ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
కవి/రచయిత అంటే తన ఆలోచనలతో కవిత అనే ఓ అమ్మాయిని పుట్టించి ఓలీ లాంటి ప్రతిఫలం పుచ్చుకొని రసజ్ఞుడైన పాఠకునికి తన కవితను అందిస్తాడు. ఇక్కడ కవి ఆ కవితను సృష్టి చేస్తుంది రసజ్ఞుడైన కృతిభర్త కోరిక మీదనే అని గుర్తుంచుకుంటే…కవి ఏమి వ్రాయాలో నిర్ణయించేది పాఠకుడేనని తెలుస్తుంది. ఇక విమర్శకుడంటే అమ్మాయిల బ్రోకర్ వంటివాడు. ఆయా కవితలలోగల ప్రత్యేకతలను పాఠకులకు ఊరిస్తూ చెబుతూ ఆ పుస్తకాలు అమ్ముడుబోవడానికి సహకరించేవాడు. “రచయిత ఏమి రాయాలో పాఠకుడు నిర్ణయించలేడు. పత్రిక, లేదా పాఠకుడి డిమాండ్ని బట్టి సాహిత్యం వస్తే/ రాస్తే అది కమర్షియల్/ కలుషిత సాహిత్యమే అవుతుంది గానీ కమనీయ సాహిత్యం కాదు. ” అనే వాదనకు భూమిక లేనట్లుంది.
విమర్శకుడు కధకుని గొప్పదనాన్ని “ఈ కథ రచయిత దిలావర్ ‘మెనీ’ అంటే సమాజంలోని మెజారిటీ జీవితాల్నే చిత్రికగట్టిండు. ఇందులో కథకుడు తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నడు. తాను దగ్గరి నుండి చూసిన పద్మశాలి, మాదిగ, లంబాడీ జీవితాల్లోని దయనీయమైన వ్యధాభరిత గాథల్ని కళ్ళముందుంచిండు. ఒక వైపు నోస్టాల్జియాను చిత్రికగడుతూనే, చిధ్రమవుతున్న రైతుల, స్త్రీ జీవితాల్ని ద్రవించిన హృదయంలోంచి పాఠకుల మెదళ్ళలోకి ఒంపిండు. దిల్ని, దిమాక్ని కలెగలిపి కమనీయ సాహిత్యాన్ని మనముందుంచిండు. పాత్రలు ఉరి బెట్టుకున్నా కథలకు మాత్రం పాణం బోసిండు. చేదు నిజాల్ని తీపి పూత లేకుండా పాఠకులకు అందించిండు. ‘ఉత్పత్తి’ జీవితా హృదయావిష్కరణ చేసిండు. “ ఈ విధంగా పొగిడిండు.
వాస్తవానికి కవులు పాఠకులు విజ్ఞానాన్ని బోధించేవారు కాదు. అలాగా ఇది మంచిది… అది మంచిదిగాదు అని చెప్పేది కవిత్వం కాదు. కవిత్వమంటే నవరసాలను పాఠకులు అనుభవించేలా చేసేది.
కొలకలూరి ఇనాక్ వంటివారు ప్రత్యేక రకమైన రచయితలు కాదు. వారు కూడా అందరిలాంటివారే. విమర్శకులు ఇనాక్ గారి వంటి కవులలో ఏదో ప్రత్యేకత ఉందని పాఠకులను ఊరిస్తున్నారు. అంతకుమించి మరేమీ లేదనుకుంటున్నాను. రాజుల జీవితాలు లేదా ధనవంతుల జీవితాలను ఆసరాగా తీసుకొని రచనలు చేసేవారు పేదలను లేదా బహుజనుల జీవితాలను ఆసరాగా చేసుకొని రచనలు చేసేవారికంటే వేరైనవారు కారు. అందరూ కవులే.
“బ్రాహ్మణాధిపత్య విద్యాబోధన నుంచి బయటపడ్డ వారు తర్వాతి కాలంలో ఆలస్యంగానే అయినా కొత్త విషయాలను కథలుగా మలిచిండ్రు” కానీ బ్రాహ్మణ ఆధిపత్య విద్యాబోధన నుండి ఇంతవరకూ ఎవరూ బయటపటలేదు. ఆ ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు. ఎందుకంటే అది ఎలా చెయ్యాలో వారికి తెలీదు. నిజానికి బ్రాహ్మణ ఆధిపత్యము అంటే భావవాదధోరణి అని అనుకుంటున్నాను.
( ఇంకా ఉంది . కానీ….)
….ప్రభావితం కావడమే గానీ…. ప్రభావితం చేసేందుకు అవకాశం దక్కలేదు. వేదిక చిక్కలేదు. ఇది వన్వే. లెఫ్ట్ పార్టీ నుంచి దళిత, బహుజనులు స్వీకరించడమే గానీ తాను నేర్చుకున్నది అప్పజెప్పడానికి, ప్రభావితం చేయడానికి ఏ సాహిత్యశాలలూ, సాహిత్యకారులూ అవకాశం కల్పించబోరు. అది వారి ఆచరణకు విరుద్ధం….కరెక్ట్ #