శారద తండ్రి పోయిన దు:ఖం నుంచి తేరుకోటానికి సుబ్బమ్మ చేసినంత కృషి, ఏ తల్లీ ఏ కూతురికీ చేసి ఉండదు. ఆవిడ తన దు:ఖాన్ని పక్కనబెట్టి కూతురి బాధ్యత మీద వేసుకుంది. ఇంట్లో ఉన్నంతసేపూ శారదను ఒక్క నిమిషం కూడా ఒంటరిగా ఒదలలేదు. పగలూ , రాత్రి అంటిపెట్టుకుని తిరిగింది. శారద కన్నీరు తుడిచి నవ్వించటమే పనిగా పెట్టుకుంది. శారద గలగలా నవ్వుతుంది ఎప్పుడూ. శారద నవ్వే ఆమె అందం.
తండ్రి మరణించాక శారద దాదాపు నెలరోజులు నవ్వలేదు. మళ్ళీ శారద నవ్వు చూడగలనా అని భయపడింది సుబ్బమ్మ. ఏదో ఒకటి చెబుతూ కూతురి వెంటవెంట తిరిగి అలిసిపోయింది. నాలుగు నెలలు గడిచిన తర్వాత మళ్ళీ శారద గలగలా నవ్వుతూ ఇంట్లో తిరుగుతుంటే సుబ్బమ్మ ఎవరూ చూడకుండా కరువుతీరా కంటారా ఏడ్చి సేదతీరింది. శారదకు ఈ నాలుగు నెలలూ అన్నపూర్ణ ఉత్తరాలు కూడా తన దు:ఖం నుంచి తేరుకోటానికి సహాయపడ్డాయి.
ఇప్పుడు అన్నపూర్ణ, అబ్బయ్య కాకినాడలో ఉంటున్నారు. అబ్బయ్య కాకినాడ కళాశాలలో ఉద్యోగం సంపాదించాడు. పెళ్ళయిననాటి నుంచీ తామిద్దరం భర్త సంపాదనతో బతకాలనే అన్నపూర్ణ కోరిక తీరింది. చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి.
ఆ సంవత్సరం కాంగ్రెస్ మహాసభలు కాకినాడలో జరుగుతున్నాయి. అన్నపూర్ణ శారదను రమ్మని మరీ మరీ కోరింది. గాంధీ జైలు లో ఉన్నాడు. గాంధీ లేకుండా జరిగే మహాసభలకు రావాలని లేదంది శారద. గాంధీని చూడాలని, మాట్లాడాలనీ శారద మనసులో చాలా రోజుల నాడు పుట్టిన కోరిక అడయారు మర్రి వృక్షమంత అయింది. కాంగ్రెస్ మహాసభలకు వెళ్ళి అక్కడ గాంధీని తప్ప అందరినీ చూడటం ఆ అమ్మాయికి అంత ఆసక్తిగా లేదు
. చివరికి అబ్బయ్య ‘‘వాళ్ళను చూడటం, వీళ్ళను చూడటం కాదు సభకు రావటమంటే ` ఎవరేం మాట్లాడతారు? ఎలాంటి రాజకీయ చర్చలు జరుగుతాయి `? రాజకీయ వాతావరణం ఎలా ఉంది? ఏ తీర్మానాలు చేస్తారు? ఇవి తెలుసుకోవటానికి రావాలి’’ అని ఉత్తరం రాశాక గాని శారదకు తన ఆలోచనలో తప్పు తెలిసిరాలేదు. తప్పు ఒప్పుకుంటూ శారద రాసిన ఉత్తరానికి అబ్బయ్య ‘‘ఆకర్షణ వ్యక్తుల పట్ల ఏర్పడుతుంది. ఉద్యమాల్లోకి వ్యక్తి ఆరాధన వల్ల అనేకమంది వస్తారు. కానీ అక్కడే ఆగిపోకూడదు. వ్యక్తులను దాటి రాజకీయాలను అర్థం చేసుకోవాలి ’’అని సమాధానం రాశాడు. గాంధీని ఆరాధించకుండా ఉండటం నా వల్ల కాదు అనుకుంది శారద. కాకినాడ వెళ్ళటానికి సుబ్బమ్మ సులభంగానే ఒప్పుకుంది. ఏదో ఒక సందడిలో పడి శారద మామూలు మనిషి కావాలనేదే ఆమె కోరిక.
తల్లీ కూతుళ్ళనిద్దరినీ ఆత్మీయంగా అక్కున చేర్చుకుంది అన్నపూర్ణ. వీళ్ళు వచ్చేసరికే కాకినాడలో సభల హడావుడి మొదలైంది. అన్నపూర్ణా వాళ్ళ ఇల్లు చూసి శారద ఆశ్చర్యపోయింది. ఇంట్లో ఎక్కడా దేవుడి పటాలు లేవు. పూజగది లేదు. ఇల్లు చాలా నిరాడంబరంగా ఉంది. ఇంటి ముందు పెద్ద తోట పెంచుతున్నారు. కాకినాడలో అబ్బయ్యకు గోపరాజు రామచంద్రరావనే గురువు దొరికాడనీ, ఇదంతా ఆయన ప్రభావమనీ అన్నపూర్ణ చెప్తే సుబ్బమ్మ ఆశ్చర్యంగా ‘‘ఐతే ` నువ్వు కూడా నాస్తికురాలివయ్యావుటే’’ అంది. శారద ‘‘అమ్మా ` నాకూ దేవుడి మీద నమ్మకం లేదు. నీ కోసం నమస్కారం పెడుతున్నా అంతే’’ అంది.
‘‘మరి ఇక్కడ నా పూజా పునస్కారాలెలా?’’ సుబ్బమ్మ విలవిలలాడింది.
‘‘అన్నీ ఏర్పాట్లు చేస్తాను’’ అంటూ అన్నపూర్ణ ఎక్కడినుంచి తెప్పించిందో సీతారాముల పటం తెప్పించింది. వంటింటి పక్కనున్న చిన్నగదిలో ఒక పీటవేసి దానిమీద ఈ పటం పెట్టింది. సుబ్బమ్మ ఆ పటానికి పసుపు కుంకుము దిద్దేసరికి అన్నపూర్ణ, శారదా తోటలో నుంచి బుట్టెడు పూలు కోసుకొచ్చారు. సుబ్బమ్మ పూజ దివ్యంగా జరిగింది.
అన్నపూర్ణ శారదకు కాకినాడంతా చూపించింది. బులుసు సాంబమూర్తిగారు అంత హడావుడిలోను శారద రామారావు కూతురని చెప్పగానే పదినిముషాల పాటు ఆగి శారదను ఆప్యాయంగా పలకరించి, క్షేమ సమాచారాలడిగాడు.
ఇక సభలు జరిగే ప్రాంతంలో హడావుడి చెప్పనలవి కాదు. సభ కోసం నిర్మించిన పెండాల్ అద్భుతంగా ఉంది. దానిని జాగ్రత్త చేస్తే మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు కూడా. మంచి ఖద్దరు విరివిగా ఉపయోగించారు. ఎక్కడెక్కడి భాషలవారు. ఎన్నో జాతులవారు, భారతదేశపు చిన్నరూపంలా ఉంది కాకినాడ. శారద ఉత్సాహంగా కాకినాడ తన స్వంత ఊరులా తిరుగుతోంది. వాలంటీర్ల దళంలో అన్నపూర్ణతో పాటు తనూ చేరింది. శారద రామారావు కూతురనే విషయం తెలిసి చాలామంది వచ్చి పలకరించి వెళ్ళారు. శారద గలగలా నవ్వుతూ, బొంగరంలా తిరుగుతూ ఏ పనీ భారమనుకోకుండా చేస్తోంది.
ఆ రోజు ఉదయం వాలంటీర్ల రిక్రూట్మెంట్ జరిగే దగ్గర చిన్నపాటి గొడవ జరుగుతోందని తెలిసి శారద అక్కడకు వెళ్ళింది. అక్కడ ఒకమ్మాయి తననూ వాలంటీర్గా చేర్చుకోవాని పట్టుబడుతోంది. చిన్నపిల్లవని పెద్దలు ఆ పిల్ల మాటను తోసి పుచ్చుతున్నారు.
‘‘నేను గాంధీగారికి నా నగలన్నీ ఇచ్చాను. హిందీలో బాగా మాట్లాడగలను. హిందీలో నాలాగా మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమందున్నారో చూపించండి. ఉత్తరాది నుంచి వచ్చే ప్రతినిధులతో హిందీలో మాట్లాడుతాను. వాళ్ళ అవసరాలు కనుక్కుంటాను. ఈ సభకు నేను పోగు చేసినన్ని విరాళాలు ఎంతమంది పోగుచేశారో చెప్పండి’’ అంటూ ఆవేశపడుతోంది.
‘‘వయసుకంటే నైపుణ్యం ముఖ్యం కదా. హిందీలో మాట్లాడగలవాళ్ళు మనకు అవసరం కదా’’ అని శారద ఆ అమ్మాయి పక్షం వహించింది.
‘‘మనం వయసు నిబంధనగా పెట్టుకున్నాం కదా. దానిని పాటించాల్సిందే. మనం పెట్టుకున్న నిబంధనను మనమే ఉల్లంఘిస్తే ఎలా’’ వాళ్ళమాటలూ సబబుగానే ఉన్నాయి.
ఆ అమ్మాయి భుజంమీద చెయ్యివేసి ‘‘నీ పేరేంటోయ్’’ అనడిగింది.
‘‘దుర్గాబాయి’’ ఆ అమ్మాయి కోపంగానే చెప్పింది.
‘‘దుర్గాబాయి వలంటీరుగా ఉంటుంది. ఐతే సభ లోపలకాదు. బైటనే. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొందరి బాధ్యత దుర్గాబాయికి అప్పగించుదాం’’ అంది శారద.
‘‘అలా ఎలా కుదురుతుంది? చిన్నపిల్ల కదా ` తెలియక ఏదైనా పొరపాటు చేస్తే ? ’’
‘‘దుర్గాబాయి మాట్లాడే పద్ధతి , ఆమె వాదన చూస్తే అందరికంటే పెద్దదిలా ఉంది గానీ చిన్నపిల్లలా లేదు. హిందీ బాగా వచ్చునంటున్నది. ఈ ఉత్సాహం మీద చన్నీళ్ళు చల్లకండి’’ శారద దుర్గాబాయి తరపున మాట్లాడింది.
చివరకు సభ ప్రవేశ ద్వారంలో పని చేయటానికి, కొందరు ఉత్తర భారతదేశ మహిళా ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళ అవసరాలు తీర్చటానికి దుర్గాభాయి బాధ్యత వహించేలా ఒప్పించగలిగింది శారద.
‘‘మీరు ఎక్కడినుంచి వచ్చారు?’’ దుర్గాబాయికి శారద బాగా నచ్చింది.
‘‘నన్ను మీరు అనకు. మనం ఇక స్నేహితులం. నేను మద్రాసు నుంచి వచ్చాను. నా పేరు శారద. ఇంటర్ పరీక్షలు రాశాను’. దుర్గాబాయి మెచ్చుకోలుగా చూసింది.
‘‘ఇంటర్ పాసయితే ఇంకా చదువుతావా? పెళ్ళి చేసుకుంటావా?’’
‘‘పెళ్ళా ? నేనా? నేను మెడికల్ కాలేజీలో చేరాలి డాక్టర్నవుతాను. పెళ్ళి చేసుకోను. పెళ్ళి చేసుకుంటే ఇలా సభకు స్వేచ్ఛగా రాగలమా?’’
‘‘నాకు పెళ్ళయింది. ఐనా వచ్చాను’’.
అప్పుడు గమనించింది శారద. దుర్గకు పెళ్ళయిన గుర్తులున్నాయి.
‘‘ఐతే నువ్వు చాలా గొప్పదానివి. ఇంట్లో ఒప్పుకున్నారా?’’
‘‘నేను ఎవరినైనా ఒప్పిస్తా. ఒప్పుకోకపోయినా వస్తా’’.
శారద ఆప్యాయంగా రెండుచేతులతో దుర్గాబాయిని దగ్గరకు తీసుకుంది.
‘‘నువ్వు నాకంటే మొండిదానివిలా ఉన్నావు. నాతో స్నేహం చేస్తావా?’’
‘‘ఓ! ఎందుకు చెయ్యను? నాకు కాలేజీలో చదువుకోవటం చాలా ఇష్టం. కుదరలేదు. హిందీ మాత్రం బాగా నేర్చుకున్నా.’’
అన్నపూర్ణకు దుర్గాబాయి గురించి చెబితే ‘‘ఆ అమ్మాయి గురించి ఈ ప్రాంతాలో తెలియని వారు లేరు. బులుసు సాంబమూర్తి గారి ప్రియ శిష్యురాలు’’ అంది. అబ్బయ్య కూడా దుర్గాబాయి గురించి చాలా మంచిగా చెప్పాడు. శారద దుర్గాబాయిని చూసి ప్రేరణ పొందిందనే చెప్పాలి.
‘తనకంటే చిన్నది. తనకున్న అవకాశాలు లేవు. పెళ్ళయింది. చదువుకునే అవకాశం లేదు. ఐనా అన్ని ఆటంకాలనూ దాటుకుంటూ వస్తోంది. తనకు రామారావు కూతురనే మాట ఒక్కటి చాలు. ఎక్కడికి వెళ్ళినా ఎదురుండదు. ఇలాంటి తండ్రి ఎందరికుంటాడు. చదువుకోటానికే పుట్టినట్లు చదువుతోంది. ఎందరికి ఇలాంటి అవకాశం ఉంటుంది? వీటన్నిటినీ దేశం కోసం వినియోగించాలి. మరింత ఎక్కువగా’ అనుకుంది తనలో తానే.
ఇంగ్లీషు, హిందీలో చకచకా మాట్లాడుతున్న శారదను చూస్తే దుర్గాబాయిలో చదువుకోవాలన్న కోరిక పెరిగింది. చదవాలి. ఇంగ్లీషులో మాట్లాడాలి. హిందీ మంచిదే. కానీ చూస్తోంది గదా ` ఇంగ్లీషు చదివిన వారికే ఎక్కువ విలువ.
గాంధీ, నెహ్రూ, సాంబమూర్తిగారు, ప్రకాశం గారూ ఎవరు చూడు ఇంగ్లీషులో పెద్ద చదువు చదివారు. పెద్ద డిగ్రీలు సంపాదించారు తనూ చదవాలి.
సభ ప్రారంభమయ్యాక దుర్గాబాయికి మరింత బాగా అర్థమైంది స్త్రీకి ఎన్ని తెలివితేటలున్నా పెద్ద చదువు, డిగ్రీలు లేకపోవటం వల్ల వాళ్ళను మగవాళ్ళు తేలికగా వెనక్కి నెడుతున్నారని. నెల్లూరు నుంచి వచ్చిన కనకమ్మ గారు చాలా బాగా మాట్లాడటం, హిందీలో ధారాళంగా మాట్లాడటం చూసి దుర్గాబాయి ఆమెను చాలా గౌరవంతో చూసింది. కానీ పెద్ద నాయకురాలు ఆమెకు ఇవ్వాల్సినంత గౌరవం ఇస్తున్నారా అనే అనుమానం కూడా వచ్చింది. ఆమె నెల్లూరులో బాలిక పాఠశా స్థాపించి గాంధీ గారితో శంకుస్థాపన చేయించారని విని దుర్గ ఆమె పరిచయం చేసుకుంది.
‘‘నేను మా ఇంట్లోనే ఆడపిల్లలను పోగు చేసి హిందీ నేర్పుతున్నానండి’’ అని వినయంగా చెప్పింది.
కనకమ్మ దుర్గాబాయిని అభిమానంగా చూసి ‘‘మంచిపని చేస్తున్నావమ్మా దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు’’ అని దీవించింది.
‘‘మీరు బాలిక పాఠశాల పెట్టారట’’
‘‘ఔను అదిప్పుడు చాలా అవసరం. ప్రతి ఊళ్ళో ఆడపిల్లలకొక బడి కావాలి. ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా చదువుకోవాలి’’.
‘‘లేకపోతే మగవాళ్ళు మనల్ని ఎక్కి రానివ్వరు. లెక్కచెయ్యరు ` కదండీ?’’ దుర్గ మాటకు కనకమ్మ నవ్వేసింది.
‘‘ఒకళ్ళు ఎక్కిరానిచ్చేదేమిటి? మన పని మనం చెయ్యాలి. ఫలితం భగవంతుడికి ఒదలాలి. గాంధీగారు ` ఇంకా అంతకు ముందు గీతలో శ్రీకృష్ణుడు అదేగదా చెప్పారు’’.
దుర్గాబాయికి ఎందుకో ఆ మాట నచ్చలేదు. ఎవరు చెప్పినా సరే ` ఫలితం గురించి ఆలోచించాలనే అనిపించింది ఆ అమ్మాయికి. చేసేపనికి ఫలితం లేకపోతే ఎలా? ఇంత ఉద్యమం చేస్తున్నాం. దీనికి ఫలితంగా స్వరాజ్యం రాకపోతే ఎట్లా? పని చేశామంటే ఏదో ఒకటి సాధించాలి.
తన ఆలోచనను శారదతో చెబితే ఆమె కూడా దుర్గ మాటనే బలపరిచింది.
‘‘ఫలితం రానపుడు మరీ నిరాశపడకూడదని అలా అంటారు గానీ ఫలితం వచ్చి తీరాలి. ఈ సభలు ఇంత వైభవంగా ఇంత కష్టపడి జరుపుతున్నాం. దీనికి ఫలితం ఉండాలి కదా’’.
శారద తనలా ఆలోచించినందుకు దుర్గ మనసు తేలికయింది. శారదను కనకమ్మ గారికి పరిచయం చేసింది. ‘‘రామారావు గారి అమ్మాయివా’’ అమ్మా అంటూ కనకమ్మ శారదను దగ్గరకు తీసుకుని తల నిమిరి ఆశీర్వదించింది.
బెంగాల్నుంచి వచ్చిన స్త్రీలు, బొంబాయి నుంచి వచ్చిన స్త్రీలు చాలా చురుగ్గా ఉన్నారు. కలకత్తా, బొంబాయి నగరాల ప్రభావం కావచ్చు. శారదకు చాలా మందితో స్నేహం కలిసింది. సిక్కులు చేసే ప్రార్థనలు, వాళ్ళు పంచే ప్రసాదాలు అందరికీ నచ్చాయి. ఆ సమయాల్లో చాలామంది ప్రార్థనలు జరిగే చోటికి చేరేవారు. కస్తూర్భాగాంధి మాటు వింటుంటే గాంధిని విన్నంత అనుభూతి కలిగింది. దుర్గ, అన్నపూర్ణ ముందు గాంధీని చూసి ఇపుడు కస్తూర్బాను చూస్తున్నారు. శారద గాంధీని వినే అదృష్టం తనకు లేదా అని దిగుపడింది. ఈ పైపై విషయాలను గమనిస్తూ, అనుభూతి చెందుతూనే సభలో జరిగే చర్చ సమాచారం ఎప్పటికప్పుడు రాసుకుంటోంది శారద.
అక్కడ జరుగుతున్నవన్నీ శారదకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఆవేశం రగిలిస్తున్నాయి.
అన్నిటికంటే ముఖ్య విషయం గాంధీగారు బోధించి కార్యక్రమం రూపొందించిన విదేశీ వస్తు బహిష్కరణకు విరామం ఇవ్వాలని తీర్మానం పెట్టారు. దానికే శారద అదేమిటని ఆవేశపడుతుంటే ఆ తీర్మానాన్ని దాదాపు అందరూ బలపరిచారు. ఇంతమంది ఒద్దనుకుంటున్న కార్యక్రమం గురించి గాంధీ మాట్లాడినపుడు వీరంతా తలూపినవారే ` ఆఖరికి చిత్తరంజన్దాస్ కూడా ఆ తీర్మానాన్ని గెలిపించటానికి కృషి చేశాడని చెప్పుకుంటుంటే శారదకు ఏం చెయ్యాలో తెలియలేదు. ఇంతమంది తనకు వ్యతిరేకులున్నారని గాంధీ గారికి తెలుసా? ప్రకాశం గారు పెట్టిన తీర్మానం ఒక్క ఓటుతో ఓడిపోయింది. ఆయన ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ప్రతిపూటా ఒక సంచలనమే. నాయకు వాగ్యుద్ధాల శారదకింత వరకూ పరిచయం లేదు. ఇక్కడ మొదటిసారి చూసి విస్తుపోయింది. మోతీలాల్ నెహ్రూ, గాంధీ చెప్పినదానికి, పూర్తి వ్యతిరేకమని, అబ్బయ్య చెబుతుంటే నమ్మబుద్ధి కాలేదు. అందరూ కాంగ్రెసే అయితే ఇన్ని విభేధాలేమిటని రాత్రుళ్ళు ముగ్గురూ కూచుని చర్చించుకున్నారు.
బహిష్కరణోద్యమం తదితర విషయాల మీద ఇంత వ్యతిరేకత ఉందని గాంధీ గారికి తొసా? జైల్లో ఉన్న ఆయనతో వీళ్ళు చర్చిస్తున్నారా అనే సందేహం శారదది.
‘‘చర్చించినా చర్చించకపోయినా వీళ్ళు నమ్మింది వీళ్ళు చేస్తున్నారు. గాంధీగారు నమ్మింది ఆయన చేస్తున్నాడు’’ అన్నాడు అబ్బయ్య ఇవన్నీ కాచి వడపోసినవాడిలా.
‘‘ఒక పార్టీలో ఒక పద్ధతి ఉండొద్దా? ఏం అన్నపూర్ణా?’’
‘‘ఉంటే మంచిదే. కానీ ఆ పద్ధతి గురించి నమ్మకం లేనివాళ్ళకు, ఇంకో పద్ధతి మంచిదన్న ఆలోచన ఉన్నవాళ్ళకు కూడా తమ ఆలోచను ఆచరణలో పెట్టే అవకాశం ఉండాలి గదా. లేకపోతే ఒకరి మాట మీదే చర్చ కూడా లేకుండా నడుచుకుంటే తీరా అది చెడు ఫలితాలనిస్తే ` అబ్బయ్య చెప్పిన మాటల్లో కూడా తప్పుపట్టటానికేమీ లేదనిపించింది. కానీ అందరూ గాంధీ మాట ప్రకారం నడిస్తే బాగుండనిపించింది.
‘‘మనకు ఈ విషయాలు తెలిశాయి గానీ, ప్రజందరూ, అంతా గాంధీ గారు చెప్పినట్టే జరుగుతుందనుకుంటున్నారు. ఇంతమంది నాయకులు నేను నేనని పోటీ పడుతున్నారు గానీ ప్రజలకు మాత్రం గాంధీ ఒక్కడే నాయకుడు’’ అంది అన్నపూర్ణ.
‘‘ఆయన ఎలా సాధించాడది?’’ శారద విస్మయంగా అడిగింది.
‘‘మొండితనంతో, నిరాడంబరంతో. కొన్ని విశ్వాసాలను త్రికరణశుద్ధిగా పాటించడం వల్ల ` ప్రజలకు ఎవరు నిజమైన నాయకుడో తెలిసిపోతుంది. నాయకుడికి నిర్భయం, మొండితనం ఉండాలి. అవి ఉంటే దానికి సత్యం, చిత్తశుద్ధి తోడయితే ఇక తిరుగులేదు. గాంధీగారిలో ఇవన్నీ ఉన్నాయి. ఆయన కోర్టులో చెప్పిన మాటలు విన్న తర్వాత ఇక ఆయన నాయకత్వానికి తిరుగులేదంది దేశం ’’
కాకినాడ సభ వల్ల శారదకు రాజకీయ పరిణితి వచ్చింది. సభలు పూర్తయ్యాక కూడా వారం రోజులు అన్నపూర్ణ దగ్గరే ఉండిపోయింది. అబ్బయ్య, అన్నపూర్ణతో కలిసి చేసిన చర్చలకు అంతే లేదు. వీటన్నిటితో తండ్రి మరణం కాస్త వెనక్కువెళ్ళి, ఉత్సాహంగా, ధైర్యంగా మద్రాసు తిరిగి వచ్చింది. తండ్రి మరణంతో అంతా శూన్యమనిపించిన భావన పోయి దేశమంతా తనతో ఉన్న భావన, బోలెడు బలం వచ్చాయి. ముఖ్యంగా కనకమ్మగారు, దుర్గాబాయి చెరొక విధంగా శారదకు స్ఫూర్తి నిచ్చారు. తను చెయ్యవసిన పనులెన్నో ఉన్నాయి.
‘‘తనవల్ల దేశం ఒక్కడుగన్నా ముందుకు వెయ్యాలి’’ అని ప్రతిన పూనింది.
శారదలో ఉత్సాహాన్ని చూసి సుబ్బమ్మ అన్నపూర్ణను నూరేళ్ళు చల్లగా ఉండమని మనసులోనే మరీ మరీ దీవించింది.
***
శారద మెడికల్ కాలేజీలో చేరిన రోజు సుబ్బమ్మ పండగ చేసింది. రామారావు మాట నిలబెట్టానన్న ఉత్సాహంతో ఆమె బంధువులందరికీ విందు చేసింది. శారద తండ్రిని తలచుకుని బాధ, ఆయన కోరిక తీరుస్తున్నందుకు సంతోషమూ..
రోజులు సంవత్సరాలవుతున్నాయి. శారద ఇంటిని యువజన విద్యార్థి కేంద్రంగా చేసింది. శారదతో పాటు చదివేవాళ్ళే కాదు, ఏ చదువుకో మద్రాసు వచ్చిన ఉద్యమపు ప్రవాహంలో పడినవాళ్ళు, చదువు, ఉద్యమం రెండిరటిలో రెండు కాళ్ళుంచినవాళ్ళు, చదువు మాని ఉద్యమంలోకి దూకిన వాళ్ళు, ఉద్యమంలో ఇమడలేక బైటికి వచ్చి నిరాశలో మునిగిన వాళ్ళు ఇలా ఎంతమంది యువకులకో మద్రాసులో శారద ఇల్లొక నెలవు. కొందరు నెలల తరబడి ఉండిపోయేవాళ్ళు. వాళ్ళందరి చర్చతో ఆ ఇల్లు వేడెక్కేది.
నిరాశతో కుంగి వచ్చిన వాళ్ళలో శారద ఉత్సాహం నింపేది. భుజం తట్టి పంపేది. అందరూ శారదనూ ‘‘అక్కా’’ అని ఆత్మీయంగా పిలిచేవారు. శారదకంటే పెద్దవారు ‘‘అమ్మా శారదా’’ అంటూ ఆప్యాయంగా పిల్చేవారు. శారద ఇంటికి ఉద్యమం అని పేరు పెట్టింది. చిత్రకళలో ప్రవేశమున్న విద్యార్థి ఒక చిత్రాన్ని ఉద్యమమనే పేరుని గట్టి అట్టమీద గీసి ఇంటి వరండాలో తగిలించాడు.
‘‘పోలీసు అడిగితే నీ పేరే చెప్తా’’ అని అతన్ని ఏడిపించేది శారద. రామారావు ఉన్నరోజుల్లో ఆ ఇంటికి వయసులో, పాండిత్యంలో, అనుభవంలో తలపండిన పెద్దలొచ్చేవారు. ఇపుడు వేడిరక్తపు ఉరకు, దేశం కోసం సర్వం అర్పించానే తపన ఉన్న యువకులు వస్తున్నారు. సుబ్బమ్మకు ఎవరైనా ఒక్కటే. అందరికీ అన్నం పెట్టి ఆదరించటం వారి ప్రేమను పొందటం.
శారద అపుడపుడూ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి దగ్గరకు, ప్రకాశం పంతులు గారింటికీ వెళ్ళొస్తుంది. హరిగారు వచ్చి వీరి యోగక్షేమాలు విచారించి వెళ్తారు. రామారావు మరణం వీరిద్దరినీ ఎంత తాకిందో హరిగారినీ అంతే తాకింది. శారదను చూసి తన స్నేహితుడిని చూసినట్లు సంతోషపడేవారు. వీరి ముగ్గురి నుంచీ ఆమెకు పిత్రువాత్సల్యం దొరుకుతోంది.
ప్రజను ఉత్తేజపరిచేలా ఉపన్యాసాలివ్వటం నేర్చుకోవాలనుకుంది శారద. కాకినాడ సభలో ఉపన్యాసాలతో ప్రజను ` ఉత్సాహ పరిచిన పొణకా కనకమ్మ ఇంకా ఇతర మహిళా నాయకులను చూసిన తర్వాత శారదకు మాటకున్న శక్తి అర్దమయింది.
ఒకనాడు ఉదయాన్నే లేచి మైలాపూర్ బీచికి బయలు దేరింది. ఇంకా సరిగా తెల్లవారనే లేదు. సముద్రపు ఒడ్డున జన సంచారం పెద్దగా లేదు. శారద అలలకు దగ్గరగా వెళ్ళింది. ఆ ప్రశాంతమైన ఉదయాన కూడా అలలు ఎగసిపడుతున్నాయి. హోరెత్తుతూనే ఉన్నాయి. శారద గొంతెత్తి ఆ అలలనుద్దేశించి మాట్లాడటం మొదలు పెట్టింది. స్వాతంత్య్రం అవసరమేమిటో ఆ అలలకు అర్థమయ్యేలా, ఎక్కడో దూరాన సాగరగర్భంలో పుడుతున్న అలలకు వినిపించేలా గంభీరంగా, గట్టిగా మాట్లాడుతోంది శారద. కంఠస్వరానికి, వాగ్ధోరణికి ఇది మంచి వ్యాయామ మనిపించింది. ఆ రోజు నుంచీ ప్రతిరోజూ తెల్లవార్జు ఝామునే లేచి కాసేపు చదువుకుని, ఆ తర్వాత సముద్రపు ఒడ్డుకి చేరటం, అలలకు ఒక ఉపన్యాసం ఇవ్వటం శారదాంబకు అవాటైంది. అసలే మాటకారి. ఏం మాట్లాడినా సూటిగా స్పష్టంగా, అర్థవంతంగా మాట్లాడే శారద మరింత పదును తేలింది.
ఎవరూ వినటం లేదనే ఆలోచన స్వేచ్ఛనిచ్చేదేమో. ఎంతో సంతోషపడేది ఆ ఉదయపు ఉపన్యాసానికి.
ఆ శనివారం ఉదయం కూడా శారద తనను తాను మర్చిపోయి, ఉపన్యాసంతో అలల హోరుని చిన్నబుచ్చుతుండగా పక్కన ఎవరో నవ్వినట్లయి తిరిగి చూసింది. ఎవరో యువకుడు నవ్వుతున్నాడు. శారదకు కోపం వచ్చి వెంటనే ముఖం పక్కకు తిప్పుకుంది. అతను మరింత దగ్గరకు వచ్చి ‘‘ఎవరికి నీ ఉపన్యాసం?’’ అని అడిగాడు.
‘‘వినగలిగిన వాళ్ళందరికి’’ శారద తొణకకుండా సమాధానమిచ్చింది.
‘‘ఉపన్యాసం ఇవ్వాలని ఉందా? ఎవరూ వేదిక మీదకు పిలవటం లేదా? నాకు ప్రకాశం గారు తెలుసు. ఆయనతో నీ గురించి చెప్పి నిన్ను పిలిచేలా చెయ్యగలను.’’ కాస్త చిలిపితనం కగలిపి మరీ నవ్వాడు.
‘‘నేనెవరో తెలుసా?’’ తీవ్రంగా అడిగింది.
‘‘నాకెలా తెలుస్తుంది? మొదటిసారి చూస్తున్నా. సహాయం చేద్దామనుకున్నా. అంత కోపం వచ్చే పని నేనేం చేశాను. అలా చూస్తున్నావు?’’ పరిహాసం ఆగనంటూ అతని గొంతులోంచి బైటికొస్తోంది.
‘‘మొదటిసారి చూసి పలకరించే వాళ్ళను మర్యాద లేకుండా ఏకవచనంలో మాట్లాడతారా? అడగని సహాయానికి హాస్యంగా పూనుకుంటారా?’’
ఆ యువకుడికి తన ఎదుట ఉన్న యువతి సామాన్యురాలు కాదని అర్థమైంది.
‘‘క్షమించండి. నా పేరు సత్యనారాయణ మూర్తి. లా చదివాను. ప్రకాశంగారి దగ్గర పనిచేస్తుంటే ఆయన కాస్తా ప్రాక్టీసు మానేశారు. నా తిప్పలు నేను పడుతూ, స్వతంత్ర ఉద్యమంలో చేయగలిగింది చేస్తున్నా’’.
‘‘నా పేరు శారదాంబ. మా నాన్నగారు రామారావుగారు. చరిత్ర పరిశోధకులు. ఇపుడు కీర్తిశేషులు. నేను మద్రాస్ మెడికల్ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతున్నాను. ప్రకాశం గారు నాకు పినతండ్రి వంటి వారు.’’
మూర్తి మొఖం వెలవెలబోయింది. ఆ యువతితో ఆషామాషీగా మాట్లాడటం ఎంత తప్పో తెలిసి వచ్చింది. తెలివి, తీక్షణత, ధైర్యంతో మెగుతున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు.
శారద అక్కడినుంచి కదిలి ముందుకు నడిచింది.
‘‘నన్ను క్షమించండి. అపరాధం చేశాను’’ అన్నాడతను.
‘‘అలాగే క్షమించాను. మళ్ళీ ఎవరిదగ్గరా ఇలాంటి అపరాధాలు చేసి క్షమాపణు అడిగే పరిస్థితిలో పడకండి’’ అంటూ ధీమాగా నడుచుకుని వెళ్ళిపోయింది శారద.
మూర్తి అలాగే నిబడిపోయాడు. శారద రూపం, వ్యక్తిత్వం అతని మనసులో అలజడి రేపాయి. ఆ అలజడి అతనికి అర్థం కాలేదు.
‘‘ఎంత అపురూపం ఇలాంటి యువతి’’ అనుకున్నాడు. అర్థంకాని ఆలోచనలతో సతమతమవుతూ ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. మర్నాడు ఉదయం శారద కోసం ఎదురు చూస్తూ సముద్రపు ఒడ్డున నిలబడక తప్పని మానసిక స్థితిలో పడ్డాడు.
శారద అతన్ని గమనించనట్టు తనురోజూ నిబడే చోట నిబడి ఉపన్యాసం ప్రారంభించింది. అరగంట గడిచాక ఆ వాక్ప్రవాహం ఆగింది. మూర్తి మెల్లగా శారద పక్కన చేరాడు.
‘‘మీరు చాలా బాగా మాట్లాడారు. కానీ ఒక పొరపాటు చేశారు.’’
‘‘పొరపాటా? ఏంటది’’ ఆశ్చర్యంగా అడిగింది శారద.
‘‘పొరపాటంటే పొరపాటు కాదు. బ్రిటీష్వాళ్ళు మన కులవృత్తున్నిటినీ నాశనం చేశారనే మాట ఒకసారి అన్నారు.’’
‘‘ఔను’’
‘‘కులవృత్తులు ఉండాలా?’’
‘‘అంటే?’’
‘‘అంటే ఏ కులంలో పుట్టినవాళ్ళు ఆ వృత్తే చెయ్యాలా?’’
‘‘కాదు. కాదు. అది నా ఉద్దేశం కాదు’’.
‘‘అది కాదని నాకు తెలుసు. అలాంటపుడు కులవృత్తునే మాట ఎందుకు? చేతివృత్తులంటే సరిపోదా?’’
శారద ఇపుడు అతన్ని తేరిపార చూసింది. తెలివిగా ఉన్న అతని ముఖంలో సన్నని చిరునవ్వు ప్రకాశిస్తోంది. ఎత్తుగా, బలంగా, తెలివిగా ఉన్న ఆ యువకుని చూసిన శారదకు మొదటిసారి ఒక పురుషుని చూసిన స్పందన కలిగింది. ఆ స్పందన అంతకు ముందు ఎరగనిది. ఒక నిముషం పాటు సర్వం మర్చిపోయి అతన్ని చూస్తూ ఉండిపోయింది. అతనికి శారద అనుభూతి అర్థమైంది. అర్థమై ఒక రకమైన గర్వం కలిగింది. దానిని దాచుకునే వ్యవధానం తీసుకుని అతను మళ్ళీ మాట్లాడాడు.
‘‘ఇంకొక విషయమేమిటంటే మీరు బ్రిటీష్వాళ్ళ నుంచి స్వతంత్రం పొందిన అమెరికా స్వతంత్ర పోరాటాన్ని గురించి మాట్లాడుతున్నారు. బాగుంది. అమెరికా స్వతంత్ర పోరాటానికి, మన ఉద్యమానికి మీరు తెచ్చిన పోలికా బాగుంది. వాళ్ళు బ్రిటీష్వాళ్ళ తేయాకును బహిష్కరించినట్లే మన విదేశీ వస్తు బహిష్కారం ఉంది. అంతా నిజమేకాని మనకివాళ అమెరికా ఆదర్శం కాదు అనిపిస్తుంది. అమెరికాలో నల్ల వాళ్ళ బానిసత్వం అలాగే ఉంది. సోవియట్ యూనియన్లో సమానత్వం రాజ్యమేలుతోంది’’.
శారద ఆలోచనలో పడింది. సోవియట్ యూనియన్ గురించి ఆమె విన్నది. కొంత అక్కడా, అక్కడా చదివింది ` ఉన్నవ వారి ‘‘మాలపల్లి’’ నవల చదివి రష్యా విప్లవం గురించి తండ్రినడిగి కొంత తెలుసుకుంది. కానీ దాని గురించి సాధికారికంగా ప్రస్తుతం మాట్లాడలేననుకుంది.
‘‘మీరు చెప్పిన విషయా గురించి ఆలోచిస్తాను. రేపు కలుద్దాం’’ అతనికి నమస్కారం చేసి చకచకా నడిచి వెళ్ళిపోయింది.
‘‘రేపు కలుద్దాం’’ అనే మాట మూర్తిలో ఎన్నో అనుభూతులు రేపింది. ఉత్సాహంగా ఇంటికి వెళ్ళాడు.
శారద ఆ రోజు కాలేజీలో ఉన్నదన్నమాటేగాని మనసంతా సోవియట్ యూనియన్ గురించిన ఆలోచనలే నిండిపోయాయి.
ఆ ఆలోచనలు పంచుకోటానికి విద్యార్థి మిత్రులు, వార్తాపత్రికా విలేఖరులూ నిత్యం శారదా వాళ్ళింట్లో ఉండనే ఉంటారు.
ఆ రోజు సాయంత్రం వాళ్ళందరి మనసుల్లో సోషలిజం అనే భావన నిండేలా మాట్లాడింది శారద. వాళ్ళంతకు ముందు ఆ మాట వినలేదని కాదు. కానీ శారద ఆ మాట వాళ్ళ మనసుల్లో ఇంకేలా మాట్లాడిరది. మొదటిసారి అందరికీ సోషలిజం గురించి నిజమైన ఆసక్తి కలిగింది. ఒకరిద్దరు యువకులు మన మతాచారాలకు అది సరిపడదన్నా మిగిలిన యువకులందరూ సోషలిజం గురించి కగనటం మొదుపెట్టారు. అదొక కొత్త కల. దేశంలోని యువతరానికి అప్పుడప్పుడే అందుతున్న కల. అస్పష్టమైన ఆశను రేకెత్తించే అందమైన ఊహ. ఆ ఊహ గురించిన స్పష్టమైన రూపాన్ని దర్శించేందుకు ఆరోజు సాయంత్రం శారద చేసిన ప్రయత్నంలో అప్రయత్నంగా భాగస్వాములై పోయారు.
‘‘మన కాంగ్రెస్ పెద్దలు సోషలిజం అంటే ఎందుకింత భయపడుతున్నారు’’ రామకృష్ణ అసహనంగా అడిగాడు.
‘‘గాంధీగారు కూడా టాల్స్టాయ్ గురించి మాట్లాడతాడు గానీ లెనిన్ గురించి మాట్లాడడేం’’.
‘‘రష్యాకూ మనకూ తేడా లేదా? లెనిన్ వాళ్ళ దేశపు నిరంకుశ రాజరికంతో యుద్ధం చేశాడు. మనం పరాయి ప్రభువుతో యుద్ధం చేస్తున్నాం. దానికి ఇక్కడి రాజు, ధనికు సాయం కూడా కావాలి కదా ` లేకపోతే వాళ్ళు పూర్తిగా బ్రిటీష్ వాళ్ళతో కలిసిపోతారు.’’
‘‘కలిస్తే వాళ్ళకేం కలిసొస్తుంది? నాశనమవుతారు.’’ సుదర్శనం కసిగా అన్నాడు.
‘‘బ్రిటీష్ వాళ్ళు వాళ్ళకు రొట్టె ముక్క విసిరేసి లోబరుచుకుంటారు.’’
‘‘అందుకని మనం రొట్టెంతా వాళ్ళకివ్వాలా? ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టుకోటానికి’’ విశ్వనాధం కోపంగా అడిగాడు.
‘‘ముందు బైటి శత్రువుని తరిమితే తర్వాత లోపలి వాడి సంగతి చూడొచ్చు’’ బాపయ్య తన లోపలి ఆలోచన బైటపెట్టాడు.
‘‘ఏమో నాకు నమ్మకం లేదు’’. మల్లికార్జునరావు ఎప్పుడూ ఈ మాటే అంటాడు. అతనికి దేనినైనా నమ్మటం గురించి నమ్మకం లేదు.
‘‘అందుకే నిన్ను నిరాశావాది అంటాం’’ గోవిందరెడ్డి వెక్కిరించాడు.
‘‘కాంగ్రెస్లో ఆశ కన్పించకపోతే ఇక నిరాశేనా? వేరే దారు గురించి ఆలోచించాలి గదా’’ రామకృష్ణయ్య.
‘‘వేరే దారి కనిపించేదాకా కాంగ్రెస్లో ఉండాంటే కంపరంగా ఉంటోంది. రాజు, జమీందార్లు, కాంగ్రెస్ అధికార పీఠాలకెక్కుతుంటే మనం వాళ్ళకు విధేయుమై ఉండాలా.’’ సుదర్శన్ కళ్ళు ఊరికే ఎర్రబడతాయి.
‘‘గాంధీని చూసి ఉండాలి’’.
‘‘నాకు గాంధీ మీద కూడా నమ్మకం పోతోంది.’’
‘‘నీది మరీ విడ్డూరం. ఎవరెలా ఉన్నా గాంధీ దేశానికి మేలు చేస్తాడు’’.
‘‘చూస్తాంగా’’
‘‘కాంగ్రెస్ని కాదని ఏం చేస్తాం? ప్రజంతా దానితో ఉన్నపుడు కొత్త దారిలో నడవటమంటే జనం మనల్ని పిచ్చి వాళ్ళంటారు. ఆ ముద్ర పడిందా మనకు మోక్షం లేదు.’’ బాపయ్య బాధగా అన్నాడు.
‘‘కాంగ్రెస్లో ఉంటూనే కాంగ్రెస్ని మార్చాలి’’.
‘‘నువ్వే మారతావేమో’’ అందరూ నవ్వారు.
‘‘ఊరుకోండి. రామకృష్ణ, శారదక్క చెప్పింది నిజం. మనం కాంగ్రెసులో ఉంటూనే ఒక గ్రూపుగా మనదారి వెతుక్కొవాలి. మన గమ్యం ఒట్టి స్వతంత్రం కాదు. శారదక్క చెప్పిన సోషలిస్టు స్వతంత్రం’’ గోవిందరెడ్డి మాటతో అందరూ నిశ్శబ్ధమై పోయారు.
శారద ఆ ఉద్రిక్త వాతావరణాన్ని మార్చాలనుకుంది. అందరూ కాస్త చల్ల బడేలా సన్నగా ఒక పాట అందుకుంది. అది దుర్గ కాంగ్రెస్ సభలో పాడిన పాట. ఆ సభలో బాలికలు యువతులూ దుర్గ వెనకా నడుస్తూ దుర్గ గొంతులో గొంతు కలిపి ఆ పాట పాడేవారు.
‘‘మేలు కొనుమా భరతపుత్రుడ
మేలు కొనుమా సుజన మిత్రుడ
వేడుకను జాతీయత అను
వేగుచుక్కా పొడిచెనదిగో
కూడి వందే మాతరమ్మని ` కుక్కుటము రచెన్’’.
ఒకవైపు రాత్రయిపోయింది. నువ్వు మేలుకోమంటున్నావక్కా.
ఇపుడు నిద్రొస్తోంది. రేపు కోడి కూసే వేళకు పాడుతూ లేపు’’ అంటూ లేచాడు సుదర్శనం.
‘‘లేదు. లేదు. మనం అర్థరాత్రే నిద్రలేవాలి’’.
‘‘అసలు నిద్ర పోకూడదు’’.
‘‘నిద్ర పోకపోతే ఇంక మేలుకొలుపు గీతాలెందుకు? ఎవరికి?’’ అందరూ గోలగోలగా అరుస్తూ నవ్వుతూ లేచి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు.
మర్నాడు శారద పెందలాడే లేవలేకపోయింది. బీచ్కి వెళ్ళటం కుదరలేదు. కాలేజీకి వెళ్ళటానికే హడావుడి అయింది.
సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చాక కొన్ని పుస్తకాు తెచ్చుకోవాని కాశీనాధుని నాగేశ్వరరావు గారింటికి వెళ్ళేందుకు తయారైంది. సుబ్బమ్మ తానూ వస్తానంది గానీ తీరా బయల్దేరే సమయానికి బంధువులొచ్చారు.
కాశీనాథుని వారింటి గేటు తీసుకుని లోపలికి వెళ్తూ ఎదురుగా వస్తున్న యువతిని చూసి ఆగింది శారద. ఎక్కడ చూశానీమెను? అనుకుంటూ దగ్గరకు వెళ్ళింది. ఇద్దరూ ఆగి ఒకరినొకరు పరిశీలనగా చూసుకున్నారు. ‘‘శారద’’ అంటూ దుర్గ ఒక్కసారిగా శారద భుజాూ చేతుూ పట్టుకుని కుదిపేసింది. శారద దుర్గను చూసిన సంతోషంతో ఉక్కిరిబిక్కిరయింది. కాకినాడలో చూడటమే ` ఐదేళ్ళు దాటిపోయింది. అప్పటి పద్నాుగేళ్ళ దుర్గ ఇరవై ఏళ్ళదయింది. శారద మరో మూడేళ్ళు పెద్దది. దుర్గ ముఖంలో కాకినాడ రోజునాటి అల్లరి, అమాయకత్వం పోయి గాంభీర్యం, ధీమా వచ్చాయి. శారద ముఖం జ్ఞానంతో, ప్రేమతో ప్రకాశిస్తోంది. ఒకరినొకరు పరిశీలనగా చూసుకుని ఎదుటివారిలో వచ్చిన మార్పు చూసి నవ్వుకున్నారు.
‘‘దుర్గా! బాగున్నావా? ఎప్పుడొచ్చావు? ఎక్కడుంటున్నావు?’’
‘‘ఇక్కడే ` పంతులు గారింట్లోనే. మా ఆయనగారి ఆరోగ్యం బాగోలేదు. ఇక్కడ వైద్యానికని తీసుకొచ్చా’’
‘‘అలాగా ` నేను చూడనా?’’ కాస్త కంగారు పడిరది శారద.
‘‘నువ్వు డాక్టర్వై పోయావా?’’
‘‘ఇంకా పూర్తి కాలేదు. రెండేళ్ళు ఆగాలి. కానీ కొంత తొసు. ఊరికే చూస్తాను. మా కాలేజీ ఆసుపత్రిలో పెద్ద వైద్యులున్నారు. చూపిద్దాం’’.
‘‘ఆచంట లక్ష్మీపతి గారు చూస్తున్నారు. వారి అనుమతి లేకుండా ఎవరికీ చూపించను’’.
ఇద్దరూ లోపలకు వెళ్ళారు. శారద తనొచ్చిన పని పక్కన బెట్టి దుర్గతో మాట్లాడుతూ ఉండిపోయింది.
ఇద్దరూ దేశ పరిస్థితుల గురించి ముచ్చటించుకున్నారు.
‘‘ఇలా మందకొడిగా ఉంటే లాభం లేదు. ఉప్పెన రావాలి’’ అంది దుర్గ.
‘‘గాంధీగారు ఎందుకిలా చేస్తున్నారు. ఆయన పిుపు ఇస్తే ఉప్నెనలాగా లేస్తారు ప్రజు’’.
‘‘తగిన సమయం కోసం చూస్తున్నారు. నాకు గాంధీజీ బాగా తెలుసు. ఆయన ఇంకెన్నాళ్ళో చూస్తూ ఊరుకోరు. ఆయన పిలుపు కోసం చూస్తున్నా. ఒక్కసారి ఆ పిలుపు వచ్చిందో ` ఇంక అన్ని బంధాలు ఒదిలించుకుని వెళ్ళిపోతాను.’’.
‘‘నీ భర్త ` సంసారం’’. ఆశ్చర్యంగా అడిగింది శారద.
‘‘దేశం కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ఇంతకూ ఇక్కడికి ఎందుకొచ్చావు?’’
‘‘ఏవో పుస్తకాల కోసం. సరేగాని దుర్గా నీ భర్తను నువ్వు ప్రేమిస్తున్నావా?’’
‘‘ప్రేమంటే ఏమిటి శారదా?’’
‘‘నాకూ తెలియదు. చలం గారి శశిరేఖ, ఉన్నవవారి మాలపల్లి చదివాను. ప్రేమ గురించి అస్పష్టంగా ఏదో అర్థమైంది. స్త్రీలు భర్తను ప్రేమించరా? నీ భర్త మీద నీకున్నదేమిటి? ప్రేమ కాదా?’’
‘‘ధర్మం. కర్తవ్యం. ఈ రెండే నాకు తొసు. ఆయన చాలా మంచి మనిషి. నేను దేవతననుకుంటారు. నాకు కష్టం కలిగించకూడదనుకుంటారు. అలాంటి మనిషిని సేవించటం నా ధర్మం అనిపిస్తుంది. కానీ దేశం గురించి ఆలోచిస్తే ఈ బంధం నివదనిపిస్తుంది. నువ్వన్న ప్రేమ నాకు దేశం మీద ఉందేమో ` దేశం గురించి ఆలోచించానా ఇక దేనిని లెక్కచెయ్యను. చివరికి ప్రాణాన్ని కూడా.’’
ఇద్దరూ కాసేపు దేశభక్తి భావనతో పుకితులై మౌనంగా ఉండిపోయారు.
‘‘నువ్వు పెళ్ళి చేసుకోవా శారదా?’’
‘‘పెళ్ళా ` చేసుకోను. నాకూ దేశం గురించి చాలా ఆలోచనున్నాయి. డాక్టర్గా నా వృత్తిధర్మం ఉంది. నేను ఈ రెండింటి మధ్యే నలుగుతున్నాను.’’
‘‘ఆ రెండింటి మధ్యలోకి పెళ్ళి, చేసుకున్నవాడిని ప్రేమించటం, ఇవన్నీ వచ్చి పడితే నీకు మరింత కష్టమేమో ` ’’
ఇద్దరూ నవ్వుకున్నారు.
‘‘పతిసేవే పరమార్థం అనేది ఒట్టిమాటనే అనిపిస్తుందా దుర్గా నీకు ` ’’
‘‘ఔను శారదా! కానీ ఎవరి పట్లా మన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. మోక్షం, పరమార్థం ఇవన్నీ నాకిప్పుడు దేశ స్వాతంత్య్రంలోనే కనిపిస్తున్నాయి’’.
‘‘అదృష్టవంతురాలివి. నీకు ఒకటే లక్ష్యం ఉంది’’ నిట్టూర్చింది శారద. ఉద్యమం గురించిన మాటతో వారికి సమయమే తెలియలేదు. దుర్గ ఒకవైపు భర్తకు కావాల్సినవి అమరుస్తూనే శారదతో మాట్లాడుతోంది. రాత్రి పొద్దుబోయాక ఇల్లు చేరిన శారద తల్లితో దుర్గ కబుర్లు చెబుతూ ఆమె పక్కనే పడుకుని నిద్రపోయింది.
భళ్ళున త్లెవారాక లేచిన శారద ‘‘ఈ రోజూ బీచ్కి వెళ్ళలేనా’’ అనుకుంది.
‘అతను ఒస్తాడేమో’ ఆ ఆలోచనే ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. త్వరత్వరగా పనులు ముగించుకుని బీచ్కి పరుగులాంటి నడకతో చేరింది.
దురాన్నించే అతన్ని పోల్చుకుంది. సముద్రాన్ని తన వెనక ఉంచుకుని శారద కోసం చూస్తున్నాడతను. శారద అతని దగ్గరగా రాగానే ‘‘నేనూ సముద్రమూ, రెండు రోజుగా మీ కోసం చూస్తున్నాం’’ శారద గలగలా నవ్వింది. శారదకు నవ్వే అందం. ఆమె ఆనందంగా నవ్విందంటే ఆ సౌందర్యాన్ని పట్టలేం. ఆ నవ్వు చూసి మూర్తి ఏమయ్యాడో అతనికే తెలియాలి.
‘‘ఏంటలా చూస్తున్నారు?’’
‘‘మీ నవ్వు ` ఎంతో బాగుంది’’
శారద మళ్ళీ నవ్వింది.
‘‘ఇంకా బాగుంది’’.
మళ్ళీ మళ్ళీ సముద్రపు హోరులో జలపాతపు జడి కగలిసినట్లు నవ్వింది.
‘‘శారదా’’ అని ఉద్వేగంతో ప్రేమతో పిలిచాడు మూర్తి.
ఆ పేరు తనదనీ, ఆ పేరే తననీ మొదటిసారిగా శరీరంలోని ప్రతి అణువుతో అనుభూతి చెందింది శారద.
‘‘మళ్ళీ పిలవండి’’
‘‘శారదా’’ గాఢానుభూతితో పిలిచాడు.
అంతవరకూ శారదను అందరూ పేరుపెట్టి పిలుస్తూనే ఉన్నారు. కానీ ఇంత హాయి అయిన అనుభూతి ఆమెకెన్నడూ కలగలేదు. ఆ ధ్వని తరంగాలు ఆమె శరీరంలోని ప్రతి అణువునీ స్పందింపచేశాయి. చలింపజేశాయి. అనుకోకుండానే ముందుకు సాచిన మూర్తి చేతులో తన చేతుంచింది శారద. ఐదు నిముషాపాటు ఆ స్పర్శ వారిని ఈ లోకంలోంచి ఎక్కడికో తీసుకెళ్ళింది. శారద మెల్లిగా తన చేతిని అతని చేతి నుంచి ఒదిలించుకుని వెనక్కు తిరిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళింది.
ఈ కొత్త అనుభూతి గురించి అన్నపూర్ణకు చెప్పాలనిపించింది. అబ్బయ్య, అన్నపూర్ణ ఎంతో ప్రేమగా ఉంటారు. ఏం చేసినా వాళ్ళిద్దరూ కలిసి చేస్తారు. అలాంటి తోడు తనకు లేదు. స్నేహితులు చాలామంది ఉన్నారు. కానీ ఇలా చేయి పట్టుకుని ఏదో తెలియని బలాన్నీ, విశ్వాసాన్ని ఇచ్చే వ్యక్తి ఇంతవరకూ తారసపడలేదు. అతని పేరు, వృత్తి తప్ప ఇంకేమీ తెలియకుండా ఇంత అలజడి ఏమిటి? జీవితంలో పెళ్ళికి చోటు లేదని గట్టిగా అనుకున్న తను ఇలాంటి అలజడికి లోనవ్వకూడదని శారదకు ఒక్కపక్క అంతరాత్మ హెచ్చరిస్తోంది. డాక్టర్గా సేవ, దేశ స్వతంత్రం ఈ రెండింటితో ఇంతవరకూ మనసు నిండింది.
ఇప్పుడు కొత్తచోటు ఏర్పడుతోందా? ఇన్నిటిని సంబాళించుకోగనా అనే ఆలోచనతో సతమతమయింది శారద. కాలేజీలో కూడా అన్యమనస్కంగానే గడిపింది.
సాయంత్రానికి ఈ ఆలోచను కట్టిపెట్టి తన పనిలో శ్రద్ధ పెట్టానుకుంది. ఆ రోజు రాత్రి చాలాసేపు చదువుకుంది. దానితో మనసులో ఆరాటం తగ్గి తన మీద తనకు విశ్వాసం కలిగి తృప్తిగా నిద్రపోయింది.
***
గతం వైపుకి మన గమ్యాన్ని మార్చగల శక్తి, ఈ కథనపు గమనానికి ఉందని చెబితే అతిశయోక్తి కాదు !!
చరిత్రలోని వ్యక్తులకు పాత్రల రూపంలో ప్రాణం పోస్తున్నారు.పరకాయ ప్రవేశం చేసి గతంలోకి పాఠకులను తీసుకెళ్లటం లో సఫలీకృతులవుతున్నరు. అభినందనలు!!
దుర్గా బాయి పాత్ర చిత్రణ బావుంది. చరిత్రను ఇంత లలితంగా చదివిస్తున్న లలితాంబ కు అభినందనలు
చాలా సరళంగా ఆనాటి సంగతులన్నీ కళ్ళకు కట్టినట్లు రాస్తున్న లలితాంబ గారికి అభినందనలు.
కథ కదనం చాలా బాగున్నాయి. ఈ భాగంలో అక్షర దోషాలు చాలా ఉన్నాయి. నివారించండి. చాలా బాగా రాస్తున్నారు.