అక్టోబర్ 25-26, 2014 (శనివారం, ఆదివారం) రెండు రోజులూ ఉదయం 8 నుండి సాయంత్రం 5 వరకూ హ్యూస్టన్ మహా నగరంలో జరుగుతున్న ఉత్తర అమెరికా మొట్టమొదటి తెలుగు కథ స్వర్ణోత్సవాలు & 9వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కు ఇప్పటికే చాలా మంది సాహితీవేత్తలు అనేక నగరాల నుండి నమోదు చేసుకున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మిగిలిన వారందరినీ మరొక్క సారి సకుటుంబ, సపరివారంగా ఆహ్వానిస్తున్నాం.
ఉత్తర అమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ 1964 లో అప్పటి ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడి యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా, ఉత్తర అమెరికాలో తెలుగు సాహిత్య ప్రారంభానికి అదే తొలి అడుగుగా గుర్తిస్తూ ఆ అర్ధ శతాబ్ది ఉత్సవాలు ప్రధాన అంశం గా ఈ “తొమ్మిదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” నిర్వహించబడుతోంది.
ఈ అద్వితీయమైన అమెరికా సాహితీ సదస్సులో పాల్గొనడానికి ఇతర నగరాల నుండి వస్తున్న అమెరికా సాహితీ వేత్తలు కిరణ్ ప్రభ, వేమూరి వేంకటేశ్వర రావు, వేలూరి వేంకటేశ్వర రావు, చెరుకూరి రమా దేవి, అఫ్సర్, కల్పనా రెంటాల, శారదా పూర్ణ, విన్నకోట రవి శంకర్, ఎస్. నారాయణ స్వామి, గొర్తి బ్రహ్మానందం, చంద్ర కన్నెగంటి, మెడికో శ్యాం, శ్యామలా దేవి దశిక, సత్యం మందపాటి, యడవల్లి రమణ మూర్తి, అపర్ణ గునుపూడి మొదలైన వారు. ఇంతటి అమెరికా హేమాహేమీలని అందరినీ ఒకేసారి కలుసుకోవడం, ఒకే వేదిక పై వారి అభిప్రాయాలని వినడం ఒక అపురూప అవకాశం. అంతే కాక భారతే దేశం నుంచి పాపినేని శివశంకర్, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, డా. ముక్తేవి భారతి, ప్రొ. జి. కృపాచారి (దళిత విశ్వవిద్యాలయ ఉప కులపతి), ఆకెళ్ళ రాఘవేంద్ర, కస్తూరి అలివేణి, జి. భగీరధ మొదలైన వారు అక్కడి సాహిత్య పురోగతిని (???) ఇక్కడ మనకి వివరించనున్నారు
ఈ సదస్సులో ప్రధానాంశాలుగా ఉత్తర అమెరికా తొలి కథకులు స్వర్గీయ పులిగండ్ల మల్లికార్జున రావు గారి సతీమణి లీల గారు & కుటుంబ సభ్యులు ఎడ్మంటన్ (కెనడా) నుంచీ, అమెరికా తొలి కవి & తొలి తెలుగు పత్రిక సంస్థాపకులు స్వర్గీయ పెమ్మరాజు వేణుగోపాల రావు గారి సతీమణి స్వరాజ్య లక్ష్మి గారు & కుటుంబం అట్లాంటా నుంచి విచ్చేసి మన ఆత్మీయ సత్కారం అందుకోనున్నారు. అదే విధంగా అమెరికా మొట్ట మొదటి కథా రచయితలైన చెరుకూరి రమా దేవి, వేమూరి వెంకటేశ్వర రావు, వేలూరి వెంకటేశ్వర రావు గార్లకు, జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించి అమెరికాలో తెలుగు సాహిత్యానికి సముచితమైన స్థానం కల్పించబడుతుంది. ఈ సందర్భంగా ఉత్తర అమెరికా లో తెలుగు సాహిత్య తొలిదశకం (1964-1974) చరిత్ర నెమరు వేసుకునే ప్రత్యేక ప్రసంగం ఉంటుంది. హైదరాబాద్ నుంచి తొలి సారిగా అమెరికా సందర్శిస్తున్న సీనియర్ రచయిత్రి, సుప్రసిద్ధ సాహితీవేత్త డా. ముక్తేవు భారతి గారు జీవన సాఫల్య పురస్కారం అందుకోనున్నారు.
ఆత్మీయ వాతావరణలో జరిగే ఈ సాహిత్య సభలకి వచ్చి ఆనందించమని మిమ్మల్ని కోరుతున్నాం. సభలో సాహిత్య విషయాలపై ప్రసంగించ దల్చుకున్న వారు వెనువెంటనే మమ్మల్ని సంప్రదించండి.
ఏ కారణం చేతనైనా మీరు రాలేక పొతే, ఖర్చులతో తలమునకలయ్యే మా ప్రయత్నాలని మీ కనీస విరాళంతో ఆర్థికంగా సమర్దించమని అర్దిస్తున్నాం. మా నియమాలని బట్టి, దాతలందరికీ $145 డాలర్లు విలువ జేసే పుస్తకాలు అందజేయబడతాయి. పోస్ట్ ఖర్చులు మావే! పుస్తకాల వివరాలు ఇందుతో జత పరచిన పూర్తి ప్రకటనలో చూడండి. అలాగే సదస్సు నమోదు పత్రం కూడా జతపరిచాం.
సాహిత్య పోషణకి కనీస విరాళం $50, సముచిత విరాళం $100, ఉదార విరాళం $2500 దాకా విరాళం పంపించడానికి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఈ క్రింది లంకె కి వెళ్తే చాలు.
ALL DONATIONS ARE TAX-DEDUCTIBLE IN USA
https://www.paypal.com/cgi-bin/webscr?cmd=_s-xclick&hosted_button_id=TQANE7ZAQDXQA
మరిన్ని వివరాలకు ఈ క్రింది వారిని సంప్రదించండి
వంగూరి చిట్టెన్ రాజు Phone: 832 594 9054, E-mail: vangurifoundation@gmail.com
మారుతి రెడ్డి (కన్వీనర్), President – హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి, maruthi@hotmail.com
Sai Rachakonda: Coordinator:, Phone: 281 235 6641, sairacha@gmail.com
కార్య నిర్వాహక సభ్యులు
C.N. Satyadev, Madhu Pemmaraju, Satybhama Pappu, Santha Susarla, Hema Nalini Tallavajjula, Sitaram Ayyagari, Pallavi Chillappagari, Uma Desabhotla, Sarada Akunuri, Ram Cheruvu, Venkatesh Nutalapati, Raj Pasala, Sudhesh Pilutla, Raghu Dhulipala, Krishna Keerty, Lalitha Rachakonda, Ravi Ponnapalli