ఆ రెండు సినిమాలు- రెండు ఆత్మగౌరవ పతాకలు!

movie-pink

వొకానొక రాత్రి పార్టీలో కలిసిన ముగ్గురు కుర్రాళ్ళతో ఆ ముగ్గురు అమ్మాయిలు, డ్రింక్స్ తీసుకుంటూ, నవ్వుతూ తుళ్ళుతూ వున్నప్పుడు జరుగుతుంది అది. చొరవ తీసుకుని, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి, లొంగదీసుకోవాలనుకుంటారు ఆ కుర్రాళ్ళు.  అమ్మాయిల్లో ధైర్యవంతురాలైన వొక అమ్మాయి, మినాల్, వేరే గత్యంతరంలేక, ప్రతిఘటిస్తున్నా వినిపించుకోని ఆ కుర్రాడిని, చేతికందిన బాటిల్తో ముఖాన కొడుతుంది. కంటి  దగ్గర గాయమై రక్తమోడుతున్న అతన్ని వదిలి, మిగతా స్నేహితురాళ్ళని (ఫలక్, ఆండ్రియా ) తీసుకుని బయట పడుతుంది.

జరిగింది పీడకలగా మరచిపోయి ముందుకు సాగిపోవాలనుకుంటారు.  కాని ఆ కుర్రాళ్ళు, వాళ్ళ మరొక స్నేహితుడు  వదిలిపెడితేగా. ఆ అమ్మాయిలకు వాళ్ళ హద్దు (ఔకాత్ అంటే స్టేటస్) ను గుర్తు  చేయాలనుకుంటారు. వాళ్ళ ఇల్లుగలాయనకు ఫోన్ చేసి వాళ్ళ చేత ఇల్లు ఖాళీ చేయించమని బెదిరిస్తారు. వాళ్ళను కూడా ఫొన్ చేసి బెదిరిస్తారు, వెంబడిస్తారు. మినాల్ నైతే కార్లోకి గబుక్కున లాక్కొని, నడుస్తున్న కారులోనే రేప్ చేసినంత పని చేస్తారు. ఇంత జరుగుతుంటే ఇక ఆ అమ్మాయిలకు ఆ కుర్రాళ్ళ  మీద పోలీసు కేసు పెట్టక తప్పని పరిస్థితి. అక్కడినుంచీ పోలీసు స్టేషన్లలో పని తీరు, వ్యవస్థ ఇవన్నీ ముందుకొస్తాయి. అభియోగి రాజవీర్ వొక రాజకీయ నాయకుడి కొడుకు. ఈ నమోదైన కేసు గురించి ముందు వారికే చెప్తారు, వారు చెప్పినట్టే పాత తేదీతో వొక కేసును ఈ అమ్మాయిల మీద (హత్యా ప్రయత్నం)  నమోదు చేస్తారు.

ఇప్పుడు ఈ విషయాన్ని చర్చకు పెట్టాలంటే కోర్ట్ రూం డ్రామా కంటే సులువు పద్ధతి యేముంది?

అప్పుడు వస్తాడు దీపక్ సెహగల్ (అమితాభ్) అన్న లాయర్. పక్క బిల్డింగులో వుంటాడు. వీళ్ళను గమనిస్తుంటాడు. మినల్ ని వాళ్ళు కారులో యెత్తుకెళ్ళిపోవడం చూస్తాడు. పోలీసుకు ఫొన్ చేసి ఫిర్యాదు చేస్తాడు. ఇప్పుడు కోర్ట్ లో వీళ్ల తరపు లాయర్.

మనకు సమాజంలో కొన్ని నమ్మకాలు, అభిప్రాయాలు బలపడ్డాయి. డ్రింక్స్ తీసుకునే అమ్మాయిలు మంచి కుతుంబంలోంచి వచ్చిన వారు కాదు, సన్స్కారవంతులు కాదు. అలాగే రాత్రి పూటలు  పార్టీలకు వెళ్ళేవారు, మగవాళ్ళతో నవ్వుతూ మాట్లాడే వాళ్ళు, జీన్స్, స్కర్ట్ లు వేసుకునేవాళ్ళు. కోర్ట్ లో గనక ఆ అమ్మాయిలు అలాంటి వారు అని నిరూపించ గలిగితే, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని, డబ్బుల దగ్గర తేడాలొచ్చి వాళ్ళల్లో వొక అమ్మాయి హత్యా ప్రయత్నం చేసిందని నిరూపించడం తేలికవుతుంది.

వొక స్త్రీ ఆమె భార్య కావచ్చు, వ్యభిచారి కావచ్చు, ప్రియురాలు కావచ్చు, యెవరైనా కావచ్చు, ఆమె వద్దన్న తర్వాత ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేదాన్ని అత్యాచారంగానే గుర్తించాలి. ఆమె “వద్దు” (నో) అంటే ఆ మాటకు వొక్కటే అర్థం. అది మగవాళ్ళంతా అర్థం చేసుకోవాలి.

ఇవీ దీపక్ కేసులో తన వాదన ముగించాక చెప్పే చివరి మాటలు.

ఈ సినిమా యే విషయం చెప్పదలచుకుంటున్నది అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా మంచి చిత్రం. అందరి నటనా (ముఖ్యంగా అమ్మాయిలది) చాలా చక్కగా వుంది. అనిరుద్ధ రాయ్ చౌధరి దర్శకత్వం కూడా చెప్పదలచిన విషయం వైపుకు కథను నడిపిస్తుంది. చూసే వారిని కట్టి పడేస్తుంది కథనం. మగవారి ఆలోచనల్లో మార్పు తేగలిగితే సినిమా విజయం సాధించినట్టే.

 

కాని కొన్ని విషయాలు వున్నాయి. దీపక్ వొక bipolar disorder తో బాధపడుతున్న వ్యక్తి. అలాంటి వాళ్ళు శరీరంలో హార్మోన్లు యెక్కువైనా, తక్కువైనా అకారణంగానే చాలా దుక్ఖంలో కూరుకుపోవడమో, కారణంలేకుండానే చాలా ఉత్సాహంగా వుండడమో చేస్తారు. అలాంటి వ్యక్తికే స్పష్టంగా అర్థం అవుతున్న విషయం, ఆరోగ్యంగా వున్న సమాజానికి యెందుకు అర్థం కాదు? వాతావరణ కాలుష్యానికి అలవాటు పడిపోయిన మనుషుల మధ్య దీపక్ మాత్రం మాస్క్ తొడుక్కునే బయటకు వెళ్తాడు. యేదో అనారోగ్యంతో బాధ పడుతున్న భార్యను ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ, వొక బాధ్యతగల భర్తగా సేవలు చేస్తుంటాడు. ఈ సందర్భం వచ్చినప్పుడు ఈ అమ్మాయిలకు న్యాయం జరగాలని వాళ్ళ తరపున కేసు వాదిస్తాడు. పితృస్వామ్యంలో ఆ అమ్మాయిలకు జరిగిన అన్యాయానికి ఇతను పితృ స్థానంలో నిలబడి సరి చేయాలనుకుంటాడు.

సినిమాలో ముగ్గురు అమ్మాయిలూ వొక రకంగా వొంటరే. వాళ్ళ ఇళ్ళ నుంచి ఈ కష్టకాలంలో తోడుగా నిలబడటానికి యెవరూ వుండరు. ఫలక్ ప్రేమిస్తున్న మనిషి కూడా ఆమెకు సపోర్టివ్వడు. తమ పనులేవో చూసుకుంటూ, తమ కాళ్ళ మీద నిలబడ్డ ఈ ముగ్గురు అమ్మాయిలూ చాలా ధైర్యం కనబరుస్తారు. కోర్ట్ లో మాత్రం బేల అయి పోతారు. యెలాంటి ధైర్యవంతులైన స్త్రీలనైనా మెడలు వంచి నిస్సహాయ పరిస్థితుల్లోకి నొక్కేసే బలమూ, తెలివి తేటలూ  వున్న వ్యవస్థ అది.

శత్రువు దుర్మార్గుడే కాదు, తెలివైనవాడు కూడా.  కోర్ట్ సీన్ లో రాజవీర్ తన సహజ స్వభావం బయటపడేలా మాట్లాడటంతో కేసు తేలిపోతుంది. ఎమోషనల్ గా కాకుండా తెలివిగా ప్రవర్తించి వుంటే కేసు ఇంత తేలికగా గెలిచేపనేనా? వాస్తవానికి అత్యాచారాల కేసులలో చాలా మటుకు తగినన్ని సాక్ష్యాధారాలు లేవనో, లేదా వేరే కారణాల వల్లనో కొట్టివేయబడుతున్నాయి.

masaan

యెందుకో 2015లో వచ్చిన సినిమా “మసాన్” గుర్తుకొస్తున్నది.

వారణాసి గంగా నదీ తీరం. సంస్కృత పండితుడు సంజయ్ మిశ్రా నదీ తీరంలో (శ్రాద్ధ కర్మలు అవీ చేసుకునేవాళ్ళకి అవసరమయ్యే సరంజామా అమ్మే) వొక దుకాణం నడుపుతుంటాడు. అతని కూతురు రిచా చడ్డా చదువుకుంటూ పార్ట్ టైం పని చేస్తుంటుంది. అదే నదీ తీరంలో శవాలను తగలబెట్టే కుటుంబంలో విక్కీ కౌశల్ అనే కుర్రాడు ఎంజినీరింగు చదువుతుంటాడు. ఇంటిదగ్గర వున్నప్పుడు తండ్రికి శవాలు తగలబెట్టే పనిలో సాయ పడుతుంటాడు.

సినిమా ఈ రెండు కుటుంబాల కథ. రిచా చడ్డా వొక అబ్బాయిని ఇష్టపడుతుంది. వొక రోజు వాళ్ళిద్దరూ చాటుగా వొక లాడ్జిలో గది తీసుకుని మోహాల మైకంలో తేలిపోతున్న వేళ పోలీసులు రైడ్ చేస్తారు. పోలీసులు అమ్మాయి ఫొటొని మొబైల్ లో తీస్తారు. అబ్బాయి మాత్రం గిలగిల లాడి పోతాడు. పరువు పోతుందని బహయం, తండ్రి భయం. వదిలి పెట్టమని ప్రాధేయపడతాడు. యెంతో కొంత తీసుకుని వదిలి వేయ మంటాడు. ఇలా చిక్కిన గొర్రెలను అంత తేలికగా వదిలిపెడతారా పోలీసులు? పిరికివాడైన అబ్బాయి సందు దొరకగానే విడిపించుకొని బాత్రూం లో దూరి తలుపు వేసుకుంటాడు. తర్వాత నిస్సహాయంగా తన చేతిని మణికట్టు దగ్గర కోసుకుంటాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు గాని బతకడు. అలా ఇద్దరు చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మయి వొక్కతే బలిపశువు అయ్యింది.

నువ్వు లాడ్జికి యెందుకు వెళ్ళావు అని పోలీసు అడిగితే ఆమె “కుతూహలం” కారణంగా చెబుతుందే తప్ప యెలాంతి సిగ్గు, అపరాధ భావన వ్యక్త పరచదు. వాళ్ళ నాన్న అడిగినా అదే జవాబు. abettment to suicide నుంచి ఆమెను తప్పించాలంటే మూడు లక్షలు రెండు నెలల్లో చెల్లించే వొప్పందం ఆ పోలీసు, ఆమె తండ్రి మధ్య. ఫిక్స్ దిపాజిట్ లో  దాచుకున్న లక్ష మొదటి వాయిదాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా డబ్బు యెలా సమకూరాలా అన్నది వాళ్ళకు పట్టిన శని. ఆమెకు కొన్ని అదనపు సమస్యలు. “నువ్వు వాడితో పడుకున్నావుగా, నాతో పడుకోవడానికేం”, అని వేధించే వాళ్ళు. 12000 వచ్చె వుద్యోగం వూడతం, వేరే వుద్యోగంలో కుదురుకుంటే 5500 మాత్రమే రావడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా సూక్ష్మంగా చూపిస్తాడు దర్శకుడు నీరజ్ ఘైవాన్ (ఇది ఇతని మొదటి చిత్రం).

మరోపక్క తక్కువ కులానికి చెందిన విక్కీ, అగ్ర కులానికి చెందిన అమ్మాయి శ్వెతా త్రిపాఠి ప్రేమించుకుంటారు. అతని కులం తెలిసిన తర్వాత కూడా అతన్నే చేసుకుంటానని, అవసరమైతే లేచి వస్తానని, పెళ్ళి అయ్యాక పెద్దవాళ్ళు నెమ్మదిగా చల్లబడతారనీ అంటుంది. కాని దానికి ముందే ఆమె వొక బస్సు ప్రమాదంలో మరణిస్తుంది.  ఆమె శవాన్ని అతనే దహనం చేయాల్సి వస్తుంది.

ఈ రెండు జంటలూ చాలా నిజాయితీ గా, స్వచ్చంగా, అమాయకంగా, నిర్మలంగా వుంటాయి. అమ్మాయిల విషయానికి వస్తే ఇద్దరూ చాలా ధైర్యన్ని కనబరుస్తారు. రిచా చడ్డా తన బాడీ లాంగ్వేజ్ తో (నిటారు గా నిలబడే/కూర్చునే/నదిచే తీరు; సిగ్గు/అపరాధభావనా లేశమాత్రమైనా కనబడని తీక్షణ కళ్ళు, తడబాటు లేని సూటిగా వచ్చే మాటలు; తన మీద తనకున్న నమ్మకం). పోతే శ్వేతా త్రిపాఠి కవిత్వన్ని ప్రేమించే సున్నిత మనస్కురాలు. కాని తమ మధ్య వున్న కులపు అడ్డుగోడల గురించి తెలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయం అవసరమైతే పారిపోయి అయినా వివాహం చేసుకోవాలి, పెద్దవాళ్ళని నెమ్మదిగా వొప్పించవచ్చు.

రోజూ యెన్నో శవాలు తగలబడుతుండే ఆ భూమికలోనే ఈ రెండు ప్రణయ గాథలు. (మసాన్ అంటే స్మశానం).

ఈ రెండు సినిమాలు పోల్చింది కూడా ఈ స్త్రీల ధైర్య-సాహసాలకి, ఆత్మ విశ్వాసానికి, ఆత్మ గౌరవానికీ.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

యెందుకో 2015లో వచ్చిన సినిమా “మసాన్” గుర్తుకొస్తున్నది.

 

వారణాసి గంగా నదీ తీరం. సంస్కృత పండితుడు సంజయ్ మిశ్రా నదీ తీరంలో (శ్రాద్ధ కర్మలు అవీ చేసుకునేవాళ్ళకి అవసరమయ్యే సరంజామా అమ్మే) వొక దుకాణం నడుపుతుంటాడు. అతని కూతురు రిచా చడ్డా చదువుకుంటూ పార్ట్ టైం పని చేస్తుంటుంది. అదే నదీ తీరంలో శవాలను తగలబెట్టే కుటుంబంలో విక్కీ కౌశల్ అనే కుర్రాడు ఎంజినీరింగు చదువుతుంటాడు. ఇంటిదగ్గర వున్నప్పుడు తండ్రికి శవాలు తగలబెట్టే పనిలో సాయ పడుతుంటాడు.

 

సినిమా ఈ రెండు కుటుంబాల కథ. రిచా చడ్డా వొక అబ్బాయిని ఇష్టపడుతుంది. వొక రోజు వాళ్ళిద్దరూ చాటుగా వొక లాడ్జిలో గది తీసుకుని మోహాల మైకంలో తేలిపోతున్న వేళ పోలీసులు రైడ్ చేస్తారు. పోలీసులు అమ్మాయి ఫొటొని మొబైల్ లో తీస్తారు. అబ్బాయి మాత్రం గిలగిల లాడి పోతాడు. పరువు పోతుందని బహయం, తండ్రి భయం. వదిలి పెట్టమని ప్రాధేయపడతాడు. యెంతో కొంత తీసుకుని వదిలి వేయ మంటాడు. ఇలా చిక్కిన గొర్రెలను అంత తేలికగా వదిలిపెడతారా పోలీసులు? పిరికివాడైన అబ్బాయి సందు దొరకగానే విడిపించుకొని బాత్రూం లో దూరి తలుపు వేసుకుంటాడు. తర్వాత నిస్సహాయంగా తన చేతిని మణికట్టు దగ్గర కోసుకుంటాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు గాని బతకడు. అలా ఇద్దరు చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మయి వొక్కతే బలిపశువు అయ్యింది.

 

నువ్వు లాడ్జికి యెందుకు వెళ్ళావు అని పోలీసు అడిగితే ఆమె “కుతూహలం” కారణంగా చెబుతుందే తప్ప యెలాంతి సిగ్గు, అపరాధ భావన వ్యక్త పరచదు. వాళ్ళ నాన్న అడిగినా అదే జవాబు. abettment to suicide నుంచి ఆమెను తప్పించాలంటే మూడు లక్షలు రెండు నెలల్లో చెల్లించే వొప్పందం ఆ పోలీసు, ఆమె తండ్రి మధ్య. ఫిక్స్ దిపాజిట్ లో  దాచుకున్న లక్ష మొదటి వాయిదాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా డబ్బు యెలా సమకూరాలా అన్నది వాళ్ళకు పట్టిన శని. ఆమెకు కొన్ని అదనపు సమస్యలు. “నువ్వు వాడితో పడుకున్నావుగా, నాతో పడుకోవడానికేం”, అని వేధించే వాళ్ళు. 12000 వచ్చె వుద్యోగం వూడతం, వేరే వుద్యోగంలో కుదురుకుంటే 5500 మాత్రమే రావడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా సూక్ష్మంగా చూపిస్తాడు దర్శకుడు నీరజ్ ఘైవాన్ (ఇది ఇతని మొదటి చిత్రం).

 

మరోపక్క తక్కువ కులానికి చెందిన విక్కీ, అగ్ర కులానికి చెందిన అమ్మాయి శ్వెతా త్రిపాఠి ప్రెమించుకుంటారు. అతని కులం తెలిసిన తర్వాత కూడా అతన్నే చేసుకుంటానని, అవసరమైతే లేచి వస్తానని, పెళ్ళి అయ్యాక పెద్దవాళ్ళు నెమ్మదిగా చల్లబడతారనీ అంటుంది. కాని దానికి ముందే ఆమె వొక బస్సు ప్రమాదంలో మరణిస్తుంది.  ఆమె శవాన్ని అతనే దహనం చేయాల్సి వస్తుంది.

 

ఈ రెండు జంటలూ చాలా నిజాయితీ గా, స్వచ్చంగా, అమాయకంగా, నిర్మలంగా వుంటాయి. అమ్మాయిల విషయానికి వస్తే ఇద్దరూ చాలా ధైర్యన్ని కనబరుస్తారు. రిచా చడ్డా తన బాడీ లాంగ్వేజ్ తో (నిటారు గా నిలబడే/కూర్చునే/నదిచే తీరు; సిగ్గు/అపరాధభావనా లేశమాత్రమైనా కనబడని తీక్షణ కళ్ళు, తడబాటు లేని సూటిగా వచ్చే మాటలు; తన మీద తనకున్న నమ్మకం). పోతే శ్వేతా త్రిపాఠి కవిత్వన్ని ప్రేమించే సున్నిత మనస్కురాలు. కాని తమ మధ్య వున్న కులపు అడ్డుగోడల గురించి తెలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయం అవసరమైతే పారిపోయి అయినా వివాహం చేసుకోవాలి, పెద్దవాళ్ళని నెమ్మదిగా వొప్పించవచ్చు.

 

రోజూ యెన్నో శవాలు తగలబడుతుండే ఆ భూమికలోనే ఈ రెండు ప్రణయ గాథలు. (మసాన్ అంటే శ్మసానం).

 

ఈ రెండు సినిమాలు పోల్చింది కూడా ఈ స్త్రీల ధైర్య-సాహసాలకి, ఆత్మ విస్వాశానికి, ఆత్మ గౌరవానికీ.

 

 

మషాల్చి

పరేశ్ ఎన్ దోశి

 

కవిత్వమింకా ఐపోలేదు
జీవితమింకా మిగిలేవుందిగా!

నువ్వు కవిత్వం పరచుకొంటూ
వాగులు, వంకలు,
వూళ్ళు, వాడలు,
కొండలు, కోనలు,
సందులు, గొందులు,
అరణ్యాలు, సాగరాలు,
యెండలు, వానలు,
పువ్వులు, ముళ్ళు,
యిన్ని దాటుకొచ్చి యిప్పుడు
యీ పొగమంచులో నిల్చున్నావు.

యిక్కడి నుండి ప్రయాణం
నాది!

(మషాల్చి: Torch-bearer)

 

స్వగతం

 

నువ్వు అల్లుతున్న పొడుపు కథను
నేను విప్పటం కాదేమో

నువ్వు నీ బాల్యం నాటి వర్షపురాత్రిని వర్ణిస్తే
నేను నా బాల్యం లో కురిసిన వానలో తడిసి తెచ్చుకున్న జలుబు గుర్తుకొచ్చి
విక్స్ కోసం తడుముకోవడం

తల దువువుకోడానికి నువ్వు అద్దం ముందు నుంచుంటే
అందులో నా ముఖం కనబడటం
నువ్వు వొక బొమ్మ గీస్తావు
సరిగ్గా రాలేదని
అందులో ప్రతి గీతమీదా
మరిన్ని గీతలు దిద్దుతావు
దూరంగా జరిగి చూసుకొని
ఇప్పుడు బాగుందని
మురుస్తావు.

గాఢమైన పదచిత్రాలూ ప్రహేళికలూ రెఫరెంసులూ
ఇన్ని గందరగోళాల ముందు
నువ్వు మొడట వేసిన బొమ్మే
గదిని పరిమళంతో నింపేస్తుంది.
మల్లెలెక్కడ వున్నాయా అని వెతకడం నా వంతు.
ఇంకోసారి —

యెడుస్తున్నా
పాపాయికి నీళ్ళు పోసి
సాంబ్రాణి పొగ పెట్టి
పౌడరు రాసి
దిష్టి కాటుక పెట్టి
బట్టలు వేసి
మురిపెంగా ముద్దు పెట్టుకుంటావు.
ఆ పసిపాపను నా చెతులలో తీసుకుంటే
యేడుపు మరచిపోయి మరి బోసినవ్వులే
కవిత్వమంటే.

paresh

సూర్యుడి లోపల…మరి కొన్ని కవితలు

మూలం: గిల్లెవిచ్ 

అనువాదం: పరేశ్ ఎన్ దోశి

 

 

ఫ్రాన్స్ లోని కార్నాక్ లో పుట్టిన గిల్లెవిచ్ ప్రముఖ ఫ్రెంచ్ కవుల్లో వొకడు. ఈ కవితలు Penguin Modern European Poets series లోని Guillevic Selected Poems లోనివి. వస్తువుల గురించి వ్రాసినా, జ్యామితి రూపాల గురించి వ్రాసినా, ప్రకృతి మీద వ్రాసినా, సృజన మీదే వ్రాసినా వొక కొత్త ప్రపంచాన్నే సృష్టిస్తాడు. అందులో అవలీలగా ప్రవేశించడం ప్రవేశిస్తాము గాని, తర్వాత దాన్ని మరచిపోవదం సాధ్యం కాదు. పుస్తకం ముందు మాటలో వ్రాసినట్లు, అతను వస్తువులను చూస్తూ తదేక ధ్యానంలో పడిపోతాడు, ఆయా వస్తువులు అతనితో నంభాషణ మొదలుపెట్టే వరకూ.

 

వొక కవిత చూడండి:

గణితం మొత్తం
నీ అలల హోరులో కొట్టుకుపొయింది.

బ్రిటనీలోని సముద్ర తీరంలో యెన్ని సాయంత్రాలు మౌన సంభాషణల తర్వాత యిది వ్రాసాడో.

తినబోతూ రుచెందుకు గాని, అడుగుపెట్టండి అతని అద్భుత లోకంలోకి.

 

1.

చీమ

చీమ శవం గురించా
నువ్వు మాట్లాడుతున్నది?
అంతేనా?
పచ్చని గడ్డి మీద చీమ శవం గురించేనా?

ప్రపంచం మనిషి కోసం సృష్టించబడినది
మనకు బాగా తెలిసిందేగా
అందుకే, విధాత పొరపాట్లను
వాటిని అంతమొందించి
దిద్దాల్సిందే.

జలదరింపు కలిగించే,
మానవుడి అవగాహనకు బయటే
పాకే మిమ్మల్ని ఆ స్వర్గానికి పంపాల్సిందే.

కాని, మీరే గనక వెయ్యిరెట్లు పొడుగు వుండి
తుపాకీ చేతబట్టి వుంటే
మీరు గౌరవాన్ని  పొంది వుండేవారు
యిట్లా మరుగుతున్న నీళ్ళకు బదులు.
2.

NEWS ITEM

కుర్చీ గురించి యింత రచ్చ అవసరమా?

_ కుర్చీ నేరమేమీ లేదే!

పాత చెక్కతో చెసింది
యిప్పుదు విశ్రాంతిగా
ఆ చెట్టుని మరచిపొయి
దాని పాత వైరాన్నీ మరచిపొయి
యిప్పుదది యెట్లాంటి శక్తీ లేకుండా.

యిప్పుడు దానికింకేమీ అక్కర్లేదు
యే బాకీలు యిక లేవు
తన సుడిగాలిలోనే తాను
స్వయంపోషక.
3.

గొడ్డు మాంసం
చర్మం వొలిచేసిన ఆవు.
దీని మాంసంలోనే ప్రవహించింది
స్పందిస్తున్న
అద్భుతమైన
అర్థంకాని
వొక వెచ్చదనం

యిప్పటికీ ఆ వెచ్చదనం
ఆ చిన్ని కళ్ళల్లొతుల్లో
యిప్పటికీ నువ్వు దాని వొంటిని నిమరవచ్చు
నీ తలను దాని వొంటికి ఆనించి
నీ భయాన్ని నిద్రపుచ్చవచ్చు.
4.

వడ్రంగిని చూశాను

వడ్రంగిని చూశాను
మానును పోడవాటి పలకలుగా కోస్తూ

వడ్రంగిని చూశాను
వేర్వేరు పలకల పోడవులను కొలుస్తూ

వడ్రంగిని చూశాను
చక్కగా వచ్చిన పలకను ముద్దు చేస్తూ

వడ్రంగిని చూశాను
వాటిని యింటికి తీసుకేళ్తూ

వడ్రంగిని చూశాను
దానికి యెట్లాంటి లోపం లేకుండా చక్కని రూపాన్నిస్తూ

వో వడ్రంగీ! దాన్ని బీరువాగ మలుస్తున్నప్పుడు
నిన్ను పాట పాడుకుంటూ వుండడం గమనించాను
నీ రూపాన్ని, ఆ చెక్క వాసనతో సహా,
నా మనసులో పదిలపరచుకున్నను

యెందుకంటే పదాలతో నేను చేసే పని
నీ పనినే పోలివుంటుంది.
5.

స్పర్శ రేఖ (Tangent)

నేను నిన్ను వొక్కసారే తాకుతాను
రహస్యంగా
అది నీకూ తెలుసు

నన్ను పిలవడమూ వృథా
నన్ను గుర్తు తెచ్చుకోవడమూ వృథా

నీకు చాలా విరామం
నీకు నీవు పదే పదే
యీ క్షణం గురించే చెప్పుకోవడానికి

అలాగే మనిద్దరమూ
వొకరి మీద వొకరు ఆధారపడి వున్నామని
నీకు నీవు నమ్మించుకోజూస్తావు.

 

6.

సమబాహు త్రిభుజం (Right Angle Triangle)

చాలా దూరమే వచ్చెశాను
అనియంత్రిత వెర్రిగా చక్కదిద్దుకుంటూ

యింక యిందులో యెట్లాంటీ
భవిష్యత్తూ లేదు.
7.

ప్లేట్లు

వాడిన పింగాణి ప్లేట్లు
తెలుపులోకి రంగులన్నీ వెలిసిపోయి.
మా యింటికి వచ్చినప్పుడు అవి
కొత్తవి

యీ లోగా మేము చాలా నేర్చుకున్నాం.
8.

సూర్యుడు

సూర్యుడు,
తన లోపల తప్ప,
యెప్పటికీ రాత్రిని చూడడు.

యెందుకంటే అతను
చీకట్లను బయటకు
విసిరేసినప్పుడల్లా
అది తన చుట్టూ
వెల్తురుగా పరచుకుంటుంది.

 

9.

సుత్తి

నా చేతి కోసమే చేసినట్లున్న
నిన్ను చేత్తో కుదురుగా పట్టుకుంటాను
బలవంతుడిగా భావిస్తాను
నీ బలంతో

నువ్వు గాఢ నిడ్రలో
నీకు చీకటి తెలుసు
నీకు బలం తెలుసు

నిన్ను తాకుతాను
చేతిలోకి తీసుకుని
సర్దుకుంటాను
నా అరచేత్తో నిన్ను వెచ్చ బరచి
చెయి యెత్తుతాను

నీతో నేను తిరిగి
యినుములోకి, చెక్కలోకి
జారుకుంటాను

నువ్వు నన్ను లాగుతావు
నన్ను పరీక్షించటానికి
నువ్వు ఘాతం వెయ్యదలిచావు.

*

ఆ ఆరుగురేనా?

 

 

అప్పుడు:

 

దేశ రాజధానిలో ఇండియాగేట్ దగ్గర

నిర్భయకు న్యాయం జరగాలంటూ ప్రశాంతంగా సంఘర్షిస్తున్న వేలాది స్త్రీ పురుషులను

లాఠీలతో, బుల్లెట్లతో, వాటర్ కానన్లతో మానభంగం చేసారు

 

వీడియో  పాఠాలు కొన్ని :

 

యీ దేశానిది  ఘనమైన సంస్కృతి..   యిందులో ఆడవాళ్ళకు స్థానం లేదు.

:న్యాయవాది వువాచ

 

ప్రాణాలు కాపాడుకోవాలంటే నోరు మూసుకుని చెయించుకోవాలి గాని నోరెత్తకూడదు

వీడియోలో రేపిస్టు మాట్లాడుతున్నడా లేక నేను అద్దంలో చూస్తున్నానా?

భుజాలెక్కడ?

: చాలామంది సమస్య.

 

యిప్పుడు:

 

మీ మానాలను కప్పి కాపాడుతున్నామంటూ

వీడియో ప్రసారాన్ని నిర్బంధించి

మీ కళ్ళు చెవులు నోళ్ళు మూసి

వొక్కసారిగ

సమస్త దేశంలోని

ఆడా-మగా  అందరిని లింగ వివక్ష లేకుండా

సమానంగా

మానభంగం చెయడం జరిగింది.

చట్టం నిర్వచనంలోకి రాని దానికి శిక్షా లేదు.

 

స్వగతం:

 

ఆ నిర్భయను మానభంగం చేసినవారు ఆ ఆరుగురేనా?

 – పరేశ్ ఎన్ దోశి

 

 

మనసుపటం

462360_10150658386643559_1319432730_o

1
మొక్కలకి నీళ్ళు పోశాను
కుక్కపిల్లకు అన్నం పెట్టాను
పిట్టలకు నీళ్ళు పోసుంచాను
తల పగిలి పోతోంది; మళ్ళీ పడుకుంటాను
గంట తర్వాత లేపుతావా?
తలకి యెర్రటి స్కార్ఫ్ కట్టుకుని
అమృతాంజనం వాసనతో
బందిపోటురాణి అవతారంలో అడిగింది భార్య.
2

నా కూనలు నీళ్ళు అడుగుతున్నాయి
దాహంతో అల్లల్లాడుతున్నాయి
నిద్దట్లో గొణుక్కుంటున్నట్టుగా అందామె
నిద్దట్లోనే నడుస్తూ వెళ్ళింది
పిట్టగోడ దగ్గరికి
చూద్దును కద
పిట్టగోడ మీద మట్టి పాత్ర
సగం నీళ్ళూ సగం గాలి
నీటిపై అనంతాకాసపు నీడ
చుట్టూ రంగురంగుల రెక్కలు కట్టుకు
వచ్చి వాలిన పిట్టలు
దాహార్తిని తీర్చుకుంటూ…..
మురిపెంగా చూస్తూనే వున్నా
పంచ భూతాల చిత్రాన్నీ
నింగీ-నేల యేకం చెసిన చిత్రకారిణినీ….

– పరేశ్ ఎన్ దోశి

10411859_850763618285904_2254249312288680562_n

(painting: Rafi Haque)