Archives for July 2016

మేముకోరుకుంటున్నకళింగం!

 

 

చికాగో ఆటా సభలో… ఉత్తరాంధ్ర కధా ప్రయాణం పై  అట్టాడ  అప్పల్నాయుడు  ప్రసంగానికి ఇది వ్యాసరూపం    

*

         అందరికీ నా నమస్కారాలు. ఇవ్వాళ నాకెంతో ఉద్వేగంగా ఉంది.శ్రీకాకుళానికీ చికాగోకీ రాజకీయ నెత్తుటి సంబంధముంది. ఆ నెత్తుటి సంబంధమే నన్ను ఆటా సభలో పాల్గొనేట్టు చేసిందనుకుంటాను.నాకిచ్కిన సమయమ్ లో సాధ్యమయినంత మేరకు వందేళ్ళ పై బడ్డ ఉత్తరాంధ్రా కధను సంక్షిప్తంగా మీ ముందుంచుతాను.

దిక్కుపేరుతో పిలువబడే ఒక దిక్కుమాలిన ప్రాంతం…ఉత్తరాంధ్ర. కళింగాంధ్ర అనే చారిత్రాత్మక పేరు చెరిగిపోయింది. గోదావరి నుంచి మహానది దాకా కళింగాంధ్ర అంటారు. ఇవ్వాళ ఆ సరిహద్దులు కుదించుకోవాలి. మాకు గూడా ఇపుడా కళింగం   మేముకోరుకుంటున్నకళింగం.  అదేఉత్తరాంధ్ర.

ఆధునిక తొలి తెలుగుకధ !దిధ్దుబాటు’ అనంటే ఇవ్వాళ అందరూ అంగీకరించకపోవచ్చుగానీ,కళింగాంధ్ర తొలి ఆధునిక కధ మాత్రం దిధ్దుబాటు అని చెప్పే హక్కు మాకుంది. కళింగ సమాజం ప్రయాణించిన మేర కళింగ కధ కూడా ప్రయాణించింది. సంస్కరణవాదం,జాతీయోద్యమం,అభ్యుదయోద్యమం,విప్లవోద్యమం…తర్వాతి ప్రపంచీకరణ,విధ్వంశ వ్యతిరేక ప్రజాఉద్యమాల వెంట కళింగకధ నడచింది. తొలి ఆధునిక కధ వచ్చిన 1910 నాటికి కళింగాంధ్ర…జమీందారీ,ఈనాందారీ పాలనతో పాటు ఆంగ్లేయుల పెత్తనంతో ముప్పేట పాలనలో వుండేది. దాదాపు 37 చిన్నా,పెద్దా జమీందారీలు,మరికొన్ని ఈనామ్ దారీలు. ఫ్యూడల్ భావజాలం ..నిండివుంది. అగ్రవర్ణ, ఉత్పత్తేతర కులాల వారికి మాత్రమే విద్యా,ఉపాధి అవకాశాలు.

ఆంగ్లేయుల పాలన రెండు రకాల ప్రభావాలను వేసింది. వారి ఆధునిక శాస్త్రీయ భావజాలమూ,ప్రజాస్వామిక ధోరణులూ…విద్యా,ఉపాధి అవకాశాలు పొందిన ఉత్పత్తేతర కులాలపై…సంస్కరణవాద ప్రభావాన్ని వేస్తే: ముప్పేట పాలనలో కష్హ్టఫలం నష్టపోయిన ఉత్పత్తికులాల పై తమ ఉపాధికోసం సమరబాట పట్టాల్సిన స్తితి కలిగించింది. అడవిమీద హక్కు కోల్పోయిన ఆదివాసీలు సమరం చేస్తే పితూరీలన్నారు వాటిని ఆంగ్లేయులు. జమీందారీ రైతులు ఇచ్చాపురం నుండి చెన్నపురి దాకా రైతు రక్షణయాత్ర చేసారు. గ్రామీణవ్రుత్తుల వారు విధ్వంసానికి గురయ్యారు. కళింగనేల బొమ్మా,బొరుసూ స్తితి ఇది.

ఈ స్తితిలో సమాజం లోని ఫ్యూడల్ భావజాలం లోని చెడుని  వ్యతిరేకించే, ముఖ్యంగా మత మౌడ్యాన్ని,అవిద్యను,స్త్రీ పట్లవివక్షను,  బాల్యవివాహాలను  వ్యతిరేకిస్తూ సమాజాన్ని భావజాల రంగం లో సంస్కరించే సాహిత్యం 1910 నుంచీ దాదాపు 1945 దాకా వచ్చింది.గురజాడ రాసిన దిద్దుబాటు,మెటిల్డా,పెద్దమసీదు,దేవుళ్ళారా మీ పేరేమిటి…సంస్కర్తహ్రుదయం కధల్లో పైన చెప్పిన సంస్కరణవాద భావజాలమే కన్పిస్తుంది. ఆ తర్వాతి తరం రచయితలు…పూడిపెద్ది వెంకటరమణయ్య,వలివేటి బాలక్రిష్ణ్,స్తానాపతి రుక్మిణమ్మ,పిల్లలమర్రి వేదవతి,విశ్వనాధ కవిరాజు,కాలూరి నరశింగరావు,మండపాక పార్వతీశ్వరశర్మ మొదలయినవారు కూడా గురజాడ బాటలోనే,కధలు రాసారు.

నీలాటిరేవు,అమ్మోరుదేవత,క్షవరకల్యాణం,యుక్తిమాల ,దయ్యాలు వంటి శీర్షికల్తో కధలు రాసారు. స్తానాపతి రుక్మిణమ్మ…ఆనాటి నీలాటిరేవు ఆడవారికి ఒక సమావేశ స్తలంగా అనేక విశయాలు కలబోసుకునే ప్రదేశంగా యెలా ఉపయోగపడేదో కధలు రాసారు. అలాగే దయ్యాల గురించీ. ఆనాడు దయ్యం పడని ఆడది లేదని కందుకూరి గారు వ్యాఖ్యానించారంటే దయ్యాల ప్రభావం యెంతటిదో తెలుస్తుంది. ఇక,పూడిపెద్ది వారయితే ప్రజల నానుడిలోని అనేక సామెతలను కధలు చేసారు…కాకర పువ్వు వచ్చి కాళ్ళమీద పడితే,నొచ్చిందా అనడగడు,ఈ ముండ సంసారం నేను చెయ్యలేనమ్మాఅన్న సామెతతో ఒక కధ, ఓపిక ఉందని ఇద్దర్నిపెళ్ళాడితే,ఒకామె తెల్లవెంట్రుకలనూ,  మరొకామె నల్లవెంట్రుకలనూ పీకిందట…సామెత కధ. వీరు పూలగుత్తి అనే పత్రికను కూడా కధల కోసం నడిపేరు.

మొత్తానికి గురజాడ గారన్నట్టు…మంచీ,చెడుల విచక్షణ,మంచివేపు మార్చే సంస్కరణ వాదమూ ఈ తరం కధల్లో చూస్తాం.వీరిలో మరి కాస్తా ముందుకు చూసినవారు…శెట్టి ఈశ్వరరావు,పండిత అ.న.శర్మ. ఈశ్వరరావు గారి హిందూ,ముస్లిం:తిండిదొంగ కధలు,అ.న.శర్మగారి..వారసత్వం కధ కేవలం ఆదర్శవాద దృష్టి గాక,నిజ జీవితాన్ని చిత్రించి చూపాయి.

ఇక జాతీయోద్యమాన్ని చిత్రించిన కధలకు వస్తే…ఇక్కడినుండి తక్కువ కధలే వచ్చాయి. బహుశా అప్పటి రచయితలు సంస్కరణవాద భావజాల ప్రభావితులేమో. కందుకూరి ప్రభావితం చేసినంతగా అల్లూరి ప్రభావితం చేయలేదేమో. ప్రజాపోరాటాలపట్లగానీ,జాతీయోద్యమం పట్లగానీ…సంశయాలే యెక్కువేమో అన్పిస్తుంది,కాంగ్రెస్ సభ ల మీద గురజాడ వ్యంగ్య రచన…మనకు ఈ అనుమానాన్ని కలిగిస్తుంది. అయితే…జాతీయోద్యమ సందర్భాన్ని కధనం చేసిన రెండు కధలు చెప్పుకోవచ్చు…ఒకటి..బంకుపల్లి రామజోగశాస్త్రి గారి విమలాదేవి కధ,మరొకటి…గోవిందరాజు రామశాస్త్రి గారి నీళిజోళ్ళమరమ్మత్తు కధ.జాతీయోద్యమం లో పాల్గోనందుకు భర్తను వ్యతిరేకించి,భర్తను వదిలేసి ఉద్యమం లోకి నడచిన ఓ స్త్రీ కధ విమలాదేవి కధ. పాత సాంప్రదాయాలే కాదు,పాత పాలనలే కాదు దేశం మరమ్మత్తు చేయబడాలని తెలిపే కధ నీళిజోళ్ళ మరమ్మత్తు కధ.

ఇక స్వాతంత్ర్యం రావడం,మనల్ని మనం పాలించుకోవడం…ప్రజల జీవితంలో యెటువంటి మార్పు లేకపోవడం…మన స్వాతంత్ర్యం ఒక మేడిపండు,మన దారిద్ర్యం ఒక రాచపుండు అన్న స్తితిని గమనించిన రచయితలు…పాలనను విమర్శించడం,ప్రజల బాధలను వివరించడమ్…కధనం చేసారు. బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు,అవసరాల సూర్యారావు,మసూనా,భరాగో,బలివాడ కాంతారావు తదితరులు…చీకటిరోజులు,ఒడ్డుదాటినవాడు,పడగనీడ,పూర్ క్రీచర్స్,గమనశ్రమ వగయిరా శీర్షికల కధలు రాసేరు. వీరిలో అవసరాల వారి సమ్మె కధ అప్పట్లోనే  కాంగ్రేస్ పై ఇప్పటికి సరిపోయే వ్యాఖ్య చేస్తుంది. వీధులు తుడిచేవారు సమ్మె చేస్తుంటే,ఆ సమస్య పట్టించుకోకుండా…వీధులు దుమ్ముపట్టినాయని కాంగ్రేస్ వాలంటీర్లు…చీపుర్లు పట్టి వీధులు ఊడ్వడం చేస్తారు…దాన్ని వ్యాఖ్యానిస్తూ…కాంగ్రెస్ తన గత కీర్తిని తానే ఊడ్చి వేస్తోందంటాడు  రచయిత.

ఈ దశల కధలను రావిశాస్త్రి అయ్యో,అయ్యో కధలన్నారు. నిజానికి ఆయనకూడా ఆరు సారో కధలు రాసారు. గానీ త్వరలోనే మారని పాలన రీతుల వెనుక గల రాజ్య స్వభావాన్ని గుర్తించారు.బహుశా అప్పటికే వామపక్ష భావజాలం కళింగాన చోటుచేసుకోవడంతో…చాసో,రావిశాస్త్రి,కారా,శ్రీపతి వంటివారు పాలకులది ఒక వర్గమనీ,ప్రజలది ఒక వర్గమనీ..ఇది వర్గసమాజమనీ,వర్గసమాజం లో ఏదీ వర్గాతీతంగా ఉండదనీ తెలియపరిచే కధలు రాయడం జరిగింది.చాసొ గారి…కుంకుడాకు,భల్లూకస్వప్నం,బూర్జువాకుక్క,రావిశాస్త్రి గారి పిపీలికం,సారాకధలు,కారాగారి యగ్యం …అభ్యుదయ దృక్పధాన్ని అందించే కధలు. తాను యెవరో ఎరుక పొందాలనుకునే ఒక చీమకు శత్రువయిన ఒక సర్పం …తాను కష్టజీవి అని ఎరుకను కలిగించిందనీ,శత్రువుని శ్రమజీవులంతా కలిసి యెదుర్కొని హతమార్చడాన్ని ఈ కధలో చిత్రించారు.  రావిశాస్త్రి గారి పిపీలికం ఒక గొప్ప మార్క్సిస్ట్ తాత్విక కధ. దాదాపు మూడు పంచవర్ష ప్రణాళికలు ధనిక,పేదలమధ్య వ్యత్యాసాన్ని పెంచాయి.ఇటు కళింగాంధ్రలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం,తెలంగాణా సాయుధపోరాట ప్రభావం,అరసం యేర్పాటు,ఆదివాసీప్రాంతాల్లో సంగాల నిర్మాణం,పాలకవర్గవ్యతిరేక ఉద్యమ వాతావరణం నిండివుండిన కాలమ్ లో కారా మాస్టారి యగ్యం కధ వచ్చింది.తొలి తరం రచయిత- అప్పు తీర్చడానికి తన సంతానాన్ని వారసుడిగా పెంచదలచిన ఒక తండ్రిని…వారసత్వం అనే కధలో చూపిస్తే…కారా మాస్టారు…అప్పు కోసం సంతానం బానిస బతుకు బతకడానికి వీల్లేదని,సంతానాన్ని గ్రామ పంచాయితీ మండపం సాక్షిగా చంపిన ఒక తండ్రిని చూపిస్తారు. భవిష్యత్ తరం బానిసలు కాగూడదనే ఆకాంక్షతో విముక్తి పోరాటబాట నడచింది శ్రీకాకుళ రైతాంగం.దాని పూర్వదశను యగ్యం చూపింది.

ఈ కాలం లో అప్పటిదాకా మధ్యతరగతి ఇళ్ళల్లో ఉండిపోయిన కధ…వీధుల్లోకీ,బజారులోకీ,పంటపొలాల్లోకీ నడచింది..రెక్కాడితేగానీ డొక్కాడని శ్రమజీవులను,అల్పజీవులను సాహిత్యం లోకి   తీసుకువచ్చింది.

శ్రీపతి నర్తోడు,పతంజలి..మోటుమనిషి,రావిశాస్త్రి..రాకెట్టప్పారావు, కారా…అప్పల్రాముడుఆనాటి కష్టజీవులూ..కష్టఫలితాన్ని కోల్పోయిన నష్టజీవులు. సర్వేజనా సుఖినోభవంతు అని అమాయకంగా ఆశించిన గురజాడ తరం నుండి ఈ తరం…శ్రామిక జన సుఖినోభవంతన్న శ్రామికవర్గధోరణికి కధను నడిపింది.

ఆ తర్వాత శ్రీకాకుళ గిరిజన రైతాంగపోరాటం సాయుధరూపం తీసుకోవడం…ఆ పోరాటం లో మేధావులూ,ఉపాధ్యాయులూ,కవులూ పాల్గోవడం,విశాఖ విద్యార్దులు..రచయితలారా మీరెటు వేపు అని ప్రశ్నించడం,విరసం యేర్పాటు…కళింగసాహిత్యావరణం లోకి రక్తసిక్త సాయుధ గిరిజనుడొచ్చాడు. అడివంటుకుంది,ఇదేదారి,తీర్పు,పులుసు వగయిరా భూషణం గారి కధలు, నర్తోడు,నక్సలైట్ రాత్రులు వంటి శ్రీపతి కధలు,ఎన్నెస్ ప్రకాశరావ్,ప్రకాశరావ్,బి.టి.రామానుజం వగయిరా కధకులు విప్లవకధా పతాకను యెగురవేసారు.

శ్రీకాకుళాన్ని కల్లోలితప్రాంతంగా ప్రకటించడం,అడవినీ,గిరిజనగూడేలనూ దగ్దం చేయడమ్,ఎన్ కౌంటర్ పేరిట చంపడం…మొత్తానికి ఉద్యమాన్ని అణచివేయడం చేసిన ప్రభుత్వం ఇంకోవేపు సంక్షేమ పధకాల పేరిట ప్రజలకు ఆశలు రేకెత్తించి ఉద్యమానికి దూరం చేయడం ఎనభయిల నాటి కళింగ స్తితి. ఈ స్తితిని భూషణం గారి కొత్తగాలి కొన్ని కధలూ,అప్పల్నాయుడి పోడు..పోరు, కొలతలు…కధలు చిత్రించాయి.

తొంభయిలనాటికి ప్రవేశించిన సరళీకరణా,ప్రయివేటీకరణా,ప్రపంచీకరణా తమ ప్రభావాన్ని కళింగాంధ్రలో గూడా కలిగించాయి. నడువని పరిశ్రమలు (జూట్,సుగర్) ,ప్ర్రూర్తిగాని నీటిప్రాజెక్టులు, ఫైనాన్స్ కంపెనీలు,ఫోర్లైన్ల రోడ్లూ, మార్కెట్ పంటల జూదం లో ఓడిన రైతులూ, ఉపాధులు కోల్పోయిన గ్రామీణ చేతివ్రుత్తులవారూ… వలసబాట పట్టిన బతుకులు…వీటిని శ్రీకాకుళసాహితి… గావలికధలు, వంశధారకధలు, జంఝావతికధలు,వేగావతికధలు పేరిట సంకలించింది. బమ్మిడి జగదీశ్వరరావు … మట్టితీగలు, గంటేడ గౌరునాయుడు…ఒక రాత్రి రెండు స్వప్నాలు,సువర్నముఖి…సువర్నముఖి   కధలు,మరి కొందరి కధాసంపుటాలు దాదాపు దశాబ్దకాలపు మార్పుల్ని చిత్రించాయి. ఆ తర్వాత వర్తమానమ్ లో కళింగాంధ్రాలోకి విదేశీకంపెనీలతో పాటూ, ఇతరప్రాంతాల పెట్టుబడుల ప్రవాహం రావడమ్…ఇక్కడి పంటభూములను సెజ్ లుగా మార్చడం,ధర్మల్,అణువిద్యుత్ కుంపట్లు పెట్టడం,అడవీ,కొండల్లోని అపార ఖనిజాలను దొలుచుకు పోవడం,సముద్రతీరాన్ని యురేనియం కోసం, మత్స్యసంపదకోసం జల్లెడపట్టడం…ఈ పరిణామాలకు వ్యతిరేకంగా మైదాన ప్రాంతాన రైతులు, దళితులు,బహుజనులూ,అటవీప్రాంతాన ఆదివాసీలు, తీరప్రాంతాన మత్స్యకారులు పోరాడుతున్నారు.

తాము కోల్పోయే  నేలకోసం,. ఉపాధికోసం ఉద్యమిస్తున్నారు…ఈ స్తితిని.. మల్లిపురం జగదీశ్…శిలకోల,గాయం,బల్లెడనారాయణమూర్తి…ఉద్దానంకధలు,బజరా…హింసపాదు,గౌరునాయుడు…మాయ,అప్పల్నాయుడు..సందిగ్దాకాశమ్,దయ్యపుభరోసా, వంటి కధల్లో గమనించవచ్చు. అలాగే చింతకింది శ్రీనివాసరావ్, కె.యెన్.మల్లీశ్వరి,  డాక్టర్.బి.ఎసెన్.మూర్తి,పి.వి.బి.శ్రీరామమూర్తి,ఎ ఎన్ జగన్నాధశర్మ వంటివారి కధల్లో వర్తమాన కళింగజీవితాన్ని చూడవచ్చు.

ముగించే ముందుగా…కొందరు విలక్షణ రచయితల గూర్చి చెప్పవల్సివుంది. వ్యక్తుల గుణగణాల మీదా,వ్యక్తుల ప్రవర్తనల మీదా తాత్విక విమర్శగా కొన్ని కధలూ,మరికొన్ని మానవజీవితం లో యెదురయే ఘటనల గూర్చిన చింతనను తెలిపేకధలు రాసిన బలివాడ కాంతారావు గారూ,హాయి అయిన హాస్య కధలు రాసిన భరాగో గారూ,వేటకు సంబంధించిన కధలు రాసిన అల్లం శేషగిరిరావుగారూ, రాజుల శిధిలవైభోగాలను రాసిన…పూసపాటి క్రిష్ణమ్రాజు,దాట్ల నారాయణమూర్తిరాజూగారూ.. వీరితోపాటూ తప్పకా చెప్పుకోవాల్సిన విలక్షణ,విశిష్ట రచయిత పతంజలి గారు. ఈ విలక్షణ,విశిష్టరచయితల రచనలు కళింగాంధ్రా కధా పతాకకు వన్నె తెచ్చిన రచనలు.

సంస్కరణవాద భావజాలంతో ఆరంభమయిన కళింగ కధ,సమరబాటనూ నడచి..విఫలమయిన విప్లవాన్నించి వర్తమానం దాకా కళింగసమాజ ప్రయాణాన్ని చిత్రిస్తూనే ఉంది.

ఎర్ర పూల గౌను

 

 

                     -మన్నె ఏలియా

~

      డ్రెస్సింగ్ టేబుల్ నిలువుటద్దం  ముందు నిల్చొని  తన రెండు జడలను వింతగా చూసుకొంటుంది . తలను కుడి ఎడమలకు తిప్పి  జడలను   చూసుకొంది .  జడలకు కట్టిన తెల్లని రిబ్బన్లు ఫ్యాన్ గాలికి రెపరెప లాడుతున్నాయి . తలను పైకి కిందికి కదిలించినప్పుడు రిబ్బన్ల విన్యాసం చూసి సంబరపడిపోతోంది. రెండు చేతులతో జడలను  పైకెత్తి పట్టుకొని సంతోషంతో గంతులేస్తుంది . తైల సంస్కారం లేక ఎండిపోయిన గడ్డిపోసల్లాంటి వెంట్రుకలు తలమీద నాట్యం చేస్తున్నాయి .  వేళ్ళతో దువ్వుకొంది . అరచేతితో అదిమి పట్టిచూసింది . చేయి తీయగానే ఎప్పటిలాగానే లేచి నిల్చున్నాయి . కొన్ని ఎగిరి నొసటి  మీద పడుతున్నాయి . చింపిరి జుట్టుకు నూనె రాసుకుందామనుకుంది . ఏదో అలోచించి విరమించుకొంది . అద్దం ముందు నుండి కదలాలనిపించడంలేదు. ఇదే మొదటి సారికావడంతో ఎన్నడు పొందని అనుభూతితో  అద్దంలో చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటుంది  .

పాలపిట్ట రంగు గౌను మీదున్న ఎర్రని పువ్వులను, చిన్న చిన్న ఆకులను , లేత మొగ్గలను తడిమి చూసుకుంది .  బర్తడే గౌనది . పుట్టిన రోజు నాడు  కొత్తబట్టలేసుకొనే వాళ్ళను చూసినప్పుడల్లా , తనకు పుట్టిన రోజు లేదేమో అనుకునేది . ఎన్నడు రాని పుట్టినరోజు కోసం  ఇన్ని రోజులుగా  ఎదిరి చూసింది .

రోజు తిట్లతో , అరుపులతో , కేకలతో దద్దరిల్లే ఇల్లు  ఇప్పుడు ప్రశాంతంగా , నిశబ్దంగా  ఉండడంతో…

నిన్న రాత్రి తనే ఉతికి తీగ మీద ఆరేసిన  గౌను దగ్గరికెళ్ళి నిల్చుంది . అటు ఇటు చూసి చేతితితో తాకింది . పూర్తిగా  తడి ఆరలేదు . సబ్బు వాసన వస్తోంది . అక్కడక్కడ కుచ్చుల మడతలు , తేమగా ఉన్నాయి .  అయిన వేసుకోవాలనే కోరిక ఆపుకోలేక , మళ్ళి అవకాశం వస్తుందో లేదోనని  తెచ్చి వేసుకొంది . వొంటికి చల్లగా తగులుతోంది . పండుగనాడు కొత్త బట్టలేసుకొన్నంత ఉత్సాహంగా ఉంది . నడుము తిప్పి వెనుకకు ముందుకు తిరుగుతూ చూసుకొని ముర్సిపోతుంది . రోజు  పొడవైన లూజ్ లూజ్  గౌన్లేసుకోవడం వాళ్ళ , ఈ గౌను పొట్టిగుందనిపించింది . కాని బాగా నచ్చింది .

మధ్యమధ్య  కిటికి గుండా వాకిలిగేటు వైపు చూస్తుంది .    డ్రెస్సింగ్ టేబుల్ డ్రా తెర్చింది . పౌడర్ డబ్బా తీసి పౌడర్ చేతులతో ముఖంకు రుద్దుకుంది . తెల్లగా మెరుస్తుంటే గమ్మతనిపించింది . “ హీ… హీ ”  అని తనను తనే వెక్కిరించుకుంది . ముఖం బోసిపోయినట్టన్పిచ్చి నొసలు తడిమి చూసుకొంది . అటు ఇటు  చూసింది బొట్టు బిళ్ళలు కనిపించలేదు . “ పోనిలే ” అనుకుంది .

ముందుకు  వెనకకు నడచుకుంటూ కన్నార్పకుండా అద్దంలో  చూసుకుంటుంది . ఈ సామ్రాజ్యానికి నేనే వారసురాలినన్నంత ధీమగానిపించింది గౌను వేసుకొన్నందుకు . సాక్సు , బూట్లు కూడా వేసుకోవాలనిపించింది . కాని అప్పటికే సమయ మెక్కువైంది . తొందర తొందరగ విప్పేయడం కష్టమని వేసుకోలేదు . ఇంకెపుడైన వేసుకుందామనుకొంది .  ఇక గౌను విప్పేద్దామనుకుంది కాని మనసొప్పడం లేదు   .  మళ్ళి కిటికి వైపు చూసింది . ఇంకొద్ది సేపాగి విప్పేద్దామనుకొని  మళ్లోసారి అద్దంలో చూసుకుంది .   కాళ్ళను చూసుకుంది. కాళ్ళకు గజ్జెలు పెట్టుకోవాలనే  కోరిక మిగిలిపోయింది .

తలవంచి కిందకి చూసింది .  మైలబట్టి , అక్కడక్కడ చినిగిపోయి రంగు వెలసిన పొడవైన గౌను కుప్పగా పడేసి ఉంది . ‘ నాకు నువ్వద్దు పో ’ అన్నట్టు ! కాళ్ళతో కసపిస తొక్కి , ఎడమ కాలితో  పక్కకు నెట్టెసింది ఎనిమిదేండ్ల లక్ష్మి .                     *****

బయట కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది .  కిటికిలకెళ్ళి చూసింది . గుండె జల్లుమంది . గబగబా  రెండు చేతులతో  రిబ్బన్లను లాగేసింది . జడలను విప్పేసి ఎప్పటిలాగానే వెంట్రుకలని వదిలేసింది . గౌనుతో పౌడర్ తుడ్చేసుకుంది .  హమ్మయ్య ! బతికిపోయాననుకుంది . ఇదంత క్షణాల్లో జరిగిపోయింది. తలుపు తట్టుతున్న చప్పుడు వినిపించింది  . “ అమ్మగారు వస్తున్నానండి ”  అంటూ వెళ్లి తలుపు తెరచి పక్కకు  నిల్చుంది .  పట్టు చీరెలో గుడికెల్లోస్తున్న శైలజ చేతిలో  స్టీలు బుట్టలో  సగం పగలగొట్టిన కొబ్బరికాయుంది. “ ఏమిచేస్తున్నవే…జల్ది తలుపు తెరుస్తలేవు? ’’  అని కండ్లు పెద్దవి చేసి ప్రశ్నించింది .  “ ఏమి లేదమ్మగారు ” అంది .  లక్ష్మిని చూసిన శైలజ కండ్లు ఎర్రని నిప్పులై భగ్గున మండిపోయాయి . బుట్ట పక్కన బెట్టింది . లక్ష్మి చెంపలు చెల్లుమన్నాయి . కరెంటు షాక్ తగిలినట్టు గిర్రున తిరిగి కింద పడింది లక్ష్మి .  చెంప ఎర్రగా  బూరేలాగా పొంగిపోయింది . చేతి అచ్చులు స్పష్టంగా  కనిపిస్తున్నాయి . చీర కొంగు విసురుగా బొడ్లో దోపుకొని వంగి లక్ష్మి వెంట్రుకలు పట్టి లేపి , ఇంకో చెంప చెల్లు మనిపించింది .  “ ఏమే దరిద్రపు ముండ ! ఎక్కడి పనులు అక్కడే వదిలేసి , సోకులు పడ్తున్నావా? ఎంత ధైర్యమే నీకు? … నా బిడ్డ గౌనేసుకుంటావా?. ఎవని దగ్గరికి పోయి కులుకుదామనే .. ఈ సోకులు .  బద్మాష్ ముండా ఎవడేసుకోమన్నాడే ? నీ అయ్యేసుకోమ్మన్నాడే ? ….నీ అవ్వ కొన్నదనుకున్నవా ?.. దొంగ ముండా !అది నేనుకొన్న”     గయ్యి మని ఒంటి కాలుమీద లేచింది .  లక్ష్మి ఎండుటాకుల కంపించి గజగజ వణుకుతుంది . నోట మాట లేదు ఏడ్పు తప్ప.  రెండు చేతులు జోడించి,  “ అమ్మగారు తప్పయిపోయింది . గౌనిప్పేస్తాను కొట్టకండి . ఇంకెపుడేసుకోను . నీ కాళ్ళు మొక్కుతా !”  అని కాళ్ళు పట్టుకొంది . “ నువ్వేసుకున్నది మల్ల నా బిడ్డెట్లేసుకుంటదే ” అని   కాలుతో కెక్కున తన్నింది , సోలిపోయి లక్ష్మి  తల గోడకు బలంగా  తాకింది .  “ అమ్మా …!  అమ్మా…! ”    కండ్లు నులుముకుంటూ దీనంగా  ఏడుస్తుంది .  “ నోర్  ముయ్..! అవాజ్ బయటకు రావద్దు . అమ్మట అమ్మా! ఎవ్వతే నీకు అమ్మ! నాకు పుట్టినవా? ’’   పండ్లు పట పట కొరుకుతూ అరుస్తుంది   .   బలవంతంగా రెండు చేతులతో  నోరు మూసుకోని వెక్కి వెక్కి ఏడుస్తోంది  లక్ష్మి .  “  అమ్మ కావాల్నా ? పోవే పో… నీ అమ్మ పోయినకాడికే పో . అది సచ్చి నా గండానికి నిన్ను అంటగట్టి పోయింది . నువ్వు నాకెన్నేండ్ల  శనో …  నువ్వుగూడ దాని దగ్గరికే పో ..  పీడా… బోతది ”  ఆవేశంగా తిడ్తోంది .  ఏడ్పు ఎంత  దూరం వినిపించిన , శైలజ నోటికి భయపడి ఎవరు ఇటువైపు తొంగి  చూడలేదు, చూడరు  కూడా.

************

ఇంటిముందు   కారు పార్క్ చేస్తుంటే కనిపించిన  పక్కింటాయనను పలకరించి , కూతురు ప్రిన్సి చేయి పట్టుకొని లోపలికి వచ్చిండు విజయ్ .

“ ఏమైంది శైలు !  ”  అలవాటు ప్రకారం అడ్గిండు . “ దాన్నే అడ్గు …నంగ నాచి ఏడ్పులు …. సుట్టుపక్కలొల్లు విని  నేనేదో సచ్చెటట్టు కొడ్తున్నాననుకోవాలని…. ”  అంటూ కండ్లు చిట్లించుకొని   వంటగదిలోకి వెళ్ళింది శైలజ . ఒక్కసారి లక్ష్మిని జాలిగా చూసి బాత్రూమ్ లోకి వెళ్ళిండు . ప్రిన్సి టీవీ ఆన్  చేసుకొని ఛిప్స్ తినుకుంటూ సోఫాలో కూర్చొని కార్టున్ చానల్ చూస్తుంది ఇదేమి కొత్తది కాదు కాబట్టి .

గోడకు ఆనుకోని  కండ్లు మూసుకొన్న విజయ్ కు గతం గుర్తొచ్చి , మూసిన కనురెప్పల సంధుల్లోంచి  నీళ్ళ ధారలు ఉభికివస్తున్నాయి  .

లక్ష్మి ఈ కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు .  లక్ష్మి తాత మిలటరిలో  పనిచేసేవాడు . గీత ఏకైక పుత్రిక  .  పెద్ద కండ్లు , సన్నని ముక్కు , గుండ్రని ముఖం , గులాబిరంగు పెదాలు , ఆకర్షనీయమైన నవ్వు  .  తెల్లగా పొడుగ్గా అందంగా ఉండేది . మొఖంలో లక్ష్మికళ ఉట్టిపడేది . మగపిల్లలు లేనికారణంగా  ఉద్యోగం లేని విజయ్ ను ఇల్లరికం తెచ్చుకున్నారు . విజయ్ చామనచాయ ఎత్తుకు తగ్గ బరువు . వీళ్ళ ఈడు జోడు చూడ ముచ్చటగా ఉండేది .

పెళ్ళైన రెండేండ్లకు లక్ష్మి పుట్టింది .  దురదృష్టం వెంటాడడం మొదలు పెట్టింది . లక్ష్మిని ఈ భూమి మీద పడేసి ధనుర్వాతంతో కన్నుమూసింది గీత . అచ్చం గీత నోట్లోంచి ఊడిపడ్డట్టుంది లక్ష్మి . అదే రంగు అదే రూపం  .  కాని  విజయ్ జీవితంలో చీకటి అలుముకుంది . గీత అమ్మనాన్న పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిండ్రు .  గీత పోయిన దుఃఖం నుండి కోలుకోకముందే, కార్గిల్ యుద్ధం కారణంగా అందరి సెలవులు రద్దు చేయబడడంతో  లక్ష్మి తాత యుద్దంలోపాల్గొని , భీకర పోరులో  అమరుడైనాడు .  చిన్నారి లక్ష్మిఆలనా పాలన  అంత అమ్మమ్మే .                            ఏడ్చి ఏడ్చి మంచం పట్టిన లక్ష్మి అమ్మమ్మ గుండే ఒకనాటి దుర్ముహుర్తాన ఆగి పోయింది .  పసిగుడ్డు లక్ష్మి పాలు లేక, తల్లి తోడులేక చూసుకొనే వాళ్ళు లేక, తల్లడిల్లి  గుక్కపట్టి ఏడుస్తోంది . గూడు చెదరిన పక్షయ్యింది .  వొంటరి వాడైన విజయ్ ఎటు చూసిన అయోమయం .

*******

అదే కాలనీలో నివాసముండే శైలజ నల్లగుండడం వల్ల పెళ్లి సంబంధాలు రాకనో ,  వచ్చినవి నచ్చకనో ఇంటి మీదనే ఉండిపోయింది .  శైలజ మేనమామ విజయ్ కు పాత  పరిచయం  , ఒకటే కులం  కావడం వల్ల ఆ చనువుతో లక్ష్మిని చూసుకొంటుందని విజయ్ ను ఒప్పించి శైలజ నిచ్చి పెళ్లి చేసారు . అసలు కారణం విజయ్ మామ మిలటరీ లో చనిపోవడంతో , విజయ్ కు  ఉద్యోగం వచ్చింది .   వచ్చిన డబ్బులతో పెద్ద ఇల్లు కొన్నాడు .

రెండు సంవత్సరాలకు ప్రిన్సి పుట్టింది . ప్రిన్సి నల్లగా పుట్టడం ,లక్ష్మిలాగ అందంగా లేకపోవడంతో ఎప్పుడు బాధ పడుతుండేది శైలజ . అప్పటి వరకు లక్ష్మిని చూసుకొనే శైలజ లో శాడిజం మొదలైంది . ఈ ఆస్తి అంత నా ప్రిన్సీకే  చెందాలని పోరు పెట్టేది శైలజ .                             ******

కాల చక్రంలో ఎనిమిదేండ్లు గడ్చి పోయాయి .  ఎనిమిదేండ్ల లక్ష్మి జీవితంలో కొత్తబట్టలు వేసుకొందంటే ప్రిన్సి పుట్టనంత వరకే . ఆ తర్వాత శైలజ వాళ్ళ అక్క పిల్లలవి  కలర్ వెలిసిపోయి , చినిగినవి , పొట్టిగైనవే లక్ష్మివేసుకునేది . ప్రేమ , ఆప్యాయత, భద్రతా అన్ని  కరువే . ప్రిన్సిని  స్కూల్లో చేర్చేటప్పుడు  లక్ష్మిని కూడా చేరుద్దామన్నందుకు ,“ ఇంట్లో పని నువ్వు చేస్తవా? నీ తాత చేస్తడా?  అదేమన్నా చదివి కలెక్టరైతదనుకుంటున్నవా ?  ఇంకోసారిగిట అన్నావనుకో దాన్ని నిన్ను  చంపేస్తా ” నని బెదిరించింది  శైలజ . నిస్సహయంగా చూడడం తప్ప నోరెత్తే దైర్యం లేదు . నోరు తెరిస్తే తన పరిస్తితేంటో బాగా తెల్సు విజయ్ కు.

****

అందరి కన్నా ముందే లేచి ఇంటి పని , వంటపని చేయడం , బట్టలుతకడం , గిన్నెలు తోమడం  . లక్ష్మితొ  పుట్టెడు చాకిరి చేయిస్తుంది సవతి తల్లి .  బానిసల కంటే అధ్వాన్నంగా, జీతంలేని పనిపిల్లలాగున్నది లక్ష్మి జీవితం .  ఇంత చేసిన రాత్రిమిగిలిన అన్నం పెట్టేది శైలజ . అలసి పోయి చెప్పిన పని చేయకపోతే  తన్నులతో పాటు ఆ రోజు తిండి కూడా పెట్టేది కాదు .  ప్రిన్సి  , లక్ష్మి ల మద్య రెండేండ్ల వయసు తేడ . కల్సి ఆడుకోవాలని ఉండేది  ,కానీ కలవనిచ్చేది కాదు  శైలజ .

ప్రొద్దుట ఆలస్యంగా లేచే  ప్రిన్సి కి  స్కూల్ కు వెళ్ళేటప్పుడు తొందర తొందరగా  సాక్సులు , బూట్లు తొడగడం . స్కూల్ బ్యాగ్ , లంచ్ బాక్స్ , నీళ్ళ సీస మోసుకెళ్ళి ఆటోలో పెట్టి రావడం , స్కూల్ నుండి వచ్చిన తర్వాత అవన్నీ  సర్దిపెట్టడం  కూడా లక్ష్మి పనే . ఏ కొంచెం తేడా వచ్చిన , కొద్దిగ  ఆలస్యమైనా వీపు చిట్లి పోవడం ఖాయం . ఆటో కనబడకుండా పోయేంతవరకు కండ్లల్ల నీళ్ళతో నిల్చొని చూడడం , ఇంట్లో నుండి కేక వినబడగానే  కండ్లు తుడ్చుకొని పరుగెత్తుకొని రావడం  రోజు జరిగేదే .

నూనె రాసుకొని , శుభ్రంగా తల దువ్వుకొని , యూనిఫాం వేసుకొని స్కూల్ కు వెళ్ళాలనుకొనేది  లక్ష్మి . కాని ఎవరున్నారు చెప్పుకోడానికి . వినే అమ్మే వినబడనంత దూరంగా కనబడకుండా ఈ రాక్షసుల చేతుల కప్పగించి వెళ్లిపోయింది .

ఇదంతా  గుర్తుచేసుకొంటున్న విజయ్ కండ్లల్ల నీళ్ళు  జలజల కారిపోతున్నాయి. తన చేతగాని తనానికి  తనకే సిగ్గనిపిస్తోంది .

****

“ ఏడ  సచ్చిండే దీనయ్యా ! ఒర్రి ఒర్రి నా నోరే  బద్నాం కావట్టే !  ఉలుకడు పలుకడు… దీని పీడా ఎన్నడు విరుగడ చేస్తాడో  రమ్మను ” . ఉగ్ర రూపమెత్తిన శైలజ ఘర్జించింది . ఉలిక్కిపడి  కండ్లు తెర్చాడు . కండ్లు తుడ్చుకొని మెల్లగా బయటకొచ్చిండు విజయ్ .

“ ఏమైంది శైలు !ఎక్కడో పేగు కాలుతున్న వాసనస్తోంది చూడు ’’.  అమాయకంగా అన్నాడు.  “ కాల్తుంది  పేగుకాదు , నా కడుపు మండుతుంది ”  చేతిలో అగ్గి పెట్టెతో వాకింట్ల నుండి ఇంట్లోకి వస్తూ, మింగేసేల చూస్తూ కోపంతో అన్నది శైలజ .

పొగ వాసన రావడంతో వాకిట్ల  కెళ్ళిండు .  వాకిట్ల  మంటల్లో తగలబడి పోతున్న గౌనును  చూస్తూ శిలాప్రతిమలా గడ్డకట్టి నిల్చుండి  పోయాడు .  కొద్ది  దూరంలో… రెండు చిట్టి  చేతులతో గుండెలను దాచుకొని ,  ఎముకలగూడుల నగ్నంగా ముడ్చుకొని కూర్చోన్న లక్ష్మి , గోడవైపు ముఖం పెట్టి  చప్పుడు వినబడకుండా  వెక్కి వెక్కి  ఏడుస్తున్నది  . తెల్లని   వీపు మీది నల్లగా కమిలిపోయిన వాతలు తండ్రిని   వెక్కిరిస్తూ , మౌనంగా ప్రశ్నిస్తున్నాయి ..

గాలికి మంట ఎక్కువైంది . ఆ మంటల్లో లక్ష్మి జీవితం శిథిలమై , దగ్దమై,  బూడిదైపోతున్నట్టనిపించింది తండ్రి విజయ్ కు .  ఏ కన్నీళ్లు ఆర్పలేని మంటలవి .

*

తెలిసిన కథే నవల అయితే…!

 

-మణి వడ్లమాని

~

 

“అబ్బా! భారతం విప్పకు ,లేదా చేట భారతం చెప్పకు. తొందరగా అసలు సంగతి చెప్పు”  లాంటి  మాటలు మనం  సాధారణంగా వింటూ ఉంటాము. అంటే ఒక విషయం గురించి చెబుతూ మరో దానిలోకి వెళ్ళిపోవడం,లేదా దానికి అనుబంధమైన విషయం మాట్లాడటం వల్ల  మూల విషయం లోకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి.

కానీ అదే సరాసరి మూల విషయం లో నేరుగా  వెళితే? అవును, అదే వ్యాసమహర్షి రాసిన కావ్యం ‘జయేతిహాసమ్’  24 వేల శ్లోకాల భారతం, లక్షశ్లోకాలకు మించి మహాభారతం అయింది.

మూల కధ జయమ్ ని ఉపాఖ్యానానలు లేకుండా రచయత నాయుని కృష్ణమూర్తి   నవలా రూపంగా వ్యావహారికంగా,ఆధునిక దృక్పథం తో  రాసారు .

జయమ్ ఒక ఇతిహాసం. ఇది నిజంగా జరిగింది అని చరిత్ర కారులు విశ్వసించారు. ఆ నాడు  వ్యాసుడు జీవించిన కాలం లోని వారె పాండవులు,కౌరవులు  వారి మధ్య జరిగిన ఘర్షణ ఒక మహా యుద్ధానికి దారి తీసింది. తన కళ్ళముందే తన వాళ్ళందరూ సర్వ నాశనమవడం తో వ్యాసుడు క్షోబతో  ఆ పరిస్థితి రావడానికి గల కారణాలను వివరిస్తూ  జయమ్ అనే కావ్య  రచన చేసాడు.

రచయత  మాటలలో:

అయితే ఈ కావ్యం ఎక్కడా విడిగా లేదని  వ్యాసుని తరువాత ఈ కావ్యాన్ని జనమేజయుడికి  వైశంపాయనుడు కొన్ని వివరణలు,పూర్వకధలు చరిత్రలు చేర్చి భారతంగా మార్చాడని లక్ష శ్లోకాలకు పైగా ఉన్న మహా భారతం లో నే ఈ  8800 శ్లోకాలతో ఉన్న  జయమ్ ను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని వేల సంవత్సరాలనుంచి పౌరాణికులు భారతాన్ని పెంచి చెబుతున్నారు కాని అసలు మూలకధ  ఏమయి ఉంటుంది అన్న  ఆలోచన చేయలేదు.

1883- 1894  లో ఒక స్కాండేవియన్ సాహిత్య వేత్త సోరెన్-సోరన్ సన్ మహా భారతం నుండి మూల కధను వేరు చేసే ప్రయత్నం మొదలు పెట్టాడు. లక్ష శ్లోకాలనుండి 27 వేల శ్లోకాలు వేరు చేసి  ఆ క్రమం లో దాన్ని 7-8  వేలకు తగ్గించే సమయం లో ఆయన మరణించాడు.  ఆ తరువాత 80 ఏళ్ళకి గుజరాత్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అహమ్మదాబాదు బ్రాంచి  గౌరవ డైరెక్టర్  ప్రొఫెసర్ కే కే .శాస్త్రి ఒంటరిగానే మహాభారతం నుండి విజయవంతంగా 8801 సంస్కృత శ్లోకాలతో  ‘ జయమ్’ ని వేరు చేసారు. తరువాత గుజరాత్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు  దాన్ని ‘జయసంహిత’ గ ప్రచురించారు.

జయమ్ ను యధాతధంగా కాకుండా నవలా రూపంలో రాయాలని అనుకున్న ఉద్దేశ్యం ఇలా జరిగి ఉంటుందని ఊహించి రాసే అవకాశం కొంత స్వేచ్ఛ లబిస్తాయని.

ఇక నవల లోకి వెళితే:

తింటే గారెలే తినాలి,వెంటే  మహాభారతమే వినాలి. ఒక వేళ ఇది కల్పన అయితే మహా గొప్ప గ్రంధం, నిజం అనుకుంటే భలే అద్భుతం. మనం కూడా టైం మెషిన్ లో ఆ కాలానికి  వెళ్లి ఆ పాత్రలను చూసి కలిస్తే! అప్పుడు  అది మహాద్భుతం.

jayam

ఇక కధ మొదలు  కురుదేశపు వర్ణన తో  మొదలవుతుంది. శంతనుడికి సత్యవతికిపుట్టిన కొడుకులు చిత్రాంగదుడు,విచిత్రవీర్యుడు. వీరిద్దరూ సంతానహీనులుగా మరణించటం వల్ల వంశం  అంతరించి పోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సత్యవతి తనకి పెళ్లి కాకుండా పుట్టిన కొడుకు కృష్ణద్వైపాయనుడుని పిలిచి దేవర న్యాయం ప్రకారం  తన  కోడళ్ళ కి సంతానం కలిగేలా చేసింది  ఈ కృష్ణద్వైపాయనుడే వ్యాస మహర్షి గ ప్రసిద్ధి కెక్కాడు.

వ్యాసుడు చూస్తూ ఉండగానే అందరూ పెరిగి పెద్దవారు అయ్యారు. అన్నదమ్ముల మధ్య  రాజ్యం కోసం ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసే పరిస్థితి కి  ఏర్పడుతుంది.అందువల్ల వంశం నాశనం అవుతుందని వ్యాసునికి తెలిసినా  ఎవరూ అతని మాట వినలేదు. తన మూలంగా ఏర్పడిన కురువంశం తన కళ్ళముందే సర్వ నాశనం అవడం వ్యాసునికి క్షోభ కలిగించింది.

దాయాదుల మధ్య వైరం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ  ఏ విధంగా వినాశనానికి దారితీసిందో ఆ  చరిత్రనే  కావ్య రూపంగా తేవాలన్న ఆలోచన వచ్చింది.

మహాభారత యుద్ధం ప్రకటించబడిన మూడేళ్లు కాలం లో  దీక్షతో ఈ కావ్యాన్ని రచించాడు.

“రెండుకుటుంబాల మద్య జరిగిన ఇతివృత్తం. పాండురాజు మరణం తరువాత అడవుల్లోనుండికుంతీదేవి పాండవులను వెంట బెట్టుకొని హస్తినకు రావడం తో మొదలయ్యి కౌరవ పాండవుల మధ్య జరిగిన మహా భారత  యుద్ధం చివరి రోజు రాత్రి  అశ్వద్ధామ నిద్రపోతున్న ఉపపాండవులని చంపడం తో కధ పూర్తవుతుంది.”

ముగింపు :

గంగా నది లో తర్పణాలు వదిలి శోకం తో కుమిలిపోతున్న ధర్మరాజు తో అక్కడే ఉన్న ధృతరాష్ట్రుడు అంటాడు “ నువ్వు ఇప్పుడు ఎందుకు దుఃఖిస్తున్నావు.అర్ధం లేకుండా  వందమంది .కొడుకులని, మనవలన్ని పోగొట్టుకున్న నేను గాంధారి ఏడవాలి ‘అంటాడు. పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు  ధర్మరాజుకి చేయి అందిస్తూ “పోయిన వాళ్ళను నువ్వు ఎలాగూ చూడలేవు.జరగాల్సినది జరిగింది. అంతా విధి నిర్ణయం. తెలివిలేనివాడిలా ఏడవకు” అంటాడు.

ధర్మరాజు హస్తినలోకి అడుగు పెట్టగానే వృద్ధులు,స్త్రీలు,పిల్లలు చావగా మిగిలిన సేనలు జయమ్, జయమ్ అని అంటారు.

అది విన్న ధర్మరాజు  పెదవులు కూడా  ఆ పదానికి అర్ధం వెతుకుతున్నట్లు  జ…య…మ్ అని గొణిగాయి.

ఇక్కడ తో నవల ముగుస్తుంది

తెలిసిన కధనే నవలా రూపంగా చదవటం  కొత్తదనంగా  బావుంది. సరళమయిన బాషతో చదువుతున్నంత సేపు చాల  ఆసక్తి కరంగా ఉంది.

కొన్ని గుర్తుంచు కో దగ్గ  వాక్యాలు:

  • ఎవరు యెంత చేర్చినా కొన్నివేల సంవత్సరాల బాటు భారతం నిలబడింది అంటే అది ఆ కధ గొప్పదనం. మూల కధలో కృష్ణుడు ఒక రాజనీతిజ్ఞుడు.
  • నాగరికత ఒక స్రవంతి.పుట్టినప్పుడు చిన్న చెలమ. కాలం గడిచిన కొద్దీఎన్నో జ్ఞాన,అ జ్ఞానప్రవాహాలు ఏకమై చెలమలో చేరి ఉంటాయి. చెలమ ఏరుగా సాగి నదిగా మారి తన వేగాన్ని విస్తృతిని పెంచుకొని ఉంటుంది.
  • ఉరుములు మెరుపులు,వర్షాలు,వరదలు,ఎండలు సుడిగాలులు,పెనుతుఫానులు మానవుణ్ణి అయోమయ స్థితి లో పడ వేశాయి. పైన ఆకాశం లో మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారని నమ్మారు.
  • భయం భగవంతుడిని పుట్టించింది
  • ప్రాణికోటికి మేలు జరగడానికి చెప్పబడిన అసత్యం సత్యం కంటే గొప్పది. కీడు కలిగించే సత్యం అసత్యం తో సమానం.
  • భారతం లో ఉన్నది ఇంకెక్కడయినా ఉంటుంది. భారతం లో లేనిది ఎక్కడా ఉండదు

***

తెలుగు వాడి బావుటా !

 

సూర్య-కుమారి-గూటాల-గారు

లండన్ లో తెలుగు భాషా, సాహిత్యాలు అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు గూటాల కృష్ణ మూర్తి గారే! 88 ఏళ్ల వయసులో గత వారం విశాఖపట్నంలో జూలై 13, 2016 నాడు పరమపదించారు అన్న వార్త ఎంతో విచారం కలిగించింది. ఆయనతో నేను గడిపిన మధుర స్మృతులు మననం చేసుకుంటూ ఆయన ఈ ఆత్మీయ నివాళి సమర్పిస్తున్నాను.

అది 1980 వ సంవత్సరంలోమంచి రోజున మా మహాకవి శ్రీశ్రీ గారి కవితలని అప్పుడే హ్యూస్టన్ లో అడుగుపెట్టిన మంచి గాయని చంద్రకాంత చేత పాడించి ఓ గ్రామఫోన్ రికార్డు చేస్తే ఎలా ఉంటుందీ అనే ఆలోచన దువ్వూరి అనంత అచ్యుత నారాయణ రావు గారు అనే మా ఊరి పెద్దాయన కి వచ్చి నన్ను సంప్రదించి దానికి మహాకవి శ్రీశ్రీ గారి అనుమతి సంపాదించే బాధ్యత నా మీద  పెట్టారు. శ్రీశ్రీ గారికి ఫోన్ చేసే ధైర్యమూ, ఆ నాటి ఇండియా ఫోన్ కాల్ కి అయ్యే వంద డాలర్లు డబ్బూ నా దగ్గర లేక నేను వెంటనే శ్రీశ్రీ గారి మద్రాసు చిరునామాకి భయం, భయంగానే ఉత్తరం వ్రాశాను.  ఆయన దగ్గర నుంచి రెండు నెలలు అయినా సమాధానం రాకపోతే “గొప్ప వాళ్ళతో అంతేలే” అనుకుని ఆశ వదిలేసుకుంటూ ఉండగా లండన్ నుంచి ఓ ఉత్తరం వచ్చింది. ‘మనకి లండన్ లో ఎవరూ తెలీదే’ అని ఆశ్చర్యంగా ఆ ఎయిరోగ్రాం ఉత్తరం తెరిచి చూస్తే అది శ్రీశ్రీ గారి నుంచే! ఆయన ప్రస్తుతం లండన్ లో గూటాల కృష్ణ మూర్తి గారి ఇంట్లో ఐదారు నెలలు గా ఉన్నట్టూ , నా మద్రాసు చిరునామా ఉత్తరం ఆయనకి బట్వాడా చేయగా అందినట్టూ, చంద్రకాంత చేత పాడించడానికి అభ్యంతరం లేదు అనీ, తను అమెరికా వచ్చి దాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందా అని అడగడం ఆ ఉత్తరంలో సారాంశం.

EPSON MFP image

ఆ విధంగా నాకు గూటాల గారితో పరోక్షంగా పరిచయం అయింది. ఆ సమయంలో గూటాల గారు ఒక తెలుగు వాడు కనీ వినని ఒక మహత్తరమైన కార్య సాధనలో ఉన్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో మొదటి సారిగా ఒక కవి స్వదస్తురీతో, ఆ కవితని ప్రతిబింబించే ఉన్నత స్థాయి బొమ్మలతో సహా పుస్తక రూపంలో ముద్రించి దానికి అనుబంధంగా ఆ కవి స్వయంగా చదివిన ఆ కవిత ని ఆడియో కేసెట్ గా అనీ కలిపి ఒక అపురూపమైన కానుకగా రూపొందించడమే ఆ మహత్కార్యం.  గూటాల గారు ఎన్నుకున్న కవి మహాకవి శ్రీశ్రీ . ఆ కవిత మహా ప్రస్థానం. ఆ చిత్రకారుడు బాపు. వారిద్దరినీ,శ్రీశ్రీ గారి సతీమణి సరోజ గారినీ, తోడుగా పురిపండా అప్పల స్వామి గారినీ ఆయన లండన్ ఆహ్వానించారు. ఈ బృహత్ కార్యం తలపెట్టడానికి మరొక ప్రధాన కారణం ఆ మహా ప్రస్థానాన్ని అత్యున్నత స్థాయి ప్రచురణని పరిశీలనకి పంపించి తద్వారా మహాకవి శ్రీశ్రీ గారికి నోబెల్ బహుమానానికి ప్రయత్నం చెయ్యడం. ఆయన ప్రణాళిక ప్రకారం శ్రీశ్రీ గారు సతీ సమేతంగా లండన్ లో గూటాల గారి ఇంట్లో ఆరు నెలలు ఉన్నారు. ఆయన ఆశయాలకి అనుగుణంగా బాపు గారు ఎంతో స్ఫూర్తితో వేసిన నాలుగే నాలుగు అద్భుతమైన బొమ్మలతో “మహా ప్రస్థానం” ఆడియో కేసెట్ తో సహా 1981 లో ప్రచురించబడింది. అమెరికాలో ఆ పుస్తకాన్ని కిడాంబి రఘునాథ్ గారు పంపిణీ చేశారు. కేవలం 100  కాపీలు మాత్రమే ముద్రించబడిన ఆ అపురూపమైన పుస్తకం 90 వ కాపీని నాకు గూటాల గారు స్వయంగా నా కోరిక మీద హ్యూస్టన్ వచ్చి నాకు బహూకరించారు. నా అదృష్టానికీ, ఆయన ఔదార్యానికీ ఇంత కంటే నిదర్శనం   ఏం కావాలీ?

ఆయన మా ఇంట్లో ఉన్న వారం రోజులూ మా ఆవిడ గిరిజ మీద ఎంతో అభిమానం పెంచుకున్నారు. ఇద్దరిదీ విశాఖ పట్నమే కదా! వాళ్ళ ‘యాస’ లో హాయిగా మాట్లాడుకునే వారు. పైగా శ్రీశ్రీ గారూ అక్కడి వారే. గూటాల గారు రాక ముందే శ్రీశ్రీ గారు అమెరికా రావడం, హ్యూస్టన్ లో ఆయన స్వహస్తాలతో సిప్రాలి రాయడం జరిగింది. కానీ గూటాల గారి ‘మహా ప్రస్థానం’ వెనక నోబెల్ బహుమానం ఆసక్తి ఉంది కాబట్టి గూటాల గారు ఆ సంగతులు కొన్ని నాతో పంచుకున్నారు. ఉదాహరణకి శ్రీశ్రీ గారికి నోబెల్ బహుమానానికి అంతకు ముందు ఆ బహుమానం అందుకున్న రచయితలో, ఇతర అర్హతలు ఉన్న వారు మాత్రమే ఆయన పేరు, కవిత సూచించాలి అనే నిబంధన ఉందిట. అందుకని గూటాల గారు శ్రీశ్రీ గారిని ప్రొఫెసర్ బట్లర్  ఇంటికి తీసుకెళ్లారుట. లోపల డ్రాయింగ్ రూమ్ లో కూచున్నాక బట్లర్ గారు ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళారుట. అక్కడ బల్ల మీద ఉన్న లండన్ టైమ్స్ పేపర్లో సగం పూర్తి చేసి ఉన్న క్రాస్ వర్డ్ పజిల్ శ్రీశ్రీ గారు చూసి, అది తీసుకుని పూర్తి చేశారుట. ఈ లోగా బట్లర్ గారు వెనక్కి వచ్చి ఆ పూర్తి చేసిన క్రాస్ వర్డ్ పజిల్ చూసి గుండెలు బాదుకుని ‘అయ్య బాబోయ్, నేను పొద్దున్న ఆరు గంటల నుంచీ తంటాలు పడుతున్నాను. మీరు ఎలా చెయ్య గలిగారూ?” అని ఆశ్చర్య పోయారుట. మరి శ్రీశ్రీ గారి మహా ప్రస్థానాన్ని నోబెల్ ప్రైజ్ కి పంపించే ఉంటారు కదా!

EPSON MFP image

తెలుగు కవిత తో పాటు ఇంగ్లీషులోకి ఒరిజినల్ తర్జుమా కూడా పంపించినా, ఈ వార్త తెలుసుకున్న కొందరు తెలుగు ప్రముఖులు తమ అనువాదాలు కూడా పంపించి అవే ఒరిజినల్ అని చిన్న వివాదం సృష్టించి మహా ప్రస్థానానికి లేకుండా పుణ్యం కట్టుకున్నారూ అని  కానీ తరువాత తెలిసిన వార్త. ఇక్కడ విశేషం ఏమిటంటే గూటాల గారూ, శ్రీశ్రీ గారూ కూడా ఇది ఎక్కువగా  పట్టించుకున్నట్టు లేదు. ఆ రోజుల్లో గూటాల గారితోటీ, శ్రీశ్రీ గారితోటీ కాస్తో, కూస్తో నేను సన్నిహితంగా ఉండే వాణ్ని కాబట్టి ఈ మాట  చెప్పగలుగుతున్నాను.  ఆనాటి మహాప్రస్థానం పుస్తకానికి బాపు గారు ఎంతో అరుదుగా -ముళ్ళపూడి వెంకట రమణ గారితో కలిసి కాకుండా – తనంత తనే వ్రాసిన ముందు మాట, అప్పుడు వేసిన బొమ్మలు ఇందుతో జతపరుస్తున్నాను.

ఇంతకీ గూటాల గారికి ఇంత ఆసక్తికి కారణం ఆయనకి ఆంగ్ల సాహిత్యం మీద ఇంగ్లీషు వారికి కూడా లేని పాండిత్యం ఉండడం. ఆయన జీవిత చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన 1928 లో పర్లాకిమిడిలో పుట్టారు. చిన్న తనంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు. మధ్య ప్రదేశ్ లోనూ, విజయనగరం లోనూ పెరిగి, విశాఖ పట్నం ఎవి ఎన్ కాలేజ్ లో రోజులలోనే ఆయన లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ ప్రభావానికి లోనై చదువులలో వెనకబడ్డా, 1955 లో ఆంధ్రా యూనివర్సిటీ లో ఇంగ్లీష్ లిటరేచర్  ఆనర్స్ పూర్తి చేశారు. ఆ తరువాత అమలాపురం లోనూ, మధ్య ప్రదేశ్ లో బిలాస్ పూర్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయులు గా పని చేశారు. సాగర్ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా ఉండి, 1962 లో  కేవలం గుమాస్తా ఉద్యోగం కోసం  లండన్ వెళ్ళిన గూటాల గారు అక్కడే 1967 లో డాక్టరేట్ చేశారు. తరువాత ఇన్నర్ లండన్ ఎడ్యుకేషన్ అథారిటీ సర్వీసులో చాలా విద్యాలయాలలో అధ్యాపకులు గా పని చేశారు.  విద్యావంతురాలైన వెంకట రమణ గారిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకి ఇద్దరు మగ పిల్లలు, ఒక అమ్మాయి ఉన్నారు.

EPSON MFP image

బాపు రేఖల్లో సూర్యకుమారి

ఈ జీవిత వివరాలు సాధారణంగానే కనపడవచ్సును కానీ ఆయన ఆంగ్ల సాహిత్యంలో 1890 వ దశకాన్ని ఔపోసన పట్టి ఆ విక్టోరియన్ దశకంలో వచ్చిన రచనల మీద విస్తృతమైన పరిశోధనలని చేసి ఆంగ్ల సాహిత్యంలో సుస్థిర స్థానం కలిగించారు. అలనాడు CP బ్రౌన్ వేమన కవిత్వాన్ని వెలుగులోకి తీసుకు వచ్చినట్టుగా ఫ్రాన్సిస్ థామ్సన్ కవిత్వానికి  గూటాల గారు ప్రాచుర్యం కలిగించారు. ఆయన సంస్థాపించి దశాబ్దాల పాటు నిర్వహించిన ఫ్రాన్సిస్ థామ్సన్ లిటరరీ సొసైటీ, ద 1890 సొసైటీ లు యావత్ ఆంగ్ల సాహిత్య ప్రపంచానికి ఆదర్శ ప్రాయాలుగా నిలిచాయి.  1890 దశకం లో పురి విప్పుకున్న ఫ్రాన్సిస్ థామ్సన్, రస్సెల్, టి.ఎస్. ఎలియట్, బెర్నార్డ్ షా, సోమర్సెట్ మామ్ మొదలైన వారి సమగ్ర  రచనలని, వారి జీవిత విశేషాలని ఆయన సేకరించి తన లైబ్రరీ లో పొందు పరిచారు. ఆయన నిర్వహించే ఆంగ్ల సాహిత్య సభలలో  తెలుగు కవులైన ఆరుద్ర, తిలక్ మొదలైన వారి కవిత్వాన్ని అంగ్ల కవులకి పరిచయం చేసే వారు. ఈ నాడు తెలుగు భాషని ప్రపంచ భాషగా చేసి పారేద్దామని మన వంటింట్లోనే సభలు నిర్వహించుకుంటూ జబ్బలు చరుచుకునే వారికి గూటాల వారి అలనాటి ప్రయత్నాలు కనువిప్పు కలిగించాలి కానీ గుడ్డి వాడికి లోకమంతా చీకటే కదా!

గూటాల గారి జీవితంలో అత్యంత ఆశ్చర్యకరం, ఆచరణలో మామూలు వారికి అసాధ్యం అయినది ఆయన స్వయానా ఆచరించి చూపించే గాంధేయ వాదం. నమ్మండి, నమ్మకపొండి….ప్రతీ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు, అలాగే జనవరి 30 గాంధీ వర్థంతి నాడు ఉదయం 10 గంటల నుంచీసాయంత్రం ఐదు గంటల వరకూ లండన్ లోని టావిస్టాక్ స్క్వేర్ లో ఉన్న మహాత్ముడి విగ్రహం దగ్గర కూర్చుని చరఖా తిప్పుతూ నూలు వాడికే వారు. ఇలా ఎన్నేళ్ళు చేశారో నాకు తెలీదు కానీ  అసలు భారత దేశం లోనే అందరూ మర్చిపోయిన మహాత్ముడి దివ్య  స్మృతులని   పరాయి దేశం లో ఎవరైనా, ఎక్కడైనా ఈ విధంగా మననం చేసుకుని ఆచరించే వారు ఇంకెవరైనా ఉన్నారేమో నాకు తెలీదు.

1982 లో గూటాల గారు హ్యూస్టన్ వచ్చాక, మా పరిచయం ఇరవై ఏళ్లకి పైగా ఉత్తరాల ద్వారానే జరిగింది. ఆయన చాలా చిన్న, చిన్న  ఉత్తరాలు ఎంతో ఆర్టిస్టిక్ గా వ్రాసీ వారు. ;ఇంత బాగా ఎలా రాస్తారు, గురువు గారూ ?’ అని అడిగితే ‘ఆ రోగం బాపు దగ్గర నుంచి అంటింది’ అన్నారు నవ్వుతూ. వారిద్దరికీ ఉన్న అనుబంధం మాటలకి అందనిది. నేను 2005 లో అని జ్ఞాపకం – ఓ సారి బాపు గారి ఇంటికి మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన ‘జికే’ గారి గురించి మాట్లాడి నాకు పరిచయం చేశారు. అన్నట్టు, జికే అనేది గూటాల గారి కలం పేరు. ఆ కలం పేరుతో ఆయన కథలూ, వ్యాసాలూ వ్రాసే వారు. జుబ్బా లేని అబ్బాయి, భాజ గోవిందం, కుకునం (వంట చెయ్యడం), క్లిననం (గిన్నెలు కడగడం), కననం (పిల్లల్ని కనడం) మొదలైనవి ఆయన రచనల్లో కొన్ని.  గూటాల గారు “ఋషి పుంగవుడు” “కర్మ యోగి” అన్న  అన్న బాపు గారి మా మాటలు  తర్వాత సంవత్సరం ఒక అతిముఖ్యమైన పని మీద లండన్ లో గూటాల గారి ఇంట్లో వారం రోజులు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా అనుభవం లోకి వచ్చింది.

EPSON MFP image

మా ఇద్దరినీ మరింత దగ్గరగా కలిపినది టంగుటూరి సూర్య కుమారి….ఆయనా, చాలా మంది దగ్గర వాళ్ళు పిలుచుకునే పేరు ‘సూర్య’. టంగుటూరి సూర్య కుమారి పేరు వినని వారు, ఆవిడ పాడిన శంకరంబాడి సుందరాచారి గారి ‘మా తెలుగు తల్లికీ మల్లె పూ దండ’ వినని, పాడని, పాడించని తెలుగు వారు ఉండరు. నేను ఆవిడని ఒక్క సారే చూశాను- ఆవిడ హ్యూస్టన్ వచ్చినప్పుడు. కానీ ఆవిడ మద్రాసులో కళా కారిణి గా ఎదుగుతున్న తొలి రోజులలో మా చిన్నన్నయ్య బాగా సన్నిహితుడు..– అనగా 1957 లో టాగూర్  వ్రాసిన ‘చిత్ర’ అనే చిన్న నాటకాన్ని తన పాటలతో ‘చిత్రార్జున’ అనే ఒక పెద్ద డాన్స్ డ్రామా గా రూపొందిస్తున్న రోజుల్లో దానికి దర్శకులు సింగీతం శ్రీని వాస రావు అయితే మా చిన్నన్నయ్య ప్రభాకర మూర్తి రాజు, నటుడు విజయ చందర్ అసిస్టెంట్ దర్శకులు. సూర్య కుమారి లండన్ లో స్థిరపడి 1973 లో హెరాల్డ్ ఎల్విన్ ని వివాహం చేసుకుని , కళాకారిణి గా అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకుని ఏప్రిల్ 25, 2005 న పరమపదించారు.

ఎలిజబెత్ మహారాణి తో 1968 లో ఒక సారి, 1972 లో రెండో సారి కరచాలనం చేసి , జూలై 11, 1972 నాడు బకింగ్ హం పేలస్ మధ్యాహ్న విందు భోజనం అంకితం చెయ్యబడిన ఏకైక తెలుగు …ఆ మాట కొస్తే భారతీయ కళాకారిణి టంగుటూరి సూర్య కుమారి—జికె గారికి ‘సూర్య’ గా ఆత్మీయురాలు. సంతానం లేని సూర్య కుమారి అంత్యక్రియలు గూటాల గారే నిర్వహించారు. సూర్య మరణం తరువాత ఆమె జీవిత సమగ్రంగా ఒక అద్వితీయమైన గ్రంధంలో నిక్షేపించాలి అని గూటాల గారు తలపెట్టారు. ఇలాంటివి ప్రభుత్వాలు, విశ్వ విద్యాలయాలు, పెద్ద సంస్థలూ చెయ్య వలసిన ఇటువంటి పనిని వాటి వాటి దౌర్భాగ్యానికే వదిలేసి, గూటాల గారు ఏక వ్యక్తి సంస్థ గా ఈ బృహత్ కార్యాన్ని తలకెత్తుకున్నారు. దానికి బాపు గారు కొమ్ము కాశారు. అమెరికాకి సంబంధించి సూర్య జీవిత విశేషాలు సంపాదించే గురుతర బాధ్యత ‘బాపు’ గారి సలహా మీద నాకు అప్పగించారు గూటాల గారు. “మీ గురించి బాపు గారు చాలా చెప్పారు” అన్నారు ఉపోద్ఘాతంగా ఆ ఫోన్ కాల్ చేసినప్పుడు. “నా గురించి ఆయన ఏం చెప్పారో కానీ, మీ గురించి నాకు చాలానే చెప్పారు. భలే భయం వేసింది’ అన్నాను సమాధానంగా…

మొత్తానికి 2005 లో ఆమెరికాలో సూర్య కుమారి జీవితం గురించి ఆయన సేకరించిన వివరాలు నాతొ పంచుకుని నేను చెయ్య వలసిన పనులు స్పష్టంగా ఆయన ‘విజన్’ నాకు అర్థం అయ్యేలా చెప్పారు. ఆ ప్రయత్నంలో నాకు పున:పరిచయం అయిన వారు సూర్య పిన్ని కుమార్తె, ఆమె ఇండియా రోజులలో ఇంచు మించు పెర్సనల్ సెక్రటరీ గా అన్ని వ్యవహారాలూ చూసుకునే ఇవటూరి అనసూయ గారు (బొకా రేటన్) ఒకరు. వైజాగ్ లో 1960 దశకం లో నేను ఇవటూరి అనసూయ గారింటికి వెళ్ళే వాడిని. గూటాల గారి ద్వారా మళ్ళీ మాట్లాడే అవకాశం వచ్చి. ఫ్లారిడా లో ఉన్న ఆవిడ వృద్దాప్యంలో ఇంట్లో సహాయానికి ఇండియా నుంచి వచ్చి రెండేళ్ళు ఉండడానికి ఒక నర్సుని ఇక్కడికి రప్పించడానికి నేను సహాయం చేశాను. అనసూయ గారితో మూడు వారాల క్రితం నేను మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ బాగానే ఉన్నారు కానీ ఆ తరువాత కొద్ది రోజులలో ఆవిడ అనారోగ్యంతో పరమపదించడం ఎంతో విచారకరం.

EPSON MFP image

గూటాల గారి సూచన మీద అప్పుడు హ్యూస్టన్ లో ఉండే దేవగుప్తాపు శేష గిరి రావు గారినీ, తదితరులనీ మొత్తం అమెరికాలో ‘వెతికి’ పట్టుకుని, వారి చేత సూర్య కుమారి మీద వ్యాసాలు వ్రాయించ గలిగాను. ఇంకా అనేక పద్దతులలో సూర్య కుమారి అమెరికా ఫోటోలు సంపాదించ గలిగాను. ఉదాహరణకి న్యూయార్క్ లో సూర్య కుమారి నివసించిన అపార్ట్ మెంట్ ఫోటో కి మిత్రులు కలశపూడి శ్రీని వాస రావు గారిని కోరితే ఆయన శ్రమ పడి అక్కడికి వెళ్లి ఆ రోడ్డు జంక్షన్ తో సహా ఫోటోలు తీసి పంపించారు. ఈ సమాచారం అంతా పట్టుకుని నేను 2006 లో లండన్ వెళ్లాను. ఎప్పుడో 1982 లో కలుసుకున్న తరువాత , ఫోన్ లో చాలా సార్లు మాట్లాడుకున్నా అప్పటికే 75 ఏళ్లు దాటిన గూటాల గారి ఆరోగ్య పరిస్థితి కానీ, మరే విధమైన వ్యక్తిగత వివరాలు కానీ నాకు తెలియవు. కేవలం సూర్య కుమారి పుస్తకానికి నేను సేకరించిన వ్యాసాలూ. ఫోటోలు తీసుకెళ్ళి ఆ పుస్తకం రూప కల్పన మీద పనిచెయ్యడం కోసమే నా లండన్ ప్రయాణం. అప్పటికే ఆ  పుస్తకం ఆయన నడిపే విదేశాంద్ర ప్రచురణలు, వీలుంటే వంగూరి ఫొండేషన్ ఆఫ్ అమెరికా తో సంయుక్తంగానూ ప్రచురిస్తే బావుంటుంది అనీ అనుకున్నాం. ఆ విషయాలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే బావుంటుంది కదా అని కూడా మా ఇద్దరి ఉద్దేశ్యం. లండన్ లో వారం ఉండి అక్కడి నుంచి నేను ఇండియా ప్రయాణం పెట్టుకున్నాను.

నేను అనుకున్నట్టుగా గూటాల గారు కానీ, మరెవరూ కానీ లండన్ ఎయిర్ పోర్ట్ కి రాలేదు. నేను లండన్ వెళ్ళడం అదే మొదటి సారి. ఎలాగో అలాగా కష్ట పడి, భారీ సూట్ కేసులతో లండన్ ‘ట్యూబ్’ ..అంటే అండర్ గ్రౌండ్ రైళ్ళు పట్టుకుని,  తర్వాత లండన్ కేబ్ పట్టుకుని మొత్తానికి బర్టన్ రోడ్ మీద ఉండే గూటాల గారి ఇంటికి వెళ్లి తలుపుకొట్టాను. అది ఒక టౌన్ హోమ్ …అంటే మూడు అంతస్తులలో ఎపార్ట్ మెంట్ లా ఉండే చాలా ఇళ్ళు ఒకే బిల్డింగ్ లో వరసగా ఉంటాయి. అప్పటికే ఆ పెట్టెలు మొయ్య లేక చచ్చే ఆయాసం వచ్చింది. బజ్జర్ మోగగానే స్పీకర్ లోంచి తలుపు తోసి లోపలికి వచ్చి , ఎదురుగా కనపడే మెట్లు ఎక్కి మూడో అంతస్తుకి వచ్చెయ్యండి.” అన్నారు గూటాల గారు తెలుగులో.  నేను అలాగే లోపలికి వెళ్లి, సూట్ కేసులు లోపలి గుమ్మంలో వదిలేసి మెట్లెక్కి పైకి వెళ్లాను. పైన ఒక చిన్న గదిలో పడక్కుర్చీలో నోట్లో పైపు తో గూటాల గారు నన్ను ఆహ్వానించారు. చుట్టూ కొన్ని వందల పుస్తకాలు. అంతా చిందర వందరగా ఉంది. ఓ మూల చిన్న కిచెన్. ‘కాఫీ ఇమ్మంటారా?” మెల్లిగా, అతి మెల్లిగా లేచారు గూటాల గారు. నేను బొత్తిగా ఉహించని విధంగా అడుగులో అడుగు వేసుకుంటూ కిచెన్ కేసి నాలుగే నాలుగు అడుగులు వేసి ‘గిరిజ భోజనం మళ్ళీ తినాలని  ఉంది. అప్పుడే ఇరవై ఏళ్లయి పోయింది. మీతో తీసుకు రావలసింది. బావుండును” అన్నారు.

అప్పటికి నాకు ఆయన “ఋషి పుంగవుడు, కర్మ యోగి’ అని బాపు గారు ఎందుకు అన్నారో అర్థం అవడం మొదలు పెట్టింది. ఆయన భార్యా, పిల్లలూ ఇండియా లోనూ, అమెరికాలోనూ ఉన్నారు. ఈయన ఒక్కరే, నడవ లేని పరిస్థితిలో, ఇతర కారణాలు ఎలా ఉన్నా, లేక పోయినా తను చెయ్యదల్చుకున్న సాహిత్య పరమైన కార్యక్రమాల కోసమే అనుకోవాలి- లండన్ లో చాలా ఏళ్ళుగా, ఏకాంతంగానే, జీవితం గడుపుతున్నారు. ఆయన తలపెట్టిన కార్యక్రమాలలో  టంగుటూరి సూర్య కుమారి పుస్తకం ఒకటి. 1890ల నాటి ఆంగ్ల రచయితల సమగ్ర జీవిత విశేషాలు, వారి రచనల ప్రచురణ మరొకటి. ఆ గది క్రింద అంతస్తులో మరొక చిన్న గది. అక్కడ ఒకే ఒక్క పడక. అక్కడ కూడా కొన్ని వందల పుస్తకాలు. మొత్తం కుటీరం అంతా ఇంతే! పుస్తకాల మయం. ఆ నాడు మహా కవి శ్రీశ్రీ,  బాపు , ఈ నాడు నా బోటి సర్బ సాధారణ మానవుడు ఆతిధ్యం పొందినది అక్కడే. ఎవరైనా ఇంటికి వస్తే గూటాల గారు ఎక్కడ నిద్ర పోతారో తెలియదు. పై గదిలో ఆయన పడక్కుర్చీ పక్కనే డజన్ల కొద్దీ ఫైల్స్ లో సూర్య కుమారి పుస్తకానికి ఆయన ఎలా సేకరించారో తెలియదు కానీ, మొత్తం మెటీరియల్ అంతా అద్భుతంగా ఆర్గనైజ్ చేసి ఉంది. మరో బల్ల మీద నేను ఆయనకీ అప్పుడప్పుడూ పంపిస్తున్న మా పుస్తకాలు అన్నీ ఉన్నాయి. అన్నింటి కన్నా పైన బాపు గారి తిరుప్పావై ఉంది. మరో మూల..అవును గాంధీ గారి చరఖా..దాని మీద ఒక పూల దండ!

EPSON MFP image

బాపు మాట

ఆ తరువాత వారం రోజులూ ఇద్దరం సూర్య కుమారి పుస్తకం మీదే పనిచేశాం. ఒకే ఒక్క సారి కష్టపడి బయటకి వచ్చి బస్సులో వెళ్లి కూరలు, మందు సామగ్రి కొనుక్కుని వచ్చాం. ఆయనకీ చాలా ఇష్టమైనదీ, రోజూ వండుకునేదీ తోటకూర పప్పు. అది మోపులు, మోపులు కొన్నారు. బిల్లు నేను చెల్లిస్తానంటే ‘కాదంటానా? సూర్య పుస్తకానికి ఆ డబ్బు వాడుకుంటాను’ అన్నారు. ఆ వారం రోజులలోనూ, ఆయన వ్రాసిన కథలు – ఆయా పత్రికలలో ఉన్నవి చదివాను. “మీ  లైబ్రరీ లో ఉన్న 1890 ల నాటి ఆంగ్ల కవుల పుస్తకాల విలువ ఎంత ఉంటుంది సార్ ?” అని అడిగితే “ఏమో కానీ ఒక మిలియన పౌండ్స్ కి ఇన్స్యూరెన్స్ చేశాను” అన్నారు…నా గుండె గుభేలు మనేలా. అవే కాదు. ఆయన దగ్గర ఉన్న అపురూపమైన కలెక్షన్ లో సరోజినీ నాయుడు గారు కవిత్వం వ్రాసుకున్న ఒక పెద్ద పుస్తకం. ఆ మహా కవయిత్రి స్వదస్తూరీతో, అక్కడా, అక్కడా కొట్టి వేతలు, మార్పులు, చేర్పులతో, ఆ నాటి ఇంక్ లో ఉన్న ఆ మేనుస్క్రిప్ట్ పేజీలు నా చేతులతో తిరగేస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయో? ఏమిటో? గూటాల గారి లాంటి కారణ జన్ములు సేకరించిన అటువంటి అపురూప సంపదని దాచుకునే అదృష్టం ఉండీ,  ఆ అవకాశాలు అంది పుచ్చుకుని గర్వించే ఆలోచనలు లేని దౌర్భాగ్యులు తెలుగు వారు అని అప్పుడప్పుడూ నాకు అనిపిస్తూ ఉంటుంది. బతికి బావుంటే ఏనాడైనా ‘తెలుగు సారస్వత భవనం” అనే నిర్మాణం చేసి మన సాహితీవేత్తలు వాడిన వస్తువులు, స్వదస్తూరీతో ఉన్న వారి రచనలు మొదలైనవి పదిల పరచాలని నాకు ఎంతో కోరికగా ఉంది.  కానీ అమరావతిలో అంగుళం కూడా ఖాళీ లేదు అలాంటి వాటికి!

EPSON MFP image

మొత్తానికి సూర్య కుమారి పుస్తకం మెటీరియల్ అంతా మద్రాసు లో బాపు గారికి అందించడం నాకు గూటాల గారు నిర్దేశించిన పని. మా ఇద్దరికీ సంయుక్త ప్రచురణ మీద ఒప్పందం కుదరక పోయినా నాకు ఇబ్బంది కలగ లేదు. ఒక మహత్కార్యం లో, బాపు గారు, గూటాల గారు లాంటి మహానుభావుల దిశానిర్దేశం లో ఒక చారిత్రక పుస్తక ప్రచరణ లో అతి చిన్న పాత్ర వహించగలగడమే నా పూర్వ జన్మ సుకృతం. నేను చేసిన సహాయానికి గూటాల గారు “Suryakumari-Elvin” అనే 270 పేజీల పుస్తకం Acknowledgements లో ఒక కృతజ్ఞతా వాక్యం వ్రాశారు. అది చాలు. ఇందుతో పాటు ఆ అపురూపమైన గ్రంధం ముఖ చిత్రం. బాపు గారు వేసిన సూర్య కుమారి చిత్రం, సూర్యకుమారితో గూటాల గారి ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.

EPSON MFP image

లండన్ లో 2006 తరువాత ఆపుడప్పుడు ఫోన్ లో పలకరించుకుంటూనే ఉన్నా, 2012 లో ఒక సారి లండన్ వెళ్ళినప్పుడు డా. వ్యాకరణం రామారావు గారు, వింజమూరి రాగ సుధా, నేనూ ఆయన్ని చూడడానికి వెళ్లాం. మళ్ళీ 2014 లో లండన్ లో నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సందర్భంగా ఆయన్ని ప్రధాన అతిథిగా సత్కరించడానికి నేనూ, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారూ, డా. దాసోజు రాములు గారూ ఆయనింటికి వెళ్లాం. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఎక్కడికీ వెళ్ళే శారీరక పరిస్థితి లేదు. అయితే అందరం కలిసి గూటాల గారితో CP బ్రౌన్ సమాధి దర్శించుకున్నాం. Wheelchairలో తీసుకు వెడుతున్నా ఆ మాత్రం కదలిక కూడా  భరించ లేక ఆ సమాధికి ఆయన దూరం నుంచే నమస్కారం పెట్టుకున్నారు. అదే నేను ఆయన్ని ఆఖరి సారి చూడడం.

కొన్ని నెలల క్రితం ఆయన కుటుంబం ఆయన్ని విశాఖపట్నం తరలించినట్టు యార్లగడ్డ గారి ద్వారా తెలిసింది. ఈ వ్యాసం లో కొన్ని విషయాలు ఆయన ద్వారా నాకు తెలిసినవే!.  వచ్చే నెల ఇండియా వెళ్ళినప్పుడు గూటాల గారిని చూద్దాం అనుకుంటూ ఉండగానే ఆయన నిర్యాణ వార్త తెలిసింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. జికె అనే గూటాల కృష్ణ మూర్తి గారికి ఈ అశ్రు నివాళి అర్పిస్తున్నాను..

*

చెరగదు ఆ దస్తూరి!

Gutala (1)

 

-జగద్ధాత్రి

~

జనవరి 4 2004 మోజాయిక సాహితీ సంస్థ రిజిస్టర్ అయి స్థాపించబడిన రోజు. ఆరోజే రామతీర్థ తెలుగు లోకి అనువాదం చేసిన టి.ఎస్. ఇలియట్ ‘ద వేస్ట్ లాండ్’ ‘వృధాత్రి’ పేరిట ఆవిష్కరణ. ఆరోజు హోటల్ మేఘాలయ లో రోజంతా జరిగిన సాహిత్య సభలో ఎందరెందరో మహానుభావులు, సాహితీ మూర్తులు. ప్రఖ్యాత కవి కె. శివారెడ్డి , అద్దేపల్లి, ఆదేశ్వరరావు గారు, ఇంకా ఎందరో. సభకు ప్రత్యేక ఆకర్షణ లండన్ నుండి వచ్చిన గూటాల కృష్ణ మూర్తి గారు. ఆరోజు ఆయనని , అచ్యుతరామరాజు గారిని గులాబీ మాలలతో సత్కరించుకోవడం మా సాహిత్య సంస్థకు
శుభారంభంగా భావించాము.

అనువాదాల ఆవశ్యకతను గూర్చి కొన్ని మాటలు మాట్లాడేరు గూటాల. ఇక ఆరోజు సాయంత్రం మా సాహితీ మిత్రుడు ప్రముఖ కవి ఏవిఆర్ మూర్తి తీసుకువెళ్లగా గూటాల దంపతులను దర్శించుకున్నాం, నేను శివారెడ్డి గారు ఇంకా కొందరు సాహితీ మిత్రులు. ఎంతో ఉత్సాహం తో సిగరెట్టు తాగుతూ ఆయన చెప్పిన కబుర్లు ఇప్పటికీ గుర్తు న్నాయి. శ్రీశ్రీ లండన్ వచ్చినప్పుడు తాను వచ్చిన పనిని కొంత వెనుక బెట్టినట్టు ఒక నాడు జి.కె. కి అనిపించి ,  ఆమాటే అంటే ఆ తర్వాత తాను వచ్చిన పని పూర్తి చేసేవరకు శ్రీశ్రీ మందు సేవించలేదని, చివరికి తను ఉండలేక బీరు
తాగేవాడినని, కనీసం అది కూడా తాగ కుండ పని పూర్తి చేసి అప్పుడు తాగాడు శ్రీశ్రీ అని చెప్పారు. శ్రీశ్రీ కోసం ఒక గదిని ప్రత్యేకంగా పెట్టి
అందులో ఆయనకి కావల్సిన మదిరను ముందే ఏర్పాటు చేసానని నవ్వుతూ చెప్పేరు.
ఆయనతో ఉన్న ఆయన శ్రీమతి తో కూడా నేను కాసేపు ముచ్చటించాను. ఎందుకంటే అక్కడ ఉన్న వారందరిలోనూ మహిళను నేనొక్కతినే. ఆమె తో మాట్లాడుతూ ఉంటే ఎన్నో కబుర్లు. ప్రొఫెసర్ గా పని చేసిన ఆమె కూడా విద్యావేత్త, కావడం గొప్ప విషయం. అయితే ఆవిడ సైన్స్ ప్రొఫెసర్ . నాతో జి.కె. సాహిత్య పిచ్చి గురించి ఆవిడ కంప్లెయింట్లు ప్రేమగా చెపుతుంటే భలే మధుర స్మృతిగా మిగిలింది
ఆరోజు మా మదుల్లో ఇప్పటికీ.

‘ఫ్రాన్సిస్ థామ్సన్’ 1890 లలో పుట్టి 1907 లో మరణించిన గొప్ప ఇంగ్లీషు కవి. అతని గురించి పరిశోధన చేశారు జికె. అంతే కాదు ఫ్రాన్సిస్ థామ్సన్
సోసైటీ పెట్టి కొన్నాళ్లు ఒక పత్రిక కూడా నడిపారు. 1890 పొయెట్రీ సొసైటీనaపేరిట జికె చేసిన సాహిత్య పరిశోధన  అమోఘం. ఆంగ్లేయులకే వారెరుగని వారి కవులను పరిచయం చేసేరు గూటాల. ఇక తెలుగు తల్లికి ఆయన చేసిన సేవ విదేశాంధ్ర ప్రచురణలు స్థాపించి శ్రీశ్రీ మహాప్రస్థానం ని మహాకవి స్వదస్తూరిలో నమోదు చేయించి ఆ గీతాలను శ్రీశ్రీ స్వరం లో రికార్డ్ చేసి కేసెట్ను ఆ ఫాసిమైల్ ఎడిషన్ లోనే వెనుక ఒక చిన్న బాక్స్ లా పుస్తకం లోనే పెట్టి ప్రచురించారు. మేము వెళ్ళిన రోజు ఒక్క పుస్తకాన్ని శివారెడ్డి గారికి బహుకరించారు. తర్వాత పురిపండా వారి  పులి పంజా కూడా అలాగే తీసుకొచ్చారు.

శంకరంబాడి వారి ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ను తన గాన సుమస్వరం లో అజరామరంగా అందించిన టంగుటూరి సూర్యకుమారి గురించి చాలా ఖరీదైన పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం లో ఆమె జీవిత విశేషాలను తెలియజేసే ఫోటోలు అన్నీ ఒక ఆల్బమ్ లా పొందు పరిచి ప్రచురించారు. సాంకేతికత ఇంకా ఇంత అభివృద్ధి చెందని ఆరోజుల్లో ఒక మహాకవి స్వరాన్ని దస్తూరిని భావి తరాలకు మిగిల్చిన  గొప్ప సాహితీ ప్రేమికుడు గూటాల.మరొక విషయం ఈరోజు సీనియర్ కధకుడు జయంతి వెంకట రమణ ని కలవడం జరిగింది. జి.కె. వారికి మేన బావ అని
తెలిసింది. అయనను కన్న బాబు అని పిలిచేవారట . ఎప్పుడూ ఇంగ్లీష్ పుస్తకం చదువుతూ ఉండెవాడు. 1956 నుండి సాన్నిహిత్యం అని గుర్తు చేసుకున్నారు .
ఏదేశమేగినా ఎందు కాలిడినా ఎంత కీర్తి గడించినా తెలుగు తల్లి ముద్దు బిడ్డగానే మిగిలి, తిరిగి మాతృ దేశం లోనే అసువులు బాసిన మహనీయుడు జికె. ఆయనకి సాహితీ జగత్తు అక్షర  నివాళి సమర్పిస్తోంది.

*

ఈ భరోసా…ఎంతవరకు?!

murugan

-దగ్గుమాటి పద్మాకర్

~

నేను నా వృత్తిరీత్యా ఇప్పటివరకు రకరకాల స్కూళ్లలో లక్షమంది పైగా విద్యార్థులతో వారి క్లాసుల్లో  10-15 నిముషాల సమయం గడుపుతూ ఉంటాను. వారంతా 2-7 తరగతుల మధ్య చదువుకునే పిల్లలు.  వారితో మాట్లాడే విషయాలు ముఖ్యంగా వాళ్లందరూ తమకి ఒక మెదడు ఉందని గుర్తించడం, అదే చాలావరకు తమని నడిపిస్తుందని పలు ఉదాహరణలతో గ్రహించేలా చెయ్యడం.  అలాగే ఆమెదడుని వారు తమ అదుపులో ఉంచుకోవాలని కూడా గ్రహించేలా చెయ్యడం, అందుకు కొన్ని ప్రాక్టికల్గా ఉదాహరణలు చూపించడం.  సందర్భాన్ని బట్టి వారెందుకు
చదువుకుంటున్నారో, అక్షరం విలువేమిటో కూడా వివరించడం చేస్తుంటాను.

ఈక్రమంలో ఒకసారి 4 వ తరగతి పిల్లలని క్లాసులో భాషకి, లిపికి తేడా చెప్పమన్నాను.  వారికి పెద్దగా అర్ధం కాలేదు.  సరే మాటకీ, అక్షరానికీ తేడ
తెలిస్తే చెప్పమన్నాను.  తెలిసిందేగదా, పిల్లలకి అవకాశం ఇవ్వంగాని ఇస్తే ఆలోచనలు మథిస్తారు!

ఒకమ్మాయి అంది, మూగవాళ్లు ఇతరులతో మాట్లాడాలంటే మాటలు రావుగాబట్టి అక్షరాల్లో రాసి చూపిస్తారు అనింది.  అందరితోపాటు నేనూ చప్పట్లు కొట్టాను.  నేను ఆతర్వాత చొరవ తీసుకుని భాషవల్ల  ఇంకో ముఖ్యమైన  ప్రయోజనం చెప్తానన్నాను.  “ఇప్పుడు ఇక్కడ అక్షరం వల్ల ప్రయోజనం గురించి  మనం మాట్లాడుకున్న విషయం మనం కొద్దిరోజులకి మర్చిపోతాం! ఇవన్నీ , ఇంకో వంద సంవత్సరాలకైనా ఇతరులు తెలుసుకోవాలంటే ఎలా? అక్షరమే గదా సాధనం” అన్నాను. ఈ అక్షరాల వల్లనే గదా మీరు టెక్స్టు పుస్తకాల ద్వారా ఎవరో ఎప్పుడో రాసిన
అనేక విషయాలు తెలుసుకో గలుగుతున్నారు అన్నాను.

2

సరే! ఇదంతా ఎందుకంటే కోర్టులు అక్షరం విలువని ఇన్నాళ్లకు గుర్తించాయి! జడ్జీలు వాయిదాలు, పాయింట్లు, తీర్పులు డిక్టేట్ చేస్తుంటే టైపిస్టులు అక్షరాలు సృష్టిస్తుంటారు గాబట్టి జడ్జీలనడిగితే అక్షరాలు సృష్టించే వాళ్లకంటే ఆలోచనలు సృష్టించే వాళ్లే గొప్పవాళ్లని తప్పకుండా
ఒప్పుకుంటారు.  ఇటీవల పెరుమాళ్ మురుగన్ కేసువిషయమై ఇచ్చిన తీర్పులో మద్రాసు హైకోర్టుకూడా ఒప్పుకుంది. కోర్టుల్లో ఇదొక గుణాత్మకమైన మార్పుగా గోచరిస్తుంది.  ఆలోచనలని ఔపోసనపట్టి అక్షరాలకు ఒక కళారూపాన్ని జతచేసి రచనలుచేసే వాళ్లని “మీరు రాయండి” అని; “ఒక కళారూపమైన సాహిత్యంలోని భావాలు నచ్చనివాళ్లు నచ్చకపోతే పుస్తకం మూసేసుకోవచ్చు” అనీ  కోర్టు ఒక రచయిత భుజం తట్టినట్టుగా మద్రాసు హైకోర్టు పెరుమాళ్ మురుగన్ కి భరోసా ఇవ్వడం నిజానికి హృదయాలు పులకించే విషయం.

కానీ ఏడాది కిందటి వరకూ “మిలార్డ్” అంటూ బ్రిటిష్ సాంప్రదాయాన్ని కొనసాగించిన కోర్టులనుంచి మనం ఇలాంటి భరోసాలు నిరంతరం ఆశించడం అత్యాశే కావచ్చు.

3

అయితే కనీసం పెరుమాళ్ మురుగన్ కారణంగా అయినా కళా సాహిత్య రంగాలకు మద్రాసు హైకోర్టు ఈ రకంగా అయినా వెన్నుదన్నుగా నిలవడం వెనుక కారణాలు అన్వేషిస్తే నావరకు అనిపిస్తున్నదొకటే.  వెల్లువెత్తుతున్న వర్చువల్ మీడియాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎలాంటి కత్తిరింపులు, ఎవరి అనుమతులు అవసరం లేకుండా దూసుకెళుతున్న కాలంలో మనం వుండడమే ఇందుకు కారణం.  కళాకారులపై రాజ్యాంగ
వ్యవస్థలో భాగమైన పోలీసులు ఫ్యూడల్ భావాజాలానికి కొమ్ముకాస్తూ నియంత్రించినప్పుడు వారి చర్యలు ప్రపంచమంతా క్షణాలలో ప్రచారం, ప్రసారం జరిగిపోతున్నాయి. ఈ పరిణామం కారణంగా అభివృద్ది చెందిన దేశాలు భారతదేశాన్ని అభివృద్ది చెందుతున్న దేశంగా కాక ఇంకా వెనకబడ్డ దేశంగానే గుర్తించడం జరుగుతుంది.  అలాంటప్పుడు భారత దేశంలో పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ కంట్రోల్లో లేదనే సంకేతాలు ప్రచారమవుతాయి.  బహుశా పెరుమాళ్ మురుగన్ కేసులో న్యాయ వ్యవస్థపై ఈరకమైన వత్తిడి కూడా పనిచేసి వుండే అవకాశం వుంది.

4

అయితే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇంకా మాట్లాడితే ఏరకమైన స్వేచ్ఛ గురించి అయినా ఇటీవలికాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవలసి వుంటుంది.

సమాజంలోని ప్రజలకు తగినంత మెచ్యూరిటీని, ప్రాపంచిక జ్ఞానాన్ని అందించే సామాజిక వ్యవస్థలని చిదిమేసి బట్టీ విద్యా విధానంతో జ్ఞానాని
తెల్లకాగితంగా మిగిల్చి వ్యవస్థ అందించే స్వేచ్ఛ చివరికి ఏ పరిణామాలకి దారితీస్తుందో ఇటీవలి సంఘటన ఒక ఉదాహరణ. వయోజనుడైన ఒక పాతికేళ్ల ఐటీ ఉద్యోగి కార్పొరేట్ హాస్పిటల్ ప్రకటనలని నమ్మి ఎత్తు పెరగడానికి కనీసం ఇంట్లోకూడా చెప్పకుండా తన రెండుకాళ్లను తెగ్గొట్టించు కోవడం  వ్యక్తిగత స్వేచ్ఛయొక్క దుష్పరిణామమని చెప్పుకోవాలి.  అంటే ఈదశలో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చివరికి వినియోగదారుడిగా మారే స్వేచ్ఛకి దారితీస్తుంది.

చెప్పుకోవాలంటే యువత ఎక్కువగా వున్న భారతదేశంలో రాబోయేకాలంలో ఇలాటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలెక్కువ. ఇప్పటికే మన సినిమాలలో చూపించి చూపిస్తున్నట్టు గుణగణాలతో సంబంధం లేకుండా ఆకర్షణే ఆధారంగా జరిగే ప్రేమపెళ్లిళ్లకి ఒకలెజిటమసీ వచ్చేసింది.  మన సినిమాలలో మొదట హీరో స్నేహితులు,  ఆతర్వాత కాలేజీ లెక్చరర్లు, ఆతర్వాత చివరికి తల్లిదండ్రులు అంతా హీరో ప్రేమని సఫలం చెయ్యడానికి ప్రయత్నించేవారే!   కారణాలేవైతేనేం 18 దాటిన వాళ్లకి మద్యం సేవించే స్వేచ్ఛ వచ్చేసింది.  మద్యం అమ్మకాలకి ప్రభుత్వమే టార్గెట్స్ పెట్టి  అమ్మిస్తూంది.  ఇండైరెక్టుగా మద్యం హాయిగా తాగొచ్చని సందేశాలు పంపుతూ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ చేత డ్రగ్స్ కి, గంజాయికీ వ్యతిరేక ప్రచారం చెయ్యిస్తుంది.  మీడియా అంతా పేజీలకింత అనేదశ దాటి టోకుగా కూడా అమ్ముడు పోతున్నాయి. ఈదశలో ఇప్పుడు రచయితలకి అందిన స్వేచ్ఛని కూడా మనం కాస్త జాగ్రత్తగా విశ్లేషించుకోవలసి వుంది.

5

సమాజంలో స్వేచ్ఛకి మితిమీరిన ప్రాచుర్యం లభించాక ఆ పదానికి ఒక ఆచరణీయత, అనుసరణీయత ప్రజల్లో లభిస్తుంది.  ఇప్పుడున్న వాతావరణంలో స్వేచ్ఛని ఎక్కువగా పైపై వర్గాలే వినియోగించుకుంటాయి.  అంటే  కార్మికులు యూనియన్లు పెట్టుకునే హక్కుని నిరాకరిస్తూ యజమానుల సంఘం మాత్రం క్రియాశీలంగా పనిచేసినట్టు అన్నమాట.  ఇలాంటి సంఘటనలు భారత దేశంలో కోకొల్లలు.
ప్రభుత్వాలు తమపార్టీలకు నిధులందించే ఇండస్ట్రియలిస్టుల కొమ్ముకాయడం , ఎన్నికల హామీలు గాలికి  వదిలి నియంతృత్వ పోకడలు పోతున్నప్పుడు క్రమేపీ ప్రజా సమూహాల గొంతెత్తే హక్కు, నిరసన తెలిపే హక్కు, అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు… ఇలాంటివన్నీ ప్రభుత్వాలు కాలరాస్తున్నప్పుడు దృతరాష్ట్ర న్యాయం ప్రదర్శించే కోర్టుల పట్ల పెరుమాళ్ మురుగన్ విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకింత సానుకూలత కలిగిస్తుందనేది రచయితలుగా మనం మరిచి పోకూడదు.

పెరుమాళ్ మురుగన్ కి ఇచ్చిన స్వేచ్ఛని అడ్డం పెట్టుకుని  కోర్టులు తాము మరింత ప్రజాస్వామికంగా వున్నట్టు మనని నమ్మిస్తాయి. నిజానికి హక్కులు, స్వేచ్ఛ కారణంగా వర్ధిల్లే బూతు సాహిత్యం ఎక్కువ!  కోర్టుల నిస్సహాయత బయట పడేది ఇక్కడే!

అసలు పెరుమాళ్ మురుగన్ భయానికిగురై రచయితగా తాను మరణించినట్టు ప్రకటించడానికి కారణమైన సంస్థలు, అధికార వ్యవస్థలను కూడా కోర్టులు ఏమీ చెయ్యలేవన్నది నిజం.  ఒకవేల అలాచేయాలని అనుకున్నా అది కత్తి పట్టుకుని పైపైకి వచ్చేవాడిని కళ్లురిమి అదుపు చేయాలనీ అనుకోవడం లాంటిదే! ఆపరిమితి కోర్టులకున్నది.  కోర్టుల నిస్సహాయత గురించి చెప్పుకోవలసి వస్తే మన రాజకీయాలు ఎంత దుర్మార్గమైనవి అంటే అవి ఒక సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ చేతకూడా పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టించ గలవని మనకి తెలిసిన విషయమే.

6

నాలుగు రోజుల కిందట  ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో ఒక కేసులో బెయిలుపై బయటికి రాగానే మరొక ధర్నా కేసంటూ వెంటనే అరెస్టు చేసి వెంటనే కోర్టుకి పెట్టారు. ఆయనేం మావోయిస్టు కూడా కాదు.  ప్రతిపక్ష ఎమ్మెల్యే.  సహజంగా పోలీసులకి వుండే పవర్ ఇది. ఈ పవర్ గురించే రావిశాస్త్రి తనకథల్లో పదేపదే చెప్పింది. కోర్టులు కూడా అధికార వ్యవస్థల్లో మరో వ్యవస్థ కాబట్టి సహజంగా తనకి కలిగిన “కళ్లురిమే” అదృష్టాన్ని అనవసరంగా  కాలదన్ను కోవడానికి సిద్ధపడవు.

కొన్నిసార్లు కోర్టులు పార్లమెంటుని సైతం ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తాయి గాని టెక్నికల్గా బాహాటంగా దొరికితే తప్ప అవి ప్రభుత్వాల పీక
పట్టుకోవన్నది నిజం.  ప్రభుత్వాలే మద్యం అమ్మకాలు చేయించడాన్ని, ప్రజాభిప్రాయాన్ని అవహేళన చేస్తూ ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి
మారడాన్ని, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు కొమ్ముకాసి దేశ సంపదని దోచి పెట్టడం గానీ ప్రశ్నిస్తూ కోర్టులు సుమోటోగా కేసులు పెట్టినప్పుడు
కోర్టుల్లో గుణాత్మక మైన మార్పులు వచ్చాయని మనం నమ్మొచ్చు.

అందాకా తప్పేమీ లేదు మిత్రమా!

ప్రపంచం అంతటా నీ అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని కొల్లగొట్టడానికి ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది.  ఈడ్రామాని నువ్వు జీవితం అనే మొత్తాన్ని ఖర్చుచేసి టిక్కెట్టు కొని చూస్తున్నావు.  నిజమా  కాదా అని అనుమానించడంలో తప్పేమీలేదు.  ప్రతి మార్పునీ, ప్రతి తీర్పునీ ఒక గీటురాయి మీద గీసి చూసుకో!

*     *      *      *

13 జులై 1931

 

-అవ్వారి  నాగరాజు
~
1
ఎటు వైపునుండయినా దీనిని మొదలు పెట్టవచ్చునని తెలిసాక
అటూ ఇటూ కదలజాలక బంధితమై  ఉన్న చోటునుండీ ఇంటినుండీ కరుడుకట్టిన నిశ్చలప్రవాహాలలాంటి రోడ్లమీదకు ఉరకాలనుకునే నిస్సహాయపు రాత్రి నుండీ
కొంచెం భయంతో మరికొంచెం ఆసక్తితో మరణాన్ని తప్ప మరొకదాన్ని ఆవాహన చేయజాలని
రోజుల గుండెలమీద నెమ్మదిగా కదలాడుతున్న ఒకానొక పురా భారము నుండీ
నుదుటి మీద నీకోసం కేటాయించిన వరుస సంఖ్యను సదా ఊహిస్తూనే ఉంటావు
2
 రోజులు  నీలాగే వొట్టిపోతున్నపుడు లేదా నీవే  రోజులన్నింటిలాగా వొట్టిపోతున్నపుడు
జీవితం అర్ధాంతరమని  గీతగీసి మరీ చెప్పడానికి
 ఇంటిలో నీ తల్లో ఎవరో మరెవరో ఒక ఆడకూతురు నీ ఎదురుగానే తిరగాడుతున్నప్పుడు
 బిడ్డల చావుని తప్ప మరేదీ నమ్మనంత ధ్యానంగా వారు  మృత్యువుని మోసుక తిరుగుతున్నప్పుడు
నువ్వు వాళ్ళని ఊరకే అలా చూస్తూ ఉండలేవు
ముఖాల మీద కదిలీ కదలాడని ఒక పలుచని తెరలాంటి దాన్ని చదవకుండానూ ఉండలేవు
3
ముందుగానే తెలిసిపోయే భవిష్యత్తులాంటి
లేదా ఇంతకు ముందెప్పుడో సరిగ్గా అలాంటిదాన్నే అనుభూతి   చెందిన  పీడకలల ప్రయాణపు దారిలాంటి
చంచలిత దృశ్యాదృశ్యాల కలయికలలో
ఇదేరోజున నిన్ను జీలం నదీ శీతలజలాల చెవియొగ్గిన చప్పుళ్ళలో
ఇంకా రాళ్ళను విసిరేందుకు ఏరుతున్న రహదారులమంటల కశ్మీర్ లోయలలో
దుఃఖించినట్టూ గుండెలవిసేలా బాదుకున్నట్టూ
కాకుండా ఇక ఎలా రాయగలవూ?
*

పీడ కల 

gopi

లోగో: భవాని ఫణి

 

~
(చూస్తూ  ఉండగానే  ఇంకో రాజధాని మన కోసం  వెలిసింది. ఈ వెలుగు వెనక అన్నీ వెలుగులే కాదు, కొన్ని చీకట్లూ వున్నాయి. చింతలూ వున్నాయి. బతుకు వెతలూ  తలరాతలూ వున్నాయి. అరుదుగా  రాసే  అతి నిక్కచ్చి  కథకుడు  దారా గోపి. అనేక సంవత్సరాల కిందట  గోపి “గుడిసె ఏసోబు.కథలు” ఒక సంచలనం. గోపి కలం నించే  మళ్ళీ  ఇన్నాళ్ళకి  ఈ రాజధాని కథలు)
*
కృష్ణా కరకట్ట మీద, చుట్టూ పచ్చని పంటపొలాల మధ్య నడుస్తున్నా.
ఒక పక్క నది … ఇంకో పక్క మా వూరు.
అరటి తోటలు…
కూరగాయల తోటలు…
ఆకుకూరల తోటలు… పూల తోటలు…
ఒక్కటేంటి… ఎన్ని రకాల తోటలో….
యెవురో యెనకపక్కనుండి బుజంమీద కండవ లాక్కుండు.
యెనక్కి సూత్తే నవ్వుతుండు.
ఒయ్ ఎవురయ్య నువ్వు అనేలోపు లుంగి పంచ లాక్కుండు.
మల్లీ నవ్వుతుండు.
నా కండవ, లుంగీ లాక్కునే ప్రయత్నం చేశా
నన్ను తోసేసి సొక్కా లాక్కోబోయిండు..
నవ్వుతుండు… నన్ను ఎగతాలి సేత్తుండు.
దిగ్గున మెలుకువొచ్చింది… కళ్ళు తెరిచి చూసా…
అప్పుడర్ధమైంది… ఇదంతా కలని.
యిదేం కల? ఒంటిమీద గుడ్డలు గుంజుకున్నడు?!
ఆచ్చర్యమేసింది… భయంకూడా…
మంచమ్మీదనుండి లేసి గుడిసెలోంచి బయటికొచ్చా..
బయట పండు ఎన్నెల… తొలి కోడి కూసినట్టుంది…
మల్లీ యింట్లోకొచ్చా…
పిల్లలూ, తనూ నిద్రపోతున్నారు.
మంచంమ్మీద పక్కసరిసేసి, దుప్పటి దులిపి పడుకున్న.
“యేంటి మెలుకువొచ్చింది”
కప్పుకున్న దుప్పటి ముసుగు తీసి అడిగింది.
“ఏం లేదే… యేదో కలొచ్చింది”
“పీడ కలా? మంచికలా?”
“యేదో పిచ్చిదే… ఒంటిమీద గుడ్డలేవురో లాక్కున్నట్టు… సూసి నవ్వుతున్నట్టు”
“అదేం కల? పిచ్చికల”
నేనేం మాట్లాడలేదు.
తనే అంది… “దరిద్రపు కల… కాసిన్ని మంచినీలు తాగిపడుకో… “
నాకు మల్లీ మంచమ్మీదనుండి లేవాలనిపించలేదు. అట్టే పడుకున్న. ఇక నిద్రకూడా పట్టేట్టు లేదు.
అటూ, యిటూ దొర్లినా నిద్రొచ్చేట్టు లేదు.
“మంచినీల్లు తాగావా? పోనీ పక్కకి తిరిగన్నా పడుకో”
పక్కకి తిరిగి పక్కలో వున్న సంటిగాడిమీద సెయ్యేసి పడుకున్న. నిద్రొచ్చేట్టులేదు. కలే గుర్తొత్తంది.
“అదేం కల! ఒంటిమీద బట్టలు గుంజుకోటం యేంటి”
ఆలోసిత్తుండగానే తెల్లారింది. పిల్లలు, తనూ నిద్ర లేచారు.
“యేంటి తెల్లార్లూ పిచ్చికలలు కని తెల్లారేక నిద్రపోతున్నవా?”
“అదేం లేదే… నిద్రేడ పట్టింది”
“మరి లేవ్వా? పొలానికి పోవా?”
ఇక లేవక తప్పలేదు. మీదున్న దుప్పటి తీసి మంచమ్మీదనుంచి లేసి బయటికొచ్చిన. గుమ్మం ముందు రోడ్డుమీద శానామందున్నారు.
శీను, ప్రసాదు, రాంబాబు, యెంకటేసు, గోపాళం … శానమందే… రాతి బల్లమీద కూసున్నారు.
బద్దకంగా వొల్లరిసుకుంట ఆల్లకాడికెల్లిన.
“ఏంట్రా సూరీ నీకిప్పుడు తెల్లారిందా?”
 శీనుగాడు ఎకసెక్కంగ పలకరిచ్చిండు.
“యిప్పుడేంట్రా తొలికోడి కూసినప్పుడే మెలుకువొచ్చింది. యేదో పీడకలొచ్చింది… తర్వాత నిద్ర పట్టలేదు.”
“పీడకలొచ్చిందా? మానాయనే… యికనుంచి అదేపనిలే… పిచ్చికలలేం కర్మ మంచికలలు కూడా కనుకుంటా మంచమ్మీదనే వుండొచ్చు”
“యేమైందిరా?”
“యీడిప్పుడే నిద్రలేచిండు. సెప్పండ్రా యేమైందో”
“పేపర్లో, టీవీల్లో మనూళ్ల  పేర్లే పలుకుతున్నయ్. తెలవదా?”
ఇసుగొచ్చింది నాకు.
“యెహే, యేమైంది సెప్పండ్రా” అని గట్టిగా అరిసిన.
“ఉండ్రా బాబూ… యెందుకరుతున్నవ్… “
“మరి లేకపోతే ఏంట్రా. సంగతేంటో సెప్పకుండా ఎకసెక్కాలేంటి పొద్దున్నే”
“సర్లే .. ముందా నిద్రకళ్ళు తుడుసుకో… మనూళ్ళనే రాజధానిగా ప్రకటించారు. రాజధాని ఇక్కడే కడతారంట”
శీను చెప్పిండు. కానీ నాకేం అర్ధం కాలేదు.
“అయితే యేంటట?”
“యేంటంటవేంట్రా? రాజధాని కట్టేది మన భూముల్లోనే”
“అంటే”  అన్న బుర్రగోక్కుంట. నాకింకేం అర్ధం కాలేదు.
అక్కడున్నోల్లంతా పగలబడి నవ్వుతున్నారు నన్ను సూసి.
“ఏంట్రా యీడు మరీను… యింకా అర్థం కాలేదా? మన పొలాల్లోనే రాజధాని కడతారంటారా. మన పొలాలు తీసుకుంటారంట”
ఒక్కసారి దిమ్మదిరిగినట్టయింది. నోటెంట మాటరాలేదు. తెల్లారుజామునొచ్చిన కల గుర్తొచ్చింది… భుజమ్మీద కండవా, ఒంటిమీద లుంగి లాక్కొని నవ్వుతున్న మనిసి కనిపిచ్చిండు.
“వార్నీ … యిదేరా తెల్లారుజామున నాకొచ్చిన కల… ఒక మనిషి నా భుజమ్మీద కండవా, ఒంటిమీద లుంగీ లాక్కొని, సొక్కా కూడా లాక్కోటానికి సెయ్యేసిండు… పైగా నవ్వుతుండు”
కలగురించి సెప్పిన… అందరూ నవ్వుతున్నారు..
“మేం పేపర్లు, టీవీల్లో సూత్తే నువ్వు కల్లోనే సూసినావా…”
“ఒరేయ్ మల్లెల్లి పొడుకో… యింకేం జరుగుద్దో మాకంటే నీకే ముందు తెలుసుద్ది”
అందరూ నవ్వుతూ యెగతాలి సేత్తన్నారు.
ఇక అక్కడ ఉండలేకపోయా. యింట్లోకొచ్చిన. మనసేదో పరిపరి విధాల పోతంది.
పొలాలు పోతే ఎట్టా? బతికేదెట్టా? ఏం పనులు సేసుకోవాలా? ఏం తినాల?
అంతా అయోమయంగా ఉంది. ఏం తోచట్లా…
అయినా ఇదేం కల? తెల్లారగానే ఇదేం వార్త?
“ఓయ్… నిన్నే… “
యింట్లోకెల్తూ పిలిసిన. అది పొయ్యికాడ కూసుంది. తెల్లారిందంటే పిల్లోల్లకి ఆకలేసద్ది. వొండి వొక ముద్ద ఆల్లకెయ్యకపోతే గోలే.
“ఏంటీ” పొయ్యికాడ కూసోనే అరిసింది.
“యింట్లోకి రావే”
“వత్తన్నా…. ” లేచి యింట్లోకొచ్చింది.
ఏంటి సంగతి అన్నట్టు నా మొహంలోకి సూచింది.
“తెల్లారుజామున కలొచ్చిందని సెప్పాగా… “
“అవును సెప్పినవ్… అదేదో మనిసి ఒంటిమీద గుడ్డలు లాక్కున్నాడనీ… “
“ఆఁ … అదే … గుడ్డలు కాదే … బతుకే లాక్కుంటన్నారు”
“ఏంటయ్యా నువ్వు సెప్పేది… “
“అదేనే మనూళ్ళని రాజధానిగా యెన్నుకున్నారంట”
“యెవురయ్య… యెవురు యెన్నుకుంది”
“యింకెవురే … గవర్మెంటోల్లు…”
“అయితే?”
“అయితేంటి నీ మొకం… మన పొలాలు తీసుకుంటారంట… అందులోనే రాజధాని బిల్డింగులు కడతారంట…”
“యెందుకు?”
“యెందుకేంటే పిచ్చిమొకమా… మనకి కూడా ఒక హైదరాబాదు కావాలిగా?”
“అదెందుకయ్యా?”
“యెందుకంటావేంటి? కోర్టు, మంత్రులకి, ఎమ్మెల్యేలకి యిళ్ళు అన్నీ కావాలంట. అయ్యన్నీ యిక్కడే మన పొలాల్లోనే కడతారంట”
“యెవురు సెప్పారు నీకు?”
“అదిగో … రోడ్డుమీద ఆల్లందరూ అంటన్నారు”
బయటికొకసారి తొంగిసూసింది. ఆళ్లంతా యింకా అక్కడే కబుర్లాడుతున్నారు.
“ఆళ్ల మాటలకేం గానీ… ”  అని మళ్ళీ తనే అంది “పెద్ద పెద్ద ఊళ్ళన్నీ వొదిలి మనూళ్లకే వత్తరా యేంటి నీ పిచ్చి గాని.. ఆళ్ళు సెప్పటం … నువ్వు నమ్మటం”
నావైపు యెగా దిగా సూసి మళ్ళీ పొయ్యికాడికెల్లింది.
తను సెప్పేది నిజమేనేమో అనిపించింది ఒక్క సారి. అదే నిజమైతే బాగుండు అనిపించింది. పొలాల్లేకపోతే యెలా? యేపని సేసుకోవాలి? ఏంతిని బతకాలి?
పిచ్చెక్కినట్టుంది. ఏం తోచట్లేదు. ఎటూ పాలుపోట్లేదు.
ఇక లాభం లేదు. ఒక్కసారి కరకట్ట మీదకి ఎల్లొత్తే యేమైనా తెలుసుద్దేమో అనుకుంట అలా బయటికొచ్చిన.
“ఏడకెల్తన్నవ్” పొయ్యిమీద అన్నం కుండ దింపుతూ అడిగింది.
“యాడికి లేదులే… కరకట్ట దాకా పోయోత్త” అనుకుంటా రోడ్డున నడక మొదలెట్టిన.
***
పచ్చని పంట పొలాలు…
యేడాది పొడుగునా పంటలే
సిన్నప్పుడు మా తాత సెప్పిండు యేడాది పొడుగునా వంద రకాల పంటలు పండుతాయంట యిక్కడ.
కొన్ని పంటలు 45 రోజుల్లో సేతి కొత్తే, యింకొన్ని 90 రోజులకి, మిగతాయి 120 రోజులకి తయారు.
నాబోటి కూలోళ్ళకి నిత్యం పనుంటది. మా యింట్లో మొగుడూ పెళ్ళం యిద్దరం రోజు కూలీపనికొత్తం. నాకూలి 400 రూపాయలు. నా పెళ్ళానికి 250 రూపాయలు.
నాకిద్దరు పిల్లలు… కొడుకు బళ్ళోకెళతండు. బిడ్డ సిన్నది. ఆళ్ళమ్మతోనే వుంటది.
“ఏంట్రా సూరిగా… పొద్దున్నే పొలానికా?”
యెదురుగా మావూరి పెద్ద రైతు సుబ్బయ్య నాయుడుగారు.
“యెల్లెల్లు… యింకెంతకాలంలే”
“అదేంటయ్యా… అంతమాటన్నారు?”
“ఏంటంటావేంట్రా? నీకింకా తెలవలేదా? మనది రాజధాని ప్రాంతం ఇకనుండి. మన పొలాల్లోనే బిల్డింగులు కడతారు. మంత్రులు, అధికారులు అందరూ ఇక్కడే ఉంటారు”
“మరి మనం?”
“మనం ఇక్కడే ఉంటాం. కాకపోతే ఈపొలం పనులు గట్రా ఉండవు.”
“ఈ పనులు లేకపోతే మనం బతికేదెట్టాయ్యా?”
ఇప్పుడు సుబ్బయ్య నాయుడు గారు సెపుతుంటే రాత్రి నాకొచ్చిన కల, పొద్దున్నే సీను గాదోళ్లు సెప్పింది నిజమని నమ్మకం కలిగింది.
“పెద్ద పట్టణం కట్టబోతుంటే బతికేదెట్టా అంటావేంట్రా? మీ బామ్మర్ది హైద్రాబాదులో బ్రతకట్లేదా? రేపు నువ్వూ అంతే.”
తాపీగా సెప్పిండు సుబ్బయ్య గారు.
“నా బామ్మర్దంటే … అక్కడ ఏదో అపార్టుమెంట్లో వాచెమేనో ఏదో అన్నడు.”
“ఆ అదే… రేపు ఇక్కడ అలాంటి అపార్టుమెంట్లే వందలకొద్దీ వస్తాయ్. అప్పుడు నువ్వెంటి, నీ బామ్మర్ది కూడా ఇక్కడికే రావొచ్చు.”
నా వీపుమీద మెత్తగా సరసి నవ్వుకుంటూ ముందుకెళ్లిండు సుబ్బయ్య నాయుడు గారు.
“ఏంటి అపార్టుమెంట్లో వాచ్మేనుగా పనిసేయాలా? అదేం బతుకు? ఇప్పుడు మా తాత సంపాదించిన అరెకరం పొలంలో సక్కగా కూరగాయలు, ఆకు కూరలూ పండించుకుంటా దర్జాగా బతికేస్తున్నా. నాకు నేనే రాజుని. ఇప్పుడేంటి వాచ్మెను పనా?”
భయం వేసింది. గుండె దడ దడగా కొట్టుకుంటంది. నిజమేనా? నేను వాచ్మెనుగా మారిపోవాల్సిందేనా? నా అరెకరం పొలం పోతదా?
ఈ సుబ్బయ్య నాయుడు గారేంటి ఇంత ధీమాగా ఉన్నడు? మా ఊళ్ళో పెద్ద ఆసామి అలా అన్నడేంటి?
నిజమేనా? నేను వాచ్మెనుగా మారిపోవాల్సిందేనా? నా అరెకరం పొలం పోతదా?
బుర్ర వేడెక్కినట్టయింది.
తెల్లారుజామునొచ్చిన పీడకల మల్లీ గుర్తొచ్చింది.
ఒంటిమీద గుడ్డలెవరో లాక్కుంటున్నారు… నన్ను సూసి నవ్వుతున్నారు.

వ్యాఖ్యానాలు- నా అనుభవాలు!

 

– నిడదవోలు మాలతి

~

 

కొంతకాలంగా రచయితలకీ పాఠకులకీ మధ్యన ప్రచ్ఛన్నయుద్ధం జరుగుతోంది విమర్శలవిషయంలో. వ్యాఖ్యలు సూక్ష్మంగా ఉంటాయి కానీ అవి కూడా విమర్శలే నాకు సంబంధించినంతవరకూ. రెంటిలోనూ జరిగేది రచనమీద చదివినవారు చదవడం అయేక స్పందనలను తెలియజేయడమే జరుగుతుంది కనక.

పండితులు తమ అభిప్రాయాలను పత్రికలలో చర్చించుకోడం వీరేశంలింగం, కొక్కొండ వెంకటరత్నంపంతులు గార్ల కాలంలోనే ఉంది. అంతకుపూర్వం పెద్దన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, ప్రెగడ నరసరాజు వంటి కవులు సభలలో ఒకొరినొకరు ఆక్షేపించుకోడం ఉండేది.

19వ శతాబ్దంలో విద్యావంతులని ప్రొత్సహించే ఆశయంతో పత్రికలు వెలువడ్డాయి. ఈనాడు జాల పత్రికలు “మీరు కూడా రచయితలే,” అని పాఠకులని రాయమంటూ ప్రోత్సహిస్తున్నారు. ఈ సంప్రదాయానికి నాంది పత్రికలు ప్రారంభించినరోజులలో సంపాదకులు స్త్రీవిద్య ప్రోత్సహించడమే.

పండితులూ సాహతీవేత్తలూ శల్యపరీక్ష చేసి రాసే విమర్శలజోలికి పోబోవడం లేదు నేను ఈ వ్యాసంలో. నా అనుభవాలు అన్నాను కదా. నాఅనుభవంలో అలాటి విశ్లేషణలు జరగలేదు కనక నేనేమీ చెప్పలేను.

నేను కథలు రాయడం మొదలు పెట్టేక, అంటే 50వ దశకంలో అభిప్రాయాలు గమనించడం మొదలు పెట్టేను. ఆ రోజుల్లో వారపత్రికలే ఈ అభిప్రాయప్రటనలకి వేదిక. కథ చదివేక కార్డో ఇన్లాండ్ కవరో తీసుకుని అభిప్రాయం రాసి ఆ పత్రికకి పంపితే అది మళ్ళీ పాఠకుడు చూసుకోడానికి కనీసం మరో రెండు వారాలు పట్టేది. అది కూడా ఆ పత్రిక ఎడిటరు వేసుకోడానికి అంగీకరిస్తేనూ, ఎడిట్ చేయకపోతేనూ మాత్రమే పాఠకుడు తాను రాసింది రాసినట్టు చూసుకునే అవకాశం. అంటే డబ్బు ఖర్చూ, కాలయాపనా కూడా అన్నమాట. నిజానికి చాలామంది పాఠకులు వ్యాఖ్యానాలు రాయడానికి మొహమాటపడేవారు కూడా ఆరోజుల్లో. ఇప్పటికీ మీ అమ్మమ్మనో వాళ్ళమ్మనో అడిగి చూడండి. ఏమో, నాకేం తెలుసులెద్దూ అంటారు. ఈమధ్య ముఖపుస్తకంలో “మీరేం అనుకుంటారో అని friend request పెట్టలేదు” అన్నవారు నాకు కనిపించేరు. రచయితలయందు పాఠకులకు గల గౌరవమర్యాదలనేపథ్యం ఇలాటి సందర్భాలలో అర్థమవుతుంది.

20వ శతాబ్దం ఉత్తరార్థంలో వారపత్రికలలో సాహిత్యపరంగా కూడా మంచి చర్చలు జరిగేయి. మహీధర రామ్మోహనరావు, కొడవటిగంటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మవంటి రచయితలచర్చలు కనిపిస్తాయి 70, 80 దశకాలలో ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలలో. భారతి, కృష్ణాపత్రికలలో కూడా ప్రముఖ రచయితలు అభిప్రాయాలను ప్రచురిస్తూ ఉన్నారనే గుర్తు. పోతే సాధారణ పాఠకులవ్యాఖ్యలు ఒక్కొక కథమీద ఒకటో రెండో నామమాత్రంగా కనిపించేవి. గత 20 ఏళ్లలో అంతర్జాలంలో పత్రికలూ, బ్లాగులూ, మిత్రసంఘాలూ చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చేయి. పాఠకులసంఖ్య లెక్కకు మిక్కిలిగా వృద్ధి పొందింది, పొందుతోంది. రచయితల సంఖ్య కూడా ఇతోధికంగా పెరిగింది.

ఈ నేపథ్యంతో నా అనుభవాలు చెప్తాను. పత్రికలలో నాకథలకి “ఈ కథ ఎందుకు రాసేరో అర్థం కావడంలేదు,” అని ఒక వ్యాఖ్య ఉంటే “చాలా బాగా రాసేరు,” అని మరో వ్యాఖ్య ఉండేది. ఒక కథమీద రెండో మూడో అభిప్రాయాలు కనిపిస్తే ఘనం. అంతర్జాలం ప్రవేశించేక, పాఠకులతో ముఖాముఖీ virtual స్థాయిలోనే జరగడం మొదలయింది. ఇది కొంతవరకూ ఆనందదాయకమే.

ఘనంగా కాకపోయినా నా పుస్తకంమీద జరిగిన ఒక చర్చ ఈవ్యాసానికి పనికొచ్చేది ఉంది. అది 20వ శతాబ్దం ఉత్తరార్థంలో స్త్రీల రచనావ్యాసంగానికీ, వారి సాహిత్యప్రస్థానానికీ దోహదం చేసిన ఆర్థిక, సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ నేను రాసిన పుస్తకంమీద వేలూరి వెంకటేశ్వరరావు ఈమాట.కాంలో రాసిన సమీక్ష. నాకు ఆనందమూ, ఆశ్చర్యమూ కలిగించిన సమీక్ష. నేనెంత గొప్పదాన్నో అని కాక కేవలం వస్తువుని విశ్లేషిస్తూ రాసిన సమీక్ష అది. ఆ సమీక్షమీద వచ్చిన వ్యాఖ్యలలో ఈ వ్యాసానికి పనికొచ్చే వ్యాఖ్య బుజ్జాయి అన్నపేరు (బహుశా కలంపేరు)తో రాసింది, “ఎందుకిప్పుడు ఇది రాయడం. పాసిబూరె,” అని. ఆ వాక్యం గౌరవప్రదంగా నాకు అనిపించలేదు కానీ అక్కడ సైటులో ఎవరూ దాన్ని తప్పు పట్టలేదు. ఆ బుజ్జాయే అడిగిన రెండు ప్రశ్నలకి నేను మర్యాదగానే జవాబులిచ్చేను అది సీరియస్ గా జరుగుతున్న చర్చ అన్న అభిప్రాయంతో. ఆయనకి ప్రశ్నలడగమే కానీ పుస్తకం చదివే ఉద్దేశం లేదని అర్థం అయేక పుస్తకం చదివితే వారి ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయని చెప్పి ముగించేసేను.

ఇప్పుడు ఆలోచిస్తుంటే మరో కోణం తోస్తోంది నాకు. ప్రతి పత్రికకీ తరుచూ వ్యాఖ్యానించేవారు కొందరుంటారు. పాఠకులకి ఈ వ్యాఖ్యాతల ధోరణి తెలిసి ఉంటుంది. అలాటి సందర్భాలలో “పాసిబూరె” లాటి పదాలు హేయంగా కనిపించవు. అతనలాగే మాటాడతాడు కానీ చాలా తెలివైనవాడు అంటూ సమర్థిస్తారు. నేను ఆ వ్యాఖ్యలన్నీ చూడను కనక ఆ పదం నాకు అసమంజసంగానే అనిపించింది. వ్యాఖ్యానాలు రాసేవారు తమగుంపులో వారే కాక ఇతరులు కూడా చదువుతారనీ, అపార్థాలకీ తావు అవుతాయనీ కూడా గ్రహిస్తే ఇలాటి వ్యాఖ్యలు రావు. ఇది కూడా నాకు అనుభవం అయింది :).

పై చర్చ అయినతరవాత నేను రాస్తున్న ఊసుపోక ధారలో ఈ వ్యాఖ్య వాడుకున్నాను. బహుశా మీలో కొంతమందికైనా తెలిసే ఉంటుంది ఈ ఊసుపోక కతలలో ప్రధానాంశం హాస్యం, వ్యంగ్యం అని. అనేక సందర్భాలలో నామీదే నేను హాస్యం, వ్యంగ్యం విసురుకున్నాను. ఈ platform అలాటిది కనక సహజంగానే ఆ బుజ్జాయి వ్యాఖ్యని  వ్యంగ్యాత్మకం చేసేను, అమెరికాలో celebrity roastలాగ అనుకోవచ్చు. దానిమీద కొడవళ్ళ హనుమంతరావు వ్యాఖ్యానించేరు. ఆయనకి నారచనలంటే గౌరవమనీ, నేను బుజ్జాయిని అలా హేళన చేయడం మాత్రం బాగులేదనీ వారి వ్యాఖ్య సారాంశం. ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించి విషయం నేను తీసుకున్న అంశాన్ని బుజ్జాయి పాసిబూరె అంటే ఆయనకి ఆభ్యంతరకరంగా కనిపించకపోవడం. హాస్యప్రధానమైన ఊసుపోకలో నేను హాస్యంగా రాసింది అభ్యంతరకరంగా కనిపించడం. నేను ఈమాట.కాంలో మర్యాదగానే జవాబిచ్చేను అన్నది ఆయన గమనించేరో లేదో నాకు తెలీదు. నాబ్లాగులో జరిగిన చర్చ అంతా ఇక్కడ పెట్టను. ఈవ్యాసం చివరలో లింకు ఇస్తున్నాను ఆసక్తి గలవారు చూడవచ్చు.

ముఖపుస్తకంలో చేరేక ఈ వ్యాఖ్యానాలధోరణిలో వచ్చిన మార్పులు నాకు మరింత స్పష్టం అయేయి. ఇది మరొక సంప్రదాయంగా రూపొందిందన్నా తప్పు లేదేమో.

Facebook ప్రధానంగా స్నేహితులు తమ స్వంత కబుర్లు చెప్పుకోడానికీ బొమ్మలు పెట్టుకోడానికీ ప్రారంభించినది. అయినా అనతికాలంలోనే సాహిత్యం, సంగీతం, పద్యం, కథ, సినిమా, పుస్తకాలు – ఇలా ఎవరి అభిమానవిషయాలనుబట్టి వారు పేజీలు ప్రారంభించడంతో “ముఖపుస్తకం కేవలం కాలక్షేపం కబుర్లకి మాత్రమే కాదు” అన్న స్థితికి చేరింది. అలాగే పూర్వ పరిచయాలున్న మిత్రులే కాక కొత్తవారు కూడా మిత్రత్వం కోరడం, అంగీకరించమో లేదా నిరాకరించడమో కూడా జరుగుతోంది. వీటివల్ల వచ్చే ఇతర అనర్థాలు ప్రస్తావించను కానీ వ్యాఖ్యలకి సంబంధించినంతవరకూ మాత్రం చెప్తాను.

అన్ని రంగాలలోలాగే ఇక్కడ కూడా మంచీ చెడూ కూడా ఉన్నాయి. బాగున్నవి – నాసందేహాలకి సూటిగా వివరంగా సమాధానాలు రావడం. ఇది నాకు చాలా నచ్చింది. ఇందుకే ముఖపుస్తకంలో నావ్యాసంగం కొనసాగిస్తున్నది. రెండో భాగం నాకు అంతగా నచ్చనిది – సీరియస్గా అడిగిన ప్రశ్నలకి హాస్యధోరణిలో జవాబులివ్వడం. ఉదాహరణ ఇస్తాను.

“కరుణ ఏవ ఏకో రసః” అని భవభూతి  వాక్యం. నాకు ఈ వాక్యం పరిచయమే కానీ పూర్వాపరాలు తెలీవు. అంచేత నా పేజీలో అడిగేను. సంగతి సందర్భాలు తెలిసినవారు చక్కగా వివరించేరు. నేను సంతోషించేను. అదే సమయంలో మరొకతను ప్రవేశించి “ఇంకా చాలా రసాలున్నాయి. నీరసం, నిమ్మరసం …” అంటూ వ్యాఖ్య పెట్టేడు నా టపాదగ్గర. నేను వెంటనే అలాటి వ్యాఖ్యలమూలంగా అసలు విషయం పక్కదారి పట్టే అవకాశం ఉందనీ, అంచేత అలా రాయవద్దని చెప్పేను. దానికి అతను, “నాకు హాస్యం ఇష్టం. అష్టావధానంలో అప్రస్తుతప్రసంగంలాగే ఇది,” అని సమర్థించుకున్నాడు. నాకు మాత్రం కాదనే అనిపించింది. అష్టావధానం ఒక సాహిత్యప్రక్రియ. అక్కడ చెల్లింది కదా అని ప్రతి చోటా అప్రస్తుతప్రసంగం చెల్లుతుందనుకోడం సరి కాదు. ముఖ్యంగా  సీరియస్గా ఒక విషయం చర్చిస్తున్నప్పుడు హాస్యం, హేళన, వ్యంగ్యం ప్రయోగిస్తే, నాకే కాదు సీరియస్గా సమాధానాలిస్తున్నవారికి కూడా నిరుత్సాహంగానే ఉంటుంది. వారిని కూడా కించపరచినట్టే అవుతుంది. ఇంతకుముందు చర్చించిన పాసిబూరె లాటిదే ఇది కూడా.

పూర్వకవులూ, ఆ తరవాత వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం పంతులువంటివారు వ్యక్తిగతంగా పత్రికలలోనే ఒకరినొకరు హేళన చేసుకున్న సందర్భాలు ఉన్నా వారందరూ వ్యక్తిగతపరిచయాలు గలవారు. ఏమాట ఎక్కడ నప్పుతుందో తెలిసినవారు. అంతర్జాలంలో అలా కాదు. అంతా తెరవెనక భాగోతమే. నూటికి తొంభైతొమ్మిది పాళ్ళు ఎవరు ఎవరో తెలీదు. ఏ ఉద్దేశంతో ఏమాట అంటున్నారో తెలీదు. తరుచూ కనిపించే పేర్లమూలంగా తెలిసినట్టు అనిపించినా అది నిజంగా తెలియడం కాదు.

ఈ రోజుల్లో మామూలయిపోయిన రెండో రకం వ్యాఖ్యలు – రచయిత రాసిన వాక్యం సంపూర్ణంగా కాక ఏదో ఒకమాట తీసుకుని పక్కదారి పట్టించడం. అంటే సూటిగా నావాక్యానికి వ్యాఖ్యానం కాక అందులో ఒక మాట తీసుకుని మరో కోణం చెప్పడం. ఒకొకప్పుడు ఆ కోణానికి సందర్భశుద్ధి ఉండదు. కిందటేడు ముఖపుస్తకం నాపేజీలో నేను ఇది పోస్టు చేసేను –

రచయితకి మరణం రెండు మార్లు.

ప్రాణం పోయినప్పుడు

ప్రజలు మరిచినప్పుడు.

రెండోమరణం రెండు రెట్లు దారుణం.

దీనిమీద వచ్చిన ఒక వ్యాఖ్య “ఆ రచయిత చావడమే మేలు” అని. ఈ వ్యాఖ్య ఇంగ్లీషులో ఉంది, “he better die.” నేను రాసింది రచయిత రచయితగా  పాఠకులదృష్టిలో ఎంతకాలం అన్నది. పాఠకులు మరిచిపోతే ఎంత మంచి రచయిత అయినా ఎన్ని రచనలు చేసినా మృతుడితో సమానం అన్న భావానికి గురి అవుతాడు అని. ఆ రచయిత చచ్చిపోవడమే మంచిది అన్న వ్యాఖ్యలో ఆ భావం లేదు. నేను వివరణ అడిగితే, “విశ్వనాథ సత్యనారాయణలా ఎవరూ రాయడంలేదు, ఈరోజుల్లో మంచి సాహిత్యం రావడం లేదు” అన్నారు ఆయన. నావాక్యంలో మరణం మాట ఉంది కనక తానలా వ్యాఖ్యానించేనని కూడా చెప్పేరు. నా రెండో వాక్యంలో మరణం అంటే మానసికంగా రచయిత అనుభవించే మరణం అని. ఎ.వి. రమణమూర్తిగారు ఈ వివరణ ఇవ్వడంతో నాపని తేలిక అయింది.

నాపోస్టుకీ వ్యాఖ్యాత కొంపెల్ల శర్మ వెలిబుచ్చిన అభిప్రాయానికీ మధ్య గల తేడా గమనించండి. విశ్వనాథవారిలా రాసేవారు మళ్ళీ పుట్టకపోవచ్చు. కానీ ఆ కారణంగా తెలుగు సాహిత్యం అక్కడితో ఆగిపోయిందనో ఆగిపోవాలనో అనడం సబబేనా? అన్నది ఒక ప్రశ్న. మిగతా రచయితలందరూ నిజంగా రచయితలు కాకుండా పోతారా అన్నది మరో ప్రశ్న. మరి కొంపెల్ల శర్మ కూడా సాహిత్యం సృష్టిస్తూనే ఉన్నారు గదా, వారు కొనసాగించడాన్ని ఎలా సమర్థించుకుంటారు అన్నది మూడో ప్రశ్న. ఈ ప్రశ్నలు ఇక్కడితో ఆపుతాను. నా మొదటి వాదన- ఒక రచనకీ దానిమీద వచ్చిన వ్యాఖ్యలకీ ఎడం ఎంతగా పెరిగిపోతోందో, ఎంత అర్థరహితం అయిపోతోందో తరిచి చూసుకుందాం అంటున్నాను.

మూడోరకం వ్యాఖ్యలు రచనలో అంశాలను రచయితకు ఆపాదించి వ్యాఖ్యానించేవి. నేను రాసే కథల్లోనూ వ్యాసాల్లోనూ నా అనుభవాలు ఉన్నా అవి సార్వజనీనం అనుకున్నప్పుడే వాటిని కథల్లో వ్యాసాల్లో చొప్పిస్తాను. అంటే అది ఒక్క నా అనుభవమే కాదు, చాలామందికి వర్తిస్తుంది అని. అలాటప్పుడు అది నా ఆత్మకథ అయిన్నట్టుగా నాజీవితంలో ఇతర విషయాలు ప్రస్తావించడం, నాకు “సముచిత” సలహాలివ్వడం, సానుభూతి చూపడం వంటివి చేస్తున్నారు. అపార్థం చేసుకోకండి. నేను ఈ విషయం ఇక్కడ ప్రస్తావిస్తున్నది ఇది నా ఒక్క అనుభవమే కాదు అని చెప్పడానికే. చాలామంది రచయితలు నాతోనే ప్రత్యక్షంగా చెప్పేరు వారికి కూడా ఇలాటి  అనుభవాలు ఎదురవుతున్నాయని.

ఈ విషయంలో చిన్న ప్రయోగం చెయ్యదలుచుకుని నేను ముఖపుస్తకంలో రెండు పోస్టులు పెట్టేను. ఒకటి నాపేరుతోనే.

చిన్న చిన్న నొప్పులు చీమల్లా గులాబీముళ్ళలా

ప్రాణాంతకాలు కావు కానీ పనులు చేసుకోనివ్వవు.

ఇది నా స్వంత అనుభవమని చెప్పలేదు. ఏం చెయ్యమంటారని సలహాలు అడగలేదు. అయినా సలహాలు వచ్చేయి. సుప్రసిద్ధులయిన కవులూ, వేదాంతవిదులూ చెప్పిన వాక్యాలు ప్రతిరోజూ కనీసం 5, 6 కనిపిస్తాయి ముఖపుస్తకంలో. ఆ ప్రవచనాలదగ్గర ఏ సలహాలూ ఉండవు.

అది ఋజువు చేసుకోడానికి నాపేరు చెప్పకుండా కొన్ని వాక్యాలు రాసేను.

“కవులు ఉపాధ్యాయులు సుభాషితములు చెప్పుదురు.

నటులు, నాయకులు నటింతురు”

– అజ్ఞాతకవి.

“కవులు స్వీయ అనుభవము వ్రాసినను అది లోకసామాన్యముగ మాత్రమే ఆవిష్కరింతురు. కొందరు అమాయకులు దానిని కవిజీవితమునకు అన్వయించి స్పందించవచ్చును. నేను గాడిదగురించి వ్రాసిన నన్ను గాడిదగా గుర్తించవచ్చును. స్వర్గమునుగూర్చి వ్రాసిన నేను స్వర్గవాసినయితినని తలపవచ్చు.”

– అజ్ఞాత కవి.

ఈ పోస్టులమీద చర్చ వస్తువుమీదే జరిగింది. నేనే రచయితని అని కొందరు గ్రహించేరని తరవాత తెలిసింది కానీ వ్యాఖ్యానాలలో వ్యత్యాసం సుస్పష్టం.

స్థూలంగా చెప్పాలంటే పూర్వం రచయితలు, స్థానికులూ, వ్యక్తిగతస్థాయిలో పరిచయాలు ఉన్నవారూ విమర్శలూ, వ్యాఖ్యానాలూ వైయక్తికస్థాయిలో నడుపుకున్నారు. ఇప్పుడు సాహిత్యవేదిక virtual వేదికగా రూపాంతరం పొందింది. వ్యాఖ్యాతలు తదనుగుణంగా తమపద్ధతులని దిద్దుకోవాలి. జాలపరిచయాలు ఇతరత్రా వ్యక్తిగత పరిచయాలుగా మారే అవకాశం ఉంది కానీ ఒక రచయితపేరు తరుచూ అంతర్జాలంలో చూసినంతమాత్రాన ఆ రచయితతో హాస్యాలాడే పరిచయం ఏర్పడిపోయినట్టూ కాదు. అది సమంజసమూ కాదు. వస్తువుమీద దృష్టి ఉంచి చేసిన వ్యాఖ్యలకి ఉన్న గౌరవం హేళనకీ, ప్రధానాంశాన్ని వదిలేసి తమకి తోచినట్టు రాసే వ్యాఖ్యలకీ ఉండదు. రచయితలు విమర్శలను ఆదరించడంలేదు అని రచయితలని తప్పు పట్టేముందు విమర్శలూ, వ్యాఖ్యలూ ఆమోదించదగ్గవిగా ఉన్నాయో లేదో కూడా చూడాలి.

రచయితలూ వ్యాఖ్యాతలూ – ఇరు పక్షాలవారూ వస్తునిష్ఠతో తమ ఆలోచనలు వ్యక్తం చేస్తేనే వీరికీ వీరికీ కూడా గౌరవమూ, సాహిత్యానికీ గౌరవమూను క్షీరనీరన్యాయంగా. లేకపోతే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అయి అర్థరహితం అయిపోతుంది చర్చ.

 

000

నా ఊసుపోక టపాకి లింకు ఇక్కడ

(జులై 12, 2016)

తేలియాడే మేఘాల్లో  … తనూజ  

 

సోలో ట్రావెలింగ్ 

 

వి. శాంతి ప్రబోధ

~

ఒక్కదాన్నే .. నేనొక్కదాన్నే..

ఇదే మొట్టమొదటిసారి ఎవ్వరూ వెంటలేకుండా ఒంటరిగా ప్రయాణం..
బెంగుళూర్ కో,  చెన్నైకో, పూనేకో   కాదు.  చిన్ననాటి నుండి కళ్ళింతలు చేసుకుని బొమ్మల్లో చూసి మురిసిన  హిమాలయాలలో తిరుగాడడం తనను చూసి తనే ఆశ్చర్యపోతోంది తనూజ.

 

అద్భుతంగా .. కొత్తగా గమ్మత్తుగా.. నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి నాకు నన్నే ప్రత్యేకంగా నిలబెడుతూ .. బయటి ప్రపంచం తెలియకుండా పెరిగిన నేను నేనేనా…  అనే విస్మయాన్ని వెన్నంటి వచ్చిన ఆనందం ..  ఆశ్చర్యం మనసు లోతుల్లోంచి పెల్లుబికి వచ్చి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి .

 

నా కళ్ళ ముందున్న ప్రకృతిని చూస్తుంటే నేను ఉన్నది ఇండియాలోనేనా ..అనేంత  వైవిధ్యం .. ఆ చివర నుండి ఈ చివరికి ఎంత వైరుధ్యం …?

ఒకే దేశంలో ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య మనిషి ఏర్పాటు చేసుకున్న సంస్కృతీ సంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు , భాషలు మాత్రమే కాదు ప్రకృతి కూడా విభిన్నంగానే . విచిత్రంగానే ..  ఆ భిన్నత్వమే.. నూతనత్వం వైపు పరుగులు పెట్టిస్తూ..  కొత్తదనం కోసం  అన్వేషిస్తూ.. భావోద్ద్వేగాన్ని కలిగిస్తూ.. మనసారా  ఆస్వాదిస్తూ… తనువంతా ఉత్సాహం నింపుతుందేమో .. ???  ఒంకర టింకర ఎత్తుపల్లాల గతుకుల రోడ్డులో కదులుతున్న మహీంద్రా జీప్ లాగే ఆమె ఆలోచనలూ .. ఎటునుండి ఎటో సాగిపోతూ ..
తననే పట్టి పట్టి చూస్తున్న బాయ్ చూపులు, హోటల్ ఫ్రంట్ డెస్క్ వాళ్ళ చూపులూ  గుర్తొచ్చాయామెకి .  రూం బాయ్ మొహమాటంలేకుండా హైదరాబాదీ అమ్మాయిలు చాలా ధైర్యవంతులా..  ఆశ్చర్యంగా మొహం పెట్టి మనసులో మాట అడగడం,  విదేశీ మహిళలు ఒంటరిగా రావడం తెలుసు కానీ భారతీయ మహిళలు ఇలా రావడం తానెప్పుడు చూడలేదనడం జ్ఞాపకమొచ్చి ఆమె  హృదయం ఒకింత  గర్వంగా ఉప్పొంగింది. తనకిచ్చిన గొప్ప  కాంప్లిమేంట్ గా ఫీల్ అయింది.

 

దేశంలో ఏ మూలకెళ్ళినా భారతీయ సంస్కృతిలో ఆడపిల్లల స్థానం ఎక్కడో తెలిసిందే కదా.. ఎంత మిస్ అయిపోతున్నారు అమ్మాయిలు అని ఒక్క క్షణం మనసు విలవిలలాడింది. కానీ, కళ్ళ ముందు తగరంలా మెరిసే మంచు కొండల  సుందర దృశ్యాలు కదిలిపోతుంటే  వాటిని మదిలో ముద్రించుకుంటూ మళ్లీ ఆలోచనల్లో ఒదిగిపోయింది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనూజ.
మనసులోంచి ఎగిసివచ్చే ఆలోచనల్ని అనుభూతుల్ని ఎక్జయిట్ మెంట్ ని ఎప్పటికప్పుడు పంచుకునే మనషులు లేరనే చిన్న లోటు ఫీలయింది ఆ క్షణం.

వెంటనే హ్యాండ్ బాగ్ తెరిచి ఫోన్ అందుకుంది. సిగ్నల్స్ లేవు.
ప్చ్..  నా పిచ్చిగానీ ఈ హిమపర్వత శిఖరాలపైకి నేను వచ్చానని ఫోన్  సిగ్నల్స్ నాతో పాటు పరుగెత్తుకొచ్చేస్తాయా ? తనలో తనే  చిన్నగా నవ్వుకుంది.  ఆత్మీయనేస్తం మనోరమ ఇప్పుడుండి ఉంటే .. ప్చ్ .. యూ మిస్స్డ్  ఎ లాట్ మనో .. అవును, నిజ్జంగా  మనో .. మనని ఒక వ్యక్తిగా కాకుండా ఆడపిల్లగా చూడ్డం వల్ల ఎంత నష్టపోతున్నామో ..
నీతో చాలా చెప్పాలి మనో.  చూడు నా జీవితంలో ఇంతటి అద్భుతమైన క్షణాలు కొన్ని ఉంటాయని అసలెప్పుడయినా అనుకున్నానా .. అనుకోలేదే.  కానీ ఆ క్షణాలను మనవి చేసుకునే చొరవ ధైర్యం మనలోనే ఉన్నాయని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. వాటిని మనం తెలుసుకోవాలి. మన జీవితంలోకి తెచ్చుకోవాలి. ఆ క్షణాలిచ్చిన వెలుతురులో మన జీవితపు బండిని మనమే నడుపుకోవాలి.

నువ్వు  నా మాటల్ని చిన్న పిల్లల మాటల్లా తీసుకోకుని నవ్వుకుంటావని తెలుసు .  అయినా చెప్తున్నాను , మన జీవితపు  పగ్గాలు మన చేతిలోకాకుండా మరొకరి చేతిలో ఉంటే ఎలా ఉంటుందో స్పష్టంగా అర్ధమవుతోంది.  నాలో పొరలు పొరలుగా కప్పడిపోయిన ఊగిసలాటల పొరలు రాలిపోతూ.. కరిగిపోతూ ఉన్నాయి.

 

ఈ ప్రయాణం జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన  ఇచ్చింది… అది తెల్సుకోలేకపోతే .. ఎంత మిస్సవుతామో, ఎంత కోల్పోతామో నాకిప్పుడు స్పష్టమవుతోంది.
అవును మనో .. నివ్వెంత మిస్ అయ్యావో మాటల్లో చెప్పలేను మనసులోనే మాట్లాడేస్తోంది తనూజ మిత్రురాలు మనోరమతో.  నీలాకాశంలో తేలిపోతున్న మేఘాల్లో ఒక మేఘమాలికలా తనూ తేలిపోతున్నట్లుంది ఆమెకు .

ఈ రోజు టూరిజం డిపార్ట్మెంట్ వారి వాహనంలో  గ్యాంగ్ టక్ నుండి ఎత్తు పల్లాల గతుకుల రోడ్డులో కొన్ని గంటల ప్రయాణం.

నేను ఒక్కదాన్నే .. థ్రిల్లింగ్ గా .  ఆ  తర్వాత వచ్చింది చాంగు లేక్.

 

నెత్తి మీద నుండి తేలిపోయే మేఘాల్లోను , కళ్ళముందు పొగమంచులా కదిలిపోయే  మబ్బుల్లోంచి ఈ మూడు గంటల ప్రయాణం.. ఓహ్ .. అమోఘం. అద్బుతం.  ముందున్నవి కన్పించనంతగా మేఘం కమ్మేసి .. ఓ పక్క ఎత్తైన కొండలు మరో వైపు లోతైన లోయలు. వాటి అంచులో ప్రయాణం ప్రమాదపుటంచుల్లో ఉన్నట్లే సుమా..!.  వాహనం ఏమాత్రం అదుపు తప్పినా , డ్రైవర్ ఏ కొద్ది అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు.  ప్రతి టర్నింగ్ లోనూ హరన్ కొడుతూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ .. కమ్మేసిన మేఘం కింద దాగిన సరస్సు ను  చూసి నాలో నిరాశా మేఘం.

 

అంత కష్టపడి వచ్చానా..  లేక్ కన్పించలేదు.  పన్నెండు గంటలయినా సూర్యకిరణాల జాడలేదు.  నిస్పృహతో నిట్టుర్చాను.

అది గమనించాడేమో .. దగ్గరలో  బాబా హర్భజన్ సింగ్ ఆలయం ఉందని డ్రైవర్ చెప్పాడు.

అక్కడికి బయలు దేరా.  పాత టెంపుల్ నుండి  కొత్త టెంపుల్ కి వెళ్ళే దారిలోనే  టాక్సీ డ్రైవర్ ఇల్లు ఉందని తన ఇంటికి ఆహ్వానించాడు.
ఆహ్హాహ్హ.. నాకు వినిపిస్తోందిలే నువ్వేమంటున్నావో .. నీకు బుద్దుందా అని అచ్చు  మా అమ్మలాగే .. తిట్టేస్తున్నావ్ కదూ..? నువ్వు అట్లా కాక మరోలా ఆలోచిస్తావ్ .. ?

కానీ ఇప్పుడు చూడు, నేను ఒంటరి ఆడపిల్లననే భావనే కలుగలేదు తెలుసా ..?!.

 

జనసంచారం లేని కొత్త ప్రాంతం.  డ్రైవర్ వాళ్ళింటికి రమ్మనగానే వెళ్ళాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించాను కానీ అది భయంతో కాదు.  శరీరాన్ని చుట్టుకున్న మేఘాల అలల ఒడిలో ప్రయాణం ఎక్కడ మిస్ అవుతానో అన్న మీమాంసతోనే సుమా .  నాకిక్కడ పగటి  కాపలాలు రాత్రి కాంక్షల విచారాలు అగుపించలేదబ్బా …

 

ఇంతటి ప్రతికూల వాతావరణంలో వీళ్ళు ఎలా ఉంటారో .. అనుకుంటూ  డ్రైవర్ తో మాటలు కలిపాను.

ప్రకృతి సౌందర్యం గొలుసులతో కట్టేసినట్లుగా ఉన్న నేను ఇప్పటివరకూ అతని వాహనంలోనే ప్రయాణించానా .. కనీసం అతని  పేరయినా అడగలేదన్న విషయం స్పృహలోకొచ్చి అడిగాను .
అతని  పేరు గోవింద్.  చిన్న పిల్లవాడే. ఇరవై ఏళ్ళు ఉంటాయేమో . చురుకైనవాడు.   చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. అక్కడి వారి జీవితం గురించి చెప్పాడు.
మేం వెళ్లేసరికి వాళ్ళమ్మ చేత్తో ఏదో కుడుతోంది.  చేస్తున్న పని ఆపి లేచి తల్లి మర్యాదగా లోనికి  ఆహ్వానించింది.  తండ్రి పగటి నిద్రలో ఉన్నాడు.

నేను మాట్లాడే హిందీ ఆమెకు అర్ధం కావడం లేదు.  ఆమె మాట్లాడే టిబెటియన్ సిక్కిం భాష నాకు తెలియదు.

 

పేదరికం ఉట్టిపడే చెక్క ఇల్లు వారిది. చాలా చిన్నది కూడా . లోపలికి వెళ్ళగానే  రూం హీటర్ వల్ల వెచ్చగా ఉంది.   వాళ్ళమ్మ చేస్తున్న పని ఆపి వెళ్లి పొగలు కక్కే టీ చేసి తీసుకొచ్చింది.  నేను టీ తాగనని నీకు తెలుసుగా .. వాళ్ళు నొచ్చుకుంటారనో లేక  ఆ కొంకర్లు పోయే చలిలో వేడి వేడి టీ తాగితే హాయిగా ఉంటుందనో  గానీ ఆ నిముషంలో వారిచ్చిన టీకి నో అని చెప్పలేకపోయాను .

daari 2

వారిచ్చిన హెర్బల్ టీ  ఆస్వాదిస్తూ పాడి ఉందా అని ఆడిగా.  నాలుగు జడల బర్రెలు ఉన్నాయని అవి టూరిస్ట్ సీజన్ లో వారికి ఆదాయాన్ని తెచ్చి పెడతాయని చెప్పారు. ఎలాగంటే ప్రయాణ సాధనంగా జడల బర్రెని వాడతారట .  నాకూ అలా ప్రయాణించాలని కోరిక మొదలైంది.

 

పాలు, పెరుగు కోసం జడల బర్రె పాలే వాడతారట. చనిపోయిన దాని చర్మంతో చాల మంచి లెదర్ వస్తువులు ప్రధానంగా షూ చేస్తారట .  వాళ్ళింట్లో తయారు చేసిన రకరకాల చేతి వస్తువులు చాలా ఉన్నాయి .  అన్ సీజన్ లో వాళ్ళు ఇల్లు కదలలేరు కదా .. అలాంటప్పుడు ఇంట్లో కూర్చొని తమ దగ్గరున్న వస్తువులతో హండీ క్రాఫ్ట్స్ చేస్తారట.  టూరిస్ట్ సీజన్ లో వాటిని టూరిస్ట్ లకు అమ్ముతారట .  వాళ్ళమ్మ చేసిన వస్తువులు చాలా బాగున్నాయి. వేటికవి కొనాలనిపించినా రెండు హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే కొన్నాను. నీ కొకటి , నాకొకటి .

 

తర్వాత గోవిందు వాళ్ళ నాన్నను లేపి నన్ను పరిచయం చేశాడు. తమ భాషలో ఏదో చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి వాతావరణం కాస్త అనువుగా మారుతుండడంతో మేం చాంగులేక్ కేసి వెళ్ళిపోయాం.

 

టూరిస్టులు ఎవరూ కనిపించలేదు. చుట్టూ ఎత్తైన పర్వతాలు తప్ప .  దగ్గరకు వచ్చేవరకూ అక్కడ ఒక లేక్ ఉన్న విషయమే తెలియదు. అలాగే వేచి చూస్తున్నా .. గాలికి కదలాడే సన్నని ఉల్లిపొర తెరల్లా నెమనెమ్మదిగా మేఘం తరలి పోతూ .. వెలుతురు పలచగా పరుచుకుంటూ ..

 

చుట్టు ముట్టు ధవళ కాంతులతో మెరిసే పర్వతాల నడుమ దోబూచులాడే మేఘపు తునకల కింద చంగూలేక్ . నా కళ్ళను నేనే నమ్మ లేకపోయానంటే నమ్ము.  అప్పటివరకూ ఈ అందాలను మేఘం చీకటి దుప్పటిలో దాచేసిందా..  కళ్ళ గుమ్మం ముందు అద్భుత సౌందర్యం కుప్ప పోసినట్లుగా .. రెప్పవాల్చితే ఆ సౌందర్యమంతా కరిగి మాయమవుతుందోనని ఊపిరి బిగబట్టి చూశాను .
తెల్లటి మేఘ విహంగాల  మధ్యలోంచి నడచి వస్తున్న జడల బర్రె  మసక మసకగా అగుపిస్తూ . అది ఎక్కవచ్చా.. మనసులోంచి ప్రశ్న పైకి తన్నుకొచ్చింది.  డ్రైవర్ విన్నట్లున్నాడు . మీ కోసమే దాన్ని నాన్న తీసుకొస్తున్నాడు. ఎక్కి సరస్సు చుట్టూ తిరిగి రావచ్చని చెప్పడంతో ఎగిరి గంతేసింది మనసు.
పొట్టి మెడతో నల్లగా పొడవైన జుట్ట్టు చిన్న చెవులు, రంగు కాగితాలు చుట్టి అలంకరించిన కొమ్ములు ,  దాని వీపుపై వేసిన దుప్పటి మన గంగిరెద్దులపై వేసినట్లుగా వేసి ఉంది . కాకపొతే బలంగా కనిపిస్తోంది .

 

మేఘం పోయి వెలుతురు బాగా పరుచుకుంది.  గంట క్రితం ఇక్కడ ఎంత చీకటి .?  పది అడుగుల దూరంలో ఉన్నది అస్సలు కన్పించనంతగా ..
నెమ్మదిగా జడలబర్రె మీద ఎక్కుతుంటే కొంచెం భయమేసింది . ఎక్కడ పడేస్తుందోనని.  నా కెమెరా గోవింద్  కిచ్చి ఫోటోలు తీయించుకున్నా. వాళ్ళ నాన్న యాక్ కి కట్టిన ముకుతాళ్ళు పట్టుకొని ముందు నడుస్తూ లేక్ చుట్టూ తిప్పుకోచ్చాడు .  అప్పుడు నా మనసులో కలిగిన ఉద్వేగాన్ని, అనుభూతుల్ని, అద్వితీయ భావాన్ని  నీకు సరిగా అనువదించగలనో లేదో .. సందేహం ..
వింతగా అనిపిస్తోందా మనో .. చిన్నప్పుడెప్పుడో యాక్ ఫోటో పుస్తకాల్లో చూడడం , చదవడం గుర్తొస్తోందా .. ఆ యాక్ పై కూర్చొని చంగూలేక్ చుట్టూ చక్కర్లు కొట్టి వచ్చా .

 

అక్కడి బోర్డ్ ఇంగ్లీషు, టిబెటియన్ భాషల్లో ఉంది. మనవాళ్ళు  చంగూ లేక్ అంటే ట్సొంగు లేక్ అని టిబెట్ వాళ్ళు అంటారట.   ఈ సరస్సు  సిక్కిం -టిబెట్ బార్డర్ కు దగ్గరలో తూర్పు దిశలో  ఉంది.  ఆ లేక్ కి వెళ్ళే దారి  కొన్నిచోట్ల బాగుంది. కొన్ని చోట్ల కనస్ట్రక్షన్ లో ఉంది. అక్కడ కొండ చరియలు విరిగి పడడం తరచూ జరుగుతూ ఉంటుందట.  కాబట్టి రోడ్లు తరచూ పాడయి పోతుంటాయట.  కంగారు పడకు తల్లీ .. నేను వెళ్ళిన సమయంలో కొండచరియలు విరిగిపడడం జరగలేదులే. అందుకే  ప్రతి మూడు నెలలకొకసారి రోడ్డు వేస్తూనే ఉంటారట. జీప్ కుదుపుతో కొన్ని సెకన్ల పాటు ఆమె ఆలోచనలకు చిన్న అంతరాయం.  ఆవెంటనే మళ్ళీ మనో వీధిలో ఆప్తమిత్రురాలు మనోతో ముచ్చట్లాడుతూ .

 

మనో తిట్టుకుంటున్నావా ..  ఎంత తిట్టుకుంటావో తిట్టేసుకో .. ఇప్పుడు హోటల్ చేరగానే ఫోన్ చేస్తాగా ..  గాంగ్ టక్ లో దిగగానే చేశాను .  అంతే.  నువ్వు నా కాల్ కోసం ఎంత ఆత్రుతపడుతున్నావో ఉదయం నీ మిస్డ్ కాల్స్ చూస్తే అర్ధమవుతోంది.  నిన్న గురుడాంగ్ మార్ లేక్ నుండి రాగానే చేద్దామనుకున్నా .. సిగ్నల్స్ లేక చేయలేకపోయాను.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు చేస్తాలేవే ..

 

ఆ .. అన్నట్టు , నా పర్యటనలో  ముందటి రోజుల  విశేషాలు చెప్పలేదు కదూ .. నేను గ్యాంగ్ టక్ లో ముందే బుక్ చేసుకున్న హోటల్ చేరానా .. హోటల్ రూంలోంచి దూరంగా కనిపిస్తూ రా రమ్మని ఆహ్వానిస్తున్న హిమాలయాలు, వాటి చెంత చేరాలని ఉవ్విళ్ళూరుతున్న మనసును కొన్ని గంటలు ఆపడం ఎంత కష్టమయిందో..అప్పటికప్పుడు వెళ్లిపోలేను కదా .. !

 

నిరంతరం వచ్చే టూరిస్టులతో నిండి ఉండే హోటల్ వారికి ఇంకా చాలా విషయాలు తెలిసి ఉంటాయనిపించింది.  ఎటునుండి ఎటు వెళ్ళాలి అని మ్యాప్  పరిశీలించా .
నేనున్న హోటల్ లోని టూరిస్టులతో పిచ్చాపాటి మాటలు కలిపాను . వాళ్ళలో బెంగాలీ టూరిస్టులతో పాటు  కొద్దిమంది  విదేశీయులు  ఉన్నారు.   మరుసటి రోజు ఉదయం బయలుదేరి  త్రికోణంలో ఉండే గురుదాంగ్ మార్  లేక్, లాచుంగ్  ఆ తర్వాత యుమ్మాంగ్ ల ప్రయాణం పెట్టుకున్నామనీ , వాళ్ళ వాహనంలో మరో ఇద్దరికి చోటుందని మాటల్లో  చెప్పారు వాళ్ళు.  ఆ హిమపర్వతాల యాత్ర మహాద్బుతంగా ఉంటుందని విని వున్నాను కదా .

daari 9

వెంటనే ట్రావెల్ డెస్క్ వాళ్లతో మాట్లాడాను. వాళ్ళు టూరిజం డిపార్టుమెంటుతో  కాంటాక్ట్  ఏర్పాటు చేశారు . అదే రోజు నా ఫోటోలు, వివరాలు తీసుకుని మరుసటి రోజు నా ప్రయాణానికి పర్మిట్ వచ్చేలా చేశారు. ఇది  ఏప్రిల్ మూడో వారం కదా .. టూరిస్టులు మరీ ఎక్కువగా లేరు. ఇకనుండీ రోజు రోజుకీ పెరుగుతారట.  అదే టూరిస్టులు ఎక్కువగా ఉండే సమయాల్లో  పర్మిట్ రావడంలో ఆలస్యం కావచ్చట.  నేను వెళ్ళింది పీక్ టైం కాదు కాబట్టి నాకు వెంటనే పర్మిట్ వచ్చేసింది.   నేనూ వాళ్లతో జత కలిశాను . నలుగురు బెంగాలీలు, ఒక విదేశీ నేనూ వెళ్ళాం. ఖర్చు తగ్గుతుంది కదాని అందరం కలసి ఒకే వాహనంలో వెళ్ళే ఏర్పాటు.  మొత్తం మూడురోజుల ప్రయాణం.

 

వింటున్నావా మనో .. ఆ ప్రయాణం ఆద్యంతం అత్యద్భుతం . ఉదయం 11 గంటల సమయంలో గ్యాంగ్ టక్  నుండి మా ప్రయాణం ఆరంభమైంది. ఎత్తైన మంచు కొండలు , లోతైన లోయలు , దట్టమైన అడవులు దాటుతూ  అద్భుత అందాలతో అలరారే గ్రామాలను పలకరిస్తూ   సాయంత్రం 6 గంటలకి లాచుంగ్ చేరాం.

 

లాచుంగ్ 10వేల అడుగుల ఎత్తులో ఉన్న చిన్న పట్టణం. అక్కడికి వెళ్ళే దారిలో మంచు కరిగి ప్రవహిస్తూ  కొండలపై నుండి కిందకు సవ్వడి చేస్తూ జారిపోయే జలపాతాలు .. ఆ రోజు రాత్రి బస లాచుంగ్ లోనే. అక్కడి నుండి యుమ్తంగ్ లోయ చూసి పాములాగా మెలికలు మెలికలు తిరిగి షార్ప్ కర్వ్స్ తో ఉండే  రోడ్డులో  జీరో పాయింట్ కు చేరాం .. అదంతా మంచుతో నిండి ఉంది. మంచు కరుగుతూ  పాయలు పాయలుగా రాళ్ళను ఒరుసుకుంటూ పల్లంకేసి జారిపోతూ చేసే గలగలలు .. తీస్టా నదిలోకి పరుగులుపెడుతూ చేసే సవ్వడులు ..

 

ఆ నదితో పాటే ఉరకలు వేస్తూ కొండా కోనల్ని పలుకరిస్తూ అలా వెళ్లిపోవాలనిపించింది ఆ క్షణం.. తీస్టా నది బంగ్లాదేశ్ మీదుగా ప్రయాణించి  బ్రహ్మపుత్ర నదిలో ఐక్యం అవుతుందట. తిరుగు ప్రయాణం  మళ్లీ లాచుంగ్,  చుగ్తాంగ్ మీదుగానే లాచన్ చేరి అక్కడే బస చేశాం. మూడో రోజు  తెల్లవారు జామున 3గంటలకే  బయలుదేరి  8 గంటలకి  గురుడాంగ్ మార్  లేక్ కి చేరాం. మార్గ మధ్యలో తంగు వ్యాలీ లో ఆగి బ్రేక్ పాస్ట్ చేసాం.

 

లాచన్ నుండి దాదాపు ఐదు గంటల ప్రయాణం అత్యద్భుతంగా … ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో రెండోదట గురుడాంగ్ మార్ లేక్  చేరాం.  భూమికి 17100 అడుగుల ఎత్తులో ఉన్నాం.

 

ఏయ్ నీకు తెలుసా .. ?

ఎంత హిమపాతం ఉన్నప్పటికీ  వాతావరణం ఎంత మైనస్ డిగ్రీలలో ఉన్నప్పటికీ  గురుడాంగ్ మార్ లేక్ లోని  నీరు కొంత ప్రాంతంలో  గడ్డకట్టదట.  బుద్దిస్ట్ మాంక్ గురు పద్మసంభవ అక్కడి నీళ్ళు ముట్టుకొని తాగి దీవించడం వల్లే ఆ నీటికి పవిత్రత వచ్చిందనీ, అందుకే ఆ ప్రాంతంలోని నీరు గడ్డకట్టదని సిక్కిం ప్రజల నమ్మకం అని నాతో కలసి ప్రయాణం చేసిన బెంగాలీలు చెప్పారు.  చలికాలంలో అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. చూడలేరు కదా ..? వెళ్ళడానికి ఎవరికీ పర్మిషన్ ఇవ్వరు అన్న సంగతి తెలిసిందే కదా .. అలాంటప్పుడు ఆ ప్రాంతంలో నీరు గడ్డ కట్టిందో లేదో ఎవరికైనా ఎలా తెలుస్తుంది చెప్పు ?

 

గురుడాంగ్ మార్ లేక్ నీరు  తిస్టా నదికి ప్రధాన సోర్స్ ల్లో ఒకటి అట. ఈ లేక్ కి చుట్టు పట్ల మరో రెండు లేక్స్ ఉన్నాయి. వాటికి మేం  వెళ్ళలేదు. ఇండో – టిబెట్ సరిహద్దులో ఉన్న ఈ  మూడు సరస్సులను చూడాలంటే  ఆర్మీ పర్మిషన్ తప్పని సరి అవసరం. తీస్టా నదిలో దిగి ఆ స్వచ్ఛమైన నీటిలో కాసేపు ఆడుకున్నాం. ఆ నీటి అడుగున ఉన్న గులక రాళ్లు నునుపుదేలి ఎంత స్వచ్ఛంగా మెరిసిపోతున్నాయో .. నువుంటే ఆ రాళ్ళన్నీ మూటగట్టుకు వచ్ఛేదానివి . నీ కాక్టస్ ల చుట్టూ అలంకరించడానికి .
అక్కడ ఉన్నంత సేపూ నేను నా దేశంలోనే ఉన్నానా అనే సందేహం.  కానీ ,   సిక్కిం ఉన్నది మనదేశంలోనే కదా ..  ఈశాన్య రాష్ట్రాలు దేశ సరిహద్దుల్లో ఉన్నాయి కాబట్టి  సరిహద్దు ప్రాంతాల్లోకి ఎటు వైపు వెళ్ళాలన్నా ఆర్మీ అనుమతి తప్పనిసరట .  సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో పొటోలు నిషేధం.  లేక్ దగ్గర పొటోలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు.  ఫోటోలు .. వీడియోలు నీకోసం సిద్దం చేస్తున్నాలే ..

 

ఆ చెప్పటం మరిచాను మనో ..  ఆర్మీ కాంపస్ ఉన్న దగ్గర చాలా నిబంధనలు.  బార్దర్స్ కి వెళ్ళే కొద్దీ మిలటరీ వాళ్ళ భద్రత చాలా ఎక్కువ. జీబ్ డ్రైవర్ చెప్పినా వినకుండా నేనెళ్ళి ఫోటో తీయబోయాను ఎక్కడనుండి చూసాడో ఏమో జవాను ఆరిచేశాడు .

 

గురుడాంగ్మార్ లేక్ కు 5 కిలోమీటర్ల ఆవల చైనా సరిహద్దు తెలుసా .. ? ఇవన్నీ చూస్తుంటే .. నాలో ఓ కొత్త శక్తి ఊటలు పుట్టుకొచ్చి ప్రవహిస్తున్నట్లుగా .. పుస్తకాలు ఎన్ని చదివితే ఈ అనుభవం వస్తుంది ..? ఆ..,  చెప్పు ?  ఎన్ని వర్క్ షాప్స్ లో పాల్గొంటే ఈ అనుభూతి వస్తుంది ? నాతో వఛ్చిన వాళ్లంతా ఎంతో మర్యాదగా స్నేహంగా ఉన్నప్పటికీ  నా అనుభవాలు, అనుభూతులు పంచుకుందామని నీకు ఫోన్ చాలా సార్లు  ట్రై చేశా .. ప్చ్ ..  సిగ్నల్స్ లేవు . ఎయిర్ టెల్ వాళ్ళ యాడ్ మనని మోసం చేసింది కదూ .. బియస్ యన్  యల్ నెట్వర్క్  కాస్త ఫర్వాలేదు . బెంగాలీ మిత్రులు అదే వాడుతున్నారులే .

నేనేం చేయనూ … నన్ను తిట్టుకోకు మనో . నెట్వర్క్ ని తిట్టుకో .. సరేనా …మనో
అటుచూడు .. ఉదయం వెండిలా మధ్యాహ్నం బంగారంలా మెరిసి సాయంత్రం ఎర్రగా  మారిపోయిన ఈ పర్వతశిఖరాలు చీకటిలో కరిగిపోతున్నాయ్ .. ఎంత అద్భుతమయిన దృశ్యమో ..

 

ఈ రోజు వెళ్ళివచ్చిన  చంగూ లేక్  టూర్ కి కూడా అప్పుడే  ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నా కదా..  ఉదయమే లేచి  ప్రయాణం కోసం మాట్లాడుకున్న వాహనం కోసం ఉద్వేగంతో ఆత్రుతతో ఎదురుచూపులు .  నీకు నవ్వు వస్తుందేమో .. చెప్తే ..  తనూజ మొహంలో సన్నని నవ్వు మొలిచింది . ఈ పనుల్లో పడి నీకు గానీ అమ్మ నాన్నలకు గానీ రాగానే ఫోన్ చేయలేక పోయాను.  ఈ రోజు రూం కి వెళ్ళగానే అమ్మా నాన్నలకి నీకు ఫోన్ చెయ్యాలి అనుకుంటూ హ్యాండ్ బాగ్ లో ఉన్న మొబైల్ తీసి మళ్లీ చూసింది.  ఊహు..  నెట్వర్క్ లేదు.

 

అమ్మ నాన్న గుర్తు రాగానే  కొద్దిగా నెర్వస్ గా ఫీలయింది ఆమె. ప్రస్తుతం నేనెక్కడ ఉన్నానో అమ్మకో నాన్నకో తెలిస్తే …చెప్పేస్తే .. అమ్మో..  ఇంకేమన్నా ఉందా ..?!
వాళ్ళని అంత ఇబ్బంది పెట్టొద్దని, మనసులో చేరి రొదపెడ్తున్న తపనని, కోరికని కాదనలేని సంఘర్షణ .  నాలో నేను ఎంతో సంఘర్షణ పడ్డ తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది అని సర్ది చెప్పుకోనే  ప్రయత్నం చేసింది తనూజ.  కానీ, నన్నింత చేసిన తల్లిదండ్రులకు చెప్పకుండా రావడం తప్పు అనే ఫీలింగ్ ఆమెను వదలడం లేదు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు గిల్టీగా అనిపిస్తూ .. వాళ్ళని ఒప్పించుకుని వస్తే ఈ గిల్టీనెస్ ఉండేది కాదేమో .. ఇంకా ఎక్కువ ఆనందించే దాన్నేమో ..అనుకుందామె.
హిమాలయ సోయగాల లోయలల్లోకి జారిపోతూన్న తనూజ మనస్సులోకి, కళ్ళ ముందుకి అన్న ట్రావెల్ చేస్తానన్నపుడు ఇంట్లో జరిగిన సంఘటనలు ప్రత్యక్షమయ్యాయి.

***                          ***                            ***
అన్న ఒంటరిగా ట్రావెలింగ్ చేస్తానంటేనే అమ్మ అసలు ఒప్పుకోలేదు. ఇంటా వంటా లేదు , ఏమిటీ తిరుగుళ్ళు  అని గోల చేసింది.   లేకపోవడమేంటి .. మా నాన్న ఆ రోజుల్లోనే కాశీ యాత్ర కాలినడకన చేసోచ్చాడని గొప్పగా చెప్పింది నాన్నమ్మ.  చివరికి ఎట్లాగో నాన్నమ్మ సహకారంతో అన్న  పెద్ద వాళ్ళని ఒప్పించుకోగలిగాడు.  అదే నేనయితేనా  చాన్సే లేదు. అస్సలు ఒప్పుకోరు. అందుకే గదా ఈ సాహసం చేసింది.

 

నా కోరిక చెప్తే నవ్వి తీసి పడేసేవారు . అది తనకి తెలియనిదా ..? అంతగా చూడాలని ఉంటే పెళ్ళయ్యాక మీ ఆయనతో కలసి వెల్దువులే అంటారు. లేదా ఫామిలీ ట్రిప్ ప్లాన్ చేద్దాంలే అంటూ నన్ను బుజ్జగించ చూస్తారు . కాని ఒక్క దాన్ని పంపడానికి ససేమిరా అంటారు.  ఉద్యోగం కోసం బెంగుళూరు పంపడానికే అమ్మ చాలా ఆలోచించింది.  అతికష్టం మీద ఒప్పించుకోవాల్సి వచ్చింది. . ఏమన్నా అంటే ఆడపిల్లలకి భద్రత లేదు. పెళ్లిచేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది  అంటూ మొదలుపెడుతుంది. నాన్నదీ అదేమాట. పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడాను. పెళ్లి అయితే భద్రత ఎలా వచ్చేస్తుందో .. ? వచ్చేవాడికి ఇవేమీ నచ్చకపొతే … ? నచ్చిన పని చేయలేకపోతే వచ్చే నిస్పృహ , నిరాశ లతో  నిస్తేజంగా ఉండే మెదడు ఆలోచించడం మానేసి రాజీ పడిపోతుందేమో..మిగతా అమ్మాయిల్లాగే తన జీవితమూ పరిమితం అవుతుందేమో .. ఎన్నెన్నో  సందేహాలూ ప్రశ్నలూ కలవరపరిచాయి.

 

ఉద్యోగం కోసం విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టాక చాలా చదువుతోంది, తెలుసుకుంటోంది. తనను తాను విశాలం చేసుకుంటోంది ..తనలోని చీకటిని, నిశబ్దాన్ని బద్దలు చేస్తూ కలలను చిగురింపచేసుకునే ప్రయత్నమేగా  ఈ ప్రయాణం. జీవితమంటే ఖరీదైన ప్రాంతాల్లో  తిరగడం, డబ్బుతో సంతోషం కొనుక్కోవడమా కానే కాదు.  నిజమైన  జీవితాన్ని అనుభవించాలంటే, ఆస్వాదించాలంటే , ఆనందించాలంటే మారుమూల గ్రామాలోకి  ఎవ్వరూ వెళ్ళడానికి సాహసించని ప్రదేశాలకు వెళ్ళాలి. వారి జీవితాన్ని పరిశీలించాలి  . వాళ్లతో కరచాలనం చేసి వాళ్ళలో ఒకరుగా కలసిపోవాలి . అప్పుడే కదా జీవితం తెలిసేది .   మొదటి ప్రయాణం టూరిస్టులా వెళ్లి రావాలి.  ఆ తర్వాతే ట్రావెలర్ అవతారం ఎత్త్తాలని ఎన్నెన్ని ఆలోచనలో ..    తన ఆలోచనల ఆచరణ  సాహసమో.. దుస్సాహసమో.. కాలమే చెప్పాలి.
తన ఆలోచనలు చిన్ననాటి  మిత్రురాలు , కొలీగ్ అయిన మనోరమతో చెప్పినప్పుడు చెడామడా తిట్టింది. ఇవ్వాళా రేపు బస్టాపులోనే ఒంటరిగా నిల్చోలేని పరిస్థితి . ఇంట్లో ఉన్న ఆడదానికే భద్రత కరువైన పరిస్థితుల్లో సోలో ట్రవేలింగా .. వెధవ్వేషాలు మాని బుద్దిగా పెద్దలు చెప్పినట్టు నడుచుకోమని లేదంటే ఇప్పుడే  అమ్మతో చెప్తానని బెదిరించింది. చుట్టూ ఉన్న అద్భుతాలని అనుభవించాలన్న ఒకే ఒక కోరికతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన భారతీయ మహిళ మెహర్ మూస్ గురించి చెప్పాను.

 

అప్పుడు చెప్పింది మనసులో మాట.

తనకీ ఇలాంటి ప్రయాణాలంటే ఇష్టమే అయితే అవి ఊహల్లోనే  కానీ ఆచరణ సాధ్యంకాదని కొట్టిపారేసింది.  అందుకే ఆచరణ సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడం అనవసరమని తేల్చేసింది మనోరమ .

 

తనకేమో అన్న సోలో ట్రావెలింగ్ స్పూర్తి. అన్న వెళ్ళినప్పుడు తను ఎందుకు వెళ్ళకూడదు అన్న పంతం. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలనన్న ధీమా .

 

ఆడపిల్లలు ఎవరైనా ఇలా వెళ్ళారా అని ఇంటర్నెట్ లో వెతికా . మెహర్ మూస్ , అంశుగుప్త, షిఫాలి , అనూషా తివారి వంటి మహిళా బ్యాక్ పాకర్స్  చెప్పిన విశేషాలు విపరీతంగా ఆకర్షించాయి.  మరి నేను అలా ఎందుకు వెళ్ళలేను అనే ప్రశ్న .. నాలో నన్నే తినేస్తూ .. నా జీవితానికి నేనే కర్తని , కర్మని, క్రియని  అని నా ఆలోచనలు స్థిరపరచుకున్న తర్వాతే మనోతో విషయం చెప్పింది. చర్చించింది.   ప్రతి రోజూ నా  కదలికలు ఎటునుండి ఎటో చెప్పాలన్న ఒప్పందం మీద  మనో ఒప్పుకుంది. అలా చెప్పడం నాకు చిరాకనిపించినా సరే అనక తప్పలేదు.    బయలుదేరేటప్పుడు , తనుండే  వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో అమ్మాయిలు ఇదేం పాడు బుద్ది అని గుచ్చుకునే చూపులు  పిచ్చిదాన్ని చేసి వెటకారపు వ్యాఖ్యానాలు    దీనికి స్క్రూ లూజు అని నవ్వుకోవడం  అన్నీ గుర్తొచ్చాయి
***                       ***                     ***
ఆలోచనల్లో ఉండగానే హోటల్  వచ్చేసింది. ఫ్రెష్ అయి వచ్చి టీ తాగుతూ బయటికి చూస్తే చిక్కటి చీకటి మూసిన కిటికీ .. ఈ నాలుగు రోజులుగా  జరిగిందంతా తలచుకుంటే మళ్ళీ ఆశ్చర్యం ఆమెలో. ఇది కలా .. నిజంగానే ఇదంతా జరిగిందా .. చెయ్యి గిల్లుకుంటూ నవ్వుకుంది .

 

అమ్మకి ఫోన్ చేసి పలుకరించాలి.  నాలుగు రోజులైంది వాళ్ళతో మాట్లాడి మొబైల్ అందుకుని రింగ్ చేసింది. లైన్ కలిసింది.  కుశల  ప్రశ్నల వర్షం కురిపించింది.  కూతురి  గొంతులో నిండిన ఉత్సాహం అమ్మకి ఆమెను చూసినంత ఆనందం తృప్తి  కలిగినట్లనిపించింది.  కూతురికి అమ్మని నాన్నని  చూసినంత సంతోషం.  ఒకసారి స్కై ప్  లోకి వస్తావా అమ్మ ప్రశ్న.
అమ్మని స్కై ప్ లో చూడాలని మనసు తొందర పెట్టింది. కాని వెంటనే తనను తను సర్ది చెప్పుకుంటూ ఇప్పుడా .. రేపెప్పుడయినా వస్తాలే అమ్మా .. ఇంటర్నెట్ సరిగ్గా లేదు అని చెప్పి అప్పటికి తప్పించుకుంది.   వాళ్ళని మోసం చేస్తున్నానా ..  కళ్ళు మూసుకుని ఆలోచనలతో నిద్రలోకి జారుకున్న  తనూజ ఫోన్ మోగడంతో ఉలిక్కి పడి లేచి ఫోన్ అందుకుంది. అవతలి వైపు మనోరమ .

Kadha-Saranga-2-300x268
‘అసలు నీకు బుద్దుందా … ప్రతిరోజూ కాల్ చేయమని ఎన్ని సార్లు చెప్పాను. ‘ గద్దించింది.
‘ నేనేం మాట్లాడను .. పో ..’  ,
‘తనూ .. ఆ మాట అనకే తల్లీ.. అసలు విషయం చెప్పు ఎలా ఉన్నావ్? నీ కోసం ఎప్పటి నుండి ట్రై చేస్తున్నానో తెల్సా .. అవుటాఫ్ రీచ్ అని వస్తోంది. అసలు ఏ పని చేయలేకపోయాను. ఏదన్నా జరగరానిది జరిగితే .. అమ్మావాళ్ళకి నేనేం సమాధానం చెప్పగలను మనసంతా గుబులు గుబులుగా .. భయం భయంగా … నీ గొంతు విన్నాక ప్రాణం లేచొచ్చింది’.
‘ చుట్టూ అడ్డుగోడలు కట్టేసుకుని అది దాటితే ఏమవుతుందోనన్న భయంతో రోజూ చచ్చే వాళ్లతో నేను వేగలే .. ‘
తనూజని పూర్తి కానివ్వకుండానే, ‘ అంత వద్దులేవే  .. ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు ఫోన్ చేసెయ్యి ..సరేనా,  నన్ను డిస్ట్రబ్ చేస్తున్నానని ఏమాత్రం అనుకోకు.  ఇంతకీ అసలు నీ ట్రిప్లో ఎలా ఉన్నావో చెప్పనే లేదు ‘
‘ తేలిపోతున్నట్లుందే .. మేఘాల్లో తేలిపోతున్నట్లుందే .. ‘రాగయుక్తంగా తనూజ గొంతు
‘ జోరుమీదున్నావు  తుమ్మెదా.. ఆ జోరెవరికోసమే తుమ్మెదా .. ‘ చిరునవ్వుతో మనో అందుకుంది.
‘ఎవరికోసమో ఏంటి ? నాకోసం. అచ్చంగా నా కోసమే .  అంబరాన్ని అందే సంబరంలో ఉన్నా,  ఈ మజా ఏంటో అనుభవిస్తే గానీ అర్ధం కాదులే .. ఎంత కాన్పిడెన్స్ బిల్డప్ అవుతుందో ..

నా వెనుకో ముందో ఎవరో ఒకరు ఉండి నన్ను పోలీసింగ్ చేస్తున్నారన్న ఫీలింగ్ లేదు.  రొటీన్ వర్క్ నుండి ఎప్పుడు బ్రేక్ కావాలంటే అప్పుడు రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలని నిశ్చయించేసుకున్నా ..

కొత్త ప్రాంతాలు , కొత్త మనుషులు, కొత్త విషయాలు నా ఆలోచనల్లో .. నన్ను నా విధానాల్ని మార్చేస్తూ .. ప్రకృతిలో ఒదిగిపోయి పోయి చేసే ప్రయాణాలు .. జీవితం పట్ల కొత్త ఉత్సహాన్నిస్తున్నాయి తెలుసా … ‘
అవతలి వైపు నుండి ఏ చప్పుడూ రాకపోవడంతో ‘ వింటున్నావా .. ‘

‘ ఆ .. వింటున్నా నే .. నీ ఉద్వేగాన్ని .. ‘ మనోరమ  పూర్తి చేయకుండానే అందుకుని

‘ఇక్కడేమో సిగ్నల్స్ సరిగ్గా లేవు, ఒక్కోసారి బాగానే  లైన్ కలుస్తుంది. ఒక్కోసారి కలవదు ‘

ఆ తర్వాత కొద్ది మౌనం
‘ ఊ.. ఇప్పుడు చెప్పు . బయటికొచ్చి నడుస్తూ మాట్లాడుతున్నా .. బయటేమో చలి గిలిగింతలు పెడ్తూ .. ‘
‘దూది పింజల్లా ఎగిరిపోయే మేఘంలా కేరింతలు కొట్టే నీ స్వరం చెప్తోంది నీవెలా ఉన్నావో ..నీవింత ప్రత్యేకంగా..భిన్నంగా ఎలా ఆలోచిస్తావ్ ? నికార్సైన నిన్ను చూస్తే చాలా గొప్పగా ఉంది ‘
‘ఆ చాలు చాలు మునగ చెట్టెక్కియ్యకు..డ్హాం డాం అని పడిపోతా ..

అది సరేగానీ, వింటున్నావా మనో ..

ఈ రోజు సిల్క్ రూట్ లో ప్రయాణించా తెలుసా ..?’
‘వాట్..  సిల్క్ రూట్.. ? అంటే, పరవస్తు లోకేశ్వర్ గారి “సిల్క్ రూట్‌లో సాహస యాత్ర“ గుర్తొస్తోంది. నువ్వూ  ఆ రూట్లో ప్రయణించావా .. రియల్లీ ?’ సంబ్రమాశ్చర్యంతో  అడిగింది మనోరమ
‘అవునే, చంగూలేక్ నుండి నాథులా పాస్ కి బయలు దేరాను. 17 కి . మీ. దూరమే కానీ ప్రయాణం చాలా సమయం తీసుకుంది. ఘాట్ రోడ్లో ఆకాశాన్నంటే పర్వత శిఖరాలను చుట్టేస్తూ అగాధాల లోతులను అంచనా వేస్తూ మేఘాలను చీల్చుకుంటూ సాగే ప్రయాణం అత్యద్భుతం అంటే అది చిన్న మాటేనేమో.. శ్వాసించడం మరచి చూస్తుండి పోయా ..
‘ నాదులాపాస్ అంటే ఇండియా చైనా బార్డర్ క్రాసింగ్ ప్రాంతం అనుకుంట కదా ‘
‘ఓ నీకూ కాస్త ప్రపంచ జ్ఞానం ఉందే .. ‘ నవ్వుతూ  తనూజ
‘ఆ.. నా బొంద , ఏదో నీ ప్రయాణం పుణ్యమాని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నాలే .. కానీ , అసలు విషయాలు చెప్పు ‘
‘అవును దేశ సరిహద్దు ప్రాంతమే ఇది,  ప్రయాణ సాధనాలేమీ లేని రోజుల్లో ఈ రూట్లోనే వర్తక వ్యాపారాలు జరిగేవట.’
‘ రియల్లీ .. గ్రేట్.. చెప్పు చెప్పు నీ సాహస యాత్ర గురించి చాలా చాలా వినాలని ఉంది ‘ ఉత్సుకతతో మనోరమ
‘ చెప్తూంటే ఏమిటే నీ తొందర .. ఈ రూట్ 1962 యుద్ధం తర్వాత మూసేసారట. మళ్లీ 2006లో రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం తర్వాత తెరిచారట. ఏడాదిలో ఆరునెల్లకు పైగా మంచుతో గడ్దకట్టుకుపోయే  ఈ రూట్లో ఒకప్పుడు అంతర్జాతీయ వ్యాపారం జరిగేదని తెలిసి ఆశ్చర్యపోయాను.

 

ఇప్పుడయితే  విదేశీయులకి  నాధులాపాస్ లో ప్రవేశం ఉండదట.  అక్కడ సిక్కిం , టిబెట్ ప్రజలు తమ ఉత్పత్తులు తెచ్చి అక్కడ అమ్ముకుంటూ ఉంటారు.   వాళ్ళు వ్యాపారం సాగించే ప్రదేశంలో మన మార్కెట్ యార్డ్ లో ఉన్నట్లుగా షెల్టర్స్ ఉన్నాయి. అవి ఈ మధ్యనే కట్టారట.  సోమ , మంగళ వారాల్లో వారి వ్యాపారాలకు సెలవు. అందుకే నాదులాపాస్ మూసేసి ఉంది. నేను వెళ్ళింది మంగళవారం కదా. నాకు ముందుగా  ఆ విషయం తెలియదు .  అందుకే  అక్కడ నుండి బార్డర్ క్రాస్ చేయలేకపోయా.    చైనా టిబెట్ ని ఆక్రమించాక చాలామంది టిబెటియన్లు , ఇండియా, నేపాల్ దేశాలకు వచ్చేశారని చాలా విషయాలు  గోవింద్ చెప్పాడులే .’
‘రేపు ఎక్కడికెళ్తున్నావ్ ..? ‘

‘రావంగలా  ప్రపంచంలో అక్కడ మాత్రమే కనిపించే పక్షుల్ని చూడాలి. అక్కడి నుండి పెల్లింగ్ వెళ్ళాలి . అక్కడ ట్రెకింగ్ చేయాలనుకుంటున్నా ‘
‘  కీర్తి శిఖరాల కోసం కాదు, ఆడపిల్లల విశ్వాసానికి రెక్కలు తొడిగి వెలుగును వెతుక్కుంటూ వేసే అడుగులో అడుగు వేయలేకపోయినా నిన్ను చూస్తే గర్వంగానూ .. ‘ మనోరమ మాటలకడ్డు వచ్చి

‘ భయంగాను ఉంది.అదేగా నువ్వు చెప్పాలనుకున్నది.  ఇదిగో ఇలా అమ్మమ్మ అవతారం ఎత్తావంటే ఫోన్ పెట్టేస్తా .. ‘ నవ్వుతూ బెదిరించిన తనూజ.

 

మళ్ళీ  తానే ‘  స్వచ్చమైన నీలాకాశంలో పొదిగిన పచ్చదనపు కౌగిలిలో పరవశిస్తూ మంచు బిందువులను ముద్దాడుతూ సాగిన ప్రయాణం,   తారకలతో స్నేహం .. ఎంత అద్భుతంగా ఉంటుందో  నీకెలా చెప్పగలను ..? ‘ నిశబ్దంగా మెరిసే తారకల్ని కొత్త ఆకాశం కింద నిలబడి చూస్తూ తనూజ
‘కవిత్వం వచ్చేస్స్తున్నట్లుందే .. మనసు పలికే భావాల్ని అక్షరాల్లో పరిచేస్తే బాగుంటుందేమో ..తనూ ‘ ఆమె ఎగ్జయిట్ మెంట్ ని గమనించి అంది మనోరమ

‘అహహా హ్హా .. జోక్ చేస్తున్నావా .. నీ మొహం..  నాకు కవిత్వం రావడం ఏమిటి ? ‘
కొద్దిగా ఆగి ‘ మనసులోని భావాల్నివెంటనే  పంచుకొనే నేస్తం లేదనే దిగులు.

ఆహ్హః లేకపోవడమేంటి.. నీతో నేనున్నాగా  నీ మనోకి  పోటీగా  అంటోంది నా లాప్ టాప్.’
‘ఏమిటీ ఆ బుల్లి పెట్టె నేను ఒకటేనా .. ?’ వేగంగా తోసుకొచ్చ్చిన మనోరమ ప్రశ్న
‘కాకపోతే మరి’ అంటూ కాసేపు మనోరమని  ఉడికించింది తనూజ
ఆ తర్వాత ‘ఏ రోజుకు ఆ రోజు నా అనుభవాల్ని పంచుకునేది ఈ ఎలక్ట్రానిక్ డైరీ తోనే కదా .. ఒకరోజు చెప్పకపోతే మరుసటి రోజు వచ్చే అనుభవాలు ముందటి రోజు అనుభూతుల్ని , ఉద్వేగాల్ని ఎక్కడ కప్పి వేస్తాయో .. ఏ మూలకు తోసేస్తాయో అన్న సంశయంతో హృదయ భాషని అక్షరాలుగా నిక్షిప్తం చేసేస్తున్నాను. ఏదేమైనా నా పర్యటన ఆద్యంతం అద్బుతంగా ..ఆహ్లాదకరంగా .. సాగుతోంది. ‘

‘ఆ.. అన్నట్టు నేనిచ్చిన  పెప్పర్ స్ప్రే , స్విస్ నైఫ్ , విజిల్ నీ బాగ్లోనే ఉన్నాయిగా ‘ ఏదో గుర్తొచ్చిన దానిలా సడెన్గా అడిగింది

‘ఊ .. ఉండక అవెక్కడికి పోతాయి ?  భద్రంగా ఉన్నాయిలే …’

‘నీకో విషయం తెల్సా .. గురుడాంగ్ మార్ లేక్ వెళ్ళిన మూడు రోజుల యాత్రలో నా సహా పర్యాటకుల్లో కొత్తగా పెళ్ళయిన ఓ జంట తప్ప అంతా పురుషులే .  అంతా చాలా మర్యాదగా వ్యవహరించారు.  సిక్కిం లో పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్లు కాల్చడం గానీ , పాన్ మసాలాలు తినడం గానీ నేను చూడలేదు. కొద్దిగా ఆశ్చర్యం అనిపించి స్థానికుల్ని అడిగాను .  బహిరంగ ప్రదేశంలో సిగరెట్ కాలిస్తే ఖచ్చితంగా ఫైన్ వేస్తారట. అదే విధంగా గుట్కాలు , పాన్ మసాలాలు అమ్మనే అమ్మరు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం’

‘రియల్లీ ..గ్రేట్ కదా .. మరి మన దగ్గర అలా ఎప్పుడు చూస్తామో ..?,,
‘నిజమేనే ..పరిసరాలే కాదు మనుషులూ స్వచ్చంగానే అగుపిస్తున్నారు’ అంటూ తలకు చుట్టిన స్కార్ఫ్ వదులు చేసుకుంటూ రూం లోకి అడుగుపెట్టింది తనూజ .
‘నీ  గొంతులోని ఉత్సాహం , ఉద్విగ్నత అనిర్వచనీయమైన నీ ఆనందాన్ని తెల్పుతోంది. మన ఇళ్ళలో స్త్రీల తెలివి, ధైర్యం , ఆత్మవిశ్వాసం మండే పోయ్యిలో వండే వంటకే అంకితమయిపోతున్నాయి ..’ మనోరమ మాటలకి అంతరాయం కలిగిస్తూ లైన్ కట్ అయింది.

 

మళ్ళీ మళ్ళీ  ప్రయత్నించింది తనూజ . నెట్వర్క్ సిగ్నల్ దొరకడం లేదు.  బయటికి వెళ్ళాలంటే చల్లటి గాలి విసిరికొడ్తాంది అనుకుంటూ బెడ్ మీద వాలింది తనూజ.
మనోరమ చివరి మాటలే ఆమె మదిలో మెదులుతున్నాయి.

 

నిజమే .. మహిళ జ్ఞానం, తెలివితేటలు, ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం పువ్వుకే అతుక్కున్న పరాగధూళిలా ఇంటికే కాదు.   నాలుగ్గోడలనుండి విశాల ప్రపంచంలోకి  సాహసంతో ప్రవహించాలి. అద్భుతమైన జగత్తులో తనదైన అజెండాతో ముందుకు సాగాలి. ఈ విశాల ప్రపంచంలో తనకో చిరునామా సృష్టించుకోవాలి.  కానీ నాలా చాటుగా కాదు.   సగర్వంగా తలెత్తుకుని..  రేపటి మహిళ గురించిన ఆలోచనల్లో  తనూజ .

చీకటీగలు-3

 

 

‘‘ఈ లమ్డ్మీ చీకటీగల్కి మనుషులకీ దగ్గర సంబంధం… ఇంకోళ్ళని ప్రశాంతంగా వుండి చావనీవివి… ఎక్కడా లేనట్టు సరిగ్గా కళ్ళముందూ పుళ్ళమీదా వాలి… చీకాకు… చీకాకు’’ అన్నాడు శ్రీమన్నారాయణ..

‘‘ఇవి ఈగలా దోమలా ఏంటివి సారివీ… వీనెమ్మ… ఛీత్‌’’ విసురుకుంటూ రంగరాజడిగాడు..

‘‘ఈగజాతే, అయిన్యాట్స్‌’’ అంటారు వీట్ని మనల్నే కాదు పశువుల్ని చంపుకుతింటాయివి… సైంటిఫిక్నేమ్‌ హిపల్యాటస్‌ పుసిలానో ఇంకోటోమరోటో అంటారు.

లంజపదోత్పత్తి దగ్గర్నించి చీకటీగల శాస్త్రీయనామానికెళ్ళిపోయాడు శ్రీమన్నారాయణ… అసలు మృచ్ఛకటికం దగ్గర మొదలుపెడతానన్న మనిషి… ఎటిమాలజీ నుంచీ ఎంటమాలజీకి ఛలాంగుమని గెంతగ బుద్ధి… కాస్త అబ్బురంగానే చూశాను శ్రీమన్నారాయణ వైపు… ఇంత బుద్ధికలిగీ జీవితాన్ని సుఖవంతం ఎందుకు చేసుకోలేకపోయాడితను? అసలు సుఖం అంటే ఏమిటి? పెళ్ళాం బిడ్డల్తో గొడవల్లేకుండా రోజూ మూడుపూట్లా కోరిందో, దొరికిందో తృప్తిగా తింటూ చీకూ చింతా లేకుండా నిద్రపోగలగడమేనా? ఎవరిస్తారు అసలు సిసలైన సుఖానికీ ఆనందానికీ సరైన నిర్వచనం… అంతా సాపేక్షమే కదా? నీకు సుఖవంతమైంది అతనికి అస్సలు కాకపోవచ్చు. రంగరాజులూ, కంఠం వేరువేరు నిర్వచనాలివ్వొచ్చు… కోట్లాదిమంది కలిగున్న ప్రమాణాలు అత్యంత సాధారణమైనవి… సహజాతాలకు సంబంధించినవి. వాటికతీతంగా వుంటే గింటే దేవుడుండొచ్చు. ఎటు తిరిగీ జీవితాన్ని వీటి చుట్టుతా చేర్చి కుట్టేసుకుంటారు. నిజానికి వీటికతీతంగా జీవితం అస్తిత్వం కలిగుందా? వుండగలదా? అడగాలి శ్రీమన్నారాయణ్ణి… అతను దేవుడిన్నమ్మడు… ‘‘అసలు సిసలు జీవితమంటే తనకిచ్చ వచ్చిన రీతిలో మనగలగడం. సమాజపు కొలతకావల స్వచ్ఛంగా స్వేచ్ఛగా వుండగలగడం’’ అన్నాడో మాటు.

రంగరాజునీ, కంఠాన్నీ చూసా… అసలు రంగరాజు బడి నడుపుతాడంటే ఆశ్చర్యం. ఏదో వ్యాపకం కావాలి కాబట్టి స్వంతస్థంలో షెడ్లేసి స్కూలు నడుపుతున్నాడు శతకోటి కుక్కగొడుగుల్లో అదోటి. ఓ డొక్కు కారుంది కూడా… ఎప్పుడూ నిశ్చింతగా గడుపుతాడు. పద్యాలూ, పాత సాహిత్యమంటే చాలా ఇష్టపడతాడు. వాడి బండముక్కు పక్కనున్న కళ్ళల్లో ఒక నిరంతర చైతన్యముంటుంది. ఊళ్ళో గ్యాసు కనెక్షన్నించీ ఏకనెక్షనుకైనా దారి చూపించగల్డు ‘‘నువ్వా లెక్చరుద్యోగానికి రిసైన్నూకు సార్‌.. జూనియర్కాలేజి పెడ్దాం… రెండేండ్లలో ఎట్టుంటాదో చూడు’’ అని నాతోటెన్నిమాట్లో అన్నాడు. వీళ్లందరి జీవితపు పరిధులు కొలిచేముందు నా జీవితమేమిటో నాకు తెలుసా? నిజ్జెంనిజంగా నే సుఖంగా వున్నానా? బ్రతుకుతూనా? జీవిస్తూనా? ఆకలి లోపల యుద్ధం చేస్తోంది…

‘‘రాజా, రా మనిద్దరం వెళ్దాం మందుకి, నేనట్నుంచటే కొంప చేరుతా…. బండికూడా లేదు.. పద…’’ అని రంగరాజు భుజమ్మీద చెయ్యేసి శ్రీమన్నారాయణవైపు చూసి ‘వెళ్తా’ అన్నా…

చివర్రౌండేస్తూ ‘‘ఆగండి…’’ అంటూ కంఠం అడుగుబొడుగు వేసేసాడు.

‘‘ఉదయాన్నే ఆ గాడ్దికొడుకొచ్చి గొడవ చేస్తే కబుర్జేస్తా వచ్చేయ్యి’’ అన్నాడు శ్రీమన్నారాయణ.

రంగరాజులూ నేనూ సందులోంచీ మెయిన్రోడ్డు మెగుల్లోకొచ్చేసాం…

‘‘ఒరేయ్‌ రాజా ఉదయాన్నే శ్రీమన్నారాయణ్ణి పలకరించెళ్ళు వీలైతే నీతో పాటు స్కూలుకు తీసుకుపో… యీ మనిషి మొండీ… వాడు మూర్ఖుడూ’’ అన్నాడు.

‘‘ఏం గాదులే నేన్లేనా… నువ్‌ మల్లా చెప్పాల్నా సార్‌’’ నిర్లక్ష్యంగా రంగరాజు గొణిగాడు…

చీకటే ఎక్కువగా వున్న గతుకురోడ్డుమీద… మెదళ్ళమీదావరించిన మత్తుపొరతో… కొద్దేళ్ళుగా పరిచయస్తుమయిన, నేనూ రంగరాజునబడే యీ వ్యక్తీ అత్యంత సన్నిహితుమైనట్టు నేను వాడి భుజం చుట్టూతా చెయివేసి… వాడినించీ యోజనాల దూరంలో అస్తిత్వం కలిగి… ఓ తాత్కాలికమయిన మజిలీ కలిగిన అతి చిన్న ప్రయాణం చేస్తూ…

‘‘సార్‌, కాలే సార్ని చూసొస్తాసార్‌…. మార్నింగే… పాట పోయింతర్వాత యింకేం కాలేసార్‌… ఆర్మోనియం బెలోస్కి బొక్కపన్నట్టు కదసార్‌. ఆదివిశ్ను సార్‌కి క్లోజ్‌సార్‌… మంచిదోస్తు సార్‌’’ రంగరాజులు యింకా ఏదేదో మాట్లాడుతోన్నాడు.

ఎవరు కాలే? ఎవరీ రంగరాజు? సంగీతకారుడు కాలే చావకుండా ఎందుకు బతికాడూ? కాలూచెయ్యీ మాటా పడిపోయి… కోలుకుంటాడో లేదో తెలీని మృతసదృశమయిన అస్తిత్వంతో. అందరూ విసుక్కొంటూంటే… మలమూత్రాలకూ, ముద్దకూటికీ యింకొకళ్ళను విసిగిస్తూ…. బతుకా అదీ? నేనెట్లా చస్తా? వీడు యీ రంగరాజుల్గాడెట్లా చస్తాడూ… మేమంతా బతికేవున్నామా? అసలు చావంటే ఏమిటీ? సెన్సేషన్స్‌… టర్మినేషనాఫ్‌ ఆల్‌ బయలాజికల్‌ ఫంక్షన్స్‌… అమ్మో! భయం మృత్యుభీతి… నెక్రోఫోబియా… రంగరాజులేదో సణుగుతునే వున్నాడు. నడుస్తున్నా కూడా…. కళ్ళముందు చీకటీగలు మూలుగుతునే వున్నాయి… కాలేను హస్పిటల్లో చూట్టానికి మనసంగీకరించట్లే… వెళ్ళనని తీర్మానించేసుకున్నా…

ఆటోలో ఎట్లా కూచున్నానో తెలీదు… ఆటోవాడు ‘‘దిగు… దిగూ’’ అన్డంతో, దిగి వాడికో పది కాయితమిచ్చి… ఇంటికి చేరుకున్నా… తలుపు తెరిచేవుంది. టీవీ ఆన్లోవుంది…. టీవీ ఎదురుగా…. ఓ ఘనీభవించిన భావరాహిత్యం…

చైతన్యరాహిత్య ప్రతిరూపం…

ఓ కామనాలేమి…

ఓ ఎండిపోయిన చెరువులోకి దూకేసిన ఆకాశం…

నాతోపాటు రెండు దశాబ్దాలు ఉంటూ లేకుండా వున్న ఓ పరిచిత భౌతిక రూపం…. అపరిచిత వ్యక్తిత్వం…

సుభద్ర… సోఫాలో…

శ్రీమన్నారాయణ షెడ్డులో రేగిన ఆకలి, ఆవిరైపోయింది… క్యాంటిన్‌ కుర్రాడు ప్లాస్టిక్‌ సంచిలో బంధించి తెచ్చిన పరిమళాలు లీగా గుర్తున్నాయి. చాపమీద నూనె పీల్చుకున్న న్యూస్పేపర్‌ పొట్లాంలో మిరబ్బజ్జీలూ… ఎగిరిపోతున్న ఆకలి చిత్రానికి గాలమేసి లాగి పట్టి కళ్ళముందుకు తెచ్చుకునే ప్రయత్నం చేసా… ‘‘తింటావా? తిన్నావా?’’ జవాబాసించని ప్రశ్న… అసలక్కర్లేని ప్రశ్న…

‘‘నేన్తింటాలే… సిన్మాచూడు’’

మనిషి ఏం కోరుతూ జీవితాన్ని సాగదీసుకొంటాడు? అసలు నాలాంటి వాళ్ళకి ‘రేపు’ ఎందుకు? ఈ సుభద్రకు రేపటి మీద కామనుంటుందా? ఇన్ని కోట్లాదిగా కామనారహిత అస్తిత్వాలెట్లా వుంటాయి? నేనొకణ్ణే యిట్లా ఊహిస్తున్నానేమో! కోటి కోర్కెల్తో ఆశల్తో…. కొత్త ప్రభవా మీది నమ్మకంతో… నేనూ నాలాంటి వాళ్ళం తప్ప అందరూ మరుసటి ఉదయం తలుపు తెరుస్తారేమో! లేపోతే ఇన్నిన్ని వేల ఏళ్ళుగా మానవుల మనుగడెలా సాధ్యపడుతుందీ? ఇట్లా ఈ బొమ్మజెముడాలోచన్లతో చీకాకు పడే బదులు… కోట్లజనాల్లా భగవదస్తిత్వ భరోసాతో బ్రతకడం మేలేమో! ఉంటే గింటే వుండి ఛస్తే అంతా వాడే చూసుకుంటాడు… మంచికీ వాడే, రోజువారీ రొచ్చుకూ వాడే కారణం… అనుకుంటూ… కళ్ళుమూసుకుని, మనకై మనం నిర్మించుకున్న ఓ రూపాన్ని తల్చుకుని… ‘ఒరేయ్‌ దేముడా! నన్ను బాగా చూడూ, నా పెళ్ళాం బిడ్డల్ని బాగా చూడూ, దండిగా డబ్బులియ్యీ, నా కూతురికి పెళ్ళీ, నాకొడుక్కుజ్జోగం, నీ గుడికో మెట్టు కట్టిస్తా… నేన్చేసుకున్న దానికంటే ఘనంగా నీకూ పెళ్ళిచేస్తా….’ మళ్ళీ వాడికో అందమయిన ఆడదేవతను తయారుచేసీ… మనకు గలీజులైన మలమూత్రాల రొచ్చు వాడికి పెట్టకుండా… భలే మనిషండీ దొంగగాడ్దికొడుకు…. నిజమే కదా…. వాడికి గోపురాలు కడతాడు, కల్యాణమండపాలు కడతాడు, అన్నీ పకడ్బందీగా కట్టేస్తాడు… దేముడికో కక్కసు మాత్రం చరిత్రలో కట్టిందాఖలాలు లేవు… వున్నాయా? వాడేం మానవమాత్రుడా? దేముడండీ… వాడికి పెళ్ళాం కావాలి… బిడ్డలు కావాలి… యుధ్ధాలు కావాలి… వాహనాలు కావాలి… నగరాలు కావాలి… కానీ మనిషికున్న రొచ్చు మాత్రముండకూడదు… వాడికాకలుండదు… నిద్రుండదూ… ఛావస్సలుండదు… పడిశెం లాంటివి పట్టవు… ముక్కుంటుందిగానీ చీదడు… కొండకచో వాడే మర్మావయపురూపం తీసుకుని… నిటారుగా ఆరేడడుగులెత్తు లేచుంటాడు… కానీ మనం ఆ రూపానికి బూతుపదం వాడకూడదు. సిల్లీ…. క్వైట్‌ సిల్లీ…. బట్‌ ఫాసినేటింగ్‌…. దేముడ్ని సృష్టించినప్పుడే మనిషి క్రియేటివిటీ గొప్పదనం తెలుస్తుంది… ఎన్ని ఊహలూ… ఎంతచిత్రణో… గొప్ప గొప్ప కవితాత్మకమై పురాణేతిహాసాలూ, నృత్యాలూ… చిత్రలేఖనం… శిల్పం… ఆ దేముడనబడే ఒకే ఒక కల్పన్చుట్టూ ఎంత ప్రతిభావంతంగా నిర్మించాడు మనిషీ… గొప్పోడివిరా మనిషీ…

పాచిరంగు చిన్నపూల లుంగీలోకి దూరా… ఒంటికాలినృత్యం చేస్తూ ప్యాంటూడదీసుకున్నా… ఇంకో రౌండేసుంటే బావుండేదేమో… బాత్రూంలో ఒంటేలుకి పోతే ఆల్కహాల్‌ వాసన గుప్పుమంది…. ఇట్లాంటి చిత్రణలు మన్తెలుగుసాహిత్యంలో కనబడవెందుకో అశ్లీలానిపేరు. ఏ ఫిలిప్‌రాతో… మిన్‌కుందేరాలో రాస్తే… అహ్హహ్హ ఎంత రియలిస్టిక్‌గా రాసారండీ అనేయగలరు…. కుందేరా మరీనూ కథలో ఓ అధ్యాయానికి ‘యూరినేషన్‌’ అని పేరే పెట్టేశాడు. రాత్‌ మరీనూ తండ్రీ కొడుకు కలిసి ఒంటేలు పోస్తున్న చిత్రాన్ని వివరిస్తూ ‘‘నాన్న ధార పేనిన తాడులా వస్తోంది…. నాది పీలగా దారప్పోగులా వుంది’’ అని కథానాయకుడి చేతనిపిస్తాడు.. రాత్‌ ఇక కాల్పనిక సాహిత్యం రాయననేసాడు. చూడాలి… చూడాలి… నాలిక్కి శతకోటి క్షమాపణల్చేప్పి… చల్లన్నం బొక్కి ప్లేట్‌ని సింక్‌లో పారేసి…. గుమ్మంబైటికొచ్చి సిగరెట్‌ వెలిగించుకున్నా…

నేను దింపినా దింపకపోయినా ఈ రోజనబడే కాలభాగానికి తెరపడినట్టే…. ఏమిటీ కాలం? ఎప్పటిదీ కాలం?

ఉదయ సాయంత్రాలూ..

గంటలూ… నిమిషాలూ…

నిన్నలూ… రేపులూ…

ఏడాదులూ… శతాబ్దాలూ…

యుగాలు యుగాలు గడుస్తూ కాలశరం దూసుకుపోతూ…

ఎడిరగ్‌టన్‌… ఎంట్రపీ… ధర్మోడైనమిక్స్‌… కాలేజీపాఠాలు కాకుండా నానా చెత్తా చదివితే యింతే… నాకెందుకీ రొచ్చూ…? జ్ఞానానికంతేమిటీ? శ్రీమన్నారాయణేం చదివుంటాడూ, దాదాపు ప్రతి విషయం గురించీ కొద్దోగొప్పో మాట్లాడ్తాడు… ఆయనకి ఆ పిల్ల మైత్రికి ఏం సంబంధం… అతనింట్లో పెళ్ళాం కొడుకుల్తోటెందుకు దెబ్బలాడాడు. లమ్డీ మనుషుంటాడు. చీకటీగల్తో పోలుస్తూ… నేనూ చీకటీగనేనా? ఎవర్కో… సుభద్రకా? బయటి జనాలకా? సుభద్ర, బయటి జనాలు నాకు చీకటీగలేనా? ఏమిటో ల్యాటిన్‌ పదం చెప్పాడు గుర్తురావట్లే…. లోపలికి తొంగి చూసా… సుభద్ర లేదు…. గవర్నమెంటుద్యోగం చేస్తుంది… తను బాగానే సంపాదిస్తుంది. ఎప్పుడో ఇరవైయేళ్ళక్రితం… యాదృచ్ఛికంగా నా జీవితంలోకి ప్రవేశించింది. ఉండిపోయింది. ఒక్క ఏడాదీ ఏడాదిన్నర పాటు శారీరక వ్యామోహల్తో బానే గడిచింది. తర్వాత్తర్వాత మా మా అస్తిత్వాల గురించిన పోరాటం ప్రారంభమయి.. ఎవరిది వాళ్ళం గెల్చుకున్నాం. పెళ్ళయిన మూడేళ్ళకు సర్వీస్‌ కమిషన్‌ రాసి ఉగ్యోగం తెచ్చుకుంది. నైమిత్తికావసరాలకు తప్ప మా మధ్య సాధారణ సంభాషణలు నడవ్వు… ఈ చిన్న కొంప కూడా తన్దే…. లోనింకా కడుతోంది బ్యాంకుకి ఈయంఐ ద్వారా… ఇప్పుడు దాదాపు ఒకర్నొకరు తాకడానిక్కూడా సందేహించే పరిస్థితి. తన బాగుకో నా బాగుకోసమో పిల్లలు కగలేదు. ఇద్దరికి కామన్‌గా ఉన్న గుణం చదవడం. తనూ పుస్తకాలు కొంటుంది. ఎప్పుడైనా నాకు చెబుతుంది. ఫలాని ఫలాని పుస్తకం బావుంది చూడూ… అనో… లేదూ ఫలాని పుస్తకం దొరకలేదు తెచ్చిపెట్టమనో…. ఇంతకీ ఇరవైయేళ్ళ పరిచయిస్తులమ్మేం. ఆమెకో యిద్దరు స్నేహితులున్నారు. ఇద్దరూ ఆమెకంటే చిన్నవాళ్ళు. అక్కా, అక్కా అంటూ యీమె చుట్టూ తిరుగుతుంటారు. ఒకట్రెండు సార్లు వాళ్ళిళ్ళలో ఫంక్షన్కూడా కలిసెళ్ళాం. బండి వెనక్కూచున్నా… తగలకుండా జాగ్రత్తగా కూచుంటుంది. ఇద్దర్లో ఒకరం. హఠాత్తుగా తప్పుకున్నా ఏ విధమైన కదలికా యిద్దరి జీవితాల్లో వుండదనద్నది ఖాయం. వుంటుదేమో… తాత్కాలికంగానయినా వుండాలి. ఎన్నో ఏళ్ళుగా దార్లో రోజూ కనిపించే ఓ పెద్ద బండరాయినెవరో హఠాత్తుగా పగలగొట్టి తీసేస్తే కలిగే శూన్యంలాంటిది. తర్వాత దాని రాహిత్యానికలవాటు పడిపోతామంతే ఏమో ఆమె అంతరంగంలోకి తొంగి చూసే ప్రయత్నం నేనెన్నడూ చేయలేదు. ఆమే అంతే… ఈ మాత్రం దానికి కలిసుండడం దేనికీ అంటే అలవాటు పడిపోయాం… నాకూ శుభ్రమయిన కూడూ గూడూ లభ్యమవుతున్నాయి. ఆమెకీ ఓ సాంఘికపరమైన గుర్తింపు…. ఓ సోషల్‌ ఐడెంటిటీ… మరట్లాంటప్పుడు శ్రీమన్నారాయణన్నట్టు తను నాకో, నేను తనకో చీకటీగలెట్లా అవుతాం…

ఆలోచించి ఆలోచించి అలుపొచ్చేసింది… చిన్నగా మగత కమ్ము కుంటోంది… తలుపేసి గదిలోకొచ్చి నా బెడ్‌మీద వాలిపోయా…

(సశేషం)

కాశీభట్ల వేణుగోపాల్ @9550079473

కులవృత్తుల వేదన బయటికి రావాలి

 

devendar

అన్నవరం దేవేందర్ ప్రముఖ తెలుగు కవి. 2001లో “తొవ్వ” కవితా సంకలనంతో మొదలై, నడక, మంకమ్మతోట లేబర్ అడ్డా, బుడ్డుపర్కలు, బొడ్డుమల్లె చెట్టు, పొద్దు పొడుపు, పొక్కిలి వాకిళ్ళ పులకరింత కవితా సంపుటాలు ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా కవిత్వం రాస్తూ ఇప్పటికి పది పుస్తకాలు ప్రచురించారు. ఇటీవల “బువ్వకుండ” దీర్ఘ కవితను వెలువరించారు. ప్రధానంగా తెలంగాణ జీవన దృశ్యాన్ని, బహుజన దృక్పథాన్ని, ప్రపంచీకరణ పర్యవసానాలను కవిత్వీకరించారు. తెలంగాణ ప్రజల భాషను కవిత్వ భాషగా తనదైన శైలిలో ప్రయోగిస్తున్న వారిలో ముఖ్యులు అన్నవరం దేవేందర్.

ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్ధిక విధానాలు, సాంకేతిక పురోగతి కుల వృత్తులను కనుమరుగు చేస్తున్నది. ఈ క్రమంలో కుమ్మరి వృత్తికి సంబంధించిన వస్తువును తీసుకుని దీర్ఘ కవితగా వెలువరించిన అన్నవరం దేవేందర్ గారితో బూర్ల వేంకటేశ్వర్లు జరిపిన ముఖాముఖి.

 

  • దేవేందర్ గారూ! కుల వృత్తి మీద దీర్ఘ కవిత వేశారు కదా! ప్రస్తుతం కుల వృత్తుల పరిస్థితి ఏమిటి? కుల వృత్తుల కొనసాగింపు పై మీ అభిప్రాయమేమిటి?

 

  • కుల వృత్తులు కూలిపోవడమనేది ఒక విషాదకర దృశ్యమే ఐనా కులవృత్తులు నిలపాలని ఎవరూ కోరుకోరు కోరుకోవలసిన అవసరం కూడా లేదు. వీటిని అధిగమించి బహుజనులు ఎదిగి రావాలె. ఇవి ప్రాచీన కళా శాస్త్ర సాంకేతిక నైపుణ్య రూపాలు. బహుజన కులాల శ్రమ జీవులంతా సామాజిక శాస్త్రవేత్తలు. కుండను కనిపెట్టడమనేది మెసపుటేమియా నాగరికత నాడే కనిపించింది. నూలు వడకడం, వంట వండడం మొదలైన మానవ నాగరికత పరిణామానికి మూల బీజాలు. ఈ టెక్నాలజీ కి, కళకు వాళ్ళు పేటెంట్ దారులే. ప్రపంచంలో ఎక్కడున్న వాళ్లైనా ఈ వృత్తులు కలవాళ్ళు తొలి నాగరికతకు బీజాలు వేసిన వాళ్ళే. ఈ వృత్తులల్లో కళతో పాటు సమాజోపయోగం కూడా ఉంటది. ఇది పర్యావరణానికి కూడా హాని చేయనిది. ఒక్క మిషన్ వందల చేతులను ఇరగ్గొట్టింది, ఒక కంప్యూటర్ రెండు వందల  టైపు మిషన్ లను లేకుండ చేసింది. ప్రపంచంలో ఏది కొత్తగ కనిపెట్టినా అది అంతకుముందున్న  వ్యవస్థకు విఘాతం కలిగిస్తది. అది అనివార్యమే, దాన్ని ఆపలేం. కాబట్టి దాన్ని అంది పుచ్చుకోవాల్సిన అవసరం ఉంటది. వ్యవసాయ రంగంలో నాగళ్ల స్థానంలో, ఎడ్లబండ్ల స్థానంలో ట్రాక్టర్లు వచ్చినయ్, పొలం కోతలకు హార్వేస్టర్ లు వచ్చినయ్. ఇంకా అన్ని రంగాల్లోకి వస్తయ్. వీళ్ళు కూడా ఇతర ఆధునిక వృత్తులలోకి అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉన్నది.

 

  • బువ్వకుండ దీర్ఘ కవిత రచనకు ప్రేరణ ఏమిటి? గతంలో ఏవైనా దీర్ఘ కవితలు రాశారా?

 

  • మల్ల ప్రపంచీకరణ నుంచే మొదలు పెడితే, ఈ ప్రపంచీకరణతో చాలా వృత్తులు పూర్తిగ అంతరించి పోతయ్. ముందు తరాలకు ఈ వృత్తుల గురించి తెలిసే అవకాశం కూడ లేదు. నేను కుమ్మరి కుల వృత్తి నుంచి రావడం వల్ల దీనిలోని కళాత్మకతను, నైపుణ్యాన్ని, మూలాల్ని సాహిత్యంలో రికార్డు చెయ్యాలను కున్నా. ఐతే, ముఖ్యంగా మిత్రుడు జూలూరు గౌరీ శంకర్ వెంటాడే కలాలు పేరుతో పదిహేనేండ్ల కిందనే చాలా కుల వృత్తుల కవిత్వాన్ని తీసుకచ్చిండు. దాన్ని రివైజ్ చేసే క్రమంలో మళ్ళీ రాయాలనే ప్రేరణ దొరికింది. గతంలో కూడ తెలంగాణ మీద నేలపాట, గుండె పాట అనే పేరుతోని రాసిన, నా బాల్యం గురించి కూడా పెద్ద కవితలు రాసిన కానీ, దీర్ఘ కవితలుగా రాయలేక పోయిన. ఆఖరి ముచ్చట అనే పేరుతోని రైతు చనిపోతూ చెప్పే స్వగతం గురించి దీర్ఘ కవిత రాయాలని తపన ఉండే. ఇవన్నీ ప్రేరణగా ఇప్పుడు “బువ్వకుండ” వచ్చింది.

 

  • తెలంగాణ ఉద్యమ సాహిత్యం  గురించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిస్థితి గురించి వివరిస్తారా?

 

  • గడిచిన దశాబ్దం అంటే 2014 కు ముందు దశాబ్ద కాలం దాకా తెలుగు సాహిత్యాన్ని తెలంగాణ సాహిత్యమే ఏలింది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం అణచి వేయబడ్డ తెలంగాణ భాష, సామెతలు, పాత్రలను సాహిత్యంలో ప్రతిష్టించింది. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా కలాలు ఆగిపోయినయ్. తెలంగాణ ఆకాంక్ష కవిత్వం దాదాపుగా నిలిచిపోయింది. కానీ, తెలంగాణ విశిష్టతను తెలిపే తొలిపొద్దు, తంగేడు వనం లాంటి కవితా సంపుటాలు వెలువడ్డాయి. ఐతే, తెలంగాణ ఏర్పడంగనే సమసమాజం ఏర్పడ్డట్టు భావించవల్సిన పనిలేదు. కోస్తా ఆంధ్రా కమ్మ పాలన నుండి చేతులు మారి తెలంగాణ పాలన ఆరంభమైంది. రూపం మారినా పాలక వర్గ స్వభావ సారాంశంలో పెద్దగా ఆశించాల్సిందేమీ ఉండదు. సంస్కృతి, చరిత్ర నిర్మాణంలో పాలనాపరమైన తెలంగాణతనం మాత్రం కనిపిస్తున్నది. కవి తన గొంతును సవరించుకోవల్సిన అవసరం ఉంటది ఎపుడైనా.

 

  • మీరు తెలంగాణ భాషలో గత రెండు దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు కదా! తెలంగాణ భాష గురించి ఏమంటారు?

 

  • తెలుగు సాహిత్యంలో తెలంగాణ భాష అద్భుతంగా ఇమిడి పోయింది. తెలంగాణ భాష స్వభావరీత్యా నాదాత్మకమైన భాష. తెలంగాణ భాషలో ప్రాస, లయాత్మకత సహజంగ ఉండి వినసొంపుగ ఉంటది. ఇది సాహిత్య ప్రామాణికతను సాధించుకున్నది. నిజానికి తెలంగాణ వ్యవహార భాషను సాహిత్యంలోకి రానీయకపోవడం వల్ల దూరమైంది కానీ, దీనిలో ఏ భావాన్నైనా వ్యక్తీకరించే సత్తా ఉన్నది. సోమన , పోతన, సురవరం, వానమామలై, కాళోజీలాంటి వాళ్ళు వాళ్ళ సాహిత్యంలో వాడిండ్రు. 1956 తర్వాత రెండున్నర జిల్లాల భాష ప్రమాణ భాష చేసి, అదే ప్రసార మాధ్యమ భాష చెయ్యడం వల్ల తెలంగాణ భాష నిరాదరణకు గురైంది. నా దృష్టిలో భాషకు ప్రామాణికత ఉండడమే ఆధిపత్య భావజాలం.

 

  • ప్రస్తుత తెలుగు సాహిత్య స్థితి ఎట్లా ఉన్నది? నేటి తరం సాహిత్య స్పృహ ఎట్లా ఉన్నది?

 

  • ఒక పదేండ్ల కిందట తెలుగు సాహిత్యమంటే దిన వార మాస పత్రికలే అనుకున్నం. కానీ, వాటికి పదింతల సాహిత్యం  ఇప్పుడు అంతర్జాలంలో వస్తున్నది. ఫేస్బుక్, వాట్సప్, బ్లాగ్ లాంటి గ్రూప్ లతో పాటు  అంతర్జాల పత్రికల్లో అద్భుతమైన కవిత్వం, సాహిత్యం వెలువడుతున్నది. ఈ పత్రికలు సాహిత్యం కోసమే ప్రత్యేకంగా వేలువడుతున్నయ్. యువతరం దీన్ని పట్టుకున్నది. ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడ కథలు కవిత్వం రాస్తున్నరు. ఫేస్బుక్ లో కవి సంగమం, సాహితీ సేవ, సాహితీ సవ్వడి, ఇట్లా ఎన్నో గ్రూప్ లు వేల మంది సాహిత్యాన్ని దినదినం పోస్ట్ చేస్తున్నయ్. కరీంనగర్ జిల్లాలో కూడా ఎన్నీల ముచ్చట్ల పేరుతో మూడు సంవత్సరాలుగ వెలువడుతున్న కవిత్వం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. తెలుగు సాహిత్యానికి ఇప్పుడు పెద్దగా వచ్చిన ముప్పేమీ లేదు. రాశితో పాటు వాసిని కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది.

 

  • చివరగా…. కుండ మీద కుండ పేర్చినట్లుండే మీ కవిత్వ దొంతరలో బువ్వకుండలోని కొన్ని కవిత్వ పాదాల్ని ఉదహరిస్తారా?
  •  “మట్టిని లోహం పురాగ మింగింది/అయినా మన్ను పరిమళం మిగిలే ఉంది/కళాత్మకతలో ఉత్పాదకత దాగి ఉన్న కుల కశ్పి/ చేతి వేళ్ళ నుంచే ఆణి ముత్యాల్లాంటి కుండలు గురుగులు గూనలు రాలిపడుతయి”.

“ చేతి పనులన్నీ కవిత్వం అల్లినట్లే/ అందంగా నులక మంచం నేసుడు/ నూలు పోగుల అల్లికలతో రంగు రంగుల చీర/ పసురం తోలుతో కిర్రు చెప్పులు ముడుసుడు/ తాళ్ళు పగ్గాలు దందెడ్లు వడివడిగా పేనినట్టుగ/ బాడిశతో నాగండ్లు అమిరిచ్చుడు/ కర్రు గడ్డ పారకు మొన పెట్టినట్లుగనే/ వ్యవసాయ దారులు తినే దినుసులు పండిచ్చినట్లుగ/ సకల కుల వృత్తులు ఊరూరి సూర్యులు/ ఊరు పరస్పర సామాజిక సేవల వాకిలి/ ఉత్పత్తి సేవలు ఒక సామాజిక సన్నివేశం/ సమాజానికి బహుజనులు అందించిన బహుమానం/ తరతరాలుగ కొనసాగుతున్న వారసత్వం”.

“మట్టి నుంచే ప్రపంచానికి పట్టెడు ధాన్యం/ మట్టే వస్తుసేవలకు మూల్యాంకనం/ మట్టి కుండతో మొదలైన మనిషి జీవితం/మట్టి కుండతోనే అగ్గిల మాయం”.

 

నీ పాదాల గురుతులు…

neel

మూలం :నీలోత్పల్

అనువాదం: పఠాన్  మస్తాన్  ఖాన్ 

~

మధ్యప్రదేశ్, వుజ్జయినికి చెందిన యీ యువకవి నీలోత్పల్ మూడు కవితా సంపుటాలను ప్రచురించాడు. నీలోత్పల్ భారతీయ జ్ఞానపీఠ్ యువకవి పురస్కారం తో పాటు అనాజ్ పక్నే కా సమయ్ (ధాన్యం పక్వానికి వచ్చే సమయం) అనే తన కవితా సంకలనాన్ని ప్రచురించింది.యితని కవితలు అనేక భారతీయ భాషల్లో అనువదింపబడ్డాయి. కెనడా నుంచి ప్రచురింపబడే సౌత్ యేషియన్ మ్యాగజైన్ లోనూ యితని కవితలు ప్రచురింపబడ్డాయి.

యితని కవిత్వపు అభివ్యక్తి విభిన్న స్థాయిలో ప్రకటితమౌతుంటుంది.యితని కవిత్వంలో వొక సంసిధ్ధత కనిపిస్తుంది.అతిపరిచితములను పరిచిత వస్తువులలోకి మార్చి దృశ్యాలకు ప్రాణం పోస్తాడు.యిలా జీవితాలకు కూడా అవసరమే కదా.యితని కవిత్వం తాకనితనాన్ని తాకుతుంది.నేటి సాంకేతిక ఆర్థిక ప్రధాన్య సమాజంలో వొక మనిషిగా తన గుండె చప్పుళ్ళను వినిపిస్తాడు.యితని కవిత్వంలో బౌధ్ధికపరమైన కఠినత్వం సహజంగానే వుంటుంది.యితని కవిత్వ ప్రపంచం మనలో దాగిన మానవత్వాన్ని,ప్రేమను,మార్మిక సందర్భాలను కదిలిస్తుంది.

South asian ensemble అనే పత్రికలో యితని కవితలు ప్రచురింపబడ్డాయి.

———————

అసంభవపు సౌందర్యంలా
—————–

లోయలన్నీ, గాలిపటాల్లా యెగురుతున్నాయి.

నీ అరచేతులు
వొక చల్లని కొండతో అతుక్కున్నాయి.

అతను వుదయాన్ని స్తంభించినపుడు
నీవు నదీ వుపరితలంపై నుంచి లేవడం
ఆవిరిలా వుంది.

నేను యీ తడి మంచు వానలో
నీ రొమ్ముల్లో అణిగివున్న కోరికల వైపుగా వెళుతున్నాను.

వొక మంచుముక్కలో
యెన్నో నీటి చుక్కలు దాగివున్నట్టు
నాకు తెలియదు

కొన్ని సీతాకోకచిలుకలు
వాటిని తాకడం కష్టం
నీవు అక్కడే వుంటావు
నీ కళ్ళల్లో ల్యాండ్ స్కేప్లూ యీతాడుతుంటాయి
నేను వొక్కొక్క దాంట్లోంకి దిగుతుంటాను.

సీతాకోకచిలుకలన్నీ అలలైనట్టు
నీవు వొక తెలియని నదీ అయినట్టు

లోయపు కొన్ని మెట్లు మునిగే వున్న
నీ పాదాల గురుతులు కనిపిస్తూనే వుంటాయి నాకు

అలల సంపూర్ణపు గోళాల్లో
నా చిత్రాన్ని కొల్లగొట్టావు
అసంభవపు సౌందర్యంలా

*

తబస్సుం

 

-రెహానా

~

 

సమయం సాయంత్రం పది తక్కువ అయిదు.
రెండు గదుల రేకుల ఇల్లు. ఆ రేకులే ముందుకు వచ్చిన చిన్నపాటి వసారా. వసారాకు ఒక వైపున పుస్తకాల సంచి ముందేసుకుని వాళ్లిద్దరు కూర్చుని ఉన్నారు. ఇద్దరిదీ ఒకటే వయస్సు. 12, 13 ఏళ్లుంటాయి. బ్లూ కలర్ గౌను కింద క్రీమ్ కలర్ పైజమా వేసుకుని ఉన్న పాప తాయారు. మిలమిల మెరిసే చెమ్కీలు ఉన్న ఎర్రటి చుడీదార్, తలకు నల్లటి హిజాబ్ చుట్టుకుని కడిగిన ముత్యంలా ఉందే తను తబస్సుం.

తబస్సుం అంటే అరబిక్ భాషలో నవ్వు అని అర్ధం. వాళ్లమ్మా నాన్నకు అర్ధం తెలిసి పేరు పెట్టడం వంటిది జరక్కపోయినా తబస్సుం మోము పై చిరునవ్వు సహజ ఆభరణం.

“ఉప్పుగప్పురంబు న్రొక్కపోలికనుండు
చూడచూడ రుచుల జాడవేరు…ఆ…ఉండుండె…నేనే చెప్తా…ఆ…
పురుషులందు పుణ్య పురుషులువేరయ
విశ్వదాభిరామ వినుర వేమ…పొల్లు పోకుంటా చెప్పినా గందా?”….ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యింది తబస్సుం.

“నీకేందేమ్మా…నీది హుషారు బుర్ర. ” ముఖం చిన్నది చేసుకుంది తాయారు.
“తబస్సుం ఇస్కూలుకు పోతినే లేదు అయినా మళ్లా ఎట్టా సదుతాదో సూడు. దిమాగ్ పుస్తకంలో పెట్టాలా…ఆటల్న కాదు. సూసి నేర్సుకో..” రెండు గిన్నెల్లో ఇద్దరికీ మురమురాలు పట్టుకొస్తూ కూతుర్ని మందలించింది తాయారు వాళ్ళమ్మ.
“తాయారు తిరిగి వప్పచెప్పలేదు కాని…పాఠం మంచిగా వివరిస్తాది. లేకుంటే నాకేడ వచ్చే ఆంటీ…ఇస్కూలుకు పోయినానా…టీచర్ పాఠం విన్నానా…” కిలకిల నవ్వుతూ స్నేహితురాలి గొప్పదానాన్ని వాళ్లమ్మకు వివరించింది తబస్సుం. తాయారు మనసు తేలికపడింది. ఆ అమ్మ కూడా తన కూతురు తక్కువ కాదు అని నమ్మకం కలిగి మురిసిపోయింది.

హైదరాబాద్ పాత బస్తీలోని సుల్తాన్ షాహిలో పక్కపక్క ఇళ్లు తాయారు, తబస్సుం లవి. తాయారు వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్. ముగ్గురు పిల్లలు.వారిలో తాయారు చిన్నది. ఉన్నంతలో నెట్టుకొచ్చే సంసారం.
తబస్సుం వాళ్ళ నాన్నది సైకిల్ రిపేర్ షాపు. పేరు ఇస్మాయిల్. ఇద్దరన్నలు, ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు . ఏడుగురు సంతానంలో తబస్సుంది నాలుగో నెంబర్. బండెడు సంసారం పైగా ఆరేడేళ్ళ క్రితం చిన్న యాక్సిడెంట్ అయితే పక్క వీధిలో ఉండే ఆర్ఎమ్పీ డాక్టర్ దగ్గర పట్టీ వేసుకున్నాడు. అది కాస్త వికటించటంతో కుడి కాలు మోకాలు వరకు తీసేయాల్సి వచ్చింది. అందుకే ఇస్మాయిల్ ఇద్దరు మగ పిల్లల్ని పదేళ్లు నిండీ నిండకుండానే పనుల్లో పెట్టేశాడు. ఒకడు హోటల్ లో బాసన్లు తోమటం, బల్లలు తుడవటం వంటి పనులు చేస్తాడు. రోజూ ఇంటికి పదో పరకో పట్టుకొస్తాడు. రెండో వాడు నాన్న దగ్గరే చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఏడాది క్రితం తబస్సుం వాళ్ళక్క పెళ్లయ్యింది. కట్న కానుకలకు డబ్బులేక ఇస్మాయిల్ ఉన్న ఇంటిని అమ్మేశాడు.

ఇప్పుడు అదే ఇంట్లో వారు కిరాయికి ఉంటున్నారు. ఇక తబస్సుం ఆరోక్లాసు పూర్తి చేసి ఏడులోకి అడుగు పెట్టిన మొదటి నెలల్లోనే పెద్ద మనిషయ్యింది.
ఆ ఘడియ నుంచి తబస్సుంకు బురఖా కొత్త యూనిఫాం అయ్యింది. ఆ లేత బుగ్గలకు పెద్దరికాన్ని ఆపాదించి బడికి పంపటం బంద్ చేశారు.
తబస్సుంకు పుస్తకాలంటే పిచ్చి. చదువుంటే ప్రేమ. బడి అంటే ఆనందం, ఓ అద్భుతం. పలకా బలపం పట్టుకుని బుడి బుడి అడుగులు వెసుకుంటూ గవర్నమెంట్ స్కూల్ కు వెళ్లిన తొలి రోజు నుంచి బడికి పోతానంటూ గుక్కపట్టి ఏడ్చినా వినకుండా మాన్పించిన తుది రోజు వరకు క్లాస్ ఫస్ట తనే. టీచర్లకు తబస్సుం అంటే వల్లమాలిన అభిమానం. అమ్మ నుంచి వారసత్వంగా వచ్చిన తెల్లని మేనిఛాయ, కోమలమైన అందం, మెరుపులతో కొత్త అందాన్ని తెచ్చే కళ్లు, చదువులో చురుకుదనం అన్నీ కలిసి తబస్సుం అంటేనే ఆ బళ్లో ప్రత్యేకం అనిపించాయి.

తబస్సుం చేత బడి మాన్పించగలిగారు గాని చదువుని కాదు. నాలుగు కాగానే తాయారు బడి నుంచి ఎప్పుడు వస్తుందా అని ఇంట్లో నుంచి గుమ్మంలోకి , గుమ్మంలోంచి ఇంట్లోకి కాలు కాలిన పిల్లిలా తిరుగుతూనే ఉంటుంది తబస్సుం. తాయారు రాగానే వాళ్లింట్లోకి వాలి పోతుంది. ఇవేళ పాఠాలు ఏం చెప్పారే అంటూ. ఇక అంతే ఇంట్లోకి కూడా వెళ్లకుండానే తాయారు ఆ రోజు స్కూల్ లో జరిగిన ముచ్చట్లన్నీ జోషుగా చెప్పుకుంటూ వస్తుంది. స్కూల్ కు పోక పోయినా తాయారు మాటలు వింటూ తానూ స్కూల్ లో ఉన్నట్లు ఊహించుకుంటూ ఆనందాన్ని జుర్రుకుంటుంది తబస్సుం. స్నేహితుల కబుర్లు, టీచర్ల విషయాలు చెప్పిన తర్వాత ఇక పాఠాల్లో పడతారు. తాయారు గతంలో పాఠాలు అంత శ్రద్ధగా వినేది కాదు. పరీక్షల్లో తబస్సుమే దొంగ చాటుగా సమాధానాలు చెప్పేది. కాని తబస్సుం స్కూల్ కు రావటం మానేసినప్పటి నుంచి తనకు పాఠాలు చెప్పటం కోసం శ్రద్ధగా వినటం మొదలు పెట్టింది. స్కూల్ లో టీచరు ఎలా చెప్పారో ఇంటికి వచ్చి వారిని అనుకరిస్తూ తబస్సుంకు పాఠాలు చెప్పటం తాయారుకు గొప్ప ఆనందాన్ని ఇస్తోంది.

“కిత్తె బార్ బులానా రీ…వస్తాద్నీ ఆయే బోలేతో సునేజాతా నేహే…టీచరమ్మ వచ్చిందని పిలుస్తుంటే ఈ పిల్ల కదుల్తానే లేదు…రేపు షాదీలా బచ్చీ ఖురాన్ చదివిందా, దీన్ గురించి తెలుస్నా అని అడుగ్ తారు గాని ఈ దునియా పాఠాలు అడుగ్ తారు…?! “గోడ మీద నుంచి తల్లి పురాణం ఎత్తగానే తబస్సుం వెంటనే ఇంట్లోకి పరుగెత్తింది. మోగ్రీబ్ కా నమాజ్ అయిన తర్వాత అంటే ఆరున్నర ఏడు గంటల సమయంలో తబస్సుంకు అరబ్బీ సురాలు, ఖురాన్ చదివించటానికి వస్తాద్నీ వస్తారు.

…………………..

“తబస్సుం…తబస్సుం…నీకో విషం చెప్తా…నాకేమిస్తావ్…”
ఈ వేళ తాయారే స్కూల్ అయిన వెంటనే ఆటలకు పోకుండా పరుగెత్తుకుంటూ తబస్సుం
వాళ్లింట్లోకి జొరబడింది.
” అబ్బా తెచ్చిన బిస్కెట్ల నీకు రెండిస్తాలే…చెప్పు ఎందుకంత హుషారుగున్నావ్…చెప్పే…”స్నేహితురాలి ఆనందానికి కారణం ఏమిటా అని ఓ వైపు నుంచి ఆలోచిస్తూనే తాయారుని పట్టుకుని తెగ ఊపేస్తూ అడిగింది.
తబస్సుం. ఒక నిమిషం పాటు ఊరడించి అసలు విషయం చెప్పింది తాయారు కళ్లు విప్పార్చి.

“మన క్లాస్ టీచర్ కమల టీచర్ లా…పొద్దొస్తూ నీ గురించి అడుగ్ తా ఉంటాదని చెప్పా కదా. మీ అబ్బాని సానా మార్లు అడిగిందట నిన్ను బడ్లోకి పంపమని. నే చెప్పా నువ్వు ఈడికి రాకపోయినా ఏడాది సదువుంతా సదివినావని. క్వశ్చన్ పేపర్లు ఇంటికాడ నువ్ రాస్తే నేను దిద్దినానని. గప్పుడు టీచరమ్మ అంది కదా…అయితే ఎలాగో అలాగ హాజరీ సంగతి నేను సూసుకుంటాను , యాన్యువల్ ఎగ్జామ్స వచ్చి రాయమను అని.”

” నిజంగనే…తాయారు… నువ్ నిజంగనే చెబుతుండావా…? నేను పరీక్ష రాయొచ్చా…పాసైతే నీతో బాటు హైస్కూల్ కి పోతానా..”తబస్సుంకు నమ్మశక్యంగానే లేదు. పరీక్షలకు ఇద్దరు కలిసి బాగా చదవాలని, తబస్సుం వాళ్ల నాన్నను ఒప్పించి పరీక్షలకు ఎలాగైనా హాజరు కావాలని…బురఖా వేసుకుని వెళ్తానంటే నాన్న కాదనడని …ఇలా …ఈ ఇద్దరు చిన్నారుల కబుర్లు సాగిపోతానే ఉన్నాయి. తాను బాగా చదివి ఉద్యోగం చేసి ఇంటి ఖర్చంతా తానే చూసుకుంటానని తబస్సు చెబుతూ తెగ ఆనంద పడిపోయింది. ఈ ముచ్చట్లు తబస్సుం వాళ్ల అమ్మ ఎలాంటి భావం లేకుండా వింటూనే ఉంది.

……………………….

పరీక్షలకు ఇంకా నాలుగు దినాలో ఉన్నాయి. అమ్మను ప్రసన్నం చేసుకోవటానికి తబస్సుం ఇంటి పని అంతా గబగబా చక్కబెట్టేస్తోంది. అంట్లు తోమటం, వంట సహాయం చేయటం నుంచి తమ్ముడ్ని, చెల్లళ్లను చూసుకోవటం వరకు అన్నింట్లోను ముందు ఉంటోంది. అమ్మ కొంగు పట్టుకుని గారాబం చేస్తే అబ్బాను ఒప్పించటం తేలిక అనేది తబస్సుం ఆలోచన.

“తబస్సూమ్….”
ఆ….ఆఈ అమ్మీ…..” అమ్మ పిలుపుతో వీధి అరుగు మీద కూర్చుని వచ్చే పోయే వాళ్లను చూస్తున్న తబస్సుం లోపలికి పరుగెత్తింది.
తబస్సుం వాళ్ల అమ్మ పాత సూట్ కేసు ముందేసుకుని కూర్చుని ఉంది. “క్యావ్ అమ్మీ…ఏ సందూక్ కైకు నికాలే…?”
“దేఖో…ఈ చుడీదార్ కైసా హై…? ఆపా కే వలీమేకా ..పెహెన్ లో…” తబస్సుం వాళ్ళ అక్క వలీమా అంటే రిసెప్షన్ నాటి డ్రస్ అది. ఆకుపచ్చ మఖమల్ గుడ్డ పై గులాబీ రంగు చమ్కీలు, పూసలు, అద్దాలతో ఝిగేల్ మంటున్న చుడీదార్.

గులాబీ రంగు ధుపట్టా పై ఆకు పచ్చ కారీగరీ చేసి ఉంది. గతంలో ఎప్పుడు అడిగినా పెళ్లి సెంటిమెంట్ పేరు చెప్పి ఇవ్వని అమ్మ…ఇవాళ ఎందుకు బయటకు తీసిందో అర్ధం కాలేదు తబస్సుంకు.
“అబ్ కైకు అమ్మీ…?” దారిలో చెబుతాన్లే వేసుకో అనటంతో ఐదు నిమిషాల్లో హుషారుగా రెడీ అయ్యింది
తబస్సుం. మరో పది, పదిహేను నిమిషాలకు తబస్సుం వాళ్ల నాన్న ఇస్మాయిల్ కూడా ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూ ఆటో తెచ్చాడు.

“ఆటో లాయ్..పైసే భోత్ హోతే ఫిర్…”ఆటో కిరాయి ఎక్కువ అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేసింది తబస్సుం వాళ్ల అమ్మ.
“తూ చుప్ రీ…దునియాకు మాలూమ్ హోనా క్యావ్. ఆటోమే చుప్ చాప్ బైఠో…” ఆటోలో మాట్లాడకుండా కూర్చోమంటూ ఆదేశాలు జారీ చేశాడు ఇస్మాయిల్. రెండు బురఖాలు ఎక్కిన తర్వాత ఇస్మాయిల్ కూర్చున్నాడు. ఆటో ముందుకు ఉరికింది.

……………………

“సలామ్ అలేకుం…”
రెండు పోర్షన్ల చిన్నపాటి డాబా ఇల్లు. ఇంటి ముందటి గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే వసారాలో పొడవాటి చెక్కబల్ల పై పాన్ నములుతో కూర్చుని ఉంది ఒకావిడ. ఆవిడ ముందు ఒక ల్యాండ్ ఫోన్. ఆ పక్కనే పాన్ ఉమ్మివేసి ఒక రేకు డబ్బా. చేతిలో ఫోన్ నెంబర్లు రాసుకునే చిన్నపాటి పుస్తకం ఉన్నాయి.
వయస్సు 45-50 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. భారీ దేహం, ముఖంలో కరుకుదనం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. పేరు నజీరున్ బీ.

“వాలేకుమ్ అస్సలామ్…”
ఆవిడ గుర్తు పట్టడానికి వీలుగా తబస్సుం వాళ్లమ్మ ముఖానికి ఉన్న నఖాబ్ తీసింది. ఇస్మాయిల్ కూడా సలామ్ చేసి ఇక మీరు చూసుకోండి అంటూ వెళ్లిపోయాడు. నజీరున్ బీ ఇద్దరిని వసారాను ఆనుకుని ఉన్న గదిలోకి తీసుకువెళ్లింది. మీ అమ్మాయేనా అని అడిగింది. అవునంది తబస్సుం వాళ్ళమ్మ.

“కా బచ్చీ…నఖాబ్ ఉతారో…పెహలే మైతో దేఖూ…బచ్చీ ఖూబ్ సూరత్ హై కీ నై…”
ఏం చేయాలో అర్ధం కాక అమ్మకేసి చూసింది తబస్సుం. ఆమె కూడా తీయమనటంతో ముఖాన్ని కప్పి ఉన్న నఖాబ్ తీసింది. అందంగా, అమాయకంగా ఉన్న తబస్సుంను చూడగానే ఆవిడ కళ్లు విప్పారాయి.
“మా షాల్లా…ఇత్తీ ఖూబ్ సూరత్ బేటీ హై ఆప్ కో…సమఝో సబ్ కుచ్ తై హోగయా…ఆప్ బే ఫికర్ రహ సక్తే. “అని భరోసా ఇచ్చింది నజీరున్ బీ. మళ్లీ అంతలోనే అనుమానం వచ్చి ఇది మొదటి సారే కదా అని ఒకటికి నాలుగు సార్లు అడిగి రూఢీ చేసుకుంది.

తబస్సుం అన్నీ నిశితంగా గమనిస్తోంది కాని ఏం జరుగుతుందో ఒక అంచనాకు రాలేకపోతోంది. అమ్మ ముఖంలో భావాలను చదివే ప్రయత్నం చేస్తున్నా ఆనందమో, బాధో తేల్చుకోలేకపోతోంది. నజీరున్ బీ తబస్సుంను వారున్న గదికి ఆనుకుని ఉన్న మరో గదిలోకి వెళ్ళమని చెప్పింది. ఆమె చూపుడు వేలు చూపిస్తున్న దిక్కుకు వెళ్ళి గుమ్మానికి ఉన్న కర్టెన్ ను కొంచెం జరిపి లోపలికి తొంగి చూసింది తబస్సుం. అక్కడ తన వయస్సుకు కాస్త అటూ ఇటూగా మరో ఐదారుగురు అమ్మాయిలు ఉన్నారు.

“జావ్…అందర్ జావ్…’ నజీరున్ బీ కంఠం వెనుక నుంచి వినిపించటంతో బెరుగ్గా ఆ గదిలోకి అడుగు పెట్టింది తబస్సుం. కొందరు అమ్మాయిల ముఖంలో నవ్వు ఉంటే కొందరు తనకు మల్లే ఆందోళనగా ఉన్నారు. ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు దట్టంగా పౌడర్ రాసుకుని పెదాలకు ఎర్రటి లిప్ స్టిక్, కళ్ళకు కాటుక, కను రెప్పలు, బుగ్గల పై కాస్త గులాబీ రంగూ పులిమారు. తలలో జడ పొడవుగా వేళ్లాడుతూ మల్లెపూలు. దాదాపు అందరూ కళ్ళకు ఛక్ ఛక్ మనిపించే మెరుపుల చుడీదార్లే వేసుకున్నారు. అందరూ ఒకరిని ఒకరూ
కళ్ళతోనే పరికించుకుంటున్నారు కాని…మాట కలపటం లేదు. వారందరిలో కాస్త సీనియర్ గా, ఇదంతా బాగా తెలిసిన వ్యవహారమే అన్నట్లున్న ఒక అమ్మాయి మాత్రం తబస్సుం దగ్గరికి వచ్చి అడిగింది..

“పహెలీ బార్…?”
దేనికి మొదటి సారో అర్ధం కాలేదు తబస్సుంకు. ఇక్కడికి రావటం మొదటి సారే కదా అని అవునంది. మొదటిసారి వచ్చినప్పుడు నేను కూడా నీకు లానే ఉండేదాన్నని చెప్పి నిట్టూర్చింది ఆ అమ్మాయి. నజీరున్ బీ రావటంతో మాటలు ఆగాయి. ఆయన వచ్చేశారు అంటూ హడావిడి మొదలుపెట్టింది. అడిగిన ప్రశ్నలన్నింటికి చక్కగా, నిజాయితీగా సమాధానాలు చెప్పాలంది. అబద్దాలు
చెబితే దొరికిపోతారు అని బెదిరించింది. ఆమె ఆదేశాలతో ఒకరి తర్వాత ఒకరిగా అమ్మాయిలు వేరే గదిలోకి వెళుతున్నారు నాలుగైదు నిమిషాల్లో బయటకు వస్తున్నారు. మరో మాట మాట్లాడకుండా తమ స్థానాల్లో బొమ్మల్లే నిలబడుతున్నారు. తబస్సుంతో మాట కలపటానికి ప్రయత్నించిన సీనియర్ అమ్మాయిని నీకు నేను తర్వాత చెబుతాన్లే అని చివరిగా తబస్సుంను తన వెంట రమ్మంది.

అమ్మ కోసం వెదికింది తబస్సుం. కనిపించలేదు. ఆందోళనతోనే నజీరున్ బీ వెంట నడించింది. ఆ గదిలోకి అడుగు పెట్టగానే ఏసీ తాలూకు చల్లదనం మృదువుగా తాకింది. మూసివేసిన కిటికీలకు కర్టెన్లు వేలాడుతున్నాయి. ఆ ఇంట్లో మిగిలిన గదులకు ఈ గదికి అస్సలు పోలిక లేదు.గది చిన్నదే కాని విలాశవంతమైన అలంకరణలతో ఉంది. ఒక వైపు ఉన్న విశాల మైన సోఫాలో డెబ్భై ఏళ్లు పైబడిన
ముసలాయన కాలు మీద కాలు వేసికుని దర్పాన్ని చూపిస్తూ కూర్చుని ఉన్నాడు. మెడ నుంచి కాళ్ళ వరకు తెల్లటి పొడవాటి డ్రెస్ వేసుకుని ఉన్నాడు. దాన్ని థోబ్ అంటారు తల మీద కప్పుకున్న గుడ్డను ఘుత్రా అంటారు. చూడగానే ఎవరికైనా ఇట్టే అర్ధం అయిపోతుంది ఇతని అరబ్ దేశాలకు చెందిన వాడని.

“సలాం కరో…” హూంకరించింది నజీరున్ బీ.
తనను ఎందుకు ఇక్కడికి తెచ్చారో మెల్లగా అర్ధం కాసాగింది తబస్సుంకు.
కళ్ళల్లో నీటి పొర కదలాడుతోంది. అమ్మా నాన్న , పుస్తకాలు , తాయారు, పరీక్షలు అన్నీ ఒక దాని తర్వాత ఒకటిగా కళ్ల ముందుకు వచ్చి వెళుతున్నాయి.

” బురఖా నికాలో “…మరో ఆదేశం
అక్షరాలకు రెక్కలు తొడిగి అనంత ఆకాశంలోకి ఎగిరి వెళ్లాలనే కలలు ఆ కళ్లవి. అవిటి నాన్నకు అండగా నిలబడాలనుకున్న ఆశలు ఆ చిట్టి తల్లివి.

కన్న పెగే కాసుల కోసం కాటు వేస్తుందని ఊహించని అమాయకత్వం ఆమెది. కల్లోనూ ఊహించని దెబ్బకు మనసు బీటలు వారుతోంది. తబస్సుం గుండె గొంతుకలో ఆర్తనాదాల హోరు. అమ్మీ, అబ్బా…నన్ను ఇలా అమ్మేస్తారా…? నేను మీ బిడ్డనే కదా. మీ కడుపునే పుట్టినా కదా. మేరీ బేటీ అని అమ్మీ నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేసేది కదా. అన్నీ మరిచి పోయారా…? ఇంత మందిని సాకలేకపోతే ఎందుకు కన్నావ్ నాన్న. ఏమంటే మజహబ్ అంటావ్. పిల్లలను అల్లా ఇస్తాడంటావ్. ఆపరేషన్లు చేసుకోకూడదంటావ్. మరి ఏ ఖురాన్ లో ఉంది నాన్న ఇట్టా ఆడబిడ్డల్ని పసువుల మాదిరిగా అమ్మేయాలని. ఆడిపిల్ల దేహంతో వ్యాపారం చేయాలని. నా ఆడపిల్లతనమే అడ్డు అనుకుంటే భయ్యాల్లాగా ప్యాంట్ , షర్టూ వేసుకుని క్రాప్ కొట్టించుకుని ఏ హోటల్ కో పోయి బాసన్లు కడిగిదాన్ని కదా నాన్న. లేదంటే నేనేవరో కనిపించకుండా నిండా బురఖా వేసుకుని రోడ్ల పై అడుక్కుని అయినా నాలుగు పైసలు తెస్తిని కదా అబ్బా. అమ్మీ..నీకేమి చెప్పాలా అమ్మీ. సందఖ్ లో నుంచి బట్టలు తీస్తుంటే నా కోసం ముచ్చట పడుతున్నావ్ అనుకున్నా కాని పైసల కోసం అని అనుకోలే అమ్మీ. నన్నెంత సింగారిస్తే అన్ని పైసలు వస్తాయని లెక్కల పుస్తకంల నేర్చుకోలేదమ్మీ. అబ్బా ఇంకో అమ్మీని పెళ్లి చేసుకున్నాడని ఆ నాడు వీధిలో పడి గొడవ చేస్తివే…మరి నన్ను ఈ ముసలోడితో నాల్గు దినాల షాది ఎలాగ చేయిస్తున్నావ్ అమ్మీ. మీ నిస్సహాయతకు, మీ మూర్ఖత్వాలకు, మీ మత విశ్వాసాలకు, మీ కష్టాలకు, మీ బాధలకు, మీ అవసరాలకు నన్ను పణంగా పెట్టాలనుకున్నారా? అల్లా కూడా ఇవన్నీ చూస్తూనే ఉన్నాడా..?ఇది అన్యాయం కాదా? తాయారు సానా మంది దేవుళ్ల గురించి చెబుతూ ఉండేది. వాళ్లూ అంతేనా? ఏ దేవుడూ ఏమీ చేయడా?
ఎవరూ ఏమీ చేయలేదు. ఆమె ఆర్తనాదాలు, ఆక్రందన బురఖా దాటి బయటకు పోలేదు. కూతుర్ని అమ్మిన డబ్బుల్లో మధ్యవర్తి వాటా పోగా వచ్చి సొమ్ములు తీసుకుని తబస్సుం అమ్మానాన్న ఇంటి దారి పట్టారు. అటు ముసలాడు తీసిన ఓ హోటల్ గదిలో తబస్సుం పంటిగాట్లు, అర్ధం కాని వికృత చేష్టలకు అలవాటు పడింది. సరిగ్గా ఇరవై రోజుల తర్వాత బహ్రెయిన్ ముసలాడు, తబస్సుం భర్త మళ్ళీ వస్తానంటూ ఫ్లైట్ ఎక్కేశాడు. నల్లటి బురఖాలో ఇంటి ముందు ఆటో దిగింది తబస్సుం.
*

ఈల సంభాషణ

 

-సురేంద్ర దేవ్ చెల్లి

~

ఒక్కరోజైన
హైడ్ రేంజియా పుష్పాల
ఉండాలని ఉంది
పి.హెచ్ విలువ కంటే
మానవత్వాన్ని కొలవడానికి
నా ప్రాణం
ఈ పువ్వులలో మళ్ళీ వికసించాలి.

ఆఫ్రికా అడవులలో
హనీ గైడ్ పక్షులతో
ఈల సంభాషణను కొనసాగించాలి
అవైన నన్ను
మనుషుల చెంతకు చేరుస్తాయి ఏమో కదా!

జీరో గ్రావిటీ కాడ
నువ్వు-నేను గాలిలో దీపాలం
కేండిల్ వెలుగు మాత్రం
నీలిరంగు దుప్పటి.

అమెజాన్‌ తాబేళ్లు
మాతృత్వ ప్రతినిధులు
సీతాకోకలకు వాటి కన్నీటిలో
సోడియం…అమృత వర్షం.

~

ఒడ్వని దుక్కం

 

 

-బండారి  రాజ్ కుమార్

~

కొందరు ఏడ్వడానికే పుడుతరు
దుక్కమే జీవితమైనట్లు బతుకుతరు
బతుకంతా దుక్కనదిని ఈదుతనే ఉంటరు
ఒడ్వని దుక్కాన్ని గుండె సందుగలో దాసుకుంటరు
సెమట సుక్కలై బొట్లు బొట్లుగ రాలిపోతరు
సంబురానికి నవ్వుదమనుకుని కన్నీటి జలపాతమైతరు

ఆ రెండు కండ్లు… ఎదురుసూపుల పడవలైతయి
కరువుల సుత కళకళలాడే సెర్వులైతయి
ఎప్పుడూ ఒట్టిపోని ఊటచెలిమెలైతయి

కొన్ని నీడలు వెంటాడుతయి
వెంటాడే నీడలు వేటాడుతయి
తప్పు జరగకముందే శిక్షలు ఖరారైతయి

ఎన్నియుగాలు  సై సూశినా
కన్నీళ్లు ఉప్పగనే అనిపిస్తయి
ఇంత బతుకు బతికి…
ఏం నోసుకున్నరని
నొసల్లు ఎక్కిరిత్తయి

నీ అతుకుల బతుకు బొంతకు అంటిన మరకల్ని తుడ్వాలంటె…
ఆ మాత్రం…దుక్కపువానలో తడవాల్సిందేలే !

*

దృశ్యభ్రమణం లోంచి…

 

 

 -దాసరాజు రామారావు

~

అట్లా నడుస్తుంటానా

మూల మలుపు తిరగ్గానే
సూర్యుడెదురుపడి ఆలింగనం చేసుకుంటడు
రోడ్డుమీది పేపరొకటి ఎగిరొచ్చి నా ముఖానికి అతుక్కుంటది
మితృని కవిత అచ్చయిందేమో
అడుగు తీసిన్నో లేదో
ఎప్పుడొచ్చిందో నా కాళ్ళచుట్టు  అల్లుకుపోతుంటదా  కుక్కపిల్ల
ఏమంత తినడానికి పెట్టినానని…
ఇంతలో వెనకనుంచి నిద్రలేపే కోడిపుంజు లాంటి కరుకైన పిలుపు
నన్ను గుర్తు పట్టే,గుర్రుమనే ఆపాత మధురమైన గురువర్యుని గొంతుదే

దుకాండ్లు తెరుస్తున్నరు
పోటీలు మొదలైనయి
అమ్మడం,కొనడం గొప్పపని కిందే లెక్క
ఎవలకు వాండ్లు బతకడానికి ఏర్పాట్లు చేసుంటున్నట్లే
500 నోటుకి చిల్లరెవరిస్తరు
ఆ మిల్క్ బూత్ లో అడగొచ్చా
పాలలాంటి మనసుంటుందా వాడికి

రోడ్డు  రన్నరై  దూసుకెల్తున్నది
అడుగులు పడుతున్నా అక్కడే కూలబడ్డట్లున్నానా …

అన్ని ధ్వనుల దాడిల అంతరంగ సంభాషణ
ఇవాల్టి సినిమా సాంగ్ లా, ఎవరికీ పట్టని  లిరిక్కయింది
ఆ గుడిదగ్గర భక్తుల కోలాహలం
అసంతృప్త జనాభా ని ,నమోదు చేసుకుంటున్నాడా దేవుడు
బిచ్చగాడా చెట్టుకొరిగి కునుకుపాట్లు పడుతున్నడు
ఈ మాయామేయజగంబుతో పట్టి లేనట్లు

కాలుకింద కంకరముక్క గుచ్చుకొని,అమ్మని తలచుకొంటానా…

సున్నితపుత్రాసుల శెక్కరి తూచుతూ
కరెన్సీని కటినంగా వసూల్ చేస్తున్నడు ఆ షాపువాడు
స్కూల్ గేట్లోకి వెళ్ళక ,చదువులమ్మి హఠం చేస్తున్నది
రోబో గ తయారవ్వడం ఇష్టం లేక
ఈ పాటను కాపీ చేసుకొమ్మంటూ
జేబులో సెల్ అరుస్తున్నది
ఒనరూ నెనరు  దానికి పట్టదు
వలస వచ్చిన ఆ వృద్ధ దంపతులు
వీధి మూలన మిర్చి బజ్జీలు వేసి
అమ్మకానికి ఆశతో చూస్తున్నారు
వయసై పోయినందుకు శిక్షింపబడాలేమో

నడుస్తున్నానా,ఆలోచిస్తున్నానా,ఆవేదిస్తున్నానా ….

కొంచెం ఆకాశం మేఘమయమై
కంట్లోవాస్తవమేదో కనుమరుగై నట్టు-
శూన్యావరణలో నేనొక్కడినే కట గల్సినట్టు-

డేట్ల గేట్లు దాటుకుంటూ పోవడమే
నుదుటి ముందు సూర్యుని లాంటి ఉనికేదో
ఉదయిస్తూ ఉండాలనుకోవడం నుంచి పారిపోవడమే

పరిశుభ్రమైన గాడ్పులు వీస్తూ
మనసుల్ని గిలక్కొట్టి ,వెన్న తీస్తున్నట్లు  కలలొస్తుంటాయి ఇప్పటికీ…

కలల్ని ప్రచారం చేయడం
బాగుంటుందేమో
నడకకు గమ్యం దొరికే అవకాశం
ఉంటుందేమో

*

పెరుమాళ్ మురుగన్ కి అక్షరాలా పునర్జన్మ!

image of judgement

-రమా సుందరి 

~

“పెరుమాళ్ మురుగన్ మరణించాడు. అతను దేవుడు కాదు. మళ్ళీ అవతారమెత్తడు. అసలు అవతారాలను నమ్మడు. ఇప్పటి నుండి పెరుమాళ్ మురుగన్ ఒక టీచరుగానే బతుకుతాడు.”

పోయిన  జనవరి 12న పెరుమాళ్ మురగన్, తమిళ నవల మాదోరుబాగన్ రచయిత తీవ్ర మనో వత్తిడితో యిచ్చిన  ప్రకటన.

“తనలో దాగున్న అత్యంత ప్రతిభతో సహా రచయితకు పునర్జన్మ ఇద్దాము. పెరుమాళ్ మురగన్ నువ్విక రాయి.”

ఈ సంవత్సరం జులై 5న రచయిత పెరుమాళ్ మురగన్ కు మద్రాస్ హై కోర్టు జడ్జి సంజయ్ కిషన్ కౌల్ యిచ్చిన గొప్ప హామీ.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను  శక్తివంతమైన శబ్దార్ధంతో వ్యక్తీకరించిన తీర్పు యిది. న్యాయస్థానాల అర్ధం కానీ పరిభాషకు భిన్నంగా – హృదయానికి దగ్గరగా, కవితాత్మకమైన భాషలో వెలువడిన ఈ తీర్పు సంవత్సరన్నర కాలంగా రచయితలు, కళాకారులు పడుతున్న మనో వేదనపై చిరుజల్లులు కురిపించి ఊరట కలిగించింది. సాహిత్యాన్ని, చట్టాన్ని  సమతూకంలో తూచి జయహో అనిపించుకొన్నది. “పుస్తకం అరుదుగా గాయం చేస్తుంది. ఎందుకంటే దాన్ని మూసి వేయటం తేలిక” అన్న ఒక రచయిత సల్మాన్ రష్దీ లాగానే “చదవటం యిష్టం లేకపోతే, పుస్తకాన్ని విసిరి కొట్టు” అంటూ మద్రాస్ హైకోర్ట్ జడ్జిలు సంజయ్ కిషన్ కౌల్, పుష్ప సత్యన్నారాయణలు రచయితల పక్షం వహించారు.

సంజయ్ కిషన్ కౌల్ కళాకారుల పట్ల ప్రేమతో వ్యవహరించటం, కళాత్మక సృజనకు గౌరవం యివ్వటం ఈ రోజు కొత్త కాదు. 2008లో ప్రవాసంలోకి వెళ్ళి పోయిన ఎమ్మెఫ్ హుస్సైన్ కు దన్నుగా ఇదే జడ్జి నిలబడ్డారు. ఆ రోజు ఢిల్లీ హై కోర్టు జడ్జిగా ఉన్న సంజయ్ కౌల్  ప్రాచీన, నవీన కళలు నగ్నత్వాన్నిఎప్పుడూ ఉపయోగించుకొన్నాయని  ఆ నాటి తీర్పులో పేర్కొన్నారు. స్త్రీ పురుషుల మధ్య కలయిక, లైంగిక పూజ.. ఈ రెండిటినీ ప్రాచీన కళ ఎప్పుడు తోసి పారేయలేదని చెప్పారు. అదే వాక్యాన్ని ఈ రోజు పెరుమాళ్ మురుగన్ కేసులో సంజయ్ మళ్ళీ వాడారు. ఎమ్మెఫ్ హుస్సైన్ తీర్పులో ఆయన దేశం ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదం ఛాందసవాదం అని చెప్పారు. ఇప్పుడు పెరుమాళ్ మురుగన్ కేసులో ‘మన సహనపు హద్దులు కిందకు పడిపోతున్నాయి. నిజమో అబద్దమో, ఎవరైనా సామాజిక ఆచరణ గురించి రాస్తే అది మనకు ఎంత మాత్రము ప్రమాదకరం కాదు’ అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఆర్ధిక శాస్త్రంలో పట్టా పొంది,  కాంపస్ లా కాలేజ్ నుండి ఎల్ ఎల్ బీ డిగ్రీ పొందారు సంజయ్. మద్రాసు హైకోర్టుకు రాక ముందు ఆయన పంజాబ్, హర్యానా హై కోర్టులకు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు.

నువ్వొక పుస్తకం రాస్తావు. ఆ పుస్తకం 5000 కాపీల వరకు అమ్ముడు పోతుంది. దాని అనేక అవార్డులు వస్తాయి. ఒక నాలుగు సంవత్సరాలు గడిచాక అది ఇంగ్లీష్ లోకి అనువాదం అవుతుంది. హటాత్తుగా కొందరు వ్యక్తులు అది మత భావాలను అవమానిస్తుందని బయటకు వస్తారు. అందులో భాష అసభ్యంగా ఉందంటారు. అసభ్యమైన అంశాలు ఉన్నాయని, అవి స్త్రీలను అవమానిస్తున్నాయని మొదలు పెడతారు. కులాన్ని భ్రష్టు పట్టిస్తుందని అంటారు. నడిరోడ్డులో పుస్తకాన్ని తగలబెడతారు. బంద్ కు పిలుపు యిస్తారు. ఊర్లో షాపులు బలవంతంగా మూయిస్తారు. (వ్యాపారస్తులు చాలా మందికి సాహిత్యం అంటే ఏంటో కూడా తెలియదు) కొంతమంది స్త్రీలు కూడా ఈ ఆందోళనకారులతో ఉంటారు. జిల్లా పాలనా యంత్రాంగానికి అది శాంతిభద్రతల సమస్యగా కనిపిస్తుంది. కలక్టరు ఆఫీసులో కట్టా(ఖాప్) పంచాయితీ జరుగుతుంది. రచయిత మెడలు అధికారులు వంచుతారు. ఆయనకు ‘సమ్మన్స్” జారీ చేస్తారు.  జరిగిన విషయాలకు ‘తీవ్ర పశ్చాత్తాపం’ ప్రకటిస్తున్నానని రచయిత అంటే ఆ పదాన్ని ‘షరతులు లేని క్షమాపణ’గా మార్పిస్తారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న డొల్లతనాన్ని మద్రాసు హైకోర్టు తప్పు పట్టింది. ఒక నవల తన స్వభాషలో నాలుగు సంవత్సరాలు నానింది అంటే అది ప్రజల ఆమోదం  పొందినట్లే. ఇంగ్లీష్ అనువాదం తమిళ మాతృకకు ఆధునిక రూపం మాత్రమే. అందులో తమిళంలోని వాడుక పదాలు కానీ, నుడికారాలు కానీ, జనపదాలు వాడే మొరటు భాష కానీ ఉండవు. సొంత భాషలో లేని అసభ్యత ఇంగ్లీషులో ఎలా కనిపించింది? అని ప్రశ్నించింది. పాలనా యంత్రాంగానికి ఈ పుస్తకం పట్ల ఎలాంటి అభ్యంతరం లేకుండానే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. శాంతి భద్రతల పేరుతో అది ఇప్పుడు ఈ విషయంలో కలగచేసుకొన్నది. కళలు సంస్కృతులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ యంత్రాగం ప్రమేయం ఎంతవరకు ఉండాలి అని హైకోర్టు ప్రశ్నించింది. ఒక కళాకారుని వ్యక్తీకరణను చంపటానికి కేవలం ఒక గుంపు ఆవేశాన్ని ప్రాతిపాదికగా తీసుకోకూడదని చెప్పింది. పాలనా యంత్రాంగంతో కూడిన ఈ చట్టాతీత కోర్టులు తమ సొంత సిద్దాంతాల తోటి సామాజిక, నేర విషయాలను పరిష్కరించబూనుకోవటాన్ని తప్పు పట్టింది. మాట్లాడిన తరువాత స్వేచ్ఛ కాపాడక పోవటం అంటే ‘మాట్లాడటానికి స్వేచ్ఛ’  అనే మాటకు అర్ధం ఉండదని స్పష్టం చేసింది.

ఇంత వివాదానికి కారణమైన మదోరుబాగన్ లో ఉన్న కధాంశం కేవలం పిల్లలు లేని తల్లిదండ్రులకు సమాజం నుండి వచ్చే వత్తిడి గురించిన అంశం మాత్రమే. ఆ వత్తిడి స్త్రీ, పురుషులకు యిద్దరికీ ఉన్నప్పటికీ  స్త్రీల మీద పడే భారం చర్చించటమే ఈ కధలోని  అంశం. పెళ్లయ్యి పన్నెండు సంవత్సరాలు అయిన తరువాత కూడా సంతానం కలగక పోవటం కాళి(పురుషుడు), పొన్న(స్త్రీ)లకు పెద్ద సమస్యగా దాపురిస్తుంది. అలాంటి సందర్భంలో తిరుచెంగొడులో ఉన్నఅర్ధనారీశ్వర ఆలయానికి జరిగే తిరనాళ్ళలో పధ్నాలుగోనాడు జరిగే రధోత్సవ సమయంలో అపరిచితులైన మగవాళ్ళతో సంపర్కించి స్త్రీలు సంతానాన్ని పొందుతూ ఉంటారు. అలా పుట్టిన పిల్లలు దేవుడి పిల్లలుగా చలామణి అవుతుంటారు. ఈ కధలోని పొన్న కూడా అలా సంతానాన్ని పొందటానికి ప్రయత్నిస్తుంది.

Kishan-Kaul_YT

ఒక కధ సమాజం మీదా ఎలాంటి ప్రభావం కలుగచేస్తుందో తెలుసుకోవాలంటే  రచయిత చెప్పుల్లో కాళ్ళు పెట్టి చూడాలని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు వివిధ స్థాయిల, వయసుల పాఠకుల దృష్టి కోణం నుండి కూడా చూడాలని అభిప్రాయపడింది. హేతుబద్దత, బలమైన వ్యక్తిత్వం, దృఢమైన మనస్తత్వం కల వ్యక్తి దృష్టికోణాన్ని గీటురాయిగా తీసుకోవాలి కానీ, చిన్న చిన్న విషయాలను ప్రమాదకరంగా భావించే వారి దృష్టికోణాన్ని స్టాండర్డ్ గా తీసుకోకూడదని కోర్టు వ్యాఖ్యానించటం విశేషం. అలా చూస్తే ఈ కధలో తప్పు ఏమీ కనబడలేదని కూడా చెప్పింది. ఈ కధ నవలీకరణ చెందిన చరిత్ర కాదని, జనపదాల్లో ప్రచారంలో ఉన్న సంగతులనే రచయిత కాల్పనికం చేశాడని చెప్పింది. ఇది విజేతల చరిత్ర కాదనీ, సామాన్యప్రజలు రోజూవారి పడుతున్న కష్టాల కధ అని చెప్పింది. కోర్టు స్త్రీల వైపు నిలబడి..   స్త్రీలు పరపురుషుడితో, అందునా అపరిచిత పురుషునితో స్త్రీలు సంపర్కానికి యిష్టపడరనీ, పిల్లల కోసం సమాజం వాళ్ళను ఆ పని పురికొల్పి వుండే అవకాశం ఉందని అన్నది.

ఈ కేసు విచారణలో ఉన్నప్పుడు ప్రచురణకర్తల వైపు నుండి వాదించిన లాయర్ సురేశ్ కొన్ని ప్రాధాన్యత కలిగిన  సంగతులు ముందుకు తీసుకొని వచ్చారు. ‘రధోత్సవంనాడు పిల్లలు లేని స్త్రీలందరూ పురుషుల కోసం వీధుల్లో సంచరిస్తుంటారు’ అని పెరుమాళ్ రాయటం స్త్రీలకు అవమానకరం అని పెరుమాళ్ మీద దాఖలు చేసిన పిటీషన్ ను ఉద్దేశిస్తూ సురేశ్ వర్ధమాన కాలంలో స్కానింగ్ సెంటర్లను గురించి ప్రస్తావించారు. అక్కడ స్త్రీలు స్కానింగ్ తీయించుకోవటానికి గుంపులు గుంపులుగా పొద్దున తొమ్మిది నుండి మధ్యాహ్నం మూడు వరకు వేచి ఉండటం పెరుమాళ్ళు వర్ణించిన రధోత్సవం నాటి స్త్రీల గుంపులను గుర్తుకు తెస్తుందని అన్నారు. ఒక స్త్రీ స్కానింగ్ కోసం మంచం మీద బట్టలు తొలగించి పడుకొని ఉండగా, ఇంకొక స్త్రీకి అదే స్థితిలో స్కానింగ్ తీస్తూ ఉంటారని చెప్పారు. ఒక్కోసారి పురుషులు కూడా అక్కడికి డాక్టర్ తో మాట్లాడటానికి వస్తుంటారనీ, ఆ స్థితిలో ఉన్న స్త్రీలను వాళ్ళు కూడా చూస్తూ ఉంటారని చెప్పారు. ఆ అవమానాన్ని పిల్లల కోసం స్త్రీలు పడుతుంటారని అన్నారు. పురుషులలో వీర్యకణాలు తక్కువగా ఉంటే ఇతర పురుషుల వీర్య కణాలు కూడా స్వీకరించి స్త్రీలు గర్భవతులవుతున్నారనీ, అందుకు పురుషుల ఆమోదం కూడా ఉంటుందని అన్నారు. పెరుమాళ్ళు కధను తప్పు పడుతున్న నైతిక పోలీసులు ఈ విషయంలో ఏమి మాట్లాడతారని ప్రశ్నించారు. వంద సంవత్సరాల క్రితం అమలులో ఉందని చెబుతున్న ఒక ఆచారాన్నికధలో జొప్పిస్తే తప్పేమిటని ఆయన వాదిస్తూ ఈ నవల ఈ ఆచారాన్ని గ్లామరైజ్ చేసి వాడుకోలేదని చెప్పారు.

పెరుమాళ్ మీద పిటీషన్ వేసిన గోవిందరాసు(అరుల్మిగు అర్ధనారీశ్వర గిరివాల), కె. చిన్నుసామి (హిందూ మున్నని సంస్థ) మొదలైన వారు వాదిస్తున్నట్లుగా ఈ విషయం సెక్షన్ 292 కిందకు రాదని కోర్టు తేల్చి చెప్పింది. యాంత్రికంగా  సెక్షన్లు వల్లించటం, పదజాలాన్ని వాడటం మంచిది కాదనీ, సెక్షన్ 292 లో పేర్కొన్న అశ్లీలత ఈ కధలో లేదని చెప్పటం సరైన నిర్ధారణ. నవలలోని చిన్న చిన్న ముక్కలను తీసుకొని తప్పు పట్టటం కాకుండా, మొత్తంగా నవల ఏమి చెబుతుందో పరిశీలించాలని అన్నది. సమాజానికి ఎలాంటి చెడు చేసే ఉద్దేశం ఈ కధకు లేదనీ తీర్మానించింది. కామేచ్ఛ కలిగించేటట్లుగా ఈ కధలోని విషయాలు లేవనీ, కేవలం ఆలోచనలు రేకెత్తించే అంశాలే ఉన్నాయని స్పష్టం చేసింది.

 

సంజయ్ కిషన్ కౌల్ సాహిత్య కారుల పట్ల ప్రదర్శించిన ప్రేమ అభిమానం గొప్పవనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే నవలలోని కధను సమర్ధించటానికి ఆయన ప్రాచీన సాహిత్య ఔన్నత్యాన్ని అతిగా పొగిడినట్లు అనిపిస్తుంది. స్త్రీలకు సంబంధించి పురాతన సాహిత్యంలో అన్నీ మంచి విషయాలే ఉన్నాయన్నట్లు వ్యాఖ్యానించారు. అప్పుడు (పాత కాలంలో) శృంగారం గురించి యదేచ్ఛగా చర్చించేవారనీ, బ్రిటీష్ వాళ్ళు వచ్చి అంతా పాడు చేశారన్నట్లు మాట్లాడారు. ఒకానొక చోట దేవదాసీ పద్దతిని కూడా వెనకేసుకొచ్చినట్లు అనిపించింది. మహాభారతంలో అంబిక, అంబాలిక, కుంతి, మాద్రిలను  ప్రస్తావనలోనికి తీసుకొచ్చారు. భర్తలు లేకుండా వీళ్ళు పిల్లలను కనటం ఉదాహరణగా చూపించారు. ఈ రకమైన ఆచారాలు ప్రాచీన సమాజంలో ఉండేవి, వాటి అవశేషాలు వందేళ్ళ క్రితం సమాజంలో ఉండి ఉండవచ్చు అని చెప్పటంలో అర్ధం ఉంది కానీ, అవన్నీ మనం కోల్పోయామన్నట్లు వ్యాఖ్యానించటం ఆశ్చర్యంగా అనిపించింది. ప్రాచీన, మధ్య యుగాలలో ఉన్న  భూస్వామ్య సమాజంలో వ్యక్తిగత ఆస్తి విధానాన్ని కాపాడటానికి స్త్రీలను పరికరాలుగా వాడుకొన్నారనేది వాస్తవం. వాళ్ళ సెక్సువాలిటీ మీదా వారికే హక్కు లేని కాలంలో అది వారి శృంగార స్వేచ్ఛగా భావించటం సరైదేనా? దేవాలయాల మీద బూతు బొమ్మలను కూడా ప్రస్తావించారు. ఆ బొమ్మల్లో కూడా పితృస్వామ్య సమాజపు అసలు స్వరూపం నగ్నంగా కనిపిస్తుంది. మహాభారతాన్ని ఒక నాటి మన చరిత్రగా చెబుతూ దాన్ని కూడా నిషేదిద్దామా అని ప్రశ్నించారు.

‘మళ్ళీ లేచి నిల్చొంటానని’ పెరుమాళ్ళు మురుగన్ అనటం ఆనందకరం. కల్బుర్గీని, పన్సారేని కోల్పోయిన సాహిత్య లోకం గట్టిగా ఊపిరి పీల్చుకోంటోంది. వేల గొంతులతో, సంతోషం నిండిన హృదయాలతో ఈ తీర్పును ఆహ్వానిస్తోంది. అయితే సెక్షన్ 292 పాము పడగ కిందే యింకా సృజనకారులు ఉన్నారు. రచయిత హృదయం ఎరిగిన సంజయ్ కిషన్ లాంటి న్యాయాధీశులు మనకు ఎంత మంది ఉన్నారు? ఎమ్మెఫ్ హుస్సేన్ నుండి పెరుమాళ్ మురుగన్ వరకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను రక్షించడానికి అవిరామంగా కష్టపడిన  జడ్జీలు ఎందరు? తొంభై ఏళ్ల చిత్రకారుడు తన కాన్వాస్ దగ్గర బొమ్మలు వేసుకొంటూ తన యింట్లోనే ఉండాలని వాంఛించిన అత్యున్నత న్యాయ స్థానాలు మనకు ఎన్ని? చట్టాలను దాటి  రచయితల కోసం సౌందర్యాత్మకమైన ప్రతిపాదనలతో ముందుకొస్తున్న వారు ఎవరు? ‘కళ రెచ్చగొట్టేటట్లే ఉంటుంది. అది అందరి కోసం కాదు. అందరూ తనను వీక్షించాలని కూడా కోరుకోదు. చూసేవాళ్ళ అభిరుచి  మీద అది ఆధారపడి ఉంటుంది.’ అనగల దమ్మున్న జడ్జీలు సంజయ్ కాకుండా మనకెవరు ఉన్నారు?

*

 

 

 

అనువాదాల అవసరం

 

 

-వేలూరి వేంకటేశ్వర రావు

~

(జూలై 3 వతారీకున ఆటా సాహిత్యసదస్సులో ఇచ్చిన ఉపన్యాసం)

తెలుగు వాళ్ళు  అమెరికాలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున  సాంస్కృతిక సంబరాలు చేసుకోవటం 1977 లో మొదలయ్యింది. కొన్నేళ్ళపాటు రెండేళ్ళకోసారి ఈ పండుగ చేసుకొనేవారు.  మరి పండుగలు ప్రతిఏడూ జరుపుకోవాలిగదా! అందుకనో, మరెందుకనో, ప్రతిఏడూ ఈ సాంస్కృతిక సంబరాలు జరుపుకోవటం పాతికేళ్ళక్రితం మొదలయ్యింది. నా శ్రీమతి  ఇంగ్లీషు పుట్టింరోజు, తెలుగు పుట్టింరోజూ చేసుకుంటుంది; అంటే సంవత్సరంలో రెండు పుట్టింరోజులు!  అల్లాగే ఈ మధ్యకాలంలో తెలుగు వాళ్ళు ఈ సాంస్కృతిక సంబరాలు ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటున్నారు.

తెలుగు సినిమా మన సంస్కృతిలో ప్రథానమైనది.  అందుకని, సంస్కృతి పేరుతో తెలుగు సినిమాల వాళ్ళు ముమ్మరంగా వస్తారు, అమెరికాకి!  సంస్కృతి పేరుతో రాజకీయనాయకులు కూడా వస్తారు; సంస్కృతికి రాజకీయానికీ ఉన్న సంబంధం  నాకు ఇంతవరకూ అర్థం కాలేదు.  నాకు ఇకముందు అర్థం అవుతుందన్న ఆశకూడా లేదు.

ఈ సాంస్కృతిక సంబరాలలో సాహిత్యానికి ప్రత్యేకంగా ఒక చిన్ని పీట ఎప్పుడూ ఉంటుంది. ఒక్కక్కప్పుడు అది ముక్కాలిపీట అవుతుంది కూడా!  తెలుగు నాడు నుంచి, కవులు, కథకులు, నవలా రచయితలు. విమర్శకులు, పత్రికలవాళ్ళు వగైరా వగైరా ఆహ్వానితులుగా వస్తారు. వారికి తోడుగా చిన్న తమ్ముళ్ళుగా అమెరికా రచయితలు కూడా పిలిపించుకుంటారు, –“ డయాస్పోరా”  రచయితలం అనుకుంటూ!

(కథలో కథ చెప్పాలి, పిట్టకథలాగా! 1985 లో నారాయణరెడ్డి గారిని అడిగాను; మీకు ఇప్పటివరకూ వచ్చిన కీర్తి చాలదూ? ప్రతిఏడూఒక కవితా సంకలనం అచ్చువెయ్యాలా?  మా బ్రాహ్మలు సంవత్సరీకాలు పెట్టినట్టు, అన్నాను. ఆయన మృదువుగా తనశైలిలో చెప్పారు: అలా ప్రతిఏడూ ఒక సంకలనం అచ్చువెయ్యకపోతే జనం మనని  మరిచిపోతారు” అన్నారు.)

పోతే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది  ముక్తకంఠంతో మనభాష ఎంతగొప్పదో, మనసాహిత్యం ఎంతగొప్పదో, మన సంస్కృతి  ఎంత పురాతనమైనదో మనకి మరీమరీ నూరి పోస్తారు. ఇక్కడి వాళ్ళు—అంటే అమెరికా డయాస్పోరా రచయితలు  “ మమ మమ” అని అర్ఘ్యమ్  పుచ్చుకుంటారు.  పునః పునః.  ఏడాదికి రెండు సార్లు!

నిజమే! మనభాష, సాహిత్యం, సంస్కృతీ గొప్పవే! కాదనం.

అయితే ప్రపంచ సాహిత్యంలో మన సాహిత్యానికి  ఉన్న స్థానం ఏమిటి? మనని ఎవరు గుర్తిస్తున్నారు? మనం ఎంతవరకూ గుర్తింపబడ్డాం? పాశ్చాత్య సాహితీ వేత్తలు, పాఠకులు, అసలు ఎవరైనా  మనని గుర్తిస్తున్నారా? మన ఘోష వింటున్నారా?

సరేనయ్యా!  వాళ్ళు మనని గుర్తించవలసిన అవసరం ఏముంది? లేదా వాళ్ళు గుర్తించనంతమాత్రాన మన ఘనత తగ్గుతుందా? అని అనే వారితో నాకు పేచీ లేదు. వారితో నాకు వాదించే ఓపిక కూడాలేదు.  అంతర్జాతీయంగా తమతమ సాహిత్యాలు గుర్తించబడాలని ప్రతి భాషలో రచయితలు, సాహితీపరులూ కోరుకుంటారు.  వాళ్ళ ఆలోచనలు, అనుభవాలు  మనకి, మన ఆలోచనలు మన అనుభవాలు వాళ్ళకీ పరస్పరం తెలుపుకోవటం అవసరం అనుకునే వాళ్ళల్లో నేను ఒకణ్ణి. ఈ విషయమై నాతో ఏకీభవించేవాళ్ళు ఉన్నారని అనుకుంటాను.

మన సాహిత్యం గురించి ఇక్కడ అమెరికాలో గాని, యూరప్‌ లోగాని ఎంతమందికితెలుసు, అని మనని మనం ప్రశ్నించుకున్నప్పుడు, మన భవిష్యత్ కర్తవ్యం బోధపడుతుంది.

మనసాహిత్యం, — సంప్రదాయ సాహిత్యం, ఆథునిక సాహిత్యం ముందుగా ఇంగ్లీషులోకి తర్జుమా  చేసుకోవలసిన అవసరం ఉన్నది.  ఆ తరువాత ఇతర యూరోపియన్ భాషలలోకి అనువదించేచే ప్రయత్నాలు మనం చేసుకోవాలి.  ఇంగ్లీషులోకి అనువదించటం కేవలం వాళ్ళకోసం కాదు; నిజం చెప్పాలంటే మనకోసమే! మనపిల్లలకి తెలుగు చదవటం రాదు;  తరువాతి తరం వారికి  తెలుగు అంటే ఏమిటోకూడాతెలియని పరిస్థితి రాకూడదు. భాష రాకపోయినంతమాత్రాన, ఆ భాషలో సాహిత్యం, ఆ సాహిత్యానికున్నప్రత్యేకత, మన వారసులకి తెలియవలసిన అవసరం ఉన్నdi. ఇంగ్లీషులోకి అనువదించటం మూలంగా,  You kill two birds at one shot.

veluri

ఆటా సాహిత్య సదస్సులో…

ఒక ఉదాహరణ:  “#Zoque#” అనే భాష కేవలం 70,000 మంది మాత్రమే మాట్లాడుతారు.  ఆ భాషలో కవిత్వం ఇవాళ ఇంగ్లీషులోకి అనువదించబడుతున్నది.

తెలుగు ప్రాచీన సాహిత్యం, ఏవో ఒకటి రెండు ప్రబంధాలనో, కావ్యాలనో తీసివేస్తే నిజంగా అంతా అనువాద సాహిత్యమేకదా! ఇప్పటికే మనకి, ఇంగ్లీషునుంచి, ఫ్రెన్‌చ్‌ నుంచి, రష్యను నుంచి కొల్లలుకొల్లలుగా అనువాద సాహిత్యం వచ్చింది. ఇప్పటికీ, దక్షిణ అమెరికను సాహిత్యాన్ని, స్పానిష్ సాహిత్యాన్ని మన రచయితలు విరివిగా అనువదిస్తున్నారు. అది వద్దనను.  అయితే, అదే బిగిలో  మనసాహిత్యం వారిభాషల్లోకికూడా వెళ్ళేటట్టు చేయగలగాలి.

#Quid Pro Quo# అనండి.

మన దురదృష్టం ఏమిటంటే, మన భారతీయభాషల సాహిత్యమే ఒకభాషనుంచి మరొకభాషలోకి  ఎక్కువగా అనువదించబడలేదు. ఎక్కడో ఒకటో రెండో కవితలు, కొన్ని కథలూ అడపా తడపా ఒకటో అరో నవల ఇతరభాషలలోకి వెళ్ళాయి. అది చాలులే అని సమర్థించుకొని సంతృప్తి పడే మంచి లక్షణం నాకు లేదు.

అయితే ఈ పని ఎవరుచేస్తారు?  ఈ దేశంలోను, ఇతర యూరోపియన్‌ దేశాలలోనూ యూనివర్శిటీలు పురమాయించో, ప్రోత్సహించో ఈ పని చేస్తాయి. ఆంధ్రలో గాని, తెలంగాణాలో గాని ఉన్న విశ్వవిద్యాలయాలు ఇటువంటి పని ఇప్పట్లో చేస్తాయని నేను అనుకోను. అక్కడ వాళ్ళకున్న ఈతి బాధలు వాళ్ళవి. వాళ్ళ సాహిత్యరాజకీయాలు వాళ్ళవి.  మరి, ఇక్కడి సాంస్కృతిక సంస్థలు పూనుకోగలవా?  ఈ సంస్థలు తమంతతామే చేయలేకపోయినా,  ఊతం ఇవ్వగలvu.  అందుకు డయాస్పోరా కమ్యూనిటీ యే పూనుకొని, సంస్థలని ప్రోత్సహించాలి.

ఈ సందర్భంలో నారాయణరావుగురించి ప్రస్తావించాలి. అతను ఒక్కడూ, మరొకరిద్దరి   సహకారంతో, ఎన్నో సంప్రదాయసాహిత్యగ్రంధాలని ఇంగ్లీషులోకి అనువదించాడు. ఇంగ్లీషులో కవితా సంకలనాలు తెచ్చాడు. శ్రీనాథుడి సాహిత్యచరిత్ర (#Literary Biography#) రాసాడు. A first of its kind. ఆథునికుల కవితలు, కథలూ  కూడా అనువదించాడు.  వ్యాఖ్యానాలు రాసాడు. అవి ఓపికగా, జాగ్రత్తగా చదవకండా  తెలివితక్కువ విమర్శలు చేసే బదులు, అంతకన్నా మంచి అనువాదం తేవాలన్న అభిలాషతో, నిష్పాక్షికంగా పనిచేయాలి.  ఆ పని అసాధ్యం కాదనుకుంటున్నాను.

నాకు ఈ కోరిక 2002-2003 లో 20th Century Telugu Poetry, Hibiscus on the Lake, —  ఈ రెండుపుస్తకాలు వచ్చిన తరువాత కలిగింది. నా స్వంత అనుభవం: మా మేనకోడలికి ఇస్మాయిల్‌ కవితల అనువాదాలు చదివి వినిపించాను. ఆ పిల్ల అప్పట్లో ఇక్కడ కాలేజీలో పేపర్‌కి సబ్-ఎడిటర్‌. ఆ అనువాదాలు విని ఇవి, elijabeth barret browning పద్యాల్లా వినపడుతున్నాయి అన్నది.  ఆహా!  That’s it అనిపించింది.  అంటే ఇక్కడి పాఠకుల “ఇడియం “ పట్టుకొని అనువదించాలన్నమాట!

1960 లో #UNESCO# రెండు తెలుగు పుస్తకాలు ఫ్రెన్‌చ్‌ లోకి అనువదించమని  ఆంధ్రా యూనివర్సిటీకి ఒక “ఆల్బర్ట్” ని పంపింది. మొదటిది వేమన శతకం. అతను అనువదించాలి. అది జరిగిందోలేదో తెలియదు కాని, అతనితో స్నేహం పట్టిన మాకు వైన్‌ తాగటం మాత్రం అలవాటయ్యింది.  రెండో పుస్తకం కళాపూర్ణోదయం.  అది నారాయణరావు ఈ మధ్యనే అనువదించాడు, ఏ అంతర్జాతీయ సంస్థయొక్క ప్రమేయం లేకుండానే! అప్పుడప్పుడు UNESCO సాహిత్య అకాడమీ తో షరీకయి భారతీయ భాషల పుస్తకాలు అనువదింపజేస్తుంది. తెలుగు పుస్తకం ఒక్కటికూడా వాళ్ళ జాబితాలో లేదు.

ఇక్కడ పదవశతాబ్దపు లాక్షణికుడు  రాజశేఖరుడి శ్లోకం గుర్తుచెయ్యటం అవసరం.

ఏకస్య తిష్ఠతి కవేర్గృహ  ఏవ కావ్యమ్

అన్యస్య గచ్ఛతి సుహృద్భవనాని యావత్,

న్యస్యా విదగ్ధవదనేషు పదాని శశ్వత్

కస్యాపి ఞ్చరతి విశ్వకుతూహలీవ. –  రాజశేఖరుని కావ్య మీమాంసా, 4:10

 

ఒక కవిరచించిన కావ్యము అతని ఇంటిలోనే పడి ఉంటుంది. మరొకడురాసిన కావ్యము మిత్రుల ఇంటి వరకూ పోతుంది. ఒక్కొక్కని కవిత్వము, ప్రపంచయాత్ర చేయుటకు కుతూహలము చూపిస్తూ ఎల్లప్పుడూ సంచరించుతుంది. ( అంటే,  సామాన్య విద్యావంతులు కూడా చదువుతూ ప్రచారము చేస్తారు, అని భావం)

ఈ కాలంలో,  మనసాహిత్యం ప్రపంచయాత్ర చేయడానికి  మనప్రేరణ, ప్రయత్నం  ఉండాలి.

ఆఖరిగా ఈ మాట చెప్పాలి.

ఇజం నిజం కాదు; నిజం ఇజంలోకి పోదు.  ఇజాల గందరగోళంలో పడకుండా మనం ఉమ్మడిగాఏమిచేయగలం అన్న విషయంపై నాకుకొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అవి మరొక వ్యాసంలో పొందు పరుస్తాను.

ఇప్పుడు మీ ప్రశ్నలకి సమాధానం చెప్పటానికి ప్రయత్నిస్తాను.

శలవ్‌

 

గ్రంథాలయాల గతి చూడండి!

 

 

-కె. శ్రీనివాస్‌

~

(ఇది “ఆంధ్ర జ్యోతి” దిన పత్రికలో అచ్చయిన వ్యాసం. ప్రస్తుత పరిస్థితులలో ఈ  విషయం మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందంటూ చాలా మంది  చదువరులు కోరడం వల్ల ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాం. ఈ  వ్యాసం మీద చర్చని ఆహ్వానిస్తున్నాం. ఈ వ్యాసం పునర్ముద్రణకి అనుమతించిన కె. శ్రీనివాస్ కి కృతజ్ఞతలు)

~

నాలెడ్జ్‌ సొసైటీ అన్న మాట ఓ రెండు దశాబ్దాల క్రితం నుంచి బాగా ప్రచారంలోకి వచ్చింది. ఏ శామ్‌ పిట్రోడా లాంటివారో మన దేశంలో ఈ సమాస పదాన్ని ప్రవేశపెట్టి ఉండాలి. ఐటి రంగాన్ని తెలుగు వారిలో వ్యాప్తిచేయడానికి తానే కీలకదోహదం చేశానని భావించే చంద్రబాబు నాయుడు కూడా మొదటి హయాం తొమ్మిదేళ్ల కాలంలో ఈ మాటను విరివిగా వాడేవారు. సమాచార సాంకేతిక రంగాల్లో తెలుగువారు విస్తృతంగా పనిచేయడం, దాని కారణంగా కొన్ని శ్రేణుల వ్యక్తుల ఆదాయాల్లోనూ, కొన్ని స్థలాల్లోనూ వృద్ధి కనిపిం చడంవల్ల, అదే క్రమాన్ని మరింతగా ముందుకు తీసుకు వెళ్లడమే జ్ఞానసమాజాన్ని ఆవిష్కరించడం అన్న అభిప్రాయం ఏర్పడింది.

నిర్వచనం ప్రకారం జ్ఞానసమాజం అంటే, తాను ఉత్పత్తి చేసే జ్ఞానాన్ని అందరూ పంచుకుని, అందరికి అందుబాటులో ఉంచుతూ, మానవ పరిస్థితులను మెరుగు పరచడానికి వీలుగా దానిని వినియోగించే సమాజం. మానవసమాజాలు పూర్వ కాలం నుంచి జ్ఞానాన్ని సమకూర్చుకుంటూ, ఏదో ఒకరీతిలో కొందరిమధ్య అయినా పంచుకుంటూ, ముందుకు వెడుతున్నాయి. కొత్తగా ఈ మధ్య ఈ పద ప్రయోగం ప్రాచుర్యంలోకి రావడానికి నేపథ్యం సమాచారసాంకేతికశాస్త్రం అవతరణే. ఈ పరి ణామం కారణంగా, సమాచారం క్రోడీకరణకు, విశ్లేషణకు, వినిమయానికి అనేక కొత్త వేగవంతమయిన అవకాశాలు ఏర్పడ్డాయి. కేవలం సమాచారమే ఉత్పత్తి అవు తుంటే, అది జ్ఞానం కాదు. సమాచారం జ్ఞానంగా పరివర్తనం చెందడంలో మానవ వివేచన, మానవీయశాస్త్రాలు అందించిన పరికరాలు చాలా అవసరం. అదే విధంగా, సమాచారం అంటే కేవలం వర్తమాన సమాజాల అవసరాలకు సంబంధించినది మాత్రమే కాదు, చారిత్రక సమాచారం, భవిష్యత అంచనాలూ ఆకాంక్షలూ కూడా. సమాచార సాంకేతికత మానవుల యాంత్రికమైన చాకిరీని తప్పించగలగడమే కాక, అతి తక్కువ స్థలాన్ని, కాలాన్ని డిమాండ్‌ చేస్తుంది. ఈ వెసులుబాటు కారణంగా, మానవ వివేచన, అవగాహన, శాసీ్త్రయదృష్టి మరింతగా ఉన్నతస్థాయిలో వినియో గించుకోగలుగుతాము. ఒకవైపు జ్ఞానసమాజాన్ని ఫ్యాషనబుల్‌గా కోరుకుంటూనే, మరోవైపు మానవీయశాస్త్రాల అధ్యయనం అనవసరమని భావించడం హ్రస్వదృష్టినే సూచిస్తుంది. అట్లాగే, ఐటీ కంపెనీలతో ఎంవోయూలు చేసుకుని, నూతన ఆవిష్కరణలకు ఆరంభసదుపాయాలూ హబ్బులూ నెలకొల్పడం వల్ల బంగారు సమాజం ఏర్పడుతుందనుకోవడం అమాయకత్వం అవుతుంది.

విద్యారంగంలో వచ్చిన మార్పులను, ప్రపంచమార్కెట్‌కు అవసరమైన శ్రమశక్తిని ఎగుమతిచేయడానికి మాత్రమే వినియోగించుకుంటే సమాజాలు తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చును కానీ, దీర్ఘకాలికంగా అజ్ఞానసమాజాలుగా మారతాయి. గత పాతికేళ్లుగా మన దేశం నుంచి అత్యంత ప్రతిభావంతులైన వృత్తినిపుణులను, సాంకేతిక ప్రజ్ఞావంతులను ఉత్పత్తి చేయగలిగాము. విద్యార్జన వయస్సులో ఉన్న పిల్లలలో చదువుమీద తీవ్రమయిన అభినివేశం, కష్టపడే తత్వం చూస్తున్నాము. అనేక దిగువ మధ్యతరగతి, మధ్యతరగతి కుటుంబాలు అనూహ్యమైన రీతిలో తమ ఆదాయాలను పెంచుకున్నాయి. మరోవైపు, ఆ విజయాలకు తగిన నిష్పత్తిలో మేధో వికసనం, సాంస్కృతిక అభిరుచులు, జీవితనైపుణ్యాలు అభివృద్ధి చెందకపోవడం కూడా గమనిస్తున్నాము. మాతృభాష మీద ఆదరణ తగ్గిపోతున్నది. పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు, కళలకు, సాహిత్యపఠనానికి విద్యార్థులు దూరమవు తున్నారు. మార్కులు, ర్యాంకుల వేటలో, చదువు తప్ప మరి దేనికీ సమయం, ప్రోత్సాహం లేకుండా పోతున్నది. పోటీపరీక్షలకోసం తప్ప, వర్తమాన రాజకీయ, సామాజిక పరిణామాల గురించి చదవడమే గగనమై పోతున్నది. ఇందుకు తగ్గట్టుగా, ప్రభుత్వ విద్యాసంస్థలు సదుపాయాల్లోనూ ప్రమాణాల్లోనూ వెనుకబడి పోతున్నాయి. జీవనకళలను పోషించే వ్యవస్థలన్నీ ఆదరణ లేక కునారిల్లుతున్నాయి. పబ్లిక్‌ లైబ్రరీలు అటువంటి బాధిత సంస్థల్లో ముఖ్యమైనవి.

తెలుగు రాషా్ట్రలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ- ఈ రెండింటి చరిత్రలోనూ గ్రంథా లయాల పాత్ర అమోఘమైనది. నైజాం పాలనలో ఉన్న తెలంగాణ తనను తాను తెలుసుకుని ఎలుగెత్తడానికి చాలా కాలం పట్టింది కానీ, ఆ ప్రయాణంలో తొలి అడుగు శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం (1901) స్థాపనతోనే జరిగింది. రాయల సీమలో 1870లలోనే ఒక బుక్‌క్లబ్‌ ఏర్పడి, మరోదశాబ్దానికి నాలుగైదు చోట్ల గ్రంథాలయాలు వెలిశాయి. రావిచెట్టు రంగారావు, మాడపాటి హనుమంతరావు మొదలయినవారు తెలంగాణలో గ్రంథాలయాల స్థాపనకు ఆద్యులయితే, అయ్యంకి వెంకటరమణయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటివారు ఆంధ్రలో ఉద్యమ నేతలు. వీరంతా తెలుగుసమాజాల వికాసానికి బహుముఖమైన కృషి చేశారు. రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం, వేటపాలెం సారస్వతనికేతనం, విజయవాడ రామమోహన గ్రంథాలయం- బ్రిటిషాంధ్ర జనజీవనంలో అవిభాజ్య అంగాలు. పాఠ శాలలో చదువుతో పాటు, ఇతరుల జీవితానుభవాన్ని, సృజనను చదవడం కూడా నాటి వికాసయుగానికి అవసరమయింది. గ్రంథాలయం కేవలం చదువరుల వసతి మాత్రమే కాదు. చైతన్యవంతుల కూడలి. సమావేశ స్థలి. తెలంగాణలో అయితే, అది భూస్వాముల గడీకి ప్రజా ప్రత్యామ్నాయం.

సమాజానికి అవసరమైన మేధాశక్తిని, వివేచనను అందించే మౌలికవసతి అయిన గ్రంథాలయం, స్వాతంత్ర్యానంతరం కొన్ని దశాబ్దాలపాటు సగౌరవంగానే జీవించింది కానీ, ఇప్పుడు దాపురించిన పాడుకాలంలో అది శిథిలమవుతున్నది. ఆర్జించలేని ఏ సంస్థ అయినా పనికిమాలినదనే దృష్టి పెరిగిపోయింది. సంపన్న దేశాలలోని ఆకాశహర్మ్యాలను చూసి అదే అభివృద్ధి అనుకుని అనుకరిస్తూ, ఆ దేశాలలోని ఇతర విలువలను ఖాతరు చేయకపోవడం కూడా మన పాలకులకే చెల్లింది. అభివృద్ధి ‘కాముకుల’ందరికీ ఆరాధ్య దేశమైన అమెరికాలో లక్షా ఇరవైవేల పబ్లిక్‌ లైబ్రరీలున్నాయి. అక్కడ జనాభా మన దేశంలో మూడోవంతు కన్నా తక్కువ, 32 కోట్లు. 2015 సంవత్సరంలో ఆ దేశంలోని లైబ్రరీలలో నమోదైన వ్యక్తిగత సందర్శనల సంఖ్య 150 కోట్లు. లైబ్రరీలలో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరయిన వారి సంఖ్య 10 కోట్లు. ఏటా అక్కడ 1150 కోట్ల డాలర్ల ప్రజాధనం లైబ్రరీల మీద ఖర్చు పెడతారు. భారతదేశంలో జనాభా 120 కోట్లు అయితే, పబ్లిక్‌ లైబ్రరీల సంఖ్య 55వేలు. ఇక రెండు తెలుగు రాషా్ట్రలూ ఎంతో పరవశించిపోయే ధనికదేశం సింగపూర్‌. ఆ చిన్నదేశంలో 26 పబ్లిక్‌ లైబ్రరీలు, నాలుగైదు జాతీయస్థాయి లైబ్ర రీలుఉన్నాయి. అక్కడ జనాభా 56 లక్షలు. అక్కడి జాతీయ లైబ్రరీ బోర్డు (ఎన్‌ఎల్‌బి)కు ఏటా 38 కోట్ల సింగపూర్‌ డాలర్ల (సుమారు 1900 కోట్ల రూపాయలు) బడ్జెట్‌. 3 కోట్ల ఆదాయం. తక్కినదంతా గ్రాంట్ల రూపంలో వస్తుంది. అక్కడ పఠనాభిరుచి క్రమక్రమంగా పెరుగుతోంది. 7-12 సంవత్సరాల మధ్య వయస్కులు నూటికి 91 మంది లైబ్రరీలు సందర్శిస్తున్నారు. ఈ సంవత్సరం ఆ దేశం పఠనోద్యమాన్ని ప్రారంభించింది. ‘ఎక్కువ చదవండి, విస్తృతంగా చదవండి, కలసి చదవండి’ అన్న నినాదంతో పాఠకుల సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నది.

మరి మన తెలుగు రాషా్ట్రలలో పరిస్థితి ఎట్లా ఉన్నది? తెలంగాణలో సుమారు 1225 గ్రంథాలయాలున్నాయి. ఇందులో ఐదువందల దాకా బుక్‌ డిపాజిట్‌ సెంటర్లు (ఇతరులు ఏర్పరచి, నిర్వహించి, తరువాత ప్రభుత్వానికి బదిలీ అయినవి), 562 బ్రాంచి లైబ్రరీలు, 165 గ్రామీణ లైబ్రరీలు. ఇవి కాక రెండు ప్రాంతీయ లైబ్రరీలు (నిజామాబాద్‌, వరంగల్‌) ఉన్నాయి. ఈ అన్నిటికీ కలిపి కేవలం 466 మంది గ్రంథపాలకులున్నారు. ఒక్కొక్కరు రెండు మూడు లైబ్రరీల బాధ్యత నిర్వహిస్తున్న పరిస్థితి. 1987 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క లైబ్రరీ కూడా కొత్తది స్థాపించ లేదు. 1993 నుంచి గ్రంథాలయాల్లో ఒక్క కొత్త నియామకమూ జరగలేదు. ఆంధ్ర ప్రదేశ్‌లో పరిస్థితి కొంచెం మెరుగు కానీ, మొత్తం మీద పెద్ద తేడా లేదు. 624 బ్రాంచి లైబ్రరీలు, 249 గ్రామీణ లైబ్రరీలు, 600 బుక్‌డిపాజిట్‌ కేంద్రాలున్నాయి. 562 మంది ఉద్యోగులున్నారు. ప్రభుత్వాలు కొత్త పుస్తకాలు కొని ఎన్ని సంవత్సరాలైందో లెక్కలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వట్టికోట ఆళ్వారుస్వామి పేరు పెట్టిన హైదరాబాద్‌ నగరకేంద్ర గ్రంథాలయంలో మంచినీళ్లు లేవు, మూత్రశాల ఉండదు. ఏటా జాతీయస్థాయి రామమోహన గ్రంథాలయ సంస్థ తానే కొన్ని పుస్తకాలను కొని అన్ని లైబ్రరీలకు పంచిపెట్టేది. రాష్ట్రవిభజన కారణంగా, ఉమ్మడి జాబితాలో ఉన్న గ్రంథాలయసంస్థ మూడు సంవత్సరాల నుంచి రామమోహన లైబ్రరీకి ప్రతిపాదనలే పంపలేదు. పుస్తకాలు ఇస్తామన్నా, తీసుకునే గతి లేదు. వంద సంవత్సరాలు పైబడిన గ్రంథాలయాలకు జాతీయసంస్థ నుంచి పదికోట్ల దాకా నిర్వహణా గ్రాంటువస్తుంది. శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం, రాజరాజనరేంద్రాంధ్రభాషా నిలయం- ఈ రెండూ ఆ గ్రాంటుకు అర్హమైనవే అయినా, ప్రతిపాదనలు పంపే ప్రభుత్వాధికారిలేడు.

పుస్తకం పాతబడిపోయింది, డిజిటల్‌ యుగం వచ్చింది- అంటూ గ్రంథాలయా లను ఆధునీకరించడమే తక్షణ కర్తవ్యం అన్న వాదనా వినిపిస్తోంది. డిజిటల్‌ పరి ణామాలు నిజమే. కానీ, భౌతికమయిన పుస్తకానికి కాలం చెల్లలేదు. అమెరికాలోనూ, సింగపూర్‌లోనూ భౌతిక గ్రంథాలయాలతో పాటు అనుబంధంగా ఆధునిక విభాగాలూ అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ డిజిటల్‌ పఠనవనరులు పెరుగు తున్నాయి. కానీ, మన దేశంలో ఇంకో నూరు సంవత్సరాల వరకు ముద్రిత అక్షరా నికి, భౌతిక పుస్తకానికి అవసరం ఉంటుంది. లైబ్రరీలను ఆధునీకరించవలసిన అవసరమూ ఉన్నది. లైబ్రరీ వ్యవస్థను, ఆర్కైవ్స్‌ వ్యవస్థను సంధానం చేయవలసి ఉన్నది. ప్రభుత్వ విభాగాలలో ఉండవలసిన ఇన్‌ఫర్మేషన్‌ అధికారులు ఎప్పటి కప్పుడు వర్తమాన గణాంక సమాచారాన్ని క్రోడీకరించి డిజిటల్‌ సామగ్రి కింద ప్రజలకు అందుబాటులోకి తేవలసి ఉన్నది. పాఠకుల కోసం కంప్యూటర్లు, దృశ్య, శ్రవణ సమాచారం, సంపుటులు, ఈ బుక్స్‌, జర్నల్స్‌, చలనచిత్రాలు, డాక్యు మెంటరీలు- ఇవన్నీ లైబ్రరీలలో కొత్త విభాగాలుగా రావడం నేటి అవసరం. అన్నిటికి మించి, గ్రంథాలయాల్లో నూతన నియామకాలు చేయడం, కనీస వసతులు కల్పిం చడం అవసరం. అలక్ష్యం బారిన పడి శిథిలమవుతున్న చారిత్రక పత్రాలను, పుస్త కాలను కాపాడుకోవలసిన అవసరం ఉన్నది.

రెండు రాషా్ట్రల ముఖ్యమంత్రులూ పోస్టుగ్రాడ్యుయేట్‌ విద్యావంతులే. నీళ్లు విద్యుత ఎంత అవసరమో విజ్ఞానం కూడా అంత అవసరమని తెలుసుకోగలిగిన వాళ్లే. గ్రంథాలయాల విషయంలో కూడా తెలుగు రాషా్ట్రలను సింగపూర్‌ చేయమని వారిని కోరడం దురాశ అవుతుందా?

*

 

చీకటీగలు-2

 

(గత వారం  తరువాయి)

నీలకంఠం ఆర్టీసీలో డ్రైవర్‌గా పన్జేస్తాడు. ఎక్కడో శ్రీకాకుళం వాడు. ఇక్కడ స్థిరపడిపోయిన కుటుంబం… తెలుగు సాహిత్యం పట్ల చాలా మక్కువ…. ముఖ్యం రంగరాజు పద్యాంటే… రాజా రాజా అని ప్రేమగా వుంటాడు తన్తో…. శ్రీమన్నారాయణంటే భక్తి

నేనో ఇంగ్లిష్‌ లెక్చరర్ని ప్రయివేట్‌ కాలేజీలో… ఒకవిధంగా అందరం ఓ మోస్తరు సుఖవంతమయిన జీవితాలు గడుపుతూన్న వాళ్ళమే…

ఒక్క శ్రీమన్నారాయణతప్ప… ట్రెషరీలో పన్జేస్తూ కొడుకుద్యోగం కోసం వలంటరీ తీసుకుని పెన్షన్మీద వున్నాడు. ఈ వయసులో కొడుకుతోటీ భార్యతోటీ దెబ్బలాడి విడిగా వుంటాడు…. ఏం చదివాడో గానీ ఏ విషయంమ్మీదైనా అనర్గళంగా మాటాడగల్డు… ఇంత వయసులోకూడా అందంగా హుందాగా వుంటాడు. బూతులు ధారాళంగా మాటాడ్తాడు.

మేమందరం ఎలా కలిసామో ఇదమిత్థం యిదీ అని చెప్పలేము… శ్రీమన్నారాయణ మాత్రం యీ రేకుల షెడ్డుకు పరిమితమయి, నెల చివర్న డబ్బుకిబ్బంది పడ్తూంటాడు, రంగరాజో నేనో మందుకు ఖర్చుపెడతాం… నీలకంఠం తనొంతు తనిచ్చేవెళ్తాడు.

రంగరాజు ఊరికి చివరగా వున్న తన స్వంతస్థలంలో రేకు షెడ్లేసుకుని రిజిష్టరు చేసుకున్న బడి నడుపుతాడు. మాట కరుకైనా మంచి మనసున్నవాడు. శ్రీమన్నారాయణంటే దేవుడే అతనికి. శ్రీమన్నారాయణ రంగరాజుని ప్రియంగా ‘ఏరా’ అని పిుస్తాడు.

*******

ఒకటో రౌండింకా పూర్తికాలేదు. ఒక్క శ్రీమన్నారాయణ మాత్రం ఎత్తిన గ్లాసు దించేసి మాసింతుండుతో మూత్తుడ్చుకుని రంగరాజు తెచ్చిన బర్కిలీ ప్యాకెటోపన్జేసి సిగరెట్వెలిగించుకుంటూండగా… చాలా వేగంగా హోరులాగా అతని కొడుకు గదిలోకి  దూసుకొచ్చాడు ఉపోద్ఘాతాల్లాంటివేవీ లేకుండా.

‘‘ఒక పార్టీని మాట్లాడాను రేపుదాయాన్నొస్తారు నలభై రెండుకు సెటిల్చేసుకున్నాం. అమ్మకూడా ఓకే అంది. తొమ్మిదిన్నర కొస్తా రడీగా వుండు. తీసుకెళ్తా…. మాట్లాడకుండా అగ్రిమెంటు మీద సంతకం పారెయ్యి…. యీ మాటు గొడవ చేశావంటే బావుండదు. ముందే చెబుతున్నా… యీ రేకు షెడ్లో అంగలారుస్తూ మమ్మల్ని బజారుకీడుస్తున్నావ్‌… కొంపలో పడేడు… ఈ పోరంబోకు వ్యవహారాలేం అక్కడ నడవ్వు… రేపు తొమ్మదిన్నర… రెడీగా వుండు… ముందే చెబుతున్నా దేనికైన ఓ లిమిటుంటుంది. ప్రతిసారీ నాకుద్యోగమిప్పిచ్చానని దొబ్బడం… తాగి తాగి నువ్వు చస్తే ఎట్లాగూ వస్తుందది. చెబ్తున్నా ముందే రేపుదయం…’’ చాలా గట్టిగా అరుస్తూ మమ్మల్నందర్నీ పురుగుల్లా చూసి వెళ్ళబోయాడు.

‘‘సంతకం కాదు కదా నా… కూడా పెట్టను కాకితమ్మీద. నువ్వూ మీ అమ్మా సందు చివరి నీళ్ళ ట్యాంకెక్కి దూకి చావండి. గెట్లాస్ట్‌ నాన్సెన్సికల్‌ ఫకర్‌’’ బూతులు అరిచాడు శ్రీమన్నారాయణ…

‘‘ఛీఁ థ్పూ మనిషివా నువ్వూ చెత్తవెధవ… తాగుబోతు లమ్డీకొడకా… ఎట్లా పెట్టవో సంతకం చూస్తా… రేపిక్కడ యుద్ధమే సిద్ధంగా వుండు… ఏ నాకొడుకుల్ని పిలిపించుకుంటావో పిలిపించుకో’’ అని మా అందరివేపూ ఓ మిర్రి చూపు చూసి యింకా బూతు గొణుక్కుంటూ ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. శ్రీమన్నారాయణ కొడుకు ట్రెషరీలో ఎల్డీసీగా చేస్తున్నాడు.

‘‘అనిబ్ధమైన జీవితంలోకి అడుగెట్టి ప్రయాణం సాగించడానికి ధైర్యమూ, బంధరాహిత్యమూ మాత్రమే చాలవు… బాంధవ్య రాహిత్యమన్నది ఓ పెద్ద లమ్డీ మిధ్య అన్నానా… చూడండి తెంపుకున్నానని అనుకుంటున్నా… అన్నా… తెగేవిగా వున్నాయా? యీ బాఢఖావ్‌ బంధాలు, బంధాలు… బంధాలట దొంగనా…. బంధాలు’’ మళ్ళీ బూతు వాడుతూ ఎవళ్ళనీ ఉద్దేశించకుండా పలికాడు శ్రీమన్నారాయణ.

‘‘ఉన్నీన్నా యీ దినాము కొత్తనా ఏం… పదయింకో రౌండేయ్యి… నీలకంఠం గ్లాసులీండి…’’ అని మా గ్లాసు వంగి తీసుకుని మందొంచాడు రంగరాజు.

శ్రీమన్నారాయణకి అయిదున్నర సెంట్లలో కట్టిన మంచి ఇల్లుంది. దాంట్లోనే పెళ్ళాం కొడుకుల్తో కలిసుండేవాడు. ట్రెషరీలో పన్జేస్తున్నప్పుడు పైనా కిందా పడి ఓ అపార్ట్‌మెంట్‌ చవగ్గా వస్తోందని తన పేర్నే కొన్నాడు. కొడుకూ భార్యా యిప్పుడా అపార్ట్‌మెంట్‌ అమ్మేయాలని… అది పూర్తిగా శ్రీమన్నారాయణ స్వార్జితం… శ్రీమన్నారాయణ కూడా నా కర్థం కాడు… ఈ రేకుల షెడ్డులో ఎందుకుంటున్నాడో… ఆ చిన్న అపార్ట్‌మెంట్లో వుండొచ్చుగా… అది కాస్త వూరికి దూరమే అదీ నాలుగో అంతస్తులో వుంది… ఈ షెడ్డు నాకన్నిటికీ కన్వీనియంటంటాడు. ఏమో నీలకంఠం అన్నట్టు మైత్రి భర్త క్యాంటీను బాగా దగ్గర… ‘ఏమో వుందండీ’ అంటాడు నీలకంఠం.

‘‘అబ్బే ఆ అమ్మాయికీనవయసులో సగముంటుందండీ యీనకా ఉద్దేశం వుందేమో కానీ…’’ అన్నేను నసుగుతా.

కానీ గాలీ వెల్తురూ లేని యీ సందులో… షెడ్డులో శ్రీమన్నారాయణ నివాసం… మ్యాసకిస్టిగ్గా అనిపిస్తుంది నాకు. కానీ ఎప్పుడూ ఆయన ఆంతరంగికత గురించి అతన్తో మాట్లాడలే… అతని గదినిండుగా పుస్తకాలూ… ఎప్పుడెళ్ళినా చదువుతూనో, రాస్తూనో కనబడతాడు.. పబ్లిష్‌ చేస్తాడా అంటే, నవ్వేసూరుకుంటాడు… ఎక్కడ కాస్త మంచి కవిత్వమో, కథో కనబడ్డా చెప్పేస్తాడు. చదవండి… చదవండి అంటాడు. అతను రాస్తూ నింపేసిన డయిరీలూ నోటుపుస్తకాలు ఓ షెల్ఫ్‌లో సగానికుంటాయి. ఈ మధ్య తాగడం ఎక్కువయింది. హైలో వున్నప్పుడు ముక్కలు ముక్కలుగా మాట్లాడ్తాడు. పొయెటిగ్గా, సరియలిస్టిగ్గా… రకరకాలుగా భాషలు వాడి మణిప్రవాళంలో మాట్లాడ్తాడు… హిందుస్తానీ సంగీతమంటే ప్రాణం పెడ్తాడు. మైత్రితో మాట్లాడేప్పుడు ఫలాని ఫలాని రాగం ఫలాని స్వరాలూ అంటూ చర్చిస్తుంటాడు. శారీరకంగా శిథిలమైనా… శిథిలమైన గొప్ప నాగరికతలా కనబడతాడు… మొత్తానికి మాకు ఎవరికి వారికి ఇంటిమేట్గా అనిపిస్తూనే ఓ మిస్టరీగా వుంటాడు శ్రీమన్నారాయణ.

‘‘కాదండీ మేషారూ, ఆ ఎపార్ట్‌మెంట్లోనే మీరుండొచ్చుగా… పోనీ యీ ఇరుగ్గదే మీ స్వర్గమనుకుంటే, దాన్ని మీరే అమ్మేసి, దీన్నే ఇంకొంచెం సౌకర్యం చేసుకోవచ్చుగా, ఆ కుర్రాడి చేత అన్ని మాట్లు పడ్డం బాధ అన్పించట్లేదు మేషారూ…’’ కంఠం నొచ్చుకున్నట్టు అన్నాడు.

‘‘ఈ రాతిరి గడిస్తే చాలు ఏ నేలైతేనేం… ఏ చూరైతేనేం. అంటుకున్న అడవిలా పెరుగుతుందే తప్ప తరగదేం రాతిరి! ఈ తడి కన్నుల ఊటలు కోట్లసార్లు ఆర్పప్రయత్నించినా రగులుతుందేగాని బూదిగా మిగలదేం రాతిరి… ఎవరండీ కవీ? దగ్గిర్దగ్గర బీతే నా బితాయె రైనా హిందీ పాటలా లేదూ… ఏమో గాల్లో భావాలు కలిసుండొచ్చు భూపేందర్‌… ఏం గొంతండీ బరువుగా సాగే కరుగుతున్న లావాలాంటి సెగ వుంటుందండీ… సర్లెండి… ఒరేయ్‌ రంగా వెయ్‌రా…. నీళ్ళతో నింపేయకు’’ శ్రీమన్నారాయణ ఎక్ట్సెండెడ్‌ మత్తుతో… ఇంకో రెంటికి సరి… పూర్తీ మత్తులోకి జారుకుంటాడు.

‘‘ప్చ్‌ మైత్రొచ్చుంటే బావుణ్ణు ఫరీదా పసందుండేది… వెయ్‌ వెయ్‌ ఈ రోజుకి నీ పజ్జాలే నంజుకు చప్పరిస్తాం’’ మళ్ళీ అన్నాడు.

‘‘ఏందోతీనా అన్నీ సగం సగమే చెప్తావ్‌ నువ్‌… నువ్‌ చెప్పు సార్‌… ముందేమనె అన్న? మృచ్చెకటికం గురించి చెబ్తా అనె… యాటికోపాయ… ఇంగోటైతే అయిపాయ… దో పట్టూ’’ అంటూ రంగరాజు శ్రీమన్నారాయణకు గ్లాసందించాడు…. నేనూ… కంఠం ముందుకొంగి మామా ఉపద్రవ్నాందుకున్నాం…

‘‘ప్చ్‌… పాటయ్యా… పాట. గుల్జార్‌ గొప్ప కవండీ…. వాడి ధున్లేం ధున్లు బాబూ పంచమ్‌దా…. ఎప్పుడూ పరిచయ్‌ వచ్చిందీ నభై ఏళ్ళ క్రితం కాదూ జబర్దస్త్‌ వయసు…. వొరే నువ్వు చెడ్డీతో తిరుగుతూండుంటావ్‌ అప్పుడు…’’ పాట పాతజ్ఞాపకాల్లోకి జారుకున్నాడు శ్రీమన్నారాయణ.

ఇంతలో నాలుగు వీధి కుక్కులు అరుచుకుంటూ రోడ్డుమీంచి షెడ్డు సందులోకొచ్చి ఓ మొరగడం మొదలుపెట్టాయి… అందులో ఓ కుక్క దాదాపు గదిలోకొచ్చేసింది, ఇంకో రెండు, కోరలన్నీ బైటపెట్టి గుర్ర్‌ గుర్ర్‌మంటున్నాయ్‌…. గోడవారగా రంగరాజు ఆనించి వచ్చిన సైకిలు ధడేల్మని శబ్దం చేస్తూ సందుకడ్డం పడినట్టుంది. ఇంకో కుక్క కాళ్ళు సైకిలు ఏ భాగంలోనో యిరుక్కుని మొరగడం మానేసి కుయ్యికుయ్యిమంటోంది…

‘‘హేయ్‌ థూత్‌… నీయమ్మ ఛల్‌… ఛల్‌…’’ అని రంగరాజు వట్టి చేతుల్తో అదిలిస్తున్నాడు భయంభయంగా….

‘‘మనిషిని తిట్టాలంటే అదీ హీనంగా ఒరే కుక్క ఛావు ఛస్తావు అనంటారెందుకో’’ కంఠం ఎవర్నీ ఉద్దేశించలేదు… అందర్నీ కూడా ఉద్దేశించేలా గొణుక్కున్నట్టుగా అన్నాడు.

రోడ్లపక్కన పడున్న దుర్గంధం… నోర్తెర్చకు…. నీలి రంగు యీగలు జుమ్మంటూ… ముక్కు మూసుకు… అటు పక్కకు తల్తిప్పుకు నడిచే జనాలు… కుక్క చావు… నిజమే…. అందరూ అసహ్యించుకునేలా చావులోకూడా చిటికెడు ఆత్మీయత దొరకని బ్రతుకు… కుక్కచావు…

గొప్పకుక్కులుండవా? అబ్బో నూటేభైయ్యా, రెండొందలో రకాలు… జాతికుక్కలు… పిన్షర్లూ, హౌండ్లూ, టెరియర్లూ, షెపర్డ్లూ, బాక్సర్లూ, స్పానియళ్లూ, డాల్మేషన్లూ, డ్యాక్షండ్లూ…

‘‘ఒరేయ్‌… వెళ్తాయవే… రారా మీదబడి కరిస్తే కుక్క చావే మళ్ళీ యింతకు ముందోటి… యిప్పుడూ గుంపుగానూ… రారా…’’ శ్రీమన్నారాయణ… తన కొడుకును ఆ కుక్కల్తో కలిపేసి…. ‘‘గొప్ప పోలిక మేషారూ… యివి కరవ్వుగానీ, ముందుది దాదాపంత పన్జేసెళ్ళిపోయింది…. హ్హ…హ్హ…హ్హ…’’ అని కంఠం గట్టిగా నవ్వాడు.

‘‘ఒరేయ్‌ రారా… వెళ్తాయిగానీ వచ్చి ఓ పద్దెం పాడు హరిశ్చంద్రదో… తెనాలి రామకృష్ణుడి సినిమాలోదో… రారా’’ పిలిచాడు శ్రీమన్నారాయణ.

‘‘రాజా రాజా… గంజాయి తాగి పాడు… లంజకొడకా అని భలేగా అంటావ్‌ అచ్చు గంటసాల మేషార్లాగే’’ కంఠం అన్నాడు.

‘‘ఇప్పుడూ తురకలనకూడదోయ్‌… క్రైం… లంజకొడకా యిక సరేసరి…. అమ్మనా బూతు కదా… గురజాడలాంటి వాళ్ళనొచ్చంతే… అసలీ లంజన్న పదం బూతెందుకైందో… ఎప్పుడైందో గానీ’’ ఆగాడు శ్రీమన్నారాయణ.

‘‘చెప్పు చెప్పు సార్‌…’’ అంటూ వచ్చి కూలబడ్డాడు రంగరాజు…. ‘‘అసల్లంజంటే పద్మమనర్థం… దాని వ్యుత్పత్తీ…’’ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు శ్రీమన్నారాయణ. యింతలో ‘‘సార్‌… టిఫిన్‌’’ అంటూ దాసు క్యాంటీను కుర్రాడు లోపలికి ఓ క్యారీ బ్యాగ్తోటి వచ్చాడు… వాడితో పాటు కమ్మటి పోపు పరిమళం… షెడ్డునిండా… కమ్ముకుంటూ..

రెండు రౌండ్ల సారాతో కడుపు కరకరలాడుతోంది…. ఆ వాసనకి నోట్లో నీళ్ళూరాయి…

‘‘టమేటా బాత్‌ చపాతీ సార్‌’’ అంటూ వచ్చిన కుర్రాడు క్యారీబ్యాగ్ని కిటికీలో పెట్టి ‘‘ఇంకేమన్నా కావాల్నా సార్‌?’’ వాకిట్లోకెళ్ళి అడిగాడు.

‘‘మందైపోయింది… నే వెళ్ళింకో హస్తం పట్టుకొచ్చేనా’’ అంటూ లేవబోయాడు నీలకంఠం. ‘‘వీడికిచ్చేనా?’’ అంటూ మళ్ళీ కూలబడ్డాడు… ఇంతకు ముందు తీసిన నూటేభై మళ్ళీ తీసి వేళ్ళ మధ్య పట్టుకొని… ఆ కుర్రాణ్ణి ‘రా’ అన్నట్టు తలూపి పిల్చాడు. ‘‘పీనా న మనాహై… నా పిలానాహి మనాహై… మగర్‌ పీనేకే బాద్‌ హోష్‌మే ఆనాహీ మనా హై… హస్తమేం చాల్తుంధీ… హాఫ్‌ చెప్పండి’’ అన్నాడు శ్రీమన్నారాయణ.

‘‘నువ్‌ పో… నా… మనం పోదాంలే’’ అన్నాడు రంగరాజు ఆ కుర్రాణ్ణి పంపిచేస్తూ…

వ్యసనపరుడు కొసరుకోరి తీరుతాడు… ఇదిప్పుడే ఆగదు… కడుపు నకనకలాడ్తోంది. గదిలో గుడ్డి వెలుగు చీకట్లోకి పసుపలికినట్లు… కళ్ళముందు చీకటీగలు మూగుతున్నాయి… చీదరగా వుంది. ఎంత చేత్తో విసిరినా వెళ్ళవు…

చీకటీగలు… నిజంగా మసక చీకట్లోనే మూగుతాయి ముఖమ్మీద… కళ్ళచుట్టూ… మేం నలుగురు కూచ్చున్న మేరా జబ్బుపడ్డ పసుపుకాంతి…. చిన్నగా అంతరించి మిగిలిన గది కనబడీ కనబడక… ముగ్గురు కూడా మొహాల మీద చేతులు విసురుకుంటున్నారు…

చీకటీగలు…

ఏమిటీ చీకటీగలు?

మొహమ్ముందు గట్టిగా చప్పట్లు చరిచినట్టుగా కొట్టి.

(మళ్ళీ వచ్చే  వారం)

కాశీభట్ల వేణుగోపాల్ @9550079473

మూడు పాయల తెలుగు డయాస్పోరా   

 

చిత్రం: సృజన్ రాజ్

చిత్రం: సృజన్ రాజ్

 

-సాయి బ్రహ్మానందం గొర్తి

~

 

అశ్వశాల నుండి గుర్రాన్ని తీసుకురమ్మనమని ఆజ్ఞాపించాను. ఏం చెప్పానో పనివాడికి అర్థం కాలేదు. నేనే లేచి వెళ్ళి, జీను వేసి గుర్రం ఎక్కాను. దూరంగా ఎక్కడో శంఖనాదం వినిపించి, అదేమిటని పనివాణ్ణి అడిగాను. అతనికేమీ అది పట్టలేదు;వినిపించలేదు. గేటు దగ్గర నన్ను ఆపి “ఎక్కడికి ప్రయాణం?” అని ప్రశ్నించాడు.

“తెలీదు. ఇక్కడనుండి బయటకి. ఇంకాస్త దూరానికి. బయటకి వెళ్ళాలి. అదొక్కటే నా గమ్యాన్ని చేరుస్తుంది,” బదులిచ్చాను. “నీ గమ్యం ఎరుకా?” మరోసారి అడిగాడు.

“తెలుసు. ఇప్పుడే చెప్పాను కదా? ఇక్కడనుండి బయటకి. అదే నా గమ్యం!”

“ద డిపార్చర్” అనే కథలో చివిరి వాక్యాలు ఇవి. ఆ కథ రాసింది కాఫ్కా.

వలసజీవుల యాతనా, తపనా సూక్ష్మంగా చిన్న కథలో చూపించాడు కాఫ్కా.    

*******

ఏ మనిషయినా తన స్వస్థలం వదిలి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? అక్కడ భరించలేనంత ఇబ్బందయినా ఉండాలి. లేదా వేరే చోటకి వెళితే జీవితం మెరుగుపడచ్చన్న ఆశ అయినా వుండాలి. ఈ రెండే మనిషిని స్థాన భ్రంశం చేయిస్తాయి. కొత్త ప్రదేశం వేరే ప్రపంచాన్ని పరిచయం చేయిస్తుంది. కొత్త అనుభవాలని ఇస్తుంది. ఆలోచనలని రేకెత్తిస్తుంది. జ్ఞాపకాల కుదుపులున్నా, నిలదొక్కుకునే ధైర్యం ఇస్తుంది. ప్రవాస జీవితానికి ఒకటి కాదు. రెండు ప్రపంచాలు.  ఇంకా గట్టిగా చెప్పాలంటే మూడు ప్రపంచాలు.

000000000000  

ఊరు మారినా, ఉనికి మారునా?

దూరమయినప్పుడే కోల్పోవడం విలువ తెలుస్తుంది. అది – మనుషులు కావచ్చు; అలవాట్లు కావచ్చు; ప్రదేశాలు కావచ్చు; సంస్కృతి కావచ్చు – ఇంకా ముఖ్యంగా భాష కావచ్చు. ఈ కోల్పోవడం వెనుక నీడలా కనిపించని అదృశ్య పార్శ్వం  ఒకటి ఉంటుంది. ఆ పార్శ్వమే “ఉనికి” లేదా “గుర్తింపు”. ఈ ఉనికి అన్నది స్థానం బట్టి మారుతూ ఉంటుంది.

ఇల్లు దాటగానే ఒక రూపం, వీధి దాటగానే మరో రూపమూ, వూరు దాటగానే వేరొక రూపమూ సంతరించుకుంటుంది.  పరాయి రాష్ట్రం వెళితే ఒకవిధంగానూ, దేశం విడిచి వెళితే ఇంకో కొత్త రూపంలోనూ దర్శనమిస్తుంది. ఈ ఉనికి అన్నది కేవలం వ్యక్తిగతమే కాదు, దానికి చాలా పార్శ్వాలుంటాయి. వాటిలో ముఖ్యమైనవీ, చాలా ప్రభావితమైనవీ – భాషా, సంస్కృతి (అంటే జీవన విధానమూ, అలవాట్లు. ముఖ్యంగా ఆహారం). సంస్కృతి బయట ప్రపంచానికి తెలియకపోవచ్చునేమో కానీ, మొట్టమొదట కనిపించేదీ, వినిపించేదీ భాష ఒక్కటే.  ప్రపంచంలో ఏ మనిషికైనా తమ జీవన స్రవంతిలో భాషే ప్రధాన అంగమూ, ఆయుధమూ కూడా. అందువలనే భాష ఉనికిని అంటిపెట్టుకునే ఉంటుంది. అలాగే అలవాట్లూ, సంస్కృతీ. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. పరాయిదేశంలో అడుగు పెట్టీ పెట్టగానే ఇవి వారి ఉనికిని గుర్తు చేస్తూనే ఉంటాయి.

“ఊరు మారినా, ఉనికి మారునా? – ఉనికి మారినా, మనిషి మారునా?” అని పాత తెలుగు సినిమా పాటొకటుంది(ఆరుద్ర రాసినది). ఊరు మారితే ఉనికి మారినా, మారకపోయినా దాని పేరు మాత్రం మారుతుంది. రాయలసీమ వాస్తవ్యులూ, తెలంగాణా వాస్తవ్యులూ, కోస్తావాసులూ అన్నది రాష్ట్రం దాటితే తెలుగువారి గానే పరిగణించబడతారు. అదే దేశం వదిలి వెళితే భారతీయులుగా గుర్తించబడతారు.

వలస వెళ్ళిన దేశం అయితే అది “diaspOra”గా అవతరిస్తుంది. ఈ Diaspora (dispersed or scattered అన్నది గ్రీకు పదం. క్రీస్తు పూర్వం 586 కాలంలో యూదు జాతీయులు దేశ బహిష్కృతులై, ఈజిప్ట్‌ నుండి చెల్లాచెదరైపోయి పాలస్తీనా దగ్గర వలస చేరిన సందర్భంలో దీన్ని వాడేవారు. దాన్ని మెల్లగా వేరే దేశాలలో వలస వెళ్ళిన సమూహాలకి అన్వయించడం మొదలుపెట్టారు. ఈ అన్వయంలో చిన్న “d” తో వీరిని గుర్తించడం మొదలయ్యింది.  డయాస్పోరా (diaspora)కి ప్రధాన లక్షణం – ఉనికి.      

ఈ ప్రపంచంలో చాలా డయాస్పోరాలున్నాయి. ముఖ్యంగా అమెరికాలో.  వలసదారులతో ఏర్పడ్డ అమెరికా దేశంలో అనేక డయాస్పోరా కమ్యూనిటీలున్నాయి. చైనీస్, ఆఫ్రికన్లు, స్పానిష్, ఐరిష్ వాళ్ళనీ వీరిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఉన్న ఊరునీ, కన్నవాళ్ళనీ, దేశాన్ని వదిలి ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టడంటే అంత తేలికయిన విషయం కాదు. భాషా పరంగా, సాంస్కృతిక పరంగా అనేక ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ నిలదొక్కుకొనీ తమకంటూ ఒక ప్రత్యేక ఉనికిని చాటుకోవడం ఈ డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేక లక్షణం.

మాతృదేశం వదిలి వలస వచ్చిన కొత్తలో ప్రతీ ఒక్కరినీ cognitive dissonance(అభిజ్ఞా వైరుధ్యం లేదా వ్యతిరేకత) ఆవరించుకొని ఉంటుంది.

వేరొక కొత్త సమాజపు అలవాట్లూ, సంస్కృతీ ఎదురుపడ్డప్పుడు – తమ నమ్మకాలకీ, ఆలోచనలకీ, నమ్మిన విలువలకీ మధ్య – వాటిద్వారా కలిగే ఒక మానసిక  ఒత్తిడి.  సూక్ష్మంగా చెప్పాలంటే – రెండు విభిన్న సంస్కృతులూ, నమ్మకాల మధ్య ఊగిసలాడే డోలాయమాన స్థితి.  ఈ సంఘర్షణకి అంతర్లీనగా సంస్కృతీ, అలవాట్లే హేతువులు అయ్యే అవకాశం చాలా వుంది.  వీటికంటే ప్రధానంగా మాట్లాడే “భాష” ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. అంతవరకూ మాతృభాషకి అలవాటు పడ్డ ఆలోచనలూ, భావాలూ ఒక్కసారి వేరే భాషలో రూపాంతరం చెందేటప్పుడు కొన్ని అర్థం మారిపోవచ్చు; కొన్ని జారిపోవచ్చు కూడా. ఇలాంటి సందర్భాలలో కొంత మానసిక సంఘర్షణ కలుగుతుంది.

ఈ సంఘర్షణలో – కొంత అస్పష్టతా, గందరగోళమూ, అపార్థమూ లేదా విబేధం ఏర్పడచ్చు. ఇవి కాకుండా కొంత ఉద్రిక్తతా, అఘాతం కూడా కలగవచ్చు. ఇవన్నీ వేరే జాతులు – అంటే అమెరికాలో ఉండే అమెరికన్లూ, ఆఫ్రికన్లూ, స్పానిష్ వాళ్ళూ, చైనీయులు, వంటి వారితో కలిసినప్పుడు కలగుతాయి. కేవలం మనుషుల మధ్యే కాకుండా వస్తుగతంగా కూడా ఉండచ్చు.

లండన్ యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ – Avtar Brah – “Cartographies of Diaspora” పుస్తకంలో ఇలా అంటారు – “డయాస్పోరా అన్నది కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తుంది. విడిపోయేటప్పడు కలిగే అనుభవంలో అఘాతాన్నీ, స్థానభ్రంశాన్నీ ఎత్తి చూపిస్తుంది. అదొక్కటే కాదు – కొత్త ఆశలనీ, సరికొత్త అధ్యాయాలనీ సృష్టిస్తుంది కూడా. ఈ కొత్త సాంస్కృతిక జాగాలో వ్యక్తిగతమైన, సామూహికమైన జ్ఞాపకాలు ఢీకొంటాయి. కొన్ని పెనవేసుకుంటాయి. ఇంకొన్ని రూపాంతరం చెందుతాయి. ఇదే దీనికున్న బలమూ; బలహీనతా కూడా.”

గత వందేళ్ళుగా డయాస్పోరా మీద కొన్ని వందల వ్యాసాలూ, పుస్తకలూ వచ్చాయి. ఎన్నో సిద్ధాంతలూ, ప్రతిపాదనలూ, చర్చలూ జరిగాయి. వాటిలో ఈ మధ్య పుట్టుకొచ్చిందే – Third Space Theory. ఈ పదాన్ని సృజన లేదా కోయిన్ చేసింది – Oxford University లో హోమీ.కె.భాభా అనే ఒక ఇండియన్ ప్రొఫెసరు. ఈ డయాస్పోరా కమ్యూనిటీల గురించి చెబుతూ – The diasporic communities occupy a unique interstitial third space, which enables negotiation and reconfiguration of different cultures through hybrid interactions. Third Space Theory explains the uniqueness of each person, actor or context as a “hybrid”.

దీన్ని బట్టి చూస్తే డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేకత – మిశ్రిత జీవనం; ఏకత్వంలో భిన్నత్వం. వీరికి రెండు కాదు – మూడు ప్రపంచాలు – మొదటి రెండూ, సొంత, వలస దేశాలయితే మూడోదే ఈ “కొత్త జాగా”. ఆ జాగాలో ఊపిరి పోసుకున్నదే డయాస్పోరా సాహిత్యం.

0000000000000

సాహిత్యం అనగానే మొట్ట మొదట గుర్తొచ్చేది భాష. భాష అంటే ఏది? మాతృభాషా? పరాయి భాషా? కొత్త దేశంలో మాతృభాష వెనక్కి వెళ్ళి పరాయి భాష ముందుకొస్తుంది. ఆ క్రమంలో వ్యక్తిగత భావ ప్రకటనే ప్రధానాంశం అవుతుంది. ఎవరికైనా భాష వచ్చూ అంటే – మాట్లాడడం, అర్థం చేసుకోవడం, చదవడం, రాయడం – వంటి వాటిలో నైపుణ్యం కావాలి.. ఈ నాలుగింటిలో నైపుణ్యత ఉన్నప్పుడే ఆ భాష వచ్చునని చెబుతాం.

ఎవరికైనా మాతృభాషలో ఉన్న ప్రావీణ్యత పరాయి భాషలో అంత తేలిగ్గా రాదు. కాబట్టి ప్రవాసీయులు తమ అనుభవాలానీ, జీవితాన్నీ చెప్పాలంటే మాతృభాషనే వాహకంగా ఎన్నుకుంటారు. తద్వారా తమ సొంత జాతీయులకి వారి జీవితం తెలిసే అవకాశం ఉంటుంది. ఇదొక పార్శ్వం. అమెరికాలో ఉన్న అనేకమంది తెలుగు రచయితలు అందిచ్చే సాహిత్యం, కథా, కవితా, నవలా, ఏ రూపమయినా ఈ కోవకి చెందుతాయి.

అలా కాకుండా పరాయి దేశపు భాషలో తమ అనుభవాలనీ, జీవితాన్నీ వ్యక్తీకరించినప్పుడు ఆయా దేశాలవారికీ తమ సంస్కృతీ, ఆలోచనలూ, సమస్యలూ, జీవితమూ తెలిసే అవకాశం ఉన్నాయి. అంటే ఇంగ్లీషులో సాహిత్య సృజన చెయ్యడం.

ఇంతకు ముందు ప్రస్తావించినట్లు యూదులు హీబ్రూ, అరామిక్ భాషల్లోనే అన్నీ వ్యవహారాలూ నడిపేవారు. మతంగురించి రాసినా, పండితులతో వ్యవహరించినా, మామూలు యూదు ప్రజలను ఉద్దేశించి చెప్పాలన్నా అవే భాషలు వాడేవారు. తమ దేశం వలస వచ్చిన వేరే జాతీయులకి చెప్పడానికీ ఇవే భాషలు వారికి బోధించి మరీ చేరవేసేవారు. తద్వారా వలస జాతీయుల ద్వారా కొంత సాహిత్యం పుట్టింది. వీరి అవస్థలూ, ఆలోచనలూ తెలిసాయి.

ప్రస్తుతం అమెరికా తెలుగు డయాస్పోరా సాహిత్యం తీసుకుంటే అది ఒంటికాలుతోనే ఉంది. ఎందుకిలా అనాల్సి వచ్చిందో చూద్దాం.

తెలుగు వారికంటే ముందు వచ్చిన చైనీస్ ఆరేడు తరాలు తమ జీవితాన్నీ, అనుభవాలనీ సాహిత్య పరంగా అందించాయి. మొదటి తరాలు తమ సొంత భాషల్లో చేస్తే, తరువాతి తరాలు ఇంగ్లీషులోనే రాయడం మొదలు పెట్టారు. తెలుగువారికంటే ముందు ఎక్కువగా వలస వచ్చిన భారతీయుల్లో గుజరాతీయులూ, పంజాబీలూ, బెంగాలీలు ఉంటారు (ఈ మాధ్యకాలంలో అంటే గత పదహారేళ్ళుగా మన తెలుగు వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. అది వేరే విషయం.). 1914 కాలంలోనే ఎంతోమంది పంజాబీలు కెనడా వలస వచ్చారు. వారిలో చాలమంది ఉపాధికోసం అమెరికాకి వచ్చారు. వీళ్ళతరువాత వచ్చిన వాళ్ళల్లో మరో ముఖ్యమైన గుంపు గుజరాతీయులు.

ఇందులో అన్ని రంగాల వారూ, అంటే వ్యాపారస్తులు మొదలుకొని, విద్యార్థులూ, నర్సులూ, పనివాళ్ళూ అందరూ వచ్చారు. దాంతో వారికి ఇక్కడి జన జీవనంతో సంబంధ బాంధవ్యాలు త్వరిత రీతిన ఏర్పడ్డాయి. అమెరికాలో మోటెల్స్ (చిన్నసైజు లాడ్జీలు) వ్యాపారంలో అందరూ గుజరాతీయులే! అలాగే టాక్సీ, రెస్టారెంట్ లాంటి వివిధ రంగాల్లో పంజాబీలూ ఎక్కువగానే ఉన్నారు. వీరుకాకుండా బెంగాలీయులూ ఉన్నారు. వీరందరికీ కొన్ని దశాబ్దాలుగా అమెరికన్ సమాజంలో వివిధ వర్గాల వారితోనూ అనుభవాలు ఉన్నాయి. అవన్నీ తమ మాతృభాషల్లోనూ, ఇంకా ముఖ్యంగా ఇంగ్లీషులోనూ అక్షర రూపం ఇచ్చారు. అందువలన ఇండియన్ డయాస్పోరా చెప్పగానే వీళ్ళ పేర్లే అమెరికాలో అందరికీ తెలుసు. ఇండియన్ డయాస్పోరా పేరు చెప్పగానే ఝుంపా లహరి, చిత్రా దివాకరునీ(బెంగాలీ) – బల్వంత్ జాని,  పన్నా నాయిక్ (గుజరీతీ) – దర్షన్ సింగ్ తట్ల,  వంటి పేర్లు అమెరికాలో అందరికీ చిర పరిచయమే.

ఈ వలస అన్నది ఈనాటిది కాదు. ఎంతో మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు సౌత్ఆఫ్రికా, మారిషస్, ఫిజీ, మయన్మార్(ఒకప్పటి బర్మా) వంటి దేశాలకు వ్యాపార రీత్యా, ఉపాధి కోసమూ అనేకమంది వెళ్ళారు. కాల క్రమేణా వారందరూ ఆయా దేశాల జన స్రవంతిలో కలిసేపోయారు. కొత్త తరం వారు పేరుకి తెలుగు వారయినా ఆయాదేశపు సంస్కృతీ, జీవిన విధానంలో భాగం కనుక, వారి ఉనికిని కోల్పోవడం సహజ పరిణాంగానే భావించాలి. ఎప్పుడైతే భాష అంతరించిందో అప్పుడే సాహిత్యమూ గతిస్తుంది. అందువల్ల ప్రపంచంలో పలు ప్రాంతాల్లో తెలుగు వారు ఉన్నా, అక్కడి నుండి గుర్తించగలిగిన సాహిత్యం రాలేదు. సౌత్ఆఫ్రికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో అనేకమంది తెలుగు వారున్నారు. తెలుగులో రాయకపోయినా, కనీసం ఇంగ్లీషులో నయినా సాహిత్య సృజన చేపట్టినవారు కనిపించరు.

డయాస్పోరా అనగానే మాతృభాషలో వచ్చే సాహిత్యమే అన్న ధోరణి కనిపిస్తూ ఉంటుంది. కేవలం మాతృభాషలోనే కాకుండా పరాయి భాషలో (ప్రస్తుతం ఇంగ్లీషు అనుకుందాం) కూడా సాహిత్య సృజన ద్వారా వారి జీవన విధానమూ, అనుభవాలూ అందజేయాలి. అప్పుడే అది పరిపూర్ణ డయాస్పోరా సాహిత్యం అవుతుంది. ఇంగ్లీషులో రాసింది ఒక కోణమయితే,  మాతృభాషలో రాసింది మరొక కోణం అవుతుంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగువారినీ, భాషనీ తీసుకుంటే, కేవలం తెలుగులో రాసే తెలుగు రచయితలు మాత్రమే ఉన్నారు.

ఇరవయ్యో శతాబ్దం మొదట్లో ఎంతో మంది పంజాబీలు అమెరికా, కెనడా వచ్చారు. కొంతమంది అక్కడున్న స్థానికులతో పెళ్ళి వంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించారు. ఇంకొతమంది మెక్సికనలని కూడా పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత తరం వాళ్ళు విద్యలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్థిరపడి నిలదొక్కుకున్నారు. అమెరికాలో టాక్సీ వ్యాపారంలోనూ, డంకిన్ డోనట్స్ ఫ్రాంచైజ్ బిజినెస్సుల్లోనూ చాలామంది పంజాబీలు ఉన్నారు. అలాగే మోటెల్స్ నడపడంలోనూ, సబ్‌వే వంటి రెస్టారెంట్ బిజినెస్సుల్లో గుజరాతీయులు ఎక్కువగా కనిపిస్తారు.  గుజరాతీయులు మొదట వలస వెల్లింది సౌతాఫ్రికాకే. అక్కడినుండే అమెరికాకి వచ్చారు.   అమెరికాలో తెలుగువారి రాక 1950, 50లలో ఉన్నత విద్యకోసం ప్రారంభమయినా, డేబ్బైల్లో అనేకమంది డాక్టర్లు, నర్సుల రాకతో ఎక్కువయ్యింది. వీళ్ళందరూ సరాసరి ఉద్యోగలకే వచ్చారు. అందులోనూ వచ్చింది వైద్య వృత్తి రీత్యా కావడంతో వీరికి ఆర్థిక సమస్యలు అంతగా ఉండకపోవడం సహజం. ఆ తరువాత తొంభైల్లో సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలకోసం వచ్చిన వారిలో తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అమెరికా పౌర జీవన ప్రమాణాలతో చూస్తే వీరందరూ ఆర్థికపరంగా మధ్యతరగతి కంటే ఎక్కువే.

డెబ్బైల తరువాత వచ్చిన వారికి అమెరికాలో అనేక అనుభవాలూ, సంఘర్షణలూ, సర్దుబాట్లూ ఉండి ఉంటాయి. ఇప్పటిలా సౌకర్యాలూ, వార్తా ప్రవహామూ అంతగా లేదు. అందువల్ల నాస్టాల్జియా వెంటాడుతూనే ఉండేది. భాషా, సంస్కృతీ ఇవన్నీ ఉనికిలో భాగం కాబట్టి అవి నిలబెట్టుకోవడం కోసం ఆ తరంలో తపనా, యావా ఉండేవి. అందులో సాహిత్యం కూడా కొద్దిగా ఉంది. ఆ విధంగానే తానా, ఆటా వంటి సంస్థలు వుద్భవించాయి. ఎంత దూరంలో ఉన్నా తెలుగువారు కలవడం అన్నది ఒక ప్రధాన అంశంగా మారింది. ఆ కోవలోనే అనేకమంది తెలుగు ప్రముఖుల రాకపోకలు అమెరికాలో ఎక్కువయ్యాయి. సాహిత్య పిపాస ఉన్న కొంతమంది ప్రేరణతో సావనీర్లు పుట్టుకొచ్చాయి.  తెలుగులో రాయడం అన్నది ఒక రివాజుగా వుండేది. అడపాదడపా కొన్ని కథలూ, వ్యాసాలూ వచ్చినా సాహిత్య పరిధి పెరిగినది మాత్రం 1996 కాలంలో ఇంటర్నెట్ వచ్చిన తరువాతే. ఆ విధంగా సాహిత్య సృజనకి కంప్యూటర్ సాంకేతిక రంగం(ఇంటర్నెట్) ఎంతో దోహదం చేసింది. చాలామంది ఔత్సాహిక రచయితలు అమెరికా నుండి రచనలు చేయడం మొదలుపెట్టారు. అక్కడి అనుభవాలూ, నాస్టాల్జిక్ జ్ఞాపకాలూ కలగలిపి అనేక కథలూ, వ్యాసాలూ వచ్చాయి. ఆ విధంగా తెలుగు డయాస్పోరా అన్నది తెలుగు సాహిత్యంలో ఒక పాయగా మారింది.

ఇంతమంది తెలుగు వారు అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఎంతో కాలం నుండీ ఉంటున్నా ఏ ఒక్క తెలుగువాడూ ఇంగ్లీషులో రచనలు చేయడం కనిపించదు. వెల్చేరు నారాయణ రావు వంటి వారు అనువాదాలు చేసినా, అవి అందరి పాఠకులనీ చేరుతాయన్నది అనుమానమే. అమెరికాలో నవలలూ, కథల పుస్తకాలూ విరివిగా ప్రాచుర్యంలో ఉంటాయి. (వేరేవి కూడా ఉంటాయి. ప్రస్తుతం కథ/నవల గురించే చెప్పుకుందాం) కొన్ని తరాల తెలుగు వారు ఇంత కాలం నుండి ఉన్నా ఏ ఒక్కరూ ఇంగ్లీషులో తెలుగువారి జీవితం గురించి రాయలేదు. అదే బెంగాలీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో అయితే రెండు వైపులా సాహిత్యం వచ్చింది. అనేకమంది పేరున్న రచయితలు అమెరికాలో భారతీయ జీవన విధానాన్నీ, సాంస్కృతిక సంఘర్షణనీ సాహిత్య రూపంలో అందించారు. వెతికి చూస్తే, అమూల్య మల్లాది అన్న ఒక్క రచయిత్రి మాత్రమే కనిపిస్తారు. అటు కన్నడంలోనూ, తమిళంలోనూ నలుగురైదుగురైనా ఉన్నారు.

తెలుగు వారి జీవితం గురించి ఎవరైనా ఇంగ్లీషులో నవలా, కథా రాసినా అమెరికన్ల వరకూ అది ఇండియన్ల జీవితమే. మనకి భాషాపరంగా అనేకమంది ఉన్నా, అమెరికన్లకి మాత్రం గుజరాతీయులూ, బెంగాలీలూ, పంజాబీలూ, తెలుగువారూ అందరూ భారతీయులక్రిందే లెక్క. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న తెలుగు వారినుండి విరివిగా ఇంగ్లీషులో సాహిత్య సృజన జరిగితే తప్ప తెలుగువారి ఉనికీ, జీవితమూ, దాని వెండి వచ్చే కష్ట సుఖాలూ అమెరికన్లకి అర్థం కావు. ఈ విషయంలో ఝుంపా లహరి, బెంగాలీ రచయితని మెచ్చుకు తీరాలి. బెంగాలీ జీవితాన్ని అమెరికన్లకి బాగానే పరిచయం చేసింది. ఈమె రాసిన “నేమ్ నేక్” ఎంతో ప్రాచుర్యం పొందిన నవల.

వలస వచ్చిన తెలుగు వారు సాహిత్య సృజన చెయ్యకపోవడానికి నాకు కనిపించిన కారణాలు:

1) వస్తూనే మంచి ఉద్యోగాలతో రావడం వలన (90ల తరువాత వచ్చిన వారు) అమెరికన్ జీవన విధానంలో మమేకం అవ్వాల్సిన అవసరం లేకపోవడం.

2) వచ్చిన వారిలో చాలామందికి సాహిత్యం పట్ల ఆసక్తిలేకపోవడం.

3) సాంకేతిక ప్రగతీ, సౌకర్యాల వలన వేరే దేశం వచ్చామన్నా భావన అంతగా పట్టకపోవడం.

4) తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరగడం వలన ఇక్కడున్న వారితోనే సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం. అవసరమయినంత మేరకే అమెరికన్ జీవన స్రవంతిలో కలవడం.

పై కారణాల వలన ఇంతవరకూ వచ్చిన సాహిత్యం, అమెరికన్ జీవిన విధానంలో ఉపరితలంలో కనిపించిన వస్తువుల చుట్టూ తిరిగింది. లోతైన అవగాహన, అధ్యయనం లేకపోవడం వలన ఊహించిన రీతిలో తెలుగు సాహిత్యం పుట్టకపోవడం; అమెరికన్ జీవన స్రవంతిలో కలవకపోయినా గడిచిపోయే వాతావరణమూ, ఇలా పలు కారణాలు కనిపిస్తాయి.  ఇంత వరకూ వచ్చిన సాహిత్యం కూడా ఈ క్రింది అంశాల పరిధి దాటి లోతుగా అధ్యయనం కాలేదు.

1) స్త్రీల సమస్యలు, గృహ హింస

2) నాస్టాల్జియా, నాస్టాల్జియా, నాస్టాల్జియా

3) పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళు, వృద్ధాప్యంలో సమస్యలు, ఇండియా నుండి వచ్చే వారి తీరుతెన్నులూ

4) అమెరికా జీవితం పై వ్యంగ్య, హాస్య రచనలు

అడపాదడపా వేరే అంశాలపై కథలు వచ్చినా, సింహభాగం రచనలు పైన చెప్పిన వాటిని మించి పోలేదు. అమెరికన్ సంస్కృతీ, జీవన విధానంతో లోతుగా ముడిపడిన వారి జీవితం గురించీ, వాళ్ళకి మన సంస్కృతీ, జీవితం పట్ల ఉన్న అవగాహనా వంటివి ప్రతిబింబింస్తూ వచ్చిన కథా వస్తువులు కనిపించవు.

రాసేవాళ్ళకీ ఉపరితల పరిశీలనే తప్ప లోతైన అధ్యయనలోపం ప్రధాన సమస్య. ఎంతో కొంత కథలు వచ్చాయి కానీ, అమెరికా జీవితన్ని ప్రతిబింబిస్తూ తెలుగులోనే మనకి నవలలు అంతగా రాలేదు. కనీసం రాబోయే కొత్త తరం అంటే అమెరికాలో ఇప్పుడున్న వారి సంతతి అయినా ఇంగ్లీషులో తెలుగువారి జీవితం గురించి రాసి తెలుగు డయాస్పోరాకి పూర్తి న్యాయం చేకూరుస్తారన్న చిన్న ఆశ. అది ఎంత సఫలం అవుతుందో కాలామే నిర్ణయించాలి.

*

రెండూ నువ్వే!

 

-ఝాన్సీ పాపుదేశి

~

 

ఈరోజు ఉదయం నుంచీ తార ఎందుకో చాలా ఎక్కువగా గుర్తొస్తోంది.

తారంటే నాకు చాలా ఇష్టం. కానీ ఒకరిపట్ల ఒకరికి ఇష్టం కలగడానికి, స్నేహం పెనవేసుకోవడానికి , గౌరవం పెరగడానికి ప్రేమించే మనసు సరిపోతుంది. కానీ దాన్ని బహిరంగంగా ప్రకటించాలంటే … సమాజం వొప్పుదల కావాలి. లేదంటే మనకున్న మర్యాద గంగలో కలిసిపోదూ!   ఒక శరీరం ..ఒక మనసు రెండు రకాలుగా ఎలా ఆలోచిస్తుందో..ఎలా ప్రవర్తిస్తుందో తలుచుకుంటే నాకెప్పటికీ ఆశ్చర్యమే!

తారతో నా పరిచయం ఆరునెలలు. ఈ ఆర్నెల్లలో తనను చాలాసార్లే కలిశాను. ఇద్దరం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎప్పుడూ కలలో జీవిస్తున్నట్టు ఉంటుంది తార. తన అసలు పేరు తార కాదు. అసలేమిటో చెప్పడానికి తనకు ఇష్టం వుండదు. అందుకే ఎప్పుడూ నేను కూడా అడగాలని ప్రయత్నించలేదు. తారను కలిసిన ప్రతిసారీ తన అందానికి, దానికి చాలా వోపికగా మెరుగులు దిద్దే తన నైపుణ్యానికి నాకెప్పుడూ ఆశ్చర్యంగా వుంటుంది. అంత అందంగా వున్న తారను చూస్తే ఒక్కోసారి అసూయగా కూడా వుంటుంది. నేనెందుకు అంత అందంగా లేనని దిగులుగా కూడా వుంటుంది.

ఎప్పుడూ తానో కురిసే జడి వానలా వుంటుంది. గడగడా మాట్లాడుతుంది. అందరినీ ఆటపట్టిస్తూ నవ్వుతూ తుళ్ళుతూ వుంటుంది. చాలా సున్నిత విషయాలకు స్పందిస్తుంది. కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది. బలంగా వుంటూనే బలహీనంగా కనిపిస్తుంది. అన్నట్టు తారతో నా పరిచయం ఎలా జరిగిందో చెప్పలేదు కదూ!

ఆర్నెల్ల క్రితం నా మరో స్నేహితురాలు చంద్రిక ఒక మీటింగ్ కి తోడుగా రమ్మంటే తనతో వెళ్లాను. చంద్రిక ఒక ఎన్జీవో నడుపుతుంది. అనాధ పిల్లల సంక్షేమం కోసం తను పని చేస్తుంది. నాకూ ఆరోజు ఇంట్లో ఉండాలంటే కాస్త బోరు కొట్టి చంద్రిక ఫోన్ చెయ్యగానే వెళ్ళిపోయాను. అదుగో ..అక్కడే పరిచయం అయింది నాకు తారతో. నాకు కొత్త వ్యక్తులతో మాట్లాడటమంటే ఏదో తెలియని భయం. కానీ కొత్త వ్యక్తిత్వాలను పరిశీలిస్తూ వారిని అర్థం చేసుకోవడం చాలా ఇష్టమైన పని. ఆ మీటింగ్ లో చాలామందే వున్నా తార ఒక్కటే నా దృష్టిని ఆకర్షించింది.

తార అమ్మాయిగా మారిన ఒక అబ్బాయి.  పెద్దకొడుకుగా పుట్టినా పదేళ్ళు రాగానే తన శరీరంలో వచ్చిన మార్పుల్ని అపనమ్మకంతో , భయంతో అర్థం చేసుకున్న ధీర. ఇంట్లో వారికంటే ముందు తన శరీరంలోని మార్పుల్ని స్నేహితులు గుర్తించి పెట్టిన పేరు ఆమె మనసులో సుడిగుండాల్నే రేపాయి. స్కూలుకు వెళ్ళకుండా యేడాది పాటూ అర్థంకాని శరీరాన్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయి స్నేహితుల హేళన తప్పించుకున్నా అమ్మానాన్న, తమ్ముడి దృష్టిని తప్పించుకోవడం తన వల్ల కాలేదు.  శరీరంలో కరుకుదనం కంటే పెరుగుతున్న లాలిత్యం, సౌకుమార్యం వారికి తారపై ప్రేమను చంపేసింది. ఆడదాన్లా ప్రవర్తించద్దని వారు తిడుతుంటే ..ప్రవర్తించడం ఏమిటి…తాను ఆడదైతే! మగవారి బట్టలేసుకుని మగవాడిలా తిరగడం ఏంటని ప్రతిరోజూ రాత్రిళ్ళు ఏడ్చేది. శరీరంలో ఇమడని తన మనసుని ఎప్పటికప్పుడు వోదార్చుకునేది. చివరకు కన్నవాళ్ళను వొదిలేసి తనలాంటి వాళ్ళను కలుసుకున్నప్పుడు పూర్తిగా తారలా మారిపోయింది.   అలా మారిన తారనే నేను కలిశాను. అసలు తార జీవితం గురించిన కుతూహలమే నాకు ఆమెతో స్నేహం చేసేలా ప్రోత్సహించింది.  ఎందుకంటే అప్పటి వరకు నాకు ట్రాన్స్ జెండర్ ఫ్రెండ్ లేదు మరి.  తార పరిచయం అయినప్పటి నుంచి తనను పూర్తిగా పరిశీలించడం మొదలుపెట్టాను.

తార బొంగురు గొంతుతో మాట్లాడుతుంది. అదొక్కటే తనలాంటి వాళ్ళతో ఉన్న పోలిక. అందర్లాగా చూడగానే తనేమిటో తెలిసిపోయేలా వుండదు.  చక్కగా పోనీటైల్ వేసుకుంటుంది. గోళ్ళు పొడవుగా పెంచుకుని ఎప్పుడూ మంచి నెయిల్ పెయింట్ తో చాలా గ్రూమ్డ్ గా కనిపిస్తుంది. లోపల టీషర్టు వేసుకుని పైన పొడవాటి షర్టు, జీన్స్ ప్యాంట్ వేసుకుంటుంది. పైకెలా అందంగా అనిపించేలా జాగ్రత్త పడుతుందో తను అంతే సౌందర్యవతి …ఆలోచనల్లో ..ప్రవర్తనలో. చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది…అలాగే ప్రవర్తిస్తుంది. అందుకేనేమో నాకు తారంటే స్పెషల్ ఇంటరెస్ట్. కొంచెం భయం కూడా…తన బోల్డ్ నెస్ చూసి.

మొదటిసారి తారను కలిసినప్పటి నుంచీ నేనే చంద్రికకు ఫోన్ చేసి మీటింగ్స్ ఎప్పుడవుతున్నాయో కనుక్కొని మరీ వెళ్తున్నా. తారతో పాటూ ఇంకో పదిమంది వొస్తారు ఆ మీటింగ్స్ కి . కానీ ఎవరూ తనంత మర్యాదపూర్వకంగా మాట్లాడరు.

నాలుగు నెలల ముందు ఒకరోజు మీటింగ్ లో చాలా ఉత్సాహంగా చెప్పింది సమీర్ తో తన పెళ్లి జరగబోతోందని. వినగానే వింతగా అనిపించింది. తనకి పెళ్ళేమిటి…విచిత్రం కాకపోతే… కానీ, ఈ మాట తనతో అనలేదు. అంటే తను నా గురించి ఏమనుకుంటుందో !  అయితే ఇంటికెళ్ళి మరో స్నేహితురాలితో చెప్పి నవ్వుకున్నాను. తారంటే నాకు నవ్వులాట కాదు. తన ముందు నా ప్రవర్తన తార అంగీకరించేలానే వుంటుంది. తన నుంచి బయటకొచ్చాక ఆటోమేటిగ్గా మారిపోతుంది.  తార తో నా పరిచయం తర్వాతే నాకు హిజ్రా జీవితాలు ఎలా వుంటాయో తెలవడం. తార ఇంట్లో అమ్మానాన్నలతో కలిసి వుండటం లేదు. అభిప్రాయబేధాలొచ్చి స్నేహితులతో కలిసి ఉంటోంది. తననెప్పుడూ అమ్మానాన్నలు ప్రేమించలేదని…అనవసర సంతానంగానే భావించారని ఒకసారి చెప్పింది. వాళ్ళు వుండమన్నట్టు తాను ఉండాలే కానీ నేను నాలా ఉండటాన్ని వారెప్పుడూ అంగీకరించరని చెప్పి ఏడ్చేది. ఇల్లొదిలి ఏడాదిపాటూ వెళ్ళిపోయానని…తరువాత వొచ్చినా ఇంట్లోకి రానివ్వలేదని…తనకిప్పుడు ఎవ్వరూ లేరంటూ వొంటరితనాన్ని ఫీలయ్యేది. చుట్టూ ఎందరున్నా హృదయానికి దగ్గరగా మిమ్మల్ని మాత్రమే తీసుకోగలుగుతున్నానంటూ చేతులు పట్టుకునేది. అప్పుడు తారతో పాటూ నేనూ కన్నీళ్లు పెట్టుకున్నాను. ఆమె బాధను నేనూ అనుభవించాను.  ఇంటికి రాగానే నా ఆలోచనల్లో కూడా మార్పు వచ్చేది.

సమీర్ తన స్నేహితుడిగా నాకు తెలుసు. వారిద్దరూ కలిసే ఉంటున్నారని కూడా విన్నా. పెళ్ళయితే ఇన్నేళ్ళ తార వొంటరితనం పోతుందని అనిపించింది. చంద్రికతో పాటూ తార పెళ్ళికి నేను కూడా వెళ్ళాను . తార కోసం కాదు. వారి పెళ్లి ఎలా వుంటుందో చూడాలని. పెళ్లి చాలా సింపుల్ గా జరిగినా తన స్నేహితులంతా పెళ్ళికి రావడంతో పొంగిపోయింది తార. ఆ రాత్రంతా ఆటపాటలతో సరదాగా గడచిపోయింది. కానీ నాకు అక్కడున్నంత సేపు నన్ను ఎవరైనా చూస్తే ఎలా అన్న కలవరం వెంటాడుతూనే వుంది.

తరువాత నెల రోజులకే నీరసంగా కనిపించింది. తార సంపాదనంతా లాక్కొని  సమీర్ పారిపోయాడని విని నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆరోజు తార సమీర్ ని తిట్టినన్ని తిట్లు నేను నా  జీవితంలో అప్పటివరకు వినలేదు. నవ్వుతూనే తిట్టేది. కళ్ళల్లో దిగులు కన్నీళ్లను కనిపించకుండా అవసరం లేనిది కూడా మాట్లాడేది అప్పటినుంచి. ఇన్నాళ్ళూ ఎంత అమాయకత్వం, నిజం ధ్వనించేదో అంత నటన కనిపించడం ప్రారంభించింది తనలో. తనేమిటో పూర్తిగా అర్థం చేసుకున్న నాకు తన ప్రవర్తన అసహజంగా కనిపించడానికి ఎంతోసేపు పట్టలేదు.  తార కలలన్నీ కరిగిపోయాక మళ్ళీ వొంటరిగా రోడ్డుమీద నిలబడింది.

ఈ ఆడపిల్లలంతా ఇంతేనా? కలల్లో జీవించడం …వాస్తవాలు తెలిసే సరికి జరిగిపోయిన తప్పిదాన్ని సరిదిద్దలేని పరిస్థితిలో పడిపోవడం…మానసికంగా కృంగిపోయి దాన్నుంచి బయటకు రాలేక పోవడం.  తార మరింత బలహీనంగా కనిపిస్తోంది నాకిప్పుడు.  తన జీవితం గురించి పూర్తిగా తెలిసిపోయాక తార స్నేహం పట్ల నాకు ఆసక్తి తగ్గడం ప్రారంభించింది.

దాంతో పాటూ ఇంకో భావన. అసలు తను పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎలా?తను ఆడదానిగా మారడానికి ప్రయత్నించినంత మాత్రాన ఆడదై పోతుందా? అసలు తార ఇలా ఆలోచించడమే తప్పు కదా! అందుకే ఇలా జరిగిందని అనుకునేదాన్ని. వాళ్ళ జీవితాలు అలాగే ఉండాలి అనుకునేదాన్ని కూడా!

ఇవ్వన్నీ జరిగాక తార చంద్రిక దగ్గరికి రావడం కూడా మానేసింది. తన ప్రాజెక్టు ఫండింగ్ ఆగిపోవడంతో తార వుద్యోగం కూడా పోయింది. అయినా తను నన్ను మర్చిపోకుండా  ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడేది.

mandira1

art: Mandira Bhaduri

తరువాత కొద్దిరోజులకు తెలిసింది నాకు…తను డబ్బుకోసం ట్రాఫిక్ సిగ్నళ్ళ దగ్గర అడుక్కుంటూ వుందని … రాత్రిళ్ళు వొళ్ళమ్ముకుంటుందని. నా మనసు విరిగిపోయింది. తనకేదయినా సహాయం కావలిస్తే నన్ను అడగొచ్చు కదా? ఇలాంటి నీతిమాలిన పనులు చెయ్యడం దేనికి? ముందు నుంచి తను ఇలాగే ప్రవర్తించేదేమో! అందుకే తన ఇంట్లో వాళ్ళు తరిమేసి వుంటారు. తనకు ఇవ్వన్నీ తెలియకుండా తారతో ఇన్నిరోజులు మంచిగా మాట్లాడేసింది.  ఇక ఈ స్నేహం కొనసాగుతుందా? సమాజాన్ని ఎదిరిస్తూ, మర్యాదలేని పనులు చేస్తూవున్న తారతో తను మాట్లాడ్డం ఎవరికైనా తెలిస్తే తన గురించి ఏమనుకుంటారు? ఇక తనతో మాట్లాడ్డం తగ్గించేయాలి. వీలైనంత దూరంగా వుంటేనే తనకు గౌరవం. … ఇలా తార గుర్తొచ్చిన ప్రతిసారీ మనసుకు సమాధానం చెప్పుకునేది.

చాల రోజుల తర్వాత ఒకసారి తార పదే పదే ఫోన్ చెయ్యడంతో మాట్లాడక తప్పలేదు.  మామూలుగానే మాట్లాడేసింది. తను చెప్తోంది. బాగానే వున్నా మేడం..మిమ్మల్ని చూడాలని అనిపిస్తోంది. ఇప్పటివరకు నాతో మీ అంత ప్రేమగా ఎవరూ మాట్లాడలేదు. అస్సలు మనిషిలా కూడా చూడలేదంటే నమ్మండి. మీరు చాలా మంచివాళ్ళు …ఇలా చాలా అభిమానంగా మాట్లాడుతుంటే…ఒకవైపు ఆ పొగడ్తలకు పడిపోతూనే మరోవైపు…నువ్విలా ప్రవర్తిస్తుంటే నీతో ఎవరు మాట్లాడుతార్లే అనుకుంటున్నా.

బావుండదని అడిగాను …ఏం చేస్తున్నావు? ఏమైనా డబ్బుకావాలా …ఇబ్బంది పడుతున్నావా? అని

పర్వాలేదు మేడం..సర్దుకుంటున్నా అంది.

వొళ్ళమ్ముకుని సర్దుకున్నావా  అడగబోయి మానేశాను. నాకు తెలుసు తన సంపాదన ఎలా వుందో. ఇంక అడగడం దేనికి.  సరేనని ఫోన్ పెట్టేశాను. కానీ పదే పదే తనే గుర్తొస్తోంది. కలుద్దామంటే ఎక్కడ కలవాలి. తన భర్తకు తార గురించి తెలుసు. తనతో నీకేంటి మాటలు అన్నాడుకూడా ఓసారి. ఒకసారి కలిసి మాట్లాడుదామంటే,మంచి మాటలు చెబుదామంటే రోడ్డుమీద ఎలా కలవడం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు. దాంతో నేరుగా కలవాలన్న ఆలోచనను ఉపసంహరించుకుంది.

 

క్రమంగా అప్పుడప్పుడు మాత్రం లీలగా గుర్తొచ్చేది. ఎలా వుందో అనిపించేది. తార కూడా ఈమధ్య ఫోన్ చేయడం తగ్గించేసింది. తను ఫోన్ తియ్యకుంటే ఏం చేస్తుంది మరి. ఆ బొంగురు గొంతు వింటేనే చిరాగ్గా ఉంది. తొలినాళ్ళలో తారను కలిసినప్పుడు కలిగిన ఉత్సాహం ఇప్పుడు కొంచెం కూడా లేదు. తార కాస్త పద్దతిగా ఉండుంటే స్నేహం కొనసాగేదేమో. పద్దతంటే ? మనసు అడుగుతోంది. సమాధానం తనకూ తెలియదు. తారను అసహ్యించుకోవడం తప్ప. తన  గురించి మొత్తం తెలిసిపోయాక ఇక తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కడుంటుంది అయినా? వీళ్ళంతా ఇంతే అనిపిస్తోంది.

కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది. తియ్యాలని లేదు. కానీ తనేమైందో  తెలుసుకోవాలన్న కోరిక.. ఒక రకంగా చెప్పాలంటే …ఎదుటివాడి జీవితంపై ఉన్న ఆసక్తి… ఫోన్ తీశాను. ఈసారి తను సాయం అడిగింది. డబ్బేమో అనుకున్నాను. కానీ ఎక్కడైనా వుద్యోగం ఇప్పిస్తారా అని అడిగింది.. తార డిగ్రీ వరకు ప్రైవేటుగా చదువుకుంది సరే… కానీ తనకు ఎవరు వుద్యోగమిస్తారు. గొంతులో ఏదో అడ్డుపడ్డ భావన. నేను చెయ్యగలనా? అందుకే వెంటనే చెప్పాను….

చూడు తారా నీకు కొంచెం డబ్బు కావలిస్తే సర్దగలను …ఉద్యోగమంటే ఎవరికి చెప్పను …నాకంత సామర్థ్యం లేదు అని.

కొంచెం నిరుత్సాహపడింది.

ప్రయత్నిస్తానని చెప్పాను. కానీ మనస్ఫూర్తిగా సహాయం చెయ్యాలని లేదు. తనకు బాగా పరిచయమున్న ఇద్దరు ముగ్గురిని మాత్రం అడిగింది. సరే అన్నవాళ్ళంతా తార ఇంటర్వ్యూ కి వెళ్ళగానే, తనను చూడగానే మనసు మార్చుకున్నారు. తనకు పని తెలియదని ఒక్కరంటే….తనలాంటి దాన్ని ఆఫీసులో కూర్చోబెడితే ఏమవుతుందో అన్న భయాన్ని మరొకరు ప్రకటించారు.  ఇది నాకు ముందే తెలుసు.

తారతో అదే విషయాన్ని చెప్పాను. తను చేస్తున్న పనుల వలన చెడ్డపేరు వొచ్చిందని …అవన్నీ మానెయ్యమని  సలహా కూడా ఇచ్చాను.  పగలబడి నవ్వింది. తార గుర్తొచ్చినప్పుడంతా ఆరోజు ఆమె అన్న మాటలు ఇప్పటికీ నా చెవిలో వినిపిస్తూనే వుంటాయి.

“మేడం…ఇన్ని రోజులనుంచి మనిద్దరం స్నేహితులం కదా ….రోడ్డులో కనీసం మీరు నా పక్కన నడవగలరా… ఎక్కడైనా కనిపించి పలకరిస్తే మాట్లాడగలరా…కనీసం ఒక్క రోజైనా మీ ఇంటికి ఆహ్వానించగలరా? నన్ను సమాజం స్వీకరించదు. మీరు నాగురించి ఇంత ఆలోచిస్తారు కదా!  మరి ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి పిలవలేదేం? మీ ఇంట్లో వాళ్లకు, పక్కింటోల్లకు పరిచయం చెయ్యలేదేం ? అంతెందుకు ..మొన్న బస్టాండులో నేను కనిపిస్తే చూడనట్టు మీరు మొహం తిప్పుకుని వెళ్లిపోలా ?” తార  ప్రశ్నించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో చెప్పలేని అసహనం పుడుతోంది వొంట్లో. తారతో స్నేహం చేసి తానేదో సాయం చేసినట్టు కదూ అనుకుంటోంది. మరి తననే ప్రశ్నించడమా?

“ఈ తిరస్కారం నాకు ఎప్పుడో అలవాటైపోయింది. కానీ మీరంటారు చూడూ …సమాజంలో బతకండి…సమాజపు కట్టుబాట్లలో నడవండి…అందరిలాగా గౌరవంగా నడుచుకోండి అని…ఆ కపటత్వాన్ని వదలండి. వాస్తవాలు చూడండి. నేనూ మనిషినే మేడం…కానీ మీ జీవితాల్లో నా అస్తిత్వం ఏదీ? స్వీకారం ఎక్కడా?? నాకు ఏ పనిలో బతకడానికి సాయం అందుతుందో అది దైవ సమానం. రోజంతా ఏదైనా పని చేసుకుని బ్రతకొచ్చుకదా అని నీతులు చెప్పే మగవాళ్ళు రాత్రి కాగానే వొంటరిగా కనిపిస్తే రాళ్ళేసి పిలుస్తారు. నన్ను గౌరవప్రదమైన స్థానంలో చూడాలనుకుంటే నన్ను నన్నుగా చూడగలిగే స్థాయి ఉన్నచోట ఏదైనా చిన్న వుద్యోగం ఇప్పించండి. కానీ అది మీకు ఎప్పటికీ సాధ్యం కాదు. కన్న తల్లిదండ్రులే నన్ను స్వీకరించలేక పోయాక ఇంకెవరికైనా నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎందుకుంటుంది. మీక్కూడా నేను అడుక్కోవడం, వ్యభిచరించడం మాత్రమే తెలుసు. కనీసం నాతో కళ్ళు కలపడానికి, పెంపుడు జంతువుల మీద చూపినంత ప్రేమ చూపడానికి కూడా ఎవరూ ముందుకు రారు. మేము చేసే పనిని చెడుగానే ముద్ర వేసేసింది సమాజం. నేను ఏపని చేసినా హేళనగానే చూస్తుంది. మీరు నాకు సాయం చెయ్యాలనుకుంటే నన్ను స్వీకరించండి ..కానీ నాలో తప్పుల్ని ఎత్తిచూపడం, నామీద జాలిపడటం చెయ్యకండి. నాకోసం మీరు చాలా శ్రమపడ్డారు. నాలాంటి దానితో స్నేహమేంటని కూడా కొందరికి మీపై అనుమానం వొచ్చేవుంటుంది. ఇలా పుట్టడాన్ని నేనెలా ఎంచుకోలేదో బ్రతకడానికి ఏం చేయాలో కూడా ఎంచుకోలేని అశక్తత నాది. నాలాంటి వాళ్ళు నా చుట్టూ చాలామంది వున్నారు. వాళ్ళెలా బ్రతుకుతారో నేనూ అలాగే. కాస్త భిన్నంగా వుండాలని నాకు కూడా వుండేది. కానీ సహాయం చేసేదెవరు? “ తార గొంతు మరింత బొంగురుగా మారడంతో ఫోన్ పెట్టేసింది.

తార సమాజాన్ని ఉద్దేశించే ఈ మాటలన్నా తననే అన్నట్టుంది. తను కూడా అంతేనా? విభిన్నంగా వుండే తారను స్నేహితురాలని అనుకోవడంలోనే హిపోక్రసీ ఉందా? తనది నిజమైన స్నేహమే అయితే ఆ స్నేహాన్ని నాలుగ్గోడల మధ్యే ఎందుకు ఉంచాల్సి వొచ్చింది? తన విభిన్నతను అంగీకరించిన తాను తార బ్రతుకు గడవడం కోసం ఎంచుకున్న వృత్తి పట్ల అసహ్యంతో తారను కూడా అసహ్యించుకుందా ? సహాయం చెయ్యగలిగే శక్తి వుండీ సమాజానికి భయపడి చెయ్యలేకపోయిందా ?

మరోసారి ఫోన్ మోగింది. మళ్ళీ తార. “ ఎవరేమనుకున్నా పర్లేదు మేడం. మీరు నన్ను అసహ్యించుకోకండి.  మా జీవితాలింతే. మిమ్మల్నెప్పుడూ మరిచిపోలేను. బయటెక్కడా కలవనులే ..భయపడకండి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తా..మాట్లాడండి చాలు”  చేతిలో ఫోన్ మెల్లగా కిందికి జారుతుంటే తార రూపం మళ్ళీ లీలగా ప్రత్యక్షమైంది.

ఈసారి తార అందమైన శరీరం తో పాటూ  తల్లిదండ్రులు కాళ్ళు విరిగేలా కొట్టినా మారని తన నడక గుర్తొచ్చింది. శరీరంలో వొస్తున్న మార్పులను అంగీకరించని మనసుతో  చిన్న వయసులోనే  ముంబాయికి పారిపోయిన తార తెగింపు కనిపించింది. రోజంతా ముంబాయ్ రోడ్లమీద అడుక్కుని…రాత్రిళ్ళు వొళ్ళమ్ముకుని కూడబెట్టుకున్న సొమ్ముతో తార పొందిన బాధాకర నిర్వాణ గుర్తొచ్చింది. మగ లక్షణాలను వొదిలించుకుని తిరిగి తల్లిదండ్రుల ముందుకొచ్చి కూతురిగా స్వీకరించమంటూ కాళ్ళు పట్టుకుంటే …బయటకు తోసి తలుపేసిన తార నాన్న ఆమె నుదుట చేసిన గాయం కనిపించింది. ఎన్జీవోలో వుద్యోగం చేసుకుంటూ పోగేసుకున్న రూపాయిలతో మామూలు ఆడదానిలా కుటుంబం కోసం పడిన ఆరాటంలో నిలువెల్లా మోసపోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ అబల కళ్ళముందుకొచ్చింది. కళ్ళముందు కన్నీటి పొరలోంచి తార ఆడ శరీరం కనిపించినా ఆమె మొహంలో ఛాయగా మొలిచిన మీసాలు…బొంగురు గొంతు …ఇప్పుడు మరింత ప్రస్పుటంగా  కనిపించాయి.

తార శరీరమేగా మారింది. మరి తాను…?? సాయం చేయలేక పోయినందుకు మళ్ళీ బాధగా వుంది.

*

 

 

 

మైత్రీ మకరందం  “స్నేహఫలము”

visanaa

— శివరామకృష్ణ

~

 

“మానవర్మ రాను క్రొత్తగా నిర్మించిన మహా సౌధమునకు నామకరణము చేసెను. ఆ పేరు కోట ముందు ప్రభాతోరణము మీద, మంచి రంగులతో అర్థ యోజనము దూరము కనిపించునట్లు పెద్ద యక్షరములతో చెక్కించెను.

ఆ మహా సౌధము పేరు “స్నేహ ఫలము”

 

***

 

వెయ్యి పేజీల వేయి పడగలు వచన మహాకావ్యాన్ని రచించిన విశ్వనాథ సత్యనారాయణ గారు కొన్ని చిన్న నవలలను కూడా రాసారు. నలభై పేజీల ‘వీరవల్లడు’, యాభై పేజీల ‘హాహా హూహూ’, తొంభై పుటల ‘స్నేహ ఫలము’ వాటిలో కొన్ని.

 

రాజవంశీయులైన ఇద్దరు పురుషుల మధ్య ఏర్పడిన మైత్రీ బంధం గురించి, దాని పరిణామంగురించీ విశ్వనాథ వారు చారిత్రక సత్యాలకు కొంత కల్పన జోడించి రాసిన రమ్యమైన చిన్న  నవల ‘స్నేహఫలము’. దీని చారిత్రక నేపధ్యాన్ని చూద్దాం. దక్షిణ భారత దేశాన్ని ఏలిన వారిలో ప్రముఖులు పల్లవులు. దాదాపు ఐదు వందల సంవత్సరాలపాటు పల్లవ సామ్రాజ్యం నిరాఘాటంగా వర్ధిల్లిందట. పల్లవ సామ్రాజ్యం తమిళ దేశంలో చాలా ప్రాంతాలను, కృష్ణా నదికి దిగువనున్న తెలుగు ప్రాంతాలనూ, కన్నడ ప్రాంతాల్లో కొంత భాగాన్నీ కలుపుకొని వర్ధిల్లింది. పల్లవ చక్రవర్తుల్లో మామల్ల నరసింహ వర్మ ఒకరు. ఈయన సుమారు  క్రీ. శ. 630-675 మధ్య కాంచీపురం రాజధానిగా పల్లవ రాజ్యాన్ని యేలిన మహా పరాక్రమవంతుడైన రాజు. ఈయన కాలంలో పల్లవులకూ, కాదంబ రాజు లకూ, పశ్చిమ చాళుక్యులకూ మధ్య అనేక యుధ్ధాలు జరిగాయి. పల్లవులకు ప్రధాన శత్రువు పశ్చిమ చాళుక్య రాజు రెండవ పులకేశి. అనేక మార్లు కాంచీపురంపై ఆతడు దండెత్తివచ్చినా, మామల్ల నరసింహ వర్మ పరాక్రమానికీ, ఆయన ప్రధాన సేనాని పరంజ్యోతి ధాటికీ ఆగలేక పలాయనం చిత్తగించాడు. పులకేశిని దక్షిణాపథం వైపు రాకుండా వీరు అడ్డగించారు. అంతే కాదు, చక్రవర్తి అంగరక్షకుడైన  మానవర్మ చక్రవర్తిని పలుమార్లు మృత్యుముఖం నుంచి తప్పించాడు, తనప్రాణాలను లెక్కచెయ్యకుండా. ఈ నేపధ్యంలో నడిచిన కథ ‘స్నేహఫలము’. చక్రవర్తి మామల్ల నరసింహ వర్మకు సింహళ దేశపు రాజపురుషుడు మానవర్మకు యేర్పడిన అపూర్వ స్నేహబంధమే ఈ నవలలో వస్తువు.

***

వసంత ఋతువులోని ఒక మధ్యాహ్నం పల్లవ చక్రవర్తి తన అలవాటు ప్రకారం వాహ్యాళికి బయలుదేరాడు, ఏనుగు మీద. వెంట అంగరక్షకుడు మానవర్మ ఉన్నాడు. దారిలో చక్రవర్తికి దాహం వేసింది. దగ్గరలో కనబడిన కొబ్బరితోట వద్ద ఏనుగుని నిలిపి కొబ్బరి బొండాలు కొట్టించాడు మావటి. రాజు తనకు సరిపడినత నీరు తాగి, తన వెనకనున్న మానవర్మకి బొండాన్ని ఇచ్చాడు, పారవేయమనే ఉద్దేశంతో. కాని, మానవర్మ మిగిలిన నీటిని తనను తాగమనే ఉద్దేశంతో రాజు తనకిచ్చాడని అనుకున్నాడు.

బొండమును పుచ్చుకొని మానవర్మ “ఈ రాజు నాకు మిత్రుడు. నాకాశ్రయమిచ్చినవాడు. మిగిలిన నీరు నేను త్రావవలయునని ఇచ్చెను కాబోలు. తన యెంగిలి నన్ను త్రావమనునా? రాజు ధూర్తుడు కాడు. దురహంకారి కాడు. సాధువైన సత్పురుషుడు. నాయందు మిక్కిలి ప్రేమకలవాడు. గతిలేక తన పంచన చేరిన నన్ను మిత్రునివలె, ఆంతరంగికునివలె పరిపాలించుచున్నాడు. నాయందెంత ప్రేమలేకున్నచో తా నెంగిలి చేసిన నీటిబొండమును నాకందించును? నేను దీనిని పారవేయుట దురహంకారమగును. న్యాయము కూడ కాదు. నేను యెంగిలి నీరమును త్రావినచో నాకు వ్యాధి పుట్టదు. నాకు మర్యాద భంగము లేదు” అనుకొని వెంటనే ఆ నీటిబొండాన్ని తాగుతుండగా రాజు చూశాడు.

“తాను అతణ్ణి తాగమని ఇచ్చాననుకున్నాడు కాబోలు. మానవర్మ గొప్ప వంశము నందు పుట్టినవాడు. అతడొక రాజ్యమునకర్హుడు. దినములు బాగుండక తన్నాశ్రయించినవాడు. అతనికి తనయందింత స్నేహభావమున్నదని ఇదివరకు తనకు తెలియలేదు.  తానిట్లీయగ మరొకడైనచో మనసస్సులో మిక్కిలి కోపము తెచ్చుకొనును. ఇది రాజయోగ్యమైన పనికాదు”  అనుకొని రాజు నరశింహ వర్మ వెంటనే మానవర్మ చేతిలోని బొండాన్ని తీసుకొని మిగిలిన నీటిని తాగేశాడు. మానవర్మ ఆశ్చర్యపోయాడు.

ఈ సంఘటన చూసిన మావటి ఆశ్చర్యపోయి, మానవర్మ మంచితనాన్ని, రాజు ఔదార్యాన్ని మనసులో మెచ్చుకున్నాడు. “మానవర్మ లేకుండా మహారాజు కాలు బయటపెట్టడు. మానవర్మదే అదృష్టము. ఇదివఱకు నేనెప్పుడూ చూడలేదు. మహరాజు కొంత త్రావి మానవర్మకిచ్చెను. అతడు కొంత త్రావి మరల మహారాజున కందిచ్చెను. ఇట్లు సురాపానము చేయువారు చేయుదురు. పరమ మిత్రులు చేయుదురు” అని తన పరిధిలో అనుకున్నాడు.

మానవర్మ కూడా మహారాజు యెంతటి సత్పురుషుడోనని అనుకున్నాడు. సేవకుడైన తన యెంగిలిని మళ్ళీ ఆయన త్రాగాడంటే తనని ప్రాణస్నేహితుడిగా తలచాడు కదా అనుకున్నాడు. “రెండు మూడు సార్లు నేను రాజును రక్షించిన మాట నిజమే. అది సేవకుని ధర్మము. రాజులు మెచ్చినచో ధనమిత్తురు. అధికారమిత్తురు. ప్రాణమీయరు. ఈ రాజు తన ప్రాణములు నాకిచ్చుచున్నాడు. నేనీ రాజును ఆశ్రయించి నా రాజ్యమును నేను సంపాదించుకొనవలయునని యనుకొనుచున్నాను.ఇట్టి ప్రాణస్నేహితుని వదిలిపెట్టి నేనెట్లు పోగలను?”

అప్పుడు మహారాజు కూడా ఇలా అనుకున్నాడు “ఈ నాటితో మానవర్మ నాకు పాణస్నేహితుడైనాడు. ఇతడు నా ప్రాణములను రెండుమూడు సార్లు రక్షించెను. అర్థరాత్రముల యందైన నీడ సూర్యునెడబాసి యుండును. కాని ఇతడు నన్నెడ బాయడు. రాజ్యభ్రష్టుడై నన్నాశ్రయించెను. నేను గొప్ప పదవినిచ్చితిని కాని, యతనిని రాజును చేయలేదు కదా! నేటి నుండి యతడును నేనును నా రాజ్యమున కిద్దరు రాజులము. నా మాట యెట్లు చెల్లునో నేటి నుండి యీతని మాట కూడ యట్లే చెల్లును. ఇతడు నా మీద చూపిన ప్రేమకు వేరొక విధముగా నేను కృతజ్ఞత చూపలేను. చూపకపోయిన నరకమునకు పోయెదను. ఒక ప్రాణదాతకు కృతజ్ఞత చూపుట వేరు, యెడములేకుండ ఇంతటి ప్రేమ చూపిన వానియందు కృతజ్ఞత నెఱపుట వేరు”

ఇలా అనుకొని రాజు మానవర్మని ఏనుగుమీద తన పక్కనే కూర్చోబెట్టుకొని, అతని భుజం మీద చెయ్యివేశాడు. “ప్రొద్దు వాటారిన తరువాత ఇంటికి తిరిగి వచ్చు రాజును, మానవర్మను ప్రజలిట్లు చూచిరి”

నవల మొదట్లోనే విశ్వనాథ వారు ఈ స్నేహబంధానికి బలమైన పునాది వేశారు ఈ సంఘటనతో.

 

***

 

మానవర్మ సింహళదేశ రాజకుమారుడు. యువరాజు. కొన్ని వ్యాపారసంబంధ విషయాలను పరిష్కరించడానికి మలయా దేశానికి వెళ్ళాడు.  అక్కడ ఉండగా మలయా రాజకుమారి సంఘను వివాహమాడాడు. మానవర్మ అక్కడ ఉండగానే సింహళరాజు చనిపోయాడు. మలయా రాకుమారిని పెళ్ళాడి అకార్యం చేశాడని మానవర్మపై దుష్ప్రచారం చేసి, అతని జ్ఞాతి దధోపతిస్సుడు అనే అతను సింహళ సింహాసనాన్ని ఆక్రమించాడు.  ఇది తెలుసుకున్న మానవర్మ ఖిన్నుడై, తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే బలవంతుడైన పల్లవ చక్రవర్తి అండ అవసరమని భావించి, కాంచీపురం చేరాడు. భార్యను మలయాలో పుట్టింటనే ఉంచాడు. అంతకు కొన్నేళ్ళ క్రితం అతడు కాంచీపురం లో విద్యాభ్యాసం చేసిం ఉన్నందున పరిచయమైన వారున్నారు. వారి సహాయంతో మహాసేనాని పరంజ్యోతి అనుగ్రహం సంపాదించి మహారాజు కొలువులో చేరాడు.  కొద్దిరోజుల్లోనే పల్లవ రాజ్యం మీద రెండవ పులకేశి దండెత్తి వచ్చాడు. మహారాజు, సేనాపతి  వేరొకచోట యుధ్ధంలో ఉండగా, పెద్ద శత్రువుల దండు కంచి కోట ద్వారాన్ని స్వాధీనపరచుకోడానికి వచ్చింది. అప్పటికి పల్లవ యువరాజు మహేంద్రవర్మ చిన్నవాడు. ఆ సమయంలో కోటలోనున్న మానవర్మ తన పటాలంతో కోట తలుపులు తెరిచి, శత్రుసమూహం మీద విరుచుకుపడ్డాడు. శత్రువులను ఊచకోతకోశాడు. కోటను కాపాడాడు. పులకేశి సేనలను ఓడించి రాజు, సేనాని కంచికి తిరిగివచ్చి, మానవర్మ పరాక్రమమాన్ని మెచ్చుకున్నారు. నరసింహవర్మ మానవర్మను తనకి అంగరక్షకుడిగా నియమించుకున్నాడు.

ఆ తరువాతి కాలంలో రాజుకి మానవర్మ కేవలం మహావీరుడే కాదు, సాహిత్యం, శిల్పం, జ్యోతిషం, సంగీతం వంటి కళల్లో కూడా నిష్ణాతుడని తెలిసింది.

ఇలా ఉండగా మానవర్మ చక్రవర్తి జాతకాన్ని సంపాదించి, ఆయనకున్న అనేక యోగాలను పరిశీలించాడు. ఆయనకు ఆపదలు వచ్చే కాలాన్ని పసిగట్టి చక్రవర్తిని అనేక హత్యాప్రయత్నాలనించి రక్షించాడు. ఒకసారి కాపాలికులనించి, మరొకసారి పల్లవ రాజవంశీయుడైన గోవింద వర్మ రాజుపై చేసిన చేతబడి ప్రయోగం నించి రక్షించాడు. ఈ గోవిందవర్మే రహస్యంగా మరోసారి అంత:పుర ఉద్యానం లో రాజును హత్యచేయించ డానికి పన్నిన కుట్రను కూడా మానవర్మ విఫలం చేశాడు. కాని ఎప్పుడూ తన గొప్పని చక్రవర్తి వద్ద చెప్పుకోలేదు. ఈ కారణాల వల్ల రాజుకి అభిమానపాత్రుడయ్యాడు. మరొకసారి సేనాని పరంజ్యోతి తో కలిసి రాజు చాళుక్య రాజధాని బాదామిపైకి దండెత్తుతుంటే అది తగిన సమయంకాదని వారించి, వారిని ఆపదనించి కాపాడాడు.  మొదట పరంజ్యోతి, తనవల్ల రాజు వద్ద చేరిన మానవర్మ రాజునే శాసిస్తున్నాడని విసుగు చెందినా, మానవర్మ ప్రవర్తన చూసి ” అతనికి గర్వము లేదు. అహంకారము లేదు. అతనికవి యుండవలసిన యవసరమునూ లేదు. అతడొక రాజ్యమున కధిపతి. మఱియొక యల్పునకు వచ్చిన యధికారము వలె అతనికి ఈ యుద్యోగము గర్వహేతువు కాదు” అనుకొని మానవర్మ పట్ల స్నేహంతో ఉన్నాడు.   మరొక సందర్భంలో పరంజ్యోతి “ఆతని యందు రాజు యొక్క మైత్రి ఆతని నహంకార కలుషితుని చేయక, పరమ సుకుమారభావుని, ఆర్ద్ర మనస్కుని చేసెను. సత్పురుషులిట్లుందురు కాబోలు” అని అనుకున్నాడు.

యుధ్ధాలు సమసి, శాంతి నెలకొన్న కొన్నాళ్ళకి, చక్రవర్తి మానవర్మతో మలయా దేశంలో ఉన్న అతని భార్యని కాంచీపురానికి తీసుకురమ్మని చెప్పాడు. తాను చక్రవర్తి ఆజ్ఞను తిరస్కరించలేడు కనుక, మానవర్మ సంఘని కాంచీపురం రప్పించాడు. ఆమె వచ్చి, తన సత్ప్రవర్తన చేత చక్రవర్తికి, పట్టపురాణికీ అత్యంత ప్రీతిపాత్రురాలయింది. మహాసేనాని పరంజ్యోతి కూడా ఆమెని తన కుమార్తెగా ఆదరించాడు.  మానవర్మకి తన కోట అంతటి మరో మహాసౌధాన్ని నివాసంగా సమకూర్చాడు చక్రవర్తి.

 

మరికొన్నాళ్ళకి గత పరాజయానికి  ప్రతీకారం తీర్చుకోవాలని చాళుక్య రాజు పులకేశి తన రాజ్యం లోని ఒక మండలానికి అధిపతైన వల్లభుడు అనే మొరటువాడైన మహావీరుడిని కాంచీపురంపైకి పంపాడు. పల్లవరాజు నరసింహవర్మని కడతేర్చడమే వల్లభుడి పని. ఆ సమయంలో సేనాని రాజ్యం లో లేడు. యువరాజుని, మానవర్మని కోట రక్షణకి ఉంచి, చక్రవర్తే బయలుదేరాడు వల్లభుడితో యుధ్ధానికి. కాని రాజుకి రానున్న ఆపదని ఊహించిన మానవర్మ, ఆయనకి తెలియకుండా బయలుదేరి, యుధ్ధంలో రాజు అత్యంత ప్రమాద పరిస్థితిలో ఉన్న సమయంలో వల్లభుడి మీద విరుచుకుపడి అతన్ని పరాజితుడిని చేసి, బంధించి, తన రాజుని రక్షించుకున్నాడు. “మానవర్మ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్నాడు. భార్యను కూడా తెచ్చుకున్నాడు. ఆమె గర్భవతి. ఐనా, తనయాజ్ఞను ఉల్లంఘించి కూడా కోటను విడిచివచ్చి తనను రక్షించిన విధానము ఆతని నిజమైన స్నేహశీలతకు గుర్తు”  అని చక్రవర్తి ఆనందించాడు.  “మానవర్మ లేకున్న తాను చక్రవర్తి కాడు”

 

చక్రవర్తి నరసింహవర్మ విజయోత్సవ సభ చేసి, వీరసైనికులను సత్కరించాడు. తరువాత ఆయన మానవర్మ పరాక్రమాన్ని కొనియాడి, ప్రజలతో  “నేను జీవితములో అతనికి ఋణపడి యున్నాను. లోకములో కృతజ్ఞత యన్న గుణము సులభ్యము కాదు. రాజులయందది మృగ్యము. రాజు తన సేవకుడు తన కుపకారము చేసినచో అది వాని ధర్మమనుకొనును. అట్లు చేయుట వాని విధి యనుకొనును.  ఇట్టి  దుష్టలక్షణము రాజులయందుండును. కృతఘ్నుడు నరకమునకు పోవును. మీరు నా ప్రజలు….నా కృతజ్ఞత మానవర్మకు చూపించవలెనన్న నేనేమి సేయవలయునో మీరే చెప్పుడు” అన్నాడు. అప్పుడు సేనాని పరంజ్యోతి “మానవర్మ రాజ్యము మానవర్మకిప్పించుట యొక్కటియే మహారాజు కృతఘ్నలోకములకు పోకుండ చేసెడిది. ఆ సైన్యములను నేను నడిపించుకొని పోయెదను” అన్నాడు.

మానవర్మ మహారాజుకి నమస్కరించి, ” పరంజ్యోతి దయామయులు. ఆయన నా భార్యకు పెంపుడు తండ్రి వంటివారు. అందుచేత నా మీద అంత దయ చూపించుచున్నారు. మహారాజు యొక్క అనుజ్ఞ యైనచో నేను నా దండు నడుపుకొనగలను. నేనే దండయాత్ర పోవలయును. నేనే నా రాజ్యమును సంపాదించుకొనవలయును.” అన్నాడు.

 

అనంతరం మానవర్మ సింహళం పైకి దండెత్తి వెళ్ళాడు. మొదటి సారి ఆ దేశాన్ని వశపచుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా, మరొకసారి ప్రయత్నించి, దధోపతిస్సుని ఓడించి, తన రాజ్యాన్ని తాను సాధించుకున్నాడు. మానవర్మ తన దేశం లో వ్యవసాయాన్ని వృధ్ధి చేశాడు. భారత దేశంతోనూ, మలయా తదితర ద్వీపాలతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. సర్వమతాలనూ అభిమానిం చాడు. ప్రజలు అధికులు బౌధ్ధులు కనుక ఆ మతాన్ని ప్రోత్సహించాడు.

సింహళ రాజభవనం అంతకుముందు సామాన్యంగా ఉండేది. దాని బదులు కంచిలోని  వైకుంఠపెరుమాళ్ళు కోవెల వంటి రాజభవనాన్ని నిర్మించాడు. దాని పేరే “స్నేహఫలము.”

 

***

 

ఈ నవలలో కథాసంధర్భంలో విశ్వనాథవారు పలుచోట్ల హృదయానికి హత్తుకునే మాటలు రాశారు.

“మధురమైన సంగీతము వినుచు, శాస్త్రములు, కవిత్వములు నిత్యాభ్యాసము చేయుచు, హృదయమునందు పరమ సుకుమారుడైన మనుష్యునకు ఇట్టి ధ్వనులు (మనకు తెలియకుండా చెవుల్లో పడే పక్షి కూజితాలు మొదలైనవి) వినిపించును. ఆలోచన లేని వాని కేవియు వినిపించవు.”

“అందరును మనుజులే కాని వారిలో కొందరు రాక్షసులు. కొందరు దేవతలు.  రాక్షసాంశ కలవారును మానవులవలెనే కనిపింతురు.”

ఇంకా ప్రాస్తావికంగా బౌధ్ధ మతం గురించి, కాపాలిక మతం గురించీ కూడా వివరించారు. పల్లవుల నాటి దాక్షిణాట్య సంగీతానికీ, మలయా దేశపు సంగీతానికీ భేదాలను వివరించారు తన సంగీత శాస్త్ర పరిజ్ఞానంతో. ఈ వ్యాసంలో ఎక్కువగా తెలపని గోవిందవర్మ రాజవంశంవాడైనా, సకల భ్రష్టుడై దొమ్మరి వాళ్ళతోనూ, కాపాలికులతోనూ తిరిగి, ఆ రోజుల్లో ప్రాచుర్యంలో ఉన్న ప్రయోగ విద్య (చేతబడి) నేర్చుకున్న వైనం, గొడగూచి అనే ఒక నాట్యకత్తె రాజు ముందు నాట్యం చేసే సమయం లో ఆయనపై ప్రయోగం చెయ్యడానికి కుట్రపన్నడం, దాన్ని మానవర్మ భగ్నం చెయ్యడం చాలా ఆసక్తికరంగా చెప్పారు విశ్వనాథ.   ఆ సమయంలో రాజు “నాకు  రాబోవు సకలాపదలను నీవు ముందు చూతువు. వానికి ప్రతిక్రియలాలోచింతువు. నీవు దీనినెట్లు పసిగట్టితివి?” అని అడుగుతాడు ఆశ్చర్యపడుతూ.

 

ఒకరు ఒక మహా సమ్రాజ్యానికి చక్రవర్తి. మరొకరు ఒక రాజ్యానికి వారసుడైనా విధి వశాన ఆ చక్రవర్తి కొలువున చేరిన వ్యక్తి. వీరిద్దరి మధ్య నెలకొన్న మైత్రి ఎంతో గొప్పగా వర్ణించారు విశ్వనాథ. చక్రవర్తి దయకు మానవర్మ ప్రతివచనం చాలు వీరిద్దరి ఆత్మీయతను, హృదయాలనూ ఆవిష్కరించడానికి:

 

“మహామల్లుడా, నేనిది వరకు తమ సద్గుణములకు, తమరికి నా యందుగల కృపకు మనస్సులో బానిసనై యున్నాను. మరియు అధికమైన దయ చూపించినచో మనుష్యుడైనవాడు బానిస యగుటకంటె తక్కువ స్థితి యేమి పొందగలడు? నా యందు తమరికి ఎంత ప్రేమయున్నను నన్ను తమ యంగరక్షకునిగా నుంచుకొనుటయే నాకు చేసెడి మహోపకారము. తమ యేనుగు మీద నన్ను తమ ప్రక్కన గూర్చుండ బెట్టుకొనుటకంటె అధికమైన గౌరవ మేమి చేయవలయును?”

 

ఏకబిగిని చదివించే మంచి నవల ‘స్నేహఫలము’

 

*

 

చీకటి మరకల ఉదయం

 

 -ఫణీంద్ర

~

 

1

 

కుక్కర్ మూడో కూత వేసింది! అప్పటికే టిఫిన్ చెయ్యడం పూర్తి చేసి, ఆఫీసుకి వెళ్ళే శ్రీవారికీ, స్కూలుకి వెళ్ళే కూతురుకీ ఆ రోజు వేసుకోవాల్సిన బట్టలు తీసిపెడుతున్న సుభద్ర వెంటనే బెడ్రూంలోంచి వంటింట్లోకి వచ్చి స్టవ్ ఆఫ్ చేసింది. ఏ పనిలో ఉన్నా చెవిని కుక్కర్ కూతలపై వేసి లెక్కతప్పకుండా మూడో కూత తరువాత ఠక్కున కట్టేసే ప్రజ్ఞ ఆమె సొంతం! కూతురూ, భర్తా హడావిడిగా రెడీ అయ్యే లోపు ఆమె వేడి వేడి టిఫిన్ టేబుల్ మీద సిద్ధంగా పెట్టి, లంచ్ బాక్సులు కూడా కట్టి ఉంచింది. ఏ రోజూ టైముకి రెడీ అవ్వని భర్తనీ, ఆ లక్షణమే పుణికిపుచ్చుకుని పుట్టిన పదేళ్ళ కూతురునీ చూసి ఆమె రోజూలానే ఓ చిరునవ్వు నవ్వుకుంది! భర్తనీ, కూతురునీ సాగనంపాక ఆమె చిక్కటి కాఫీ పెట్టుకుని వరండాలోకి వచ్చి, కుర్చీలో కూర్చుని, తాను మురిపెంగా కుండీల్లో పెంచుకుంటున్న పూలమొక్కల్ని చూస్తూ వేడి కాఫీని ఆస్వాదిస్తోంది. ఇలా రోజూ తనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని రిలాక్స్ అవ్వడం ఆమెకి అలవాటు.

అది పూణే నగరంలో మూడంతస్తుల ఇల్లు. కింద ఇంటి ఓనర్లూ, రెండో అంతస్తులో అద్దెకి సుభద్రా వాళ్ళూ ఉంటున్నారు. ఇల్లు పాతదే కానీ, ఇంటి చుట్టూ పచ్చదనం, రెండో అంతస్తులో పెద్ద వరండా ఉండడంతో ముచ్చటపడి ఈ ఇల్లే అద్దెకి తీసుకోమంది, భర్తకి ఇంకో కొత్త అపార్ట్‌మెంటు నచ్చినా.  వరండాలో ఓ మూలకి ఉన్న మెట్లెక్కి వెళితే మూడో అంతస్తులో ఒక చిన్న సింగిల్ రూం ఉంటుంది, మిగతా అంతా ఖాళీ జాగా.  ఓ నెల క్రితం వరకూ ఓ తమిళ అమ్మాయి ఉండేది అక్కడ. సుభద్ర తరచూ రాత్రివేళ మేడ పైకి వెళ్ళి వెన్నెలని ఆస్వాదిస్తూ ఆ అమ్మాయితో కబుర్లు చెప్పేది. ఆ అమ్మాయి ఖాళీ చేశాక ఎవరో కుర్రాడు వచ్చాడు.

కాఫీ తాగుతూ పూలమొక్కల కేసి చూస్తున్న సుభద్రకి మేడ మెట్ల దగ్గరగా ఉన్న పూలకుండీల మధ్య ఓ మడత పెట్టిన కాయితం కనిపించింది. తీసుకుని చదివితే ఏదో కవిత –

నీకు పడ్డ మూడు ముళ్ళు

మన ప్రేమకి పడ్డ శాశ్వత సంకెళ్ళు

నీ పెళ్ళిమంటపాన ఆ అగ్నిహోత్రం

చితిమంటలపాలైన మన ప్రేమకి సాక్ష్యం

నీపై వాలే అక్షింతలు

మన ప్రేమసమాధిపై రాలే పూలు

చెలీ తెలుసుకో

నీ కళ్యాణ వైభవం

మన కన్నీటి తోరణం

ఆ మంగళ వాద్యం

మన గుండెల ఆర్తనాదం

 

ప్రేమ వైఫల్యపు బాధ నిండిన ఈ కవిత కొత్తగా వచ్చిన కుర్రాడు రాసిందే అయ్యి ఉండాలి అనుకుంది సుభద్ర. అతను తెలుగు వాడే అన్నమాట! కుర్రాడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిలానే ఉంటాడు. ఉదయం రెడీ అయ్యి ఆఫీసుకి వెళ్ళడం చాలా సార్లు చూసింది కానీ ఎప్పుడూ పలకరించలేదు. అతని వాలకం ఏదో తేడాగా అనిపించేది. ఓ నవ్వూ, ప్రశాంతత లేకుండా ఎప్పుడూ నిర్లిప్తంగా కనిపిస్తాడు. ఈ నెలరోజుల్లో ఒక ఫ్రెండు రావడం కానీ, ఓ పార్టీ చేసుకోవడం కానీ చూడలేదు. ఎవరితో కలవకుండా, మౌనంగా తనపని తాను చేసుకునే రకం కాబోలు! ఆ కవిత చదివాక అతని తీరుకి కారణాన్ని కొంత ఊహించగలిగింది. అతన్ని కలిసి మాట్లాడాలనిపించింది ఒక్కసారిగా సుభద్రకి. ఆఫీసుకి లేటుగా వెళతాడు కాబట్టి రూంలోనే ఉండి ఉంటాడు.

 

 

2

 

ఉదయ్‌కి మనసంతా చికాగ్గా ఉంది. అతనిలో నిత్యం రగిలే బాధకి సంకేతంగా నిప్పుల కొలిమిలాంటి సూర్యుడు ఆ రోజూ ఉదయించాడు. అతని భారమైన జీవితానికి ఇంకో రోజు జతకలిసింది. బతకడానికి డబ్బు కావాలి కాబట్టి ఓ ఉద్యోగం, ఆ ఉద్యోగానికి వెళ్ళడం కోసం ఓ మామూలు మనిషిలా కనిపించాలి కాబట్టి అలా ఉంటాడు కానీ తను ప్రాణంగా ప్రేమించిన వర్ష దూరమయ్యాక అతను మామూలుగా లేడు, ఎప్పటికీ కాలేడు. నిన్న వర్ష పెళ్ళిరోజు, అతని గుండె పగిలిన రోజు! సంవత్సరం క్రితం మనసుకైన ఆ శాశ్వత గాయానికి రోదనగా అతను రాసుకున్న కవిత ఒకసారి మళ్ళీ బయటకి తీసి చదువుకున్నాడు. కవిత అతనికి అక్షరం అక్షరం గుర్తుంది కానీ ఆ పాత కాయితం ఓ సజీవ స్మృతి. అందుకే ఆ కవితను బైటకి తీసి, కాయితాన్ని తాకి చూసి, మళ్ళీ జ్ఞాపకాల్లో మునిగాడు. అతనికి కన్నీళ్ళు రాలేదు, ఆ స్థితి ఎప్పుడో దాటిపోయాడు. చెమ్మంటూ ఉండడానికి ముందు మనిషై ఉండాలి, అతనిలో మనిషితనం ఎప్పుడో చచ్చిపోయింది. కాదు ఈ సంఘమే చంపేసింది అంటాడు అతను. కవిత చదివాక జేబులో పెట్టుకుని ఆఫీసుకెళ్ళాడు. రోజంతా కుదిరినప్పుడల్లా తీసి చదువుకుంటూ ఉన్నాడు. కానీ రాత్రి రూంకి వచ్చి చూసుకుంటే లేదు, ఎంత వెతికినా కనిపించలేదు.

బాధపడుతూ, తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ రాత్రంతా గడిపాడు. తనకి ప్రియమైనవి ఎందుకు దూరమైపోతాయో అతనికి అర్థం కాలేదు. తీవ్రమైన నిరాశ అతన్ని ఆవహించింది. జీవితం నరకమే, మళ్ళీ రోజుకో కొత్తశిక్షా? ఇలా చస్తూ  బ్రతికే కంటే చావడమే మేలని చాలా సార్లు అనిపించింది. కానీ ధైర్యం చాలలేదు. ఆ ధైర్యమే ఉండుంటే పెద్దలనీ సంఘాన్నీ ఎదిరించి వర్షని దక్కించుకునే వాడేమో.

అతను ఈ ఆలోచనల్లో ఉండగా ఎవరో తలుపు తట్టారు. తన రూంకి ఎవరొచ్చుంటారా అని ఆశ్చర్యపడుతూ తలుపు తీశాడు. ఎదురుగా కింద పోర్షన్‌లో ఉండే ఆవిడ కనిపించింది. రెండు మూడు సార్లు చూశాడు ఆమెని. తన జీవితాన్ని అపహాస్యం చేస్తూ విరబూసినట్టుండే పూలమొక్కల్ని పెంచేది ఆవిడే కదా! “ఎందుకొచ్చారు” అన్నట్టుగా చూశాడు.

“మేము కిందే ఉంటాం. నా పేరు సుభద్ర. ఊరికే పలకరిద్దామని వచ్చాను, నిన్ను చూస్తే మా తమ్ముడిలా అనిపించావ్…”

ఈ పూసుకున్న నవ్వులూ, పలకరింతల ఫార్మాలిటీస్ అతన్ని మభ్యపెట్టలేవు. ప్రస్తుతం ఎవరితోను మాట్లాడే మూడ్ కూడా లేదు.

“మీరు తమ్ముడూ అని వరస కలిపారని, నేను మిమ్మల్ని అక్కా అని పిలవలేను. నాకు వరసల మీదే కాదు, మనుషుల మీద కూడా నమ్మకం లేదు! క్షమించండి!”  – సాధ్యమైనంత మర్యాదగా చెప్పే ప్రయత్నం చేశాడు.

సుభద్ర అతని ముక్కుసూటి సమాధానానికి కొంత ఆశ్చర్య పడుతూనే ఏ మాత్రం తొణక్కుండా –

“నాకూ మనుషుల మీద నమ్మకం లేదు! కానీ నేను మనిషినన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే  పలకరిద్దామని వచ్చాను. ఇరుగుపొరుగు వాళ్ళం కదా, చేదోడువాదోడుగా ఉండడానికి నమ్మకాలూ అవీ అవసరమా?”

ఓ మామూలు గృహిణిలా కనిపించే సుభద్ర నుంచి అలాంటి సమాధానం ఊహించలేదు అతను. అతని అహం కొంచెం దెబ్బతింది. అది తెలియనివ్వకుండా –

“అవసరాల మీద ఏర్పడే సంబంధాలు నాకు అవసరం లేదు. మీ ఆప్యాయతకు థాంక్స్!” అన్నాడు.

సుభద్ర చిరునవ్వు నవ్వుతూ  –

“చాలా చదువుకున్న వాడివిలా ఉన్నావయ్యా! ఏవో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నాకవన్నీ తెలియవు. కానీ తెలిసిన ఒక విషయం ఏమిటంటే కోరుకున్నది పారేసుకోకూడదు, పారేసుకున్నదాన్ని కోరుకోకూడదు”

అతను అర్థం కానట్టు చూశాడు. సుభద్ర అంతవరకూ అతనికి కనిపించకుండా చేతిలో మడతపెట్టి పట్టుకున్న కవిత ఉన్న కాయితాన్ని తీసి ఇస్తూ –

“వెళ్ళొస్తాను. ఏదైనా కావాలంటే మొహమాటపడకు. నన్ను అక్కా అని పిలవక్కరలేదులే!” అని కిందకి దిగివెళ్ళిపోయింది.

అతను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. వెంటనే తేరుకుని ఆనందంగా కాయితం కేసి చూసుకున్నాడు. ఎప్పటిలానే వర్ష స్మృతుల్లో గడిపాడు మిగిలిన రోజంతా.

 

3

 

ఈ సంఘటన జరిగాక, ఆ కుర్రాడి కథ ఏమయ్యుంటుందా అని సుభద్ర చాలా సార్లు ఆలోచించింది. కొద్ది రోజుల తరువాత ఓ ఉదయం సమాధానం సుభద్ర ఇంటి తలపు తట్టింది. ఆ రోజు సుభద్ర ఇంటి పనుల్లో ఉండగా మేడపై నుంచి ఏదో వాగ్వివాదం వినిపించింది. ఎవరొచ్చారో ఏమయ్యుంటుందో అని సుభద్ర అనుకుంటూ ఉండగానే ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఎవరో పెద్దాయన, అరవై ఏళ్ళ వయసుంటుందేమో. నీరసంగా, ఏదో పెద్ద బరువు మోస్తున్నట్టు భారంగా ఉన్నాడు.

“అమ్మా! కొంచెం మంచినీళ్ళు ఇస్తావా?”

“అయ్యో! తప్పకుండా! లోపలికి రండి” అంటూ సుభద్ర ఆహ్వానించింది.

మంచినీళ్ళు తాగి ఆయన కొద్ది సేపు ఏమీ మాట్లాడలేదు. సుభద్రా ఆయన్ని కదపలేదు. ఎదుట మనిషి మనస్థితిని గుర్తించి మసలడం ఆమెకి ఉన్న సుగుణాల్లో ఒకటి. కొద్దిసేపటికి కన్నీళ్ళని దిగమింగుకుంటూ ఓ నిట్టూర్పు విడిచి గొంతువిప్పాడాయన –

“చాలా థాంక్సమ్మా! మీ ఇంటి తలుపు మీద తెలుగు అక్షరాలు కనిపించి మీరు తెలుగువాళ్ళే అయ్యుంటారనిపించింది. నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. బాగా అలిసిపోయాను. కాస్త సేదతీరాలనిపించి మీ తలుపు తట్టాను. ఏమీ అనుకోకు. వెళ్ళొస్తానమ్మా!”

“పెద్దవారు మీరు అంతలా చెప్పాలా? మనుషులమన్నాక గ్లాసెడు మంచినీళ్ళూ, కాసింత కన్నీళ్ళూ పంచుకోవడం కూడా పెద్ద సాయమేనా? కాస్త నడుం వాల్చి భోజనం చేసి వెళ్ళండి”

సుభద్ర ఆదరణకి ఆయన కరిగిపోతూ  –

“లేదమ్మా నేను వెళ్ళాలి. నీది మంచి మనసు. పరిచయం లేకపోయినా ఆత్మీయురాల్లా ఆదరిస్తున్నావు. బాధ పంచుకుంటే తగ్గుతుందంటారు, నీతో నా బాధ చెప్పుకోవాలనిపిస్తోంది. మీ మేడపైన ఉన్నవాడు నా కొడుకమ్మా! ఏకైక సంతానం. పేరు ఉదయ్. మాది మునగపాక అని వైజాగ్ దగ్గరలో ఉన్న చిన్న ఊరు. మాపైన కోపంతో సంవత్సరం క్రితం నుంచీ దూరమయ్యాడు. ఎంతో కష్టపడి ప్రయత్నిస్తే ఈ పూణే నగరంలో వాడు ఉండొచ్చని తెలిసి వచ్చాను. ఈ ఇంటి అడ్రస్సు పట్టుకోవడానికి రెండు రోజులు పట్టింది.

మేము కలిగిన వాళ్ళం, మా ఊర్లో మాకు చాలా పరపతి ఉంది. వాడికెప్పుడూ లోటు చెయ్యలేదు. అయితే చిన్నప్పటి నుంచీ వాడి లోకంలో వాడు ఉండేవాడు. అదో రకం మనిషి, ఎవరితోనూ కలిసేవాడు కాదు, ఒక్క స్నేహితుడూ లేడు. ఇంట్లోనూ మాటలు తక్కువ. ఎప్పుడూ వాడి రూములో వాడు ఏవో పుస్తకాలు చదువుకుంటూ, ఏదో రాసుకుంటూ ఉండేవాడు. పోనిలే అందరి కుర్రాళ్ళలాగ అల్లరిచిల్లరగా తిరక్కుండా ఇంటిపట్టునే బుద్ధిగా ఉంటున్నాడు అనుకున్నాను. అనకాపల్లిలో ఇంటర్మీడియట్ వరకూ చదివాక ఇంజనీరింగ్ చదువుతానని బిట్స్ పిలానీకి వెళ్ళాడు. అది చాలా మంచి కాలేజీ అట! నాకు ఈ చదువుల గురించీ కాలేజీల గురించీ పెద్ద తెలీదు. నాకు తెలిసిందల్లా మా చిన్న ఊరు, అక్కడి మా కులగౌరవం, ధనగర్వం ఇవే! పెద్దరికం పేరుతో మా పాతతరం వెంటతెచ్చుకున్న బరువులు ఇవేగా! మా ఊరునుంచి వాడు దూరంగా వెళ్ళడం ఇష్టం లేకపోయినా సరే అన్నాను.

ఆ కాలేజీలో చేరాక వాడిలో మార్పు కనిపించసాగింది. సెలవలకి ఇంటికి వచ్చినప్పుడు కాస్త నవ్వుతూ కబుర్లు చెప్పేవాడు మాతో. వాడు మామూలు మనిషౌతున్నందుకు మేము ఆనందించాం, ముఖ్యంగా వాడి అమ్మ. దానికి వాడు ఎలా బతుకుతాడో అని ఎప్పుడూ బెంగ ఉండేది.  నాలుగేళ్ళ తరువాత చదివి పూర్తయ్యి మంచి ఉద్యోగం వచ్చింది వాడికి బెంగళూరులో. ఇంకేముంది త్వరలో గొప్ప కట్నంతో మా కులానికి చెందిన అమ్మాయితో ఘనంగా పెళ్ళిచేసేద్దాం అనుకున్నా! కాని వాడొచ్చి ఎవరో అమ్మాయిని ప్రేమించాను అన్నాడో రోజు. ఆ అమ్మాయి మా కులం కాదు, వాళ్ళకి పెద్ద ఆస్తిపాస్తులూ లేవు. దాంతో నేను పెళ్ళి కుదరదని ధిక్కరించా. అహంకారంతో ఆ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి నానామాటలు అన్నా. వాళ్ళకీ ఈ ప్రేమ విషయం తెలీదు, వాళ్ళూ నాలా ఉడుకుతనం ఉన్న వాళ్ళే. నన్ను ఎదురు తిట్టి ఆ అమ్మాయికి ఎవరితోనో వెంటనే పెళ్ళిచేసి అమెరికా పంపించేశారు. నేను విషయం తెలిసి మీసం మెలేశాను!”

సుభద్రకి విషయం అర్థమైంది ఇప్పుడు. మొగ్గలా ముడుచుకున్న వాడు ప్రేమలో పువ్వులా వికసిస్తే ముల్లై లోకం గుచ్చింది. అదే పాత కథ, అదే వ్యథ.

“కానీ నా తెలివితక్కువ పనివల్ల వీడు మళ్ళీ తన చీకటి గుహలోకి వెళ్ళిపోతాడని, ఈసారి తల్లితండ్రులమైన మాక్కూడా ప్రవేశం ఉండదని ఊహించలేదు. అప్పటినుంచీ వాడు మా మొహం చూడలేదు,  కనీసం ఫోన్ చేసి పలకరించలేదు. బెంగళూరు ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేదో తెలియలేదు. తన తప్పు లేకపోయినా నా భార్యకి నావల్ల శోకం మిగిలింది. కొడుకుపై బెంగపెట్టుకుని చిక్కిశల్యమైంది. మా ఇంటిలో ఆనందం మాయమైంది”

ఒక భారమైన నిశ్శబ్దం గదంతా పరుచుకుంది. మాటల్లో చెప్పలేని విషయాలెన్నో మౌనం విశదీకరిస్తోంది. మళ్ళీ ఆయనే మాట్లాడాడు –

“ఇన్నాళ్ళకి వాడి ఆచూకీ దొరికి వచ్చానమ్మా. కాని వాడు నన్ను చూసి రగిలిన అగ్నిపర్వతమే అయ్యాడు. కొన్ని మంటలు చల్లారేవి కావేమో! నా తప్పు ఒప్పుకుని నన్ను క్షమించమన్నాను. అమ్మ కోసమైనా ఒక్కసారి ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాను. కానీ వాడు ఏమాత్రం కరగలేదు. తనకెవరూ లేరన్నాడు. నన్ను పొమ్మన్నాడు. వాడిక ఎప్పటికీ ఇంటికి రాడేమో అని భయమేస్తోందమ్మా.”

“మీరు అధైర్య పడకండి. ఏదో కోపంలో అలా అన్నాడు కానీ, మిమ్మల్ని చూశాక ఇల్లూ అమ్మా గుర్తురాకుండా ఉంటాయా? మీ అబ్బాయి తప్పకుండా తిరిగివస్తాడు”

“నీ నోటిచలవ వల్లైనా అలా జరిగితే అదే చాలమ్మా! నీకు నా ఆశీస్సులు. ఉంటాను” అని ఆయన వెళ్ళిపోయాడు.

 

4

 

ఆయన వెళ్ళాక సుభద్ర ఏం చెయ్యాలా అన్న ఆలోచనలో పడింది. ఓ నిశ్చయానికి వచ్చి ఉదయ్ రూంకి వెళ్ళింది. ఈసారి తలుపులు తెరిచే ఉన్నాయి. రూంలో కళ్ళు మూసుకున్న ఏదో ఆలోచనలో ఉన్న ఉదయ్, కళ్ళు తెరిచి తీక్షణంగా సుభద్రకేసి చూశాడు.

“మళ్ళీ ఎందుకొచ్చారు? మా నాన్న నా గురించి చెప్పిన కథంతా విని నాకు నీతిబోధ చెయ్యడానికా?”

“లేదు. సానుభూతి తెలపడానికి వచ్చాను. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు దూరమైపోతే కలిగే బాధ నేను అర్థం చేసుకోగలను”

“దూరం కాలేదండి! దూరం చేశారు. ద్రోహం చేశారు. నా బాధ మీకు తెలుసు అనడం తేలికే, కానీ నా బాధ మీరు పడగలరా? ఆత్మీయమైన పలకరింపులూ, పులుముకున్న నవ్వులూ వెనుక దాగున్న మనుషుల అసలు స్వరూపాలు మీకు తెలుసా? కులగౌరవాలూ, ధనమదాలూ, సంఘమర్యాదలూ తప్ప మనిషిని మనిషిగా చూడలేని సమాజం మీకు తెలుసా? అలాంటి మా ఊరి వాతావరణంలో ఇమడలేక, అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా ఏకాకిగా పెరిగిన నాకు స్నేహమాధుర్యాన్ని పంచి, జీవితాన్ని నేర్పి, సరికొత్త ప్రాణాన్ని పోసిన నా “వర్ష”ని నాకు కాకుండా చేశారు. మీకు తెలీదండీ, మీకు తెలీదు. అప్పుడే ప్రేమతో విరబూస్తున్న జంటపువ్వులని కర్కశంగా నలిపేసిన ఈ లోకపు కాఠిన్యం మీకు తెలీదు! జీవితంలో ఎప్పుడూ ఏడవని నేను వెక్కివెక్కి ఏడ్చిన రాత్రులు మీకు తెలీదు. నా వర్ష లేని ఒంటరితనంలో నేను పెట్టిన గావుకేక మీకు తెలీదు.

ఇవన్నీ తెలియని మీరు, మనిషినన్న నమ్మకం ఉండాలి, పారేసుకున్న దాన్ని కోరుకోకూడదు అంటూ డైలాగులు మాత్రం తేలిగ్గా చెప్పగలరు. ఎందుకుండాలండీ? నాకు మనుషులపైనే కాదు, నేను మనిషినన్న నమ్మకం కూడా లేదు. నేను జీవచ్చవంలా, ఓ రాయిలా బ్రతుకుతున్నాను. చచ్చే ధైర్యం లేక బ్రతుకుతున్నాను. నాలో మనిషిని చంపేసిన సంఘానికి నేను మాత్రం నవ్వుతో స్వాగతం పలకాలా? నేను మోయలేనంత శోకాన్ని శిక్షగా విధించిన లోకాన్ని నేను క్షమించేసి గుండెకి హత్తుకోవాలా? బాధా నేనే పడి, జాలీ నేనే పడి, మార్పూ నేనే చెందాలి కానీ ఈ సంఘం మాత్రం ఎప్పటిలాగే తన పాత పద్ధతుల్లో కొనసాగుతూ ఉంటుందా? ఇదెక్కడి న్యాయం అండీ? పారేసుకున్నది జీవితం కన్నా గొప్పదైనప్పుడు, అది లేని నిస్సారమైన జీవితంలో బ్రతకడంకంటే అది ఉందనుకున్న భ్రమలోనో, లేదా దాన్ని కోల్పోయిన బాధలోనో బ్రతకడమే మంచిది. కాదంటారా?”

అతను ఆవేశంగా వర్షిస్తున్నాడు. అతని ఆవేశాన్ని చూసి సుభద్ర ఏమీ మాట్లాడలేకపోయింది. లోలోపలి బాధ ఉబికి వచ్చి అతని కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి, కానీ అతను ఏడుపు ఆపుకుంటున్నాడు. సుభద్ర అతని భుజాన్ని ఆప్యాయంగా నిమిరి మౌనంగా వెనుదిరిగి వెళ్ళిపోయింది. అతను రూం బయటకి వచ్చి ఆకాశం కేసి చూస్తూ ఉండిపోయాడు.

 

5

 

ఓ రెండుగంటల తరువాత అతను తేరుకున్నాడు. ఆవిణ్ణి అనవసరంగా మాటలు అన్నానే అనుకున్నాడు! పాపం ఆవిడ తప్పేముంది? ఓదార్చడానికి వచ్చింది. అయినా వదిలెయ్యండని చెప్పినా ఎందుకు కలగజేసుకుంటుంది?  వద్దన్నా ఆప్యాయత చూపిస్తుంది. తాను లోకాన్ని పట్టించుకోవడం మానేస్తే లోకంలో ఎవ్వరూ తనని పట్టించుకున్న పాపాన పోలేదు, ఈవిడ తప్ప.

నాన్నకి తన ఆచూకి తెలిసిపోయింది కాబట్టి తను ఇక రూం వదిలి, ఊరు వదిలి, బహుశా ధైర్యంచేసి ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి. ఈ రోజు మళ్ళీ ఆవేశం కట్టెలు తెంచుకుంది. ఈ ఆవేశం పూర్తిగా చల్లారేలోగానే తాను ఆత్మహత్య చేసుకోవాలి. అవును తప్పదు. వెళ్ళిపోవాలి. ఒంటరితనాన్ని వదిలి, జ్ఞాపకాలని వదిలి, పిరికితనాన్ని వదిలి. ఈ ఆవేశమనే నావపై ప్రయాణించి లోతు తెలియని అగాధంలోకి.  జీవితమనే నరకాన్ని వదిలి మరణమనే ప్రేయసి కౌగిలిలోకి.

వెళ్ళిపోయే ముందు ఆవిడని ఒకసారి కలిసి “సారీ” చెప్పాలి అనుకున్నాడు. కిందకి దిగి సుభద్ర ఇంటి తలుపు తట్టాడు.

“రావయ్యా! మొత్తానికి మేడ దిగొచ్చావన్న మాట” ఆశ్చర్యానందాలతో పలకరించింది సుభద్ర.

“నేను కూర్చోడానికి రాలేదు. మీతో ఓ మాట చెప్పి వెళ్ళిపోతాను”

“చెబుదువుగానులే! ముందు లోపలికి రా. నిలబెట్టి మాట్లాడితే ఏం మర్యాదయ్యా!”

సుభద్ర ఆహ్వానాన్ని కాదనలేక అయిష్టంగానే హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. పొందిగ్గా అమర్చిన ఇల్లు.

“కాఫీ టీ ఏమైనా తీసుకుంటావా?”

“వద్దండీ. నేను వెళ్ళాలి. ఇందాకా ఆవేశపడి ఏవో మాటలన్నాను, క్షమించండి. మీకు నాపై ఈ అభిమానం ఎందుకో తెలియదు కానీ, మీ అభిమానాన్ని నేను స్వీకరించలేను. దయచేసి నన్ను పట్టించుకోవడం మానెయ్యండి! నేనెవరికీ చెందను, నాకెవరూ అక్కర్లేదు. నా దారిలో నేను దూరంగా ఎక్కడికో వెళిపోతాను, నాకే పిలుపులు వినిపించవు. మీరూ పిలవకండి. ప్లీజ్!”

ఆ మాటల్లో దాగున్న అర్థాలకి సుభద్ర మనసు కీడు శంకించింది.

“వెళిపోతాను అన్నవాణ్ణి ఆపలేనయ్యా. నీ ఇష్టం నీది. నిన్నింక ఇబ్బంది పెట్టను. చివరగా ఓ మాట చెప్పొచ్చా?”

“చెప్పండి”

“నువ్వు చాలా సున్నిత మనస్కుడివని నీ కవిత చదివినప్పుడే అర్థమైంది. సున్నితమైన మనసూ, స్పందించే గుండె లేనివాడు కవిత్వం రాయలేడు. నువ్వు ఒంటరివాడివి కూడా అని ఈ రోజే తెలిసింది. ఎవ్వరూ చొరబడని నీ మనసనే చీకటిగదిలోకి ఓ వెలుగురేఖ వచ్చింది. నువ్వు మేలుకుని తలుపు తెరిచేలోపు ఆ వెలుగుని లోకం మింగేసింది. నువ్వు లోకాన్ని ద్వేషిస్తూ చీకట్లోనే మిగిలిపోయావు. అసలు వెలుగన్నదే భ్రాంతన్నావు!

ద్వేషం దహిస్తుందయ్యా. ద్వేషించే వాళ్ళనీ, లోకాన్నీ కూడా. దానివల్ల ఎవరికీ లాభం లేదు. నీకు తీవ్రమైన అన్యాయం జరిగింది నిజమే. దానివల్ల నీకు తీరని నష్టం బాధా కలిగాయి. సహజంగానే నీకు కోపం వస్తుంది. ఆ కోపాన్ని ద్వేషంగా మార్చుకోకు. మనసు పిచ్చిది, బాధొస్తే ఓ గోల పెట్టి ఊరుకుంటుంది. కానీ తెలివి చాలా టక్కరిది. అది దేన్నీ వదిలిపెట్టదు, బాధ కలిగించిన వాళ్ళని జీవితాంతం ద్వేషిస్తూనే ఉంటుంది. దాని వలలో పడకు!

నేను నీలా బోలెడు పుస్తకాలు చదవలేదు. కానీ బోలెడు జీవితాన్ని చూశాను. కష్టాలూ, ఆనందాలూ, అనుబంధాలూ, స్వార్థాలూ, అపార్ధాలూ ఇవన్నీ జీవితాన్ని నిర్మించే ముడిసరుకులే. ఇలా అన్ని రకాల అనుభవాలతో, మనుషులతో నిండిన లోకాన్ని కాదని తమతమ ఊహాలోకాల్లో విహరిస్తూ, ఓ ముల్లు గుచ్చుకుంటే ఈ లోకంలోకి వచ్చి, “ఛీ! పాడు లోకం” అని ఓ మాట అనేసి మళ్ళీ తమ ఊహాలోకంలోకి జారుకునే వాళ్ళు జీవితాన్ని అర్థం చేసుకోలేరు. అనుభవించలేరు. కాలికి ఇసుక అంటకూడదు అనుకునేవాడు జీవితమనే సముద్రంలో స్నానం చెయ్యలేడు.

నీలో సంస్కారంతో కూడిన ఓ మంచి మనిషిని నేను చూస్తున్నాను. నీ గుండె గాయపడింది కానీ నువ్వింకా రాయివైపోలేదు అనుకుంటున్నాను. నీలో ఏ మూలో మిగిలిన మనసుని తట్టి చూడు. నీకు నువ్వే దట్టంగా పరుచుకున్న చీకటి తెరలు దాటిచూడు. ఆలోచనా సామ్రాజ్యాన్ని వదిలి మౌనసరస్సులో స్నానించు. అప్పుడు వినిపించే పిలుపు ఎటు పిలిస్తే అటే వెళ్ళు!”

సుభద్ర ఇంకేమి చెప్పడానికి లేదన్నట్టు చూసింది. అతను ఇంకేమీ మాట్లాడలేనన్నట్టు లేచి వెళ్ళిపోసాగాడు. అప్పుడు కనిపించింది అతనికి గోడకున్న ఆ ఫోటో. నవ్వులు చిందిస్తున్న ఓ యువకుడిది. దండేసి ఉంది. చూసి ఓ క్షణం ఆగాడు.

సుభద్ర అతని భావం గ్రహిస్తూ –

“వాడు నా తమ్ముడు. నీ వయసే ఉంటుంది, మెడిసిన్ చదివేవాడు. మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. వాడు నాకన్నీ చెప్పేవాడనే అనుకునే దాన్ని. కానీ కాదని తెలిసింది. ఆరు నెలల క్రితం సెలవలకి ఇంటికి వచ్చినప్పుడు డల్‌గా కనిపించాడు. ఏమిట్రా అంటే ఏం లేదక్కా అన్నాడు. వాడు తిరిగి కాలేజీకి వెళ్ళిన కొన్ని రోజులకి సూసైడ్ చేసుకున్నాడని మాకు కబురొచ్చింది. వాడు ప్రేమించిన అమ్మాయి వాడిని కాదందట. అమ్మానాన్నా ఇంకా తేరుకోలేదు. నేను ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను – “జీవితం గొప్పదా, జీవితాన్ని కాదనుకునే పంతం గొప్పదా?” అని.

అతనికి ఏమనాలో తెలియలేదు.  “సారీ టు హియర్ దిస్” అని వెళ్ళిపోయాడు.

 

6

 

 

పక్కరోజు తెల్లవారుతూ ఉండగా సుభద్ర లేచి వాకిలి తలుపు తీసింది. తలుపు గడియకి మడిచిపెట్టిన ఓ కాయితం కనిపించింది. కీడు శంకిస్తూ తీసి చదవసాగింది –

అక్కా,

చాలా రోజుల తరువాత నిన్న నిండుగా ఏడ్చాను. అసలు ఏడుపు ఎందుకొచ్చిందో కూడా తెలీదు. ఆపలేకపోయాను, ఆపాలనిపించలేదు కూడా. కొన్నిసార్లు మనసుని శుభ్రపరచడానికి కన్నీటి స్నానం చెయ్యాలేమో! నువ్వన్నది నిజమే, నా గుండె లోతుల్లో ఆరని జ్వాలేదో ఉంది. నా ప్రతి ఆలోచనా ఆ జ్వాలని రగిలిస్తూనే ఉంది. ఈ కన్నీరు ఆ జ్వాలని ఆర్పిందో ఏమో, చాలానాళ్ళ తరువాత కొంత ప్రశాంతత దొరికింది.

నిన్న నేను చచ్చిపోదాం అనుకున్నాను. ఇన్నాళ్ళూ బాధించిన ఈ లోకాన్ని ఓడిస్తూ వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ నీ మాటలు నన్నాపాయి. నీ మాటలు కాదేమో, నీ మాటలు వెనుక ఉన్న ఏదో ఆత్మీయత. నీ కళ్ళలో కనిపించే అపారమైన కరుణ. మా అమ్మ గుర్తొచ్చింది. తన్నినా అక్కున చేర్చుకునే వాళ్ళు అమ్మ కాక ఎవరుంటారు! అందుకే మా ఊరు వెళ్తున్నాను, అమ్మ ఒళ్ళో తలవాల్చి మళ్ళీ కన్నీళ్ళు కార్చడానికి.

సొంత తమ్ముణ్ణి దక్కించుకోలేకపోయావు కానీ, ఈ తమ్ముణ్ణి కాపాడావు అక్కా! నీ రుణం ఎలా తీర్చుకోగలను? ఊరినుంచి తిరిగి వచ్చాక మీ కాళ్ళపై పడి ప్రణమిల్లుతాను. క్షమిస్తావు కదూ?

నీ తమ్ముడు,

ఉదయ్

 

సుభద్ర కళ్ళలో ఆనందభాష్పాలు. గోడపైన తన తమ్ముడి ఫొటో కేసి చూసింది ఓ సారి. బయట అప్పుడే చీకట్లు కరిగిస్తూ సూర్యుడు ఉదయిస్తున్నాడు.

*

 

 

 

 

 

 

 

 

 

మనసులో వాన

 

Art: Mandira Bhaduri

Art: Mandira Bhaduri

అరుణ గోగులమండ
~
చూరును వీడి జారబోయే చినుకు క్షణకాలపు ఊగిసలాటలో
నూనెరంగుల చిత్రపు వెలిసిపోయిన వెర్షన్లా..
నువు ఓగుబులు తెరై కదలాడతావు.
గది గోడకున్న నిలువుటద్దంపై ఉషోదయపు ఏటవాలు కిరణంలో
తెలిమంచు వేళ్ళతో లిపికందని ఊసుల్ని రాసి మాయమౌతావు
“యువర్ థాట్స్ సర్ఫేస్ సో ఆఫెన్ డియర్ నోబడీ”.
ఉన్నదేదో ఇదిమిద్దంగా తెలియని గమ్మత్తైన స్థితి.
లేనిదెపుడూ.. నిజంగా లేనిదెపుడు?
తలపుల గోతాముపరుగులో ఆ నాలుగుగదులెంత అలిసాయో తెలిసేదెవరికి?
రమ్మనీ అనకుండా వద్దనీ చెప్పకుండా
వాటంత అవే పాదాలను చుట్టుకున్న పాశపు పోగులు
కొన్ని ముడులలో చిక్కుబడి, పీఠముళ్ళై బంధించబడి
బంధాలుగా కట్టబడి
వలయాలు వలయాలుగా బ్రతుకంతా ఆక్రమిస్తూ.
ఏం చెప్పమంటావోయ్.. కలలలో నిరంతరం నాతో నడిచే చెలికాడా..!
మర్రి చెట్టు ఊడల్లా దిగబడి మనసులోతుల దాగున్న చిత్రం నీవు.
నిద్దురలో నడిచే ప్రాణమున్న మతిలేని జీవి నేను.
బాధ్యత మరవను.
కాలాన్ని వెనుదిప్పనూలేను.
చిటికెలేసి నీ ఉనికి చాటుతూ నాకోసం వెతికిన రోజుల దిగులుమేఘం ..
నడిరేయంతా మాగన్ను నిదురల కళ్ళలో కదులుతూ.
చిమ్మ చీకటిలో వరస గదులకావల పిట్టగోడపై నీ ఒంటరి మనసు
వేళ్ళాడిన మౌనసందేశపు గేయాల సుడులు తలపై రివు రివ్వున తిరుగుతూ.
వేర్ ఆర్ యు మై బోయ్? మస్ట్ బీ సంబడీ ఎల్సెస్ మేన్ నౌ..!
ఆనాడు వికసించిన వాత్సల్యం శిలాజమై మిగిలినా సౌరభం మదిని వీడదు.
ఏ లోకాల సరిహద్దుల నీ అడుగులు సాగుతూపోయినా
ఈ అంచుల ఒంటరై నిలుచున్ననా దేహాన్ని పొగమంచులా తాకకమానవు.
లైఫ్ స్టిల్ రిమైన్స్ మై డార్లింగ్..
థో,నథింగ్ లాస్ట్స్ ఫరెవర్..
మెమరీస్ లాస్ట్.
టిల్…లాస్ట్.
*

దహించేస్తున్న శీతల పవనంతో

Art: Rafi Haque

Art: Rafi Haque

 

-పఠాన్ మస్తాన్ ఖాన్

~
1.
వొక పూటలోని కొన్ని దేహాల్లో వేలాడే
అసంధర్భాలలోని పురా వాసనలను
మనిషికి పూసిన వొందల అక్షరాలతో
తనను వెతుక్కొంటూనే వేల యేళ్లుగా
ధ్వనీతీత నిశబ్దం ఆవరించిన వెలుగులో
రేపటికి వానకురుస్తుందనే
యేకరహస్యంలో వివృతమై…
2.
గుండెలకు చేరని శ్వాసలో మనసును చంపిన నిశ్చ్వాస లోని హననపు సత్తువ
నిర్మోహనంగానే గతిస్తున్నా వొక రేపటిదాకా
యీ ఆరిపోతున్న రంగుల్లో తేలిపోతున్న
నిర్మాణహీన ముక్కల్లో
గదులను దాటించి కిటికీలను తీయించి
గీసిన వొక వర్ణపటమౌతున్నప్పుడు
వృక్షపు వేర్ల నీడల బిగుతుతనం సడలింది
3.
యింకా మొలవని రెక్కలతో వాలు జారిన
యీ ధార స్వేదంతో కన్నీళ్ళతో కొండలను
లోయలను తాకి వుప్పు సముద్రమైంది
సలపరిస్తున్న గాయాల బరువును చూసి
పచ్చగా వాలిన వొక తడిలేపనం కరిగాక
మొలిచే ప్రాణమేదో మళ్ళీ కళ్ళతో చూడలేక పోతోంది
4.
కొత్త చివుళ్ళలో కాలిపోతున్న దేహానికి
తీరిగ్గా పాఠాలు వల్లెవేసే పురిటి నొప్పులను
వొక నడకలో మరణించిన వొందల దృశ్యాలను
వొకేసారి చూడలేని చేతకానితనపు కళ్ళజోడులతో
పరిధుల అవధులు మాత్రమే గుర్తొచ్చే
సంస్మరణలు కొన్నీ
5.
అన్నీ వర్ణాలను కిందుగా పరుచుకొన్నాకనే
అస్పష్టంగా మెరిసిపోతున్న బంగారు దిగులేదో
కక్కేసిన యెండుటాకులు ఫళఫళ రాలిపోతుంటే
దాచుకోవాలనుకొన్న మృత్యువును వొక చెట్టై నిండుగా మోసి
యెండకూ వెన్నెలకూ చివరి వరకు వేచి చూసి వాటి చివర్లలో
మళ్ళీ మళ్ళీ బధ్ధలైపోతున్న విశ్వపు ముక్కల విలీనం కోసం …వొక ప్రతీక్షలో
యింకా చనిపోతూనే వున్న…

 *

మతము-నాస్తికత్వము-నాస్తిక మతము                                                                                        

 

                                                                                                                       – రాణి శివ శంకర శర్మ

~

 

మనం ఆధునిక కాలంలో మతచాందసత్వాన్ని కాదు. ఎథీస్ట్ ఫండమెంటలిజాన్ని అంటే నాస్తిక చాందసత్వాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేయడం ద్వారా మనం సంఘర్షిస్తున్నాయి అని అనుకుంటూన్న శక్తులు ఒకే కుదురులోనివనీ, తోబుట్టువులనీ అర్థమవుతుంది. వైరుధ్యాలు అనుకున్నవి మిత్ర వైరుధ్యాలనీ వైరుధ్యం ముసుగులోని మైత్రీపూర్వక సంబంధాలనీ అవగతమవుతుంది. అప్పుడు కమ్యూనిజము, హిందూవాదము లాంటి అనేక పేర్లు ఒకే సత్యానికి సహస్ర నామాలని అవగతమవుతుంది.

నిజానికి కమ్యూనిజం వ్యాన్ గార్డులుగా వ్యవహరించిన కొన్ని అగ్ర కులాలని గ్రామీణ బంధనాల నుండి విముక్తం చేసి పెట్టుబడి దారీ వ్యవస్థలో తగిన భాగస్వామ్యం పొందడానికి అవకాశం కల్పించింది. ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేటు పరిశ్రమల ఆవిర్భావానికి చోదక శక్తిగా పని చేసినట్లేనన్న మాట. చైనాలో కూడా అంతే. కమ్యూనిజం చిన్న కమతాలని సమిష్టి వ్యవసాయంలోకి లయం చేసి ప్రాచీన గ్రామీణ వ్యవస్థని బలహీనపరిచింది. ఇప్పుడు అలా సమీకరించబడిన భూమి పెట్టుబడికి ప్రశ్నకవకాశం లేని వనరుగా మారింది. ప్రజా ప్రభుత్వం పేరుతో ఆవిర్భవించిన కమ్యునిష్టు వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థకి దుర్భేధ్యమైన కవచంగా మారింది. తావోయిజం ప్రకారం ప్రతీదీ పూర్తి విరుద్ధంగా మారుతుంది. ఆ మాటని మావో తాత్వీకరించాడు. ఇప్పటి పరిణామాలు కూడా ఆ తాత్వీకరణలో భాగమేనా? తాత్విక సూత్రాలు స్వయం చలనంగా ఉండి తమ అర్థాలని తామే నిర్ణయించుకుంటాయా? మానవ ప్రగతి అనే భావనలో ఏ మానవుడి ప్రగతి, ఏ జాతి ప్రగతి అనే ప్రశ్నలకి సరైన సమాధానం లేదు. దురదృష్టవశాత్తూ కమ్యూనిజం ఈ భావన మీదే కాళ్ళూనుకొని ఉంది. నిజానికి ఆధునికత అంతా అంతే.

 

హిందూ వాదం కూడా పురోగతి అనే భావన మీదే ఆధారపడి ఉండి. చరిత్ర పురోగమనం అనే విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. హిట్లర్ నేషనలిజం అన్నా, సావర్కర్ హిందూ నేషనలిజం అన్నా ఈ ఆధునిక అభివృద్ధి భావనల మీదే ఆధారపడ్డాయి. అందరూ ఏదో రూపంలో త్యాగశీలతనే కొనియాడారు. కానీ త్యాగం చేసేవారూ, నాయకత్వం వహించేవారి మధ్య అగాథం అలాగే నిలిచిపోయింది. మొత్తం మీద కమ్యూనిజం, హిందూయిజం- ఈ రెండూ,  కొందరు అగ్రవర్ణాల వారు పెట్టుబడిదారీ వ్యవస్థలో రాణించడానికి పునాదిగా పని చేసాయి. కమ్యూనిజం, కమ్యునిష్టు ఉద్యమాలు పునాది అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ, గ్లోబలైజేషన్ ఉపరితలం అనవచ్చు. అంటే కమ్యునిజం మానవుల్ని, అంటే అగ్ర కులాల్ని మాత్రమే సంప్రదాయ బంధనాల నుంచి విముక్తం చేసి, నగరీకరణలో, గ్లోబలైజేషన్లో భాగం చేసాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఇందుకు మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి.

 

ఈ క్రమంలో పెట్టుబడి దారీ వ్యవస్థలో, గ్లోబలైజేషన్లో తగిన భాగం పొందలేక, గ్రామీణ వ్యవస్థ విచ్చిన్నమై నూతన అవకాశాలు కూడా పొందలేక బాధపడుతున్న దళిత, బహుజనులు, ముస్లీంలు తమ అస్తిత్వాలతో, మతాలతో, సంస్కృతులతో ముందుకు వచ్చి వాటినే అగ్ర కులాల ముందు ప్రశ్నలుగా ఎగరవేశారు. దాంతో అగ్ర కులాలు నాస్తికత్వం, ఆర్థిక సమానత్వం, హిందూ నేషనలిజం లాంటి సెక్యులర్ అబ్స్ట్రాక్ట్ పదాల్ని ఆశ్రయించారు. దళితులు, బహుజనులు తమ ప్రత్యేక అస్తిత్వాలని కరిగించుకొని అబ్స్ట్రాక్ట్ గా మారిపోవాలని ఆదేశిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అబ్స్ట్రాక్ట్ స్వభావాన్ని ఇష్టపడుతుంది. ప్రత్యేక అస్తిత్వాలని కాక కొనుగోలుదార్లని వాంఛిస్తుంది. నగరీకరణలో ప్రత్యేకతలు, ప్రత్యేక సంస్కృతులు లయమైపోవాలని ఆదేశిస్తుంది. కమ్యునిష్టు, హిందూ ముసుగుల్లోని అగ్రవర్ణాలది మొదటి నుంచీ అబ్స్ట్రాక్ట్ పరిభాషే. భూస్వామి అన్నా, బూర్జువా అన్నా, పెటీ బూర్జువా అన్నా, హిందుత్వ అన్నా, నేషనలిజం అన్నా అంతా వలసవాదుల నుంచీ దిగుమతి చేసుకున్న అబ్స్ట్రాక్ట్ సరుకే. ఈ పదాలతోనే వీళ్ళు నగరీకరణలోకీ, గ్లోబలైజేషన్లోకీ సులభంగా ఎగబాకారు. అదే సమయంలో దళిత, బహుజన, ముస్లీంలు ఈ నిచ్చెన మెట్లు ఎక్కకుండా ఉండడం కోసం ప్రత్యేకతల్నీ, కులాల్నీ, మతాల్నీ, సంస్కృతుల్నీ ఉపరితలం అంటూ అగ్రకులాలు విసిరి కొట్టారు. హిందూవాదులైతే బహుళత్వాన్ని హిందూ జాతీయతకి ముప్పుగా పరిగణించారు.

 

అందుకే ఇప్పుడు కమ్యునిష్టులు, దళిత బహుజనుల్ని, వారి ప్రత్యేక మతాలనీ , సంస్కృతులనీ  గ్లోబలైజేషన్ దుష్పరిణామాలుగా వాదిస్తున్నారు. ఐక్యతకి ముప్పుగా భావిస్తున్నారు. నిజానికి గ్లోబలైజేషన్‍కీ వాటి ఫలితాలకీ కారణం ఆ కులాల వాళ్ళే. ఐక్యత అనే విశాలార్థం కల  పదం ఎప్పుడూ కొద్దిమంది అభివృద్ధికి అనేక మంది అణచివేతకి కారణమవుతూ వచ్చింది. మాదిగ దండోరా ఆవిర్భావానికి కారణమదే. మాదిగల ప్రత్యేక అస్తిత్వ ప్రకటన సాంస్కృతికంగా మరుగుపడిపోయిన అనేక అంశాల్ని బయటికి తెచ్చింది. సంస్కృతి గురించి అగ్రవర్ణాలు కమ్యునిష్టు హిందూవాదులు వ్యక్తం చేసిన ఆధిపత్య కోణాల్ని బట్టబయలు చేసింది.

 

ఉదాహరణకి ద్రోణుడు ఏకలవ్యుడికి విద్య చెప్పడానికి నిరాకరించాడనే కథని, కమ్యునిష్టులు కూడా యాధార్ధంగా స్వీకరించారు. ద్రోణుడిని వ్యాన్ గార్డ్ గా ఏకలవ్యుడిని కార్యకర్తగా చూసారు. అసలు ద్రోణుడు గిరిజనుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడమేమిటని ఎవరూ ప్రశ్నించలేదు. ఎందుకంటే కమ్యునిష్ట్ హిందూ అగ్ర వర్ణాలవారు తాము ప్రజలనుంచీ నేర్చుకోవడం కంటే వారికి నేర్పే వారిగానే తమని తాము చిత్రీకరించుకున్నారు. తాము గురుత్వం వహించారు. అందుకే జాంబ పురాణం వంటి ప్రత్యామ్నాయ పురాణాలని అధ్యయనం చేయలేదు. దళితులు అవిద్యావంతులనీ, అగ్రకులాలు విద్యావంతులనే స్టీరియో టైపుని బద్దలు చేయలేక పోయారు. డక్కలి వారికి చదవడం, రాయడం వచ్చని, వేద పండితులకి రానే రాదనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోనే లేదు. ఎందుకంటే అగ్రకులాలే ఙ్ఞానవంతులనేది వారి అభిప్రాయం. కానీ డక్కలి వారి దృష్టి వేరు. వాళ్ళు ఙ్ఞానాన్ని అగ్ర కులాలు తమ వద్దనుంచే దొంగిలించాయంటారు.

 

వలసవాద విద్య వల్ల అగ్రకులాలు తమరిదొక్కరిదే ఙ్ఞానమని, విద్య అనీ, మతమనీ ఇతరులందరినీ బ్రిటీషువారిలాగే సంస్కరించే వైట్ మ్యాన్స్ బర్డేన్ తమ మీద ఉందనీ భావించడం మొదలు పెట్టారు. ఇతర సంస్కృతుల్ని అంటరానివిగా చూడడం కాక, వాటిని మొత్తంగా నిర్మూలించి, వాటి స్థానంలో తాము సంస్కృతీ, మతం, నాగరికత అనుకున్నదాన్ని బలంగా ప్రతిష్టించాలని వారు భావించారు. ఈ భావనలకి    అత్యాధునిక ప్రతిధ్వనులే గోగినేని బాబు, హెచ్చార్కే, రంగనాయకమ్మ. వీరిది నాస్తిక మతం. ఎథీస్ట్ ఫండమేంటలిజం. గోగినేని బాబు గద్దరు అనే ప్రజా గాయకుడు శివుడ్నీ, బసవడ్నీ సమానత్వ భావాలకి నిలయంగా భావించి పాట రాసినందుకు తీవ్రంగా నిందిస్తాడు. అదే సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతంలో అబ్స్ట్రాక్ట్ విశాల దృష్టినన్వేషిస్తాడు. హెచ్చార్కే కులమతాలు పోవాలనీ, తానే మైనారిటీననీ అంటాడు. రంగనాయకమ్మ బ్యాక్ టూ మార్క్స్ అంటుంది. అంటే తనలోనూ, మార్క్స్ లోనూ తప్ప అన్ని చోట్లా లోపాలే ఉన్నాయని అంటుంది.   ఇంతవరకూ లోపాలు లేని వ్యక్తులు, వ్యవస్థలు, సంఘాలు బయట ఎక్కడా ఉదాహరణగా నిలచి లేవు కనుక తన హృదయంలోని మార్క్స్ కలగన్న సమాజం కోసం జపం చేస్తూ ఉండాలని బోధిస్తుంది. మొత్తం మీద వీళ్ళందరూ వాళ్ళు నిర్మించుకున్న అబ్స్ట్రాక్ట్ ఏకాంత మందిరంలో లోపాలు, పక్షపాతాలూ ఏవీలేని స్వచ్చమైన నాస్తిక మతంలో నాస్తికతనే దేవుడిగా ఆరాధిస్తూ జీవిస్తారు. ఈ స్వచ్చతని పాటించడం కోసం అన్ని మతాలకీ, అన్ని కులాలకీ సమదూరం పాటిస్తున్నట్టూ నటిస్తారు.

 

 

నట సామ్రాట్

నీ ఇంట్లో అరలెన్నో మరలెన్నో

నాకు తెలుసు నాకు తెలుసు

నీ పాత్ర చిలుం పట్టింది తోముకో

-మహాస్వప్న

 

 

*

మిస్టర్ గోస్వామి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!

 

 

 

రమణ యడవల్లి 

———————-

“ప్రధాన మంత్రిని అర్నబ్ గోస్వామి చేసిన ఇంటర్‌వ్యూ చూశావా?” అడిగాడు నా స్నేహితుడు.

“చూళ్ళేదు.” అన్నాను.

“అదృష్టవంతుడివి. నాకా ఇంటర్‌వ్యూ ఉప్మా లేని పెసరట్టులా చప్పగా అనిపించింది. అర్నబ్ గోస్వామికి బుద్ధిమంతుడి వేషం నప్పలేదు. థాంక్స్ టు మోడీ, అర్నబ్ నోర్మూసుకుంటే యెలా వుంటాడో మొదటిసారి చూశాను.” అంటూ నవ్వాడు నా స్నేహితుడు.

గత కొన్నేళ్లుగా టీవీ మీడియంలో అర్నబ్ గోస్వామి పేరు మోగిపోతుంది. మోడెస్టీ కోసం తానో జర్నలిస్టునని చెప్పుకుంటాడు కానీ, అర్నబ్ జర్నలిస్టు స్థాయి ఎప్పుడో దాటిపొయ్యాడు! అతను ఒక షోమేన్, ఒక పెర్ఫామర్! సినిమా నటులు పాత్రోచితంగా అనేక రసాలు పండిస్తారు. అర్నబ్ ‘చర్చో’చితంగా కోపావేశాల్ని పండిస్తాడు. సినిమావాళ్ళది బాక్సాఫీస్ దృష్టైతే, అర్నబ్‌ది టీఆర్పీ దృష్టి!

అర్నబ్ గోస్వామి పాపులారిటీకి కారణం యేమిటి? యే దేశంలోనైనా సుఖమయ జీవనం సాగిస్తూ కులాసాగా ఆలోచించే వర్గం ఒకటి వుంటుంది. వీళ్లు రాజకీయంగా కలర్ బ్లైండెడ్‌. అంటే – ప్రతి సమస్యనీ బ్లాక్ వైట్‌లోనే ఆలోచిస్తారు, అధికారిక (ప్రభుత్వ) వెర్షన్‌ని సమర్ధించేందుకు రెడీగా వుంటారు, ప్రభుత్వ అభివృద్ధి నమూనాల పట్ల విశ్వాసం కలిగుంటారు (తమకీ ఓ రవ్వంత వాటా దొరక్కపోదా అన్న ఆశ కూడా వుంటుందనుకోండి). వీరిలో ఎక్కువమంది వేతనశర్మలు (చూడుము – రావిశాస్త్రి ‘వేతనశర్మ కథ’).

ఈ అర్నబ్ గోస్వామి వీక్షక వర్గం సోషల్ మీడియాని ప్రతిభావంతంగా వాడుతుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ గూర్చి కేంద్ర హోమ్ శాఖ చెప్పింది కరెక్ట్. వ్యతిరేకించావా? – నువ్వు ‘మావోయిస్టు టెర్రరిస్టువి’.  కల్బుర్గి హంతకుల కోసం ప్రభుత్వం ఇంకా వెదుకుతూనే వుంది. ప్రశ్నించావా? – నువ్వు ‘సూడో సెక్యులరిస్టువి’. రోహిత్ వేముల ఆత్మహత్య కేంద్రాన్ని కలచివేసింది! సందేహించావా? – నువ్వు ‘దేశద్రోహివి’.

ఈ వర్గంవారి అభిప్రాయాల పట్ల ఎవరూ ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆసక్తికర అంశం యేమంటే – ‘రాజకీయాలు చెత్త, అవి మాట్లాడ్డం టైమ్ వేస్ట్’ అన్న లైన్ తీసుకున్న ‘న్యూట్రల్’ వ్యక్తులు కొన్నాళ్లుగా ఘాటైన రాజకీయ అభిప్రాయాలు వెలిబుచ్చడం! అవి అచ్చు అర్నబ్ గోస్వామి అభిప్రాయాలే! ప్రతి అంశాన్నీ సింప్లిఫై చేసి బ్లాక్ ఎండ్ వైట్‌లో ప్రెజెంట్ చేసే అర్నబ్ గోస్వామి స్టైల్ వీళ్ళకి బాగా నచ్చింది.

మర్నాడు న్యూస్‌పేపర్లలో పదోపేజీలో కూడా రిపోర్ట్ కాని అంశాన్ని కొంపలు మునిగిపొయ్యే సమస్యలా చిత్రించ గలగడం అర్నబ్ గోస్వామి ప్రతిభ. అతని డిబేట్లు WWE కుస్తీ పోటీల్లా స్క్రిప్టెడ్ కేకలు, అరుపుల్తో గందరగోళంగా వుంటాయి. చూసేవాళ్ళకి ‘ఈ వీధిపోరాటంలో ఎవరు గెలుస్తారు’ లాంటి ఆసక్తి కలుగుతుంది. ఇట్లాంటి చౌకబారు ఆసక్తిని రేకెత్తించి వ్యూయర్‌షిప్ పెంచుకోవటమే టైమ్స్ నౌ చానెల్ వారి ఎజెండా. ప్రతిభావంతులైన నటుల్ని అభినందించినట్లుగానే అర్నబ్ గోస్వామిని కూడా అభినందిద్దాం.

టీవీల్లో వార్తల్ని విశ్లేషించే చర్చా కార్యక్రమాలకి కొంత ప్రాముఖ్యత వుంటుంది. వీక్షకులకి ఎదుటివారి వాదన యేమిటనేది తెలుసుకోడానికీ, తమకంటూ ఒక అభిప్రాయం ఏర్పరుచుకోడానికి ఈ చర్చలు ఉపయోగకరంగా వుంటాయి. కానీ – అర్నబ్ గోస్వామి స్టూడియోలో కూర్చుని ప్రతి సబ్జక్టు పైనా ముందుగానే ఒక ఖచ్చితమైన అభిప్రాయం యేర్పరచుకుని వుంటాడు. ఆ అభిప్రాయంలో తీవ్రమైన దేశభక్తీ, భీభత్సమైన ధర్మాగ్రహం వుంటాయి. ఈ కారణాన – తన అభిప్రాయాన్ని వొప్పుకోనివారికి తిట్లు తినే సదుపాయం తప్ప, మాట్లాడే హక్కుండదు. ఈ సంగతి తెలుసుకోకుండా అర్నబ్ షోలో పాల్గొన్న JNU విద్యార్ధులకి యేమైందో మనకి తెలుసు.

“టీఆర్పీ రేటింగ్ కోసం చర్చా కార్యక్రమాన్ని వినోద స్థాయికి దించడం దుర్మార్గం.” ఒక సందర్భంలో నా స్నేహితుడితో అన్నాను.

“నీకు మర్యాదస్తుల న్యూస్ డిబేట్ కావాలంటే బిబిసి చూసుకో! మజా కావాలంటే అర్నబ్‌ని చూడు. అది సరేగానీ, అర్నబ్ డిబేట్లలో స్క్రీన్ మీద మంటలు మండుతుంటాయి. ఎందుకో తెలుసా?” అడిగాడు నా స్నేహితుడు.

“తెలీదు.” ఒప్పేసుకున్నాను.

“అరుంధతి రాయ్, తీస్తా సెటిల్వాడ్ లాంటి దేశద్రోహుల్ని అందులో పడేసి రోస్ట్ చేసెయ్యడానికి.” కసిగా అన్నాడతను.

ఈ విధంగా ప్రజలు ప్రశాంతంగా టీవీ చూసేస్తూ చాలా విషయాల పట్ల చక్కటి అవగాహన యేర్పరచుకుంటున్నారు! ‘ముఖ్యమైన’ సమాచారం ప్రజలకి చేరే విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా వుంటాయి. తమకి ఇబ్బందిగా ఉండే విషయాల్లో (రాజకీయాలకి బయటనున్న ప్రజల) ఒపీనియన్ మేకింగ్ అన్నది అధికారంలో వున్నవాళ్ళకి చాలా అవసరం. ఈ వ్యవహారం సాఫీగా సాగడానికి అనేకమంది స్టేక్‌హోల్డర్స్‌ పాటుపడుతుంటారు (చూడుము – Noam Chomsky ‘Media Control’).

ఇంతటితో నేను చెబ్దామనుకున్న విషయం అయిపోయింది. అయితే – చెప్పుల షాపులో పన్జేసే వ్యక్తి దృష్టి తనకి తెలీకుండానే ఎదుటివారి చెప్పుల వైపు పోతుంది. దీన్ని occupational weakness అనుకోవచ్చు. వృత్తిరీత్యా నేను సైకియాట్రిస్టుని కాబట్టి చాలా అంశాల్లో సైకలాజికల్ యాస్పెక్ట్స్ కూడా ఆలోచిస్తాను. అంచేత కొద్దిసేపు – సైకాలజీ బిహైండ్ అర్నబ్ గోస్వామి సక్సెస్.

ఒక వ్యక్తి ‘చర్చా కార్యక్రమం’ అంటూ గెస్టుల్ని పిలిచి మరీ చెడామడా తిట్టేస్తుంటే, చూసేవారికి ఎందుకంత ఆనందం? సైకాలజీలో Frustration-Aggression అని ఒక థియరీ వుంది. సగటు మనిషికి దైనందిన జీవితంలో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, చిరాకు.. ఇవన్నీ frustration కలిగిస్తాయి. ఈ frustration ఒక స్టీమ్ ఇంజన్ లాంటిదని సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు. ఇంజన్ స్టీమ్ వదలాలి, లేకపోతే పేలిపోతుంది. అంచేత frustration అనేది తప్పనిసరిగా aggression కి దారితీస్తుంది. సగటు మనిషిలో వున్న ఈ aggression కి అర్నబ్ గోస్వామి కార్యక్రమం ఒక విండోగా ఉపయోగపడుతుంది. అందుకే చూసేవారిలో అంత ఆనందం!

అన్ని వృత్తుల్లాగే – జర్నలిస్టులకీ వృత్తి ధర్మం వుంటుంది. వాళ్ళు అధికారంలో వున్నవాళ్ళని ప్రజల తరఫున ప్రశ్నలడిగి, సమాధానాలు రాబట్టాలి. మరప్పుడు అర్నబ్ గోస్వామి – “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! విదేశాల నుండి నల్లడబ్బు తెచ్చే విషయం ఎందాకా వచ్చింది? NSG కి చైనా అడ్డుపడకుండా ఎందుకు ఆపలేకపొయ్యారు? అదానీ వ్యాపారానికి అన్నేసి రాయితీలు ఎందుకిస్తున్నారు?” అని అడగాలి. అతనికి ప్రధాన మంత్రి ఆఫీసు నుండి ఫలానా ప్రశ్నల్ని అడక్కూడదనే ఆదేశాలు వొచ్చి వుండొచ్చు. అయితే చండప్రచండులైన గోస్వాములువారు ప్రధాన మంత్రి ఆఫీసు ఆదేశబద్దులై వుంటారా? వుండకూడదు కదా! స్టూడియోలో కూర్చుని కేకలేస్తూ గెస్టుల్ని తిట్టేసే అర్నబ్ గోస్వామి, ప్రధానమంత్రి దగ్గర వినయపూర్వకంగా ఎందుకు వొదిగిపొయ్యాడు?

సోషల్ సైకాలజీలో Obedience to Authority అని ఒక థియరీ వుంది. ఇది ‘పైనుండి’ వచ్చే అదేశాల్ని తుచ తప్పకుండా పాటించేవారి మనస్తత్వాన్ని చర్చిస్తుంది. లక్షలమంది యూదుల్ని హిట్లర్ వొక్కడే చంపలేదు, చంపలేడు. అతనికి తన ఆదేశాల్ని గుడ్డిగా అమలు చేసిన నాజీ అధికారులు తోడయ్యారు. మన సివిల్ పోలీసులు పై ఆధికారుల ఆదేశాలని పాటిస్తూ నిరసన చేస్తున్న వికలాంగులు, వృద్ధులు, స్త్రీలని చావ చితక్కొడతారు. ఈ పోలీసులే పోలీసు అధికారుల ఇళ్లల్లో ఆర్దర్లీలుగా మగ్గిపోతుంటారు (చూడుము – పతంజలి ‘ఖాకీవనం’, స్పార్టకస్ ‘ఖాకీబ్రతుకులు’).

అర్నబ్ గోస్వామి టీఆర్పీ కోసం aggression చూపిస్తాడు, తన కెరీర్ కోసం Obedience to Authority కూడా చూపిస్తాడు. స్టూడియోలో కూర్చుని చిన్నాచితకా నాయకుల్ని మందలిస్తూ, దేశభక్తిపై లెక్చర్లిచ్చే అర్నబ్ గోస్వామి బ్రతక నేర్చినవాడు. అందుకే ఎక్కడ ఎలా వుండాలో అర్ధం చేసుకుని సెలబ్రిటీ జర్నలిస్టయ్యాడు. ఇతగాడి విజయ యాత్ర యెందాకా సాగుతుందో తెలీదు గానీ, అది ఎంత తొందరగా ముగిసిపోతే దేశానికీ, ప్రజలకీ అంత మంచిదని నమ్ముతూ –

“మిస్టర్ గోస్వామి! ఐ హేవ్ ద ఇన్‌ఫర్మేషన్ విత్ మి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!”

*

ఆడంబరం లేని అబ్బాస్!

 

ఇంద్రగంటి మోహన కృష్ణ

~

 

mohanakrishnaఆంద్రెయ్ తార్కోవిస్కీ  (Andrei Tarkovsky) అనే ఒక గొప్ప రష్యన్ ఫిల్మ్ మేకర్ ఒక మాటన్నారు. కళలో అబ్సల్యూట్ సింప్లిసిటీ అంటే పరిపూర్ణమైన నిరాడంబరత అనేది చాలా కష్టమని అన్నారు. .అబ్సల్యూట్ సింప్లిసిటీ అంటే ఎటువంటి హంగులూ ఆర్భాటాలూ లేకుండా ఎంత క్లిష్టమైన విషయాన్నైనా సరళంగా  చెప్పగలగడం .

సరళంగా చెప్పగలగడం అంటే తెలివితక్కువగా సింప్లిస్టిక్ గా చెప్పడం అని కాదు. ‘సరళంగా చెప్పగలగడం అనేది ఒక అద్భుతమైన కళ’ అని తార్కోవిస్కీ అన్నారు. అలా అంటూ ఆయన, సంగీతంలో యొహాన్ సెబాస్టియన్ బెక్ (Johann Sebastian Bach)సంగీతమూ, సినిమాల్లో రాబర్ట్ బ్రెస్సోన్(Robert Bresson) సినిమాలూ ఇందుకు తార్కాణాలుగా పేర్కొన్నారు . నా దృష్టిలో వాళ్ల తర్వాత అబ్బాస్ కిరొస్తామీ(Abbas Kiarostami)సినిమాలు ఈ అబ్సల్యూట్ సింప్లిసిటీకి గొప్ప ఉదాహరణలు. దీనినే పరిపూర్ణమైన నిరాడంబరత అని కూడా అనవచ్చు.

అంటే ఎంచుకున్న విషయం చిన్నదైనా కూడా ఒక గొప్ప లోతునీ, ఒక అద్భుతమైన జీవిత సత్యాన్నీ అత్యంత సరళంగా ఆవిష్కరించగలిగిన  చాలా కొద్ది మంది దర్శకుల్లో నా దృష్టిలో కిరొస్తామీ ఒకరు.  ‘వైట్ బెలూన్’ గానీ, ‘ద విండ్ విల్ క్యారీ అజ్’ గానీ, ‘టేస్ట్ ఆఫ్ చెర్రీస్’ గానీ, ‘వేర్ ఈజ్ ద ఫ్రెండ్స్ హోం’ గానీ ఇలా ప్రతి సినిమాలోనూ ఒక దర్శకుడి యొక్క అహం గానీ, అహంకారం గానీ  కనబడకుండా అద్భుతమైన పారదర్శకతతో, సింప్లిసిటీతో ఎటువంటి ఆడంబరాలకీ, స్టైలిస్టిక్ టచెస్ కీ, అనవసరపు హంగామాలకీ పోకుండా జీవితాన్ని ఉన్నదున్నట్టుగా చూడటం, ఆ చూడటం ద్వారా అతి చిన్న విషయాలని కూడా  పరిశీలించడమెలాగో నేర్పించిన దర్శకుడు అబ్బాస్ కిరస్తామీ.  అది చాలా చాలా కష్టమైన కళ.

అబ్బాస్ కిరస్తామీ నా దృష్టిలో చనిపోలేదు. ఆయన అవసరం ఉంది కనుక కొంతకాలం మన భూమ్మీద నివసించడానికి వచ్చారు. ఇక వేరే గ్రహాల్లో, వేరే అంతరిక్షాల్లో, వేరే లోకాల్లో కూడా ఆయన అవసరం పడి ఉండటం వల్ల ఇలా వెళ్లిపోయారని అనుకుంటున్నాను. కాబట్టి థాంక్ యూ అబ్బాస్ కిరస్తామీ.

(సాంకేతిక సహకారం: భవాని ఫణి)