడు ఆమెకి విడుదలవుతానని ఆశ పుట్టేది. ఆ వీరులకీ ఆమెని చూస్తే ఉత్సాహం వచ్చేది. అయితే ఏమీ లాభం లేకపోయింది. అలా ఏడు సంవత్సరాలు ఆమె అలాగే ఎదురు చూస్తూ ఉంది. ఏడేళ్ళ తర్వాత ఇక ఆమె బయటికి రాలేదు, ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలి.

ఇంకొక మూడు రోజులలో ఏడేళ్ళూ పూర్తి అవుతాయనగా ఆ రోజున బంగారు కవచమూ శిరస్త్రాణమూ ధరించిన ఒక యువకుడు కొండ ఎక్కటం మొదలుపెట్టాడు. అతని గుర్రం బలంగా, చురుకుగా ఉంది. జారిపోకుండా ఉండేందుకు దానికి ప్రత్యేకంగా తయారు చేసిన నాడాలు తొడిగారు. సగం దూరం ఎక్కింది కానీ మరి చేతకాలేదు. అయితే జారకుండా జాగ్రత్తగా వెనక్కి వచ్చి ఆగింది. రెండో రోజు ఇంకా తొందరగా , నేర్పుగా ఇంచుమించు పైదాకా వెళ్ళింది. నాలుగు అడుగులు వేస్తే గుర్రం మీది యువకుడికి ఆపిల్ పళ్ళు అందేలా ఉన్నాయి. సరిగ్గా అప్పుడు ఎక్కడినుంచో భయంకరమైన రాబందు  ఒకటి ఎగిరి వచ్చింది. అది ఏనుగంత పెద్దగా ఉంది. రెక్కలతో చటుక్కున గుర్రం కళ్ళ మీద కొట్టింది. బాధతో గట్టిగా సకిలించి గుర్రం, ముందు కాళ్ళ మీద పైకి లేచింది. అంతే ! వెనకకాళ్ళకి పట్టు జారిపోయింది. గుర్రమూ దాని మీది యువకుడూ ఇద్దరూ గాజు మీద జారిపోయి లోయలోకి పడిపోయారు. చూస్తూ ఉన్న రాజకుమారి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎలాగూ తనకి విముక్తి లేదు, తనకోసం ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నందుకు ఆమెకి దుఃఖం ఆగలేదు.

glass mountain 1

ఆఖరి రోజున ఒక కుర్రవాడు వచ్చాడు. హుషారుగా సరదాగా ఉన్నాడు. చిన్నపిల్లవాడికిలాగా మొహం లేతగా ఉంది , కానీ బాగా పొడుగ్గా దృఢంగా ఉన్నాడు. అంతమందీ  ఏమీచే యలేకపోయారనీ చచ్చిపోయారనీ అతనికి తెలుసు. అయినా ధైర్యంగా తనవంతు ప్రయత్నం చేద్దామనే అనుకున్నాడు. వాళ్ళ ఊళ్ళో కమ్మరి చేత కాలివేళ్ళకీ చేతివేళ్ళకీ ఇనప గోళ్ళు తయారు చేయించుకున్నాడు. వాటిని తగిలించుకుని చాలా కొండలు ఎక్కి సాధన చేశాడు. అవన్నీ నిట్టనిలువుగా ఉన్న కొండలు, ఎక్కడా పట్టు దొరకనివి. గాజువి అయితే కావు, ఇటువంటి కొండ ఇదొక్కటే.

అతను ఎక్కటం మొదలుపెట్టాడు. ఓపికగా కాస్త కాస్తగా పైకి వెళుతున్నాడు. చూస్తుండగానే పొద్దుకుంకింది. బాగా అలిసిపోయాడు. దాహంతో గొంతు ఎండిపోతూ ఉంది. కాళ్ళకి ఇనపగోళ్ళు గుచ్చుకుపోయి రక్తం చిమ్ముతున్నాయి. చేతులతో మాత్రమే పాకగలుగుతున్నాడు. కొండ మీది ఆపిల్ చెట్టు కనబడుతుందేమోనని పైకి చూశాడు. కనిపించలేదు. కిందికి చూశాడు, అగాథమైన లోయ. తన కంటే ముందు వచ్చినవారంతా అందులోకే పడిపోయారని అతనికి తట్టింది, భయం వేసింది. చేతి గోళ్ళ పట్టు మాత్రం వదిలిపెట్టలేదు. మెల్లిగా చీకటి పడింది. బడలిక వల్ల అలాగే అక్కడే  నిద్రపోయాడు.glass mountain 2

 

అంతకుముందు రోజు యువకుడి గుర్రాన్ని కిందపడేసిన రాబందు అటువైపుగా వచ్చింది. అది మామూలు రాబందు  కాదు , పిశాచపక్షి. ఎవరూ చివరివరకూ రాకుండా  దాన్ని మాంత్రికుడే ఏర్పాటు చేశాడు. రోజూ రాత్రి వేళల్లో అది కొండ చుట్టూ చక్కర్లు కొడుతూ కాపలా కాస్తుంటుంది. ఈ నిద్రపోయే కుర్రవాడిని చూసి చచ్చిపోయాడని అనుకుంది. తినేందుకు దగ్గరికి వచ్చి ముక్కుతో పొడిచింది. అతనికి మెలకువ వచ్చింది, వస్తూనే ఒక ఉపాయం తట్టింది. రాబందు పొడుస్తున్న చోట విపరీతమైన నొప్పిగా ఉన్నా ఓర్చుకున్నాడు. దాని రెండుకాళ్ళూ గట్టిగా పట్టుకున్నాడు. అది బెదిరి పైకి ఎగిరింది. దానితోపాటు అతనూ గాలిలోకి లేచాడు. కొండ పైకంటా ఎగిరి గాలిలో గుండ్రంగా తిరుగుతోంది. అతను కళ్ళు తెరిచి చూస్తే కిందన బంగారుకోట పెద్ద దీపంలాగా కనిపిస్తోంది. రాబందు ఎగరటం లో ఒకసారి ఆపిల్ చెట్టుకి దగ్గరగా వచ్చింది. అతను తటాలున కిందికి దూకాడు. దూకబోయేముందు ఇనపగోళ్ళతో దాన్ని బలంగా కొట్టాడు. అది వికృతంగా అరుస్తూ లోయలోకి పడిపోయింది. కుర్రవాడు ఆపిల్ చెట్టు కొమ్మల్లోకి పడ్డాడు. పెద్దగా దెబ్బలేమీ తగలలేదు. ఆకలేసి రెండు పళ్ళు కోసుకుని తిన్నాడు. చేతులకి ఆ రసం అంటిన చోట గాయాలు మాయమైపోయాయి. ఇంకొక పండుకోసి ఒంటిమీద దెబ్బలు తగిలినచోటల్లా రుద్దుకున్నాడు. అన్నీ నయమైపోయాయి. బోలెడంత శక్తి వచ్చింది. మరికొన్ని పళ్ళు కోసి చేత్తో పట్టుకుని కోట దగ్గరికి వెళ్ళాడు.

glass mountain 3

 

కోట గడప  దగ్గర ఒక డ్రాగన్ పహరా కాస్తోంది. ఆపిల్ ని దానిమీదికి విసరగానే అది మాయమైంది. తలుపులు తెరుచుకున్నాయి. రంగురంగుల  పూల మొక్కలు, పళ్ళ చెట్ల మధ్యలోంచి రాజకుమారి నడిచివచ్చింది. ఆమె వెంట తల్లి, తండ్రి, పరివారం- అంతా ఉన్నారు. వాళ్ళందరికీ అప్పుడే శాపం తీరింది.ఆ కొండ మీదే వాళ్ళ రాజ్యం- చాలా పెద్దది.  చేతిలో ఉన్న పూలమాలని కుర్రవాడి మెడలో వేసింది. అతనికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంది. రాజకుమారి ఎంత అందమైనదో అంత మంచిది కూడా. ఆమెతో అతను చాలా సంతోషంగా ఉన్నాడు.

 

మరుసటి  రోజు  వాళ్ళిద్దరూ తోటలో తిరుగుతుండగా గాజు కొండ కింద పెద్ద కలకలం వినబడింది. ఆ రాజ్యం లో వానకోయిలలు అన్ని చోట్లకీ ఎగిరి వెళ్ళి వచ్చి  వార్తలు చెబుతూ ఉంటాయి. కుర్రవాడు ఈల వేసి ఒక వానకోయిలని పిలిచి సంగతి ఏమిటో కనుక్కురమ్మన్నాడు.

 

అది వచ్చి చెప్పింది- ” రాబందు లోయలోకి పడినప్పుడు దాని రక్తపు చుక్కలు చనిపోయిన వీరులందరిమీదా పడ్డాయి. వాళ్ళు వాళ్ళ గుర్రాలతో సహా ఒక్కొక్కరే బతికి లేస్తున్నారు. ఆశ్చర్యంగా, ఆనందంగా ఎవరి ఊళ్ళకి వాళ్ళు బయలుదేరుతున్నారు. అదీ ఆ హడావిడి . ”

                                                                                               [  పోలండ్ జానపద కథ]

                                                                         సేకరణ- Hermann Kletke, Andrew Lang

 

 

కారామాస్టారు@90

Kalipatnam_Ramaraoఒక కధ కధాశిల్పానికి నమూనాయై  చరిత్రలో మిగిలి పోతుంది. ఒక  కధ కధా సౌష్టవానికి వ్యాకరణం అందిస్తుంది. ఒక  కధ కధా సాహిత్యంలో మైలురాయిగా మిగిలిపోతుంది. ఒక  కధ చదువరుల  ప్రాపంచిక దృక్పధాన్ని మార్చివేస్తుంది. కొత్త రచయితలు ఒకానొక  కధ చదివి, ఆ కధా బలానికి గౌరవవందనం చేసి, పెన్ను మూసేసి, తను కొనసాగించదలచిన కధా ప్రక్రియకు తాత్కాలిక  విరామం ప్రకటించి ఉత్సాహం స్థానంలో శ్రద్ద పెట్టాలని అనుకొంటారు.

“కధలు ఎలా ఉండాలి? ఎలా రాయాలి?” అనే చర్చ సర్వత్రా జరుగుతున్న ఈ  సందర్భంలో వర్ధమాన రచయితలు ఈ ప్రశ్నలకు జవాబులు ఒక నాటి మేటి కధకుల కధల నుండి పిండుకోవటం ఒక మేలైన పద్దతి. కారాగారి తొంభైయ్యవ పుట్టిన రోజు సందర్భంగా “కధ ఎలా రాయాలి అనే ప్రశ్నకు కారా గారి కధల నుండి సమాధానం” అనే అంశం మీద మీ అభిప్రాయాలను, నవంబరు 9న రాబోతున్న “సారంగా – సాహిత్య పత్రిక, కాళీపట్నం రామారావుగారి ప్రత్యేక సంచిక” కోసం రాసి పంపవలసిందిగా కోరుతున్నాము. మీ అభిప్రాయం ఒక పేజీకి పరిమితం చేస్తే చాలు. మీ వ్యాసాలను manavi.battula303@gmail.com కు అక్టోబరు 31 లోపల పంపండి.

 

పెద్రో పారమొ-6

pedro1-1

“ఆమెని అడిగాను, ఒప్పుకుంది. ప్రీస్ట్ అరవై పీసోలు అడిగాడు ముందస్తు పెళ్ళి ప్రకటనలగురించి పట్టించుకోకుండా ఉండేందుకు. వీలయినంత తొందర్లోనే ఇస్తానని చెప్పాను. దైవ పీఠాన్ని బాగు చేయడానికి కావాలన్నాడు. అతని భోజనాల బల్ల కూడా చివరిదశలో ఉందట. కొత్త బల్ల పంపిస్తానని చెప్పాను. నువెప్పుడూ ప్రార్థనకు రావన్నాడు. నువ్వొస్తావని చెప్పాను. మీనాయనమ్మ పోయనప్పట్నుంచీ దశకం చేయలేదన్నాడు. దానిసంగతి వదిలేయమన్నాను. చివరికి ఒప్పుకున్నాడు”
“డలోరిస్ నుంచి అడ్వాన్స్ ఏమన్నా అడగలేదా?”
“లేదయ్య అంత ధైర్యం చేయలేకపోయాను. నిజంగా. ఆమె సంతోషాన్ని చూసి అట్లాంటి పని ఏదీ చేయాలనిపించలేదు.”
“మరీ పసిపిల్లాడిలా ఉన్నావు!”
పసిపిల్లాడని అన్నాడా? నన్ను, యాభై ఏళ్ళ నన్ను పట్టుకుని? అతన్ని చూస్తే ముక్కుపచ్చలారలేదు, నేను కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నాను. “ఆమె సంతోషాన్ని చెడగొట్టదలచలేదు.”
“ఎంతయినా నువ్వింకా పిల్లాడివే!”
“నువ్వేమంటే అదేనయ్యా!”
“వచ్చే వారం ఆ ఆల్డ్రెట్ దగ్గరికి వెళ్ళు. అతని కంచెలు సరి చూసుకోమను. మన మెదియా లూనా లోపలికి జరిపాడని చెప్పు.”
“కొలతలన్నీ పొరపాటు లేకుండా బాగానే కొలిచాడు. ఆ సంగతి నేను కచ్చితంగా చెప్పగలను”
“సరే, పొరపాటు చేశాడని చెప్పు. లెక్కల్లో తేడా వచ్చిందను. అవసరమయితే ఆ కంచెలు పీకేయించు.”
“మరి చట్టం?”
“ఏం చట్టం ఫుల్గోర్? ఇకనుంచీ మనమే చట్టం. మెదియా లూనాలో పనిచేసే వాళ్లలో ఎవరన్నా గట్టివాళ్ళున్నారా?”
“ఒకరిద్దరున్నారు.”
“ఆల్డ్రెట్ సంగతి చూడ్డానికి వాళ్లను పంపు. నువ్వొక ఫిర్యాదు రాయి అతను మన నేలను ఆక్రమించుకున్నాడనో లేకపోతే నీ ఇష్టమొచ్చిందేదో. లూకాస్ పారమొ చనిపోయాడని అతనికి గుర్తు చేయి. ఇకనుంచీ వ్యవహారమేదో నాతోనే తేల్చుకోవాలని చెప్పు.”
ఇంకా నీలంగా ఉన్న ఆకాశంలో కొద్ది మబ్బులే ఉన్నాయి. పైనెక్కడో గాలి రేగుతున్నట్లుంది కానీ కింద నిశ్చలంగానూ, వేడిగానూ ఉంది.

అతను మళ్లీ కొరడా పిడితో తట్టాడు. తీయాలని పేద్రో పారమొకి అనిపించిందాకా వేరెవరూ తలుపు తీయరని తెలిసినా తనొచ్చినట్లు తెలియజేయడానికి. తలుపు పైన ఉన్న రెండు ముడులుగా చుట్టిన అలంకారాల్ని చూసి ఆ నల్ల రిబ్బన్లు బావున్నాయనుకున్నాడు, ఒకదానికొకటి.
అప్పుడే తలుపు తెరుచుకుంది. అడుగు లోపలికి పెట్టాడు.
“రా ఫుల్గోర్! ఆ టోర్బియో ఆల్డ్రెట్ సంగతి ముగిసినట్లేనా?”
“ఆ పని అయిపోయిందయ్యా!”
“ఇంక ఫ్రెగోసస్ విషయమొకటి ఉంది. ప్రస్తుతానికి అది వదిలేద్దాం. నా హనీమూన్ తో తీరికే దొరకడం లేదు.”

“ఈ పట్టణమంతా ప్రతిధ్వనులతో నిండిపోయింది. అవి ఈ గోడల వెనకో, కిందపరిచిన బండరాళ్ల కిందో ఇరుక్కుపోయినట్టు ఉన్నాయి. నువ్వు నడుస్తున్నప్పుడు ఎవరో నీవెనకే ఉన్నట్టూ, నీ అడుగులో అడుగు వేస్తున్నట్టూ ఉంటుంది. మర్మర ధ్వనులు వినిపిస్తాయి. ఇంకా జనాలు నవ్వుతున్నట్టు. అలసిపోయినట్టుగా వినిపించే నవ్వులు. యేళ్ళు అరగదీసిన గొంతులు. అలాంటి శబ్దాలు. కానీ ఆ శబ్దాలన్నీ మాయమయే రోజు వస్తుందనుకుంటాను”
పట్టణం గుండా మేం నడుస్తున్నప్పుడు నాతో డమియాన సిస్నెరోస్ చెప్తూ వస్తున్నదదీ.

“ఒకప్పుడు రాత్రి తరవాత రాత్రి జాతర జరుగుతున్న శబ్దాలు వినిపించేవి. మెదియాలూనా దాకా స్పష్టంగా వినగలిగేదాన్ని. ఆ గోలంతా ఏమిటో చూద్దామని ఇక్కడిదాకా వస్తే నాకు కనిపించేదేమిటంటే ఇప్పుడు మనం చూస్తున్నదే. ఏమీ లేదు. ఎవరూ లేరు. ఇప్పటిలాగే ఖాళీగా ఉన్న వీధులు.
“తర్వాత ఏమీ వినిపించేది కాదు. నీకు తెలుసుగా సంబరాలు చేసుకునీ చేసుకునీ అలసిపోతాం. అందుకే అది ముగిసినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు.
“అవును,” డమియానా సిస్నెరోస్ మళ్లీ అంది “ఈ పట్టణమంతా ప్రతిధ్వనులతో నిండిపోయింది. నాకిప్పుడు భయం వేయదు. కుక్కల అరుపులు వినిపిస్తాయి, వాటినలా అరవనిస్తాను. బాగా గాలిగా ఉన్న రోజుల్లో చెట్లనుంచి రాలిన ఆకులు కొట్టుకుని వస్తాయి. ఇక్కడ చెట్లు లేవన్న విషయం ఎవరికయినా కనిపిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు ఉండి ఉండాలి. లేకపోతే ఆకులెక్కడ్నుంచి వస్తాయి?
“అన్నిటికంటే పాడుసంగతి ఏమిటంటే ఎవరో మాట్లాడుతున్నట్టు వినపడతాయి. ఆ గొంతులు ఏ సందుల్లోంచో వస్తున్నట్లు వినపడుతుంది. కానీ ఆ గొంతులు ఎవరివో చెప్పగలిగేంత స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడే ఇక్కడికి వస్తున్నప్పుడు దారిలో దినం చేయడం కనిపించింది. దైవ ప్రార్థన చేద్దామని ఆగాను. నేను ప్రార్థిస్తుండగా ఒకామె మిగతా జనాన్నుండి విడివడి నావైపు వచ్చి ‘డమియానా నాకోసం ప్రార్థించు డమియానా!’ అంది.
“ఆమె మొహాన ముసుగు జారి ఆమె మొహం కనపడగానే గుర్తు పట్టాను. ఆమె నా అక్క సిక్స్టినా.
“’నువ్వేం చేస్తున్నావిక్కడ?’ ఆమెనడిగాను.
“అప్పుడామె పరుగెత్తుకుని వెళ్ళి మిగతావాళ్ల వెనక దాక్కుంది.
“నీకు తెలియదేమో, మా అక్క సిక్స్టినా నాకు పన్నెండేళ్ళప్పుడే చనిపోయింది. అందరికంటే పెద్దది. మేము పదహారుమందిమి. నువ్వే లెక్క చూసుకో ఇప్పటికి ఆమె చనిపోయి ఎన్నాళ్లయిందో!. ఇంకా ఈలోకంలోనే తిరుగుతూంది. కాబట్టి నీకు కొత్త ప్రతిధ్వనులు వినపడితే ఏం భయపడకు హువాన్ ప్రెసియాడో!”
“నేను వస్తున్నట్టు నీకు మా అమ్మేనా చెప్పింది?” నేను అడిగాను.
“కాదు. ఇంతకీ మీ అమ్మకి ఏమయింది?”
“ఆమె చనిపోయింది” బదులిచ్చాను.
“చనిపోయిందా? ఎలా?”
“ఏమో నాకు తెలియదు. బహుశా దిగులేమో! ఎప్పుడూ నిట్టూర్పులు విడుస్తూ ఉండేది.”
“అయ్యో! ప్రతి నిట్టూర్పుతోటీ నీ జీవితంలో ఒక్కో బొట్టూ జారిపోతూ ఉంటుంది. అయితే చనిపోయిందన్నమాట!”
“అవును. నీకు తెలుసనుకున్నాను.”
“నాకెట్లా తెలుస్తుంది? ఆమె కబురందక కొన్నేళ్ళయింది.”
“మరి నీకు నా సంగతెలా తెలుసు?”
డమియానా బదులీయలేదు.
“నువు బతికే ఉన్నావా డమియానా? చెప్పు డమియానా?”
అకస్మాత్తుగా ఆ ఖాళీ వీధుల్లో నేను ఒంటరిగా నిలబడి ఉన్నాను. కప్పులు లేని ఇళ్ల కిటికీల్లోంచి ఎత్తుగా పెరిగిన కలుపు మొక్కలు కనిపిస్తున్నాయి. దాచలేని కప్పు కింద పొడవుతున్న ఇటుక గోడలు.
“డమియానా!” పిలిచాను. ‘డమియానా సిస్నెరోస్!”
ప్రతిధ్వని బదులిచ్చింది “…ఆనా….నెరోస్…ఆన..నెరోస్”

కుక్కలు అరవడం వినిపించింది. నేనే వాటిని లేపినట్టు. ఒకతను వీధి దాటటం చూశాను.
“ఓయ్, నిన్నే” పిలిచాను.
“ఓయ్, నిన్నే” నా గొంతే వెనక్కి వచ్చింది.
పక్క మలుపులోనే మాట్లాడుకుంటున్నట్టు ఇద్దరు ఆడవాళ్ళ మాటలు వినవచ్చాయి.
“చూడు ఇటు ఎవరొస్తున్నారో! అది ఫిలోటియొ అరేచిగా కాదూ?”
“అవును అతనే. అతన్ని గమనించనట్టు నటించు.”
“అంతకంటే మేలు, ఇక్కడినుంచి పోదాం పద! అతను మనవెంట పడితే మనలో ఒకరినుంచి ఏదో ఆశిస్తున్నట్టు. మనలో ఎవరి వెనక పడుతున్నానుకుంటున్నావు?”
“నీ వెనకే అయ్యుండాలి.”
“కాదు, నా లెక్కప్రకారం నీ వెనకే.”
“మనం పారిపోవలసిన పని లేదు. అతనా మలుపు దగ్గరే ఆగిపోయాడు.”
“అయితే మన ఇద్దరిలో ఎవరమూ కాదన్నమాట. చూశావా!”
“కానీ అయి ఉంటే? అప్పుడేమిటి?”
“లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు.”
“కాకపోవడమే మంచిదయింది. డాన్ పేద్రోకి అమ్మాయిలని ఏర్పాటు చేసేది అతనే అంటారంతా. మనం తప్పించుకున్నాము.”
“అవునా? ఆ ముసలాడితో శొంటి నాకు లేకపోవడమే మేలు.”
“మనం ఇక వెళ్ళడం మంచిది.”
“అవును. ఇంటికి పోదాం.”

రాత్రి. అర్థరాత్రి దాటి చాలాసేపయింది. ఇక ఆ గొంతులు:
“ఈ ఏడు మొక్కజొన్న పంట బాగా పండితే నీ అప్పు తీరుస్తాననే చెప్తున్నాను.అది చేతికి అందిరాకపోతే నువు కొనాళ్ళు ఆగవలసిందే!”
“నేనేమీ బలవంతపెట్టడం లేదు. ఎంత ఓపిక పట్టానో నీకు తెలుసు. కానీ అది నీ పొలం కాదు. నీది కాని పొలంలో పని చేస్తున్నావు. మరి నా అప్పు తీర్చడానికి డబ్బెక్కడి నుంచొస్తుంది?”
“అది నా పొలం కాదన్నదెవరు?”
“పేద్రో పారమోకి అమ్మావని విన్నాను.”
“నేను అతని దరిదాపులకి కూడా పోలేదు. అదింకా నా పొలమే.”
“అని నువ్వంటున్నావు. జనాలంతా అది అతనిదంటున్నారు.”
“ఏదీ ఆ మాట నాతో అనమను.”
“చూడు గెలీలియో! మనలో మాట, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత కాదన్నా నా చెల్లి భర్తవి. ఆమెను నువ్వు బాగా చూసుకోవడంలేదని ఎవరూ అనగా నేను వినలేదు. కానీ ఆ పొలం నువ్వు అమ్మలేదని మాత్రం నాకు చెప్పబోకు.”
“ఎందుకు చెప్పను? అది నేను ఎవరికీ అమ్మలేదు.”
“అది పేద్రో పారమోకి చెందుతుంది. ఆ అర్థం వచ్చేటట్లే నాతో అన్నాడు. డాన్ ఫుల్గోర్ వచ్చి నిన్ను కలవలేదా?”
“లేదు.”
“అయితే రేపు తప్పకుండా ఇక్కడికి వస్తాడు. రేపు కాకపోతే త్వరలోనే ఒక రోజెప్పుడో!”
“అయితే మా ఇద్దరిలో ఒకడికి చావు రాసి పెట్టి ఉంది. అతని ఆటలు నా దగ్గర సాగవు.”
“వదిలేసి ప్రశాంతంగా ఉండు బావా! ఎందుకయినా మంచిది.”
“నేనెక్కడికీ పోను, చూస్తూండు. నాగురించి కంగారు పడకు. మా అమ్మ డక్కామొక్కీలు తినిపించే పెంచింది గట్టివాడిగా.”
“సర్లే, రేపు చూద్దాం. ఫెలిసిటాస్ కి రాత్రి భోజనానికి రానని చెప్పు.తర్వాత ‘అతను చనిపోయే ముందు రాత్రి నేను అతనితోనే ఉన్నాను’ అని చెప్పుకునే బాధ తప్పుతుంది.”
“చివరి క్షణంలో మనసు మార్చుకుంటే రా, నీకోసం అట్టేపెడతాం.”
దూరమవుతున్న అడుగుల చప్పుడు కాలి బూట్ల ముళ్లచక్రాల గలగలల్లో కలిసిపోతూ ఉంది.

“రేపు పొద్దున్నే వేకువజామున నాతో వస్తున్నావు చోనా. జట్టునంతా సిద్ధం చేశాను.”
“మరి మానాన్న తట్టుకోలేక చచ్చిపోతే ఏం చెయ్యాలి? ఈ వయసులో.. నామూలాన ఆయనకి ఏమయినా అయితే నేను భరించలేను. ఆయన బాగోగులు చూడవలసినదానిని నేనొక్కదాన్నే కదా? ఇంకెవరున్నారు? ఆయన్నించి లాక్కెళ్ళడానికి ఎందుకంత తొందర నీకు? కొన్నాళ్ళు ఆగు. ఎన్నాళ్ళో బతకడు.”
“పోయిన ఏడూ అదే చెప్పావు. అవకాశం తీసుకోవడం లేదని ఎత్తిపొడిచావు. అప్పుడేమో ఈ పనులన్నిటితో విసిగిపోయి ఉన్నానన్నావు. కంచరగాడిదల్ని కట్టి సిద్ధం చేశాను. నువ్వు నాతో వస్తున్నావా లేదా?”
“నన్ను ఆలోచించుకోనివ్వు.”
“చోనా! నేను నిన్నెంత కోరుకుంటున్నానో నీకు తెలుసు. ఇంక ఆగలేను చోనా! ఏది ఏమయినా నువ్వు నాతో రావలసిందే!”
“నేను ఆలోచించుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆయన చనిపోయేదాకా మనం ఆగాలి. ఎన్నాళ్ళో పట్టదు. అప్పుడు నేను నీతో వస్తాను. మనం లేచిపోవలసిన అవసరం ఉండదు.”
“అది కూడా చెప్పావు సంవత్సరం క్రితం.”
“అయితే?”
“చోనా, నేను కంచరగాడిదలు బాడిగకి తీసుకోవలసి వచ్చింది. అవి తయారుగా ఉన్నాయి. నీకోసమే ఎదురుచూస్తున్నాయి. ఆయన బతుకు ఆయన్ని బతకనివ్వు. నువు అందగత్తెవి. వయసులో ఉన్నావు. ఏ ముసలమ్మో వచ్చి ఆయన్ని చూసుకుంటుంది. దయగల తల్లులు లోకంలో చాలామందే ఉన్నారు”
“నావల్ల కాదు.”
“అవుతుంది.”
“కాదు. అది నన్నెంత బాధిస్తుందో నీకు తెలుసు. ఆయన నా కన్నతండ్రి.”
“ఇక నేను చెప్పేదేం లేదు. నేను హూలియానా దగ్గరికి పోతున్నాను. తనకి నేనంటే తగని పిచ్చి.”
“సరే. నువు పోవద్దని నేను చెప్పను.”
“అయితే రేపు నా మొహం చూడవా?”
“లేదు. నిన్నెప్పటికీ చూడాలనుకోవడం లేదు.”

శబ్దాలు. గొంతులు. గొణుగుళ్ళు. దూరపు పాట:
లేసు అంచుల రుమాలిచ్చిపోయావా ప్రియతమా
నాకన్నీళ్ళు తుడుకునేందుకు
ఉచ్ఛస్వరాలు. ఆడవాళ్లెవరో పాడుతున్నట్టు.

బళ్ళు కిరకిరలాడుతూ పోవడం చూశాను. నెమ్మదిగా కదులుతున్న ఎడ్లు. చక్రాల కింద నలుగుతున్న రాళ్ళు. నిద్రకి తూగున్నట్టున్న మగాళ్ళు.
… ప్రతి ఉదయమూ ఆ పట్టణం దాటిపోయే బళ్ళ మూలాన వణుకుతుంది. అవి ఉప్పూ, మొక్కజొన్న కండెలూ,పశువుల దాణా వేసుకుని ఎక్కడెక్కడినుంచో వస్తాయి. కిటికీలు దడదడలాడి లోపలి జనాలు లేచేదాకా చక్రాలు కిర్రుమని మూలుగుతుంటాయి. ఆవం తెరిచే సమయం కనక అప్పుడే కాల్చిన రొట్టె వాసన చూడగలవు. హటాత్తుగా ఉరుముతుంది. వాన, వసంతకాలం వచ్చిందేమో! ఆ ఆకస్మికాలకి నువ్వు తొందరలోనే అలవాటు పడతావు కొడుకా!”
వీధుల్లోని నిశ్శబ్డాన్ని చిలుకుతూ ఖాళీ బళ్ళు. రాత్రి చీకటి దారుల్లో కలిసిపోతూ. ఇంకా నీడలు. నీడల ప్రతిధ్వని.
వెళ్ళిపోదామనుకున్నాను. నేను వచ్చినదారి కొండల పైదాకా పోల్చుకోగలుగుతున్నాను. అది కొండల నల్లదనంలో తెరుచుకున్న గాయంలా కనిపిస్తుంది.
అప్పుడెవరో నాభుజాన్ని తాకారు.
“నువ్విక్కడ ఏం చేస్తున్నావు?”
“నేను ..” ఎవరిని చూడడానికొచ్చానో ఆ పేరు చెప్పబోయి ఆగిపోయాను. “ నేను మా నాన్నను చూడటానికి వచ్చాను.”
“లోపలికి రారాదూ?”
“లోపలికి వెళ్ళాను. సగం కప్పు ఇంట్లోకే కూలిపోయి ఉంది. నేలమీదే కప్పు. మిగతా సగంలో అతనూ, ఆమే.
“మీరు చనిపోయారా?”
ఆమె నవ్వింది. అతను తీక్షణంగా చూస్తున్నాడు.
“బాగా తాగినట్టుంది.” అతనన్నాడు.
“భయపడ్డాడులే!” ఆమె అంది.
ఒక నూనె పొయ్యి ఉంది. ఎర్ర మంచం, ఈమె దుస్తులు పడేసిన మోటు కుర్చీ. పుట్టినప్పుడున్నంత నగ్నంగా ఉంది ఆమె. అతను కూడా.
“ఎవరో మా తలుపుకి తలకొట్టుకుంటూ మూలుగుతున్న చప్పుడు వినవచ్చింది. తీసి చూస్తే నువ్వు. ఏమయింది నీకు?”
“చాలా జరిగాయి. నాకయితే నిద్రపోవాలనే కోరిక తప్ప మరేం లేదు.”
“ఆ నిద్రే పోతూ ఉన్నాం.”
“అయితే పడుకుందాం పదండి!”

ఈజిప్టులో ‘ఈశాని’ పూజ!

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

జూలియస్ సీజర్ తనను దేవుడిగా ప్రకటించుకుని, గుడి కట్టించుకోవడం; రోమ్ ను సామ్రాజ్య దశవైపు మళ్ళించడం ఒక దానితో ఒకటి సంబంధం లేనివి కావు. రెండింటిలోనూ ఉన్నది ఒకటే…అది వ్యక్తి ప్రాధాన్యం. వ్యక్తి రాజకీయ సామ్రాజ్యానికి అధికారకేంద్రం అయినట్టే, ఆస్తిక సామ్రాజ్యానికీ అవుతున్నాడు. గణతంత్రవాదులు సీజర్ ను చంపగలిగారు కానీ గణతంత్రాన్ని మాత్రం బతికించుకోలేక పోయారు. సీజర్ వరవడిలోనే రోమ్ క్రమంగా సామ్రాజ్యదశవైపు అధికారికంగా మళ్ళిపోయింది.

అయితే ఇక్కడ కొంత తేడా ఉంది. సీజర్ దేవుడిగా అవతరించినా అప్పటికి అనేకమంది దేవీ, దేవతలలో ఒకడు మాత్రమే. కానీ రాజకీయ సామ్రాజ్యంలో మాత్రం చక్రవర్తి ఏకైకుడు. ఆస్తికరంగాన్ని కూడా అలాంటి సామ్రాజ్యంగా మార్చడానికి మరికొంత కాలం పట్టింది. అందులో రోమన్లు పోషించిన కీలక పాత్ర గురించి చెప్పుకోబోయే ముందు కొంత పూర్వచరిత్రలోకి వెళ్ళడం అవసరం.

పురాచరిత్రలో ఒక ముఖ్యమైన తెగ అసీరియన్లు. వీరు మొదట్లో మెసపొటేమియాలోని బాబిలోనియా సామ్రాజ్యానికి ఉత్తర, తూర్పు దిక్కులలో సన్నని పీలికలా ఉండే టైగ్రిస్ నదీలోయలో ఉండేవారు. లోపలికి అంత తేలిగ్గా చొరడానికి వీలు లేని విధంగా ఆ లోయ చుట్టూ కొండలు. అసీరియన్లు క్రూరత్వానికి మారు పేరు. వీరి దేవుడు ఆసూర్. ఆ దేవుడి పేరు మీదనే వీరు ఆసూరు అనే నగరాన్ని, ఆ తర్వాత నినవే అనే నగరాన్ని కట్టుకున్నారు. మన పురాణ, ఇతిహాస ప్రసిద్ధులైన అసురులతో ముడిపెట్టుకుని అసీరియన్ల గురించి చెప్పుకోవలసిన ఆసక్తికరమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. వాటిని అలా ఉంచి ప్రస్తుతానికి వస్తే…

కాలక్రమంలో గొప్ప సైనిక శక్తిగా ఎదిగిన ఆసీరియన్లు క్రీ.పూ. 745 నాటికి బాబిలోనియాను ఆక్రమించుకున్నారు. బాబిలోనియా అప్పటికి అత్యధిక జనాభాతో, నినవే కన్నా చాలా పెద్ద నగరం. అక్కడి ప్రధాన దైవం బెల్ మర్దుక్. ఆసీరియన్లు ఆసూర్ అనే దేవుడిని కొలిచే వారే అయినా, బెల్ మర్దుక్ పై కూడా భక్తిప్రపత్తులు చాటుకునేవారు. మర్దుక్ పూజారులనే కాకుండా, బాబిలోనియాలోని వర్తకలను కూడా మర్యాదగా చూసేవారు. అంతేకాదు, శత్రువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన చరిత్ర తమకు ఉన్నా ప్రజలతో మాత్రం సామరస్యంగా ఉండేవారు. వాళ్ళ మనసు గెలుచుకోడానికి ప్రయత్నించేవారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, విజేతలు విజితులను(ఓడిపోయినవారిని) తమలో లీనం చేసుకోవడం కాక, తామే విజితులలో, వారి విశ్వాసాలలో కలసిపోవడం అప్పటి విధానం. అసీరియన్లలో సర్దనాపలస్ అనే పాలకుడు పూర్తిగా బాబిలోనియన్ గా మారిపోవడమే కాదు, ఆ నగరాన్ని గొప్ప మేధోనగరంగా తీర్చిదిద్దాడు. అప్పట్లోనే అతను మట్టి పలకల రూపంలో ఉండే పుస్తకాలతో పెద్ద గ్రంథాలయాన్ని అభివృద్ధి చేశాడు.

అయితే, నూట యాభై ఏళ్ల తర్వాత, క్రీ. పూ. 606లో మెసపొటేమియా ఆగ్నేయదిశనుంచి సెమెటిక్ జాతికి చెందిన చాల్దియన్లు, ఈశాన్య దిశనుంచి పర్షియన్లుగా గుర్తింపు పొందిన ఆర్యులైన మీదులు చుట్టుముట్టేసరికి ఆసీరియన్ రాజ్యం కుప్పకూలింది. ఉత్తరదిశలో నినవే నగరాన్ని కూడా కలుపుకుంటూ సియాక్జెరెస్ నాయకత్వంలో మీదుల రాజ్యమూ, బాబిలోనియాలో చాల్దియన్ రాజ్యమూ అవతరించాయి. మీదుల రాజ్యం తూర్పున భారతదేశ సరిహద్దుల దాకా విస్తరించింది.

చాల్దియన్లలో చివరి పాలకుడైన నబోనిడస్ విజ్ఞానవ్యాప్తిలో అసీరియన్ పాలకుడైన సర్దనాపలస్ ను కూడా మించిపోయాడు. పురాచరిత్ర మీద అతను పరిశోధనలు చేయించాడు. అప్పటికి రెండు వేల ఏళ్ల క్రితం బాబిలోనియాలో అక్కాడియన్ సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి సారగాన్ రాజ్యకాలాన్ని పరిశోధింపజేసి, నిర్ధారణ చేయడం ఆయన చేసిన పనుల్లో ఒకటి.

అదే సమయంలో నబోనిడస్ ఒక అనాలోచితమైన పని కూడా చేశాడు. అది చివరికి అతని రాజ్యానికే ఎసరు పెట్టింది. అదెలా జరిగిందంటే, బాబిలోనియా జనంలో అనైక్యతా ధోరణులు నానాటికీ పెరుగుతుండడం నబోనిడస్ గమనించాడు. ఆ రోజుల్లో ప్రజల లౌకిక, మత జీవితాలు రెండింటికీ దేవుడే కేంద్రబిందువుగా ఉండేవాడు. దేవుళ్ళ నందరినీ ఒక చోట చేర్చితే జనంలో ఐక్యత ఏర్పడుతుందని నబోనిడస్ అనుకున్నాడు. ఎక్కడెక్కడ ఉన్న స్థానిక దేవతల నందరినీ బాబిలోనియా నగరానికి రప్పించి, వారికి అక్కడ దేవాలయాలు నిర్మింపజేయడానికి ప్రయత్నించాడు. రాజ్యంలో ప్రధాన దైవం బెల్ మర్దుక్ కనుక ఆ దేవుడి పూజారులు మంచి పలుకుబడీ, ప్రాభవాలతో మిగిలిన పూజారులకంటే ఉన్నతస్థితిలో ఉండేవారు. నేటి మన తిరుమల పూజారుల్లా అన్నమాట. స్థానిక దేవుళ్ళ నందరినీ రాజధానిలో కేంద్రీకరించి మర్దుక్ పక్కనే చోటు కల్పించే నబోనిడస్ ప్రయత్నం వారికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.

దాంతో వారు నబోనిడస్ నే పక్కకు తప్పించాలని పథకం వేశారు. పొరుగునే మీదు రాజ్యాన్ని ఏలుతున్న పర్షియన్ పాలకుడు సైరస్ తో కుమ్మక్కయ్యారు. సైరస్ బాబిలోనియా మీదికి యుద్ధానికి వచ్చాడు. కోట గోడల అవతల ఇరు సైన్యాలకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సైరస్ దే పైచేయి అయింది. అంతలో కోట ద్వారాలు తెరచుకున్నాయి. సైరస్ తన సైన్యంతో లోపలికి ప్రవేశించాడు. అతనికి అక్కడ ఎలాంటి ప్రతిఘటనా ఎదురుకాలేదు.

బైబిల్ కథనం ప్రకారం, ఆ సమయంలో యువరాజు బెల్షజ్జర్ విందు ఇస్తున్నాడు. అంతలో ఒక చెయ్యి ప్రత్యక్షమై గోడ మీద నిప్పు కణికల్లా వెలిగే అక్షరాలతో కొన్ని మార్మికమైన మాటలు రాసింది. అవి అర్థం కాని యువరాజు అప్పటికప్పుడు డేనియల్ అనే ప్రవక్తను రప్పించి వాటి అర్థం చెప్పమని కోరాడు. ‘దేవుడు మీ రాజ్యానికి రోజులు లెక్కించాడు. మీ రాజ్యాన్ని అంతమొందించాడు. మిమ్మల్ని తాసులో పెట్టి తూచినప్పుడు మీలో ఎన్నో సుగుణాలు లోపించిన సంగతి బయటపడింది. దాంతో మీ రాజ్యాన్ని మీదులకు, పర్షియన్లకు ఇవ్వాలని నిర్ణయించాడు’ అని డేనియల్ ఆ మాటలకు అర్థం చెప్పాడు.

ఆ రోజు రాత్రే బెల్షజ్జర్ ను హత్య చేశారు. నబోనిడస్ ను బందీగా పట్టుకున్నారు. ఆ విధంగా పర్షియన్ల బాబిలోనియా ఆక్రమణ ఎంత ప్రశాంతంగా, చడీచప్పుడు లేకుండా జరిగిపోయిందంటే, ఆ సమయంలో కూడా మర్దుక్ ఆలయంలో నిత్యపూజాదికాలు యథావిధిగా జరుగుతూనే ఉన్నాయట!

ఆ గోడమీది రాత రహస్యం బహుశా మర్దుక్ పూజారులకు తెలిసి ఉంటుందని హెచ్.జి. వెల్స్ చమత్కరిస్తారు.

Rembrandt_-_Belshazzar's_Feast_-_WGA19123

  ***

ఇంతకీ విషయమేమిటంటే, నబోనిడస్ తెలివితక్కువగా తలపెట్టి తన రాజ్యానికే ముప్పు తెచ్చుకున్న దేవుళ్ళ కేంద్రీకరణ చర్యనే అనంతర కాలంలో రోమన్లు విజయవంతంగా అమలు చేయగలిగారు. ఈ మధ్యలో కనీసం మూడు, నాలుగువందల సంవత్సరాల అంతరం ఉంది. అప్పటికి రాజకీయంగా కేంద్రీకృత అధికారానికి అలవాటు పడుతున్నట్టే, ఆస్తికరంగంలో కూడా కేంద్రీకృత ధోరణులకు జనం అలవాటు పడుతూ ఉండాలి. అయితే అప్పటికి కూడా బహురూప ఆస్తికత కొనసాగుతూనే ఉంది. నబోనిడస్ చర్య ప్రధానదైవమైన మర్దుక్ ప్రాభవాన్ని తగ్గిస్తుందన్న ఉద్దేశంతో పూజారులు వ్యతిరేకించి ఉండచ్చు కానీ, స్థానిక దేవతల అస్తిత్వం మీద వారికి వ్యతిరేకత ఉండే అవకాశం లేదు.

రోమన్లు తమ అధీనంలో ఉన్న విశాల భూభాగాలపై ఏకీకృత నాగరికతను రుద్దడానికి ప్రయత్నించలేదు. ఒక ప్రాంతానికీ ఇంకో ప్రాంతానికీ మధ్య ఎన్నో వ్యత్యాసాలు, సంస్కృతుల మధ్య అసమానతలు ఉండేవి. హెచ్.జి. వెల్స్ ఈ సందర్భంలో రోమన్ గణతంత్రాన్ని బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశంతో పోలుస్తారు. రాజ్యం అంతటా అక్కడక్కడ రోమన్ స్కందావారాలూ, కాలనీలూ ఉండేవి. వాటిలో జనం రోమన్ దేవతలను పూజించేవారు. లాటిన్ మాట్లాడేవారు. అయితే, రోమన్ ఆక్రమణకు ముందు నుంచీ ఉన్న నగరాలు, పట్టణాలలో మాత్రం జనజీవితం ఎప్పటిలానే ఉండేది. రోమన్ అధికారానికి లొంగి ఉంటూనే అక్కడి జనం తమ వ్యవహారాలను తామే నడుపుకునేవారు. తమ దేవీ దేవతలను తమ పద్ధతిలో పూజించుకునేవారు.

మత తాత్విక రంగాలలో మార్పులు లేవని కాదు, ఉన్నాయి. కాకపోతే, అవి బహురూప ఆస్తికత అనే చట్రం లోపలే జరుగుతూ వచ్చాయి. అంతకుముందు పురాతన వ్యవసాయ నాగరికతకు చెందిన జనం వందలు, వేల తరాలపాటు దేవాలయం చుట్టూ తమ జీవితాలను, ఆలోచనలను అల్లుకుని జీవించారు. మతపరమైన తంతును ఎంతో శ్రద్ధగా జరిపేవారు. నిత్యవిధులకు ఏమాత్రం భంగం కలిగినా ఏదో కీడు జరుగుతుందని భయపడేవారు. బలులు ఇచ్చేవారు. ఏదో మార్మికతా, అంతుపట్టని నిగూఢతా వారి ఆలోచనలను ఆక్రమించుకుని ఉండేవి. ఆర్యీకృత ఆధునిక ప్రపంచానికి వారి దేవతలు భయానకంగానూ, తర్కరహితంగానూ కనిపించవచ్చుకానీ, వారు మాత్రం గాఢస్వప్నంలో ఆయా దృశ్యాలను, వస్తువులను ఎంత స్పష్టంగా చూస్తామో అంత స్పష్టంగా వారిని దర్శించేవారు. వారితో మమేకమయ్యేవారు. అదొక స్వాప్నిక జగత్తు. ఆ కాలంలో సుమేరియాలో కానీ, ఈజిప్టులో కానీ ఏదైనా నగరాన్ని ఇతరులు జయించినప్పుడు మహా అయితే, అక్కడి దేవీ దేవతల పేర్లు మారేవేమో కానీ, పూజా విధానం, దాని వెనుక ఉండే స్ఫూర్తీ అలాగే ఉండేవి. స్వప్న ప్రపంచంలోని మూర్తులు మారేవే తప్ప స్వప్నం మాత్రం యథాతథంగా కొనసాగేది. తొలినాటి సెమెటిక్ విజేతలు, సుమేరియన్ల ఆలోచనా సరళి, ఆరాధనా పద్ధతులు ఒకలానే ఉండేవి కనుక సెమెటిక్ విజేతలు సుమేరియన్ల మత సంస్కృతులను దాదాపు యథాతథంగా స్వీకరించేవారు. ఈజిప్టుకు వస్తే, గ్రీకు టోలెమీల పాలనలోనూ, రోమన్ సీజర్ల పాలనలోనూ కూడా ఈజిప్టు దేవాలయాలు, పూజారివ్యవస్థ, పూజావిధానాలు ఈజిప్టువిగానే ఉండిపోయాయి.

విజేతలు, విజితులు ఒకరితో ఒకరు కలసిపోయినట్టే వారి దేవతలూ కలసిపోయేవారు. దీనినే థియోక్రేసియా అన్నారని ఇంతకుముందు చెప్పుకున్నాం. క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. దేవతల మధ్య పోలికలు లోపించి విలీనానికి అవకాశం లేనప్పుడు వారి మధ్య ఒక సంబంధాన్ని కల్పించేవారు. ఉదాహరణకు గ్రీకులు తమ ప్రాంతాన్ని ఆక్రమించుకోడానికి ముందు ఏజియన్లు అమ్మవారి రూపంలో స్త్రీదేవతను పూజించేవారు. గ్రీకులు ఆక్రమించుకున్నాక ఆ స్త్రీదేవతను ఒక పురుషదేవుడికి ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా ఇద్దరినీ విలీనం చేసుకున్నారు. అలాగే ఒక జంతు దేవతకు, పక్షి దేవతకు, సర్పదేవతకు, నక్షత్రదేవతకు, సూర్యుడికి, లేదా ఒక ఖగోళ విశేషానికి మానవ రూపమిచ్చో, లేదా యథారూపంలోనో పూజించేవారు. ఒక్కోసారి ఓడిపోయిన వారి దేవతలను క్షుద్రదేవతలుగా పరిగణించేవారు. ఆస్తిక చరిత్ర అంతా ఇలా దేవీదేవతలను ఇచ్చిపుచ్చుకోవడం, రాజీపడడం, స్థానిక దేవతలను సంస్కరించడమే నని హెచ్.జి. వెల్స్ అంటారు.

గమనించే ఉంటారు… వెల్స్ ప్రత్యేకంగా ఇక్కడ భారతదేశ చరిత్ర చెప్పడంలేదు. అయినాసరే, పైన చెప్పిన ప్రక్రియ మనదేశపు దేవీ, దేవతలకు కూడా పూర్తిగా అన్వయిస్తుంది. వేర్వేరు దేవీదేవతలను పూజించేవారు ఇరుగుపొరుగున ఉన్నప్పుడు వారిని ఏకం చేయవలసివచ్చేది. అమ్మవారి రూపంలో స్త్రీ దేవతను ఆరాధించేవారిని, పురుష దేవుణ్ణి ఆరాధించేవారిని ఏకం చేయడం; సాధారణంగా ఆ ఇరువురి దేవతల మధ్య దాంపత్య సంబంధాన్ని కల్పించడం రూపంలో జరిగేది. శక్తి, శివుడు ఇందుకు ఒక ఉదాహరణ. మన దేశంలోని అనేక ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఈ సయోధ్య సూత్రం మీద ఆధారపడే అభివృద్ధి చెందినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. భ్రమరాంబా, మల్లికార్జునస్వామీ కొలువైన శ్రీశైలక్షేత్రాన్నే తీసుకుంటే, భ్రమరాంబ మొదట్లో ఆ ప్రాంతంలోని ఆటవికులైన చెంచులు పూజిస్తూ వచ్చిన అమ్మవారి రూపమని చెబుతారు. అప్పట్లో ఆమె ఉగ్రరూపిణి కూడా. బ్రాహ్మణీయ సంప్రదాయం ఆ రూపాన్ని స్వీకరించి, సాత్వికమూర్తిగా మలచి, బహుశా చెంచుల పూజా పద్ధతులను కూడా సంస్కరించి శివుని రూపమైన మల్లికార్జున స్వామి సరసన ప్రతిష్టించింది. ఆది శంకరాచార్య శ్రీశైలక్షేత్రంలో ప్రముఖ పాత్ర పోషించారనీ, అమ్మవారి ముందు వారే శ్రీచక్రాన్ని ప్రతిష్టించారని క్షేత్రచరిత్ర చెబుతోంది. చెంచులు భ్రమరాంబను తమ ఆడబడుచుగానూ, మల్లికార్జున స్వామిని అల్లుడిగానూ చెప్పుకుంటారు. అక్కడి పూజారి వ్యవస్థలో కూడా సర్దుబాటు కనిపిస్తుంది. మల్లికార్జునస్వామి అర్చకులు బ్రాహ్మణేతరులైన జంగములైతే, అమ్మవారి అర్చకులు బ్రాహ్మణులు. శ్రీ కాళహస్తి క్షేత్రానికి కూడా ఇదేవిధమైన ఆటవిక, బ్రాహ్మణీయ సంబంధం కనిపిస్తుంది. భక్త కన్నప్ప కథ దానికి సూచన. భద్రాచల క్షేత్రం అవతరించింది కూడా ఇలాంటి సయోధ్య సూత్రం మీదే. గిరిజన మహిళ అయిన పోకల దమ్మక్కకు రాముడు కలలో కనిపించి తనకు గుడి కట్టమని కోరినట్టు స్థలపురాణం చెబుతోంది. భద్రాచలం ప్రసాదంలో విప్పపూలు కూడా ఇవ్వడం గిరిజన సంబంధాన్ని సూచిస్తుంది.

ప్రసిద్ధ దేవాలయాలు అనేకం కొండలు, గుట్టలు, అడవుల్లో ఉండడానికి కూడా అనేక కారణాలను చెప్పుకోవచ్చు. వ్యవసాయ విస్తరణలో భాగంగా ఆటవిక, గిరిజన తెగలు ఉన్న కొత్త కొత్త ప్రదేశాలకు జనావాసాలను విస్తరించేవారు. వ్యవసాయ భూమినీ, దేవాలయం ఉన్న ప్రాంతాన్నీ కూడా ‘క్షేత్రం’ అనడం రెండిటికీ ఉన్న సంబంధాన్ని సూచిస్తూ ఉండచ్చని ఇంతకు ముందు ఒక వ్యాసంలో అన్నాను. వ్యవసాయ, జనావాసాలు విస్తరించడమంటే రాజ్యం విస్తరించడమే. శ్రీశైలంలోని ఆలయమే కాక, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లో కూడా పురాతన దేవాలయాలు అనేకం ఎత్తైన, పటిష్టమైన ప్రాకారాలతో, ద్వారాలతో, బురుజులతో అక్షరాలా కోటలను తలపిస్తూ ఉంటాయి. ఆవిధంగా పుణ్యక్షేత్రం రాజులకు రెండవ రాజధానిగా ఉండేదనుకోవచ్చు. దేవుడికి చేసే ఉపచారాలు కూడా రాజోపచారాలే. స్థానిక దేవీ దేవతలను, పూజా విధానాలను సంస్కరించి, బ్రాహ్మణీయ సంప్రదాయంలో విలీనం చేయడం రూపంలో సామదాన ఉపాయాలను అనుసరిస్తూనే; అవసరమైతే, భేద, దండోపాయాలను కూడా అమలు చేసే ఏర్పాటుకు వీలుగా దేవాలయ నిర్మాణం ఉండేదనిపిస్తుంది. ఇంకొకటి ఏమిటంటే, దేవాలయం కేంద్రంగా అభివృద్ధి చెందిన పురాతన నగర రాజ్యాల సరళీ వీటిలో ప్రతిబింబిస్తూ ఉండచ్చు. ఈ మాట అంటున్నప్పుడు, ప్రాచీన సుమేరుసంస్కృతికీ, ప్రత్యేకించి దక్షిణభారత సంస్కృతికీ ఉన్న పోలికల చర్చలోకి పరుగుపెట్టాలని కీబోర్డు మీద నా వేళ్ళు ఉత్సాహపడుతున్నాయి కానీ, దాంతోపాటు పై విషయాలు అనేకం మరింత విపులంగా చెప్పుకోవలసినవి కనుక ఆ ఉత్సాహానికి కళ్ళెం వేయక తప్పదు.

పైన జంతు దేవత, సర్ప దేవత, నక్షత్రదేవత అని హెచ్. జి. వెల్స్ అన్నప్పుడు వాటితో కూడా మనకున్న సామ్యాలకు లెక్కే లేదు. కుక్కకు కాలభైరవ రూపమిచ్చి జంతురూపంలోనూ, మనిషి రూపంలోనూ కూడా కొలవడం మన దగ్గర ఉంది. అలాగే, నందిని శివునికి వాహనమైన వృషభ రూపంలోనే కాక మానవ రూపంలోనూ చెప్పుకుంటాం. విష్ణువు వాహనమైన గరుత్మంతుడు అనే పక్షి విషయంలోనూ అంతే. సర్పానికీ, సూర్యచంద్రులకీ, ఇతర ఖగోళ విశేషాలకు మానవ ఆకృతిని ఇవ్వడం మన దగ్గరా మామూలే. సర్పాన్ని యథారూపంలో పూజించడమూ ఉంది.

ఇలాంటి బహురూప ఆస్తికత మన దేశంలో సమకాలీన వాస్తవం అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన అంశం.

   ***

దేవతల కూర్పులు, చేర్పులు, మార్పుల (థియోక్రేసియా) ప్రక్రియను వెల్స్ ఈజిప్టు నేపథ్యం నుంచి వివరిస్తారు. ఇందులో దొర్లే దేవీ, దేవతల పేర్లు కొత్తగా అనిపించి ఆసక్తి గొలపక పోవచ్చు కానీ, వారిలో మన దేవీ, దేవతల పోలికలను పట్టుకుంటూ వెడితే ఆసక్తిని కలిగించవచ్చు.

ఈజిప్టు నగరరాజ్యాల దశనుంచి, ఐక్య సామ్రాజ్యంగా అభివృద్ధి చెందే క్రమంలో థియోక్రేసియా పెద్ద ఎత్తున సంభవించింది. వారి ప్రధాన దైవం ఓసిరిస్. ఈజిప్టు చక్రవర్తి(ఫారో) భూమి మీద ఈ దేవుడి ప్రతిరూపం. ఓసిరిస్ బలులు స్వీకరించే పంటల దేవుడు. విత్తనాన్ని భూమిలో పాతిపెట్టడం, దానినుంచి మళ్ళీ మొక్క రావడం –చావు, పుట్టుకల చక్రానికి ప్రతీకగా చెబుతారు. ఈ పంటల దేవుడు కూడా అంతే. చచ్చి మళ్ళీ పుట్టడమంటే, మృత్యుంజయత్వమే. ఆవిధంగా ఓసిరిస్ మృత్యుంజయుడు. మన శివుడు కూడా మృత్యుంజయుడు. ఈ మృత్యుంజయత్వాన్నే మనం అమరత్వం అంటాం. ఈ అమరత్వం అనే భావనను ఈజిప్షియన్లే ప్రపంచానికి పరిచయం చేశారని వెల్స్ అంటారు. అందుకు ప్రత్యేకమైన సామాజిక కారణాలు కూడా ఉన్నాయి. అందులోకి తర్వాత వెడదాం. సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉంటాయి కనుక ఓసిరిస్ సూర్యుడు కూడా. ఆ తర్వాత ఓసిరిస్ ను ఎపిస్ అనే వృషభదేవుడిగా గుర్తించడం ప్రారంభించారు. అప్పుడతని అర్థాంగి ఐసిస్. ఆమె హేతర్ అనే పేరు ఉన్న గోదేవత కూడా. అంతేకాదు, ఆమె చంద్రవంక, సముద్రం నుంచి ఆవిర్భవించిన తారా కూడా. తార మన అమ్మవారి పేర్లలో ఒకటి. అమ్మవారి తల మీద, శివుని తల మీద చంద్రవంక ఉంటుంది. మన లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవిస్తుంది.

ఓసిరిస్ చనిపోయిన తర్వాత ఐసిస్ కు హోరస్ అనే కొడుకు పుడతాడు. ఇతడు మొదట్లో మన గరుత్మంతుడిలాంటివాడు. ఇతనే ఆ తర్వాత ఓసిరిస్ అవుతాడు. ఐసిస్ చంద్రవంక మీద నిలబడి కొడుకుని ఎత్తుకుని ఉన్న రూపంలో కనిపిస్తుంది. ఈ రూపం బాల వినాయకుణ్ణి ఎత్తుకుని ఉన్న పార్వతిని గుర్తుచేస్తుంది. వృషభం, సూర్యుడు, చంద్రుడు, సర్పం మొదలైనవి నాటి బహురూప ఆస్తికతకు గుర్తుగా ఈజిప్టు, మనదేశపు ఆస్తికతలలోనే కాక, పురాతన ఆస్తికతలు అన్నిటా ప్రధాన పాత్ర వహించాయి. ఎంతో ఆసక్తికర సమాచారం ఉన్న ఆ కోణంలోకి ఇప్పుడు వెళ్లలేం.

గ్రీకులు ఈజిప్టును జయించిన తర్వాత నూతనంగా నిర్మించిన అలెగ్జాండ్రియా నగరం ఈజిప్టు మతజీవితానికే కాక, హెల్లెనిక్ (పురాతన గ్రీసు, దానిని దగ్గరలో ఉన్న దీవులు, క్రీటు ద్వీపం, ఆసియా మైనర్ తీరప్రాంతం, ఇటలీ దక్షిణ ప్రాంతాలను ఇలా పిలిచేవారు) ప్రపంచ మతజీవితం మొత్తానికి కేంద్రస్థానం అయింది. మొదటి టోలెమీ చక్రవర్తి అలెగ్జాండ్రియాలో ‘సెరాపియమ్’ అనే బ్రహ్మాండమైన దేవాలయాన్ని నిర్మింపజేసి, అందులో ఒకవిధమైన త్రిమూర్తులను ప్రతిష్టింపజేశాడు. వారు: సెరాపిస్, ఐసిస్, హోరస్ లు. సెరాపిస్ మరెవరో కాదు, ఓసిరిస్-ఎపిస్ లను కలిపేసి సృష్టించిన దేవుడు. నిజానికి ఈ త్రిమూర్తులు వేర్వేరు దేవుళ్ళు కారు, ఒకే దేవుడికి భిన్న అంశలు. ఈ సెరాపిస్ నే గ్రీకుల జియస్ (ఈయన మన బ్రహ్మ దేవుడిలాంటివాడు) గానూ, రోమన్ల జూపిటర్ గానూ, పర్షియన్ల సూర్యదేవుడిగానూ గుర్తిస్తారు.

హెల్లెనిక్ ప్రభావంతో ఈ త్రిమూర్తుల ఆరాధన ఉత్తరభారతం, పశ్చిమ చైనాల వరకూ వ్యాపించిందని వెల్స్ అంటారు.

మన దేశంలో అమ్మవారిని పూజించినట్టే అసంఖ్యాక భక్తులు ఐసిస్ ను ఆరాధించేవారు. ఆ చల్లని తల్లి తమను కష్టాలు, కడగండ్ల నుంచి గట్టెక్కిస్తుందని నమ్మేవారు. ఐసిస్ అనే పేరు మన ఈశాని(పార్వతి)ని గుర్తుచేస్తూ ఉండచ్చు. ఆమె స్వర్గరాణి. దేవాలయాలలో ఆమె హోరస్ ఎత్తుకుని ఉన్న రూపంలో ఉంటుంది. ఆమె ముందు దీపారాధన చేసి, నైవేద్యాలు అర్పించేవారు. విశేషమేమిటంటే, ఐసిస్ ఆలయంలో అర్చకులు శిరోముండనం చేసుకునేవారు. బ్రహ్మచర్యం పాటించేవారు.

మన అమ్మవారి ఆలయాలలోని మనకు చిరపరిచితమైన దృశ్యాల ప్రతిబింబాన్ని ఈ వివరాలలో మీరు ఈపాటికి స్పష్టంగా పోల్చుకుని ఉండవచ్చు.

అదీ సంగతి!

 

 

మిగతా విశేషాలు తర్వాత…

-కల్లూరి భాస్కరం

 

 

 

 

తాత్విక ‘జీవధార’

karalogo
నిర్వహణ: రమాసుందరి బత్తుల

’జీవధార’ కారా కధలన్నిటిలోకీ విశిష్టమైనది. ఇది కేవలం ఒక కధ కాదు. కారా కధలన్నిటా అంతర్వాహినిగా ప్రవహించి వాటిని సుసంపన్నం చేసిన ఆయన ప్రాపంచిక దృక్పధం. ఇది ఆయన తాత్విక జీవధార.

కారా తనకాలం విసిరిన సవాలును స్వీకరించి ప్రజలపక్షం తీసుకోవడంలో ఆయన నిబధ్దత ఉంటే , తను ఏ వైపు ఉన్నాడో ఆ ప్రజల జీవితాన్ని, వారి నిత్యజీవిత సంఘర్షణను అతి సమీపంనుండి నిశితంగా గమనించి అక్షరీకరించడంలో ఆయన సంవేదన ఉంది. నక్సల్బరిలో రాజుకొని దేశమంతా కార్చిచ్చులా అల్లుకుంటున్న విప్లవోద్యమానికి ఇరుసయిన వర్గ సంఘర్షణ తాలూకు ఆనవాళ్ళను తన చుట్టూ జీవితంలో కనిపెట్టగలగడంలోనే కారా అనన్య సామాన్యమయిన ప్రతిభ ఉంది.

ఆయన ఎంచుకున్న వస్తువు నీళ్ళు. మనిషి ప్రాధమిక జీవనాధారం. అందుకే ఆయన ‘జీవధార’ అన్నాడు. అదే మానవ నాగరికతకు ఆలంబన. అందరికీ సమాన హక్కులున్న ఒక సహజ వనరు. నీరు పల్లమెరుగు. అది దాని సహజ ధర్మం.

మరి పల్లానికి ప్రవహించాల్సిన నీరు బంగళాల మీది తోటల్లోకి ఎట్లా పరిగెత్తింది? శక్తి దానిని నడిపింది?

దాహం గొన్న మనిషికీ దాన్ని తీర్చే నీటికీ మధ్య శక్తి అడ్డుగా నిలిచింది?

దాన్ని దాచి కాపాడే శక్తి ఎక్కడుంది?

ఇనుప గేటులోనా? యజమాని గొంతు లోని భావన్ని కనిపెట్టి మీదికి దూకే ’బేపి’ల్లోనా? యజమాని మాట మాత్రమే వినిపించే నరసింహులులోనా? వీళ్ళందరి మీదుగా కనిపెట్టి చూస్తున్న పోలీసులూ, చట్టాలూ, కోర్టుల్లోనా? కారా మనల్ని ఈ ప్రశ్నలు అడగడు. జవాబులూ చెప్పడు. ఆయన తన మానాన తాను ఒక జీవన చిత్రాన్ని ఆవిష్కరించి వెళ్తాడు. రక్తమాంసాలున్న మనుషుల్ని మన ముందుంచి వెళ్తాడు. వాళ్ళతో కలసి అన్వేషించడం మనపని.

తొలి యవ్వన మాధుర్యం ’సిటం’ సేపు మైమరిపించినా జీవన కాఠిన్యతను మర్చిపోని అమ్మాజీ.. బతిమాలైనా, కొట్లాడయినా బ్రతకడం ముఖ్యమని, దీనికి మంది బలం అవసరమని గుర్తించిన సత్యవతి.. పల్లెనుండి వచ్చి నగరం ఉక్కపోతకి ఉక్కిరిబిక్కిరయినా బిడ్డ ఏడుపుకు కారణం తెలుసుకొని చెమట తుడుచుకొని స్తన్యమిచ్చినంత సులువుగా పరిస్థితులనర్ధం చేసుకోగలిగిన తవిటమ్మా.. రాజీపడటం తప్పుకాదనీ, తప్పదనీ చెప్పి పోరాటాన్ని ఫలప్రదంగా ముగించగలిగిన లౌక్యమున్న అప్పాయమ్మ .. ఇంకా ఇలాంటివాళ్ళే చాలామంది పేదోళ్ళవాడలోనుండి తాగేందుకు గుక్కెడు నీళ్ళకోసం రావుగారి గేటు ముందు నిలబడతారు. గేటు లోపల కూడా స్త్రీలే. కాకపోతే వాళ్ళ పేర్లే తెలీదు. ముసలావిడా, మధ్యవయసు స్త్రీ, తెల్లపిల్ల.

రచయిత ఇక్కడే తనెటు వైపు నుండి కధ చెబుతున్నాడో చెప్పకనే చెబుతాడు. వాడలోని వాళ్ళు తనకి పరిచితులు. బంగళా తనకి అపరిచితం, పరాయి. లోపల గదిలో వాళ్ళెందుకు నవ్వుకుంటున్నారో అమ్మాజీకెంత తెలుసో మనకూ అంతే తెలుసు. అంతకుమించి వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు మనకు పరాయి. కానీ అమ్మాజీ ఎంత అవమానపడ్డదో, సత్యవతి ఎంత రోషపడ్డదో, తవిటమ్మ ఎంత బెదిరిపోయిందో మనమూ అంతే అవమానపడతాం.. రోషపడతాం.. బెదిరి పోతాం. రచయితగా కారా మనల్ని తనతో పాటు వాడలోకి తీసుకెళ్తాడు. సత్యవతి మొదటిసారి తవిటమ్మ ఇంటికి వెళ్ళినట్టుగా మనంకూడా అట్లా గోడవారగా వెళ్ళి నిలబడతాం.

ఫోటో: కూర్మనాధ్

ఫోటో: కూర్మనాధ్

వీధి కొళాయి నుండి నీరు ఝాకొడుతూ వస్తున్నప్పుడు ఒకరినొకరు పలకరించుకున్నవాళ్ళు, ధార తగ్గేసరికి వాదులాడుకోవడం మొదలెడతారు. ఇంకా సన్నబడితే తోసుకుంటారు. కడవలు తిరగబడతాయి. ఇక్కడ శాంతిభద్రతలు కాపాడ్డానికి పోలీసులొస్తారు. కోర్టులు, కేసులు. పోనీ సరిపడినన్ని నీళ్ళివ్వచ్చు కదా! సత్యవతి మాటల్లో ’ఎక్కడలేని నీళ్ళు వీళ్ళలాటోళ్ళ మొక్కలకే సాలవ్’. అవి కూడా ఎలాంటి మొక్కలూ..? ఒక పువ్వు పూయని, ఒక కాయ కాయని మొక్కలు. ఆ బంగళాలోని టాపుని మున్సిపాలిటీ వాళ్ళు కట్టెయరు. వాడలోని వాళ్ళకి ఆ బంగళా వాళ్ళు ఒక కడవ పట్టివ్వరు. ముసలమ్మ మాటల్లో ఒకసారి పట్టుకోనిస్తే రోజూ వస్తారు. అదే అలవాటవుతుంది. ఆ తర్వాత హక్కవుతుంది. అసలు అందరికీ హక్కున్న నీరు కొద్ది మంది దెట్లయింది?.. ఇక్కడే ఈ కధ ’ప్రాసంగికత’ ఉంది.

ఈ దేశంలో’అభివృద్ధి’ పేరుతో జరిగిందీ, జరుగుతున్నదీ అందరికీ చెందిన సహజ వనరులను కొందరికి దఖలు పరచడమే. పెట్టుబడి బలపడని కాలంలో మౌలిక వసతులు, పరిశ్రమల పేరుతో నెహ్రూ ఆర్ధిక నమూనా చేసింది పెట్టుబడిదారులకు కావలసిన సౌకర్యాలు అందించడమే. రావుగారు వాడలోని వాళ్ళపేరుతో నీళ్ళూ కరెంటూ తెప్పించినందువల్ల జరిగింది ఆయన స్థలాల విలువ ఒకటికి పదిరెట్లు పెరగటమే.. ఒక కారు రెండు కార్లయ్యాయి. అదే నిష్పత్తిలో ఆయన హోదా కూడా పెరిగింది. సహజంగానే మున్సిపాలిటీ వాళ్ళు బాబుగారి టాపు కట్టేయడం మానేశారు. ఇంతా జేస్తే ప్రాణావసరమైన నీళ్ళు రావుగారి తోటలో పూలు పూయని , కాయలు కాయని మొక్కల విలాసానికి ఖర్చయిపోతాయి. అందుకే నీటి విలువ తెలిసిన తవిటమ్మ “మా ఊళ్ళో ఈ మాత్తరం తోట సొంతానికుంటే ఒక కుటామం సునాయాసంగా బతికేస్తది” అనుకుంటుంది.

ఇక్కడ నీరు ధర్మం తప్పింది. ఒక్క పువ్వుకీ, ఒక్క కాయకీ నోచుకోని తోట కోసం దారి తప్పింది. ఈదేశంలో ఇది నీటికి మాత్రమే పరిమితమైంది కాదు. మూడు పంటలు పండే నల్లరేగడి భూములనుండి మొదలుకొని దట్టమైన అడవులూ, పచ్చనికొండలూ, సముద్రతీరాలూ అన్నీ వాటి సహజధర్మాల్ని వదిలిపెట్టి, కుళాయిలోని నీళ్ళు మెరక మీద బంగళాలోనికి ప్రవహించినట్టుగా, రావు గారు పనిచేసిన కంపెనీల సంపదగా మారిపోయాయి. కాకపోతే ఇప్పుడు రావుగారి వారసులకు ప్రభుత్వ సాయం అవసరంలేదు. వాళ్ళే తవ్వుకోగలరు, పైపులు వేసుకోగలరు, కరెంటు చేసుకోగలరు, వీటన్నిటికీ ఆవసరమయిన అనుమతులిచ్చే ప్రభుత్వాన్ని కూడా వాళ్ళే గెలిపించుకోగలరు.

మరి వనరుల అసలు హక్కుదారులైన ప్రజలెట్లా బ్రతకాలి? ఎక్కడికెళ్ళాలి?

ఆ అనివార్యత లోంచే వీళ్ళు బంగళాల ఇనుప గేట్ల ముందు గుమి గూడతారు. గొడవపడతారు. బంగళాల వాళ్ళకు, వాటికి కాపలా కాసే నరసింహులులాంటి వాళ్ళకూ అది దొమ్మీలా కన్పిస్తుంది. పోలీసులూ కుక్కలూ ఉండనే ఉన్నాయి. అయినా అప్పాయమ్మ ముసలావిడతో “ఒక అందం ఉందని ఇరగబాటా, ఒక సందం ఉందని యిరగబాటా, లేప్పోతే మళ్ళూ మాన్నేలూ డబ్బూ మాకు మీకన్నా ఎక్కువుండాయని యిరగబాటా, ఏటి సూసుకొని మీ ముందు యిరగబడిపోతాం’ అన్నప్పుడు తలా ఒక బిందె పట్టుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇది కేవలం తన అహం సంతృప్తి పడటం వల్లనే కాదు, ఈ గొడవను కొనసాగించడవల్ల వచ్చే పర్యవసానాల పట్ల గల సంశయం వల్ల కూడా కావచ్చు. ఇక్కడే కలవాళ్ళ భయం లేనివాళ్ళ తెగింపుతో రాజీకొస్తుంది. అయితే ఇది కేవలం తాత్కాలికం. ఇద్దరు ముగ్గురై, ముగ్గురు పదిమందై కలవాళ్ళ గేటుముందు గొడవపడక తప్పదు. ఇది ఎప్పటిదాక?

ఈ కధ రాసేనాటికి కలవాళ్ళు, లేని వాళ్ళ మధ్య గొడవను శాశ్వతం గా ముగించేందుకు ఒక పెనుగులాట మొదలైంది. ఒక యుద్ధం, ఒక పోరాటం మొదలైంది. దమ్ముంటే కుక్కను విప్పమని సవాల్ చేసిన సత్యవతి లాంటి వాళ్ళు ఆ యుద్ధానికి సైనికులయ్యారు, సేనానులయ్యారు.

కలవాళ్ళూ లేనివాళ్ళ మధ్య తగవు ఏ అంశాన్నీ వదిలిపెట్టలేదు. పదేళ్ళ కిందటి పరిచయం శేషుబాబుకీ, ఆ యింటి ఆడపిల్లలకీ ’ఓ నువ్వా’ అనే వేళాకోళం. ఇదంతా అమ్మాజీకి అవమానకరమైన సందర్భం. మనసులో ఎర్రగా బుర్రగా టెర్లిన్ షర్ట్ టక్ చేసుకున్న శేషుబాబు గురించి ఊహయినా రానివ్వని అమ్మాజీ ’సవుద్రాల్ని’ మాత్రం రావొద్దని చెప్పలేదు.

తవిటమ్మ ఊరినుండి వచ్చింది. అమ్మాజీ వాళ్ళు షరాబులు కాకపోయినా వడ్రంగం పని ఎట్లా చేస్తున్నారా అని ఆశ్చర్యపోతుంది. నగర జీవితంలో కులాల నుండి వృత్తులు వేరవడం తవిటమ్మ అనుభవంలో లేని విషయం. రావు గారి కులమేంటన్న తవిటమ్మ ప్రశ్నకి సమాధానంగా అమ్మాజీ “ఏదో పెద్ద పనే” అంటుంది. వాడలోవాళ్ళకి బంగళా వాళ్ళంతా ఒక కులమే.

ఈ దేశంలో.. ఆమాట కొస్తే ఏ దేశంలోనైనా, కొద్దిమంది కలవాళ్ళు ఆసంఖ్యాకులైన లేనివాళ్ళ మధ్య కలహం ఇప్పటిది కాదు. ఇప్పుడప్పట్లో ముగిసేదీ కాదు. ఎన్నో అంతర్బహిర్ యుద్ధాలు జరగాలి. దానికి కావలసిన పూనికను ఈ కధ విజయవంతంగా అందిస్తుంది. అందుకే ఇది కేవలం కధ కాదు. తాత్విక ’జీవధార’.

                                                                                      –యెనికపాటి కరుణాకర్

కరుణాకర్

వై కరుణాకర్ ప్రకాశం జిల్లాలో టీచరుగా పని చేస్తున్నారు. కార్టూన్లు వేయటం వీరికి ప్రియమైన విషయం. Karunacartoon.blogspot.in పేరుతో ఉన్న కరుణాకర్ గారి బ్లాగ్ లో సీరియస్ పొలిటికల్ విమర్శ, కార్టూన్ల రూపంలో ఉంటుంది. కరూణాకర్ గారు రాసిన కధా విమర్శలు గతంలో అరుణతార, సాహిత్య నేత్రం పత్రికల్లో వచ్చాయి. స్వాతంత్రం ముందు రచయితల్లో కరుణకుమార అంటే ఇష్టమట. అల్లం రాజయ్య, కొడవటిగంటి కుటుంబరావు గారు ఈయన ఇష్టమైన రచయితలు. వర్ధమాన రచయితల్లో బమిడి జగదీశ్వరరావు, ఆర్. ఎం. ఉమామహేశ్వరరావులను ఇష్టపడతారు. విమల, తెరేష్ బాబు, మద్దూరి నగేష్ బాబు, కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని కవిత్వం చాలా ఇష్టం.

వచ్చే  వారం జి.ఎస్ రామ్మోహన్ గారి “శాంతి” కధ గురించిన పరిచయం

‘జీవధార’ లింక్ ఇక్కడ: