Archives for September 2016

నిన్ను వోడించే యుద్ధం!

dali-hiroshima-melancholy1

ఉన్నట్టుండి

యెప్పటిదో గాయం

తలుపు తెరచుకుని నీ ముందు నిలబడుతుంది

వూహించని మెరుపు తాకిడికి

నీ కలల్తో సహా నువ్వు వులుకులికి పడ్తావ్

అప్పుడిక అందరూ తలా వొక వాయిద్యం మోగిస్తూ

నీ గాయానికి శబ్ద లేపనాలేవో పూస్తూ వుంటారు

నువ్వు గాయాన్నే చూసుకుంటూ  వుంటావ్ గానీ

నిన్ను గాయపరచిన శత్రువెవరో తెలియనివ్వని

మంత్రగానమే  వింటూ వుంటావ్  గానీ

అంతకంటే యేమీ తెలియని అమాయకత్వంలోకి

తలకిందులుగా జారుకుంటూ వెళ్ళిపోతావే

అప్పుడనిపిస్తుంది నీ కోసం కాసింత జాలి కూడా నేరమే అని-

 

2

వొక నిండు దేహాన్ని

రెండు ముక్కల కింద తెగనరికినప్పుడు కూడా నువ్వు అంతగా చలించలేదు గానీ

యిప్పుడు సరికొత్తగా తొడుక్కున్న చొక్కాలో

నీది కాని కవచంలో నిన్ను ఎంత పిరికిగా మడత పెట్టేశారో తలచుకుంటే

నాకు  అన్నమూ సయించదు, నిద్రా దారి చూపదు

ఎటైనా పారిపోదామంటే లోకమెల్లా ఖైదుకొట్టమే కదా!

నిన్ను రెండుగా  చీల్చి, నీకు హద్దులు గీసినప్పుడు

ఆ హద్దులన్నీ నీ కోసమే అని కదా నువ్వు సంబరపడ్డావ్

నిన్ను కప్పిన అంబరానికి ఖడ్గం దూసి-

ఇవాళ సరే

యింకెప్పటికైనా  తెలుస్తుందా  సరిహద్దుల సర్జికల్ కోతలు

నీ కోసం  కానే కాదని!

 

3

తొలియవ్వనాల మెరుపు శరీరాల్తో వెళ్ళిన వాళ్ళు

వొట్టి గాలి తిత్తులై యింటికొచ్చారని

కలల ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు

నెత్తుటి ముద్దలై తరలి వచ్చారని

రోజుకిన్ని కన్నీళ్లు  ధారపోస్తున్నావే కాని

యెవరి యుద్ధం ఇది

యెవరి ఆయుధాలు వాళ్ళు

అని మాటవరసకైనా నీ పగిలిన అద్దంలో జిన్నానో

నీ నెత్తిన ఊరేగుతున్న  మాటల మోళీనో

అబద్ధమై రాలిపోతున్న నిన్ను నువ్వో  అడగలేదుగా నువ్వు!?

యీ  యుద్ధాలు నీ కలలు కావు

నీ నాలుగు మెతుకుల కోసమూ  కాదు

ఆ సరిహద్దుల మాదిరిగానే-

 

4

యివాళ నువ్వు తాగుతున్న నీళ్ళలో నెత్తురూ

నువ్వు తినబోతున్న అన్నంలో నిషిద్ధ మానవ మాంసాల తునకలూ విసిరి

వాళ్ళు ఆడుకుంటున్న ఆటలో

నువ్వే వోడిపోతావ్ ఎప్పుడూ!

నేనూ దేశాన్ని ప్రేమిస్తాను గాని

దాన్ని భక్తిగా తర్జుమా  చేసుకోలేను యెప్పటికీ,

నువ్వు క్షమించకపోయినా సరే!

 

నాకు యే దేహమైనా అన్నం పళ్ళెం లాగే కనిపిస్తుంది యెప్పుడూ,

యే “దేశ”మైనా ఆ మెతుకుల్ని దోచేసే దొంగలాగే కనిపిస్తుంది యెప్పుడూ-

యిక్కడ నీ పేదరికపు వొంట్లోనూ

అక్కడ ఆ గరీబు వొంట్లోనూ

వొకే ఆకలి కేక

వొకే వెతుకులాట-

 

వొక్కటే అనుకుంటాను,

నిన్ను శవంగా కూడా మిగలనివ్వని

యీ ఆటకి నువ్వే డప్పు వాయిద్యానివి!

యుద్ధమూ ఆగదు, డప్పూ ఆగదు ఆకలిదప్పుల్లాగే!

శవాలు ఇంటికొస్తూనే వుంటాయి

అన్నీ తుడిచేసుకొని కేవలం అంకెలయి-

 

5

నువ్వు ఎదురుచూస్తూ వుంటావ్

నీ అంకె ఎప్పుడా అని-

పూల బాస!

seetaram

ఇది ప్రముఖ  చాయాచిత్రకారుడు దండమూడి  సీతారాం తీసిన  ఫోటో! కొన్ని  ఫోటోలు  గొప్ప  దృశ్యాన్ని  పొదివి పట్టుకున్న  చిత్ర కవితలు. ఇదీ అలాంటిదే!

ఈ దృశ్యం  మీ  అక్షరాల్లో  ఎట్లా తర్జుమా  చేయగలరో  ప్రయత్నించండి. మీకు  నచ్చిన  పద్ధతిలో- కవిత  కావచ్చు, చిన్ని కథ  కావచ్చు, చిన్ని ఆలోచన కావచ్చు, చిన్ని  అనుభవమూ  కావచ్చు- ఇక్కడ  కామెంట్ గా  రాయండి.

బచ్పన్ లో ప్రతి కొమ్మ

saif
1
సందుల్లో తిరగడం అంటే ఎంతిష్టమో .బేషరం  ల
చూపులెప్పుడూ జాకెట్ మధ్య  సందుల్లోనే ఎప్పుడూ 5 <3
2
మనల్ని మనం ఇరికించుకోవడం ఎంత బాగుంటదో
బేషరం రెండు ఇరుకు గోడల మధ్య  కొద్ది సేపు 5 <3
3
దాచాలని ప్రయత్నిస్తుంది బేషరం
ఆకులవెనకాల పళ్ళని ప్రతి చెట్టు 5 <3
4
అమాయకంగా కనిపించే మొహాలు ఎన్నో ఈ దునియాలో
బేషరం ప్రతి రాత్రి లంగాలతో మొహాలు తుడిచుకునేవి 5 <3
5
వర్షం అన్ని చూపించి పోతుంది బేషరం
పెద్ద పెద్ద పళ్ళన్ని బయటకు కనిపించేలా చెట్లని తడిపి 5 <3
6
తనంతట  తాను వంగదు అని తెలిసివచ్చింది బేషరం
బచ్పన్ లో ప్రతి కొమ్మని ఎగెరెగిరి వంచాల్సివచ్చేది 5 <3
7
నేను తనని దొంగచాటుగా చూస్తున్న అనుకున్నా బేషరం
తనే నన్ను దొంగ చాటుగా చూస్తుంది మేఘాల్లోనుంచి 5<3
8
వక్షోజాలు కొన్ని అందంగా కనిపిస్తాయి బేషరం
వాటిని కుడుతూ సూదులు గుచ్చుకున్న కూలీ టైలర్లెందరో 5 <3
9
వయసుని ఎవరు పట్టించుకోరని తెలుస్తుంది బేషరం
ఈ కాలం లో కూడా ఇంకా హిమాలయా శిఖరాలని ఇష్టపడుతుంటే 5<3
10
ఏదో అద్భుతమయిన వంట సిధ్ధంగా ఉన్నట్లుంటది
బేషరం వేడి వేడి శ్వాసలు దగ్గరగా వస్తే 5<3
*

మరి కొన్ని ప్రాతినిధ్యాలు…!

 katha

saipadmaగాలికీ కులముంది – కధా క్రమంబెట్టి దనిన

 -సాయి పద్మ
ఈ కధ ఎందుకు రాసాను ? అంటే – రాయకుండా ఉండలేక రాసాను. నన్ను చిరాకు పెడుతూ, ఏడిపిస్తోంది కాబట్టి, వదుల్చుకోవటానికి రాసేను. ఇది నాకు చాలా దగ్గరైన వొక దళిత అమ్మాయి నిజ కధ. చాలా కాలం వరకూ ఆమె ఎస్సీ అని నాకు తెలియదు. మాట్లాడుతూ ఉండేది. వొక్కోసారి దుఃఖంగా, వొక్కోసారి సంతోషంగా.. పిల్లలు కావాలి అన్న కోరిక విపరీతంగా ఉండేది. పిల్లల కోసం ఎవరేం తాయత్తు, మహిమ, మంత్రం ఉంది అన్నా, వెళ్ళిపోతూ ఉండేది. చాలా సార్లు సున్నితంగా కపుల్ కౌన్సెలింగ్ ఇలా చెప్పినా , ఏమీ మాట్లాడేది కాదు. వాళ్ళాయన రాడేమో అనుకోని వూరికొనే దాన్ని. నాకు తెలిసిన ఐ వీ ఎఫ్ సెంటర్ల గురించి చెప్పాను, వోకదానికి వెళ్లి ఏదో ప్రాసెస్ స్టార్ట్ చేసింది కూడా. తర్వాత ఏమైందో తెలీదు. చాలా కాలం గ్యాప్ తర్వాత, వొకసారి ఫోన్ చేసి ఏడ్చింది. వాళ్ళ అత్తగారు, తాను కడిగిన గిన్నెలు మళ్ళీ కడుక్కొని పెట్టుకుంటుంది అన్నది, చాదస్తం ఏమోలే అంటే.. కాదక్కా , నేను తక్కువ జాతి దాన్ని కదా అంది. జాతి అంటారు, కులం కూడా కాదు అంటూ ఏడ్చింది. అయ్యో.. ఇంత చదువుకున్నావు బాధపడకు అంటే, వాళ్ళాయన దగ్గరకి తీసుకుంటూ.. ఇలా ఉంటె చాలదా.. నీతో పిల్లలు అంటే మళ్ళీ అదో వారసత్వపు గోల అన్నాడు అని.. కుళ్ళి కుళ్ళి ఏడ్చిన ఆ స్వరం ఇప్పటికీ నన్ను భయపెడుతూనే ఉంది.
నిజ కథలో క్లైమాక్స్ ఏంటి అంటే, వాళ్ళాయన తన కులపు అమ్మాయి, మరదలు వరస ని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు. ఈ అమ్మాయి, రిజర్వేషన్ ఉపయోగించుకొని వచ్చిన, రాజకీయ పదవి, అనధికారంగా అనుభవిస్తున్నాడు. తోటలో ఇంట్లో, వొంటరిగా , మధ్యలో మొగుడు, ఉంచుకున్న వాడిలా వచ్చిపోతూ ఉంటె, తన వరకూ నగలు, చీరలు చూసుకొని త్రుప్తి పడుతోంది ఆమె. నాతో మాట్లాడినా ముభావంగా ఉంటుంది. పిల్లల కోసం ప్రయత్నించటం మానేసింది. చదువుకోమన్నాను. పీహెచ్డీ మొదలెట్టింది.
నాకే, ఇంకా ఆశ చావక మనుషుల మీదో, సమాజం మీదో, ఆమె గెలవాలన్న కసితో, క్లైమాక్స్ మార్చాను. ముఖ్యంగా థాంక్స్ చెప్పుకోవాల్సింది, రవీందర్ వీరేల్లి గారికి, ఈ కదా వాకిలి లో వేసేముందు, పాపం, సహనంగా నన్ను భరించి, కథని అక్కడక్కడా ఎడిట్ చేయటమే కాకుండా మంచి సూచనలు ఇచ్చారు. ఇంకో పెద్ద థాంక్స్ సామాన్య కిరణ్ గారికి, ఏ కధా సంకలనం లోనూ నా కదా రాలేదు, నా కథలు ఎవరికీ నచ్చవేమో అనుకోనేదాన్ని, ఈ కథ కావాలని అడిగి, ప్రాతినిధ్య లో వేసుకున్నందుకు భలే సంతోషంగా ఉంది.
ప్రాతినిధ్యం గా నిలుస్తున్న , అందరు, రచయిత్రులకీ, రచయితలకీ శుభాకాంక్షలు
~~

సీమ అస్తిత్వానికి  చిన్న చోటు

vijaykumar viktar

-విజయ్ కుమార్ 

 

‘ మూడ్రాల్ముక్రాయ్ ‘ నా మొదటి కథ. రచయితగా వేషం వేసుకున్నాక బయటపడిన మొదటి ప్రాడక్ట్ అది. పశ్చిమ కర్నూలు ప్రాంత నేపథ్యం లో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థలో బతికే ఒక యువ జంట ప్రేమ చుట్టూ ఈ కథ ఉంటుంది. ఒక్క రాయలసీమ ప్రాంతం లోనే ఎన్నో డైలెక్ట్స్ ఉన్నాయి. బహుశా ఈ ప్రాంత వ్యావహారిక శైలిలో కథ రావడం ఇది ప్రథమం అనుకుంటున్నా. ఈ కథ ‘ కినిగె ‘ లో ప్రచురణమయ్యింది. మెహర్ గారు నాకు ఇందులో సూచించిన కొన్ని చిన్న చిన్న సలహాలతో ఈ కథ లో డిక్షన్ మార్చడం జరిగింది. అందుకు ఈ సందర్భంగా మెహర్ గారికి కృతజ్ఞతలు  చెప్పుకోకుండా ఉండలేక పోతున్నా.

మాదేవి ఈ కథలో కథానాయిక. ఈ కథ తర్వాత నేను ‘ మా ఊర్ల పాకిస్తానోల్లు ‘ ( కినిగె) ; ‘ బతుకు తునకలు ‘ ( వాకిలి) ; ‘చిల్లర నాణేలు ‘ ( వాకిలి ) లో కథలు రాశాను. ప్రతి కథలోనూ ‘ మాదేవి ‘ అనే ఒక కేరక్టర్ కేమియో గా ఉంటుంది. ఎందుకంటే ‘ మా దేవి ‘ పాత్ర ఈ కథలో స్వచ్చమైన ప్రేమకు , కన్సర్న్ కు తార్కాణంగా ఉండిపోయిందని నా నమ్మకం. ఈ కథ లో మాదేవి కి ముక్రాయి ( ముక్కు పుడక ) బాగుంటుంది అన్న వీరేశు కాంప్లిమెంట్ మీద సాగిపోయే కథ ఇది.

సాహితీ రంగం నా ప్రధాన స్రవంతి కాకపోవడం వలన ఏమో ఎప్పుడో విన్నాను తప్ప సామాన్య గారి నాకు పరిచయం లేదు. మంచి కథలను ప్రోత్సాహిద్దాం అనే ఆమె తలపు అభినందనీయం. నిజానికి ఈ తెలుగు సాహితీ రంగం లో ఎంతో అసంబద్ధత, ఎన్నో తారతమ్యాలు ఉన్నాయనే నా బలమైన భావనతో నేను ఎక్కువగా ఇంగ్లీషు రచనలకు పరిమితమయ్యాను. అటువంటి సమయం లో సామాన్య గారు తనే ఇనీషియేటివ్ తీసుకుని నాకు ఫోన్ చేసి కథను ప్రచురణకు స్వీకరించి ప్రోత్సహించడం వ్యక్తిగతంగా నాకు ఆనందకరమే కాదు సంభ్రమం కూడా కలిగించింది. సారంగ తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియ జేసుకుంటూ , రాయలసీమ అస్తిత్వానికి సాహిత్యం లో చిన్న చోటు అయినా కలిపించడం తెలుగు సాహిత్య ప్రగతి వాద పథం లో విధివిహితమైనది అని గుర్తించవలసిందిగా ప్రతి సాహితీ వేత్తకు విన్నవించుకుంటున్నా.

*

ముఖ్యంగా ఒంటరితనం మనిషినెలా చీల్చేస్తుందో..!

 -షాజహానా

shahjahanaమనసుకి తగిలిన గాయాలన్నీ వరుసపెట్టి  ఒకదాని వెంట మరొకటి తరుముకొచ్చాయి. మనసులో మంట. ఎంతకీ ఆర్పలేని కార్చిచ్చులాంటి మంట. రాసాకగాని ఆరలేదు. ఒక్కటా రెండా.. ఎన్నో విషయాలు జలపాతంలా… దూక్కుంటూ దూసుకుంటూ… ఏదీ కావాలని రాసింది కాదు. మనసులో ఏమనుకుంటానో అదే raw గా వచ్చేసింది.. ఊటలా ఉప్పొంగి కన్నీటి నదిలా ఉబికి ఉబికి వచ్చింది. బతకమ్మ పేర్చినట్టు కథ పేరుకుంటూ పోయింది.

చైతన్య స్రవంతి అన్నారు. తాగి రాసావా అనడిగారు.. పాపం, చాలా మంది స్కై నే విలన్ అనుకున్నారు.. నవ్వొచ్చింది.

చాలా ఎక్కువమంది స్త్రీలు కథతో ఐడెంటిఫై అయ్యారు.. మరెంతోమందికి కథ కనెక్ట్ అయ్యింది. చాలామంది పేరు బాగుందన్నారు. కొందరు ఎంతగానో ఏడ్చామన్నారు.. ఇది స్త్రీలందరి కథ అన్నారు.. స్త్రీలందరి తరఫున ఇలాంటి కథ రాయగలగడం బాగుంది నాకు…

*

ముస్లిం ఆకాంక్షల “చమన్” 

 chaman

దేశానికి స్వాతంత్రం సంభవించి డెబ్భై వసంతాలు గడిచిపోయాయి. గడిచిపోయాయి అని చెప్పటం చాలా తేలిక. కానీ…మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అంత సులభం గా మనకు చిక్కలేదంటే రాబోయే తరాలకు నమ్మశక్యం కాకపోవచ్చు. అంతగా స్వేచ్ఛకు అలవాటు పడిపోయాం. కానీ ఈ ఫలాలు మనకు అందించడానికి ఎంతోమంది వారి ప్రాణాలను ఫణంగా పెట్టారు. అప్పట్లో వారికి ఒక్కటే లక్ష్యం. భారత్ ను దాస్య శృంఖాలలనుంచి విముక్తి పొందించాలనేదే ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యం ముందు ఎంతటి సమస్య అయినా దిగదుడుపే. అందుకే హిందూ,ముసల్మానులు స్వాతంత్య్రోద్యమంలో తమ వంతు పాత్ర నిర్వర్తించారు. అమరులయ్యారు.

గతం గడిచింది. భారత యవనికపై ఎన్నెన్ని మార్పులు సంభవించాయో. అన్ని రకాలుగా ఎదుగుతున్నాం. సాంకేతికంగా అందనంత ఎత్తుకు దూసుకుపోయి అరుణ గ్రహానికి నిచ్చెన వేశాం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత యాభై ఏళ్లు ఒకలా గడిస్తే, ఆ తరువాత ఇరవయ్యేళ్లు వేగంగా దూసుకుపోయాయి అని చెప్పవచ్చు. కంప్యూటర్లు, మొబైళ్ళు, ఇంటర్నెట్, ఎల్సీడీలు, ఎల్యీడీలు, బ్లూటూత్, వైఫై, కార్డ్ రీడర్….ఇలా సాంకేతిక భాషను వంటబట్టించుకోనివారు లేరు. పూట గడవనివారైనా సాంకేతికతకు అనుసంధానం కాకుండానైతే లేరు.
 మరి ఇంతటి వర్తమానంలోనూ ఒక వర్గం అత్యంత వెనకబాటుకు గురై చైతన్యలేమితో బాధపడుతోంది. అదే ముస్లిములు. వీరి వెనుకబాటు పాలకుల దృష్టికి వెళ్లలేదా? అంటే లేదు అని చెప్పడం అసత్యమే అనిపించుకుంటుంది. ఎందుకంటే..ఎన్నికలకు ముందు ప్రత్యేక బ్యాంకుగా ఆ వర్గం పాలకును ఆకర్షిస్తుంటుంది మరి. అటువంటి వర్గం నుంచి ఒక విద్యావేత్త, ఒక వైద్యుడు, ఒక ఇంజనీరు, ఒక పైలట్, ఒక లాయరు…బయటకు రావాలంటే ఆ కుటుంబం ఎన్నెన్నో త్యాగాలు…త్యాగాలంటే ఇక్కడ మిగతావారిలాగా చేసే పనులు వాయిదా వేయడం లాంటివి కాదు. పొట్ట మాడ్చుకోవడం. తాము తినాల్సిన తిండిని కూడా సదరు చదువుకునే కొడుకుకో, కూతురికో పెట్టడం లాంటివన్నమాట. ఆ వర్గమే మైనారిటీ వర్గం. చాలామంది అంటుంటారు. “ఏం…వాళ్లు మాత్రమే నిర్లక్ష్యానికి గురయ్యారా? మిగతావారిలోనూ పేదరికమే ఉంది కదా?” అని. నిజమే! లేదని కాదు. కానీ మిగిలిన వర్గాలలో ఎంతమంది అక్షరాస్యులున్నారో, ఎంతమంది ఉద్యోగస్తులున్నరో గమనిస్తే సరిపోతుంది. అంతేకాదు నిత్యం మన కళ్లముందు కనిపించేవారిపైనే కాస్త దృష్టి పెట్టండి చాలు. మిగిలిన వారు ఎటువంటి వృత్తులు చేస్తున్నారు. ముస్లింలు ఎక్కువగా ఏ వృత్తులలో కొనసాగుతున్నారో. సైకిల్ పంక్చర్ చేసేవాడు, గాజులు అమ్మేవాడు, హోటల్ లో చాయ్,పాన్లు అమ్మేవారు ముసల్మానులే. అక్షరాస్యులు తక్కువ. రాబడీ తక్కువే. సంతానం ఎక్కువ. చైతన్య పరిచేవారు కూడా సరైన విధివిధానాలతో ముందుకు రావట్లేదేమో అనిపిస్తుంటుంది.
“చమన్” అవసరం చాలా ఉంది
ముస్లింలు అనగానే ఒకప్పుడు పరిపాలించిన రాచరికపు మర్యాదలనే ప్రస్తావిస్తుంటాయి చాలా పత్రికలు. గతం విడిచి వర్తమానంలో జీవించాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటిదాకా మనకు పత్రికలు రాలేదని కాదు. సమాచారం అందుబాటులో లేదనీ కాదు.ముస్లిముల అవసరాలను గుర్తించిన పత్రికలు ఉర్తూలో వెలువడ్డాయి. ఉర్దూ చదవగలిగిన వారికే ఆ పత్రికలు చేరాయి. చేరుతున్నాయి. ముస్లిముల ఉనికి సమాజానికి చేరువ కావాలంటే తెలుగు భాషలోనే ప్రత్యేక పత్రిక రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ బాధ్యతను చమన్ ఎత్తుకుంది. ముస్లింలకు కావాల్సిన అంశాలను స్పష్టంగా ప్రభుత్వానికి, ప్రజలకు చేర్చడానికి చక్కటి వారధిగా నిలుస్తుందనడంలో సందేహంలేదు. పాత్రికేయులుగా, కవిగా, రచయితగా, ఉద్యమకర్తగా అందరికీ స్కై బాబాగా సుపరిచితమైన ఎస్.కె.యూసుఫ్ బాబా సంపాదకత్వం వహిస్తూ త్రై మాసిక పత్రికగా త్వరలో  మన అందరిముందుకు రాబోతుంది “చమన్”. ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలను ఊపిరిగా చేసుకుని, జర్నలిజంలో అనుభవం సంపాదించి, జనజీవనంతో మమేకమైన ఉద్ధండుల సారథ్యంలో మలి ప్రతిగా వస్తున్న చమన్ లో ముస్లింలకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. వీటన్నింటిని స్కై బాబా గారు ఎంతో ధ్యానంతో తీర్చిదిద్దారు.
“చార్ సవాల్” అంటూ దున్న యాదగిరి, కోడూరి విజయ్ కుమార్, వి.బాలరాజు, వేదన భూపతి…వేసిన ప్రశ్నలు, సమాధానాలు పాజిటివ్ నెగెటివ్ అంశాలను ప్రస్తావించడం పత్రికకు  ప్రత్యేకతను ఆపాదించాయి. ముస్లింవాదంపై ప్రత్యేక గళమెత్తిన సారా అబూబకర్ ఇంటర్వ్యూ. మన అందరికీ సుపరిచితమైన, ఇష్టమైన కవి అఫ్సర్ ఇంటర్వ్యూను కూడా ఇదే ప్రతిలో చూడవచ్చు. అంతేనా…ముస్లింల మూలాలెక్కడ ఉన్నాయో, వారి పేదరికానికి కారణాలేమిటి?, వారెందుకు వెనుకబడ్డారు, ఈ వెనుకబాటుతనంలో ముస్లిం మహిళల వెనుకబాటు ఎక్కడ దాగుంది, ముస్లింలంటే ద్రోహులా?, రాజకీయంగా వారిపై జరుగుతున్న, జరిగిన కుట్రలేమిటి?…ఇలా అనేక అంశాల సమాహారంగా ఈ పత్రిక మనముందు ఉంటుంది.
చదవడానికి అందరూ సిద్ధమే కదా?!
*

రెండు పదుల దక్కనీ ఘోష!

Siddharta Book Coverసిద్దార్థ 1994 లో “దీపశిల” తో తెలుగు సాహితీలోకానికి వచ్చి “దీపశిల సిద్దార్థ” గా పేరు తెచ్చుకొన్నారు. ఇప్పుడు తన ఇరవై సంవత్సరాల కవిత్వాన్ని ఒకచోటకు చేర్చి ‘బొమ్మలబాయి’ పేరుతో సంపుటిని తెచ్చారు. సిద్దార్ధ కవిత్వంలో – గొప్పజీవన కాంక్ష, ఆదిమ సౌందర్యం, వలస దుఃఖం, గ్రామ్యజీవనం వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. ఇప్పుడు వస్తున్న కవిత్వ తీరులకు పూర్తి భిన్నంగా ఉంటూ చదువరులకు సరికొత్త పఠనానుభవాన్ని కలిగిస్తుంది.

ప్రముఖ మళయాలి కవి సచ్చిదానందన్ “కవిత్వానికి సమాంతర భాష కావాలి” అంటారు. అంటే – కవిత్వంలో వాడే పదాలు తమ మామూలు అర్థాల్ని వదిలి వేరే విశిష్టార్థాల్ని ధ్వనించాలని, వాక్యాలు ఒట్టి వాచ్యంగా ఉండకుండా భిన్న పొరలలో ఒక అనుభవాన్ని దర్శింపచేయాలని ఆయన ఉద్దేశం. అలాంటి కవిత్వంలో పదాల అర్ధాలు క్రమక్రమంగా అదృశ్యమై మనోద్వేగం (Emotion) మాత్రమే మిగుల్తుంది. పదాలు అర్ధాల్ని వీడి ఉద్వేగాన్ని తొడుక్కొంటాయి. ఏ ఉద్వేగానికి కవి లోనై ఆ కవితను సృజించాడో అది యధాతధంగా స్పష్టంగా దర్శనమిస్తుంది. “సమాంతర బాష” అని సచ్చిదానందన్ అన్నది అలాంటి కవిత్వభాష గురించే. ఇది ఉత్తమోత్తమ కవిత్వాభివ్యక్తి.

తెలుగు సాహిత్యలోకంలో సమాంతరభాషలో కవిత్వం వ్రాసే అతికొద్దిమందిలో సిద్దార్థ ఒకరు.

కురిసిన వానలన్ని ఏమయిపొయ్యాయి
పక్కటెముకల ఎద్దూ ఆకాశమూ
ముచ్చటించుకొంటున్నాయి
భూమిపొరల్లో దొరికిన వొకడి అస్థిపంజరం గురించి
అందులో పడుకుని నిద్రిస్తూన్న
పచ్చచిలుక దేహం గురించి—- “వానలు సిప్తల వనాలు” అనే కవిత ఒక భయంకరమైన కరువును సమాంతర భాషలో దృశ్యమానం చేస్తుంది. ఆ అస్థిపంజరం రైతుది కావొచ్చు, అతనిలో నిద్రిస్తున్న పచ్చచిలుక అంటే అతను జీవితకాలమంతా ఎదురుచూసిన పచ్చదనం అవ్వొచ్చు. ఇక్కడ పదాల అర్ధాలు అదృశ్యమై వాక్యాలు కరువుకాలపు ఉద్వేగాల్ని ఆవిష్కరిస్తాయి.

‘బొమ్మలబాయి’ లో కనిపించే అనేక దేశీపదాలు, ప్రయోగాలు జానపద సాహిత్యరూపానికి దగ్గరగా ఉంటాయి. సమకాలీన కవిత్వరీతులతో పోల్చితే ఇది ఒక భిన్నమైన స్వరం. బండమైసమ్మ, గట్టుమైసమ్మ, ఒగ్గుకథలు, బాలసంతు, పెద్దలకు బియ్యాలివ్వటం, శివసత్తు, ప్రభలు, మల్లన్న, గండెమ్మ, జోగిని, చిందెల్లమ్మ వంటి వివిధ విషయాలు, ఒక ప్రాంత సంస్కృతికి, ఆధునీకరణ పేరుతో మార్జినలైజ్ అవుతున్న జీవనరీతులకు ప్రతీకలు. వీటిని స్మరించుకోవటం, అక్షరాలలో పదిలపరచటం నేటి కాలానికి చాలా అవసరం. సిద్దార్థ తన కవిత్వం ద్వారా ఆపని చేసినట్లు బొమ్మలబాయి నిరూపిస్తుంది.

సిద్దార్థ కవిత్వం నిండా పల్లెదనం ఉంది. అక్కడ గడిపిన బాల్యం ఉంది. ఖేదమో మోదమో అర్ధంకాని ఆధునిక జీవనముంది. తనకలలకు, జ్ఞాపకాలకు వారధిగా నిలిచి తనలోకి కవిత్వప్రవాహాల్ని ఒంపిన మహా నగరముంది.

సీమసింతకాయ నవ్వినట్టు
నల్లతుమ్మ పువ్వు పసుపై రాలినట్టు
తనకడియాల దరువులో కాలమంతా పొగిలినట్టు -(బుశ్శెడ) అంటూ పల్లె సౌందర్యాన్ని కళ్లకుకడతాడు.

సిటీ కదులుతూంటే
ఎటుతిరిగినా వొక బరువుంటుంది
నన్ను నాకుతూనే వుంటుంది
వలసపోవటం ఎంత నరకం
నా గూడుకు నేనే కిరాయి కడుతున్నాను -(సింగాడ) అంటూ నగర జీవనపు ఒరిపిడిని, వలస దుఃఖాన్ని పట్టుకొంటాడు.

బాకీ మొత్తం/అతివాస్తవం
వొక మల్టిమీడియా బ్లూ సరస్సు
దానిపైని ఫ్లైవోవరు
పేగును కొరికే కరెంటు బిల్లు
కుత్కెలోపల వంకరగా దిగిన రేగుముల్లు// -(కర్రెసామీ జంగపోడా) వాక్యాలలో నగరజీవితాన్ని నగ్నంగా మనముందు నిలుపుతాడు. ఫ్లైవోవర్లు, హైటెక్ సిటీలతో అందంగా కనిపించినా, తీర్చాల్సిన అప్పులు, కరంటుబిల్లు కట్టలేనితనం, మహాకవి కాళోజీ “ఏం తినేట్టు లేదు, ఏం తాగేట్టు లేదు” అన్నట్టు గొంతులో దిగిన ఆకలిముల్లు….. అని ఒకానొక భీభత్స దృశ్యాన్ని చూపిస్తాడు చిన్న చిన్న పదాలలో. సిద్దార్థ కవిత్వగొప్పతనం అది.

అజంతా కవిత్వంలో పదే పదే వచ్చే భయం- రాక్షసాకారం దాల్చి రక్తం పీల్చే మహానగరం పట్ల భయకంపితుడైన వ్యక్తి వైయక్తిక అనుభవంలా అనిపిస్తుంది అంటారు నున్నా నరేష్ ఒక మిసిమి పత్రికా వ్యాసంలో. ‘బొమ్మలబాయి’ లో కూడా భయం, ఒక భీతావహ వాతావరణం అనేక కవితల్లో కనిపిస్తుంది. కానీ ఇది వైయక్తిక అనుభూతిగా కాక ఒక సామాజిక ప్రకటనలా వ్యక్తమౌతుంది.

భయం తింటున్న జాతివాణ్నని
తిట్టూ తిట్టూ నాకేమీ సిగ్గులేదు//
నా భయమో పదిజిల్లాలంత వెడల్పూ
ఏడు సముద్రాలంత లోతూ. — అంటాడు (భయచరాన). ఇక్కడ పదిజిల్లాలు అనటం ద్వారా తన సమాజపు చారిత్రికనేపథ్యాన్ని ప్రతిభావంతంగా ప్రతిబింబించగలిగాడు సిద్దార్థ. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే మలిదశ తెలంగాణా పోరాట సాహిత్యం ఇంకా ఊపందుకోని కాలం లోనే (1999) సిద్దార్థ భవిష్యత్తుని దర్శించాడు. ఆ తరువాత కాలంలో విరివిగా వచ్చిన తెలంగాణ అస్థిత్వ సాహిత్యానికి సిద్దార్థ కవిత్వం చక్కని భూమికను ఏర్పరచిందనటంలో సందేహం లేదు.

సిద్దార్థ కవిత్వాన్ని ఓపికగా చదవాలి. ఏ వాక్యమూ వాచ్యంగా ఉండదు. అంతా ధ్వనిప్రధానంగా ఉంటుంది. ఆ వాక్యాన్ని మనోలోకంలో మరోసారి చదువుకొన్నప్పుడు ఏదో దృశ్యం కనిపిస్తుంది. దాన్ని అలా మనకు మనం ఏర్పరుచుకొన్నప్పుడు గొప్ప తృప్తి ఆనందం కలుగుతాయి. ఇది ఒకరకంగా డీకోడింగ్ చేసుకోవటం లాంటిదే. ఆ కాస్త ప్రయత్నం చేయని/చేయలేని వారికి సిద్దార్థ కవిత్వం జఠిలంగా కన్పించవచ్చు. కవిత్వం రాయటంలో కవి పడే తపనతో పోల్చుకొంటే, పాఠకుడు కూడా ఎంతోకొంత శ్రమించకపోతే కవిత్వప్రయోజనం ఎలా దక్కుతుందీ?

కినిగె పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “కవిత్వం అనేది నేచర్. నేను మీడియం మాత్రమే. మన చుట్టూతా ఉండే అనేకానేక శక్తులు మన మీద దాడి చేసి, మనల్ని ఎంచుకుని, ఒక మీడియంలా వాడుకుని వదిలేస్తాయి. అప్పుడు కవిత్వం పుడుతుంది” అంటారు శ్రీ సిద్దార్థ. ఈలోకంలో చెట్టు, పుట్టా రాయి రప్పా వాగు గుట్టా వాటి పనులు నిర్వహిస్తున్నట్లే నేనూ నా పని నిర్వహిస్తున్నాను అంటూ కవిత్వాన్ని ఒక ఒక సహజమైన స్వభావంలా భావించే శ్రీ సిద్దార్థ ‘బొమ్మల బాయి’ మంచి, చిక్కని కవిత్వాన్ని ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది. ఎందుకంటే ఇది స్పందించే హృదయమున్న కవి రెండు దశాబ్దాల జీవితపు కవితాయాత్ర.

పుస్తకం పేజీలు: 208
వెల: 150/-
ప్రతులకు: 9848015364

నక్షత్ర భరిణ

 

moshe

Art Work: Moshe Dayan

అలా ఒలింపస్ పర్వతసానువుల్లో నువ్వు పచ్చని చెట్ల నీడలో కూర్చుని నీలాకాశం, నీలి తటాకం, ఎర్రని కొండచరియలకేసి చూస్తూ విరబోసిన జుట్టుతో కాటుక కళ్ళతో శరీరాన ధరించిన పల్చటి పట్టు వస్త్రాలతో శిల్పంలా కూర్చుని వుంటే నాకెలా వుంటుంది…?

… ఎప్పుడూ నిన్నే చూడాలనిపిస్తుంది! నీ మాటలే వింటూ నీ పాటలకే చెవులప్పగించి నీ కళ్ళ లోకి చూస్తూ… నీ మనసులోని ఉద్వేగ తరంగాలకి స్పందిస్తూ అలానే ఓ వంద సంవత్సరాలు గడిపేయాలనిపిస్తుంది.

అసలు వంద సంవత్సరాలంటే వంద కెప్లర్ సంవత్సరాలు. పట్టు వస్త్రాలంటే ఈ కెప్లర్ గ్రహంలో పెరిగే పట్టు పురుగుల నుంచి తీసిన దారాలు, నీలి ఆకాశం అంటే కెప్లర్ గ్రహ ఆకాశం లోని వాతావరణం వల్ల వచ్చే రంగే.

అలా ఫెళ్ళుఫెళ్ళున కాసే ఎండలో చెట్ల నీడలో కూర్చుంటాం. నువ్వు కవితావేశంలో పద్యాలు చెబుతావ్. నేను సెలయేళ్ళలో స్నానాలు చేసి ఎండలు వళ్ళు ఆరబెట్టుకుని దగ్గర్లో వున్న నీలి నీళ్ళ తటాకంలో మంచినీళ్ళు తాగి, నీ దగ్గరకి వస్తాను. దూరాన కెప్లర్ గ్రహ ముఖ్య పట్టణం లిబర్టీ నుండి తెచ్చుకున్న ఆహారం – గోధుమలతో చేసిన అన్నం, కూరలు, పళ్ళు, మాంసాలు, మంద్రంగా మత్తెక్కించే ద్రాక్షరసం – ఆ రోజల్లా గడిచిపోతుంది.

రోజంటే రోజూ రోజే! సాయంత్రం ఎప్పటికీ రాదు.

చీకటి ఎప్పటికీ రాదు. నీడలు ఎప్పుడూ పొడుగవవు.

ఎప్పటికీ రాత్రి రాదు. ఆకాశం నీలంగా ధగధగా మెరిసిపోతుంది. నడయాడే తెలిమబ్బులు కనబడినా, ఎప్పుడైనా కాంతితో మెరిసే సూర్యుళ్ళు… ఒకరు ఉదయిస్తూనో మరొకరు అస్తమిస్తూనో ఉంటారు. ఇద్దరూ కలిసి అయినా మెరుస్తారు లేక ఒకరు మెరుస్తుంటే మరొకరు విశ్రమిస్తునే వుంటారు. అందుకే ఎప్పుడూ పగలే కెప్లర్‌లో. ఎప్పుడూ కాంతే, ఎప్పుడూ వెలుగే.

“నాకు చల్లటి రాత్రి కావాలి” అంటుంది. “ఈ సూర్యకాంతి వద్దు. తెల్లటి మబ్బులు, మెరిసే చుక్కలు కావాలి” అంటుంది ఫిలోమీనా.

“నీకెలా తెలుసు? మబ్బులు అంటే ఏమిటి? చుక్కలు ఎలా వుంటాయి? రాత్రి ఎలా వుంటుంది?” అని అడుగుతాను.

“హెరోడోటస్! నాకు తెలుసు. నా కలల్లో రాత్రి నావహించే నీలి నీడలు, తెల్లని చల్లని స్వచ్ఛమైన కాంతి, మెరిసే నక్షత్రాలు, ఆకాశంలో తేలిపోయే నేను…”

నేను నవ్వుతాను. ఎప్పుడూ నవ్వుతూనే వుంటాను. ఈ కెప్లర్‌లో రాత్రి లేదు. చీకటే లేదు. నక్షత్రాలంటే ఏమిటి? మబ్బులంటే ఏమిటి? అంతా సూర్యశక్తే. ఇద్దరు సూర్యుళ్ళ శక్తి నుంచీ ఆహారం సంపాదించి చెట్లు పెంచుతాం. కృత్రిమ వాతావరణంలో మొక్కలు పెంచుతాం. ఎక్కడి నుంచో ప్రవహించి వచ్చే నదుల జలాల నుంచీ నీరు తీసుకుని పంటలు పండిస్తాం. ఇద్దరు సూర్యుళ్ళు ధ్రువాల్లోని అంతులేని మంచుని కరిగిస్తూనే వుంటారు. నీరు సెలయేళ్ళుగా పొంగి పొరలుతునే వుంటుంది. ఇంక ఆకాశం నుంచి వాన ఎందుకు? రాదు కూడా! ఒక సూర్యుడిని మబ్బులు మూసినా మరో సూర్యుడు వెలుగుతూ ఉంటాడు. వాన ఎప్పుడో కాని రాదేమో. ఎప్పుడూ వెలుతురే. ఎప్పుడూ ఆకాశం తళతళా మెరుస్తూంటుంది. నవ్వాను.

“కల కన్నాను” అంటుంది ఫిలోమినా.

కెప్లర్ దాటి అంతరిక్షంలోకి ఎగిరిపోయినట్లు ఏవేవో వింత లోకాలు చూసినట్లు, లక్షల కొద్దీ మినుకు మినుకుమనే చుక్కలు… ఏవేవో వింత స్వరాల పిలుపులు!”

నేను నవ్వాను. “లిబర్టీ నగరంలో అబ్జర్వేటరీలు శాస్త్రజ్ఞులు ఈ విషయంపై ఎప్పుడూ పరిశోధనలు జరుపుతూనే వుంటారు. వాళ్ళకే తెలియనిది నీకెలా, నాకెలా తెలుస్తుంది? మనం వచ్చింది ఈ రెండు రోజులు హాయిగా గడిపి వెళ్ళడానికి అంతే!”

కొండలు తళతళా వెండి వెల్తురుతో మెరుస్తున్నాయి. చెట్ల ఆకులు హరితంతో మిలమిలలాడుతున్నాయి. బాల్యం నుంచి కెప్లర్ చరిత్ర చదువుకున్న రోజులు గుర్తుకొస్తాయి. మూడు శతాబ్దాల కొకసారి చీకటి వస్తుందట. అదేనా ప్రళయం? గ్రహం అంతా అంధకార బంధురమై పోతుందట. ప్రజలందరు ఉన్మాదులై ఒకరినొకరు హింసించుకుని చంపుకొంటారట. ఆకాశంలో మెరుపులు, మెరిసే చుక్కలు, పాములు లాంటి తోకచుక్కలు కనిపిస్తాయి అట. అలా ఒక నాగరకత అంతమయిపోయి దేవుడు ఆకాశంనుంచి దిగివచ్చి పాపహరిహారాలు చేసి శిక్షలు విధిస్తాడట!

ఈ కథ నేను చదువుకున్న చరిత్ర పుస్తకాలలోదే! కాని ఎంతవరకూ నిజమో, అసలు చీకటి ప్రళయం నిజంగా వస్తుందా? వస్తేనే చుక్కలు ఆకాశంలో మొలుస్తాయా?

“నాకు నక్షత్రాలతో నిండిన ఆకాశపు పందిరి కింద పాటలు పాడాలని వుంది” అంది ఫిలోమినా.

“సరేలే పద! వచ్చింది ట్రెకింగ్ చేయడానికి. ఇప్పుడు ఈ నక్షత్రాల గోల ఏమిటి?” అని విసుక్కున్నాను.

 

కొన్నాళ్ళ క్రిందట కొందరు కెప్లర్ యువ శాస్త్రవేత్తలు – మన గ్రహవ్యవస్థ దాటి, ఇంకా గ్రహాలున్నాయనీ, వందల అంతరిక్ష నక్షత్రాలున్నాయనీ వాదించారు. ఒక గుడారంలో చిల్లులు పెట్టిన నల్లటి గుడ్డ కట్టి వేసి అందరినీ దాంట్లోకి ఆహ్వానించి చీకట్లో పైకి చూడమన్నారు. కాంతి చిన్న చిన్న నక్షత్రాల వలె కంతల్లోంచి మెరిసింది.

Kadha-Saranga-2-300x268

“విశ్వాంతరాళపు శక్తి అలా నక్షత్రాల వలె కనిపిస్తుంది. మన సూర్యుళ్ళు కాంతిలో మెరవడం వలనే అవి కనపడడం లేదు. సూర్యుళ్ళు ఆరినా, ప్రకాశించడం మానేసినా ఆ చీకటికి కనిపిస్తాయి సుదూర నక్షత్రాలు. ఇది మా సిద్ధాంతం!” అనేవారు. “అది తెలియక చీకటి ప్రళయం అని కొందరు కెప్లర్ ప్రజలు తరతరాలుగా భయపడి నాగరకతని నాశనం చేసుకున్నారు.”ఆని వాదించేవారు.

ఎవరూ ఒప్పుకోలేదు. మత విశ్వాసులు అసలే ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరినీ జైలులో వేశారు. యావజ్జీవ శిక్ష!

ఫిలోమినా నవ్వింది. “నేను ఇప్పటికే ట్రెకింగ్ చేసి వచ్చాను. మళ్ళీ వెళదాం. ఆ దూరపు కొండ చరియలో ఎన్నో నివాసాలున్నాయి. కొండ గుహలు!!! అక్కడ నాకొక ముసలి సాధువు తపసు చేస్తూ కనిపించాడు. ఎన్నో గుహలున్నాయి. వాటిలో వెల్తురు లేదు. ఆ చీకటిలోనే వాళ్ళు ధ్యానం చేస్తున్నారు”.

“నిజమా!” ఆశ్చర్యపోయాను.

“మనకి తెలియని వింతలు ఎన్ని వుంటాయి! పద! నేనూ చూస్తాను”

ఎర్రటి రాతి బండల మీద ఆకుపచ్చని నాచు మొలిచింది. వాటి మీద నడుచుకుంటూ ఇద్దరం బయలుదేరాం. ఎండ ఫెళఫెళమని తలని కాలుస్తోంది. ఆల్ఫా వన్ సూర్యుడు పటమట, ఆల్ఫా టు నడిన కిరణాల వెదజల్లుతున్నారు. వీపు మీది సంచుల్లో నుంచి నీళ్ళు తీసుకుని తాగుతూ నడిచేం.

మూడో గుహ చూపించి “అక్కడ” అంది ఫిలోమినా. ఆమె కళ్ళు ఆతురతతో మెరిసాయి. “ఇద్దర్నీ రమ్మన్నాడు ఆ సాధువు?” అంది.

గుహాంతర్భాగంలో చీకటిలో దూరాకా, ఎత్తయిన రాతి వేదిక మీద కూర్చున్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాల వయస్సో వూహించడం కష్టం. తెల్లటి, ఎర్రటి జడలు కట్టిన గడ్డాలు మీసాలు జుట్టు. మాసిన కాషాయ రంగు వస్త్రాలు. నుదుటన తెల్లటి చారలు అడ్డంగా. అది ఒక మత చిహ్నమా? నాకు తెలీదు.

కాగడాలు అతని చుట్టూ వెలుగుతున్నాయి. వాటి నుంచి నూనె వాసనా, నల్లటి పొగలూ వస్తున్నాయి.

ఇద్దరం ఆయన దగ్గరికి వెళితే, సాగిలబడి దండం పెట్టమని  నాకు సంజ్ఞ చేసింది ఫిలోమినా.

“ఓం… శివోహం!” అలాంటి కంఠస్వరం నేనెన్నడూ వినివుండలేదు. ఆయన కళ్ళు తెరిచి చూశాడు.

“హెరోడోటస్, ఫిలోమినా! దీర్ఘాయుష్మాన్ భవ!” అన్నాడు.

ఫిలోమినా చెప్పింది రహస్యంగా – “అది సంస్కృత భాష. ఏదో సుదూర గెలాక్సీ గ్రహంలోనిది!”

“ఆమె నన్నడిగింది ప్రళయం ఏమిటని? ఎలా తప్పించుకోవాలి అని!” సాధువు గంభీర స్వరంతో చెప్పసాగాడు.

“చీకటి ఏర్పడుతుంది. ఇద్దరు భానులు ఆరిపోతారు. ఈ కెప్లర్ గ్రహం అంతటా చీకటి ఏర్పడుతుంది. అది ప్రళయం కాదు. సహజమైన ఖగోళ పరిణామం. కాని ఈ అంధ విశ్వాసులు, ఒకరినొకరు భయంతో చంపుకొంటారు, గృహదహనాలు చేస్తారు. సైతాను వచ్చిందని నమ్ముతారు. నాగరకత నాశనమవుతుంది. మళ్ళీ కాంతి వస్తే మళ్ళీ మొదలవుతుంది! మీరిద్దరూ ఆ ప్రళయాన్ని తట్టుకోండి. ఈ గుహల్లో దీపాలున్నాయి. అవే కాంతిని ఇస్తాయి…”

ఫిలోమినా చేతులు జోడించి, “ఈసారి చీకటి ప్రళయం ఎప్పుడు వస్తుంది స్వామీ?” అన్నది.

నిశ్శబ్దం. టపటపా మండే కాగడాల చప్పుళ్ళు తప్ప.  ఎక్కడి నుంచో హోరు గాలి.

ఆయన చేతిలో హఠాత్తుగా ఒక భరిణ ప్రత్యక్షమయింది. నీలంగా వుంది. దాని మూత వెల్వెట్‌తో కప్పబడి వుంది. ఆ మూత నిండా వేలకొద్డీ వజ్రాల లాంటి కాంతిని చిమ్మే రాళ్ళు పొదగబడి మెరుస్తున్నాయి. అది ఒక కూజా ఆకారంలా వుంది. దాని లోపల ఎర్రటి ఇసుకలాంటి పదార్థం అణువులు అణువులుగా భరిణలోకి క్రింది అరలోకి జారుతోంది. అది పారదర్శకంగా కనిపిస్తోంది.

“అవర్ గ్లాస్! ఒక రకమైన కాలయంత్రం!”’ నేను విజ్ఞాన పురాతన దర్శినిలో చదివాను” అంది ఫిలోమినా. క్రింద అర పూర్తిగా నిండిపోయింది. కొంచెమే ఖాళీ!

“మూడు వందల ఏళ్ళ కొకసారి ఆల్ఫా వన్, ఆల్ఫా టు సూర్యులు కెప్లర్ గ్రహమూ, దాని ఉపగ్రహాల నీడలలో పడి గ్రహణానికి గురి అవుతారు. అప్పుడు సంపూర్ణ ద్విసూర్య గ్రహణం ఏర్పడి గ్రహం అంతా చీకటి అవుతుంది. అది ప్రళయం అని, సైతాను ఆకాశంలోంచి చుక్కల రూపంలో వస్తాడని మూఢ మత విశ్వాసులు నమ్ముతారు. నాగరకతని నిర్మూలిస్తారు.

అవి ఆకాశంలో మెరిసే నక్షత్రాలు. అవన్నీ సుదూర గెలాక్సీలలోని గ్రహాలు, నక్షత్రాలు. వాటి నుంచి వచ్చే కాంతి! సూర్యకాంతి లేకపోతేనే అవి కనిపిస్తాయి. రాత్రి లేని గ్రహంలో అదే ఒక వింత! వింత భయం! కింది అర నిండగానే సూర్యగ్రహణాలు మొదలవుతాయి. మీరు ఆ గొడవలకి దూరంగా పోయి మిమ్మల్ని మీరు రక్షించుకోండి!”

“మీకు… ఎలా తెలుసు స్వామీ?”

“అనేక వందల సంవత్సరాల నుంచి మా పూర్వీకులు గణితంలో ఈ లెక్కలు నేర్చుకుంటూ వున్నారు. అంతం, ఆరంభంల నుంచే నేను ఇక్కడ తపస్సులో మునిగిపోయాను. నిజంగా ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు! శివోహం.”

కాగడాల వెలుతురులో గుహలోని అల్మారాలు పాత డిజిటల్ కంప్యూటర్లు, కాగితంతో కూడా చేసిన గ్రంథాలు ఇప్పుడు స్పష్టంగా కనిపించాయి.

“ఫిలోమినా! దైవం నిన్ను నా దగ్గరకి పంపింది.  తీసుకో! శుభం భూయాత్!”

నక్షత్ర భరిణని కళ్ళకద్దుకుంది ఫిలోమినా.

నేను అనుమానంగానే ఆయనకి నమస్కరించి బయటకి నడిచాను.

***

కాలం గడుస్తోంది. నక్షత్ర భరిణలోని పై అర లోంచి ఇసుక రేణువులు చాలావరకు క్రింది అరలో నిండిపోతున్నాయి.

లిబర్టీ నగరంలో మా ఇంట్లో కూర్చుని వున్నాం. క్రమంగా ఆల్ఫా వన్ సూర్యుడు పడమట పసుపురంగులోకి, ఆ తర్వాత సగం నలుపు, సగం పలచటి ఎరుపులోకి మారిపోతున్నాడు. నడినెత్తిన ఆల్ఫా టు సూర్యుడు సూర్యకాంతి నల్లగా అయి అంచుల్లో తెలతెల్లగా మెరుస్తున్నాడు.

ఫిలోమినా, నేను – ఆహారం, చీకటి రోజుల కోసం కాగడాలు, తాగడానికి నీళ్ళూ, చలి తట్టుకోడానికి దుస్తులు అన్నీ సర్దుకున్నాం.

“కొండల్లోకి పోదాం” అన్నది ఫిలోమినా.

లిబర్టీ నగర వీధుల్లో కలకలం. “ప్రళయం… ప్రళయం” ఎవరి నోట విన్నా అదే మాట.

‘ఇండిపెండెంట్ స్క్వేర్’ లో వున్న ఖగోళ పరిశోధనాలయం దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతోంది.

శాస్త్రజ్ఞులు నలుగురు ఓపికగా సమాధానాలు ఇస్తున్నారు.

“కాదు. ఇది ప్రళయం కాదు. మన దైవం మరణించదు. సైతాను చుక్కల రూపంలో రాడు. ఇది ఒక గ్రహణం మాత్రమే. నమ్మండి.”

మత చిహ్నాలు ఒంటినిండా పూసుకున్న గడ్డాలు మీసాల విలేకరి హుంకరించాడు.

“ఎలా చెప్పగలరు? ఇది దైవ లిఖితం. ఈ నాగరకత నశించాలని రాసి పెట్టివుంది. ఇది ఎన్నో సార్లు జరిగింది. అందరినీ మీరు మభ్యపెడుతున్నారు.”

మేము జనసమూహంలోంచి తోసుకుంటూ వూరి బయటకి నడిచాం.

నక్షత్ర భరిణ పూర్తిగా ఖాళీ అయిపోయింది. క్రింది అర పూర్తిగా నిండింది.

ఇంకా నడిచాం. దూరాన కొండల మీద నీడలు అలముకుంటూ వున్నాయి.

చీకటి నాకు కొత్త. చలి నాకు కొత్త. ఆల్ఫా వన్, ఆల్ఫా టు ఇద్దరూ పూర్తిగా ఆరిపోయారు. ఒక్కసారిగా అంధకారం అలముకుంది.

ఆ సరికి మేం ఒలింపస్ కొండ గుహల దగ్గరికి వచ్చేశాం.

సాధువులంతా గుహల బయటకి వచ్చి ఆకాశానికేసి చూస్తూ – ఏదో వింత భాషలో – ప్రార్థనలు చేస్తున్నారు.

ఒక్కసారి ఆకాశం దేదీప్యమానంగా వెలిగింది. లక్ష దీపాలు వెలిగాయి. ఆకాశంలో చుక్కల పందిరి వెలిసింది. నీలం, పసుపు, తెలుపు, పెద్దవి, చిన్నవి, తోకలతో కొన్ని, తెలిమబ్బులతో కొన్ని అసంఖ్యాకంగా మినుకు మినుకుమని మెరుస్తూ వెలుస్తున్నాయి. అవి వెలిగే దీపాల్లా సువాసన లేని పువ్వుల్లా మెరిసే నక్షత్ర మాలికలు.

వాటి కాంతితో అస్పష్టంగా మెరుస్తున్నాయి కొండలు.

సాధువులు చేతులు ఆకాశం వైపు ఎత్తి పెద్ద గొంతులతో అనేక వింత భాషలలో ప్రార్థిస్తున్నారు.

ఒక వింత చలి ఎముకలని ఒణికిస్తూ ఆరంభమైంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు అరుస్తూ చెట్ల నుంచి ఎగిరిపోయాయి. కొన్ని అడవి జంతువులు అరవడం వినబడుతోంది.

“ఇద్దరం కొండ మీదకి ఎక్కేద్దాం. ఉన్ని దుస్తులు వేసుకో! భయపడక! ఇదంతా త్వరలో ముగిసిపోతుంది!”

కొండ సగం ఎక్కినాక ఇద్దరం దక్షిణం వైపు లోయలో వున్న లిబర్టీ, కెప్లర్ గ్రహ ముఖ్య పట్టణం వైపు చూశాం.

చీకటి, బొమ్మరిళ్ళ లాంటి ఇళ్ళని కప్పేసింది. చుక్కల వెలుగురు అస్పష్టంగా వాటి మీద పడి అది ఒక భీతి గొలిపే దృశ్యంలా ఉంది.

ఎందుకంటే హఠాత్తుగా మంటలు చెలరేగాయి. పట్టణంలోని భవనాలు నిప్పు అంటుకున్నాయి. బహుశా ఖగోళ పరిశోధనాలయం కూడా అంటుకుంటుంది.

గాలిలో అలలు అలలుగా కేకలు, నినాదాలు వినబడుతున్నాయి. అవి మాకు తెలిసిన కెప్లరీ భాషలో ‘దేవుడి శాపం, దేవుడి శాపం, అంతా నశించిపోవాలి’ అన్న అరుపులు మిన్నుముట్టాయి.

అప్రతిభులమై, ఆశ్చర్యంతో, భయంతో దూరాన వున్న ఆ దృశ్యాన్ని చూడసాగాం నేనూ ఫిలోమినా.

కెప్లర్ గ్రహపు ఇద్దరు సూర్యుళ్ళు ఆరిపోయిన వేళ దీర్ఘరాత్రిలో చీకటి ప్రళయం మొదలయింది.

 

(ఈ రచనకు ఐజాక్ అసిమోవ్ వ్రాసిన “నైట్‌ఫాల్ అనే కథ స్ఫూర్తి. నక్షత్ర భరిణ అనే పదం ఉష మరువం రాసిన కవిత్వంలో చదివి ఈ కథ వ్రాశాను. ఆమెకీ, అసిమోవ్‌కి కృతజ్ఞతలు!)

 

ఎన్నెన్నో వర్ణాల పరికిణీ!

parikini600

అవును, అచ్చతెలుగు అమ్మాయి వేసుకొనే  – పరికిణీయే!

భరణి గారి కలంలో ఇన్ని కళలు ఉన్నాయా  ఇన్ని సొగసులు ఉన్నాయా అనిపించే మహత్తర విందు భోజనం ఈ కవితా సంకలనం. ఇవి నిజానికి భరణి అనుభవాల, అనుభూతుల నుండి రాలిన భావోద్వేగాలు. వీటిలో కవిత్వం మాత్రమే కాదు, కసి, కోపం, ద్వేషం, ప్రేమ, అసహనం, ఆప్యాయత, హాస్యం, భయం, వీరం అన్నీ కనిపిస్తాయి.

మరో చిత్రం ఏమంటే ? తెలుగులో ఎన్ని వర్ణాలో అనిపించేలా  వీటిల్లో పదప్రయోగాలు, విరుపులతో పాటు అన్ని యాసలూ కనిపిస్తాయి.  వినిపిస్తాయి.

మద్యతరగతి మనుషుల్లో కనిపించే చిత్రాలు, విచిత్రాలను తనదైన శైలిలో కళ్ళెదుట కనిపించేట్టు చేస్తారు భరణి. ఆయన శైలి మనతో మాట్లాడినట్టో లేదా నిలదీసి అడుగుతున్నట్టో అనిపిస్తుంది. అక్షరాలను ఆయుధాలుగా చేసి బాణాలుగా వదిలిన 26 కవితల ఈ సమాహారంలో ఒక్కో కవిత ఒక్కో సాక్ష్యం అనడం అతిశయోక్తి కాదు.

——-

మనకే సొంతమైన అందమైన పరికిణీని  మిడ్డీలు, చుడీలు మాయం చేస్తున్నాయనే ఆక్రోశం నుండి పుట్టినదే పరికిణీ.

మధ్యతరగతి సంసారంలో కష్టాలను అధిగమించలేక సతిపై తాండవమాడే  – మద్యతరగతి నటరాజు

ఆశల ఆవకాయ జాడీలను కళ్ళలో కలలుగా మార్చుకొని తృప్తిపడే సామాన్యుడి – ఖారం ఖారంగా

అందం, డబ్బులేక పెళ్ళికాని కన్యలతో ఆడుకొనే పెద్దల ఆట, ఆడపిల్లల వేట అయిన పెళ్ళిచూపుల ప్రహసనం

ఉద్యోగం పురుషలక్షణం అన్నారు, ” ఒక్కరోజన్నా ఉద్యోగం చేసి చచ్చిపోవాలి” అని ఆలోచించే అసహాయ  – గ్రాడ్యుయేట్

ఉడికీఉడకని అత్తెసరులాంటి సాహిత్యంతో సరస్వతిని చంపేస్తున్న మేధావుల సాహిత్యపు – మీల్స్ రెడీ

డబ్బే మనిషిని ఆడించే మాయ. ఆమాయలో ఘోరాలు ఎన్నో కదా అనే  – లచ్చింతల్లీ

శుభకార్యాలకు అపశకునంగా, అమంగళానికి అర్ధంలా అనుకొని విలువివ్వని పెద్దల గొప్పధనం చెప్పే –  బామ్మ

అర్ధంకాని అనేక ప్రశ్నలతో దేవుడ్నే అడిగే – చిలకప్రశ్న

వంట తప్ప మరేం రాదు అనుకొనే ఆలి గొప్పతనం అసువుగా చెప్పే – మా ఆవిడకు మంత్రాలొచ్చు

అద్బుతాలు ఆవిష్కరిచే చీర. రూపాలు మార్చుకొనే చీర. ప్రపంచంలో గొప్ప వస్త్రం ఏదయ్యా అంటే –  చీరే

రోబోట్ జీవితం, ఉదయం బ్రతికి రాత్రికి చచ్చే ఒకానొక – గుమాస్తా సూర్యుడు

శశిరేఖ, పార్వతి, మధురవాణి పాత్రేదైనా పలుకేను – సావిత్రి సావిత్రే అని

భువి నరకంలోనుంచి స్వర్గానికి చేరుకోవాలనే కూతురి ఓ లేఖ  – నాన్నకు….

 

ఇలాంటి ఆణిముత్యాలు మరెన్నో-  ప్రతి కవితలో అంతర్లీనంగా ఏదో ఒక సందేశం జతచేస్తూ, ఆలోచింపచేసేవిగా రాయడం ఒకెత్తు అయితే , ఎవరికైనా అర్ధం అయ్యేలా చిన్న పదాలతో భావాన్ని స్పురింపజేయడం మరొకెత్తు. భరణి చూసిన జీవితంలో చిత్రాలను అక్షరాలుగా మలచి అందించిన అందమైన ఈ పుస్తకం కేవలం చదువుకొని భద్రపరచుకోడానికే కాదు ఎవరికైనా ఇవ్వడానికి కూడా గొప్ప బహుమతిగా ఉంటుంది.

 

పుస్తకం – పరికిణీ

రచన- తనికెళ్ళ భరణి

వెల – 60

 

చెమ్మగిల్లిన వేకువలు

Art: Satya Sufi

Art: Satya Sufi

మూడు కావ్యాల ముచ్చట!

mani-92మనకి తెలుగులో ఐదు పంచకావ్యాలు (మనుచరిత్ర, వసుచరిత్ర, రాఘవపాండవీయము, పాండురంగ మహాత్మ్యము, శృంగార నైషధము)  ఉన్నట్లే తమిళంలో కూడా ఐదు పంచకావ్యాలు ఉన్నాయి.  అవి శిలప్పదిగారం, మణిమేఖల, జీవక చింతామణి, వళయాపతి, కుండలకేశి.

వీటిలో అత్యుత్తమ రచనలు, జంట కావ్యాలు అయిన శిలప్పదిగారం, మణిమేఖల కావ్యాలను  ఎమ్.ఎ తెలుగు పాఠ్యపుస్తకాలు చదివీ,   నెట్ లోని సమాచారం సేకరించీ,  అన్నిటికంటే ముఖ్యంగా నా కొలీగ్స్,  తమిళ ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకునీ గతంలో సారంగ పాఠకులకు సంక్షిప్తంగా పరిచయం చేశాను.  అదే విధంగా ఇప్పుడు మిగిలిన మూడు కావ్యాలను పరిచయం చేయడమే ఈ వ్యాసం ఉద్దేశం.  ఇవి నేను విన్న,  తెలుసుకున్న కథలు మాత్రమే గమనించగలరు.  తప్పులు ఉంటే మన్నించి మీకు ఇంకా ఈ కావ్య విశేషాలు తెలిసి ఉంటే ఇక్కడ పంచుకోవలసినదిగా కోరుకుంటున్నాను.

  1. శిలప్పదిగారం లింక్
  1. మణిమేఖల  లింక్

మిగిలిన మూడు కావ్యాలను ఈ క్రింది వ్యాసంలో చదవండి –

  1. జీవకచింతామణి

తమిళ పంచకావ్యాలలోని మూడవది “జీవక చింతామణి”.  కావ్య నాయకుడు జీవకుడు పుట్టినప్పుడు ఆకాశవాణి “జీవ”  అని పలికిందనీ,  అతని తల్లి “చింతామణీ,  నువ్వు నాకు లభించావా?”  అన్నదనీ ఈ కావ్యానికి జీవక చింతామణి అనే పేరు వచ్చిందంటారు.

శృంగార కావ్యమైన ఈ జీవక చింతామణి కావ్యాన్ని తిరుత్తక్కదేవర్ రచించారు.  ఈ కావ్యం 3145 వృత్త పద్యాలతో రచింపబడినది.    తమిళంలో వృత్తపద్యాలతో కావ్యరచనకి నాంది పలికినవాడు తిరుత్తక్కదేవర్.    ఈయన జైన మత సంప్రదాయానికి చెందినవాడు.

ఒకసారి తిరుత్తక్కదేవర్ మధుర పండిత పరిషత్తుకు వెళ్ళినప్పుడు అక్కడి పండితులు ‘మీరు – జైన సంప్రదాయవాదులు – ఎంత సేపటికీ సన్యాస దీక్ష గురించి రాయమంటే రాయగలరు గాని ప్రణయానికి సంబంధించిన రచనలు చేయలేరు”  అని అన్నారుట.  తిరుత్తక్కదేవర్  దానిని సవాలుగా తీసుకుని ఈ జీవక చింతామణి కావ్యాన్ని ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేశారుట.

ఇది చక్కని కావ్యంగా పండితుల ప్రశంసలను అందుకొన్నది.

కథా సంగ్రహం :

హామాంగద రాజ్యానికి రాజు సత్యంధరుడు.  ఇతడు దయార్ద్ర హృదయుడు.  ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు.  అతని మేనమామ కూతురైన విజయను వివాహం చేసుకున్నాక అతిలోక సౌందర్యవతి, అపురూప లావణ్యవతి అయిన ఆమెని వదలకుండా ఆమెతోనే కాలం గడపసాగాడు.  రాజ్యవ్యవహారాలన్నీ మంత్రులు చేజిక్కించుకున్నారు.

కాష్టాంగాకారుడు అనే మంత్రి రాజుని మట్టుపెట్టి తాను రాజవ్వాలనే దురుద్దేశంతో సైన్యాన్ని సమీకరించుకుని  సమయం కోసం వేచి చూస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా విజయ గర్భవతి అయింది.  నెలలు నిండాయి.  రేపో మాపో బిడ్డ పుట్టబోతాడని రాజు సత్యంధరుడు భార్యని విడవకుండా రేయింబవళ్ళు ఆమె చెంతనే ఉండసాగాడు.  అది అదనుగా భావించిన కాష్టాంగాకారుడు తన సైన్యంతో అంతఃపురాన్ని ముట్టడించాడు.  సత్యంధరుడు తన ఎగిరే యంత్ర విమానంలో భార్యను కూర్చుండబెట్టి ఆమెని పుట్టినింటికి వెళ్ళమని చెప్పాడు.   అక్కడున్న కొద్దిపాటి సైన్యంతో కాష్టాంగాకారుడిని ఎదుర్కొన్నాడు కాని యుద్ధంలో వీరమరణం పొందాడు.

విజయను తీసుకెళ్ళిన విమానం ఓ స్మశానంలో ఆగిపోయింది.  అక్కడ ఆమె ప్రసవించింది.  నిస్సహాయతతో హృదయవిదారకంగా ఏడుస్తున్న విజయని కాపాడాలన్న ఉద్దేశంతో ఓ దేవత మనిషి రూపంతో వచ్చి ఆమెని ఓదార్చింది.

ఆ సమయంలో రాజ్యంలోని ఓ ప్రముఖ వాణిజ్యశ్రేష్టి తన బిడ్డ చనిపోవడంతో కుమారుని ఖననం చేసిన చోటు కొచ్చి ఏడ్చుకుని  తిరిగి ఇంటికి వెళుతున్నాడు.  బిడ్డను ఎలా పెంచాలో ఏం చేయాలో తెలియక దుఃఖిస్తున్న విజయకు దేవత ఉపాయం చెప్పింది.  దానికి ఒప్పుకున్న విజయ బిడ్ద వేలికి రాజముద్రికను తొడిగి ఆ శ్రేష్టి వచ్చే దారిలో పరుండబెట్టి చెట్టు చాటుకి తప్పుకుంది.  బిడ్డను చూసిన శ్రేష్టి తన బిడ్డ చనిపోయినా భగవంతుడు మళ్ళీ ఈ బిడ్డను ప్రసాదించాడని భావించి చేతుల్లోకి తీసుకున్నాడు.  అప్పుడు చాటునుండి చూస్తున్న దేవత “జీవ”  అంది.  అది విన్న శ్రేష్టి ఆకాశవాణి ఆ మాటలు పలికిందని భావించి బిడ్డకు ‘జీవకుడు’  అని నామకరణం చేసి బిడ్డను తీసుకెళ్ళి భార్యకి ఒప్పచెప్పాడు.  బిడ్డ చేతికున్న రాజముద్రికను చూసిన వారు అతను రాజకుమారుడని తెలుసుకున్నారు.  రాజముద్రికను తీసి దాచిపెట్టి అతడు తనకి దొరికిన బిడ్డ అని అందరికీ చెప్పి అల్లారుముద్దుగా పెంచుకోసాగాడు.

విజయ స్మశానం నుండి బయటపడి అడవిని దాటి వెళ్ళి అడవికి ఆవలనున్న ఓ జైన ఆశ్రమంలో చేరిపోయింది.

***

జీవకుడు ఆర్యనంది అనే ఓ రాజగురువు దగ్గర విద్యను అభ్యసించసాగాడు.   సకల విద్యలను నేర్చుకున్నాడు.  మనోహరాకారుడైన అతని ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరచసాగింది.  అతని విద్య పూర్తయ్యాక ఆర్యనంది జీవకుడికి అతని పుట్టుక రహస్యాన్ని తెలియచేశాడు.  కోపోద్రేకుడైన జీవకుడిని ఆర్యనంది శాంతపరచి కాష్టాంగాకారుని చంపడానికి ఇది తరుణం కాదు.  ఓ ఏడాది తర్వాతనే నీకది సాధ్యమవుతుంది.  అప్పటివరకూ దేశాటన చేయమని ఆజ్ఞాపించాడు.  గురువుకి మాట ఇచ్చి ఇంటికి చేరాడు జీవకుడు.

ఆ సమయంలో రాజ నగరానికి సమీపంలోని అడవిలో వేటగాళ్ళ గుంపు తయారై పశువులని ఎత్తుకుపోసాగారు.  రాజు కాష్టాంగాకారుడు వాళ్ళ మీదికి సైన్యాన్ని పంపాడు కాని ఆ అడవి ఆనుపానులు తెలియక చిత్తుగా ఓడిపోయాడు.  జీవకుడికి అది తెలిసి తన స్నేహితులైన కొంతమంది వీరులని వెంటబెట్టుకు వెళ్ళి వేటగాండ్రను పారద్రోలాడు.  ప్రజలు అతన్ని కొనియాడారు.  అది కాష్టాంగాకారునికి నచ్చలేదు.  జీవకుడి ధైర్యసాహసాలని చూసి అసూయాద్వేషాలతో రగిలిపోసాగాడు.  జీవకుని చర్యల మీద కన్నేసి ఉంచాడు.

నగరంలో శ్రీదత్తుడు అనే వ్యాపారి ఉన్నాడు అతనికి ఓ కుమార్తె ఉంది.  నిజానికి ఆమె ఒక గంధర్వుడి కుమార్తె.  ఈ నగరంలోనే ఆమె వివాహం అవాలని ఉందని ఆమె జాతకంలో ఉండటం వల్ల ఒకప్పుడు శ్రీదత్తుడిని కాపాడిన ఆ గంధర్వుడు కుమార్తెని శ్రీదత్తుని ఇంట్లో ఉంచాడు.  ఆమె పేరు గంధర్వదత్త.  గంధర్వదత్తను వీణావాదనలో ఎవరైతే ఓడిస్తారో వాళ్ళకి ఆమె భార్య అవుతుందని శ్రీదత్తుడు ప్రకటన చేస్తాడు.  ఎంతోమంది యువకులు ప్రయత్నించి విఫలులవుతారు.  జీవకుడికి సంగతి తెలిసి ఆ పోటీలో పాల్గొని గంధర్వదత్తని ఓడించి ఆమెని వివాహమాడతాడు.

ఇద్దరూ సంతోషంగా కాలం గడపసాగారు.  ఒకరోజు ఓ ఏనుగు సంకెళ్ళని తెంచుకుని కోమటి వీధుల్లో పరిగెడుతూ గుణమాల అనే యువతిని తరుముకు రాసాగింది.  ఆమె కూడా నగరంలో ఓ ప్రముఖ వ్యాపారి కుమార్తె.   ఆ సమయంలో ఆ వీధిలోనే వెళుతున్న జీవకుడు ఏనుగును అదుపులో పెట్టి గుణమాలని రక్షించాడు.   అతని చేతిలో వాలిన ఆమె అద్భుత సౌందర్యాన్ని చూసిన జీవకుడు ఆమెపై మరులుగొన్నాడు.  ఆమె కూడా జీవకుడిని మొదటి చూపులోనే ప్రేమించింది.  తన చిలుక ద్వారా అతనికి ప్రణయసందేశాన్ని పంపింది.  జీవకుడు సంతోషపడి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి గుణమాలని వివాహమాడాడు.

తన కుమారుడైన మదనునికి గుణమాలనిచ్చి వివాహం చేయాలని సంకల్పించుకున్న కాష్టాంగాకారుడు ఇది సహించలేకపోయాడు.  మదనుడిని పిలిచి జీవకుడి మీద ఏదో ఒక రాజద్రోహం మోపి సంహరించి రమ్మని పంపాడు.  పెద్ద సైన్యంతో జీవకుడి ఇంటి మీదకు వచ్చాడు మదనుడు.  సంవత్సరం పాటు కాష్టాంగాకారునిపై యుద్ధం చేయనని గురువుకిచ్చిన మాట నిలబెట్టడం కోసం తన భార్య గంధర్వదత్త మంత్రమహిమతో ఎవరికీ కనపడకుండా అక్కడ నుండి తప్పించుకుని మాయమైపోతాడు.

దేశ సంచారం చేస్తూ వివిధ దేశాలల్లోని ప్రముఖుల కుమార్తెలని ఐదుగురిని వివాహమాడతాడు.

పాము కాటు నుండి కాపాడి ఓ దేశ రాజకుమారి అయిన పద్మను మూడవభార్యగా స్వీకరిస్తాడు.   యుక్తవయస్తు వచ్చినా ఎవర్ని చూసినా సిగ్గుపడని ప్రముఖ వ్యాపారి కుమార్తె ఖేమచరి జీవకుడిని చూసి సిగ్గుపడటంతో అతనే ఆమె భర్త అని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమెని వివాహమాడతాడు.  ఆ తర్వాత మరో రాజకుమార్తె కనకమాలను వివాహమాడాడు.

జీవకుడు కనకమాల దగ్గర ఉన్నప్పుడు,  జీవకుడు ఎక్కడున్నాడో అని గంధర్వదత్త తనకున్న మంత్ర ప్రభావంతో చూసి “దారిలో కనపడుతున్న యువతులందరినీ పెళ్ళి చేసుకుని సాగిపోతున్నారు బాగానే ఉంది.  కాని ఇక మీరు వెంటనే తిరిగి వచ్చి కాష్టాంగాకారుడిని సంహరించి రాజ్యాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైంది” అని  ఉత్తరం రాసి రాజమిత్రుడికి ఇచ్చి పంపింది.

ఉత్తరం చదువుకున్న జీవకుడు కనకమాలకి చెప్పి రాజమిత్రుడితో పర్వతాలను నగరాలను దాటుకుంటూ తన తల్లి ఉన్న జైన ఆశ్రమానికి చేరుకుంటాడు.  అక్కడ విజయను చూసి గుర్తుపట్టిన ఆ రాజమిత్రుడు జీవకుడే ఆమె బిడ్డ అని చెప్తాడు.   తల్లీ బిడ్డలిద్దరూ ఆనందంతో ఆలింగనం చేసుకుంటారు.

అమ్మని మేనమామ ఇంటికి పంపి తన రాజ్యానికి చేరుకుంటాడు జీవకుడు.   అక్కడ ఉద్యానవనంలో స్నేహితులతో కలిసి విశ్రమిస్తాడు.  ఆ సమయంలో బంతి ఆడుకుంటూన్న  విమల అన్న ఓ యువతిని చూసి మోహిస్తాడు.  ఆమె కూడా జీవకుడినే పరిణయం చేసుకోవాలని ఉబలాటపడుతుంది.  ఆమె తల్లిదండ్రుల అనుమతితో ఆమెని వివాహమాడతాడు.

నగరంలో సకలైశ్వర్యాలతో తులతూగే మరో ప్రముఖ శ్రేష్టి కుమార్తె సురమంజరి.  అహంకారి.  పురుషద్వేషి.  విమలని వివాహమాడానని  జీవకుడు తన స్నేహితులతో చెప్తున్నప్పుడు  “వివాహేచ్ఛ ఉన్న యువతులని వివాహమాడటం గొప్ప కాదు ఈ పురుషద్వేషిని వివాహమాడు చూద్దాం”  అని సవాలు చేశారు.

జీవకుడు ముసలివేషంతో సురమంజరి ఇంటికి చేరి స్పృహ తప్పినట్లు నటించి ఆ రాత్రికి ఆమె ఇంట్లోనే ఉంటాడు.  ఆ రాత్రి మైమరిపించే సంగీతంతో ఆమెను తన గదికి రప్పించుకుని ముసలి వేషాన్ని తీసివేస్తాడు.  మన్మధాకారుడైన జీవకుడిని చూసిన ఆమె తాను పురుషద్వేషినన్న సంగతి కూడా మరిచి అతన్ని వివాహమాడుతుంది.

ఈ విధంగా జీవకుడు తన దేశాటనలో  ఐదుగురు కన్యలను వివాహమాడతాడు.

***

download

ఆ తర్వాత జీవకుడు మేనమామ ఇంటికి వెళతాడు.  మామ సహాయంతో కాష్టాంగాకారుడిపై దండెత్తి అతడిని సంహరిస్తాడు.  రాజ్యలక్ష్మిని వరించిన జీవకుడికి మేనమామ తన కుమార్తె అయిన లక్షణను ఇచ్చి వివాహం జరిపిస్తాడు.

రాజైన జీవకుడు తన అష్టభార్యలతో సుఖంగా కాలం గడుపుతున్నాడు.  కొన్నాళ్ళయ్యాక అతని తల్లి విజయ తిరిగి జైన ఆశ్రమంలో చేరిపోయింది.   ఒక్కో భార్యకూ ఒక్కో కుమారుడు కలిగారు.

ఒకరోజు జీవకుడు భార్యలూ బిడ్డలతో ఉద్యానవనంలో కూర్చుని ఉన్నాడు.  ఎక్కడ నుండో పనసపండుని తెచ్చిన ఓ మగ కోతి దానిని సగంగా చీల్చి తన పక్కనే ఉన్న ఆడకోతికి ఇచ్చింది.  అదే సమయంలో తోటమాలి వాటిని తరిమి అవి కిందపడేసిన పనసపండుని తీసుకున్నాడు.  క్షణం ముందు ఆ పండుని కోతులు తింటాయని ఊహించుకుంటూ వాటిని తిలకించాలనుకున్న జీవకుడు క్షణంలో మారిపోయిన విధిని చూసి ఆశ్చర్యపోయాడు.

ఏ నిమిషానికి ఏమి జరుగునో తెలియని ఈ అశాశ్వతమైన భోగభాగ్యాలలోనే తానూ ఓలలాడుతున్నానని గ్రహించుకున్నాడు.  ఒక్కసారిగా అతనిలో ఏదో మార్పు.  అప్పటికప్పుడే తన పరివారాన్ని అందరినీ పిలిచి సన్యాసాశ్రమం తీసుకుంటున్నానని చెప్పాడు.  పెద్దకుమారుడైన సత్యంధరుడికి రాజ్యాన్ని ఒప్పగించాడు.   ఆ రాత్రి హాయైన స్నానం చేసి తృప్తిగా భోంచేసి సన్యాస దీక్షని స్వీకరించాడు.

మహావీరుడు బోధించిన మార్గంలో ప్రవర్తిల్లుతూ తపస్సు చేసి కర్మబంధాలను వదిలించుకుని జ్ఞాని అయ్యాడు.  దివ్యలోకాలు చేరాడు.   ‘నీ యీ కథను విన్న వారందరికీ శుభాలు కలుగుతాయ’ని దేవతలందరూ ఆయన్ని ఆశీర్వదించారు.

***

  1. వళయాపతి

వళయాపతి కావ్యం సంపూర్ణంగా లభించడం లేదు.  కేవలం డెబ్భై పద్యాలు మాత్రమే దొరికాయిట.  ఈ కథ అచ్చం ధృవుడి కథలా అనిపిస్తోంది.  ఈ కావ్య రచయిత ఎవరో కూడా తెలియదుట.

కథా సంగ్రహం

పుహార్ పట్టణంలో నారాయణుడు అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు.  అంతులేని సంపద ఉన్న ఇతన్ని నవకోటి నారాయణుడు అని పిలుస్తారు.  అతనికి పెళ్ళయి భార్య ఉన్నా కూడా వేరే కులం ఆమెని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు.  తక్కువ కులపు స్త్రీతో సంసారం చేస్తున్నాడని అతన్ని అతని బంధువులు, అతని కులపెద్దలు నిందిస్తారు.  ఆవిడని వదిలెయ్యకపోతే కులాన్నించి వెలివేస్తామని అనడంతో నిండు గర్భిణి అని కూడా చూడకుండా రెండవ భార్యని వదిలేస్తాడు.

ఆమె కాళికాలయానికి చేరి అక్కడ బిడ్డను ప్రసవిస్తుంది.  భక్తులు ఇచ్చిన దక్షిణలతో ప్రసాదాలతో కడుపునింపుకుంటూ ఉంటుంది.  తన భర్తతో తనని చేర్చమని నిత్యమూ ఆ కాళికాదేవిని ప్రార్థిస్తూ ఉండేది.

బిడ్డ పెరిగి పెద్దవాడవుతాడు.   ఓరోజు ఆ పిల్లవాడు తోటి పిల్లలతో ఆడుకుంటుండగా వాళ్ళ మధ్య ఏదో తగాదా వస్తుంది.  “పోరా నీకు తండ్రే లేడు,  తండ్రి పేరు కూడా తెలియని వాడవు”  అని వాళ్ళల్లో ఒకడు ఎగతాళి చేస్తాడు.  ఆ బాబు ఏడ్చుకుంటూ వచ్చి తల్లిని తన తండ్రెవరో చెప్పమని నిలదీస్తాడు.  ఆమె తండ్రి పేరు చెప్పగానే నేరుగా నవకోటి నారాయణుడి ఇంటికి వెళతాడు.   బిడ్దని వెంబడిస్తూ తల్లి కూడా వస్తుంది.

నిలదీస్తున్న కొడుకుకి సమాధానం చెప్పలేక తలవంచుకుని నిలబడి ఉంటాడు నవకోటి నారాయణుడు.  చోద్యం చూడను గుంపుగా చేరిన ప్రజలు ఆమెని నిందిస్తుంటారు.  ఆమె మౌనంగా కళ్ళు మూసుకుని కాళికాదేవిని ప్రార్థిస్తుంది.  దేవి ప్రత్యక్షమై అందరూ వినేట్లుగా ఈమె శీలవంతురాలు.  ఆమెని భార్యగా స్వీకరించు అని నారాయణుడికి చెప్తుంది.

నారాయణుడు సంతోషంగా రెండవ భార్యని తన ఇంట్లోకి పిలుచుకుంటాడు.  కొడుకుని ప్రయోజకునిగా చేసి తనంత గొప్ప వ్యాపారిని చేస్తాడు.

***

  1. కుండలకేశి

తమిళ పంచకావ్యాలలో ఐదవది కుండలకేశి. ఈ కావ్యం కూడా సంపూర్ణంగా లభించడం లేదు.  కుండలకేశి అనే యువతి బాధాకరమైన కథ ఇది.  ఈమె సన్యాసినియై  జైన మత గురువైన నాదగుత్తాచార్యులతో వాదించి గెలవడం ఈ కథలోని విశేషంగా చెప్పుకుంటారు.

కథా సంగ్రహం

రాజుగారికి చాలా దగ్గరివాడైన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె ‘కుండలకేశి’.  అసమాన సౌందర్యవతి.  ఒకసారి ఆమె తన భవనం పైభాగానికి చల్లగాలి కోసం వచ్చింది.   ఆ సమయంలో రాజభటులు ఓ యువకుడిన సంకెళ్ళు వేసి వీధిలో నడిపించుకుంటూ తీసుకెళుతున్నారు.    వాళ్ళని అనుసరించి ఏవేవో మాట్లాడుకుంటూ ఓ గుంపు అనుసరిస్తోంది.  ఆ కలకలం విన్న ఆమె కిందికి చూసింది.  సంకెళ్ళు వేసి తీసుకెళుతున్న యువకుడిని చూడగానే ఆమె అతని పట్ల ఆకర్షణకి లోనయ్యింది.

ఆ యువకుడి పేరు కాలుడు.  అతను గజదొంగ.  దొంగతనం చేస్తూ పట్టుబడిన అతనికి మరణదండన విధించి ఉరి తీయడానికి తీసుకువెళుతున్నారు.   చెలికత్తెని కిందికి పంపి అతని గురించి ఈ వివరాలు తెలుసుకున్న కుండలకేశి హృదయం ద్రవించిపోయింది.  తొలిచూపులోనే అతనిపై మరులుగొన్న ఆమె అతన్ని ఎలాగైనా విడిపించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది.

అప్పటికప్పుడే తండ్రికి తన కోరికను చెప్పింది.  కూతురు ఏది అడిగినా కాదనలేని బలహీనత కలిగిన ఆ తండ్రి ఎంతో ధనం పోసి (లంచాలు ఇచ్చి) కాలుడిని విడిపించాడు.  అంగరంగ వైభవంగా ఇద్దరికీ వివాహం జరిగింది.  ఇరువురూ ఆనందంగా కాలం గడపసాగారు.

కొన్నాళ్ళయ్యాక ఇద్దరి మధ్యా తీవ్ర విభేదాలు మొదలయ్యాయి.  ఒకరోజు ఒకరినొకరు తీవ్రంగా నిందించుకుంటున్నప్పుడు కుండలకేశి “నువ్వు గజదొంగవు.  ఆ పాత బుద్ధులు ఎక్కడకి పోతాయి?  ఆరోజు నేను నిన్ను కాపాడకపోయినట్లైతే ఏమై ఉండేవాడివో ఆలోచించుకో”  అని అవమానించింది.

ఆ మాటలకి కాలుడు విపరీతోద్రేకానికి లోనయ్యాడు.  అప్పటికప్పుడే ఆమెని చంపేయాలన్నంత కోపం కలిగిందతనికి.    అది సమయం కాదు అని ఆవేశాన్ని అణచుకున్నాడు కాని  సమయం చూసి ఎవరికీ అనుమానం రాకుండా ఆమెని కొండ మీద నుండి తోసి చంపేయాలని మనసులో నిర్ణయించుకున్నాడు.

ఆ రోజునుండీ ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించసాగాడు.  కుండలకేశి కూడా తన భర్తకి మంచి బుద్ధి కలిగిందని సంతోషపడింది.  ఒకరోజు భార్యని పిలిచి “మనిద్దరి మధ్యా ఏ కలతలూ రాకుండా ఉంటే కొండమీది దేవాలయానికి వస్తానని మొక్కుకున్నాను.  మొక్కు తీర్చుకుని వద్దాం, బయలుదేరు”  అన్నాడు.

ఆమె నిజమేననుకుని చక్కగా అలంకరించుకుని భర్త వెంట బయలుదేరింది.   కొండ ఎక్కుతున్నప్పుడు  అతను మాట్లాడుతున్న విషపు మాటలు, వ్యంగ్యపు మాటల ద్వారా అతని పన్నాగాన్ని కనిపెట్టింది.  వంచనని వంచనతోనే గెలవాలని మనసులో తలపోసిన కుండలకేశి ఏమీ బయటపడలేదు.  పరిస్థితి అంతవరకూ వస్తే ఏం చేయాలో పథకం వేసుకుంది.

కొండ శిఖరం చేరాక “ఇప్పుడు నిన్ను కిందకు తోసి చంపబోతున్నాను”  అన్నాడు.  నిర్ఘాంతపోయి ఏడుస్తూ భర్త కాళ్ళ మీద పడుతుందనుకున్నాడేమో పాపం – ఆ మాట చెప్పి వికటంగా నవ్వుతున్న అతన్ని గభాల్న కిందకి తోసేసింది.  అతడు శిఖరం మీద నుండి కింద పడి ప్రాణాలు వదిలాడు.

ఇక ఆమెకి జీవితం పట్ల రోత కలిగింది.  సన్యాసినియై బౌద్ధమతాన్ని స్వీకరించి వివిధ ప్రదేశాలు తిరుగుతూ మహనీయులని కలుసుకుని బౌద్ధమత సారాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది.  బౌద్ధమత ప్రచారం చేస్తూ బౌద్ధమత ప్రచారకురాలిగా పేరు పొందింది.

******

పంటని వాగ్దానం చేసే కవిత్వం ఏదీ?!

Art: Rafi Haque

Art: Rafi Haque

కవిత్వం గాలిలోంచి పుట్టలేదు. ఆకాశం నుండి రాల లేదు. ఏ దేవుడో వరమిస్తే మొలకెత్త లేదు. కవిత్వం ఎలా పుడ్తుంది అని ఒక కవిని నిద్ర తట్టి లేపితే ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు కలిగే ఆలోచనల వల్ల పుడ్తుంది అంటాడు. ఒకడు విశ్వంతో మమేకమైతే ( అదెలా ఉంటుందో కొంచెం  సంశయాత్మకత   ఉన్నా సరే ) కవిత్వం పుడ్తుంది అంటాడు. ఒకడు ప్రకృతి లో పవళిస్తూ ఉంటే కలిగే ఆలోచనల్లో కవిత్వం పుడ్తుంది అంటాడు. మరొకడు కడుపు కాలితే పుడ్తుంది అంటాడు. ఈ కవిత్వం అన్నది ఎటువంటి బ్రహ్మ పదార్థం ? ఎలా పుడుతుంది ? ఈ  తర్కాన్ని జాగర్తగా అర్థం చేసుకుంటే మనం కవిత్వం గురించి వచ్చే చర్చలను చాలా మట్టుకు అర్థం చేసుకునే ప్రయత్నంలో సఫలం అవ్వచ్చు. లేదా గాలి ఎటు వీస్తే అటు వీచి పోతాము.

అసలు సమాజం ఎలా పరిణామం చెందిందో అందులో భాష ఎలా పుట్టిందో ఏ నియమాలననుసరించి పుట్టిందో తెలుసుకోకుండా కవిత్వం ఎలా పుడ్తుంది అని చర్చించడం అస మగ్రంగా ఉంటుంది.

ఆదిమానవుడి ప్రపంచంలో ప్రకృతి  ప్రధాన పాత్ర పోషించింది. అప్పట్లో ఆదిమానవుడి  పరస్పర సంబంధం ప్రధానంగా ప్రకృతి తోనే నడిచింది. ప్రకృతికి మాటలు రావు , వినిపించవు. చెట్టు ను బతిమాలో బామాలో పళ్ళు సంపాయించుకునే  యాంత్రికవిధానం లేకపోవడంతో మనిషి తన చేతులకు కాళ్ళకు పని చెప్పవలసి వచ్చింది. లేపొతే మనిషి అంతరించాల్సిన ఆగత్యం వస్తుంది. ప్రకృతితో ఉండే  పరస్పర సంబంధం  లో మానవుడు తన అవసరాల దృష్ట్యా తన అవయవాలను భౌతికంగా ఉపయోగించాల్సి వచ్చింది. ఆ క్రమంలో మనిషి చేతులు కాళ్ళు రూపాంతరం చెంది ఒక పరిణామ క్రమంలో మనిషి నాలుగు కాళ్ళ జంతువు నుండి మనిషిగా విభిన్న రూపం దాల్చుకోవాల్సి వచ్చింది. కొద్దిగా  మళ్ళి ఆలోచిస్తే మనిషి మొట్ట మొదటి ఉత్పత్తి పని ముట్టు చేయి. మనిషిలో ఎదుగుదల జరగడానికి కారణం శ్రమ. ఈ పనిముట్టు అనగా చేయి, దానితో పాటు తదితరై అవయవాలలో జరిగిన మార్పు, అందుకు సమన్వయంగా మెదడు అభివృద్ధి చెందడం ఒక మానవ శ్రమ విధాన క్రమంలో అవసరమయ్యింది.  ఇదే పరిణామాన్ని జీవ పరిణామ సిధ్ధాంతాలు మనకు సులువుగా వివరిస్తాయి. ఇక మెదడు అభివృద్ధిచెందిన తర్వాత లేదా చెందుతున్న క్రమంలో తనకు అవసరమైన పనుల గురించి మనిషికి చైతన్యం పెంపొందడం సహజం అయ్యింది. అలా కాకపోయి ఉండి ఉంటే మనిషి  అంతరించిపోయే వాడు.

శ్రమ

Physiological development ——–> pshychological development

 

అంటే మనిషి భౌతిక మానసిక పరిణామ క్రమంలో ప్రకృతి లో మనుగడకు కావాల్సిన  కనీస పరస్పర సంబంధం  ఎంతైతే కావాలో అంత కలిగి ఉన్నాడు. ఆ మాట కొస్తే ప్రతి పక్షికీ ప్రతి జంతువుకు కూడా  స్మృతి చేతన  ఉంటుంది. అప్పుడు భాష అవసరం లేదు ఎందుకంటే – మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా కేవలం భౌతిక అవసరాల కోసం ప్రకృతి తో ఉండే  పరిమిత పరస్పర సంబంధం కు భాష అనవసరం. ఏం మనిషి కూడా అలానే చీమలానో తేనెటీగలానో ఆ మాత్రం  స్మృతి చేతన  తో బతక లేడా ? బతకలేడు. బతికి ఉంటే మనిషి కాకుండా ఏ ఏనుగో, గుర్రమో అయి ఉండేవాడు. ఐతే అతని అవయవాలు అతని భౌతిక అవసరాలు పూరించడానికి అనుగుణంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని గమనించాలి.

ఒక విషయం అర్థం చేసుకుందాము. మానసిక ఎదుగుదల భౌతిక ఎదుగుదల ఒక అనుసంధాన క్రమంలో జరిగింది. అంటే గంట క్రితం ఆలోచించిన విషయానికి ఇప్పుడు మాటలు పుట్టితే ఇక మాటల అవసరం ఏముంది ? లేదా ఇప్పుడు చేసిన పని మన మెదడులో ముద్రించుకోడానికి ఒక రోజు పడితే ఇక పని ఎలా చేయగలం ? కాబట్టి మానసిక ఎదుగుదల అన్నది శారీరక ఎదుగుదలతో పాటు జరగాల్సిన ఒక అనివార్య క్రమంగా మనం చూడొచ్చు.

మెదడు అభివృద్ధి జరిగాక మనిషిలో చైతన్యం అన్నది మొదలయ్యింది. చైతన్యం అంటే The manner in which we interpret, analyse, remember and use the information about the social world . అంటే చుట్టు పక్కల ఉన్న పదార్థాలతో ఉండే ఒక  నిరంతర పరస్పర సంబంధంవలన మనిషికి ఆలోచనలు కలిగాయి . ఎందుకంటే ఈ చైతన్యం వలన మనిషికి  pattern recognition    అర్థం అవుతూ వచ్చింది. ఇదంతా ఒక  ఏక కాల ప్రక్రియ. ఏ ఒక్క గంటలో జరిగిన విధానం కాదిది. కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టింది.

పొద్దున్నే లేచి ఆది మానవుడు లేచి రాతి గొడ్డలితో చెట్టును కొడ్తే ‘ ఠక్ ‘ ‘ఠక్ ‘ అనే చప్పుడే వచ్చేది. అలాకాక ఒక రోజు హఠాత్తుగా ‘ఖణేళ్ ‘ ‘ ఖణేళ్ ‘ అన్నదనుకోండి. వెంటనే అది మొద్దు ఐనా కాకపోయి ఉండాలి లేదా మొద్దుకు ఈ గుణం కొత్తగా ఐనా వచ్చి ఉండాలి అన్న విషయం తర్కించగలడు. అది తేలకపోతే మనిషి మొద్దు మీద ఆధారపడ్డం అన్నా వదులు కోవాలి లేదా ఆ విషయాన్ని శొధించాలి. ( అంటే ఏ ‘X’ మనిషో ‘Y ‘ మనిషో ఐనా మనకెందుకు అని ప్రొసీడ్ అయి ఉండొచ్చు. ఆ   వ్యక్తిగత నడవడిక సామాజిక గతి క్రమాన్ని వివరించదు. పైగా ఈ మార్పు ఒక్క క్షణంలో జరిగింది కాదు ). కాబట్టి జాగర్తగా గమనిస్తే పదార్థం ( అంటే పరిసరాల మొత్తం అని సింపుల్ గా చెప్పొచ్చు ) వలన చైతన్యం కలిగింది. చైతన్యం ఒక రకంగా చూస్తే ఆలోచనల సముదాయము.

పదార్థం ——— > చైతన్యం 

పరిసరాలలో ఉన్న వైరుధ్య భావనల వల్ల ( ‘మొద్దు ‘  గురించి వివరించిన ఉదాహరణలో చూసినట్టు ) క్రమ క్రమంగా ఆలోచనల సమూహం పెంపొందుతూ వచ్చింది. చైతన్యం అన్నది ఒక  శరీర ధార్మిక మార్పు (Physiological change)  దశ నుండి పదార్థం చేత ప్రభావితం చేయబడ్డది. మరింత పరిణతి చెందుతూ వచ్చింది. ఇది జాగర్తగా గమనిస్తే పదార్థం తో జరిగిన ఒక శ్రమ విధానం వలన ఉద్భవించిన విశేషఘటన ( phenomenon)   గా చెప్పొచ్చు.

మనిషి ఈ క్రమంలో పదార్థం పట్ల పెంపొందించుకున్న అవగాహన వలన లోహం కనుక్కోగలిగాడు. దాని వలన ఉండే ఉపయోగాలు గుర్తించగలిగాడు. ఇదే క్రమంలో ఒక ఉత్పత్తి విధానం ఒక పంపిణీ విధానం అమలు లోకి వచ్చాయి. అదే క్రమంలో తనతో పాటు జీవించే తోటి మానవులతో  పరస్పర సంబంధం  మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే మనిషి ప్రకృతి తో పరస్పర ప్రతిస్పందన క్రమంలో ఎదుగుదల చెంది తన చుట్టూ ఉన్న సమాజంతో  కూడా పరస్పర ప్రతిస్పందన ను ఏర్పరుచుకోవడం అవసరం అనే ఒక సందర్భానికి లాగ బడ్డాడు. అంత వరకు సైగలకు పరిమితమైన  సంభాషణ పద్దతికి ఒక భాష అవసరం అయ్యింది. మనం ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటూ వస్తుంటే భౌతిక ఎదుగుదల కు సమన్వయంగా వచ్చిన మానసిక ఎదుగుదల వలన, ఆ మానసిక ఎదుగుదల ఫలితంగా ఏర్పడిన చైతన్యం వలన మరియు ఉత్పత్తి విధానం లో ఒరవడి పెంపొందడం వలన ఆ క్రమంలో మారుతున్న మానవ సంబంధాల వలన ఒక సంస్కృతి  ఏర్పడాల్సిన దిశ అవసరం అని తెలుస్తుంది.

ఇంకా చూద్దాం. సైగలకు పరిమితమైన కమ్యూనికేషన్` పద్దతి క్రమంగా సన్నగిల్లి భాష అవసరం ఏర్పడింది. నాగలి తయారు చేసే దశకు వచ్చే లోపు అనగా సుమారు లోహ పరికరాలు విరివిగా వాడ్డం మొదలు పెట్టడం మొదలు పెట్టాక భాష వచ్చింది అని కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం. ఐతే అంతకు ముందో అంతకు తర్వాతనో మొత్తం మీద భాష మారిన సామాజిక లేదా మానవ సంబంధాలకు అనుగుణంగా అవసరం అయ్యింది. ఆ భాష లేకపోతే పెద్ద మొత్తంలో ఉన్న సాంఘిక అవసరాలు తీరలేవు.

ఇంతవరకు గమినించిందేంటి ? 

  1. మనిషి తన భౌతిక అవసరాల కొరకు శ్రమ చేసే క్రమంలో ఎదుగుతున్నప్పుడు మెదడు a అభివృద్ధి అన్నది శారీరక ఎదుగుదల క్రమంలో అవసరం అయ్యింది.ఆ క్రమంలోనే మనిషి జంతువు నుండి వేరు పడ్డాడు.
  2. మానసిక ఎదుగుదల వలన కలిగిన చైతన్యం వలన ( దీని నిర్వచనం వ్యాసంలో ముందు చూసాము ) పదార్థంతో జరిగే నిరంతర పరస్పర సంబంధం వలన ఉత్పత్తి విధానాని ప్రభావితం చేయగలిగాడు.
  3. ఉత్పత్తి విధానం పెంపొంది సామర్థ్యము పెరుగుతున్నప్పుడు సైగలకు పరిమితమైన సంభాషణ పద్దతి అనివార్యంగా మారాల్సిన పరిస్థితి సమాజంలో ఏర్పడింది
  4. తన చైతన్యంతో కొత్తగ ఏర్పడిన ఉత్పత్తి విధానం పంపిణీ విధానానికి అనుగుణంగా మరియు తన సాంఘిక అవసరాలకు అనుసంధానంగా మనిషి సౄష్టించుకున్న సంభాషణా మాధ్యమం భాష.
  5. పదార్థంతో ఉండే నిరంతర పరస్పర సంబంధం వలన చైతన్యం పెంపొంది ఆలోచన కలుగుతుంది. ఆ చైతన్యం వలననే మనిషి శ్రమ సంబంధాలను మెయింటెయిన్ చేయగలిగాడు. ఇది భాషకు మూలం అయ్యింది.

 

ప్రకృతి సహజంగా అనుసరించే  సహజమైన్ డైయెలిక్టిక్స్   ఉన్నాయి. వాటి ప్రకారమె మనిషి జననం, భాషా జననం జరిగింది. ‘ మనిషికి ఈ పరిణామ క్రమంలో తోక ఎందుకు రాలేదు?’ అని అంటే కోతి ఈ సృష్టిలో ఏర్పడే విధానాన్ని చర్చించినట్టు అవుతుంది తప్ప మనిషి గురించి కాదు. ఇది కేవలం జీవ పరిణామంగా మాత్రమే చూస్తే మనం  జీవ శాస్త్రం  దగ్గర మాత్రమే ముగిస్తాము. డార్విన్` జీవ పరిణామ సిద్ధాంతం సమాజ చలనాన్ని వివరించదు. అది డార్విన్ తప్పు కాదు. దాన్ని  వ్యాఖ్యానించే వాళ్ళది తప్పు. ఆ రకంగా చూస్తే మనకు మన మనుష్య సమాజ పరిణామాన్ని అర్థం చేయించడానికి  ఆంత్రోపాలజీ, ఫిలాసఫీ అవసరం లేదన్నమాట. సాంఘిక చలనాన్ని అర్థం చేసుకోడానికి  డైయెలిక్టిక్స్   అన్వయించడానికి ఆయా విషయాలకు మాత్రమే సంబంధించిన శాస్త్రాన్ని చూస్తే చాలా  పరిమితమైన దృష్టి   అవుతుంది. ఆ క్రమంలో మన ముందు ఉన్న ఒక ప్రాథమిక చట్రాన్ని ఉపేక్షించాల్సి వస్తుంది.

ప్రతి పరిణామము కేవలం సహజమే కాదు. ఆ సహజత్వానికి ఒక నియమం ఉంది. ఒక సహజమైన అవసరం ఉంది. లేపొతే జీవం మనుగడనే సాధ్యం కాదు. భాష పుట్టుక ఎంత చారిత్రక, సాంఘిక అవసరమో మనం గమనించాము. అందుకు చైతన్యం ఎలా దోహద పడిందో ఆ చైతన్యం పదార్థం నుండి ఎలా పుట్టిందో చూసాము.భాష పుట్టుక గమనిస్తే లోహ యుగం ప్రారంభమయ్యాకనే మొదలయ్యింది. ఇదేదో  కేజువల్ గా జరిగిన విషయం లోహం కనుగొనడం మానవ జీవితంలో ఒక విప్లవం. దీనితో ఉత్పత్తి విధానం విపరీతమైన మార్పులకు గురి అయ్యింది. అందుకనుగుణంగానే ఉత్పత్తి సంబంధాలు మారాయి. మారిన మానవ సంబంధాలకనుగుణంగానే సైగలతో ఉన్న  సంభాషణ పద్దతి ప్రతిబంధకమై నిలదొక్కుకోలేక భాష అవసరం వచ్చిపడింది.

ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. తేనె టీగ తన తుట్టెను కట్టుకుంటుంది. దానికుండే ఒక  లిమితెద్  చొన్స్చిఔస్నెస్స్   అది. తేనె టీగకు తుట్టె నిర్మించే ముందు తన తుట్టె ఏ రూపంలో ఉంటుందో ఎంత పొడవుంటుందో ఎంత వెడల్పు ఉంటుందో తెలుస్తుందా ?. అదే మానవుడు తనను ప్రకృతినుండి రక్షించుకునే క్రమంలో తన శ్రమ విధానం లో పెరిగిన  సామర్థ్యము వలన , పదార్థం పట్ల తనకున్న చైతన్యం వలన తాను కట్టుకునే గుడిసె పొడవు, ఎత్తు, వెడల్పు ఎంత ఉంటుందో కట్టక ముందే చెప్పగలడు.మనిషిలో ఉన్న  abstract thinking, logical thinking  వలన (  శరీరానికి మెదడుకు ఉన్న సమన్వయంలో భాగంగానే ఆపై మారిన మానవ సంబంధాల ఫలితంగా ఇలా ఏర్పడాల్సిన పరిస్థితి ఉంది అని గమనించాము) ఊహించే లక్షణం మనిషి మెదడుకు అబ్బింది.ఈ ఎదుగుదల ఏ ఒక్క క్షణం లోనో ఏదో ఒక్కరి లోనో ఒక్కసారిగా కలిగినది కాదు అని గమనం లో ఉంచుకోవాలి.

సమాజ పరిణామ క్రమంలో సమాజంలో కొన్ని institutions  కూడా ఏర్పడగలిగాయి. పెళ్ళి, కుటుంబము, మతము లాంటి కొత్త  institutions  ఏర్పడ్డం మొదలయ్యింది . ఐతే మనిషి తనకున్న Abstract thinking, logical thinking  వలన కలిగిన పరిజ్ణ్జానాన్ని ఉత్పత్తి , పంపిణీ విధానం ( ఇంకో రకంగా చెప్పాలంటే మొత్తంగా ఉత్పత్తి సంబంధాలు అనవచ్చు) వీటిలో ప్రయోగిస్తూ కొత్తగా ఏర్పడిన  institutions   లో కూడా ఉపయోగించడం మొదలయ్యింది. మనిషి దేహానికి సింహం తల తగిలించడం , లేదా ఏనుగు తల తగిలించడం జరిగింది. ఐతే క్రమ క్రమంగా మనుష్యుల్లో వర్గాలు ఏర్పడ్డంతో సమాజాన్ని నడిపే పగ్గాలు సమిష్టిగా ఉండడం ఆగిపోయింది. ఇదే పరిజ్ణ్జానన్ని తన కట్టుబాట్లలో చూయించాడు. తన అలవాట్లలో చూయించాడు. తన రుచుల్లో చూయించాడు. తనకవసరమైన భాషలో కూడా చూయించాడు. ఆ విధంగా భాష లో ప్రయోగం జరగడం తార్కిక క్రమం లో జరగాల్సిన ప్రక్రియ అయ్యింది. నిజానికి ఈ పరిస్థితి సుమారు 4000 సంవత్సరాల క్రితం మించి ఉండదని కొంత మంది చరిత్ర కారుల అభిప్రాయం. భాష పరిణామం చెందాల్సిన అవసరం చూస్తే మళ్ళీ మనం పదార్థంతో జరుగుతున్న  పరస్పర సంబంధం దగ్గరే ఆగాల్సి వస్తుంది.

ఏర్పడిన వర్గాల దౄష్ట్యా , తెగిపోయిన సమిష్టి సంబంధల దౄష్ట్యా ఏదైనా విషయాన్ని సంఘంలో ఆమోదించే క్రమానికి ఒక  ప్రభావశీల భావ వ్యక్తీకరణ  (effective expression)   అవసరం అయ్యింది. ఇదేదో ఒక్క రోజులో ఏర్పడిన ఆలోచన కాదు. అందుకు ఒక విషయాన్ని హత్తుకునేలా అర్థం చేయించడానికి ఆమోదింపజేయడానికి కళలు, సాహిత్యం అవసరమయ్యాయి. ఇందుకోసం సాధారణ వచనాలు సరిపోలేదు. మారిన ఉత్పత్తి సంబంధాలు, ఏర్పడిన వివిధ వర్గ సంస్కౄతులు, మనిషికి ఉన్న భావావేశ వృద్ధి (  emotional development )  ఒక భిన్న భావ వ్యక్తీకరణ జననానికి అవసరాన్ని, అనుకూలతను సూచించాయి ( భాష మొదలు కాక ముందు మానవుడి భావావేశాలకు సంబంధించిన ఎదుగుదల చాలా ప్రాథమిక స్థాయిలోనే ఉండిందని చెప్పుకోవచ్చు. మనకు రాతి యుగం నాటి అవశేషాలు గమనిస్తే మనిషి వేటాడిన జంతువుల బొమ్మలు లాంటివి కనిపిస్తాయి తప్ప ఎక్కడా మనిషి భావావేశాలు ప్రతిబింబించే అవశేషాలు పెద్ద  ప్రాముఖ్యంగా   దొరకవు).

అదే విధంగా సమాజంలో ఏర్పడిన  వైవిధ్య సాంఘిక స్థాయిలలో సమాజం మీద ఆధిపత్యం గురించి, స్వంత ఆస్తి పరిరక్షణ క్రమంలో సాంఘిక అస్తిత్వాన్ని మరింత గట్టి పరుచుకునే క్రమంలో, భిన్న సంస్కృతుల్లో భాగంగా – భాష వివిధ భిన్న రూపాలను ఏక కాలంలో కొనసాగించాల్సి వచ్చింది కూడా. అంటే భాష సమిష్టి ప్రయోజనాల కోసం ఏర్పడి సమాజ పరిణామ క్రమంలో ఆయా సమాజాల్లో ఏర్పడిన  institutions  ను బట్టి, వర్గ సమాజాన్ని బట్టి, సంస్కృతి లో కలిగిన చీలికలను బట్టి ( ఈ మూలకాలన్నిటినీ కలిపి పదార్థం అంటారు అని అనుకున్నాము ) మార్పు చెందుతూ వచ్చింది.

ఏం వర్గ సమాజం ఏర్పడకపోయి ఉండి ఉండొచ్చు కదా? అటువంటి వర్గ సమాజం మాత్రం ఎందుకు అవసరమయ్యింది ? అంటే వర్గ సమాజ జననం స్థూలంగా గమనిస్తే నిజానికి మనుష్య సమాజంలో వెనుకబాటు కాదు. అది ఒక రకంగా అభివౄద్ధి. ఒక తెగ ఇంకొక తెగపై దాడి చేసినప్పుడు గెలిచిన తెగ ఓడిపోయిన తెగను పూర్తిగా నిర్మూలించే వారు. ఐతే ఉత్పత్తి విధానంలో మార్పుల వల్ల వారిని చంపడం కంటే అలా ఓడిపోయిన తెగను తమ ఉత్పత్తి విధానంలో భాగం చేసి వారిని దోచుకుంటూ వారికి బానిస స్థాయిని కల్పించిండంలో ఎక్కువ ప్రయోజనం కనిపించింది. అప్పటి బానిస వ్యవస్థ ఏర్పడ కూడదు అనుకుంటే మొత్తం మనుష్య జాతి అంతా అంతరించి పోయేదేమో !

మన సమాజంలో ఐతే వర్ణ వ్యవస్థ ఏర్పడ్డం వలన ఆధిపత్య వర్గాల ప్రయోజనం కొరకు పాలక వర్గాల భాషనే అధికారిక లేదా అదే సామాజిక భాషగా చెలామణీ అయ్యింది.అదే సంస్కృతమై వెలిసింది.   Known ruling classes  వారి భాషలైన ప్రాగ్ , ద్రవిడ, పాళీ భాషలకు సముచితమైన సాంఘిక స్థాయి కల్పించలేదు. సంస్కృత భాష ప్రాకౄతిక వ్యావహారిక భాషలపై గొడ్డలి పెట్టు అయ్యి ఒక వర్గ ప్రయోజనాలలో భాగమైన మూలకం అయ్యింది. తమ సంస్కృతికి కి  superiority  ని పులిమే క్రమంలో సంస్కృతానికి దైవత్వం ఆపాదింపబడింది ( ఇక మనిషి అంటూ వాడ్డం మానేద్దాం. ఎందుకంటే సమిష్టి ప్రయోజనాల నుండి వ్యక్తిగత లేద వర్గ పరమైన ప్రయోజనాలు ముందుకొస్తున్నప్పుడు సంస్కృతి కూడా చీలి పోయింది మనుష్యులతో పాటు ).

ఇక సాహిత్యం అంత:పుర గోడలకు పరిమితమై పోయింది. సంస్కృత సాహిత్యం మెజారిటీ ప్రజలనుండి విడివడింది. సంస్కృతం అంటే అదో దైవత్వ రూపం కలిగి ఉండాలి అనో, అదో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్న వారి సొత్తు అనో, సంస్కృతం మానవాతీత సంస్కృతిలో భాగం అన్నట్టుగానే project  అయ్యింది. అధ్యాత్మికత ముసుగులోనూ దైవత్వం ముసుగులోనూ ఇలా ముక్కు మూసుకుని తపస్సు చేస్తే , లేదా ఉపాసన చేస్తే కవిత్వం పుడ్తుంది అన్న భావన కలిపింపజేసే ప్రయత్నాలు జరిగి ఇలాంటి అభ్యాసం తుచ్చ మానవులకందరికీ రాదు అన్న విశ్వాసాన్ని పాలక వర్గాలు కల్పించినట్టు మనకు స్పష్టమౌతుంది.

ఇందుకు అప్పటి బ్రాహ్మణీయ హైందవ మత వ్యవస్థ బాగా తోడ్పడింది. ఆ రకంగా చూస్తే  vernacular languages  పుట్టుక సామాజిక సాంస్కృతిక పరిణామంలో ప్రజా సంస్కృతి యొక్క విజయంగా చెప్పొచ్చు. భాష, సాహిత్యము, దానితో పాటు కళలు , సంస్కృతులలో   సమభావము నశించి పాలక వర్గం వేపు ఒక భాగం, ప్రజల వేపు ఒక భాగం అయ్యి చీలిపోయాయి. సమిష్టి ప్రయోజనాలు అన్న భావన నశించాక సాహిత్యంలో ప్రజలకు సంబంధించి ఎన్నో కుట్రలు జరిగాయి. సాహిత్యం ప్రజలకు సంబంధించిన విషయంగా కాక తమ ఆధిపత్యాన్ని నిర్ణయించే మూలకంగా చేయాలని మన సమాజంలో ఎన్నో ఎత్తుగడలే నడిచాయి. ఇందుకు వర్ణ వ్యవస్థ బాగా తోడ్పడింది.సాహిత్యం ఎలా పుడ్తుందో కవిత్వం ఎలా పుడ్తుందో అనే ఒక విశ్వాసాన్ని, పదార్థాన్ని వదిలేసి బ్రహ్మ పదార్థంగా చిత్రీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయని గమనించవచ్చు.

ఐతే భూస్వామ్య వ్యవస్థ కూలుతున్న క్రమంలో పెట్టుబడి దారి ప్రజాస్వామ్యం ముందుకొస్తున్న తరుణంలో మన దేశంలో  sanskritisation ప్రభావం దాని వెనక ఉన్న శక్తులు అనివార్యంగానే బలహీనపడ్డాయి.  తమ మనుగడను విస్తృతం చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

  1. భాషకే కాదు సంస్కౄతికీ, సాహిత్యానికీ , మూలము పదార్థం . ఆలోచనలు విడిగా ఉండవు. పదార్థంతోనే ముడివడి ఉంటాయి.
  2. మనిషి సమిష్టి ప్రయోజనాల కోసం భాష ఏర్పడింది.ఎదుగుతున్న ఉత్పత్తి సంబంధాలను మనగె చేయాలంటే భాష అనివార్యం అయ్యింది.
  3. మనిషికిదెవెలొప్ ఐన abstract thinking, logical thinking సమాజ పరిణామ క్రమంలో ఏర్పడిన  institutions  లో ఉపయోగించుకోవడం జరిగింది
  4. సమాజం లో వర్గాలు ఏర్పడ్డంతో భాష, సంస్కౄతి సాధారణ ప్రజానీక సంస్కౄతి, భాషలతో విడివడ్డాయి. ఇందుకు మత, వర్ణ వ్యవస్థలు మన సమాజంలో బాగా తోడ్పడ్డాయి.
  5. సంస్కృతం సాధారణ ప్రజల భాషను చావు దెబ్బ తీసి తనకో దైవత్వ రూపాన్ని పులుముకుంది. ఇది వర్ణ వ్యవస్థ పుణ్యమే. ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాలు కాపాడుకునే క్రమంలో జరిగింది.
  6. సాహిత్యం అన్నది ఏ ఒక్క వ్యక్తిగత పరిణ్గానం వలన పుట్టుకు రాలేదు. మనిషి తన సాంఘిక అవసరాల కోసం చేసిన ఎన్నో ప్రయోగాల్లో భాషపై జరిగిన ప్రయోగం ఒకటి. అందులో భాగం సాహిత్యం.
  7. భాషకు దైవత్వం ఆపాదించడం సాహిత్యానికి మానవాతీత రూపాన్ని పులమడం సన్స్క్రితిసతిఒన్ అవుతుంది. దీని వలన ఆధిపత్య సంస్కృతి ఏదైతే చలామణిలో ఉందో అది అభివౄధ్ధి చెందడానికి తోడ్పడింది.

 

సాహిత్యం అన్నది బ్రహ్మ పదార్థం కాదు. మరో సారి అనుకుందాము. సాహిత్యం అన్నది బ్రహ్మ పదార్థం కాదు. ఇది ఏ ఋషి హిమాలయాల్లో ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని పరధ్యాన్నంగా ఉన్నందు వల్ల మాత్రాన పుట్ట లేదు. ఎందుకంటే మనిషి ఆలోచన పదార్థం లేకపోతే లేదు. పదార్థాన్ని వదిలి పెట్టి మనిషి ఆలోచనలు రెక్కలు కట్టుకుని ఎగర లేవు. నీల్స్ బోరు పరమాణు నమూనాను కనుక్కోక పోయి ఉంటే ఇక ప్రపంచంలో ఏ రసాయన మూలకాలు ఉండేవి కావు అన్నది ఎంత తప్పో అలాగే కేవలం వ్యక్తిగత పరిజ్ణ్జానాఇకి, మానవ సమాజ అభివౄద్ధికి ఉపయోగ పడే సాహిత్యానికి లింకు పెట్టడం అంతే తప్పు. ఒకప్పుడు రాజు సింహాసీనుడై మధువు సేవిస్తూ ‘ మేము ఆనంద డోలికల్లో తేలియాడుచున్నాము. ఏది మన రాజ నర్తకి ఊరువుల మీద ఒక బహు సుందరమగు పద్యం వినిపించుము ‘ అన్న ఆదేశంతో సాహిత్యం పుట్టుకొచ్చిన చరిత్ర ఉంది. సాహిత్యం అంతపురానికి పరిమితమై వర్ణ వ్యవస్థ చట్రంలో అగ్ర భాగాన ఉన్న వర్గాల ప్రయోజనాలు వారి విలాసాలు తౄప్తి పరిచే విధంగా ఉపయోగపడింది.

చరిత్ర కారులకు ఉదయ పూర్ రాజుల కోటలో ‘ అనంగరంగం ‘ అనే గ్రంథం లభించింది. అందులో మొదటి  చప్తెర్  ‘ లింగ స్థూలీకరణం ‘. ఒక నాడు సాహిత్యమంటే అదే అన్నట్టు శౄంగారం గొప్పదైన నవరసం అని ( శౄంగార రసం అన్నది విశ్రాంతి అధికంగా ఉన్న వర్గాల వారి విలాస కేళికి సంబంధించిన విషయంగానే పరిమితమయ్యింది. దిగువ వర్ణాలు సమాజానికి తమ శ్రమ నందించి సేవ చేసే విషయంలోనే తమ జీవితాన్ని చూసుకున్నారు ) చలామణీ కూడా చేసారు. అందరూ అదో అద్భుత ప్రక్రియ అని అందులో జరిగిన ప్రయోగాలను నోరు తెరుచుకుని చదివి అసలు సాహిత్య ప్రయోజనాన్ని మనకు కాకుండా చేసారు. శ్లోకాలు ఏ చందస్సును పాటించాయి అని తీక్షణంగా పరీక్షించే ముందు మనం శృంగార రసం పేరుతో రాజుల ‘ లింగ స్థూలీకరణ ‘ గురించి ఆందోళన చెందిన కవి సమూహాన్ని, ఆ సాహిత్య కల్పన తీరు తెన్నులను గమనించడం వదిలేస్తే ఇది సాహితీ కౄరత్వం తప్ప ఏమీ కాదు . సాహిత్యం దేవుడి గొప్ప తనాన్ని ఎంతో ఆధ్యాత్మికంగా వర్ణించడానికి ఉపయోగపడ్డది. ఒక మనిషిని పట్టుకుని ‘ నీవు తక్కువ వాడివి పెద్ద పనికొచ్చే లక్షణాలు ఏమీ లేవు ఉత్పత్తి విధానంలో నీ స్థానం ఇదే ‘ అని బోధించడానికి వాడిని బలవంతంగా ఒప్పించడానికి సాహిత్యం ఉపయోగ పడింది.

‘చాతుర్వర్ణం మయా సౄష్ట్యాం గుణ కర్మ విభాగశ తస్య కర్తార మపిమాం వ్ద్యికర్తార మవ్యయం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం ‘ (క్లుప్తంగా చెప్తే నాలుగు వర్ణాలను నేనే సౄష్టించాను. అందులో శూద్రుని పని మిగతా వర్ణాలకు పరిచర్య చేయడమే ) సాహిత్యం పుట్టుక కొన్ని ప్రయోజనాలను ఆశించి జరిగింది. అది ఖచ్చితంగా ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు మాత్రమే దౄష్టిలో పెట్టుకుని జరిగింది అన్న వాస్తవాన్ని ఇక్కడ గమనించగలరు.

ఐతే సంస్కౄత భాష కాల క్రమేణా బ్రాహ్మణీయ వ్యవస్థ తో పాటు బలహీన పడడంతో వ్యావహారిక భాషలో సాహిత్యం కూడా ఏక కాలంలో అభివౄధ్ధి జరగడం జరిగింది. తెలుగులో గురజాడ, గిడుగు రామ్మూర్తి తదితర కవులు తెలుగు సాహిత్యంలో  sanskritisation   ను కాదని దేశీయ చందస్సులో తెలుగు సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు. ఐతే అప్పటికీ ఇప్పటికీ కవిత్వం అన్నా, సాహిత్యం అన్నా ఒక బ్రహ్మ పదార్థం అదో మానవాతీత రూప ప్రమేయం తోనే పుడ్తుంది అని దాన్ని అడపా దడపా ఆధ్యాత్మికతకు లింకు పెట్టి చూడ్డం జరుగుతుంది.

చరిత్రను గమనిస్తే సాహిత్యం ఎప్పుడైనా ఏదో సామాజిక ప్రయోజనం ఆశించకుండా పుట్టదు. పుట్టలేదు. ఐతే పదార్థం ఎప్పుడూ మార్పులకు గురవుతుంది.అందువల్ల చైతన్యం మార్పులకు గురవుతుంది. తద్వారా సాహిత్యం మార్పులకు లోనవుతుంది అన్న ప్రక్రియను అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయా సమాజ ప్రయోజనాలు ఆయా వర్గ సమాజ లక్షణాలు బట్టి వేరు వేరుగా ఉంటాయి. పైన చూసిన శ్లోకం ఎలా పుట్టుకొచ్చింది ? ఇందులో ఎంత గొప్ప సాహిత్యం ఉన్నది అని లొట్టలు వేసుకుని చర్చించే ముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయం – ఇది రాజులకు పురోహిత వర్గానికి ప్రజలను విధేయులుగా ఉంచే ప్రయత్నంలో భాగంగా, పాలక వర్గల ప్రయోజనాన్ని ఆశించే సౄష్టించ బడినది. అది మరవ రాదు. ఇక ఎంత గొప్ప ప్రయోగం జరిగినా సాహిత్యంలో ఒరిగిందేమిటి ? రాజ్య ప్రయోజనాల కోసం కవిత్వం రాయాలంటే అప్పుడు కవులు ప్రజల నుండి రారు. అది సాధారణ ప్రజలు భాగస్వామ్యం కాలేని సాహిత్యం అవుతుంది. ప్రయోగం మీద ఉన్న మక్కువ ప్రయోజనం మీద చూయించలేదు కవులు. వారి అజెండా  మొత్తం వర్ణ చట్రంలో బిగి వేయబడ్డది.

ఐతే సాంఘిక ప్రయోజనాలు ఆశించి కూడా సాహిత్యంలో ప్రయోగాలు జరిగాయి. సాహిత్య శిల్పాల్లో ప్రయోగాలు జరిగాయి. ఈ విషయాన్ని సింపుల్ గా అర్థం చేసుకోడానికి ఒక ఉదాహరణ చూద్దాం. బాల సాహిత్యం కుచేల కథ, గజేంద్ర మోక్షం , భక్త ప్రహ్లాద లాంటి బ్రాహ్మణీయ సాహిత్యం నుండి విడివడి వ్యావహారిక భాషలోనే ఎదిగే ప్రయత్నం జరుగుతుంది. చిన్న పిల్లలను బుజ్జగించడానికి , పడుకోబెట్టడానికి ఉపయోగపడే సాహిత్యం కావాలి. చిన్న పిల్లలను ప్రజాస్వామికంగా  త్రేత్  చేయడానికి బాల సాహిత్యం కావాలి.ఆ ప్రయోజనాలను దౄష్టిలో పెట్టుకుని వచ్చిన అందరికీ తెలిసిన ఒక తెలుగు  ఋహ్య్మె  చూద్దాము ‘ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోట కెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుక్కుమన్నావా ‘ ఇక్కడ దయ చేసి గమనించండి. సాహిత్యం ఎటువంటి రూపాన్ని మలుచుకుంటుందో.  కొట్టో తిట్టో పిల్లలను మేనేజ్ చేయాలి అన్న వాదన సన్నబడుతుంది. ఈ చైతన్యంతోటే ‘చిట్టి చిలకమ్మ ‘ పుట్టింది. సాహిత్యానికి ఎటువంటి ప్రయోజనాలు లేవు అన్న  హైపో తిసిస్   కు అనంగీకారం తెలిపే మంచి ఉదాహరణ ఇది.

ఆ రకంగా ఇది ఒక మంచి సాహితీ ప్రయోగానికి చిహ్నము. అలాగే ఒక వ్యక్తి భావన, వ్యక్తి ఆలోచన పదార్థం పట్ల ఉన్న అవగాహన ద్వారానే రూపుదిద్దుకుంటుంది.  మీకు కవిత్వం రాయాలంటే నది ఒడ్డు కెళ్ళొచ్చు. కవిత్వం రాయాలంటే ఆదివారం చార్మినారు వద్దకు వెళ్ళొచ్చు. మీ ఇంట్లో నెట్ ముందు కూర్చోవచ్చు. పదార్థంతో వల్ల కలిగిన వైరుధ్య భావనల మధ్య జరిగే సంఘర్షణ మనలో అవగాహనను పెంపొందిస్తుంది. ఐతే పదార్థం పట్ల మీ అవగాహన ఎలా పెంపొందుతుందో దాన్ని బట్టే మీ కవిత్వం వస్తుంది. మీ పక్కనే కూర్చున్న వ్యక్తి కి అదే వాతావరణం , పదార్థం పట్ల వేరు అవగాహన కలిగించవచ్చు. ఏది సరి ఐనది ఏది కాదు అన్నది వ్యక్తులు నిర్ణయించే సమస్య కాదు. కాబట్టి వ్యక్తిలో కవిత పుట్టుక గురించి మనం గెన్రలిసె చేయలేము. ఐతే సాంఘిక వ్యవస్థలో సాహిత్యం ఒక భాగమని మరిచి చేసే ఏ ప్రయోగమైనా – ఒకప్పుడు ప్రాచుర్యం లభించిన హేతుబద్దమైన ఆధారం లేని  ఎంపిరికల్ అప్ప్రోచ్   లేని ‘ ఆయిల్ పుల్లింగ్ ‘ ప్రయోగంలానే – మిగిలి పోతుంది.

ఉదాహరణకు మీరు ఒక పాత దేవాలయంలో మహా నిశ్శబ్దంలో ధ్యానం చేస్తూ కూర్చున్నారనుకోండి. అప్పుడు మోగిన గంట మీకు  Evil dead  సినిమా చూసిన అనుభూతిని గుర్తు చేయొచ్చు. మీ ఆఫీసు రిసెప్షనిస్టు నవ్వు లో ఉన్న అనుభూతి గుర్తు రావొచ్చు. లేదా అదో విప్లవ నినాదంగా అనిపించవచ్చు. మీ సాంస్కౄతిక నేపథ్యాన్ని బట్టి మీకు కలిగే భావనలు వేరు. ఐతే అందువల్లనే కవిత్వం పుడుతుంది అని సూత్రీకరించడం అందులోనే ఒక కవితా రూపం జననం దాగుంది అని సైద్ధాంతీకరించడం పూర్తిగా అశాస్త్రీయం. ఒక రకంగా మోసం చేసే ప్రయత్నం కూడా. ఇది మనలో ఉన్న  మధ్య తరగతి భయాలను  సపోర్ట్    చేస్తుంది తప్ప కవిత్వం పట్ల హేతుబద్దమైన ఆలోచనను పుట్టించలేదు. పైగా అలా ఒక కవితా రూపాన్ని ఊహించి దానికో ఆధ్యాత్మిక రూపాన్ని లేద దైవత్వాన్ని తగిలించడం , సామాన్యులకు సాధ్య మయ్యే విషయం కాదిది అని అన్నట్టు  ప్రొజెక్ట్   చేయడం భాషను, సాహిత్యాన్ని  సన్స్క్రితిసె  చేసే ప్రయత్నం తప్ప ఏమీ కాదు.

అలా ప్రయోగం మేనియాలో పడితే సాహిత్యానికి సమాజానికి వచ్చే ప్రాథమిక ప్రయోజనం ఏమీ లేదు. ఏదో హాబీగా కవిత్వాన్ని చూసుకోడానికి, విశ్రాంతి సమయాన్ని ‘ఖుషీగా’ గడపడానికి, భాష పైన  అచదెమిచ్ ఎక్ష్పెరిమెంత్స్   చెయడానికి ఒకరిద్దరు వ్యక్తులు చేసే ప్రయత్నంగా తప్ప ఇక వేరే విధంగా చూడలేము. ఇది ప్రధానంగా ‘ విశ్రాంతి వర్గాల ‘ ఉల్లాస ప్రక్రియ. మనకు చరిత్ర చెప్పిన సత్యం ఏమంటే ఈ ప్రయోగాలు పుట్టిన మరుక్షణం మరణం తేదీలు లెక్కించేలా ఉంటాయి. ‘ ఆయిల్ పుల్లింగ్ ‘ ప్రయోగాలు ఇవి. ” Literature is not merely a form of language gimmick ‘. భాషలో ప్రయోగం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం.

ప్రయోగం కన్నా ప్రయోజనం ముఖ్యం అని వ్యక్తిగా ఒక్కరు గుండె నిండా నమ్మినా అందులో భాగంగానే ప్రయోగాలు అని అర్థం చేసుకున్నా, ఒకే ఒక్క కవిత రాసినా, ఒకే ఒక్క ప్రయోగం చేసినా ప్రస్తుతానికి అది చాలు. ఆ సమిధ ఆరిపొయేలోపు ఇంకో సమిధ వెలగడం ఖచ్చితం. అదే క్రమంలో వందలు వేలు ‘ చిట్టి చిలకమ్మలూ పుట్టుకొస్తాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ‘ విత్తనం మరణించి పంటను వాగ్దానం చేస్తుంది ‘ (శివ సాగర్ ) అన్న నియమం ప్రకృతికే కాదు సాహిత్యానికీ వర్తిస్తుంది.

నరాలు తెంచే

ఇసుక రాళ్ళ వొత్తిళ్ళు మరిచి

కంఠం పెగల నీయని

ప్రాణ కంటక వలయంలో చిక్కుకున్న

నిలయ విద్వాంసులారా !

పడిపోయిన గాయకులారా !

తడి ఆరిన బతుకుల గాథల్లో

నిప్పులు కురిపించే తప్పుడు నియమాలతో

వాస్తవాల కళ్ళు చిదిమే కల్పనా కథకులారా !

కాల గమనంలో

సముద్ర తరంగాలు తలలు వాల్చినా

కవితా హౄదయం సరికొత్త మార్గాలు తొక్కినా

రూపు మాసిన రాజ సౌధాల్ని కీర్తించే

అంత రంగం ఏ మాత్రం మారని

వంది మాగధ నేపథ్య కవనాలు రచించే

ఆత్మ వంచనకొడిగట్టిన కవులారా !

ఆకాశ హర్మ్యాల రాకాసి ముఖాల్ని వదిలి

ఆనంద నిలయ సోపానాలు కూల్చి రండి !!

( చెరబండ రాజు )

 

 

Bibliography :

  1. Social anthropology – S L Doshi, P C Jain
  2. Social and Cultural Anthropology – Nigel Rapport and Joanna Overling
  3. Marxist – Leninst Philosophy – T Vlasova
  4. సాహిత్యంలో వస్తు శిల్పాలు – త్రిపురనేని మధుసూదన రావు
  5. ౠగ్వేద ఆర్యులు – రాహుల్ సాంకౄత్యయన్

 

( మరింత చర్చకు లేదా క్లారిటీ కోసం రచయిత మెయిల్  pvvkumar@yahoo.co.uk  లేదా ఫేస్ బుక్  ID ” P V Vijay Kumar “ లో కాని కాంటాక్ట్ చేయవచ్చు )

 

 

 

 

చీకటిని మింగిన వెలుగు తార

hemantహేమంత్ కుక్రేతి హిందీ ఆచార్యులుగా పనిచేస్తూనే తన కవితా సేద్యంలో ఐదు కవితా సంపుటాలు పండించారు. కవిత విమర్శ పై నాలుగు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. హిందీ సాహిత్య వాస్తవ చరిత్ర అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని రచించారు. వీరి కవితలు భారతీయ భాషలతోపాటు విదేశీ భాషల్లోనూ  అనువదింపబడ్డాయి.ఆకాశవాణి,దూరదర్శన్లకు తమ రచనా సేవను అందిస్తున్నారు. సాహిత్య పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యిన్ని రకాలుగా సాహిత్యానికి సేవచేస్తున్న వీరికి పురస్కారాలు వరించవా?! వీరి కవిత్వం మనుషుల్ని నమ్మి వారి చుట్టూ తిరిగే అందాలను వర్ణిస్తుంది, మోసాలను పసికడుతుంది. వీరి కవిత్వం చీకటిని మింగి వెలుగు తారలను కురిపిస్తుంది. జీవితం పట్ల విపరీత ప్రేమ వో వైపూ మరో వైపు నిరశన కూడా లేకపోలేదు. దుఖాలను తుడిచే ప్రయత్నంలో చివరి వరకు పోరాడే కవిత్వం. కవిత్వాన్ని చదవాలని కవిత్వమై బతకాలనే ధృఢమైన సంకల్పం వుంటుంది అతని కవితల్లో. వ్యవస్థల పట్ల విపరీతంగా వ్యంగ్యంగా దుయ్యబట్టిన సంధర్భాలు అనేకం. వర్తమానంలో కవిత్వాన్ని వొక ఆయుధంగా వుపయోగించమనే కవుల్లో అగ్రగణ్యుడు.

మట్టి కవిత
—————-

నీరే మట్టిని రాతిలా మార్చుతుంది
నీటిలో నానితే అది మెత్తబడుతుంది
నిప్పు లోపల నీటిచుక్క వుండునేమో
ఆకాశంలో భూమి జీవితంలా

యెన్నో యుగాల నుంచి సీతాకోక చిలుకలు
తమ శరీరాలపై వొణుకుతున్న రంగుల
మౌనాన్ని మోస్తున్నాయి.
పూలు యెవరి ప్రేమ యాతనలోనో కాలుతుంటాయి
మరెవరిలోనో జ్ఞాపకాలు  మట్టిలా మారిపోతుంటాయి

జీవించడానికి ప్రాణానికి ఆత్మ తోడు కావాలి
శరీరమంతటా అన్నపు వాసనే లేదు
పనికి యే కవచము లేదు
తప్పించుకుని వుండడమంటే గింజలా మారడమూ కాదు
యీ పనికి రాని ప్రపంచంలో వో భారీ లాభం దాగుంది
కొన్ని లాభంలేని వుపాదులు
మిగిలిన వ్యాపారమంతా యిలానే వుంటుంది
తనకు తననే కొనుక్కొని
అమ్ముడుపోవడం నుంచి తప్పించుకోవాలి
దేవుడి గొప్పతనం దైనిక భవిషత్తు
ఫలితం తప్ప మరేం లేదు

ప్రేమించేందుకు అడ్డుపడుతూ కాలయాపన కోసం ప్రేమించలేదు
తన జీవితపు వుప్పును పొందేందుకు
తన మట్టినే పిసికి తన ముఖాన్ని తయారు చేసుకున్నాడు

మబ్బుల్లో  మెరుపులు వుంటాయి
మెరిసే ప్రేమమయ ముఖాలపై యెక్కడో లోతుగా గుచ్చుకున్న
గాయాలు వుంటాయి
వీటిల్లో నుంచి వొకరికొకరం దగ్గరగా సమీపిస్తాం
అంతం మమ్మల్నీ విరిచేసి
నిర్మించుకోమనే సవాలు విసురుతుంది

మట్టికి చావు లేదు
అది కొద్దిగా పెరిగుతుంది

వారి ప్రాణాలు యెవరి వద్ద వుంటాయో

పొదలలో దాక్కొన్న వాడు
ఎలుగుబంటి అయ్యుంటాడు
యెందుకంటే బంగాళాదుంప తినేవాడు
దాని కథతోనే భయపడి పోయాడు
బంగాళాదుంపను పండించేవారే
ఎలుగుబంటిని అదిలించారు

వారు వెచ్చదనం కోసం పాలు తాగేందుకు వెళ్ళారు
పశువులను మేపుకొని తిరిగొచ్చారు
వారి చెమట యెంతలా మండుతూ వుందంటే
బంజరును మండించేసేలా వుంది

నివాసించాలనే సాకుతో పల్లెలను కాల్చేస్తున్నారు
హిమాలయాలను కరిగించేసి సప్తసముద్రాలను దాటించేస్తారు
గంగాతీరంలో మధ్యసీసాల్లో నింపి , అమ్మేస్తారు

యిక కాపాడుకునేందుకు తమ
ప్రాణాలు తప్ప యిక యేమి లేనివారు
యిలాటి వారినే యెందుకు యెంచుకుంటాడో
తాను పండించిన బంగాళాదుంపల ఖరీదుతో భయపడి
అక్కడి పొదల్లో దాక్కొంటాడు

వాడు కథలలో నుంచి బయటకు వచ్చి
వారిని లోపలకు యెందుకు పంపడు

వీరి యిళ్ళను ఆక్రమించుకొన్నాక
పొలాల్లో
అంతరిక్ష నరకాన్ని నిర్మించాలనుకొంటున్నాడు.

*

చల్లని వేళా…చలించే జ్ఞాపకం!

konni sephalikalu

అవును , రచయిత చెప్పినట్టు చల్లని వేళ తలుచుకోవలసిన జ్ఞాపకమే ఈ కథ.  ఇంకోలా చెప్పాలంటే ఈ కథ గుర్తొచ్చినప్పుడల్లా ఆ సమయం చల్లగానే కాక గుప్పున  పరిమళభరితమవుతుంది. ఎన్.ఆర్.చందూర్ గారి

కథ  అది. ఆ కథ నేను కుడా లేత కొమ్మగా ఉన్నపుడే చదివాను.  చలించిపోయాను, చాలా…  మాటల్లో చెప్పలేను.

తర్వాత కథ పోగొట్టుకున్నా, జవ్వాది అలుముకున్న జేబురుమాలు బీరువాలో మారుమూల ఉండిపోయినట్లు కథా పరిమళాలు ఈ నలభయి ఏళ్ళుగా నా వెంట వస్తూనే ఉన్నాయి.  మళ్ళీ ఇన్నాళ్ళకు కథ దొరికింది.  ఒక మహానుభావుడు అందించాడు.  కాని లేత కొమ్మ ఇప్పుడు బాగా ముదిరి ఆ లేతదనం మళ్ళీ రాదని కథ చదువుతుంటే అర్ధం అయింది.  ఇంకొక విషయం ఏమిటంటే ఇంతటి సున్నితత్వం ఇవాళ సమాజంలో కూడా లోపించిందని ,మనం మళ్ళీ అలా మారడానికి ఇలాంటి కథలు ఎంతో  అవసరం అనీ అనిపించింది

ఇందులో రచయితే ఉత్తమ పురుషలో కథ చెప్తాడు.ఆ ఉత్తమపురుష  ‘అతను’ ఇంకా టీన్స్ ఉన్నాడు.  సాహిత్యం బాగా చదువుతాడు.  చదవడమేమిటి డాస్టవిస్కీ ‘క్రైం అండ్ పనిష్మెంట్” చదివి ఒక రోజల్లా అన్నం మానేసాడు. టర్నీవ్ ‘జ్యూ’ లోని కథా భాగం చదివి కన్నీళ్లు కార్చాడు.  అతను కథలు రాస్తాడు. ఒక హోటల్లో మూడో అంతస్తులో తొమ్మిదో నెంబరు గదిలో పర్మనెంటుగా అంటే ఒక ఏడాది కాలంగా ఉంటూఉంటాడు.  డబ్బు కోసం తడుముకోవలసిన అవసరం లేని ఆర్దిక స్థితి అతనిది.  హోటల్ యజమాని, నౌకర్లు అతనితో స్నేహంగా ఉంటారు.

అలాంటి తన లేత గుండె వయస్సులో జరిగిన తన ఉహాతీతమైన అనుభవాన్ని గురించి దాదాపు పద్నాలుగేళ్ళు తరవాత గుర్తుచేసుకుంటూ మనకి చెప్తాడు.  ఆ లేతదనం తన గుండెకి ఇప్పుడు లేదని, ఇప్పుడు స్పందించడం కంటే తర్కించడం ఎక్కువ చేస్తోందని, రసాస్వాదన లోనే బోలెడంత తేడా వచ్చిందని చెప్తాడు.

ఎందుకంటే ఆ లేత ప్రధమ యవ్వన దినాలనాటి స్పందన, ఉద్వేగమూ, తీవ్రతతో కూడిన నిజాయితీ – వాటి నుంచి ఎలాంటి ‘మిరకిల్స్’ జరుగుతాయో స్వయంగా తను అనుభవించాడు కనుక,ఆ తేడా అతనికి బాగా తెలిసింది.

ఆ హోటల్ కి తనకోసం వెంకటపతి అనే మిత్రుడొక్కడే వస్తుండేవాడు.  హోటల్ యజమాని ‘సేట్ జీ’ కూడా రొజూ వచ్చి కాసేపు కష్టసుఖాలు మాట్లాడి వెళ్ళేవాడు. వాళ్ళ మాటల ద్వారా అయిదవ నెంబరు గదిలో ఒక అమ్మాయి ఉందని, ఆమె భర్త వారం రోజులుగా ఆ గది అద్దెకు తీసుకుని మూడు రోజుల క్రితమే ఆమెను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి రూంలో ఉంచాడని మూడు రోజులుగా డబ్బు పే చెయ్యడం లేదని, మనిషి కూడా ఎప్పుడో అర్థరాత్రి గాని రావడం లేదని తెలిసి, సేట్ జీ అభ్యర్ధన వల్ల  అతను కనుక్కుంటానన్నాడు.

రోజూలాగే రాత్రి చాలా సేపు చదువుకుంటూ మేలుకుని ఉన్న అతనికి ఆ రామ్ నాధ రావడమూ, ఆ అమ్మాయీ  అతనూ భోజనం చేస్తూ చాలా సేపు వాదించుకోవడమూ ఓరగా వేసి ఉన్న తలుపులోంచి కనిపించింది.భాష తెలియకపోయినా.  భోజనం కాగానే సిగరట్ ముట్టించి ఇవతలికి వచ్చిన రామ్ నాధ అతనికి దొరికాడు.  మాటలు కలిసేక అతన్ని లోపలి తీసుకెళ్ళి వారిద్దరి కథ రామ్ నాధ గంటసేపు చెప్పాడు.  ఆమె కూడా పడుకునే వింటూ ఉండింది. వాళ్ళు మలయాళీలు, ఆమె పేరు మంజులత. ప్రేమించి పెద్దవాళ్ళని  కాదని పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ళు హాయిగా గడిచేయి. ఇంతలో మంజు జబ్బు పడింది. వైద్యానికి చాలా ఖర్చయింది. ఊరు మారారు.ఉద్యోగం పోయింది . మరో ఉద్యోగం దొరకలేదు.  ఆమె ఆపరేషన్ అయి హాస్పిటల్ నించి వచ్చి ఈ హోటల్ లో ఉంది. డబ్బు ఇబ్బందుల్లో ములిగి ఉన్నారు.పెద్దవాళ్ళు రానివ్వరు.అయినవాళ్ళు లేరు.

‘అతను’ చాలా సున్నితమే కాక సంస్కారం ఉన్నవాడు. స్నేహితుడు వెంకటపతి సాయింత్రం  ఆమెను ‘రంగుల చిలక’ అంటే చివాట్లు పెట్టాడు.  ఇప్పుడు ఆమె జబ్బుపడి పీలగా ఉంది కానీ చక్కనిదే.  ఆమె వంటిమీద మరే నగా లేకపోవడం వల్ల చెవులకి ఉన్న ఎర్ర రాళ్ళ దుద్దులు ప్రత్యేకంగా కనబడుతున్నాయి. సిల్కు లాంటి జుట్టు.ఆ జుట్టు లోంచి ఎర్ర రాళ్ళు ప్రత్యేకంగా మెరుస్తున్నాయ్   జబ్బు కోసం వంటిమీద బంగారం అంతా అమ్మేసుకున్నారుట.

‘అతను’ లోపలికి వచ్చి పడుకున్నా, వాళ్ళ నిస్సహాయత గురించే ఎంతగానో దిగులు పడ్డాడు.  ఎన్నో వెర్రి ఆలోచనలు చేసాడు. ఎంతో గాఢత తో ప్రేమించుకున్న వారి మనుగడ గురించి మధన పడ్డాడు.

తెల్లవారి సేట్ జీ ఒక పొట్లం తెచ్చి ఇచ్చి “ఆ రామ్ నాధ ఈ దుద్దులు ఇచ్చి పోయాడు.  డబ్బులు లేవన్నాడు” అని చెప్పి వాపోతే ఆ పొట్లం తీసుకుని అతనికి పాతిక రూపాయల చెక్ ఇచ్చి పంపేసాడు.ఆ దుద్దులు చూడగానే అతని మనసంతా కలగిపోయింది . సేట్ జీకి అతని మంచితనం తెలుసు కనుక, ఆ అమ్మాయి మీద మనసు పారేసుకుని అందుకోసం ఇంత సాయం చేసే లాంటి మనిషి కాదని అతని గురించి తెలుసు కనుక,  మారు మాట్లాడలేదు గానీ – ఆ ఉదయం వేళ అతనికి లోకమంతా అగమ్యంగా తోచి ఉంటుందని’ రాస్తాడు రచయిత.  ‘అతను’ ఆ దుద్దుల పొట్లం నౌకరు ద్వారా ఆమెకు పంపబోయి, తానే ఇవ్వాలనే ఒక బాల్య చాపల్యంతో తానే ఆ గదికి వెళ్ళడమే ఒక అద్భుతమైన అనుభవానికి కారణమయిందని చెప్తాడు

అతను వెళ్లేసరికి ఆమె విపరీతమైన భాధతో పొట్ట పట్టుకుని లుంగలు చుట్టుకుపోతూ ఉంది.తెల్లవారుఝాము నుంచి నౌకరు కూడా ఇటు రాలేదట.  ఆమె చెప్పిన మాటలను బట్టి రామ్ నాధ బయటకు వెళ్ళక తప్పలేదని,ఉదయం నుంచి తన ప్రాణం పోయేలా ఉందని అంత బాధలోనూ చెప్పింది.

కాఫీ తెప్పించి పట్టిస్తే తాగి, గబా గబా వాంతులు చేసుకుంది.  అతను ఆమెను పట్టుకుని పడుకోబెట్టి డాక్టరును పిలిపించి ఇంజక్షన్ చేయించాడు.

విషయమేమిటంటే ఆమెకు వచ్చిన జబ్బుకి ఆమె సంసారం చెయ్యకూడదు.  అలా జరిగితే ఆమె ఏ క్షణమైనా చనిపోవచ్చు.  ఆ రాత్రి ఆ తప్పు చేసాడు రామ్ నాధ. ఆమెకు తాను బతకనని తెలుసు, డాక్టరూ అదే చెప్పాడు.

ఆమె అతనికి ఆ మరణ వేదనలో అత్యంత ప్రియమైనదైపోయింది.అతని గుండె జాలితో, వేదనతో కరిగిపోయింది   ఆమె కోసం ఎంతయినా ఇస్తాను బ్రతికించ మన్నాడు.  డాక్టరు నవ్వి బతకడం అసంభవం, ఈ రాత్రి పన్నెండు దాటడం కష్టం అన్నాడు. ఏవో నాలుగు పొట్లాలిచ్చి వెళ్ళాడు.

ఆమె అతని చెయ్యి వదల్లేదు. తన పక్కనే కూర్చోపెట్టుకుంది.  మరణ భయంతో ఆమె కళ్ళ ముందు నల్లటి నీడలు. అతను ఆమె సిల్కు జుట్టు నిమురుతూ ధైర్యం చెబుతూ ఉండిపోయాడు.

ఆమె బాధతో తాదాత్మ్యం చెందడం లో అతని మనసంతా ఆమె పట్ల  గొప్ప ప్రేమతో నిండిపోయింది.  రామ్ నాధ  ఇక రాకపోతే ఈ పెన్నిధి నాదే. ఈమె బతకాలి అని అతని ప్రాణం అపరిమితంగా కొట్టుకు పోయింది. ఆమె కడుపు పట్టుకుని మెలికలు తిరుగుతూ నరకబాధ పడింది.  కానీ అతని చెయ్యి వదల లేదు.

అతనికి ఆమె తన చెయ్యి పట్టుకున్నపుడు ఆ రోగి స్త్రీ అనే భావన కలిగిందట.  ఏదో విద్యుత్ నాలో ప్రవహించిందంటాడు.  అది మామూలు విద్యుత్ కాదు, మంత్ర మయమయిన విద్యుత్.  మీ చేతుల్లో ప్రాణాలు వదలనివ్వరూ ? నన్ను వదిలి వెళ్లి పోవద్దే అని ఆమె ఏడుస్తుంటే,  ఎవరూ దిక్కులేకుండా ఈ చిన్ని పుష్పం నేల కలుస్తుందా ! అనే అతని ఆవేదన ఆమెకు ధైర్యాన్నిస్తూ వచ్చింది.

గంటలు గడిచాయి “ఎందుకో తెలియదు, నువ్వు నా కోసం బతకాలి, బతికి తీరాలి” అనే అతని కంఠంలోకి ఏడుపు కూడా వచ్చింది.  ఆమె ఆ ప్రేమను గ్రహించింది.  అంత బాధలోనూ తన బాధ మరిచి అతన్ని లాలించింది.  అతని కంఠంలోని రోదన ఆమెను కొత్త లోకాలలోకి వెలిగించింది.అటువంటి స్త్రీ లాలన అతనికి కొత్త.

పగలంతా గడిచింది.  ఇద్దరి మధ్య వాళ్లకు మాత్రమె తెలిసే చనువు ఏర్పడింది.  బాధ కాస్త తగ్గగానే మొహానికీ చేతులకీ పౌడర్ వేసుకుంది.  అతన్ని అడిగి లవండర్ కూడా రాసుకుంది.  ఇంత తెలివిగా ఉన్న మనిషి అర్థ రాత్రి లోపు చనిపోతుంది.  ఆమెకూ తెలుసు.  అతనికీ తెలుసు.  ఆ చావు అమాంతం వస్తుంది.  బహుశా మాట్లాడుతూ మాట్లాడుతూ కొలాప్స్ కావచ్చు.

రామ్ నాధ వచ్చినా ఫరవాలేదనీ, తన పక్కన అలా కూర్చునే ఉండాలనీ నిష్కర్షగా చెప్పింది.  రాత్రి గడిచే కొద్దీ ఆమెకు భయం పెరుగుతూ వచ్చింది.  గ్లూకోజ్ నీళ్ళు పట్టాడు.  కిటికీలు ముసేసాడు.  అతనికీ భయంగానే ఉంది.  ఆమె భయం ఏదో విధంగా పోగొట్టాలి.  ఆమె నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె వెన్నుముక మీద చేతివేళ్ళతో నిమిరేడు. నిద్రపోయింది.

పన్నెండింటికి ఉలిక్కిపడి లేచి అతని వళ్ళో తలపెట్టుకుని పడుకుంది. మళ్ళీ కునుకుపట్టిన అరగంటలో కెవ్వుమని కేక పెట్టింది. మరణయాతన పడింది. నువ్వు నా మంజువి, నాకోసం బతికించు కుంటాను. ప్రేమలో అమృతానికున్న గుణం ఉందన్నారు.  నువ్వు బతక్క తప్పదు అన్నాడు.  ఇక ఇక్కడ రచయిత మాటలే రాయాలి.

“ఆమె బతికింది. సులువుగా ఒక్క మాటలో ఆ సంగతి ఈనాడు చెబుతున్నానే గాని, ఆనాడు తెల్లవారుఝాము మూడు గంటల దాక ఎంత బాధపడింది మంజు. విలవిలా తన్నుకునే ఆమె పాంచ భౌతిక శరీరాన్ని చూసి నేనెంత ఏడ్చాను.  బాధలూ, కన్నీళ్లు కాలమనే మహార్ణవంలో కలిసిపోతాయి కదా!  నా మంజూ నాకోసం మృత్యువుతో హోరా హోరీ పోరాడింది. ఎంత అహం – నా మంజు, నా కోసం:  మంజూ నేనూ జీవితంలో కలుసుకోము – కలుసుకోక పోయినప్పటికీ ఎంత అహం”

మర్నాడు డాక్టరు మంజులత బతకడం మిరకిల్ అన్నాడు.  ఆమెకింక ప్రాణ భయం లేదన్నాడు ఆ స్థితి దాటాక.డాక్టర్ వెళ్ళాక అతను ఆ ‘ఎర్ర రాళ్ళ’ దుద్దులు ఆమె చేతిలో పెట్టాడు.  అవి ఇవ్వడానికే కదా ఆ ఉదయం ‘అతడు’ ఆమె గదికి వెళ్లి ఆమె బాధ చూసింది.

చివరకు రామ్ నాధ విధిలేక ఆమెను వదిలి వెళ్ళిపోయాడు.  ఆమె తన అన్నగారిని పిలిపించుకుని అతనితో వెళ్ళిపోయింది.  ఈ లోగా నాలుగు రోజులు అదే రూమ్ లో ఉంది. ఆ నాలుగు రోజులు అతను ఆమెను తన ప్రాణంగా భావించాడు. వదలలేక వదలలేక మంగళూర్ మెయిల్ ఎక్కించాడు.  ఆమెకూ అంతే.  ఆమె తన గుర్తుగా ఆ ఎర్ర రాళ్ళ దుద్దులు అతనికి ఇచ్చింది.అతని కాబోయే భార్యకు ఇవ్వమని చెప్పింది

ఇదంతా పద్నాలుగేళ్ళ తర్వాత గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అవి నా భార్య చెవులను మెరుస్తూ ఉన్నాయంటాడు.

ఎవరి జీవితాలూ ఆగలేదు.  కానీ ఆగిన చోట ఒక సమయంలో, ఒక సందర్భం ఇద్దరినీ ఎలా దగ్గర చేసింది.  ఆ సమయం ఎలాంటిది ? ! ఆ వ్యక్తులెలాంటి వాళ్ళు ?! వాళ్ళ హృదయాలు ఆ సమయంలో గొప్ప వెలుగులో ఎలా ధగద్దగాయమానం అయ్యాయి – ?!

పూవులో సువాసన కనిపించనట్టే ప్రేమ కూడా కనిపించదు కదా?కేవలం అనుభవానికే తెలుస్తుంది. కానీ ఎంత మందికి ఆ అనుభవం తెలుస్తుంది.  మరణాన్ని సైతం ధిక్కరించగల ఆ అనుభవం, దానిపేరు ఏదయితేనేం.  కామం మాత్రం కాదు.  వారి మధ్య ఆ సంబంధం సాధ్యం కాదుకదా!

మంజు, రామ్ నాధ గాడంగాప్రేమించుకున్నారు.  కొంత జీవితం సుఖంగా గడిపారు. కానీ, మంజు ‘అతని’ నించి పొందిన ప్రేమ అవ్యాజమయినది. ఆమెకు అది ప్రాణాధారం.  ఆపైన ఆమెకు అతను ప్రాణాధికుడు.

లేత యవ్వనం ఎంత మృదువైనది.  దానికితోడు అతను నిరంతరం గొప్ప సాహిత్యం చదువుకుంటూ  దాంతో ఆ సున్నితాన్ని మరింత మృదువుగా, సంస్కారవంతంగా మార్చుకున్నాడు.

అందువల్లనే ఆమె బాధను తనదిగా తీసుకోగలిగాడు.  అలా తీసుకోవడంలో ఆమెతో ఆకస్మికమయిన ప్రణయ బంధానికి లోనయ్యాడు.  మానవతాదృష్టిలోంచి, దయలోంచి, గాఢ ప్రణయంలోకి అతనూ, అతనివెంట ఆమె చేసిన ప్రయాణం అంతా మన కళ్ళముందే నడుస్తుంది.  ఆ పగలూ, రాత్రీ మనం కళ్ళప్పగించి వారిద్దరి వేదనా ఉత్కంఠతో చూస్తూ నిమిష నిమిషం బరువుగా గడుపుతాం.  ఇదంతా చందూరి నాగేశ్వరరావు గారి ప్రతిభ. పైగా ఆయన ఇది కథ కాదంటాడు.  కథ అయితే పాత్రల్ని రచయిత ఇష్టం వచ్చినట్టు నడపచ్చు.  సన్నివేశాలు మార్చవచ్చు.  కానీ ఇది కథ కాదు.  నిజంగా అలా జరిగింది.  ఆ సన్నివేశాలు అలాగే మారాయి. చివరికి ఆశ్చర్యంగా వారిద్దరి భీతి , బాధ కన్నీళ్ల మధ్య ఆ అద్భుతం జరిగింది.  మళ్ళీ కలవకపోతేనేం వారి అనుబంధం మన మనస్సులో కుడా ఎంతో పదిలంగా ఉంటుంది.

స్త్రీ పురుష సంబంధాల గురించి మనం ఎన్ని చర్చలు చేస్తాం?ఇలాగే ఉండి తీరాలని ఎలా శాసిస్తాం!కాని జీవితం వీటన్నిటి కన్న యెంత అగోచరమో ,యెంత ఆశ్చర్యమో,ఎంతటి అద్భుతమో ఇలాంటి కథలు చెప్పకనే చెప్తాయి.ఇక మనం వేరేగా చెప్పేది ఏముంది !!!

%e0%b0%8e%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%86%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%9a%e0%b0%82%e0%b0%a6%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b0%b3%e0%b1%82%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%ae

*

మూన్ బో

chandram

Art: Rajasekhar Chandram

ఎవరూ ‘నో’ చెప్పలేని సినిమా!

 

pink1

చిత్రం – ‘పింక్‌’ (హిందీ), తారాగణం – అమితాబ్‌ బచ్చన్, తాప్సీ పన్ను, కీర్తీ కుల్హారీ, ఆండ్రియా తైరాంగ్, అంగద్‌ బేడీ, పీయూష్‌ మిశ్రా, కథ – స్క్రీన్‌ప్లే – రితేశ్‌ షా, కెమేరా – అభిక్‌ ముఖోపాధ్యాయ్, సంగీతం – శాంతను మొయిత్రా, ఎడిటింగ్‌ – బోధాదిత్య బెనర్జీ, నిర్మాతలు – రష్మీ శర్మ, సూజిత్‌ సర్కార్, దర్శకత్వం – అనిరుద్ధ రాయ్‌ చౌధురి, నిడివి – 136 నిమిషాలు, రిలీజ్‌ – సెప్టెంబర్‌ 16

 

ఇది పూర్తిగా స్త్రీలకు సంబంధించిన విషయమని తెలిసేలా టైటిల్‌ పెట్టుకున్న ‘పింక్‌’ సినిమా గురించి హాలులోకి వెళ్ళే దాకా నిజంగా నాకేమీ తెలియదు. అమితాబ్‌ నటిస్తున్న సినిమా అనీ, తాప్సీ కూడా ఉందనీ మాత్రం చదివాను. ఎందుకనో అంతకు మించి తెలుసుకోలేదు. ట్రైలర్‌ కూడా మిస్సయ్యాను. కానీ, పోస్టర్‌ చూసినప్పటి నుంచి సినిమా చూడాలని మైండ్‌ ఫిక్సయిపోయింది. మనసు చెప్పేవాటికి మెదడు వివరణ ఇవ్వలేదు. అది అంతే! సినిమా చూడదలుచుకొంటే అది రిలీజయ్యాక దాని గురించి దూషణ భూషణ తిరస్కారాలేవీ తెలుసుకోకపోవడం, విశ్లేషణలు చదవకపోవడం నాకున్న అలవాటు. అవన్నీ తెలుసుకుంటే ఏమీ రాయని పలకలా స్వచ్ఛంగా సినిమాకు వెళ్ళలేనేమోననీ, ఆ చదివినవాటి ప్రభావంతోనే హాలులో ఆలోచిస్తానేమోననీ ఒక చిన్న భయం. అందుకే, ‘పింక్‌’ వచ్చి మూడు రోజులైనా, దాని గురించి ఏమీ చదవలేదు. తెలుసుకోలేదు. ఇప్పుడే సినిమా చూసొచ్చాను. అర్ధరాత్రి అయ్యిందన్న మాటే కానీ, నిద్ర పట్టని అనుభవం ఈ సినిమా. ఇంటికొచ్చేశాక కూడా దర్శక, రచయితలు సమాజానికి సంధించిన ప్రశ్నలు నా బుర్రలో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. దీని గురించి మనసులో అనిపించింది ఏదో రాయాలి… మనసు చెబుతోంది. రాయకుండా పడుకోలేని మనఃస్థితిలో… ఒకానొక రాత్రివేళ రాసుకుంటూ వెళ్ళిన ర్యాంబ్లింగ్స్‌ ఇవి…

అవునూ… కాస్తంత నవ్వుతూ, తుళ్ళుతూ, షేక్‌ హ్యాండ్‌ ఇస్తూ తిరిగే అమ్మాౖయెతే… ఇక ఆ అమ్మాయి తిరుగుబోతు అనేనా? పార్టీకి వచ్చి ఒక దమ్ము బిగించి, బీరు కొట్టినంత మాత్రాన ఆడపిల్లంటే అలుసా? డబ్బుకో, మరొక దానికో చటుక్కున లొంగి, టపుక్కున పక్కలో చేరిపోతుందనే భావనా? వర్కింగ్‌ లేడీ కాస్తంత ఆలస్యంగా రూమ్‌కొచ్చినా, ఆమె కోసం ఇద్దరో ముగ్గురో మగ ఫ్రెండ్స్‌ రూమ్‌కు వచ్చినా ఆ అమ్మాయి బజారుదనే అర్థమా? కాస్తంత అందంగా తయారై ఆఫీసుకు వచ్చినా – క్యారెక్టర్‌ బ్యాడ్‌ అనే తాత్పర్యమా? ఏమిటీ మైండ్‌సెట్‌! తప్పు మనదా? మనల్ని ఇలా తయారుచేసిన చుట్టుపక్కలి సమాజానిదా? మరి, మనం మారమా? ఎప్పటికీ మారమా? మనసుతో బుర్రకు పని చెప్పే ఇలాంటి ప్రశ్నలెన్నో ‘పింక్‌’ మనకి వేస్తుంది. ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

————————-

కథగా ఈ సినిమా చాలా సింపుల్‌. ఢిల్లీ పిల్ల మీనల్‌ అరోరా (తాప్సీ), లక్నో వనిత ఫాలక్‌ అలీ (కీర్తీ కుల్హారీ), మేఘాలయ పిల్ల ఆండ్రియా (ఆండ్రియా తైరాంగ్‌) – ముగ్గురూ వేర్వేరు రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధుల్లో ఉంటారు. స్వతంత్రంగా గడపాలనుకొనే ఈ ఆధునిక తరం యువతులు ఢిల్లీలో ఒక అపార్ట్‌మెంట్‌ను కలసి అద్దెకు తీసుకొంటారు. స్వేచ్ఛగా బతుకుతుంటారు. సిగరెట్‌ తాగడం, అవసరాన్ని బట్టి ఒకటో రెండో పెగ్గులేయడం, మనసుకు నచ్చితే దైహిక అవసరం తీర్చుకోవడం – ఇవేవీ తప్పు కాదని నమ్మి, అలాగే బతికే కొత్త తరానికి వీళ్ళంతా ప్రతినిధులు. ఒకసారి ఫ్రెండ్స్‌ నైట్‌ పార్టీలో జరిగిన ఒక గొడవలో మంత్రి గారి బంధువైన యువకుడు రాజ్‌ వీర్‌ (అంగద్‌ బేడీ)ని సీసాతో కణత మీద గట్టిగా రక్తమోడేలా కొట్టి, మీనల్‌ తన స్నేహితురాళ్ళతో కలసి పారిపోతుంది. అతగాడికి కంటి పైన తీవ్రగాయమై, ఆస్పత్రిలో కుట్లు కూడా పడతాయి. మీనల్‌ మీద కక్ష తీర్చుకోవాలని విలన్‌ బృందం ప్రయత్నం. పోలీసుల దగ్గరికి వెళ్ళాలని హీరోయిన్‌ సాహసం. రాజీ కుదర్చాలని మధ్యలో ఫ్రెండ్స్‌ తాపత్రయం.

రాజీ ప్రయత్నం విఫలమైపోతుంది. పోలీసుల దగ్గరకు హీరోయిన్‌ వెళ్ళడంతో ఆమెను ఏకంగా కిడ్నాప్‌ చేసి, వ్యాన్‌లో అఘాయిత్యానికి పాల్పడి మరీ విలన్లు బెదిరిస్తారు. పైగా, అమ్మాయిలపై తామే ఎదురు ఫిర్యాదు చేస్తారు. హీరోయిన్‌ జైలు పాలవుతుంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న మిగతా ఇద్దరు అమ్మాయిలకు, ఆ ఇంటి పక్కనే ఉండే ప్రముఖ రిటైర్డ్‌ లాయర్‌ దీపక్‌ సెహ్‌గల్‌ (అమితాబ్‌ బచ్చన్‌) బాసట అవుతాడు. చాలా రోజుల క్రితమే నల్ల కోటు వదిలేసిన ఆయన మళ్ళీ ఈ ఆడపిల్లలకు న్యాయం జరిపించడం కోసం బరిలోకి దిగుతాడు. కానీ, తీరా విలన్లు, వారి లాయర్‌ (పీయూష్‌ మిశ్రా) మాత్రం హీరోయిన్, ఆమె స్నేహితురాళ్ళు పక్కా వ్యభిచారుణులన్నట్లు చిత్రీకరిస్తారు. మరి, అప్పుడు ఏమైంది? ఆ అపవాదును ఆ అమ్మాయిలు ఎలా ఎదుర్కొన్నారు? అసలింతకీ ఆ పార్టీ రోజున జరిగిందేమిటి? మొదలనవన్నీ మిగతా సినిమా.

————————-

ఒక చిన్న సంఘటన, దాని పర్యవసానాలు… అంతే ఈ సినిమా కథ. పాటలు, డ్యాన్సులు, కామెడీల లాంటి ఐటమ్‌లు, కనీసం ఐటమ్‌ సాంగ్‌లు కూడా లేని సినిమా. సినిమాలో ఒకటికి రెండుసార్లు వినిపించే ఒకే బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్, రోలింగ్‌ టైటిల్స్‌లో వచ్చే కవితాత్మక గీతం మినహా ఇందులో సోకాల్డ్‌ ‘సినిమాటిక్‌ సాంగ్స్‌’ లేవు కాక లేవు. ఆ మాటకొస్తే, సినిమాలో పేరున్న నటీనటులు మాత్రం ఎవరున్నారని? మనందరికీ తెలిసిన అమితాబ్‌ బచ్చన్, మన దగ్గర మాత్రమే కాస్తంత పాపులరైన తాప్సీ. వాళ్ళు కూడా మనకు వాళ్ళలా కనపడరు. కథలో పాత్రలుగానే అనిపిస్తారు.

అమితాబ్‌ను ఎందుకు గొప్ప నటుడంటారో తెలుసుకోవాలంటే, అనారోగ్యం పాలైన భార్యను చూసుకొనే టైమ్‌లో అతని హావభావాలు, అతని డైలాగ్‌ మాడ్యులేషన్, పూడుకుపోయిన గొంతుతో అతను మాట్లాడే డైలాగులు చూడండి, వినండి. ఫెమినిస్టుగా కనిపించే అదే మనిషి – కోర్టులో నిలదీస్తున్నప్పుడూ, నిర్ఘాంతపోయి ఆవేదనాపూరిత మనస్కుడైనప్పుడూ మాట్లాడే తీరు, ప్రవర్తన గుర్తించండి. ఇవాళ్టికీ ‘సర్కార్‌’, ‘బ్లాక్‌’, ‘పీకూ’ లాంటి విభిన్న తరహా సినిమాలు, వయసుకు తగ్గ సినిమాలూ చేసే ఆయన మీద మన సినిమా స్టార్స్‌ అందరి కన్నా ప్రేమ పెరుగుతుంది. ఇప్పటి దాకా తాప్సీని గ్లామర్‌ రోల్స్‌లోనే చూసి, మానసికంగా అలాగే ఫిక్సయిపోయివాళ్ళకు ఈ సినిమా ఒక స్టార్‌ట్లింగ్‌ రివిలీషన్‌. ఈ పాత్ర, కోర్టు బోనులో నిలబడే సీన్లలో ఆమె నటన చూశాక, నటిగా ఆమె మీద గౌరవం కలుగుతుంది.

సినిమాలో ఇక, మిగతా అంతా పెద్ద పేరున్నవాళ్ళు కాదు. కానీ ఎంత బ్రహ్మాండంగా పాత్రల్ని పండించారో! తాప్సీకి స్నేహితురాలుగా వేసిన ఇద్దరమ్మాయిలూ, ముఖ్యంగా ఫాలక్‌ అలీ పాత్రధారిణి, అలాగే కోర్టులో అబ్బాయిల తరఫు లాయర్, జడ్జి (ధ్రుతిమాన్‌ ఛటర్జీ), అమితాబ్‌ భార్య (మమతా శంకర్‌), చివరకు హౌస్‌ ఓనర్‌ సహా ప్రతి పాత్రా సహజంగా అనిపిస్తుంది. తెరపై సజీవంగా కనిపిస్తుంది.

————————-

టెక్నికల్‌గా కూడా ‘పింక్‌’ సౌండే! విడిగా మళ్ళీ డబ్బింగ్‌ చెప్పాల్సిన అవసరం లేకుండా సెట్స్‌లో నటిస్తున్నప్పుడే డైలాగులు కూడా రికార్డు చేసే ‘సింక్‌’ సౌండ్‌ విధానం వాడారు. ఇవాళ తెలుగు సినిమాకు కూడా విస్తరిస్తున్న హాలీవుడ్, బాలీవుడ్‌ సినిమాల తాలూకు ‘సౌండ్‌ డిజైనింగ్‌’ అనే ప్రత్యేక శాఖతో స్క్రిప్టుకు వచ్చే బలం ఎంతో సినిమా చూస్తే అర్థమవుతుంది. నేపథ్య సంగీతం అంటే, డబ డబ డప్పుల మోత, హీరో గారి ఎంట్రన్స్‌ నుంచి విలన్‌తో ఢీ అన్నప్పుడల్లా హై డెలిబల్స్‌ సౌండ్‌ అలవాటైపోయిన ప్రాంతీయ భాషా సినీ ప్రేక్షకులకు ‘పింక్‌’ ఒక రిఫ్రెషింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. శాంతను మొయిత్రా (గతంలో రాజేశ్‌ టచ్‌రివర్‌ డైరెక్ట్‌ చేసిన అవార్డు చిత్రం ‘నా బంగారు తల్లి’కి నేపథ్య సంగీతం కూడా శాంతనూయే) నేపథ్య సంగీతం, రీ–రికార్డింగ్‌ ఇటీవల వచ్చిన సినిమాల్లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ అంటే అతిశయోక్తి అనిపిస్తుందేమో! కానీ, అది నిజం!

సినిమా చూస్తుంటే… తెరపై టైట్‌ క్లోజప్‌లు, నేమ్‌బోర్డ్స్‌ మీదుగా ప్యాన్‌ చేస్తూ సిటీలోకి కారులో సాగే ప్రయాణం – ఇలా చాలా చోట్ల కెమేరామన్‌ అభిక్‌ ముఖోపాధ్యాయ్‌ పనిమంతుడని అర్థమైపోతుంటుంది. ఆ సీన్‌లో, ఆ సన్నివేశం తాలూకు అనుభూతిలో ప్రేక్షకుణ్ణి కూడా ఒక భాగం చేసే ఆ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఇక, సినిమా ఎడిటింగ్, షాట్స్‌ సెలక్షన్, వాటి కూర్పులో తెచ్చిన డ్రామా కూడా చాలా ఉంది. వీటన్నిటినీ సౌండ్‌ డిజైన్, నేపథ్య సంగీతం మరో మెట్టు పైన కూర్చోబెట్టాయి. కథ జరుగుతున్న కొద్దీ, టైమ్‌కు తగ్గట్లుగా విలన్‌ ముఖం మీది గాయం కూడా క్రమంగా మానిన లక్షణాలతో మేకప్‌ చేయడం లాంటివి చూడడానికి చాలా చిన్న విషయాలే. అయితే, అవన్నీ దర్శకుడి శ్రద్ధాసక్తులకు నిస్సందేహంగా నిదర్శనం.

————————-

pink2

సినిమా మొదలైన క్షణాల్లోనే ప్రేక్షకుల్ని కెమేరా కన్ను వెంట కథలోకి లాక్కుపోవడం ఏ ఉత్తమ స్క్రిప్ట్‌కైనా ప్రాథమిక లక్షణం. అది ‘పింక్‌’లో పుష్కలం. న్యూస్‌పేపర్లలో వస్తున్న సమకాలీన సంఘటనల స్ఫూర్తితో రితేశ్‌ షా రచన చేసిన ఈ సినిమా మొదలైన తర్వాత గంటకి ఎప్పుడో ‘ఇంటర్‌మిజన్‌’ అని తెరపై పడితే కానీ, టైమ్‌ తెలీదు. ఇక, పూర్తిగా కోర్టు డ్రామాగా నడిచే సెకండాఫ్‌ అయితే అంతకన్నా రేసీగా, ఆలోచించే తీరిక ఇవ్వకుండా పరుగులు తీస్తుంది. ఆస్పత్రిలో భార్యకు ఈ ముగ్గురు ఆడపిల్లల్నీ అమితాబ్‌ పరిచయం చేస్తుంటే, మంచం మీద నుంచి లేవలేని భార్య బిస్కెట్‌ ప్యాకెట్‌ అందించే సీన్‌ లాంటి సెన్సిబుల్‌ మూమెంట్స్‌ ఈ సినిమాలో కొన్ని ఉన్నాయి. అసలు జరిగిన కథేమిటో ఆఖరులో రోలింగ్‌ టైటిల్స్‌లో చూపెట్టే ‘పింక్‌’ స్క్రీన్‌ప్లే పరంగా, కథాకథన శైలి పరంగా ఔత్సాహికులు గమనించాల్సిన సినిమా.

అలాగని ఈ సినిమా స్క్రిప్టులో లోపాలు లేవని కాదు. హీరోయిన్‌ను పోలీసులు జైలులో పెట్టినా, ఆ తరువాత కథ కోర్టు దాకా వెళ్ళినా – అంతకు ముందు కనిపించిన హౌస్‌ ఓనర్‌ ముసలాయన ఎందుకొచ్చి, నోరు విప్పడో తెలియదు. అలాగే, తనను కిడ్నాప్‌ చేసి, ఊరంతా వ్యాన్‌లోనే విలన్లు తిప్పిన సంగతి గురించి కోర్టులో హీరోయిన్‌ చెప్పదు. విలన్ల కన్నా ముందే పోలీసుల్ని ఆశ్రయించి భంగపడిన విషయమూ జడ్జి ఎదుట బయటపెట్టదు. అయితేనేం! ఈ సినిమా ప్రస్తావించిన అనేక మౌలిక అంశాల ముందు ఈ లోటుపాట్లు మర్చిపోదగ్గవే!

చలం ఏనాడో చెప్పినట్లు, స్త్రీకి కూడా ఒక మనసుంటుంది… ఆమెకూ ఇష్టానిష్టాలు ఉంటాయి. అవేవీ గమనించకుండా, గౌరవించకుండా తాళి కట్టిన భార్య అనో, సరదాగా తిరిగిన తోటి ఉద్యోగిని అనో, స్నేహితురాలు అనో… పశువులా మీద పడితే? అచ్చంగా పశువు అనే అనుకోవాల్సి వస్తుంది. తనకు ఇష్టం లేదని తోటి మనిషి ‘నో’ అంటే, ఆ ఒక్క పదంలో కొన్ని కోట్ల భావాలు, వాక్యాలు ఉన్నాయని గుర్తించాలని ‘పింక్‌’ మన పురుషాహంకార జీవుల చెంప ఛెళ్ళుమనిపిస్తుంది. రూల్‌ నంబర్‌ 1, నంబర్‌ 2 అంటూ కోర్టులో అమితాబ్‌తో దర్శక, రచయితలు చెప్పించే ప్రతి డైలాగూ ఒక పాఠమే. ‘విక్కీ డోనర్‌’, ‘మద్రాస్‌ కేఫ్‌’, ‘పీకూ’ లాంటి వైవిధ్యమైన సినిమాలు అందించిన దర్శకుడు సూజిత్‌ సర్కార్‌ ఈసారి నిర్మాతగా వెండితెరపై చేసిన కాంటెంపరరీ సోషల్‌ కామెంట్‌ ‘పింక్‌’. రాగల చాలా కాలం పాటు ఈ సినిమా గుర్తుంటుంది.

ఒక సినిమాలో మహా అయితే కథ బాగుండవచ్చు. మరొక సినిమాలో నటీనటుల అభినయం బాగుందనిపించవచ్చు. ఇంకొక సినిమాలో టెక్నికల్‌ బ్రిలియన్స్‌ కొట్టొచ్చినట్లు కనిపించవచ్చు. కానీ, ఒకే సినిమాలో ఈ మూడూ బాగుంటే? ఈ మధ్య కాలంలో అలాంటివేవీ లేవు. కానీ, ఇప్పుడు ఆ కొరత తీరుస్తుంది – ‘పింక్‌’. ఆ మాటకొస్తే – చూసిన కాసేపే కాకుండా, హాలులో నుంచి బయటకు వచ్చేశాక కూడా వెంటాడే ఒక అనుభూతినో, ఆలోచననో మిగల్చడానికి మించి ఏ సినిమాకైనా ప్రయోజనం ఇంకేం ఉంటుంది! రెండుంబావు గంటల ‘పింక్‌’ అచ్చంగా అలాంటి సినిమానే! అందుకే, ఇలాంటి సినిమాలకు యూ కాన్ట్‌ సే… ‘నో’. కావాలంటే, వెళ్ళి చూసి రండి. చూసి వచ్చాక నా అభిప్రాయంతో నూటికి నూరుపాళ్ళూ మీరూ ‘యస్‌’ అనే అంటారు! మే ది ట్రైబ్‌ ఆఫ్‌ థాట్‌ ప్రొవోకింగ్‌ ఫిల్మ్స్‌ గ్రో!

 

తాజా కలం

 ఇంతకీ ‘పింక్‌’ అంటే ఏమిటి? అమ్మాయిలకు సంబంధించిన విషయమనేది వాచ్యార్థం. కానీ, ‘పింక్‌’ అంటే భయపెట్టి, బాధించి, బలవంతాన స్త్రీ జననేంద్రియాన్ని పురుషుడు ఆక్రమించడమనేది కొన్ని దేశాల్లో ఉన్న అర్బన్‌ స్లాంగ్‌ అట! జర్నలిస్ట్‌ మిత్రుడొకడు తాజాగా గుర్తుచేశాడు. అది ఈ టైటిల్‌లోని సూచ్యార్థం. సినిమా చూస్తే, ‘పింక్‌’ అంటే ఏమిటో ఇట్టే అర్థమవుతుందని సూజిత్‌ సర్కార్‌ అన్న మాటల వెనుక ఇంత నిగూఢార్థం ఉందన్న మాట! ఈ సినిమానే కాదు టైటిల్‌ కూడా ప్రేమ ముసుగులో బయటా, పెళ్ళి ముసుగులో ఇంటా జరుగుతున్న కనిపించని లైంగిక హింసకు అర్థవంతమైన అద్దం కదూ!

…………………………………..

 

 

 

 

ఆ రెండు సినిమాలు- రెండు ఆత్మగౌరవ పతాకలు!

movie-pink

వొకానొక రాత్రి పార్టీలో కలిసిన ముగ్గురు కుర్రాళ్ళతో ఆ ముగ్గురు అమ్మాయిలు, డ్రింక్స్ తీసుకుంటూ, నవ్వుతూ తుళ్ళుతూ వున్నప్పుడు జరుగుతుంది అది. చొరవ తీసుకుని, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి, లొంగదీసుకోవాలనుకుంటారు ఆ కుర్రాళ్ళు.  అమ్మాయిల్లో ధైర్యవంతురాలైన వొక అమ్మాయి, మినాల్, వేరే గత్యంతరంలేక, ప్రతిఘటిస్తున్నా వినిపించుకోని ఆ కుర్రాడిని, చేతికందిన బాటిల్తో ముఖాన కొడుతుంది. కంటి  దగ్గర గాయమై రక్తమోడుతున్న అతన్ని వదిలి, మిగతా స్నేహితురాళ్ళని (ఫలక్, ఆండ్రియా ) తీసుకుని బయట పడుతుంది.

జరిగింది పీడకలగా మరచిపోయి ముందుకు సాగిపోవాలనుకుంటారు.  కాని ఆ కుర్రాళ్ళు, వాళ్ళ మరొక స్నేహితుడు  వదిలిపెడితేగా. ఆ అమ్మాయిలకు వాళ్ళ హద్దు (ఔకాత్ అంటే స్టేటస్) ను గుర్తు  చేయాలనుకుంటారు. వాళ్ళ ఇల్లుగలాయనకు ఫోన్ చేసి వాళ్ళ చేత ఇల్లు ఖాళీ చేయించమని బెదిరిస్తారు. వాళ్ళను కూడా ఫొన్ చేసి బెదిరిస్తారు, వెంబడిస్తారు. మినాల్ నైతే కార్లోకి గబుక్కున లాక్కొని, నడుస్తున్న కారులోనే రేప్ చేసినంత పని చేస్తారు. ఇంత జరుగుతుంటే ఇక ఆ అమ్మాయిలకు ఆ కుర్రాళ్ళ  మీద పోలీసు కేసు పెట్టక తప్పని పరిస్థితి. అక్కడినుంచీ పోలీసు స్టేషన్లలో పని తీరు, వ్యవస్థ ఇవన్నీ ముందుకొస్తాయి. అభియోగి రాజవీర్ వొక రాజకీయ నాయకుడి కొడుకు. ఈ నమోదైన కేసు గురించి ముందు వారికే చెప్తారు, వారు చెప్పినట్టే పాత తేదీతో వొక కేసును ఈ అమ్మాయిల మీద (హత్యా ప్రయత్నం)  నమోదు చేస్తారు.

ఇప్పుడు ఈ విషయాన్ని చర్చకు పెట్టాలంటే కోర్ట్ రూం డ్రామా కంటే సులువు పద్ధతి యేముంది?

అప్పుడు వస్తాడు దీపక్ సెహగల్ (అమితాభ్) అన్న లాయర్. పక్క బిల్డింగులో వుంటాడు. వీళ్ళను గమనిస్తుంటాడు. మినల్ ని వాళ్ళు కారులో యెత్తుకెళ్ళిపోవడం చూస్తాడు. పోలీసుకు ఫొన్ చేసి ఫిర్యాదు చేస్తాడు. ఇప్పుడు కోర్ట్ లో వీళ్ల తరపు లాయర్.

మనకు సమాజంలో కొన్ని నమ్మకాలు, అభిప్రాయాలు బలపడ్డాయి. డ్రింక్స్ తీసుకునే అమ్మాయిలు మంచి కుతుంబంలోంచి వచ్చిన వారు కాదు, సన్స్కారవంతులు కాదు. అలాగే రాత్రి పూటలు  పార్టీలకు వెళ్ళేవారు, మగవాళ్ళతో నవ్వుతూ మాట్లాడే వాళ్ళు, జీన్స్, స్కర్ట్ లు వేసుకునేవాళ్ళు. కోర్ట్ లో గనక ఆ అమ్మాయిలు అలాంటి వారు అని నిరూపించ గలిగితే, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని, డబ్బుల దగ్గర తేడాలొచ్చి వాళ్ళల్లో వొక అమ్మాయి హత్యా ప్రయత్నం చేసిందని నిరూపించడం తేలికవుతుంది.

వొక స్త్రీ ఆమె భార్య కావచ్చు, వ్యభిచారి కావచ్చు, ప్రియురాలు కావచ్చు, యెవరైనా కావచ్చు, ఆమె వద్దన్న తర్వాత ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా జరిగేదాన్ని అత్యాచారంగానే గుర్తించాలి. ఆమె “వద్దు” (నో) అంటే ఆ మాటకు వొక్కటే అర్థం. అది మగవాళ్ళంతా అర్థం చేసుకోవాలి.

ఇవీ దీపక్ కేసులో తన వాదన ముగించాక చెప్పే చివరి మాటలు.

ఈ సినిమా యే విషయం చెప్పదలచుకుంటున్నది అన్నదాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా మంచి చిత్రం. అందరి నటనా (ముఖ్యంగా అమ్మాయిలది) చాలా చక్కగా వుంది. అనిరుద్ధ రాయ్ చౌధరి దర్శకత్వం కూడా చెప్పదలచిన విషయం వైపుకు కథను నడిపిస్తుంది. చూసే వారిని కట్టి పడేస్తుంది కథనం. మగవారి ఆలోచనల్లో మార్పు తేగలిగితే సినిమా విజయం సాధించినట్టే.

 

కాని కొన్ని విషయాలు వున్నాయి. దీపక్ వొక bipolar disorder తో బాధపడుతున్న వ్యక్తి. అలాంటి వాళ్ళు శరీరంలో హార్మోన్లు యెక్కువైనా, తక్కువైనా అకారణంగానే చాలా దుక్ఖంలో కూరుకుపోవడమో, కారణంలేకుండానే చాలా ఉత్సాహంగా వుండడమో చేస్తారు. అలాంటి వ్యక్తికే స్పష్టంగా అర్థం అవుతున్న విషయం, ఆరోగ్యంగా వున్న సమాజానికి యెందుకు అర్థం కాదు? వాతావరణ కాలుష్యానికి అలవాటు పడిపోయిన మనుషుల మధ్య దీపక్ మాత్రం మాస్క్ తొడుక్కునే బయటకు వెళ్తాడు. యేదో అనారోగ్యంతో బాధ పడుతున్న భార్యను ఆసుపత్రిలో చికిత్స చేయిస్తూ, వొక బాధ్యతగల భర్తగా సేవలు చేస్తుంటాడు. ఈ సందర్భం వచ్చినప్పుడు ఈ అమ్మాయిలకు న్యాయం జరగాలని వాళ్ళ తరపున కేసు వాదిస్తాడు. పితృస్వామ్యంలో ఆ అమ్మాయిలకు జరిగిన అన్యాయానికి ఇతను పితృ స్థానంలో నిలబడి సరి చేయాలనుకుంటాడు.

సినిమాలో ముగ్గురు అమ్మాయిలూ వొక రకంగా వొంటరే. వాళ్ళ ఇళ్ళ నుంచి ఈ కష్టకాలంలో తోడుగా నిలబడటానికి యెవరూ వుండరు. ఫలక్ ప్రేమిస్తున్న మనిషి కూడా ఆమెకు సపోర్టివ్వడు. తమ పనులేవో చూసుకుంటూ, తమ కాళ్ళ మీద నిలబడ్డ ఈ ముగ్గురు అమ్మాయిలూ చాలా ధైర్యం కనబరుస్తారు. కోర్ట్ లో మాత్రం బేల అయి పోతారు. యెలాంటి ధైర్యవంతులైన స్త్రీలనైనా మెడలు వంచి నిస్సహాయ పరిస్థితుల్లోకి నొక్కేసే బలమూ, తెలివి తేటలూ  వున్న వ్యవస్థ అది.

శత్రువు దుర్మార్గుడే కాదు, తెలివైనవాడు కూడా.  కోర్ట్ సీన్ లో రాజవీర్ తన సహజ స్వభావం బయటపడేలా మాట్లాడటంతో కేసు తేలిపోతుంది. ఎమోషనల్ గా కాకుండా తెలివిగా ప్రవర్తించి వుంటే కేసు ఇంత తేలికగా గెలిచేపనేనా? వాస్తవానికి అత్యాచారాల కేసులలో చాలా మటుకు తగినన్ని సాక్ష్యాధారాలు లేవనో, లేదా వేరే కారణాల వల్లనో కొట్టివేయబడుతున్నాయి.

masaan

యెందుకో 2015లో వచ్చిన సినిమా “మసాన్” గుర్తుకొస్తున్నది.

వారణాసి గంగా నదీ తీరం. సంస్కృత పండితుడు సంజయ్ మిశ్రా నదీ తీరంలో (శ్రాద్ధ కర్మలు అవీ చేసుకునేవాళ్ళకి అవసరమయ్యే సరంజామా అమ్మే) వొక దుకాణం నడుపుతుంటాడు. అతని కూతురు రిచా చడ్డా చదువుకుంటూ పార్ట్ టైం పని చేస్తుంటుంది. అదే నదీ తీరంలో శవాలను తగలబెట్టే కుటుంబంలో విక్కీ కౌశల్ అనే కుర్రాడు ఎంజినీరింగు చదువుతుంటాడు. ఇంటిదగ్గర వున్నప్పుడు తండ్రికి శవాలు తగలబెట్టే పనిలో సాయ పడుతుంటాడు.

సినిమా ఈ రెండు కుటుంబాల కథ. రిచా చడ్డా వొక అబ్బాయిని ఇష్టపడుతుంది. వొక రోజు వాళ్ళిద్దరూ చాటుగా వొక లాడ్జిలో గది తీసుకుని మోహాల మైకంలో తేలిపోతున్న వేళ పోలీసులు రైడ్ చేస్తారు. పోలీసులు అమ్మాయి ఫొటొని మొబైల్ లో తీస్తారు. అబ్బాయి మాత్రం గిలగిల లాడి పోతాడు. పరువు పోతుందని బహయం, తండ్రి భయం. వదిలి పెట్టమని ప్రాధేయపడతాడు. యెంతో కొంత తీసుకుని వదిలి వేయ మంటాడు. ఇలా చిక్కిన గొర్రెలను అంత తేలికగా వదిలిపెడతారా పోలీసులు? పిరికివాడైన అబ్బాయి సందు దొరకగానే విడిపించుకొని బాత్రూం లో దూరి తలుపు వేసుకుంటాడు. తర్వాత నిస్సహాయంగా తన చేతిని మణికట్టు దగ్గర కోసుకుంటాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు గాని బతకడు. అలా ఇద్దరు చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మయి వొక్కతే బలిపశువు అయ్యింది.

నువ్వు లాడ్జికి యెందుకు వెళ్ళావు అని పోలీసు అడిగితే ఆమె “కుతూహలం” కారణంగా చెబుతుందే తప్ప యెలాంతి సిగ్గు, అపరాధ భావన వ్యక్త పరచదు. వాళ్ళ నాన్న అడిగినా అదే జవాబు. abettment to suicide నుంచి ఆమెను తప్పించాలంటే మూడు లక్షలు రెండు నెలల్లో చెల్లించే వొప్పందం ఆ పోలీసు, ఆమె తండ్రి మధ్య. ఫిక్స్ దిపాజిట్ లో  దాచుకున్న లక్ష మొదటి వాయిదాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా డబ్బు యెలా సమకూరాలా అన్నది వాళ్ళకు పట్టిన శని. ఆమెకు కొన్ని అదనపు సమస్యలు. “నువ్వు వాడితో పడుకున్నావుగా, నాతో పడుకోవడానికేం”, అని వేధించే వాళ్ళు. 12000 వచ్చె వుద్యోగం వూడతం, వేరే వుద్యోగంలో కుదురుకుంటే 5500 మాత్రమే రావడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా సూక్ష్మంగా చూపిస్తాడు దర్శకుడు నీరజ్ ఘైవాన్ (ఇది ఇతని మొదటి చిత్రం).

మరోపక్క తక్కువ కులానికి చెందిన విక్కీ, అగ్ర కులానికి చెందిన అమ్మాయి శ్వెతా త్రిపాఠి ప్రేమించుకుంటారు. అతని కులం తెలిసిన తర్వాత కూడా అతన్నే చేసుకుంటానని, అవసరమైతే లేచి వస్తానని, పెళ్ళి అయ్యాక పెద్దవాళ్ళు నెమ్మదిగా చల్లబడతారనీ అంటుంది. కాని దానికి ముందే ఆమె వొక బస్సు ప్రమాదంలో మరణిస్తుంది.  ఆమె శవాన్ని అతనే దహనం చేయాల్సి వస్తుంది.

ఈ రెండు జంటలూ చాలా నిజాయితీ గా, స్వచ్చంగా, అమాయకంగా, నిర్మలంగా వుంటాయి. అమ్మాయిల విషయానికి వస్తే ఇద్దరూ చాలా ధైర్యన్ని కనబరుస్తారు. రిచా చడ్డా తన బాడీ లాంగ్వేజ్ తో (నిటారు గా నిలబడే/కూర్చునే/నదిచే తీరు; సిగ్గు/అపరాధభావనా లేశమాత్రమైనా కనబడని తీక్షణ కళ్ళు, తడబాటు లేని సూటిగా వచ్చే మాటలు; తన మీద తనకున్న నమ్మకం). పోతే శ్వేతా త్రిపాఠి కవిత్వన్ని ప్రేమించే సున్నిత మనస్కురాలు. కాని తమ మధ్య వున్న కులపు అడ్డుగోడల గురించి తెలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయం అవసరమైతే పారిపోయి అయినా వివాహం చేసుకోవాలి, పెద్దవాళ్ళని నెమ్మదిగా వొప్పించవచ్చు.

రోజూ యెన్నో శవాలు తగలబడుతుండే ఆ భూమికలోనే ఈ రెండు ప్రణయ గాథలు. (మసాన్ అంటే స్మశానం).

ఈ రెండు సినిమాలు పోల్చింది కూడా ఈ స్త్రీల ధైర్య-సాహసాలకి, ఆత్మ విశ్వాసానికి, ఆత్మ గౌరవానికీ.

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

యెందుకో 2015లో వచ్చిన సినిమా “మసాన్” గుర్తుకొస్తున్నది.

 

వారణాసి గంగా నదీ తీరం. సంస్కృత పండితుడు సంజయ్ మిశ్రా నదీ తీరంలో (శ్రాద్ధ కర్మలు అవీ చేసుకునేవాళ్ళకి అవసరమయ్యే సరంజామా అమ్మే) వొక దుకాణం నడుపుతుంటాడు. అతని కూతురు రిచా చడ్డా చదువుకుంటూ పార్ట్ టైం పని చేస్తుంటుంది. అదే నదీ తీరంలో శవాలను తగలబెట్టే కుటుంబంలో విక్కీ కౌశల్ అనే కుర్రాడు ఎంజినీరింగు చదువుతుంటాడు. ఇంటిదగ్గర వున్నప్పుడు తండ్రికి శవాలు తగలబెట్టే పనిలో సాయ పడుతుంటాడు.

 

సినిమా ఈ రెండు కుటుంబాల కథ. రిచా చడ్డా వొక అబ్బాయిని ఇష్టపడుతుంది. వొక రోజు వాళ్ళిద్దరూ చాటుగా వొక లాడ్జిలో గది తీసుకుని మోహాల మైకంలో తేలిపోతున్న వేళ పోలీసులు రైడ్ చేస్తారు. పోలీసులు అమ్మాయి ఫొటొని మొబైల్ లో తీస్తారు. అబ్బాయి మాత్రం గిలగిల లాడి పోతాడు. పరువు పోతుందని బహయం, తండ్రి భయం. వదిలి పెట్టమని ప్రాధేయపడతాడు. యెంతో కొంత తీసుకుని వదిలి వేయ మంటాడు. ఇలా చిక్కిన గొర్రెలను అంత తేలికగా వదిలిపెడతారా పోలీసులు? పిరికివాడైన అబ్బాయి సందు దొరకగానే విడిపించుకొని బాత్రూం లో దూరి తలుపు వేసుకుంటాడు. తర్వాత నిస్సహాయంగా తన చేతిని మణికట్టు దగ్గర కోసుకుంటాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్తారు గాని బతకడు. అలా ఇద్దరు చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మయి వొక్కతే బలిపశువు అయ్యింది.

 

నువ్వు లాడ్జికి యెందుకు వెళ్ళావు అని పోలీసు అడిగితే ఆమె “కుతూహలం” కారణంగా చెబుతుందే తప్ప యెలాంతి సిగ్గు, అపరాధ భావన వ్యక్త పరచదు. వాళ్ళ నాన్న అడిగినా అదే జవాబు. abettment to suicide నుంచి ఆమెను తప్పించాలంటే మూడు లక్షలు రెండు నెలల్లో చెల్లించే వొప్పందం ఆ పోలీసు, ఆమె తండ్రి మధ్య. ఫిక్స్ దిపాజిట్ లో  దాచుకున్న లక్ష మొదటి వాయిదాగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా డబ్బు యెలా సమకూరాలా అన్నది వాళ్ళకు పట్టిన శని. ఆమెకు కొన్ని అదనపు సమస్యలు. “నువ్వు వాడితో పడుకున్నావుగా, నాతో పడుకోవడానికేం”, అని వేధించే వాళ్ళు. 12000 వచ్చె వుద్యోగం వూడతం, వేరే వుద్యోగంలో కుదురుకుంటే 5500 మాత్రమే రావడం, ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా సూక్ష్మంగా చూపిస్తాడు దర్శకుడు నీరజ్ ఘైవాన్ (ఇది ఇతని మొదటి చిత్రం).

 

మరోపక్క తక్కువ కులానికి చెందిన విక్కీ, అగ్ర కులానికి చెందిన అమ్మాయి శ్వెతా త్రిపాఠి ప్రెమించుకుంటారు. అతని కులం తెలిసిన తర్వాత కూడా అతన్నే చేసుకుంటానని, అవసరమైతే లేచి వస్తానని, పెళ్ళి అయ్యాక పెద్దవాళ్ళు నెమ్మదిగా చల్లబడతారనీ అంటుంది. కాని దానికి ముందే ఆమె వొక బస్సు ప్రమాదంలో మరణిస్తుంది.  ఆమె శవాన్ని అతనే దహనం చేయాల్సి వస్తుంది.

 

ఈ రెండు జంటలూ చాలా నిజాయితీ గా, స్వచ్చంగా, అమాయకంగా, నిర్మలంగా వుంటాయి. అమ్మాయిల విషయానికి వస్తే ఇద్దరూ చాలా ధైర్యన్ని కనబరుస్తారు. రిచా చడ్డా తన బాడీ లాంగ్వేజ్ తో (నిటారు గా నిలబడే/కూర్చునే/నదిచే తీరు; సిగ్గు/అపరాధభావనా లేశమాత్రమైనా కనబడని తీక్షణ కళ్ళు, తడబాటు లేని సూటిగా వచ్చే మాటలు; తన మీద తనకున్న నమ్మకం). పోతే శ్వేతా త్రిపాఠి కవిత్వన్ని ప్రేమించే సున్నిత మనస్కురాలు. కాని తమ మధ్య వున్న కులపు అడ్డుగోడల గురించి తెలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయం అవసరమైతే పారిపోయి అయినా వివాహం చేసుకోవాలి, పెద్దవాళ్ళని నెమ్మదిగా వొప్పించవచ్చు.

 

రోజూ యెన్నో శవాలు తగలబడుతుండే ఆ భూమికలోనే ఈ రెండు ప్రణయ గాథలు. (మసాన్ అంటే శ్మసానం).

 

ఈ రెండు సినిమాలు పోల్చింది కూడా ఈ స్త్రీల ధైర్య-సాహసాలకి, ఆత్మ విస్వాశానికి, ఆత్మ గౌరవానికీ.

 

 

   అ~దృశ్యం 

 

Art: Wajda Khan

Art: Wajda Khan

 

నిజంగా యిక్కడ ఎవరూ లేరు

కొండల్లో, లోయల్లో , గుహల్లో అంతటా వెతుకుతావు

ఎక్కడో ఓ చోట ఆనవాలైనా వుంటుందని

తడితగలక  దాహంతో  ఎదురుచూస్తున్న

నేలకి సర్దిచెప్పాలనుకుంటావు

 

చివరి అంచులో నిలబడి ప్రార్ధించి అలసిపోతావు

ఆకాశం సమస్తలోకాన్ని పాలిస్తుందని

సముద్రాలు ఎడారుల్లో యింకిపోయాయని దుఃఖిస్తావు

అందనంత దూరంలో గూడు కనిపించి కనుమరుగై

దారి తెలియక, వెతకలేక  విసిగి వేసారి వెళ్ళిపోతావు

 

జలపాతాలహోరు , .. తుంపర్ల తడి ఆత్మ చుట్టూ!

‘భిక్షాం దేహి’ అనే శబ్దమై వీధుల్లో విరాగివై తిరుగుతావు

దొరికినవన్నీ నీవికావని నిర్దారించి వెలివేసి

లోలోపలకి తిరిగి చూడకుండా పరిగెడతావు

 

నువ్వొక బిక్ష పాత్రవై , ఎండిన మెతుకులై

చినిగి చీకిన దేహపు వస్త్రమై

ఎగిరిపోయిన పూలలో, రాలిన ఆకుల్లో

ఎడారి రాత్రుళ్ళలో, కాంక్షాల్లో, ఆంక్షల్లో

పరావర్తించని చీకటి రేఖవై ,ప్రతిధ్వనించలేని శబ్దానివై

నిలవలేక ,నిలువరించలేక  వీగిపోతావు

*

 

హఠాత్తుగానే….అప్పుడు!

Art: Satya Sufi

Art: Satya Sufi

 

 

 

కలలో అమ్మ!

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

నా స్వప్న జగత్తు లో
అనంత ఆకాశం లో
ఒలికింది జీవ కలశం-
వెలుగై చిందిన ఆ ప్రాణ రసం తో
తడిసి తపించాయి  జీవ వృక్ష వ్రేళ్ళు .
ప్రవహించిన ప్రాణరసం
జీవ భాండాగారం కాండాంతరంలో
 బుజబుజ పొంగి పరచుకుంది
  కొమ్మలై రెమ్మలై.
కొమ్మకో ప్రాణి రెమ్మకో ప్రాణి
విరిశాయి  వైవిద్య జీవ పుష్పాలై
అదో వెలుగు విరుల సంద్రం-
మెలమెల్లగ విచ్చుకున్నాయి
ఆ వెలుగు పూల రేకులు.
విచ్చుకున్న  విరుల గర్భాలు
రాల్చాయి జలజలా ప్రాణవిత్తులను-
నక్షత్ర దీపాలై రాలిన జీవవిత్తులు
పయనిస్తున్నాయి అధోముఖంగా-
ఆ నిశ్శబ్ద నిశీదిలో మెల్లగా
 క్రిందికి దిగుతూంది
ఒక ప్రాణవిత్తు దీపమై –
భూమి పై కనుచూపు మేర పరచుకున్న
ధవళ కాంతులీను రంగవల్లి పై పద్మాసీనురాలైన మా అమ్మ
 కటిసీమ పై నిలిచి అదృశ్యమయింది
ఆ ప్రాణ దీపం.
నా కల రేపింది నాలో కలవరం
నా అత్మ దీపాన్ని నేను దర్శించానా?!
జీవులన్నీ
ఆ అనంత వృక్షం  రాల్చిన
ప్రాణ విత్తుల అంకురాలా?!
అమ్మా నాన్నా
 కేవలం
భౌతిక రూప దాతలా?!
ఓ బృహత్‌ సంశయానికి
తెరలేపిన నా స్వప్నమది .
(దాదాపు దశాబ్దం నన్ను వెంటాడుతున్న నా కలకు అక్షర రూపమీ  నా  కవిత )
*

ఆ వూరు, ఆకాలం గుర్తొస్తే ఏడుపే!

   katya3

           ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక పక్షాన ముప్ఫయి మంది రచయిత్రులం  12-9-2016 నాడు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలలో పర్యటించాం.కొత్తదేవరగొండి,కొత్త రామయ్య పేట మొదలైన పునరావాస గ్రామాలలోనూ, వాడపల్లి ,కొత్తూరు మొదలైన ముంపు గ్రామాలలోను  తిరిగి భిన్న ప్రజా సమూహాలను  కలిసి మాట్లాడాము.వారి ఇళ్ళు జీవించే పరిసరాలు, జీవన స్థితిగతులు పరిశీలించాం. రెండు భిన్నవాతావరణాలలోని ఏక రూప విషాదాన్ని అనుభవించి వచ్చాం.

              మేము ముందు చూసినవి  పునరావాస గ్రామాలు. అవి పోలవరం మండల కేంద్రానికి సమీపంలో రోడ్డు పక్కన గ్రామాలు.కొన్ని ఊళ్ళు నాలుగేళ్ల క్రితం ,మరికొన్ని రెండేళ్లక్రితం పొందించినవి. పచ్చదనమే లేని ఎడారిని తలపించే మట్టి దారులలో రెండేసి గదుల సిమెంటు ఇళ్ళు. ఒక ఇంటికి అయిదేసి సెంట్ల భూమి.కొన్నిఇళ్ళు  మూడున్నర సెంట్ల భూమిలో కట్టి ఒకటిన్నర సెంట్ల భూమి వేరే చోట ఇయ్యటం వల్ల అది ఉపయోగంలోకి రానే లేదు.కూలివేతనం కిందనో ,మరే రూపంలోనో వచ్చిన నష్ట పరిహారం ఆ రెండు గదుల ప్రాధమిక నిర్మాణాన్ని వరండాలు దించి పూర్తి చేసుకొనడానికి వ్యయం చేసిన వాళ్ళే చాలామంది.

         గోడలు లేచి ప్రభత్వం కేటాయించిన  నిధులు ఇయ్యకపోవటం వల్ల పూర్తికాని  బాత్ రూములు కొన్నిచోట్ల.దొడ్లకు,స్నానాలకు మరుగు లేక ఆడవాళ్లు పడే ఇక్కట్లు.చుట్టూ నేల మట్టిపోసి చదును చెయ్యక పోవటంవల్ల,డ్రైనేజి చెయ్యక పోవటం వల్ల మురుగు కాలువలమధ్య ముసిరే దోమల మధ్య దుర్భరమైన జీవితం అక్కడి ప్రజలది.శుభ్రమైన గాలికి,పచ్చని పర్యావరణానికి పరాయీకరింప బడిన  వాళ్ళు. ఈ కొత్త ఇళ్ళ మధ్య పశువులను కట్టేసుకొనే చోటు ,వీలు లేక ఉన్నఆవులను అమ్ముకొని పాడికి దూరమైన వాళ్ళు. కొండమొదలు నుండి ఏరుకొచ్చుకొనే కట్టెపుల్లలు లేవు.అడవి నుండి  సేకరించుకుని వచ్చే కుంకుళ్ళు లేవు.జామ,సీతాఫలం వంటి  పండ్లు లేవు. ఇంట్లో పండించుకునే కూరలు లేవు. ఆర్ధికంగా స్వయం సంపూర్ణమైన గొప్ప జీవితం కోల్పోయి అన్నిటినీ డబ్బు పెట్టి కొనుక్కోవలసిన స్థితికి నెట్టబడ్డారు.   

         పొలానికి పొలం ఇచ్చారు కానీ అన్ని వూళ్ళల్లోనూ అవి ఇళ్ళు కట్టించి ఇచ్చిన చోటికి పది పదిహేను కిలోమీటర్లకు తక్కువ దూరంలో లేవు. అవికూడా చాలావరకు బంజరు భూములే . వర్షాధారపు వ్యవసాయమే చెయ్యాలి. ఈ పరిస్థితులలో ఆడవాళ్లు వ్యవసాయానికి  దూరమయ్యారు.మగవాళ్ళు కూడా  చాలా మంది భూమిని  కౌలుకు ఇచ్చి  కూలిపనులకు  పోతున్నారు. ట్రాక్టర్ లేని వ్యవసాయం ఇప్పుడు సాధ్యం కాదని వాళ్ళు అంటున్నారు. గోదావరి నుండి దూరం తరిమివేయబడిన వాడోళ్లు (జాలరులు)జీవికకు దూరమయ్యారు. పదిపదిహేను కిలోమీటర్లు పోతేగానీ గోదావరి దొరకదు చేపలు పట్టటానికి. సైకిళ్ళమీదనో ఆటోలు పట్టుకొనో మగవాళ్ళు ఆ పనికి పోతున్నారు కానీ ఆడవాళ్లు ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. మొత్తం మీద స్త్రీలు ఉత్పత్తి క్రమం నుండి వేరు చేయబడ్డారు. వైవిధ్య భరిత మైన జీవికను కోల్పోయి విసుగులోకి ,విచారంలోకి ,దుఃఖం లోకి జారిపోతున్నారు.

           పశ్చిమ గోదావరి జిల్లాలో  పోలవరం ముంపు గ్రామాలు 29 కాగా ఇప్పటికి లేపేసిన ఊళ్ళు ఏడు. చేగొండిపల్లి ,సింగినపల్లి ,పైడిపాక ,దేవరగొండి,రామయ్యపేట ,తోటగొండి,మామిడి గొండి.ఈ క్రమంలో మండల రెవిన్యూ ఆఫసర్లు వూళ్ళల్లోనే తిష్ఠ వేసి  రోజుకు రెండు మూడుసార్లయినా ప్రతి ఇంటికీ వెళ్తూ  బుజ్జగించో బెదిరించో ,ఆశపెట్టొ, వాళ్ళను తమతమ నెలవులు వదిలి వెళ్లేందుకు ఒప్పించారు.బాధితుల మాటల్లోనే చెప్పాలంటే ‘లేపేసే వరకు వెంట పడ్డారు.’పొండి పొండి అని తోలేసారు’.వండుకున్నగిన్నెలతో,తినటానికి అన్నం పెట్టుకున్న కంచాలతో సహా లారీలలోకి ,ట్రాక్టర్లలోకి ఎక్కి వెంటనే ఇల్లు వదిలి పోవాలని వత్తిడి చేశారు.ప్రొక్లెయిన్లు తెచ్చి ముందు పెట్టి ఇల్లు కూలగొడుతున్నాం ఖాళీ చేయండని ఖంగారు పెట్టారు. పూర్తికాని ఇళ్లల్లో ,పూర్తిగా చేతికందని పరిహారాలతో కొత్తజీవితం వాళ్లకు  అనివార్యం చేశారు.

        నష్ట  పరిహార పాకేజిలో 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లకు ఐదులక్షల ఎనభైవేలు ఇస్తుండగా 18 ఏళ్ళ వయసు తో నిమిత్తం లేకుండా ఆడపిల్లలందరికీ ఆ పరిహారాన్ని వర్తింప చేయాలన్నది  ప్రజల కోరిక.  అందులో సగమైనా ఇప్పిస్తామని నమ్మించి పబ్బం గడుపుకున్న అధికారులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. ఇదేమిటని అడిగితే ఏవో చెప్తాము ,చెప్పినవన్నీ చెయ్యటం అవుతుందా అని దాటవేస్తున్నారు.ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ యాష్ట పడుతున్న జనం ‘ఓట్లకు కావాలె మేము ,ఓట్లకు ముందూ అక్కరలేదు,తరువాత అక్కరలేదు’ అని పార్లమెంటరీ వ్యవస్థపై తమ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.పౌరులుగా ఒక గౌరవకరమైన గుర్తింపు లేక ,తమ సమస్యలు తాము ఎన్నుకున్న ప్రభుత్వానికే పట్టనివి అయి  కొత్త పరిసరాలలో,కొత్త పనుల వెతుకులాటలో తడుముకొంటూ తండ్లాడుతున్న పోలవరం ప్రాజెక్టు బాధిత ప్రజల విషాద  జీవన ముఖ చిత్రం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది.

katya2

          పునరావాస గ్రామాల నుండి ముంపు గ్రామాల వైపు చేసిన ప్రయాణంలో దారిపొడుగునా ప్రొక్లైన్లతో కూల్చ బడ్డ ఇళ్ల ఆనవాళ్లు కూడా కానరాకుండా ఊళ్లకు ఊళ్ళుఎత్తైన   రాళ్ళ గుట్టల కింద కప్పివేయబడిన దృశ్యాలు గుండె బరువెక్కించాయి.   ఊళ్ళు ఖాళీ చేయిస్తున్నప్పటి ఆందోళన గురించి ,ప్రస్తుత పరిస్థితి గురించి చెప్తూ కొత్త రామయ్య పేటలో ఒక మహిళ “మమ్మల్ని కూడా కప్పెట్టేత్తారేమో అనిపించింది.ఆవూరు ,ఆ కాలం గుర్తొస్తే ఏడుపు తప్ప ఏమీ లేదు.” అని చెప్పిన మాటల లోని విషాద వాస్తవం కళ్ళకు కట్టినట్టయింది.    

       ముంపు గ్రామాల్లో వాడపల్లి – చలి నుండి ,చిరుజల్లుల నుండి ఒకింత కాపు కోసం హరితారణ్యాన్నిశాలువలా  కప్పుకుని గంభీరంగా ఉన్నతంగా నిల్చున్న కొండ గోడల మధ్య, నిండుగా ప్రవహించే గోదావరి ఒడ్డున ఉన్నవూరు.ఆ వూళ్ళో  ఇళ్ళు  రకరకాల రంగు రంగుల పూల తీగలు పాకిన దడులతో , కూరగాయ పాదులతో కళకళలాడుతున్న పెరళ్ళతో ,అటూ ఇటూ సందడిగా తిరిగే కోళ్లతో పర్ణశాలల వలె ప్రశాంతంగానే ఉన్నాయి .కానీ   ఆ ఇళ్లల్లో  మనుషుల ముఖాలు మాత్రం  దిగులు మబ్బులు కమ్మిన నిర్వేదపు నవ్వులను పూస్తున్న విషయం మా దృష్టిని దాటి పోలేదు.ఈ రోజో రేపో ఊళ్ళు వదిలి పోక తప్పదని వాళ్లకు తెలుసు. బలవంతపు ప్రయాణాలకు ఐచ్ఛికంగా సిద్ధమవుతున్నదుస్థితి వాళ్ళది. తమ ఇళ్ళు  ,జీవికకు ఎన్నో వనరులు ఉదారంగా పంచిపెడుతున్నకొండలు,అడవులు వాటితో వున్నతరతరాల అనుబంధాలు,జ్ఞాపకాలు,సంతోషాలు,సంబరాలు-అన్నిటికీ మూలమైన,అన్నిటికన్నావిలువైన  స్వేచ్ఛ సమాధి కాబోతున్నాయి అని తెలిసి రోజులు లెక్కపెట్టుకుంటూ నిస్సహాయంగా కాలాన్ని ఈడుస్తున్న జనం వాళ్ళు.

                  

ఈ పర్యటనలో మేము గుర్తించిన అంశాలు ;

  • పోలవరం ప్రాజెక్టు వస్తుందని పాతిక ముప్ఫయి ఏళ్లుగా అక్కడి ప్రజలు ఆ నోటా ఈ నోటా వింటూనే ఉన్నారు.అది తమ బతుకులలో  తెచ్చే ఉపద్రవం గురించి   చూచాయగానైనా  వాళ్లకు తెలుసు.ఒక సందిగ్ధ సందర్భంలో జీవించారు వాళ్ళు.
  • 2004 లో రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్  ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు  కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో  జల యజ్ఞంలో భాగంగా మొదలైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపు పనులను   ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో   తెలుగుదేశ ప్రభుత్వం  కొనసాగిస్తున్నది.నష్ట పరిహార పాకేజీలు ఒక్కొక్క ప్రభుత్వ హయాం లో ఒకరకంగా మారుతున్నాయి. అవి ప్రజలలో అసంతృప్తికి కారణమవుతూ పరస్పర అవిశ్వాసాలకు దారితీస్తున్నాయి.
  • నష్ట పరిహారాల నిర్ధారణలో ఆశ్రిత పక్షపాతం ,అవినీతి ప్రధానంగా పని చేశాయి. అందువల్ల నష్టపరిహారం అందరికీ సమానంగా కాక అన్యాయంగా ఎక్కువ తక్కువలుగా అందింది.
  • ఉమ్మడి వ్యవసాయ కుటుంబాలు ముక్కలు చెక్కలు అయ్యాయి.
  • ఏజన్సీ ప్రాంతాల నుండి తరలించ బడిన ఆదివాసీలు తమ సంస్కృతి నుండి దూరం జరప బడ్డారు.
  • ఏజెన్సీ నుండిబయటకు వచ్చారు కనుక  పునరావాస గ్రామాల లోని వారికి  ఏజన్సీ ఎలవెన్సులు లేవు.
  • డబ్బు అవసరాలలోకి ప్రజలు నెట్టబడ్డారు.
  • నష్ట పరిహారపు డబ్బు ఇళ్లకు ఖర్చుపెట్టుకొని , కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక పనులు దొరకక ఉన్న డబ్బు ను వాడుకొంటూ ఈ రెండు మూడేళ్లు గడిపేశారు. ఇప్పుడు తమ బతుకు తెరువులు ఎట్లా అన్నది వాళ్ల ముందున్న పెద్ద ప్రశ్న.
  • వూరికి ఒక బడి ఇంకా రాలేదు.
  • ఇంటికి ఒక ఉద్యోగం హామీ ఇంతవరకు ఆచరణకు రాలేదు.
  • అభివృద్ధికి మానవముఖం లేదు . విస్థాపన అంతా అమానవీయంగా జరిగింది.
  • విస్థాపిత ప్రజల పట్ల ప్రభుత్వాలకు ,పాలనా వ్యవస్థకు ఉండవలసిన అదనపు బాధ్యత పూర్తిగా విస్మరించి బడింది.
  • 2018 నాటికి ఈ ప్రాజెక్టు పని పూర్తి చేసి ఫలితాలను పొందాలనే సంకల్పంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అత్యుత్సాహం ఇప్పటికింకా తరలించబడని ముంపు గ్రామాల ప్రజల పట్ల అవలంభించే వైఖరి దానికి కొనసాగింపుగా కాక విభిన్నంగా ప్రజాస్వామికంగా ఉంటుందా?

                         katya1 విశాఖ పట్నం -కాకినాడ కారిడార్ అభివృద్ధి అవసరాలకు ,కోస్తాప్రాంత ధనిక వర్గ  వ్యవసాయ ప్రయోజనాలకు ఉపయోగ పడే ప్రాజెక్ట్ కు లక్షలమంది స్థానికులను నిర్వాసితులను చేస్తూ వాళ్ళ అవసరాల పట్ల నిర్లక్ష్యం గా ఉండటం గౌరవంగా జీవించే హక్కును స్వేచ్ఛగా జీవించే హక్కును నిరాకరించటమే. రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వాలు  ప్రజల హక్కులకు, ఆదివాసీల ప్రత్యేక హక్కులకు-భంగకరంగా పనిచేస్తూ సాధించే అభివృద్ధి అన్యాయమైనది,అమానవీయమైనది అని భావిస్తున్నది ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక.  ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ ఎన్నికలకు పరిమితం చేయకుండా ఒక వాస్తవ జీవితాచరణ విలువగా,రాజ్యాంగబద్ధ  పాలనాసారంగా పరివర్తింప చేయాలని కోరుకొంటున్నది. తెలంగాణాలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను వద్దనేది ఈ కోణం నుండే. 2013 చట్టం అమలు చేయమని కోరటం ప్రజల హక్కులను గౌరవిస్తూ అభివృద్ధి దిశగా గమనాన్ని నిర్దేశించుకొనమని చెప్పటానికే. బలహీనుల హక్కులను బలిపెట్టే అభివృద్ధి విధానాన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ ప్రరవే ఈ కింది డిమాండ్లు చేస్తున్నది.  

 

    – ఇప్పటివరకు జరిగిన విస్థాపన విధానాలను ,నష్టపరిహార పాకేజీలను పునఃసమీక్షకు పెట్టి విస్థాపిత ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ,జీవన విధానం ,జీవితం ఎక్కువ నష్ట పోకుండా తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించాలి.

       – వ్యవసాయ జీవితాన్ని నిర్మించుకొనటానికి ఎన్టీఆర్ జలసిరి వంటి పధకాలను విస్థాపిత ప్రజా ప్రయోజనాలకొరకు విస్తరించటంపై దృష్టి పెట్టాలి. ఆవాసాలకు దూరంగా ఉన్న పొలాల సాగుకు వారిని ప్రోత్సహించే పధకాలు రూపొందించాలి

           -వ్యవసాయేతర వృత్తుల వారి అవసరాలను గుర్తించి ,గౌరవ జీవనానికి తగిన మార్గాలు చూపాలి.  

        -ఉద్యోగ పరికల్పన వేగవంతం చేసి వాటిలో మహిళలకు ప్రాధాన్యత నివ్వాలి. సామూహికంగా పాల్గొనగలిగిన చిన్న పరిశ్రమలు  ఏర్పాటు చేసి స్త్రీలకు పని కల్పించాలి.

    – పునరావాస గ్రామాలను ఆవాసయోగ్యాలుగా మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దేoదుకు  సత్వర చర్యలు చేపట్టాలి.  

*

     

                                                                      

 

     

         

        

 

           

 

  

సుధమ్మ యేడ్చింది -5

gopi
సుధమ్మ యేడ్చింది. ఒక రోజు కాదు… రెండ్రోజులు కాదు… రేత్రి లేదు… పగులు లేదు… యేడుత్తనే వుంది. కన్నీరు మున్నీరుగా యేడుత్తుంది. యెవురన్నా పలకరిత్తే సాలు… కన్నీరు కట్టలు తెంచుకొత్తంది. పలకరిచ్చాలంటేనే బయంగా వుంది.
సుధమ్మది మా పక్కూరే… కిష్ట్నాయపాలెం… బోయపాటోల్లు… అధికార పార్టీయే లెండి.   అక్కడ కూడా మాకున్న బాధలే…. అదికూడా రాజధాని ప్రాంతమే. అక్కడా గవర్మెంటోల్లు భూములు తీసుకుంటారంట. అదే సుదమ్మ బాధ.
సుదమ్మకి పాతికసెంట్లు పొలం వుంది. అందులో బంతిపూలు పండిత్తారు. అల్లింకో రెండెకరాలు కౌలికి తీసుకున్నారు. మొగుడూ పెళ్ళాం యిద్దరూ రోజంతా కట్టపడి పనిసేత్తారు. అవసరం వుంటేనే కూలోల్లని పెట్టుకుంటారు. లేకపోతే యిద్దరే పని సేసుకుంటారు. కౌలుకి తీసుకున్న పొలంలో కూరగాయలు, ఆకుకూరలు పండిచ్చుకొని బెజవాడ మార్కెట్టుకి అమ్ముతారు.
సుదమ్మకి యిద్దరు పిల్లలు…  కూతురు పెద్దది. కొడుకు సిన్నోడు. కూతురు యింజినీరింగ్ సదువుతుందంట. కొడుకేమో పదోతరగతంట. సదువులకే అల్ల కట్టం సాలట్లేదని బాధ.
పొద్దున లేగిత్తె సుదమ్మ, ఆళ్లాయన పొలంలోనే వుంటారు. శానా కట్టపడి పనిసేత్తారు. యిద్దరు పిల్లల్ని సదివించుకోవాలంటే కట్టపడకపోతే యెట్టా!? నేను శానా సార్లు సూసిన…. యిద్దరూ పొలంలో సెరోపని సేత్తనే వుంటారు. సుదమ్మ యెవురితోను పెద్దగా మాట్టాడదు. ఆళ్ళాయన కూడా అంతే. పెద్దగా మాటకారి కాదు. యెవుళ్ళన్నా పలకరిత్తే పలుకుతుడు. యెదురుపడితే నవ్వుతుదు. అంతే. అట్టాంటి కుటుంబం యీ మధ్యన రొజూ యేడుత్తనే వుంది.
యెవురో టీవీవోల్లు సుధమ్మతో మాట్టాడి కెమెరాలో రికార్డు సేశారంట. అది టీవీల్లో వొచ్చిందంట. నాకు తర్వాత తెలిసింది. తర్వాత కంప్యూటర్లలో, సెల్లుఫోనుల్లో కూడా ఆయమ్మ మాట్లాడింది వొచ్చింది. మా పక్కింట్లో కుర్రోడి సెల్లుఫోనులో సూసిన… ఆయమ్మ యేడుత్తుంది… కన్నీరు మున్నీరుగా యేడుత్తుంది.
పాతికసెంట్ల పొలంలోనే పూలతోటేసి పిల్లల్ని సదివిచ్చుకుంటంది.  రెండెకరాల కౌలుకూడా… కూలీ, పెట్టుబడి కర్చులు పోయాక యేడాదికి రొండు లచ్చల దాకా వాసద్దంట. దాంతోనే పిల్లల సదువులు… యిల్లు…  మందులు… అప్పుడప్పుడు ఆస్పత్రి కర్చులు… సుట్టాల యిళ్ళల్లో పెళ్లిల్లు… అన్నీ అందులోనే…
యిప్పుడు గవర్మెంటోళ్లు పొలాలన్నీ తీసుకుంటే మేం బతికేదెట్టా అని గట్టిగనే అడుగుతుంది. యేడుత్తనే అడుగుతుంది.
అబ్బో … సెల్లుపోన్లోనే ఆయమ్మ మాట్టాడేది సూత్తుంటే కడుపు తరుక్కు పోతంది. యిక టీవీల్లో సూసినోళ్లు… యెదురుగ్గా సూసినోళ్లు యెట్టతట్టుకున్నరో…
రవిగారు సెప్పిండు… సుదమ్మ సెప్పేది కంప్యూటర్లో యింకా శానా బాగుంటదంట. దేశ దేశాల్లో జనం యిరగబడి సూత్తున్నరంట.
“సుధారాణికి మా మద్దత్తు”
“సుధారాణి కుటుంబానికి మేం అండగా ఉంటాం”
“సుధారాణికి న్యాయం జరగాలి”
కంప్యూటర్లో యిట్టాటి మాటలన్నీ వున్నయ్యంట. అమెరికానుంచి. అయిదరాబాదు నుంచి, యింకా శానా సోట్ల నుంచీ ఆయమ్మకి జైకొడతన్నారంట.
నిజం… ఆయమ్మ సెప్పింది… మాబోటోల్లం సెప్పలేక పోయినం. బాగా సెప్పింది. అర్ధం అయ్యేలా సెప్పింది. మాబాదలు, మా బతుకులు శానా బాగా యిడమర్సి సెప్పింది.
గవర్మెంటోళ్లు ఆయమ్మ సెప్పిన మాటలు టివీల్లోనో, కంప్యూటర్లోనో, సెల్లుఫోనుల్లోనో సూసే వుంటారు. అల్లకర్థం అయితే సాలు అనుకున్న.
***
టీవీలోళ్లు, పేపర్ల విలేకర్లు శానామంది మా వూళ్లల్లో తిరగటం మొదలైంది. రోడ్డుమీద యెవుళ్లు కనపడితే ఆల్లతో మాట్టాడుతున్నారు.
యే టీవీ సూసినా మావూళ్ల గొడవే…
యే పేపరు సూసినా మావూళ్ల వార్తలే… మా వాళ్ల ఫొటోలే…
జనం యిట్టాఅంటన్నారు… గవర్మెంటోళ్లు అట్టా అంటన్నారు….  పేపర్లల్లో అదే… టీవీల్లో అదే… మా బతుకులు అట్టా అయినియ్.
పెద్దరైతులు… ఆపార్టీ నాయకులు కొంతమంది తప్ప మిగతా జనం అంతా ఒక్కటే మాట…
“ఈ పొలాలిచ్చి మేం ఏం తినాల? యెట్టా బతకాల…”
***
గాంధీ గారు రెండు మూడు సార్లు కలిసిండు. యిద్దరం కలిసి బెజవాడలో లాయర్లని కలిసినం. గాంధీ గారు ఆల్లతో శానా సేపు మాట్లాడిండు. పేపర్లలో వార్తలేవో ఆల్లకి సూపిచ్చిండు.
తర్వాత అదేదో ఆపెసుకి తీసుకెళ్లిండు. అక్కడ శానమంది వున్నారు. అంతా పెద్దోల్లే.
“రాజధాని పంట పొలాల్లో యెందుకు? ఆ పక్కన కట్టుకోమనండి”
“రాజధానికి యిన్ని వేల ఎకరాలెందుకు?”
“ఇదంతా వాళ్ళు దోచుకోడానికి… వాళ్ళ మనుషులకు దోచిపెట్టడానికి”
“దీన్ని మనం ఆపాలి… కానీ మనం రాజధానికి వ్యతిరేకం అనే మాట రాకుండా జాగ్రత్తగా చూడాలి.”
అందరూ తలొక మాట మాట్లాడుతున్నారు.
యింతలో గాంధీ గారు అన్నడు:
“మేం రాజధానిని వ్యతిరేకించటంలేదు సర్. రాజధాని ఆ 29 గ్రామాల్లోనే కట్టమనండి. కానీ పచ్చని పంటపొలాలు వదిలేసి నదికి కొంచెం దూరంగా జరిగి మెట్ట భూముల్లో కట్టుకోమనండి. ఆ భూములు యిచ్చేస్తాం. అక్కడ బిల్డింగులు కట్టుకోమనండి. ఇంత సారవంతమైన భూములు ఇంకెక్కడా లేవు. వాటిని పాడుచేస్తే చూస్తూ ఎలా ఉరుకుంటాం?”
గాంధీ గారు చెపుతున్నది నాకు బాగా నచ్చింది. నిజమే ఈ బూములు వదిలేసి ఆ పక్కనే మెట్ట బూముల్లో రాజధాని కట్టుకోవచ్చు… అప్పుడు మా పొలాలు మాకుంటయి… మా పనులు మాకుంటయి… మా తిండి మాకుంటది…
నేనిట్ల ఆలోసిత్తన్న…
“సూరీ… పద పోదాం” అని గాంధీ గారు నా భుజమ్మీద సెయ్యేసి లేపిండు.
“యెవురు సారు యీళ్లంతా?” వుండబట్టలేక అడిగిన.
“వాళ్ళు మనలాంటి వాళ్ళే… పంట  నాశనం చెయ్యొద్దని… బిల్డింగులు కొండలమీదైనా కట్టుకోవచ్చని చెపుతున్నారు. ఇలాంటి వాళ్లంతా మనకు అండగా ఉన్నారు.”
“అంటే మన పొలాలు గవర్మెంటోళ్లు లాక్కోరా సారూ!”
“మన ప్రయత్నం మనం చేద్దాం. అవసరమైతే ఢిల్లీ వరకు పోయి పోరాడదాం.”
“ఢిల్లీ వరకా!!!”
“అవును… వెళ్దాం… పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు… చట్టం ఉంది… కోర్టులు ఉన్నాయి… మన ప్రయత్నం మనం చేద్దాం.”
గాంధీ గారు సెపుతుంటే మనసు తేలికపడ్డట్టయింది. నా పొలం నాకే  వుంటదేమో అనే నమ్మకం కలిగింది.
సూద్దాం… ఏంజరుగుద్దో …. ఆలోసిత్తనే గాంధీ గారితో కలిసి నడుతున్నా.
…..

సైసైరా నరసింహారెడ్డి!

palegadu

The importance of history is two folds. One is to draw the awesome inspiration of the heroes born before us. The other one is to learn to cultivate the virtues leading to soliderity and prosperity of a nation, and how to avoid the defects leading to contrary results.

– పుల్లెల రామచంద్రుడు గారు రాజతరంగిణి గురించి రాస్తూ అన్న మాటల సారాంశం అది. ఆయన చారిత్రకుడు కారు కానీ చరిత్రకు ఒద్దికైన పాఠకుడు, అనుశీలి అనుకోవచ్చు. ఆయన అన్న ఆ మాటలు ఏ కొంచెం ప్రామాణికత ఉన్న చారిత్రక రచనకైనా వర్తిస్తాయి.

**********

నేటి రాయలసీమ ప్రాంతాల్లో ఓ సామెత/నుడికారం ఉన్నది. “పోవేయ్, పెద్ద పాలేగాడు తయారయినాడు”. ఇతర ప్రాంతాల వారికి, ఇదేదో తిట్టులా తెలుస్తున్నా, కొంచెం విచిత్రమైన, వింతయిన మాట. అయితే ఆ ’పాలెగాడు’ అన్న మాట వెనుక కొంచెం బరువైన చరిత్రే ఉంది. అందుకనే ఏమో, ’పాలెగాడు’  అన్న ‘పేరు’ మీదే ఎస్.డి.వి. అజీజ్ గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటచరిత్రను నవలగా రచించారు. ఈ చరిత్ర క్రీ.శ. 1846 లో మొదలయ్యింది. అంటే – ప్రథమస్వాతంత్రపోరాటానికి పదకొండు సంవత్సరాలకు ముందు.అప్పటికి  ఆ ప్రాంతాలకు ’రాయలసీమ’ అన్న శబ్దం స్థిరపడలేదు. అప్పటికది ’రేనాడు’.  విజయనగర సామ్రాజ్యపు రాజులు ఆ రేనాటిసీమలో 100 లేదా 200 గ్రామాలకు గుత్తగా ఓ అధికారిని పర్యవేక్షణకై నియమించారు. ఆ అధికారిని పారుపత్తెందారు లేదా ’పాళెయగారు’ అనేవారు. పాళెయగారు- పాలేగారు – పాలేగాడు అయింది. ఆ పాలేగాళ్ళలో కొందరు తాము రాజుకన్నా గొప్పగా అధికారులమన్నట్టు భావించేవారు. అలా ఆ సామెత పుట్టుకొచ్చింది.

అయితే ఆ ‘పాలేగాడు’ కు నిస్వార్థ పోరాట చరిత్ర కూడా ఉంది.

క్రీ.శ. 17 వ శతాబ్దం తర్వాత కుంఫిణీ ప్రభుత్వం భారతదేశంలో ఒక్కొక్క సంస్థానాన్ని లోబరుచుకుంటూ వస్తూంది. క్రీ.శ. 1799 లో టిప్పుసులతాను మరణించాడు. ఆ యుద్ధం తర్వాత రేనాటి సీమ, దుట్టుపక్కల ఇతర ప్రాంతాలు నిజాం నవాబుకు దక్కింది. ఆపై క్రీ.శ. 1800 అక్టోబరు 12 న నిజాం – సీమను బ్రిటీషు వారికి లీజికు ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ ప్రాంతాలు సీడెడ్ డిస్తిక్ట్స్ గా పిలువబడుతూ వచ్చాయి.  ఆపైన బ్రిటీష్ ప్రభుత్వం 80 మంది పాలెగాళ్ళను కుట్రతో గుత్తికోటలో బంధించి లొంగదీసుకుంది. ఆ పైన భూమి శిస్తుకు తట్టుకోలేక కర్నూలులో తెర్నేకల్లు గ్రామస్తులు తిరుగుబాటు చేసి అమరులయ్యారు. 1839లో కర్నూలు నవాబు వాహబీ తిరుగుబాటు చేస్తే ఆంగ్లేయులు కుట్రతో అతణ్ణి బంధించారు. ఆ నేపథ్యంలో కర్నూలు జిల్లా కోయిలకుంట్ల, కడప జమ్ములమడుగు మధ్యన ఉన్న అరవై గ్రామాలకు చెంచురెడ్ల వంశానికి చెందిన జయరామిరెడ్డి పాలేగారు. ఇతణ్ణి నొస్సం పాలేగారు. ఇతని నివాసం నొస్సంకోట. ఈ పాలేగారుకు సంతానం లేకపోవడంతో – అతని మేనల్లుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అధికారం దక్కింది. నరసింహారెడ్డి – రూపనగుడిలో పుట్టాడు. జయరామిరెడ్డి ఆంగ్లేయులకు లొంగిపోయింది. ఆ ప్రభుత్వం అతనికి కేవలం 11 రూపాయల తనర్జీ (భరణం/నెలజీతం) ఏర్పాటు చేసింది. ఇది ఆ సంస్థానానికి ఏ మాత్రం చాలని భరణం.

ఆ నేపథ్యంతో మొదలైన నవల యిది.

 

*************

నరసింహారెడ్డి మీద రాయలసీమలో వీథిగాయకులు పాడుకునే జానపదగీతం ఒకటి ఉంది. దాన్ని ’రాయలసీమ రాగాలు’ అన్న పుస్తకంలో మల్లిక్ గారు ప్రచురించారు. అది ఇలా సాగుతుంది.

సైరా నరసింహారెడ్డి

నీ పేరే బంగార్పూకడ్డీ

 

రాజారావు తావుబహద్దరు నారసింహారెడ్డి

రెడ్డి కాదు బంగార్పుకడ్డి నారసింహారెడ్డి

ముల్ కోల్ కట్టె సేతిలో ఉంటే మున్నూటికీ మొనగాడు

రెడ్డి మాటలు ఏదాలురా రాండి సూరులారా (సైరా)

 

మొనగాండ్రకు రేనాటి గడ్డరా – రోషగాండ్రకు పెద్ద పేరురా

దానధర్మములు దండిగ జేసే – పురిటిగడ్డలో పుట్టినావురా

కల్వటాల దండదిగో రా సై – ముక్క ముళ్ళ దండదిగోరా సై

సంజామల దండదిగోరా సై – కానాల దండదిగోరా సై (సైరా)

….

….

బానిసగుండి పాయసం తాగుట మేలుకాదురన్నా

పచ్చులలాగా బతికితె రెండే గింజలు మేలన్నా (పచ్చులలాగా = పక్షులలాగా)

బయపడి బయపడి బతికేకంటే సావే మేలన్నా

ఈరుడు సచ్చిన జగతిలొ ఎప్పుడు బతికే ఉండన్నా (సైరా)

 

నరసిమ్మా అని దూకినాడురా రణంలోన రెడ్డి

తెల్లోలందరి కుత్తుకలన్ని కోసినాడు రెడ్డి

“కోబలీ” యంటా తెల్లసర్కరును నరికెను దండంత

గడ్డ కోసము సావో బతుకో తేల్చుకున్నరంత (సైరా)

 

(పూర్తి పాటకై తెలుగు అకాడెమీ వారి ’రాయలసీమ రాగాలు’ పుస్తకం చూడగలరు)

 

*************

narasimhaఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ – క్లుప్తంగా.

1846, జూలై పది.

కర్నూలు కోవెలకుంట్లలో బ్రిటీషోల్ల ట్రెజరీ కొల్లగొట్టి అక్కడి సైనికులను చంపి భీభత్సం సృష్టించాడు రెడ్డి. అతని పేరు బయటకు వచ్చింది. జూలై 26 న బ్రిటీషు వాళ్ళు లెఫ్టినెంట్ వాట్సన్ అనే వాణ్ణి, సైన్యాన్ని నొస్సంకోటకు పంపారు. భయంకరమైన యుద్ధం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఆధునిక ఆయుధాలు ఉన్నాయి. అయినా సరే, వాళ్ళ  సైన్యం రెడ్డి అనుచరుల చేతిలో చచ్చింది. వాట్సన్ యుద్ధంలో అంగవికలుడై పారిపోయాడు.

అక్కడి నుంచి రెడ్డి, ఆకుమళ్ళ గోసాయి వెంకన్న, ఓబన్న ..ఇలా నలుగురైదుగురు సహచరులతో,  నల్లమల అడవులకు స్థావరాన్ని మార్చినాడు. అక్కడ పీటర్స్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ ఉండేవాడు. వాడు అక్కడ చెంచు వాళ్ళను తెగ హింసలు పెడుతున్నాడు. రెడ్డి అతణ్ణి చంపేశాడు. ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది.

బ్రిటిష్ వాళ్ళు ఇంగ్రిస్ అనే వాణ్ణి స్ట్రాటెజీ కోసం, కాక్రెన్ అనే వాణ్ణి ఫీల్డు మార్షల్ గా పెట్టి పథకం ఆలోచించారు. రెడ్డి తలకు పదివేల వరహాలు బహుమతి ప్రకటించారు. ఆ బహుమతి కాశపడి శ్రీనివాసరావు అనే వాడు (రుద్రవరం) రెడ్డి ఆనవాళ్ళు తెల్లవాళ్ళకు అందించాడు. కోళ్ళ పందేలు నడుస్తుండగా రెడ్డిని మాయోపాయంతో బంధించదల్చుకుంటే – ప్రజలే తిరగబడి, రాళ్ళతో కొట్టి చంపారు. రెడ్డి పట్టుబడలేదు. ఆంగ్లేయులు భంగపడ్డారు.

ఆపై ఆంగ్లేయులు నరసింహారెడ్డి తమ్ముని వరస అయిన మల్లారెడ్డికి ఆశ చూపి లోబరుచుకున్నారు. అతని ద్వారా నరసింహారెడ్డిని లోబరుచుకుందామనుకున్నారు. ప్రయత్నం బెడిసి కొట్టింది. నరసింహారెడ్డి భార్యాపిల్లలను బంధించారు. అదీ విఫలమయ్యింది. అతను అపూర్వ శౌర్యసాహసాలతో వారిని విడిపించుకుంటాడు రెడ్డి. చివరకు ఆంగ్లేయులు రెడ్డి ప్రాణస్నేహితులైన ఓబన్నను, గోసాయి వెంకన్నను వేరు చేసి చంప ప్రయత్నించారు. ఈ ప్రయత్నం పూర్తీగా ఫలించకపోయినా వారిద్దరూ గాయపడ్డం జరుగుతుంది.

ఆపై రెడ్డి ఎర్రమలకు వెళ్ళాడు. బ్రిటిష్ వాళ్ళు నాలుగు వైపులా ముట్టడి జరిపారు. ఆ యుద్ధంలో రెడ్డి బ్రిటీషు వాళ్ళను చాలామందిని చంపాడు. వాట్సన్ కూడా మరణించాడు. చివరకు దొరికాడు. అతని కాళ్ళు, చేతులకు సంకెళ్ళేసి కోవెలకుంట్లకు తెచ్చి విచారించి ఉరి తీశారు. (1847 ఫిబ్రవరి 6).

ఇది అజీజ్ గారు రచించిన నవల వృత్తాంతం చాలా క్లుప్తంగా. ఈ కథలో ఇక్కడ చెప్పని వివరాలు నవలలో చాలా ఉన్నాయి.

*************

నరసింహారెడ్డి చేసిన యుద్ధాలను, ఆంగ్లేయుల కపటోపాయాలను, స్థానిక సాంప్రదాయాలను, స్థానిక ప్రదేశాల వివరణనూ, ఆ నాటి భారతదేశ పరిస్థితినీ వివరిస్తూ రచించిన నవల యిది.

ఈ కథను పాపులర్ నవల లా రచించినా, అజీజ్ గారు – స్థానిక సాంప్రదాయాలు, సంస్కృతినీ చాలా లోతుగా వివరించేరు. ’బూతపిల్లి’, పెద్దమ్మ దేవర వంటి విషయాల వివరణ విస్మయకరంగా ఉంటుంది. ఆరంభంలోనే ’పొలికేక’ అన్న శబ్దం – దానివెనుక స్థానిక సాంప్రదాయాల వివరణ విశదంగా, కథలో భాగంగా ఉంది. ఈ జాతరలు, గ్రామ సాంప్రదాయాలు తెలియని వారికి, ఆ నేపథ్యం కాస్త ’భీభత్సం’ ఎక్కువయినట్టు అనిపించవచ్చు కానీ ఇవి చరిత్రలో భాగం. చారిత్రక నవల – ఇలా నిక్కచ్చి గానే ఉంటేనే బాగు. అలవి మాలిన వర్ణనలు గుప్పించి పేజీలు పెంచే ప్రయత్నాలు లేవు ఈ చారిత్రక రచనలో. చివరన ఆయా ఘట్టాలకు చెందిన ఫుటోలను జోడించారు.

ఒకట్రెండు సందర్భాల్లో బ్రిటీషు అధికార్ల గురించి కాస్త హాస్య ధోరణిలో వ్రాశారు. ఎన్నదగిన లోపం కాదు కానీ చారిత్రక రచనలో ఇటువంటివి అంత బాగోవని ఈ వ్యాసకర్త వ్యక్తిగత అభిప్రాయం.

ఈ నవలకు కళాప్రపూర్ణ. డా. కొండవీటి వెంకటకవి ముందు మాట రాశారు.

చరిత్రలో ఎందరో వీరులు కులమతాలకతీతంగా స్వాతంత్రోద్యమంలో పోరాడి అసువులు బాశారు. అయితే కొందరి పోరాట చరిత్ర మాత్రమే బాగా ప్రచారం కావడం జరిగింది. అది విచారకరం అని ప్రస్తావిస్తూ అజీజ్ గారి మాటలు అక్షరాలా నిజం.

తెలుగునాట పుట్టిన విప్లవవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మీద విస్తృతమైన రచనలు లేవు. ఉన్నా ప్రాచుర్యం లేదు. ఈ నేపథ్యంలో మరుగుపడిన ఈ మహావీరుని చరిత్ర గురించి ఆసక్తి గలవారికి ఈ నవల తప్పక నచ్చుతుంది.

 

***

విరిగిన రెక్కలు

Art: Satya Sufi

Art: Satya Sufi

 

(ఖలీల్ జిబ్రాన్ “బ్రోకెన్ వింగ్స్” ముందు మాట )

ప్రేమ తన మాంత్రిక కిరణాలతో నా కళ్ళు తెరిపించి నా ఆత్మను తొలిసారిగా చురుకైన తన వేళ్ళతో స్పర్శి౦చినప్పుడు, సెల్మా కారమీ తన సౌందర్యంతో తొలి సారి నా ఆత్మను మేల్కొలిపినప్పుడు, ఉదయాలు స్వప్నాలుగా, రాత్రులు వివాహాలుగా గడిచే  ఉన్నతమైన ఆప్యాయతల నందనవనం లోకి నన్ను తీసుకువెళ్ళినపుడు నా వయసు పద్దెనిమిది.

సెల్మా కారమీ తన సౌందర్యమే ఉదాహరణగా సౌందర్యాన్ని ఆరాధించటం నాకు నేర్పి౦ది. తన ఆప్యాయతతో ప్రేమ రహస్యాన్ని తెలియపరచి౦ది,నిజ జీవిత కవిత్వాన్ని తొలి సారి నాకు పాడి వినిపి౦చినది ఆమెనే.

ప్రతి యువకుడూ తన తొలి ప్రేమను గుర్తు౦చుకు౦టాడు, ఆ విచిత్ర సమయాన్ని మళ్ళీ మళ్ళీ పట్టి తెచ్చుకు౦దుకు, ఆ నిగూఢత వల్ల పొ౦దిన చేదు అనుభవిస్తున్నప్పటికీ, ఆ జ్ఞాపకాల వల్ల గాఢమైన భావాలు మార్పుచె౦ది అతన్ని ఆనందపరుస్తాయి.

ప్రతి యువకుడి జీవనంలో ఒక సెల్మా ఉ౦టు౦ది, హటాత్తుగా జీవిత వసంతం లో  ప్రత్యక్షమై అతని ఏకాంతాన్ని ఆనందభరిత  క్షణాలుగా మార్చి అతని నిశ్శబ్దపు రాత్రులను సంగీత భరితం చేస్తు౦ది.

khalil1

నేను ఆలోచనలలో , యోచనలో గాఢ౦గా మునిగిపోయి ప్రకృతి స్వభావాన్ని, పుస్తకాలు , మాట గ్రంధాల సందేశాలను అర్ధం చేసుకునే ప్రయాసలో ఉ౦డగా, సెల్మా పెదవులు ప్రేమను నా చెవుల్లో గుసగుసలాడటం విన్నాను. సెల్మా నా ఎదురుగా ఒక వెలుగు స్తంభం లా ని౦చుని ఉ౦డట౦ చూసాక స్వర్గంలో ఆడం మాదిరిగా నా జీవితం ఒక అపస్మారకత అయి౦ది.

ఆమె నా హృదయపు ఈవ్ గా మారి దాన్ని రహస్యాలతో అద్భుతాలతో ని౦పి జీవితం అర్ధం నాకు అర్ధంఅయేలా  చేసి౦ది.

మొట్టమొదటి ఈవ్ ఆడం ను స్వర్గం ను౦ది తనంత తానూ కదలివచ్చేలా చేస్తే సెల్మా తన ప్రేమ, మాధుర్యాలతో నన్ను నా ఇష్టపూర్వకంగా స్వచ్చమైన ప్రేమ, సుకృతాల స్వర్గం లోకి కదలివచ్చేలా చేసి౦ది. కాని మొదటి మనిషికి ఏ౦ జరిగి౦దో నాకూ అదే జరిగి౦ది. ఏ తీవ్రమైన కరవాలం ఆడం ను స్వర్గం ను౦డి తరిమి కొట్టి౦దో అలాటిదే, నిషేధి౦పబడిన చెట్టు ఫలాన్ని రుచి చూడకు౦డానే ఎలాటి విధానాలూ ఉల్ల౦ఘి౦చకు౦డానే తన మెరుస్తున్న అంచుతో నన్ను నాప్రేమ స్వర్గం ను౦డి దూరంగా లాగి౦ది.

ఈ రోజున చాలా సంవత్సరాలు గడిచిపోయాక, ఆ సుందరమైన స్వప్నం లో బాధాకరమైన జ్ఞాపకాలు నాచుట్టూ కనిపి౦చని రెక్కల్లా కొట్టుకోడం , తప్ప నాకేమీ మిగలకపోయాక, నా హృద౦తరాళాలను  విషాదంతో ని౦పి నాకళ్ళలో నీరు తెస్తూ,మరణించిన నా ప్రియురాలు అందమైన సెల్మాను గుర్తు౦చుకు౦దుకు నా ముక్కలైన హృదయం, సైప్రస్ చెట్టు అలుముకున్న సమాధి తప్ప ఏమీ మిగల్లేదు. ఆ సమాధీ, ఈ హృదయమూ మాత్రమే సెల్మా సాక్షాలుగా మిగిలాయి.

సమాధిని చుట్టుముట్టి కాపలా కాస్తున్న నిశ్శబ్దం శవ పేఠిక అస్పష్టత లోని భగవంతుడి రహస్యాన్ని విప్పి చెప్పదు. ఆ శరీరపు మూల ద్రవ్యాలు పీల్చుకున్న వేళ్ళున్న ఆ చెట్టుకొమ్మల కదలికలు  ఆ సమాధి మార్మికాల గుట్టు విప్పవు. కాని వదన్లౌన్న నా హృదయపు నిట్టూర్పులు సజీవులందరికీ ప్రేమ, సౌ౦దర్య౦, మృత్యువు ప్రదర్శి౦చిన నాటకాన్ని తెలియజేస్తాయి.

బీరట్ నగరంలో  విస్తరి౦చి ఉన్న నా యౌవన కాలపు మిత్రులారా, మీర్రు ఆ పైన చెట్టుపక్కనున్న స్మశానం ము౦దును౦డి వెళ్ళేప్పుడు , నిశ్శబ్దంగా దానిలోకి వెళ్లి మరణించిన వారి నిద్ర చెదిరిపోకుండా మెత్తని అడుగులతో నెమ్మదిగా నడచివెళ్ళి, సెల్మా సమాధి పక్కన ఆగి ఆమె శవాన్ని దాచుకున్న నేలను పలకరి౦చ౦డి.ఒక దీర్ఘమైన నిట్టూర్పుతో  నాపేరు చెప్పుకుని మీలో మీరు “ ఇక్కడ, సముద్రాల కావల ప్రేమ ఖైదీగా నివసిస్తున్న గిబ్రాన్ ఆశలన్నీ  పూడ్చిపెట్టారు. ఇక్కడే ఆటను తన ఆనందాన్ని పోగొట్టుకున్నది. కన్నీళ్లు ఖాళీ చేసుకున్నది, చిరునవ్వులు మరచిపోయినదీ” అనుకో౦డి.

సైప్రస్ చ్ట్లతో బాటు ఆ సమాధి పక్కనే గిబ్రాన్ విచారమూ పెరుగుతో౦ది. ప్రతి రాత్రీ,విషాదంగా , విచారిస్తూ సెల్మా నిష్క్రమణకు రోదిస్తున్న కొమ్మలతో చేరి  ఆ సమాధిపైన అతని ఆత్మసెల్మా జ్ఞాపకాలతో రెపరెపలాడుతు౦ది.

నిన్న ఆమె జీవితం పెదవులపై ఒక అందమైన రాగం , ఈ రోజున భూమి గర్భాన ఒక నిశ్శబ్ద రహస్యం.

ఓ నా యౌవనకాలపు మిత్రులారా , మీకు నా విన్నపం ఇది

మీ హృదయాలు ప్రేమించిన కన్యల పేరున

వదిలేసిన నా ప్రియురాలి సమాధిపైన

ఒక పూల సరం ఉంచండి

సెల్మా సమాధిపై మీరు౦చిన సుమాలు

వాడిపోయిన గులాబీ ఆకులపై

ఉదయపు కళ్ళను౦డి రాలుతున్న మ౦చు బి౦దువులు.

*

 

 

 

సరళత్వమే మహాస్వప్నం: మైథిలి

Mythili1

ఒక వాక్యం వెంట మరొక వాక్యం…  ఆర్ద్ర మేఘాల వలె కమ్ముకుంటాయి. చదువుతూ ఉండగానే ఎప్పటి నుంచో స్పందన లేని గుండెల లోపల చిన్న తుంపర మొదలవుతుంది. ఆ పై మనసారా తడిసి ముద్దయ్యి చినుకు చినుకునీ ఆస్వాదించి ఆ సంతోషాన్నీ, ఆ సంతోషాన్నిచ్చిన సాహిత్యాన్నీ ప్రపంచానికి పంచే పనిలో ‘నిమగ్న‘మైపోతాం, ఉప్పొంగే మనసులమైపోతాం! కాస్త చదివాక ఆ మాధుర్యం అర్ధమైపోతుంది, ఇక ఆ వాక్యాన్ని అలా కాక మరొకలా ఊహించలేము,  ఇది ఇలానే పలుకుతుందని తెలిసిపోతుంది. ఇన్నాళ్ళూ అతి సహజంగా మన ముందు నుంచీ దాటిపోయిన విషయాలే .. ఒక ప్రత్యేకమైన శైలిలో, ఆసాంతం కనుబొమ్మలెత్తుకొని చదివేలా వ్రాస్తారు ఈమె! 

    తెలుసుకున్నదీ, చదివినదీ, విన్నదీ అలానే కాగితం మీద కుమ్మరించేయరు .. పూర్తిగా తనలోకి తీసుకున్నాక తాను అనుభూతి చెంది గీసిన  పెయింటింగ్ తెచ్చి వ్యాసంగానో  అనువాదంగానో  కథగానో మన ముందు ఉంచుతారు.  మన లోపల ఉండిన మునుపటి జ్ఞానమేదో అందంగా ఇప్పుడు ఈ అక్షరాల భావంలోకి, ఈ భాషలోకి, తర్జుమా అయి  తెలుస్తుంది… లో లోనే !!

mythili2

   ఏమిటి పట్టి లాగుతుంది ముందుగా దూరం నుంచే.. అక్కడ మెరిసే ‘టైటిల్స్’ ! అదేమిటి … ‘గాజుకెరటాల’ మీద ప్రతిఫలించే వెన్నెలేమిటి? ‘నక్షత్రధూళి’ మీద నీరెండ అందమేమిటి? ‘ఈ లోకపు పొలిమేరలు ‘ .. ‘కొంచం విచ్చిన కిటికీ ‘, ‘పన్నెండు రూపాల ప్రేమ’, ‘నీలిపూల రహస్యం’ ఇలా ఈ టైటిల్స్ చూడగానే  మోహన మేలుకుంటుంది పెదవులపై చిరునవ్వై !  ‘క్షీర సాగరం’, ‘పత్రహరితం ‘ , ‘మహా శ్వేత’, ‘నియతి’ వంటి కథలూ..  అందులోని పాత్రలు, పరిసరాలూ ఎప్పటికైనా మరచిపోగలమా ! ఈ మధ్య వచ్చిన ‘రాజహంస’ , ‘ద్వారబంధం’, ‘సంజీవరాయడు’ కథలు పరిమళం వీడని పూర్వజన్మపు అత్తరులలోనో  లేక నిజానికీ, ఊహకీ మధ్య కనబడని సన్నటి గీత మీదనో  నిలబడిపోయిన నేపథ్యాల నడుమ సాగుతాయి. 

    గడిచిన మూడేళ్ళలో వచ్చిన సాహిత్య వ్యాసాలనూ ఫేస్ బుక్ నోట్స్ నూ కలిపి ఇటీవలే చినుకు పబ్లికేషన్స్ వారు ‘నిమగ్న’ సంకలనాన్ని తీసుకువచ్చారు. ‘సారంగ’ సాహిత్య వారపత్రిక, ‘వాకిలి’ సాహిత్య మాసపత్రికలకు తరచుగా రాస్తూ, అంతర్జాలం గ్రూపు ‘సాహిత్యం’ అడ్మిన్ గా వ్యవహరిస్తూ, బాధ్యతగల డాక్టర్ గా విధులు నిర్వహిస్తూ జీవనోత్సాహానికి ఉదాహరణగా విరగబూస్తున్న ఈ వయొలెట్ పూల తోటతో ముఖాముఖి ..

peepal-leaves-2013

  1. 2013 కి ముందు మీరు దాదాపుగా ఎవరికీ తెలియదు. ఎందుకని రాయటం మొదలు పెట్టారు?  రాసి ఉండకపోయినా కూడా comfortable  గానే ఉండి ఉండేవారా ?

ప్రాథమికంగానూ ప్రధానంగానూ నేను చదువరిని. వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి ప్రశ్న ఒకటి నా చేత మొదటి కథ ‘నియతి’ ని రాయించింది, 2001 లో. ఆవిడే ఫెయిర్ చేసి పంపారు. [ నియతి తెలుగు యూనివర్సిటీ వాళ్ళ ‘ తెలుగు కథ 2001’ లో కూడా వచ్చింది.]  తర్వాత 2003 లో ‘పత్రహరితం’. రెండూ వార్త ఆదివారం సంచికలలో వచ్చాయి. అప్పటి ఎడిటర్ గుడిపాటి గారు చాలా సార్లు రాయమని అడిగినా, చెప్పవలసినది ఉందనిపించక రాయలేదు. పిల్లలు పై చదువులకి వెళ్ళాక దిగులేసి ఫేస్ బుక్ లో చేరాను. 2013  లో శ్రీవల్లీ రాధిక గారు అంతర్జాలంలోని  సాహిత్య సమూహాలకి నన్ను పరిచయం చేశారు. అప్పుడే ‘ నిమగ్న’ అనే బ్లాగ్ తెరిచి చిన్న వ్యాసం రాశాను అందులో. రెండో రోజుకి అఫ్సర్ గారు నాకు మేసేజ్ ఇచ్చారు – సారంగ కి ఏమైనా రాయమని. ‘కౌమారపు పూల తోట’ నా మొదటి వ్యాసం అందులో. ఆ రకంగా  పత్రికలకు  రాయటం మొదలుపెట్టించినదీ అఫ్సర్ గారే. వాకిలి ఎడిటర్ లలో ఒకరైన  రవి వీరెల్లి గారు బోలెడంత స్వేచ్ఛని ఇచ్చారు. ఫేస్ బుక్ లో – అనిపించేవి మిత్రులతో పంచుకోవటం లోని ఆనందం గొప్ప ఉత్తేజాన్ని ఇచ్చేది, ఇప్పటికీ ఇస్తోంది.

రాయకపోయినా కూడా హాయిగానే ఉండి ఉండేదాన్నేమో , అన్నాళ్ళూ ఉన్నానుగా [నవ్వు] మరిన్ని పుస్తకాలు చదువుకునేదాన్ని.

  1. మీ నేపథ్యం ఏమిటి? చదవటాన్ని ఎవరు ప్రోత్సహించారు?

మా నాన్నగారు గవర్న్ మెంట్ డాక్టర్. తీరిక ఉన్నప్పుడు హాయిగా తెలుగు నవలలు చదువుతుండేవారు. అమ్మ తెలుగు మెయిన్ గా బి.ఏ చేశారు . ఆవిడ బాగా ఎక్కువగా, వేగంగా చదివేవారు. మా అత్త కథలు చదివి చెప్తుండేది. ఉన్న కథలని ఇంకాస్త పొడిగించి, మార్చి చెప్పేది. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు – పిల్లల పత్రికలన్నీ కొనేవారు. టాగూర్ నవలల అనువాదాలన్నీ జయంతి పబ్లికేషన్స్ వాళ్ళు వేసేవారు అప్పుడు – అవన్నీ అమ్మమ్మ సంతోషంగా కొనిపెట్టేవారు. పన్నెండేళ్ళు నిండేప్పటికి అవన్నీ అయిపోయాయి, అర్థమైనా కాకపోయినా.  తర్వాతి రోజుల్లో ఏది దొరికితే అది చదివాను – ఎవరూ అడ్డు పెట్టేవారు కారు. విద్యాగంధం ఉన్న మధ్యతరగతి కుటుంబాలన్నీ అప్పుడు అలాగే ఉండేవి.

  1. వ్యాసం, అనువాదం, కథ – మూడిట్లో ఏది ఎక్కువ ఇష్టం? ఏది ఎక్కువ కష్టం? భవిష్యత్తులో నవలేదైనా రాస్తారా?

అన్నీ ఇష్టంగానే రాస్తాను. అనువాదం తేలిక. నోట్స్ అలవోకగా వస్తాయి గాని వ్యాసాలకి చాలా చదవాలి. ముందు తెలిసిన సమాచారాన్నే అయినా కొత్తగా చదవకపోతే ఒక పద్ధతిలో పెట్టలేము. వాకిలి లో పెద్ద వ్యాసాలు రాసేప్పుడు శ్రమ పడి  చదవవలసి వచ్చేది… మొదటి వారం అవుతూనే తర్వాతి నెల కోసం. కథని వీలైనంతగా చెక్కుకోవాలి కనుక అది మరొకలాగా కష్టం. అయితే  – ఇవాళ్టికీ కథ వల్ల వచ్చే ప్రతిష్టే ఎక్కువ. It is the most rewarding of the three.

చిన్నప్పుడంతా చాలా నవలలకి plots ఉండేవి బుర్రలో – మెడిసిన్ చదివేప్పుడు కూడా. ఇప్పటికైతే నవల రాసే శక్తి లేదు.

  1. కుందమాలలో రాముడు, అభిజ్ఞాన శాకుంతలంలో ‘దుష్యంతుడు’, నర్తనశాల వ్యాసంలో ‘కీచకుడు ‘ .. ఇలా కథా[ప్రతి] నాయకులు కన్నీరు పెట్టుకొని పశ్చాత్తాప పడే అరుదైన అంశాల పై మిమ్మల్ని వ్యాసాలు వ్రాసేందుకు ప్రేరేపించినవి ఏవి ?

ఏటవాలు చూపు ఒకటి ఉంటుందని మొదట చెప్పినవారు జలంధర గారు. ఆ దృష్టిని అతి సమగ్రంగా దర్శించినది విశ్వనాథ లో.

  1. విశ్వనాథ రచనల్లో మిమ్మల్ని బాగా కదిలించినది యేది? నేటి సమాజానికి ఆయన రచనలు ఎలా relevant అవుతాయో చెబుతారా?   

ఆయన రాసిన అన్ని నవలలూ నాటకాలూ గొప్పగానే ఉంటాయి. చదవకపోతే ఎంత నష్టపోతామన్న దానికి కొలత లేదు నిజంగా. ఆ భాష మొదట్లో కొంచెం బెదరగొట్టేమాట నిజమే, కాని ఆయన ఏ మాత్రం భయపడవలసిన వారు కారు. ఒక రచన లోనే మూడు నాలుగు perspectives చూపిస్తారు – ఒకటే ఒప్పుకు తీరాలని అన్నదెప్పుడని, పాపం?  దేన్నీ ఒప్పుకోకుండానే ఆయన శతధా దర్శించిన ప్రపంచాన్ని మనమూ  దర్శించి రావచ్చు, ఇంకాస్త అర్థవంతంగా జీవించవచ్చు.

mythili1

  1. మీరు విశ్వనాథతో పాటు చలాన్నీ బాగా చదివారు కదా? ఆయన రచనలకి relevance ఉందా ఇప్పుడు ? మీ పైన ఆయన ప్రభావం ఉందా?

ఎప్పటికీ ఉంటుంది.  నిజాయితీ, నాగరికమైన ప్రవర్తన, సౌందర్యదృష్టి – ఎప్పటికీ ఆయన నుంచి నేర్చుకోవచ్చు.   నన్ను చలం ఎంత మలిచారంటే ఆ మధ్యన మా అబ్బాయి మ్యూజింగ్స్ చదువుతూ ఆ thought process  లో చాలా చోట్ల నన్ను గుర్తు పట్టాడు.

  1. తెలుగులో మిమ్మల్ని ప్రభావితులను చేసిన వేరే రచయితలు ఎవరు ?

కొడవటిగంటి కుటుంబరావు గారు. ఆయన విశ్లేషణ అద్భుతం గా ఉంటుంది. ”మనిషి కష్టాలు పడచ్చు గాని రొష్టు పడకూడదు” – అంటారు ఒక చోట. ఊరికే verbal contrast  కోసం అన్న మాటలు కావు – అవి  అర్థమైతే జీవితం  తేలికయిపోతుంది. మునిపల్లె రాజు గారు, ఇచ్ఛాపురపు జగన్నాథ రావు గారు, కల్యాణ సుందరీ జగన్నాథ్ గారు , మాలతీ చందూర్ గారు,  ఇష్టం. – ఇంకొంచెం పక్కకి వస్తే భరాగో, జ్యేష్ట, అవసరాల రామకృష్ణారావు గారు  – వీళ్ళ కథలూ  నచ్చుతాయి.  చాలా ముఖ్యంగా యద్దనపూడి సులోచనారాణి గారు. ఎందుకో సరిగా తెలియకుండానే పదే పదే చదివినవారు లత, చండీదాస్.

  1. ఆంగ్ల రచయితల జీవిత దృక్పథానికీ, మన తెలుగు లేదా భారతీయ రచయితల జీవిత దృక్పథానికీ యేదైనా తేడా మీరు గమనించారా? మీకు బాగా నచ్చిన ఆంగ్ల రచయిత లు ఎవరు?

దేశ కాలాల హద్దులని మినహాయిస్తే అక్కడ నాకు మన సాహిత్యంతో వైరుధ్యాలు తట్టలేదు. George Eliot చాలా సంపన్నమైన రచన చేశారు. ఆమెని చదువుతుంటే చాలాసార్లు విశ్వనాథ గుర్తొస్తారు. Late Victorian యుగం వరకూ వచ్చిన ఆంగ్ల సాహిత్యాన్నే ఎక్కువ చదివాను,  అందువల్ల కూడా నాకు ఎక్కువ తేడా కనిపించకపోయి ఉండవచ్చు.   Wilkie Collins, F.H.Burnett,  Jules Verne , Henrik Ibsen , Oscar Wilde,  Ayn Rand,  Agatha Christie   –  అలా ఒకరితో ఒకరికి పొంతన లేని రచయితలుంటారు నా జాబితా లో. [నవ్వు]  Jane Austen  గురించి పెద్ద వ్యాసమే రాసుకున్నాను కదా .  L.M.Montgomery నుంచి ఎంతో నేర్చుకున్నాను .  British horror , Gothic  genres చాలా ఆకర్షిస్తాయి . Fantasy  ఎక్కువ చదువుతున్నాను ఇప్పుడు- వారిలో Patricia A Mckillip అతి రమ్యంగా రాస్తారు….

  1. . మీ శైలి ఆపకుండా చదివిస్తుంది, దాని వెనక రహస్యం ఏమిటి? మీ వచనంకవిత్వానికి అతి దగ్గరగా – ఉంటుంది, మీకు టక్కున గుర్తొచ్చే కవి – కవిత గురించి .. ?

అవునా – పెద్ద పెద్ద ఉత్తరాలు రాసేదాన్ని – అందుకేమో మరి. జేన్ ఆస్టిన్ ఒకచోట అన్నారు, ఉత్తరాలకీ వచనం రాయటానికీ సంబంధం ఉందని. నిజానికి నేను మరీ ఎక్కువ కవిత్వం చదువుకోలేదు. వెంటనే స్ఫురించే వాక్యాలు ఇవి.”Charm’d magic casements, opening on the foam Of perilous seas, in faery lands forlorn’’  కృష్ణశాస్త్రి గారు నాకు కవిత్వంలో గొప్ప. లిరిక్ శిల్పం అని ఒక వ్యాసం లో ఆ Keats మాటలని పరిచయం చేస్తే వెతుక్కుని చదివాను. గాజు కెరటాల వెన్నెలా జాజిపువ్వుల అత్తరు దీపాలూ – తిలక్ పదబంధాలు నోట్లో ఆడుతుంటాయి. టాగూర్ మాటలు-  Much have you given to me, Yet I ask for more …. not for the gift of love, but for the lover himself.

  1. మీ అనువాదాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అనువాదాల్లా కాక స్వతంత్ర రచనల్లాగా అనిపిస్తాయి.ఎలా వీలయింది అది ?

మాటకి మాట గా అనువదించకుండా భావాన్ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తాను. తెలుగులో సమానార్థకాలు ఉన్నాయేమో వెతుక్కుంటాను, కొద్దిగా స్వేచ్ఛ తీసుకుంటాను. నండూరి రామమోహనరావు గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారు చేసిన అనువాదాలు నాకు ప్రేరణ. పిల్లల కథలని అనువదించేప్పుడైతే రష్యన్ అనువాదాలు స్ఫురిస్తుండేవి. చందమామ లో కొకు వాడిన పదాలు – చావడి, వసారా – ఇలాంటివి గుర్తొచ్చేవి. ఆయన ఎన్నో జానపద కథలని తిరగరాశారు – కొన్ని రోజుల కిందట, Irish folk and fairy tales omnibus  తిరగేస్తుంటే కొకు వాటిలో కొన్నిటిని  adapt  చేశారని అర్థమై గొప్ప ఆశ్చర్యం వేసింది.

  1. . పిల్లల సాహిత్యం పెద్దవారికి కూడా అవసరమేనా ?

ఆ మధ్య చదివాను – ఎవరో అమ్మాయి research చేస్తూన్న అంశం ఇది – ‘’ పిల్లల సాహిత్యాన్ని చదవటం వల్ల పెద్దవారిలో depression తగ్గుతోంది.  చాలా సంక్లిష్టతలలో చిక్కుబడిపోతున్నాం – సరళంగా ఎలా ఆలోచించాలో బాల సాహిత్యం చెప్తుంది అని నేను అనుకుంటాను. అందుకు నిదర్శనం ఎదురుగానే ఉంది – ‘గ్రీన్ గేబుల్స్ లో ఆన్’ అంటే ఫేస్ బుక్ లో అందరికీ ప్రేమే కదా!  Young  adult fiction నే కాదు, 9-11 ఏళ్ళ పిల్లల పుస్తకాలు కూడా చదువుతూనే ఉంటాను.

  1. మీ కథల్లోని వ్యక్తులకు క్షమించడం లేదా పూర్తిగా ( unconditional గా) ప్రేమించడం మాత్రమే తెలుసు, అలా నిజ జీవితంలో సాధ్యమేనా?  మీ కథల్లో పాత్రలకీ మీకూ ముడులేమైనా ఉన్నాయా ?

క్షమించటం, ప్రేమించటం అవతలివారి కోసం కాదు, మన కోసమే. ఎందుకు సాధ్యం కాదు – నేను రాసినవారి కన్నా గొప్పమనుషులు ఉన్నారు, నేను చూశాను. వాళ్ళు  ఉత్తినే, ఉట్టుట్టి – త్యాగాలు చేయరు – ఏది ఎందుకో తెలిసే చేస్తారు… నిజమైన తెలివి అది. ఉత్తమమైనదానినే ప్రతిపాదించే ప్రయత్నం సాహిత్యపు బాధ్యత అని నేను నమ్ముతాను.

కొన్ని కొన్ని ముడులు తప్పకుండా ఉంటాయి, రచయిత తన ప్రాణంలో ఒక భాగాన్ని రాసేదానిలో తప్పకుండా నిక్షేపిస్తారు. కాని మొత్తంగా నిజం ఏదీ ఉండదు, వేర్వేరు నిజాలు ఒక ధారగా కలుస్తుంటాయి కూడా.

  1. మూడుదశలు గా వచ్చాయి మీ ఏడు కథలూ. మీలో మీరు గమనించినదేమిటి ? ఆఖరి మూడింటిలోsupernatural elements ని ఎందుకు తీసుకున్నారు? ఇక మీదటా అటువంటివే రాస్తారా?

మొదటి రెండు కథలూ రాశాక తర్వాతి రెండూ పదేళ్ళ తర్వాత వచ్చాయి – ఆ లోపు ఖచ్చితంగా నాకు చాలా సందేహాలకి జవాబులు దొరికాయి. ఇటీవలి మూడు – బహుశా ప్రశ్నలు అంతమవటం వల్ల వాస్తవాన్ని దాటి వెళ్ళాలనిపించిందేమో. ఇక ముందు – చెప్పలేను. తెలుగులో కూడా genre fiction రావలసిన అవసరమైతే ఉంది.

  1. రచయిత తన రచనల్లో తప్పనిసరిగా ఏదైనా సందేశాన్ని ఇవ్వాలని మీరు భావిస్తారా? రచన సూటిగా చదువరులపైకి దూసుకురావాలా? లేక ఆలోచించి సారాన్ని తెలుసుకునేలా ఉండాలా?

అదంతా రచయిత ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది. చదువరులంతా కూడా ఒకేలాగా ఉండరు – కొందరు పాఠకులకి గోరు ముద్దలు రుచిస్తాయి, ఇంకొందరికి విద్వదౌషధాలు కావాలి. ఏమైనా, ఎలాగైనా చెప్పండి – అయోమయపు చీకట్లో వదలకూడదు. రచయిత బుర్రకి ప్రపంచం అంత కల్లోలంగా తోస్తోంది కనుక, దాన్నంతా,  అలాగే – రాసేసే హక్కు ఉంటుందనుకోను.

at-home

15 . మీ దృక్పథం ఏమిటి? దేన్ని సమర్థిస్తారు?

నేను ఆశావాదిని, స్వాప్నికురాలిని.  కుటుంబానికి సంబంధించి సంప్రదాయవాదిని. కుటుంబం విచ్ఛిన్నం కాకూడదని నమ్ముతాను.సామాజికంగానో , స్త్రీ ని అవటం వల్లనో  నేను వ్యక్తిగతంగా వివక్షకి గురి కాలేదు –  బ్రహ్మ సమాజపు, వైష్ణవపు నేపథ్యాలు చాలా కల్మషాలను మా ఇంటికి దూరానే ఆపేశాయి. కాని ఎన్నెన్ని అపరాధాలు జరిగిపోయాయో నాకు  అవగాహన ఉంది.

ఏ అస్తిత్వ వాదాల పైనా నాకు ద్వేషం గానీ అయిష్టం గానీ లేదు. అన్ని వైపులా నాకు స్నేహితులు ఉన్నారు.  పడినవారికి అడిగే హక్కు ఉంది- కాని ఎవరి తప్పులకి ఎవరిని నిందిస్తామో కూడా ఆలోచించుకోవాలి… మన దేశంలో ప్రతి సామాజిక వర్గానికీ తన సొంత సంస్కృతి ఉంటుంది, దాన్ని గర్వంగానే తలచుకోవాలని నేను అనుకుంటాను. ఒకరి పట్ల ఒకరు కొత్త తప్పులు చేసుకోకూడదనిపిస్తుంది. మనిషికీ మనిషికీ మధ్యన వైవాహిక బంధుత్వాలే కాదు, ఇంకా చాలా ఉంటాయి-  ఉండచ్చు, నాకు తెలిసి.

  1. ‘పాఠకుడుఅంత లోతైన భాష చదివేందుకు సిద్ధంగా ఉండడు, కనుక వాడుక భాషలోనే రచన చేయాలి’ ఈ అభిప్రాయాన్ని మీరు అంగీకరిస్తారా? మీ రచనలు చదవడానికి పాఠకుడికి కాస్త లోతైన భాష తెలిసి ఉండాలి’ అనే అభిప్రాయాన్ని మీరెలా స్వీకరిస్తారు?

వినయం గానే స్వీకరిస్తాను. అయితే ఒక్క మాట చెప్పాలి ఇక్కడ – మనకి తెలిసిన భాష లోనే చదువుతామని భీష్మించుకుంటే కొత్త మాటలూ కొత్త ప్రయోగాలూ తెలియవు. భాష పుష్టిగా అవదు. ఏది వాడుక భాష అనేది మరొక ప్రశ్న-  ఒక జిల్లా వాడుక భాష మరొకరికి కష్టంగా తోస్తుంది – చదవటం మానేయకూడదు కదా? మాది గుంటూరే గాని మా గోఖలే గారు రాసిన గుంటూరు మాండలికం మా ఇంట్లో మాట్లాడము – చదువుకోలేదా ?  నిన్న మొన్నటి  ‘గోపల్లె’ లో తమిళనాటి తెలుగు సొగసు మాట, మరి? తెలంగాణా, రాయల సీమ మాండలికాలు నేను ఇష్టంగా చదువుతాను. ఉత్తరాంధ్ర ది కొంచెం కష్టమనిపిస్తుంది గాని ప్రయత్నిస్తుంటాను. నా వరకూ వస్తువుని బట్టి రాసే భాష అప్రయత్నంగా మారిపోతుంటుంది.

17 .  ఎందరో ఎన్నోసార్లు మిమ్మల్ని అడిగిన ప్రశ్న  “వృత్తికీ – ప్రవృత్తికీ, కాస్త సొంతానికీ”  సమయాన్ని ఎలా సంతులనం చేయగలుగుతున్నారు?

కాస్త కాదు, అంతా సొంతమే [నవ్వు]. ఇరవై ఏళ్ళకి పైబడి ఇంచుమించు నిర్విరామంగా ప్రాక్టీస్ చేశాను, అప్పుడు కూడా రాత్రి  ఒంటిగంట వరకూ చదువుకుని సర్జరీ పేషెంట్స్ ని మళ్ళీ చూసి నిద్రపోయేదాన్ని.  మా అమ్మ, మా వారు – ఇద్దరూ నాకు చాలా వెసులుబాటు ఇచ్చారు. నా పుస్తకాన్ని అందుకనే ఆ ఇద్దరికీ అంకితం ఇచ్చాను. ఇప్పుడు నేను semi retired, కావలసినంత తీరిక. అంతా కలిసే ఉంటాము,  పిల్లలిద్దరూ బాగా చదువుతారు- కొత్త ఉత్సాహం.

   ( శ్రీ వంకాయల శివరామకృష్ణారావు గారి సహకారంతో)

[ డా. మైథిలి అబ్బరాజు గారి సారస్వత వ్యాసాల సంపుటం ‘ నిమగ్న’ కినిగె లో దొరుకుతుంది.

లింక్ : http://kinige.com/kbook.php?id=7411  ,  విశాలాంధ్ర, నవోదయ బుక్ హౌస్ కాచిగూడ లలో కూడా ]

 

 

 

 

 

 

 

 

 

ఛాయ! 

 

damayanti

ఒక్కఉదట్న నిద్రలోంచి  లేచి కుర్చుంది వర్ధనమ్మ.  మంచంపట్టీల  మీద చేతులు  ఆన్చి,  కాసేపటి దాకా అలానే  తలొంచుకుని వుండిపోయింది.   పీడకలకి గుండెలు దడదడా కొట్టుకుంటోంటే,  కళ్ళు నులుముకుంటూ ఆత్రంగా చూసింది – ఎదురుగా  వున్న బెడ్ కేసి.

కోడలు అటుపక్కకి తిరిగి, పొట్టలోకి   కాళ్ళు ముడుచుకు పడుకుని కనిపించింది !  హమ్మయ్య అనుకుంది.

ఒకప్పుడు – మెలి తిరిగిన ఏటి పాయలా  థళథళామంటుండేది.  మిలమిలా మెరిసిపోతుండేది. ఈ నాడు –  గ్రీష్మతాపాగ్నికి   ఇంకిపోయిన  జీవ నది కి తాను ఆన వాలు అన్నట్టు – ఒక   ఇసుక చారలా మిగిలిపోయింది.

  వసంతాన్ని చూసిన రెండు కళ్ళే, శిశిరాన్నీ చూస్తాయి.  కానీ, ఒక్క హృదయమే భిన్నంగా స్పందిస్తుంది.

 అవును మరికన్నీళ్ళుఖేదంలో వస్తాయి. సంతోషం లోనూ వస్తాయి. అయినా, రుచి వేరు కాదూ?

కలల్లోనూ, కనులెదుటనూ కోడలి దీన రూపం  – ఒక  వీడని  వెతలా  ఆవిణ్ని వెంటాడుతూనే వుంది.   ఒక్కోసారి  ఆ కల ప్రభావం ఎంత తీవ్రంగా వుంటుందంటే  – ఆ  ధాటికి    ఊపిరి అందక ప్రాణం ఉక్కిరిబిక్కిరైపోతుంది.  ఇప్పుడామె ఉన్న పరిస్థితి అదే!  ముఖాన పట్టిన చెమటని చీర కొంగుతో అద్దుకుని,    వొణుకుతున్న కాళ్ళతో మెల్లగా మంచం మీంచి లేచింది.  తలుపు తీసుకుని, ప్రధాన ద్వారం బయట..  మెట్ల పక్కని అరుగు మీద కొచ్చి చతికిలబడింది.

భాద్రపద మాసం,  కృష్ణ పక్షం .   కాంతిని కోల్పోతున్న చంద్రుడు – ఆకాశంలో నిశ్శబ్దంగా వెలుగుతున్నాడు.  కొడికడుతున్న  దీపంలా.  అసలే జారిపోతున్న ప్రాణం. పై నించి, నల్లమేఘాల వధం లో కొట్టుమిట్టాడుతున్నట్టుంది  అతని పరిస్థితి.

వుండుండి విసరిసరి  వీస్తున్న  కొబ్బరి చెట్ల   గాలొచ్చి ఒంటికి తాకడంతో  కాస్త నిదానించింది ఆ పెద్ద ప్రాణం.

అప్పటికి – కాస్త  గుండె వేగం గా కొట్టుకోవడం ఆగింది. కానీ, శరీరం కుదు టపడినంత  తేలిక గా  మనసు కుదుటపడుతుందా? లేదు.

ఎవరికి చెప్పుకోలేని  మానసిక వ్యధ. ఆ ముసలి గుండె ఒంటరిగా మోయలేని  భారపు మూట గా మారింది.

పెళ్ళి కాని కూతురు – తల్లి గుండెల మీద కుంపటంటారు! కానీ, నరకమనుభవించే కోడలు గుండెల మీద నిప్పుల గుండం అని ఎంతమందికి  తెలుసు?  అనుభవించే తనకు తప్ప!

వొద్దువొద్దనుకున్నా మరచిపోలేని గతం మళ్ళీ కళ్ళముందుకొచ్చింది.

ఆ రోజు ఎంత చేదైనా రోజంటే – తమ జీవితాల్ని చిందరవందర చేసిన రోజు. ఒక పూల తోటలాంటి ఈ ఇంటిని  అమాంతం   శ్మశానం చేసి పోయిన రోజు!

ఆవాళ ఏమైందంటే!

*****

ఊరంతా గుప్ఫుమ్మన్న  ఆ వార్త  వాళ్ళ చెవుల కీ సోకిన  క్షణం – తల కొట్టేసినంత పనయింది  వర్ధనమ్మకి. నిలువునా నరికిన చెట్టులా కూలిపొయింది.  రేపు బయట నలుగురిలో మొఖమెత్తుకుని తిరగడం ఎలా అనే మాట అలా వుంచి, ఈ క్షణం  ఇప్పుడు..తను –  కోడలి వైపెలా కన్నెత్తి ఎలా చూడగల ద నేది పెద్ద ప్రశ్న గా మారింది.  సిగ్గుతో కాదు. భయం తో అంతకంటే కాదు. ఇంకొకటి..ఇంకొకటుంది అదే..సాటి స్త్రీగా ..  ఆమెకేమని జవాబివ్వగలదని?  ఏం సమధానపరచి ఓదార్చగలదనీ?

వెంటనే పూజ గదిలోకెళ్ళి తలుపులుమూసుకుంది. అలా ఏడుస్తూ..ధ్యానిస్తూ..దేవుణ్ణి శపిస్తూ..ఎలా గడిచిందో కాలం!’ తనే ఇలా డీలా పడిపోతే, పాపం! దాన్నెవరు సముదాయిస్తారూ?’ అనుకుంటూ మెల్లగా లేచి హాల్లోకొచ్చింది. మిట్ట  మధ్యాహ్న మైనట్టు చూపిస్తోంది గడియారం. ఆమె కళ్ళు –  కోడలి కోసం ఇల్లంతా వెదుకుతున్నాయి. ఏ మూల ముడుచుకునిపోయి, శోకభారంతో కుంగుతోందా అని!

అంగుళంగుళం కటిక నిశ్శబ్దాన్ని ముసుగేసుకున్న ఆ బంగళా  ఆమెకాక్షణంలో భూతాల కొంపలా అనిపించింది.

అందుకే అంటారు.ఇల్లంటే ప్రేమిచిన హృదయం. అదే మనిషిలోంచి వెళ్ళిపోయినప్పుడు ఏం మిగులుతుందనీ?  ఇప్పుడిక – పాడుపడ్డ గూడేనా?

‘జ..ము..నా..’ పిలిచాననుకుంది. గొంతు పెగలందే!

“ఏమిటత్తయ్యగారూ? ఇలా నిలబడిపోయారు?” వెనకనించి వినిపిస్తున్న కోడలి మాటలకి గిరిక్కున అటు తిరిగి చూసింది.

జమున తల స్నానం చేసి,  నీళ్ళు కారుతున్న తడి బట్టలతో పూజ గదిలోకెళ్తోంది.

ఇంత మిట్ట మధ్యాన్నపు వేళ..తల స్నానమా? ఏదో చావు కబురు విన్నట్టు…మైల విడిచినట్టు..?  ఆమెకర్ధమైంది. పూర్తిగా అర్ధమైంది. ముడుచుకున్న  భృకుటి విడివడ్డాక నిస్సత్తువగా  సోఫాలో కూలబడిపోయింది. కోడలి ప్రవర్తన అంతుబట్టడం లేదు.

లేదు..ఈ ప్రశాంతత ఎంత భయానక ప్రళయానికి దారితీస్తుందా అని వొణికిపోతోంది !

తన నింత వేదన కి గురిచేసిన  కొడుకు మీద ఆమెకి మొట్టమొదటి సారిగా విరక్తి కలిగింది.

అది మామూలు విరక్తి కాదు. జుగుప్సతోకూడిన విరక్తి కలిగింది.

బంగారం లాంటి పిల్లని వెదికి వెదికి తీసుకొచ్చి పెళ్ళి చేసింది. ఈ ఇల్లు తనదని, వీళ్లంతా తన వాళ్ళని తమని కలుపుకుని,  తమతో కలిసి, ఈ ఇంటిని తన మమతానురాగాలతో బంగారు దీపాలు వెలిగించిన పుత్తడి బొమ్మ-  జమున! చందమామ లాంటి  కొడుకుని కని ఇచ్చింది. అలాంటి   ఇల్లాలికా వీడు  – ఇంత ద్రోహం చేసిందీ?

ఎవర్తినో  తీసుకొచ్చి, నడి బజార్లో కాపురం పెడతాడా? సిగ్గు లేదు? తమ బ్రతుకులేమౌతాయనే ఆలోచనా జ్ఞానం లేదూ? కుల యశస్సును, వంశ ప్రతిష్టను కాలరాచే పుత్రుణ్ని కలిగి వుంటం కన్నా, అసలు కొడుకే లేకపోవడం మేలేమో!   కంటి తడి  ఆరకుండా ఏడుస్తోంది – కోడలి గురించి పరితాపం చెందుతోంది. ‘పిచ్చిది ఏమౌతుందా ‘అని.

ఒక అత్త గారు ఇలా తన  కోడలి కోసం దుఖించడం..వింతే కదూ?

***

వర్ధనమ్మ కొడుకు పేరు – చక్రవర్తి. అతనిది  గిల్ట్ నగల వ్యాపారం. తయారు చేసిన నగలను చిన్నా చితకా దేవాలయాల నించి పెద్దపెద్ద క్షేత్రాల కు సరఫరా చేస్తుంటాడు.   పర్వ దినాల్లో దేవుళ్ళ ప్రత్యేక అలంకరణల కై ఘనమైన నగల్ని స్పెషల్ గా తయారు చేసి సప్లై చేస్తుండేవాడు. అందుకు తగిన వర్క్ షా ప్, వూళ్ళొనే వుంది.  చేతికింద పనివాళ్ళుండేవాళ్ళు.  నగల తయారీ దనం లో కొత్తదనం, కళాత్మకత ఉట్టిపడుంటం తో  ఇతని పేరు –  ఊరూ వాడలతో బాటు చుట్టుపక్క ప్రాంతాలలోనూ మారుమ్రోగింది.  వ్యాపారాన్ని వృధ్ధి చేసుకునే ప్రయత్నం లో అనేక నాటక సంస్థల నిర్వాహకుల దగ్గర కు వెళ్ళి స్వయంగా  పరిచయం చేసుకుని, బిజినెస్ తెచ్చుకునేవాడు నటులు ధరించే  .  ఆ యా  పాత్రలను  దృష్టిలో వుంచుకుని   తన సృజనాత్మకత  ఉట్టిపడేలా నగలను డిజైన్ చేసిచ్చేవాడు.  రెఫెరెన్సుల  కోసం పుస్తకాలు వెదికి పట్టుకునే వాడు.  కిరీటాలు, గదలు, మెడ లో ధరించే రకరకాల  రంగు రాళ్ళ హారాలు,  ఉంగరాలు, పతకాలు, వడ్డాణాలు, కంకణాలు, వంకీలు నెక్లెస్సులు, అన్నీ  ఆర్భాటం గా గొప్ప హంగుతో  కనిపించి, మెరిపించేవి గా వుండేవి.

వ్యాపారం నిమిత్తమై  వూళ్ళు తిరుగుతుండే వాడు. అలా అలా ఇతని ప్రాభవం సినిమాలకూ పాకింది.  వాళ్ళ తో పరిచయాలేర్పడ్డాయి.మద్రాస్ లో –  అక్కడే ఒక ప్రధాన షో రూం ఓపెన్ చేసాడు. నిర్మాత దర్శకులు తాము నిర్మించే  పౌరాణిక , జానపద చిత్రాల కు చక్రవర్తి నే ఎంచుకునే స్థాయికి ఎదిగాడు. అతని పనితనం అంత  ప్రత్యేకం గా వుండేది. సినిమా షూటింగ్ లకు  సెట్స్ మీద కి వెళ్తుండేవాడు.

ఎలా పరిచయమైందో ఏమో, దేవమ్మ ట..ఏకంగా పెళ్లి చేసుకుని తీసుకొచ్చేశాడు ఊళ్ళోకి. తీసుకొచ్చి,  సరిగ్గా   ఊరి నడిబొడ్డున  ఇల్లు తీసుకుని కాపురం పెట్టాడు.

ధనం వల్ల కలిగే అహం ఎంత బలమైనదంటే – తన పతనానికి తానే  కారణమయ్యేంత!

కన్నూ మిన్నూ కానరాని తొందరపాటు నిర్ణయాల వల్ల తనని అంటిపెట్టుకుని జీవించే వారి జీవితాలెంత అతలాకుతలమౌతాయో అప్పుడా అవేశంలో వారికి అర్ధంకాదు. వాటి విషఫలితాలు అనుభవించేటప్పుడు  తప్ప!

మిన్ను విరిగి మీదపడ్డ వార్త తో వర్ధనమ్మ వొంగిపోతే, చిత్రంగా, జమున మాత్రం నిఠారై నిలబడింది.  శరీరమైనా, మనసైనా భరించే స్థాయికి మించి గాయమైనప్పుడు ఆ నొప్పి వెంటనే తెలీదు.

గొడ్డలి దెబ్బలు తింటూ కూడా వృక్షం నిలబడే వుంటుంది.

‘వీడు చేసిన వెధవ పనికి  ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోతుందేమో, తల్లి తండ్రులు వచ్చి  తీసుకెళ్ళిపోతారేమో, లేక ఆమే విడాకులు తీసుకుని   శాశ్వతంగా  విడిపోతుందేమో..లేదా నలుగురిలో అల్లరి చేస్తుందేమో,  వీధికెక్కుతుందేమో !’అని   తలదిరిగే   గందరగోళ  ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరౌతున్న వర్ధనమ్మకి – పెరటి  బావి దగ్గర తల స్నానం చేసొచ్చిన కోడలు ఒక   ఆశ్చర్యార్ధకంగా , కాదు అర్ధం కాని జవాబులా తోచింది. అమెనలా చూసి నిర్వుణ్ణురాలైంది!   మాట రాని కొయ్యబొమ్మైంది.

క్రమం గా – కోడలి మనసుని చదవడానికి ప్రయత్నించ సాగింది.

***

అనుకున్నట్టుగానే ఆమె తరఫు  పెద్దలొచ్చారు.  ఇంట్లో జనం మూగారు. చిన్న పంచాయితీ పెట్టారు.

వర్ధనమ్మ చూస్తుండిపోయింది. న్యాయం చెప్పాలంటూ ఆవిణ్ణి నిలదీస్తూ.. కొడుకు మీద నిప్పులు కురిపించారు మాటలతో.

అప్పుడు జమున అడ్డొచ్చి, “ఆవిడ కి ఈ గొడవతో సంబంధం లేదు. ఆవిణ్ణి మీరేమీ అడగడానికి వీల్లేదు” అంటూ జవాబిచ్చింది.   ఆ మాటలకి –  ఆమె కళ్ళల్లోకి చూసింది కన్నీళ్ళతో. అది కృతజ్ఞతో..ఏమో..తెలీదు.

కన్న పిల్లలు తల్లి తండ్రులకి గర్వ కారణం గా నిలవకపోయినా ఫర్వాలేదు కానీ, ఇలా నలుగురిలో నిలదీయించే దుస్థితికి తీసుకురాకూడదు.

అప్పుడే వచ్చాడు చక్రవర్తి.  అతన్ని చూస్తూచూస్తూనే  ఆ తల్లి తలొంచుకుంది. జమున  చూపులు తిప్పుకుని, తన నిర్ణయం చెప్పింది. స్థిరంగా, చాలా బిగ్గర గా కూడా!

“ – నేనీ గడప దాటి ఎక్కడికీ వెళ్ళను. వెళ్ళలేను. ఇదే నా ఇల్లు.  నా చివరి ఊపిరి దాకా ఇక్కడే వుంటాను. ఎలా పోయినా ఫర్వాలేదు  నా ప్రాణం మాత్రం ఇక్కడ పోవాల్సిందే. నేను ఏ తప్పు చేయలేదు. నాలో ఏ దోషమూ లేదు.  నేనెందుకు  విడాకులు తీసుకోవాలి? ’ జమున డైవోర్సీ’అని అనిపించుకోవడానికా  నేనీ వివాహం చేసుకుందీ?

నా జీవితంలో జరగరాని ఘోరమే జరిగింది.  అన్యాయమే జరిగింది.  తిరిగి ఎవ్వరూ న్యాయం చేకూర్చలేనంత  అన్యాయమే జరిగింది. నేను తట్టుకులేని గా..య మే ఇది.” ఆమె గొంతు లో సుడి రేగి ఆగింది.

అయినా వదలి పోలేను.   ఎందుకంటే,  నా  కన్న బిడ్డ వున్నాడు. వాడి పేరుకి ముందు  ఈ  ఇంటి పేరుంది. వాణ్ణి చూసి మురిసే బామ్మ వుంది.  ముద్దు చేసే మేనత్తలున్నారు.  ఈ కుటుంబం  చాలు. వాడు ఆనందంగా బ్రతకడానికి. నాకింతే ప్రాప్తమనుకుంటాను. దయచేసి, ఇంకెవ్వరూ నన్నేమీ అడగొద్దు. ఏ తీర్పులూ చెప్పొద్దు.” ఉబి కొస్తున్న  దుఖాన్ని  ఆపుకుంటూ,  చీర చెంగుని నోటికడ్డుపెట్టుకుంది.

వర్ధనమ్మ తలొంచుకుని  తదేకంగా నేలని చూస్తోంది.   భూమి రెండుగా చీలితే బావుణ్ణు.  ఉన్నపళం గా  ఎవరికీ కనిపించకుండా అందులోకెళ్ళి దాక్కోవాలనుంది.  ఇంట్లో  పెద్దవాళ్ళకి   న్యాయాన్యాయాల జ్ఞానం వున్నప్పుడే –   కుటుంబంలో స్త్రీలకి నైతిక న్యాయం జరుగుతుంది.  అందుకే, ఆ దేవుడు –  ధర్మానికి స్త్రీ పేరు పెట్టి, ‘ధర్మ దేవత’ అని పిలిచాడు.

స్త్రీ మానసిక అశాంతుల్ని కుటుంబమే అర్ధం చేసుకోక పోతే,  ఇక సమాజమేం అర్ధం చేసుకుని ఆదరిస్తుంది?

ద్రౌపది అవమానం అన్యాయమని పెద్దలు ధిక్కరించి  అడ్డుకోనందుకే కదూ?  కురుక్షేత్ర యుధ్ధం జరిగిందీ?

సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది అక్కడ.

ఇక వినాల్సిందేమీ లేదు, అన్నట్టు ముందుగా –  చక్రవర్తి లేచాడు అక్కణ్ణించి.  గెలిచిన వాడిలా ఛాతీ విరుచుకుని,    తలెగరేసుకుంటూ  లోపలకెళ్ళిపోయాడు. తనెవరికీ జవాబు చెప్పాల్సిన పని లేదని అంతకు  ముందే సెలవివ్వడం తో ఎవ్వరూ అతన్ని ప్రశ్నించే సాహసం చేయలేదు.

తల్లితండ్రులు కూడా, ఆమెని వచ్చేయమంటున్నారే తప్ప, ఆమె  గాయానికి బాధ్యులైన వారికి శిక్ష ఏమిటన్నది ఎవరూ నోరిప్పి అడగడం లేదు. మన  వివాహ వ్యవస్థ లో మొగుడూ పెళ్ళాలిద్దరూ సమానమే అయినా అధిక అసమానురాలు  మాత్రం భార్యే!  ఇప్పటికీనూ ఇంతే!

వచ్చినవాళ్ళందరూ మెల్ల మెల్లగా  ఎక్కడి వాళ్లక్కడ సర్దుకున్నారు. వెళ్తూ వెళ్తూ జమున తల్లి – వర్ధనమ్మకి అప్పచెబుతూ  “వదిన గారు! దాని ఖర్మ అది అనుభవిస్తానంటోంది..బంగారం లాటి పిల్ల ని ఇలాటి.. వాడి..” అంటూ ఆగి,  తనని తాను  సంబాళించుకుంటూ , మళ్ళీ చెప్పింది అభ్యర్ధన గా.. “అమ్మాయిని ఒక కంట కనిపెట్టుకునుండండి వదిన గారు! దానికేదైనా అయితే ఈ కన్న కడుపు తట్టుకోలేదు.  మీరెప్పుడు కబురు పెడితే అప్పుడొచ్చి అమ్మాయిని తీసికెళ్తాను..” ఏక ధాటిగా ఏడుస్తూ చెప్పింది.

తలూపింది వర్ధనమ్మ. అలాటి దుర్భర పరిస్థితుల్లో కన్నతల్లి పడే క్షోభ ఏమిటొ, ఎలాటిదో ఆమె అర్ధం చేసుకోగలదు. ఆమె కూడా ఆడపిల్లను కన్న తల్లే కాబట్టి.

చిత్రమేమిటంటె – ఇంత జరుగుతున్నా, ఆవిడ పన్నెత్తి ఒక్క మాటా మాట్లాడలేదు. నోరేసుకుని,  డబాయించి, కొడుకుని వెనకేసుకొచ్చే ప్రయత్నమేమీ చేయలేదు. అందరి అత్తల్లా..కొడుకు చేసిన పాపపు పనికి కోడలే కారణమని దుమ్మెత్తి ధూళిపోసే  దుర్మార్గపు యోచనైనా  చేయలేదు.

పైపెచ్చు, రేపట్నించి కోడలు   తమతో కలిసి వుంటుందని తెలిసాక మాత్రం పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టైంది ఆవిడకి.  కానీ అప్పుడామెకి తెలీలేదు.  కోడల్ని చూడరాని స్థితిలో  చూస్తూ   మానసిక క్షోభని అనుభవించాల్సిన నరకపు స్థితి ఒకటి ఎదురవ్వబోతోందని. అదే  గనక ఊహించి వుంటే ఆవిడ ఈ ఒప్పందానికి అంగీకరించేది కాదేమో. అయితే ఆ విషయం –  ఆ తర్వాత గడిచిన రోజులకి  కదా, ఆవిడకి తెలిసింది!

***

జమున జీవన విధానం మారింది. రాత్రి మూడో ఝాము కంటె ముందే నిద్రలేచి స్నానం, పూజలు, నైవేద్యాలు కానిచ్చేస్తోంది. ఎంత చలి కాలమైనా, వడగళ్ల వానా కాలమైనా ఆమె పధ్ధతి  ఆమెదే!

ప్రతిరోజూ తల స్నానాలే! తడిజుట్టు ముడి –  వీపు మీదొక అలంకారమైపోయింది.  ఏదో సాకు చెబుతుంది, ఏకాదశనో, ద్వాదశనో, ఉత్తారాయణారంభమనో దక్షిణాయనానికి అంతిమ దినమనో .. వంకలకి అర్ధం వుండేది కాదు.  పౌర్ణమీ అమావాస్య ల దీక్షలు కఠినంగా పాటించేది.  ఉపవాసాలతో – శరీరం సగమైంది.

రాత్రిళ్ళు తనతో పాటు పిండి తింటుంటే..అడిగింది. “నీకెందుకే, ఈ చప్పటి తిండి? కమ్మగా అన్నం లో ఇంత   పప్పేసుకుని,   ఆవకాయ ముద్దతో పెరుగు నంజుకుని తినరాదూ? “ అంటూ ప్రేమగా కోప్పడింది.

కొన్ని క్షణాల  తర్వాత చెప్పింది జమున. “మీకూ నాకూ తేడా లేదు అత్తయ్యగారు. మీరూ నేనూ ఒకటే..” అంటూ ఒక పిచ్చి నవ్వు నవ్వింది.

తెల్లబోయి చూసింది కోడలి వైపు, రంగు వెలిసిన ఆ నవ్వువెనక  అంతర్భావం ఏవిటో  ఆ రాత్రి జరిగిన సంఘటనతో కానీ పూర్తి అవగాహన కాలేదు.

*****

ఆ రాత్రీ ఇలానే…నల్ల రాతి అరుగుమీదకొచ్చి కుర్చుంది. ఎంతకీ నిద్ర పట్టక.

చుట్టూ చీకటి.  గుయ్ గుయ్ మని శబ్దమేదో తనకు తోడుగా వచ్చి నిలిచింది.  వీధి దీపం ఆరిపోవడం తో కన్ను పొడుచుకున్నా బయటేమీ  కానరావడం లేదు. దూరం నించి  కుక్కల అరుపు  లీలగా వినిపిస్తోంది.  వీస్తున్న గాలి కూడా నల్లగానే వుంది.  తన మనసులా దివులుదివులు గా. ప్రకృతిలోని ఎంతటి సౌందర్యాన్నీ నిర్వీర్యం చేసి చూపించే శక్తి వెతచెందిన  మన మనసుకుంటుంది.

ఇంతలో గేట్లోంచి కారొచ్చి ఆగింది.  ‘ఈ సమయంలో వచ్చేది ఇంకెవరు? వాడే. ఆ రాక్షసుడే. ‘    గబగబా మెట్లెక్కి తన పక్కనించి   లోపలకెళ్ళిపోయాడు.  ‘తనని చూసినట్టు లేడు. అదే మంచిదైంది. లేకపోతే పలకరిస్తే ‘ఊ ‘అనాల్సొచ్చేది..ఆ బాధ తప్పింది. ’ –  అనుకుంది మనసులో.

అతని  మీంచి  గుప్ఫుమన్న సెంటు వాసన కి  చప్పున వాంతికొచ్చిన పనైంది.

“హు. ఎన్నాళ్ళైందీ, జమున జడలో మల్లెపూవు చూడక. ఇంత బారెడు జడేసుకుని,   నాలుగు వరసల

ఇంత బారు విరజాజుల  దండ ని గుత్తం గా తురుముకుని, నలగని చీరలో, చెదరని చిరునవ్వుతో నలుమూలలా తిరుగుతుండేది. పాదాలు కదిలినప్పుడల్లా కాలి మువ్వల శబ్దం సంగీతం లా వినిపించేది.  నట్టింట తిరిగిన  నా ఇంటిలక్ష్మి నేడు నిదురబొయింది..నిదురబోయింది..” వర్ధనమ్మ గుండె మరో సారి భోరుమంది.

ఒక స్త్రీ మానసిక దుఃఖ స్థితిని  సరిగ్గా అర్ధం చేసుకొనే  సహృదయత  కేవలం మరో స్త్రీకి మాత్రమే వుంటుంది. అందులో అత్తగారికి  మరింత బాగా అర్ధమౌతుంది ఏ కోడలి కష్టమైనా! కానీ,  చాలామందిలో స్వార్ధం, కపటం,  అడ్డుపడి  నీతి నిజాయితీల్ని కప్పేస్తాయి. అందుకే ఈ రోజుల్లో కాపురాలు వీధిన పడి న్యాయాన్ని  అడుక్కుంటున్నాయి.

కానీ ఈ లోపాలేవీ  వర్ధనమ్మ లో లేవు. కంటేనే కూతురా?  కోడలూ కూతురే. ఆ మాట కొస్తే వర్ధనమ్మకి ఇంకా ఎక్కువే. ఎందుకంటే,  ఆమెలో-  సగభాగం కొడుకు కూడా వున్నాడనే భావనకు,  ఆ ఫలం  – వంశోధ్ధారకుడై ఇంట వెలిసినందుకు.

ఎంత మాత్రమున ఎవ్వరు ఎలా  ఎంచుకుంటే, అంతమాత్రమే మరి ప్రేమానుబంధాలునూ. ఆత్మ సంస్కారాల ఔన్నత్యాన్ని అనుసరించి కుటుంబానుబంధాలు ఉన్నత స్థాయిని అలరిస్తాయి.  ఎప్పటికైనా కోడలి ముఖం లో మునపటి కళ చూడాలనే ఆమెలోని  ఆశా దీపం – ఇక కొండెక్కినట్టే అన్నట్టు..వినిపించింది లోపల్నించి ఓ పెనుకేక!  గోడకున్న నిలువెత్తు అద్దం భళ్లున పగిలి ముక్కలైన పెంకల శబ్దాలు ఆవిడ చెవి లోపలకొచ్చి  గుచ్చుకున్నాయి.  కొడుకు మాటలు  కర్కశం గా వినొస్తున్నాయి. “రాక్షసి..రాక్షసి..(ఎడిట్) ..అమ్మా! అమ్మా..త్వరగా రా..” కొంపలంటుకుపోతున్న ఉద్రేక స్వరం. “త్వరగా రా..ఇది చ..స్తోం..ది.. ఈ (…ఎ.) ..చస్తోంది..”

‘జరగరానిదేదో జరుగుతోంది లోపల..’ అదురుతున్న గుండెలతో  పరుగుపరుగున కోడలి గదిలోకెళ్ళింది.

పగిలిన అద్దం ముక్క పదునుకోణాన్ని తన పొట్టలోకి  నొక్కిపెట్టి,  పట్టరాని ఆవేశం తో  ఊగిపోతోంది జమున.   రక్తహీనమైన ముఖం మరింత తెల్ల గా పాలిపోయి, కళ్ళు ఎరుపెక్కి , అధరాలు వొణికిపోతూ..అరచేతుల్లోంచి కారుతున్న  రక్తాన్ని కూడా  లెక్క చేయనంత  మతిలేని స్థితిలో వుంది.

ఒక్క అంగలో   కోడలి దగ్గరకెళ్లి,  చేతుల్లోంచి గాజు ముక్కని లాగి అవతల పడేసింది. ధారలా కారుతున్న రక్తాన్ని తుడుస్తూ…“ఏమిటీ అఘాయిత్యం? ..ఆ?” అంది. కంపన స్వరంతో

తుఫానుకెగిసిన సముద్ర కెరటాల్లా  ఎగసిపడుతున్న గుండెలతో,  “నా దగ్గరకి రావద్దని చెప్పండి అత్తయ్యా..నన్ను     ముట్టుకుంటే కాల్చుకు చస్తానని చెప్పండి..”రొప్పుతూ  చెప్పింది.

అతన్లో అహం దెబ్బతింది.  “అంత చచ్చేది ఇక్కడెందుకు చావడం..ఫొమ్మను..ఎవడితో..పోతుందో..” అతని మాట పూర్తికాకముందే వర్ధనమ్మ – “నోర్మూయ్..” రౌద్రంగా అరిచింది.  –  “ఇంకొక్క మాట దాన్నేమైనా అన్నావంటే ఈ ఇంట్లోంచి దాన్ని కాదు నిన్ను వెళ్లగొడతా. జాగ్రత్త. “ మాటల్లోనే ఆమెకి ఏడ్పొచ్చేసింది. “అయినా,  దాన్ని నువ్వెప్పుడోనే చంపేసావ్ గదంట్రా? ఆ శవంతో..ఇక  నీకేం పని?..ఫో..ఫో..” హిస్టీరిక్ గా అరుస్తూ ఏడుస్తున్న తల్లి వైపు పిచ్చి చూపులు చూసాడు. ఏమీ అర్ధం కానివాడిలా  “మీ చావు మీరు చావండి ‘ అని అంటో, అక్కణ్ణించి విస్సురుగా  వెళ్ళిపోయాడు.

మరో పెళ్ళి చేసుకున్న భర్త మోసాన్ని భార్య క్షమిస్తే క్షమించవచ్చు.

కానీ, ఆ భర్తని మరిక నమ్మలేదు.

మరోసారి ప్రేమించనూ లేదు.

 

****

జమున తన మంచాన్ని   అత్తగారి గదిలోకి మార్చేసుకుంది.   “ఇవాళ్టినించీ  మీరూ నేనూ రూమ్మేట్స్ మి అత్తయ్య గారూ!” అని అంటున్న కోడలి మాటలకు బాధపడుతూ  “నన్నెందుకే ఇలా బాధపెడతావూ? నీ పిల్లాణ్ణి తీసుకుని  నువ్వు మీ వాళ్ళింటికెళ్ళిపోరాదూ? ఈ వయసులో నే నివన్నీ చూడలేనే జమునా..” అంటూ కళ్ళొత్తుకుంటుంటే..  మెల్లగా   ఆవిడ దగ్గరకొచ్చి చెప్పింది జమున.  “నన్ను క్షమించండి అత్తయ్యా..అ..ది నా వల్ల కాదు..దాని కంటే నూ నాకు మరణమే..” అంటూ తలొంచుకుని  ఏడ్చేసింది.  ఆ అబల  అసహాయతకి ఉప్పెనలా జాలి ముంచుకొచ్చింది.    గబుక్కున కోడల్ని రెండు చేతులతో దగ్గరికి  తీసుకుంది. కరిగిన రెండు గుండెల మధ్య జరిగిన సంభాషణేమో తెలీదు కానీ, ఇన్నాళ్ళు పేరుకునిపోయిన దుఖం, కట్టలు తెంచుకుని ప్రవహించింది

ఆవిడకి బాగా అర్ధమౌతోంది. ఆ కన్నీళ్ళ ప్రవాహం లో  ప్రతి బొట్టూ అవగతమౌతోంది.

***

కాలం వేగం గా కదుల్తోంది.  అంతే వేగం గా జమున చుట్టూ చీకటి కూడా – పొరలుపొరలుగా చుట్టుకుని,  మరింత దట్టమౌతోంది.

సరైన ఆహారం అందక శరీరం అంతకంతకూ క్షీణించిపోయింది. ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింది. వంట చేయడం మానేసింది. పూజలూ ఆపేసింది. అయితే  – ధ్యానం లో మునిగి,  ఒక ట్రాన్స్ లోకెళ్ళిపోతుంది. కాదంటే –   బెడ్ మీద అలా,  అటు వైపుకి తిరిగి , డొక్కలో కాళ్ళు ముడుచుకుని పడుకునుంటుంది.

ఎవరితోనూ పెదవి విప్పి మాట్లాడదు. కన్ను తెరిచి చూడదు. ఒక్క అత్త గారితో తప్ప.

డాక్టర్లూ ఏమీ చేయలేకపోయారు. మనోవ్యాధి కి మందేదీ?

జీవితం – ఒక కళాత్మకమైన వర్ణ చిత్రం. తుడిపివేతలుండకూడదు. వుంటే, ఆ బొమ్మ పనికిరాదు.

వైవాహిక జీవితాన్ని పవిత్రం గా భావించి  ప్రే మించే స్త్రీ జీవితంలో-  భర్త స్థానం కూడా అంతే.

‘తను తుడిచేయలనుకున్నా చెరగని మచ్చ పడిపోయింది. ఇక ఈ జీవి తానికి’ ఆ బొమ్మ’ పనికిరాదు. అంతె. అదంతే.’

చెప్పకనే చెబుతోంది కోడలు.

ఆవిడ లోలోన కుమిలికుమిలి కృశిస్తోంది. తనేమీ చేయలేని తనానికి, చేతకాని తనానికి.

ధనాన్ని  ఆశించే  కోడలై వుంటే –  సగం ఆస్తి  ఆమె పేర రాయించి  సరిపెట్టించేది.

విలాసాలని వాంఛించేది  అయితే –  భోగాలను సమకూర్చేది.

అధికారం కావాలనుకున్నది అయితే  – సంతోషంగా తాళం చేతులు అప్పచెప్పేది.

వాడి కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో పడేసి, ఆ పాపిష్టి దాన్ని  ఊళ్లోంచి తరిమించేస్తానంటే అందుకూ సహకరించేది.

కానీ..కానీ..దీనికి అలాటి బుద్ధుల్లో  ఒక్కటైనా లేకపోవడం తను చేసుకున్న పాపం కాదూ? తాళి కట్టిన వాణ్ణి ప్రాణం గా ప్రేమించి, వాడే జీవితమని నమ్మిన ఈ పిచ్చిదానికి – ఎలా తెచ్చిస్తుంది  కొడుకుని  మునపటి వాణ్ణి చేసి?  ఆ వెధవ  తన ద్రోహాన్ని అంత  బాహాటంగా ప్రజల కు  ప్రకటించుకున్నాక, మోసగాడిగా  పట్టుబడ్డాక –  విరిగిన దాని మనసుని ,    ఏ అబద్ధం చెప్పీ అతుకేస్తుందీ?  ఏ నాటకమాడి ఈ అమాయక జీవిని కాపాడుకుంటుందీ?

అసలు తను – కోడలి కోసం ఏం చేయగలదు? ఏం చేసి దాని ఆత్మ క్షోభని తగ్గించగల్దూ? రేయీ పగలూ ఇదే కలత. ఇదే నలత.  మనసున్న మనుషుల మధ్య హార్ధిక  సంక్షోభాలు ఇలానే వుంటాయి.

జమున ఇంకెన్నో రోజులు బ్రతకదన్న సంగతి అందరికంటే ముందే గ్రహించిన మొదటి వ్యక్తి – వర్ధనమ్మ.  దానికి మించి,

ఆమె ఆత్మ దేనికోసమో కొట్టుకులాడుతోందని,  ఏదో చెప్పాలనీ, చెప్పలేక విలవిల్లాడుతోందని పసిగట్టిందీ ఆవిడే!     ఆ వెంటే, విహ్వలితురాలై కంపించిపొతూ  కోడలి పక్కలో కుర్చుని, మంచానికంటుకుపోయిన ఆ శరీరాన్ని    పసిదాన్ని ఒళ్ళోకేసుకున్నట్టు వేసుకుంది. కళ్ళు తెరిచి చూస్తున్న జమున చెవిలో రహస్యం గా అడిగింది. “బంగారం! నీ మనసులో ఏవుందో, ఈ అమ్మకి చెప్పవూ? నీ బిడ్డ మీద ఒట్టు. నే తీరుస్తా. ” అంది పొంగుకొస్తున్న కన్నీళ్ళ మధ్య.

ఆమె కళ్ళు మెరిసాయి. పెదాలు కదిలాయి. నూతిలోంచి వినిపిస్తున్న ఆ బలహీన స్వరాన్ని ఒళ్ళంతా చెవులు చేసుకుని వింది. విన్నాక, వర్ధనమ్మ చలనం లేనిదై పోయింది.

****

ఆవిడ అనుకున్నట్టే – జమున తనువు చాలించి వెళ్ళిపోయింది.

ముత్తైదువుగా పోయింది..పుణ్యవతంటూ ఆమెని పొగుడుతున్నారు ఎవరో..ఏకాదశి పూటా వెళ్ళిపో యింది…దివ్యలోకాలకి చేరుతుంది అని  అంటున్నారు ఇంకొందరు.

వర్ధనమ్మ మౌనంగా చూస్తుండిపోయింది.

వార్త తెలిసి చక్రవర్తి ఊరునించి అప్పుడే దిగాడు. గబ గబా అడుగులేసుకుంటూ భార్య శవం దగ్గరకొచ్చి ఆగాడు.  కళ్ళు మూసుకుని ప్రశాంతంగా పడుకున్న ఆమె ముఖం లొ ఏ గత కాలపు జ్ఞాపకాలు కదిలాయో..అతని చేయి కదిలి ఆమె నుదుట్ని తాకబోతుండగా… ఒక్క తోపు తోసిన ఆ విసురుకి విస్తుబోయి చూశాడు.   వర్ధనమ్మ కఠినంగా   చెప్పింది. “వొద్దు. ముట్టుకోవద్దు. “ చేయి అడ్డంగా ఊపుతూ  ” నువ్వేం చేయొద్దు. అవన్నీ దాని కొడుకు చేస్తాడు. “ అంది.

ఆ మాటలు అతన్ని శాసిస్తున్నాయి.

చక్రవర్తి కి తలకొట్టేసిన ట్టు అయింది. అవమాన భారంతో తలొంచుకుని మెల్లగా  అడుగులేసుకుంటూ వెనకెనక్కెళ్ళాడు.

అందరూ చూస్తూనే వున్నారు. చెవులు కొరుక్కునే వాళ్ళు కొరుక్కుంటూనే వున్నారు. బ్రాహ్మలొచ్చారు. తతంగమంతా   పూర్తి చేసారు. మనవడు కుండ పట్టుకుని ముందు నడుస్తుంటే…వెనక  మోసుకెళ్తున్న పాడె, పూల జల్లుల మధ్య వూరేగి పోతున్న పుష్పపల్లకిలా కనిపించింది ఆ అత్తగారికి.  వెళ్ళిపోయింది..కనుమరుగై వెళ్ళిపోయింది.

‘అయిపోయింది. విముక్తురాలైపోయింది. ఏ జన్మ ఋణానుబంధమో ఇలా తీర్చుకున్నానా, జమునా!’ ఆవిడ మనసు ఒక్కసారిగా గొల్లుమంది.’

పని వాళ్ళ చీపుళ్ళ చప్పుళ్ళు,  పరివారం గుసగుసలతో ఇల్లు కల్లోలంగా  వుంది.

వర్ధనమ్మ నిశ్శబ్దం గా కదిలి, లోపలకొచ్చింది. ఇల్లంతా ఖాళీ అయిపోయినట్టు..తన ఉచ్వాశ నిశ్వాసలు ఈ గుహంలోంచి    భయంకరం గా ప్రతిధ్వనిస్తున్నట్టు వినిపించింది. ‘ భ్రమ..భ్రమా..అంతా భ్రమ? కాదు నిజం. నిజం. అంతా నిజం!! ‘కళ్ళు తిరిగాయో, ఏమో! సోఫాలో పడిపోయింది..గోడ మీద జమున పెళ్ళి కూతురి ఫోటో మసకమసగ్గాకనిపిస్తుంటే..

***

ఆ నాటి నించీ ఈ రోజు దాకా రాత్రిళ్ళు వర్ధనమ్మకు నిద్రుండదు. కునుకు పట్టినా, అంతలో నే భయపెట్టే పీడ కలలకి    గాభరగా లేచి కుర్చుంటుంది.  ఊపిరాడని తనానికి ఇలా పోర్టికో మెట్ల పక్కని, అరుగుమీదకొచ్చి గాలిపోసుకుని వెళ్తుంది. గతాన్ని తలచుకుతలచుకుని విలపించి  మరీ వెళ్తుంది.

గదిలోకి వచ్చి అలవాటుగా  ఎదురుగా వున్న మంచం వైపు చూసింది.  ఇందాక,  అటు తిరిగి పడుకున్న జమున ఇప్పుడు వెల్లకిలా పడుకుని, తనని చూసి నవ్వుతోంది.

గబుక్కున మంచం దగ్గరకెళ్ళి,  ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ లాలనగా అడుగుతోంది వర్ధనమ్మ.

‘ఇందుకేనా?….కొడుక్కి ఒడుగు చేయమని తొందరపెట్టావూ?..నీ కోరిక తీర్చాను కదూ?..నువ్వు సంతోషం గానే

వెళ్ళిపోయావు కదూ? నీ ఆత్మ శాంతించింది కదూ? చెప్పవూ, మా అమ్మ కదూ,  నాకు చెప్పవూ? ” పరుపు మీద తలానించి, తనలో తాను మాట్లాడుకుంటున్న తల్లి పిచ్చి చేష్టలకు కనుబొమలు ముడిచి చూసాడు చక్రవర్తి.  ‘ఇది ఎప్పుడూ వున్నదేగా’ అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు.

వర్ధనమ్మ ఇంకా ఏవేవో మాట్లాడుతూనే వుంది కోడలితో. ఆ కోడలు  ఎవరో కాదు. ఆవిడ ఛాయే!  ఒకప్పడు తను అనుభవించిన నరకానికి ప్రతి  రూపం.  ప్ర త్య క్ష్య  సాక్ష్యం. అందుకే జమున అంతరంగాన్ని అంత గా చదివి అర్ధం చేసుకోగలిగింది.

కుటుంబం నించి తను పొందలేని సాంత్వన తన వల్ల కోడలు పొందాలని తాపత్రయపడింది. శక్తికి మించినదే అయినా కోడలి ఆఖరి కోరిక తీర్చే సాహసం చేసింది.

 

*****

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

చిత్రకూటమి సహప్రయాణం

gop3

ఆ జాబిల్లి దూరం నుంచే..

saif
1
కోరికలు తీర్చుకోవడానికి బయటకు వస్తుంది
బేషరం ప్రతి తుమ్మెద ప్రతి పక్షి ప్రతి జీవి 5 <3
2

జాబిల్లికి పువ్వులకు యువతులకు తేడ ఒక్కటే
యువతులు బేషరం రోజుకో రంగు చీరలు మారుస్తారు
5 <3  <3

 
3
ఇంకా భూమ్మీద అప్పుడప్పుడు అక్కడక్కడ మేఘాలు వస్తున్నాయ్
బేషరం ఇంకా అక్కడక్కడ చున్నీలు  కనిపిస్తున్నాయ్
5 <3 <3
 
4
తన అదృష్టానికి తానే మురిసిపోయే వాళ్ళు ఎలా ఉంటారు
బేషరం ఆ వెన్నెలమెరుపుల జాబిల్లిలా ఉంటారు 5  <3
5
ఎంతలా ప్రాధేయపడి తను ఓ వరం పొందిందో బేషరం
తనివితీర నాకించుకొనే జీవితం కావాలని ఐస్క్రీం జాతీ 5 <3
6
ఎవరికి ఏ రంగు రావాలో ఆ రంగు వచ్చేస్తుంటది బేషరం
 ప్రతి పువ్వు నుంచి నిలువు పెదాల లేత గులాబితనం వరకు 5 <3
7
కొన్ని పుస్తకాల్లో నేర్చుకోకుండానే వచ్చేస్తాయి బేషరం
కోరిక కలిగించుకోవడం ఎలా అని పుస్తకాలు చదవాల్సిన పనిలేదు 5<3
8
నాది నాకున్నది నీదేం అక్కరలేదు బేషరం
ఒక పువ్వు మరో పువ్వు పరిమళం అక్కరలేదు అని చెప్తుంది 5 <3
 
9
నన్ను ఊరించిపోతుంటది బేషరం
ప్రతి రోజు ఆ జాబిల్లి దూరం నుంచే   5 <3
*

చిన్న నాటికథ 

srinath-1నేను డా. శ్రీనాథ్ వాడపల్లి.  హైదరాబాద్, బరోడా, ఫ్రాన్స్, లండన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకొని ఆయా దేశాల్లో, చుట్టుపక్కల యూరోపు దేశాల్లో, ఇంకా ఆఫ్రికా దేశాల్లోను అసోసియేట్ ప్రొఫెసర్ గా, చిత్రకారుడిగా, ఫోటోగ్రాఫర్ గా, డాక్యుమెంటరీ సినిమాల దర్శకునిగా, ఇంకా గ్రాఫిక్ డిజైనరు గా పనిచేసి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నాను. గత సంవత్సరం న్యూ మీడియా స్టడీస్ లో పరిశోధనకు పసిఫిక్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్. సాహిత్యం చదువుకోడం, తోచినప్పుడు కొత్త పంథా రచనల గురించి / పోస్ట్ మోడర్నిటీ ల గురించీ నాలో నేను ఆలోచించుకోడం అలవాటు. ఇంకా సమయమున్నప్పుడు వంటిల్లు/శాకాహారం గురించిన శోధనలు, “easy-veg, recipes with nutritional values & ingredient benefits” book with Ros Cutler.

*

 

“The ancient Greeks called love “the madness of the gods.”

Modern psychologists define it as it the strong desire for emotional union with another person.

But what, actually, is love.?

It means so many different things to different people.”

…………

వర్షం వెలిసి ఉదయం తెలుస్తోంది. తడిసిన దిన పత్రిక ఫేస్ పేజీలో ‘ప్రముఖ రచయిత  సముద్రం ఒడ్డున.. ‘ .. మరి చదవలేక పోయాను… ఐనప్పటికీ మొదటి లైన్ అప్రయత్నంగా నా మస్తకంలోకి చొచ్చుకుపోయింది.. ఏదో intuition మెదడులోంచి అప్రయత్నంగా నా ప్రాణ స్నేహితుడి వైపు ఆలోచింపచేస్తుంటే ఈ కల్పన.

…..

{ ఇందులో పాత్రలు ఇద్దరు. ఒక ఆడ ఒక మగ. ఒకరికొకరు పరిచయం లేదు. వయసు ప్రశ్న లేదు. ఇద్దరిదీ రైలు పట్టాల మాదిరి చెరో రహదారి. కానీ వారి స్వప్నాలు చేరువ. ఆమె నిత్య అన్వేషి  – అతను సదా పదాన్వేషకుడు. ప్రకృతి నేపధ్యం }

… …. …..

ఒకానొక శ్రావణంలో
నిండు పున్నమి.
ఎదురుగా సముద్రం.
మేఘాల మాటున ఉన్న అతనిని ఆమె మీటింది.
ఇద్దరి మధ్యా నిశ్శబ్దం మాటలు.
…. …. ….

ఆమె: మీరేనా ఆ చంద్రుడు?
అతడు: ఎవరు – ఆ ?
ఆమె:  గుర్తులేదా..? సముద్రం..రాత్రి.. ప్రతిబింబం..రంగుల మబ్బులు…నా చంద్రుడివే నువ్వు.. నటించకు.
అతడు: రంగుల మబ్బులు?
ఆమె: అవును. తెల్లని ధనుస్సు
అతడు: నీ మాటలు సొగసు.
ఆమె: ఇన్నాళ్లు ఏమైపోయేవు? వెతుకుతూ ఉన్నాను.
అతడు: నేనిక్కడే. ఎదురుచూపుల్లో.
ఆమె: నన్ను గుర్తు పట్టినట్టు లేదు. సంగీతం కావాలి. ఆకలేస్తోంది. నేను నేల మీదకి రాలేను. కాఫీ తెస్తావా?
అతడు: నా దగ్గిర ముఖేశ్ ఉన్నాడు. సారంగా తేరి యాద్ మే ..
ఆమె: అది ఆ గుడిమెట్ల కింద టీ బడ్డీ వానిది.
అతడు: గుడిలో దేవుడెవరు? ఇదుగో బషీర్.
ఆమె: గోడలు మన మధ్య లేవు
అతడు: జడలో పాయలుండేవి?
ఆమె: ఉండు. నక్షత్రాల్ని చూడాలి.
అతడు: చంద్రుణ్ణి చూడు, వెన్నెల పలకరిస్తుంది.
ఆమె: నేను మాట్లాడను.

Autumn-Fall-Leaves-HD-Wallpaper

……
మౌనం.
పెదవులు మెదలడం లేదు.
మౌనం.
ఆకులు చాపుకొన్న కొబ్బరి నిలువుగా.
అక్కడక్కడా ఎండిన మట్టల రాపిడి శబ్దం.
ఇసక మీద పల్చగా పరుచుకొంటున్న కెరటాల మెత్తని సద్దు.
పదేసి కాళ్ళతో
అటూ ఇటూ హడావిడిగా ఎండ్రపీతల పరుగుల చప్పుడు.
……

ఆమె: బెంగగా ఉంటోంది ఈ మధ్య. చీకటంటే భయం. నన్నంటి ఉంటావు కదూ. చుక్కల నింగి కప్పుకొందాం. పెదాలు అప్పుడైనా కదుపుతావా.
అతడు: ఆల్పనా గుర్తొస్తోంది.
ఆమె: కొబ్బరి మొవ్వులో పడిన వెన్నెల ఆకుల నునుపుల మీంచి జారి
దిగూనున్న పచ్చగడ్డి పై పడి తుళ్లుతోంది.
వెన్నెల నీడలతో కూర్చున్న జాగా అంతా మోడరన్ మొజాయిక్ ఫ్లోరింగ్ డిజైన్ లా ఉంది.
అరిటాకుల ఉగిసలాటతో మా వైపు తిరగబోయిన గాలి –
సంపెంగ గుబురులో ఇరుక్కొని
విరజాజి పొదమీదా
మల్లెమొక్క మీదా
తూలీ సోలీ మరీ మమ్మల్ని తాకుతోంది..
దూరంగా ఇంటి పెరటిగోడ వారనున్న
కూరగాయల మళ్ళలో నీటి వంకాయల మీది నిగారింపులో
వెన్నెల వింతగా మెరుస్తోంది.
పెరటి మధ్యనున్న సాల పైకప్పు
వెన్నెట్లో కిరీటంలా ఉంది.
అతడు: నువ్వు అల్పనావి. నిన్ను అలానే పిలుచుకొంటాను. ప్రేమించొచ్చా?
ఆమె:  ప్రేమించగలవా? ప్రేమించడం వొచ్చా? ప్రేమించేవా?
అతడు: లేఖలు, కథలు, కవిత్వం అన్నింట్లోనూ ఉన్నాను. ప్రేమికులకు నేను ఆదర్శం.
ఆమె:   నీ రాతలంటే నాకు పిచ్చి. నువ్వు ప్రేమికుడివి.
ఇదుగో చూడు నా బంతిపూల జడ.
నా హృదయం నిండా పరిమళం.
నాకు పూలంటే ప్రేమ.
నేను ప్రేమని.
నా ఫలకం సినీవాలి
పాయల వాలుజడ చూడు. కెరటాల నడుము మీంచి ఎలా ప్రవహిస్తోందో.

……
నిశ్శబ్దం
ఆకాశంలో వన్నెల వెన్నెల గూడు కట్టుకొంది.

ఊదా రంగు మబ్బులు నెమ్మదిగా నల్లరంగులోకి మారుతూ నక్షత్రాల్ని కనిపించనీయడం లేదు. మాటలన్నీ మౌనం వైపు పరిగెడుతున్నాయి.
….
ఆమె: నీకు మౌనం నచ్చుతుందా? నిశ్శబ్దం నచ్చుతుందా?

…..
హఠాత్తుగా ఒక చినుకు ఆమె బుగ్గ మీద పడి హృదయంలోకి జారుకొంది. దూరంగా ఆకాశం మధ్యలోకి చీల్చినట్టు మెరుపు.

ఆమె: హత్తుకో నన్ను. ప్రేమించు. ప్రేమను తెలుసుకో. నువ్వు ప్రేమికుడివని నిరూపించుకో.

……

వెలిసిన వర్షంలో పేపర్ని చేతిలో చుట్టగా చుట్టి అటు సముద్రం దిక్కు మనుషులు గుమిగూడిన చోట పోలీసుల మధ్యలోంచి వెళ్లి మిత్రుణ్ణి ఆఖరు సారి చూసుకున్నాను.

అతగాడి మొహం మీద ఒక కొత్త చెదరని చిరునవ్వు.. మరణంలో.

దగ్గర్లోని గుడిసెలో ఒకతను, రాత్రి చీకట్లో తూలుతో వర్షంలో రోడ్ దాటుతోంటే చూసేట్ట .. పంచానామాలో బహుశా అదే ఖరారు కావొచ్చు.

నేను కొండమీది గుడిలో ఏ దేముడున్నాడో చూడ్డానికి ఒక్కొక్కమెట్టూ ఎక్కడం ప్రారంభించేను.

……… …… ….

(కనీ కనిపించని పాత్రల్లో ఉన్న కుమారి కే.పి., శ్రీమాన్ వి.ఎల్.ఎన్ గార్లకు గౌరవంతో)

 

 

నానుంచి నీకు విడుదల ఇక!

mastanకృష్ణ మోహన్ ఝా మధేపురా బీహార్ లో జన్మించారు. తన వున్నత విద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి అస్సాం విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. సమయ్ కో చీర్కర్ అనే కవిత సంపుటిని హిందీలోనూ,యెక్టా హెరాయల్ దునియా అనే సంపుటిని మైథిలిలోను ప్రచురించారు. యితని కవితలు మరాఠి,మైథిలి,నేపాలి,ఆంగ్ల భాషల్లో అనువదింపబడ్డాయి.

కృష్ణ మోహన్ ఝా కవితలలో కోమల దేహంపై కాలం చేసిన లోతైన గాయాలు వుంటాయి. గాయాల గురుతులు మన సభ్య నాగరికత చేసిన అనేక అసంగతులను సంకేతిస్తాయి. మనుషులు చేసే హింస హింసను కొట్టే దెబ్బలను భరించే ప్రకృతి దుఖంతో యితని కవిత్వం కంపిస్తుంది.యేడ్చే పిల్లవాడు తన మాటలను లిఖించినట్టు,యేడ్చి యేడ్చి లేచొచ్చిన స్త్రీ లా యితని కవిత్వముంటుంది. కవిత్వ రసస్వాదనలో దాని ఆంతరంగిక లయను ఆత్మగతమై రచిస్తాడు కవి.

నిన్ను విడుదల చేస్తున్నాను
————————————-

నేను వో రాతిని తాకుతాను
వారి కలవరంలో రాళ్ళుగా మారిన
వారి గాయాలు కనిపిస్తాయి

నేను మట్టిని తాకుతాను
భూమి చర్మం చుట్టూ అల్లుకున్న
అదృశ్యపు పువ్వుల సువాసనలు చూస్తాను

నేను చెట్టును తాకుతాను
క్షితిజంలో పరుగెత్తే వ్యాకులత నదులు
పాదగురుతులు వినిపిస్తుంటాయి.

ఆకాశం వైపు చూస్తూనే
నీ వీపులో నుంచి పుట్టిన బాణం
నన్ను చీల్చుకొంటూ వెళ్ళిపోతుంది

నా చుట్టు నిశబ్దాన్ని మోగనివ్వాలి
వెళ్ళిఫో
యీ ప్రపంచంలో నాకు ముక్తి లభిస్తుంది
నీతో యేం చెప్పలేను..చెబితే
దానికి అర్థము వుండదు
నేను నిన్ను నానుంచి విడుదల చేస్తున్నాను
యింత కంటే యింకేమి చెప్పలేను

నా దేహం, కళ్ళ నుంచి
నా శరీరపు పరాగాన్ని వూడ్చుకొని
తీసుకు వెళ్ళు

నాలో యెక్కడైన నా పేరున
వో అలికిడి మిగిలి వుంటే
దోచుకు వెళ్ళు

యుగాలు నేసిన దాహపు దుప్పటిని
నా దేహంపై నుంచి లాక్కెళ్ళు

వొక అర్థవంతమైన జీవితం కోసం
యింత దుఖం తక్కువేం కాదేమో…

*

గాయంలోపలి మనిషి!

ayo

 

ప్రాచీన కావ్యాలకాలం నాటికి పూర్వులు రాసిన పురాణకథలను వర్ణనలను పెంచి  బంధాలుగా,స్వతంత్రకావ్యాలుగా రాసిన వారున్నారు.ఆధునికంగా వచనకవితల్లో ఇలాంటివి అరుదే.ఎందుకంటే ఒక కవితకు, మరోకవితకు మధ్య సారూప్యతలు,సామీప్యతలు గమనించి ప్రేరణలను అర్థం చేసుకోవడం తక్కువ.రేణుకా అయోల “ఒక హిజ్రా ఆత్మకథ”నుంచి పొందిన ప్రేరణ,సహానుభూతిని ఒక దీర్ఘకవితగామలచారు.ఇప్పుడున్న కవిత్వవాతావరణంలో అనేక  వాతావరణాలున్నాయి.”పీడన””అణచివేత”అనే బిందువులు వీటికి మాతృకలు.అది కులం,వర్గం,ప్రాంతం,జెండర్ ఏదైనా ఈ సంఘర్షణ కనిపిస్తుంది.

ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో లైంగికత కారణంగా కనీసం మనుషులుగా కూడా తోటిసమాజం గుర్తించని హిజ్రాల ఆత్మఘోష ఈ దీర్ఘకవితలో ఉంది.పౌరసత్వాన్ని “పునరుత్పత్తి”నుంచి ఎవరూ నిర్వచించలేదుగాని..ఇంత ప్రజాస్వామ్యవ్యవస్థలో పౌరులు రెండురకాలు ఆడ,మగ అనేభావన మాత్రమే ఉంది.ఈ పాదునుంచే ఈ కొత్త సంఘర్షణ  దేశంలో చర్చకు వచ్చింది.ఇది కేవలం సంఘర్షణ,చర్చను మాత్రమే కాక మానవీయతకు సంబంధించిన అనేక ప్రశ్నలను సంధించింది.జెండర్ వరుసలో చూస్తే స్త్రీకి రెండవస్థానం ,పురుషునికి మొదటి స్థానం ఉంది.ఈ స్థితిలో హిజ్రాలకు స్థానం కష్టమే.పైగా ఏహ్యభావం.కొన్ని సంవత్సరాలనుంచి యుగాలనుంచి ఈ వాతావరణం కనిపిస్తుంది.ఇతిహాసాల్లో శిఖండిలాంటిపాత్రలో ఈ స్థితిలో కనిపిస్తాయి.

సామాజిక స్థితి,ఆర్థికస్థితి,రాజాకీయ స్థితి ఈ ఏ పరిధుల్లోకి రాని హిజ్రాల జీవన సంఘర్షణను “మూడవ మనిషి”చిత్రించింది.తెలుగులో వచనకథాకావ్యాలు రావాలని కుందుర్తి కోరుకున్నారు.ఈ కవిత అలాంటిదే.”మూడవ మనిషి”అనే శీర్శిక తీసుకున్నారుకాని ‘మూడవ మనిషి”అనేపదం,ఈ ఆత్మకథను రాసిన రేవతి”కాని,కవిత రాసిన అయోల కాని ఇష్టపడరు..ఈ ఉద్యమం ప్రతిపాదించింది కూడ ఇదే.

కాకి గూట్లోంచి కోడిపిల్లలా/

నెట్టివేయబడిన బతుకులని/

ఎచరో ఒకరుగా బతకనివ్వాలి/

స్త్రీగానో పురుషుడిగానో ఉండనివ్వాలి“-(47పే)

 

మామూలు మనుషులుగా గుర్తించాలి/

మూ జాతి నిర్మాణం ఆగిపోవాలి/

ఎలాంటి ముద్రలు లేని స్వాతంత్య్రం కావాలి“-(46పే)

padam.1575x580 (2)

అయోలా కవిత నిర్ణయించుకున్న లక్ష్యం,హిజ్రాల సంఘర్షణ నిర్దేశించుకున్నది కూడా ఇదే.మూడవ మనుషులుగా కాకుండా వాళ్ల ఇష్టాలకనుగుణంగాఉండాలని.ఏహ్యాభావానికి ఎగతాళికి గురౌతున్నది ఈ గుర్తింపునుంచే.ఈ అంశాన్ని ఆవిష్కరించడం పట్ల అయోలాకు ఈ ఉద్యమం పట్ల ఉండే అవగాహన అర్థమవుతుంది.రేణుకా ఆయోలా కవిత్వంలో ఒక స్వాభావికమైన స్త్రీ ముద్ర ఉన్నది.రేవతి ఆత్మకథతో సహానుభూతిపొంది ఆగొంతుతో రాసినా ,స్వాభావికంగా స్త్రీ పార్శ్వాలు అక్కడక్కడా కనిపిస్తాయి.

అసలు ఎందుకీ ముడవ వ్యక్తి ?/తేనె తుట్టకి పొగపెట్టినట్లు/మళ్ళీ ఒక జాతిని నిర్మించడం దేనికి/వివక్షకు కొత్త దేహాలెందుకు

 స్త్రీగా ఉండనిస్తే చాలు/మామూలు మనిషిగాస్త్రీలా/బాత్రూంల దగ్గర/ఉద్యోగాల దగ్గర గుర్తిస్తే చాలు“-(44పే)

మోసగించబడ్డ ముఖాలు/శిథిలమైన దేహాలు/ముఢనమ్మకాలు/వైధవ్యాలు/పెళ్ళిళ్ళు/అందరిదీ ఒకటే చరిత్ర/శరీర చరిత్ర“-(44పే)

మొదటివాక్యంలో మూడవవ్యక్తి అవసరం లేదనే భావన,రెండులో స్త్రీగా గుర్తించడం తో పాటు స్త్రీలు ఎలా వివక్షకు గురౌతున్నారో మూడవ భావాంశం చెబుతుంది.వీటిలో స్త్రీ సంబంధమైన గొంతుక పెనవేసుకుపోయి ఉంది.కవితకు మరింత బలాన్నిచ్చింది ఇదేనేమో.ఈ కవితలో మానసికాభిప్రాయాన్ని  కవిత్వం చేయడం,ఆ సంస్పందనలను రీకార్డు చేయడం ఎక్కువ.లోపలి స్త్రీత్వాన్ని,బాహ్యంగా ఉండే పురుషత్వానికి మధ్య జరిగే సంఘర్షణ కవిత్వం చేయడం కనిపిస్తుంది.పదిహేనుభాగాలుగా ఉన్న కవిత్వంలో మొదటిది ఆముఖం లాంటిది.రెండులో మగవాడుగా పుట్టి, స్త్రీత్వం తొంగిచూడ్డం,మూడులో ఇల్లు,కాలేజీల్లో సంఘర్షణ.నాలుగులో శరీరంలోని అసంపూర్ణ లైంగికత,ట్రాన్స్ జెండర్ గా మారడానికి కలిగే ప్రేరణ,హిజ్రాగామారటం,ఒక కొత్త ప్రపంచపు క్షణికానందం,దుఃఖం,కొత్త జీవితం పై సందేహం,వెకిలి తనం వల్ల కలిగే సంవేదన.ఇంట్లో తిరస్కారం,కోరుకున్న స్త్రీగా జీవించలేని సామాజిక స్థితి,బలవంతంగానైనా బతకడానికి తలవొగ్గడం.ఉద్యొగం గుర్తింపుకోసం న్యాయపోరాటం,దానికొన సాగింపు ఇలాఉరామరికగా ఇందులోని కథను అంశాత్మకంగా చూడవచ్చు.

మగవాడిగా పుట్టి అవయవాల్లో తేడావల్ల స్త్రీగాబతకాలనుకుని,విధిలేక మూడవమనిషిగా మారి స్త్రీలాబతికే హక్కులేక అణచివేతకు విలాసాలకు గురైన,బలైన “ఆత్మకథ””మూడవ మనిషి”

ఒక భారమైన కథను నడిపినప్పటికీ కవిత్వంలో కళాత్మకత కనిపిస్తుంది.అనేక సంవేదనల్లో రాసిన వాక్యాలేకాకుండా అనేక పదబంధాలు అనుభవాన్ని,సహానుభూతిని హృదయానికి ప్రసారం చేస్తాయి.

1.ఎండుటాకుల్లా ఎగిరిపోయే/ఆలోచనలను తెల్లకాగితం మీద పేర్చాలి-(3)

2.బతుకు గోడు చెప్పుకోవాలనుకున్నప్పుడు/ఒక నిశ్శబ్దపు నీలివర్షం/నాచుట్టు పేరుకుంది“-(3)

3.చీరబొంతలో తమలపాకుల కట్టలానన్ను దాచి/సందేహంలో పడిపోయిన అమ్మ“-(5)

4.తెల్లటి గడ్డిపూవులా నిటారుగా నిలబడి/గాలికి రెక్కలిచ్చి ఆనందపడేఅది“-(15)

5.అందమైన జీవితంలా/నీలినదిలో పడవలో తేలుతున్న చంద్రవంకని/రేపటి వెలుగులోకి చూస్తున్న ఒంటరి నక్షత్రాన్ని“-(21)

6.పాదాలు నడిచీ నడిచి/దూరాలు కొలిచి కొలిచి పుళ్లు పడేవి/నమ్మకాలు కత్తిరిస్తున్న కొమ్మల్లా విరిగిపడేవి(25)

7.అమ్మ ఊరు తొలి వర్షానికి రేగిన  మట్టివాసనలా గుర్తుకొచ్చేది(28)

 

ఈ వాక్యాలన్ని ఊహాత్మకతను,కళను దాచుకున్న వాక్యాలు.అయోలా ఎక్కువగా భారతీయ ఆలంకారిక సామాగ్రిని కళాచిత్రణకు ఉపయోగిస్తారు.”ఎండుటాకులా/తమలపాకుల కట్టలా/గడ్డిపూవులా/కొమ్మల్లా విరిగిపడేవిలాంటివాటిల్లో కనిపించే”లా”ఉపమావచకాన్ని చూపుతుంది.”ఊరు వర్షానికి రేగిన మట్టివాసనలా ఉందనటంతెల్లటి గడ్డిపూవు నిలబడటాన్ని చెప్పడం“ఇవన్నీ సౌందర్య పరిశీలనకు అద్దం పడుతాయి.ఇలాంటి వాక్యాలతో పాటు సమాసాల్లాకనిపించే పదబంధాల్లో కళాత్మకత బాగాకనిపిస్తుంది.

పసితనపు యుద్ధాలు(7)అయోమయాల లోయలు(7)ఇష్తాల రెక్కలు(6)ఆకుపచ్చని చీర(6)ఆడతనం చిగుళ్ళు తొడుక్కోవడం(6)నడక రెక్కలు(13)ధైర్యపు గొడుగు(14)గాయాలపొర(15)చీకటితలుపు(22)ఆకలి చూపులు(23)వెకిలితనం చేతులు(25)పగటి రంగులు(43)ఓదార్పుకాగితాలు(45)జీవిత విత్తనం(49)ఇలాంటివి అనేకంగా కనిపిస్తాయి.ఈ సమాస బంధాలుకూడా భారతీయ ప్రాచ్యకళా సంప్రదాయానికి చెందినవే.ఇవన్నీ కవిత్వీకరణ శక్తిని చూపుతాయి.

తెలుగులో కవితాఖండికలుగా,కథలుగా హిజ్రాల జివితంపై సాహిత్యం వచ్చింది.దీర్ఘకవితగా ఈ కవితే మొదటిది.కథను చెబుతున్నప్పుడు కళాత్మకతకు అవకాశం తక్కువ.కాని అయోల కవిత సాధన దాన్ని సుసాధ్యం చేసింది.తెలుగులో దీర్ఘకవితలు రాసిన కవయిత్రులు తక్కువ.అలావచ్చిన తక్కువ కవితల్లో ఈ కవిత విభిన్నమైనదేకాదు.తనదైన కవితాత్మకతతో నిలబడగలిగేది కూడా.

*