తెలంగాణ రచయితల సంఘం సాహిత్య సదస్సులు, కవి సమ్మేళనాలు, కథకుల సమావేశాలు, తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లో నిర్వహించి ఆయా ప్రాంతాల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించింది. ఖమ్మంలో ఊటుకూరు రంగారావు, డోకిపర్తి రామలింగం, హీరాలాల్ మోరియాలు మొదలు సిరిసిల్లలో గూడూరి సీతారామ్, జనగామలో గఱ్ఱేపల్లి సత్యనారాయణ రాజు వరకు ఎందరో ఈ సంఘం నిర్వహణలో పాలుపంచుకున్నారు.
‘‘ఆంధ్రావని ఏకమై మహాంధ్ర స్వరూపం ఏర్పడి ఆంధ్రప్రదేశం అవతరించు శుభముహూర్తం సమీపించుచున్నది. ఏ జాతి ఉన్నతికి గాని పురోగమనమునకు గాని ఆ జాతి సాహిత్యం మార్గదర్శకము. అట్టి సాహితీ సంపత్తిలో తెలుగుదేశం ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. పూర్వ, మధ్య, ఆధునిక యుగాలలో వాగానుశాసనుడు మొదలు వర్తమాన కాలం వారు తెలుగు రచనా వ్యాసాగం నవ్య రీతులలో నడుసూతనే ఉన్నది. ఆంధ్రులు సామ్రాజ్యములు ఏలిన కాలంలో ఆంధ్రభాషామతల్లిని మహారాజులు పోషించినారు. ఒకనాడు తెనుగుతేట కర్నాట కస్తూరీతో కలిసి దేశభాషలందు తెలుగు లెస్స అన్న బిరుదాన్ని పొందినంది.
తొలిదశలో దాశరథి, నారాయణరెడ్డిలతో పాటుగా ఆంుధప్రదేశ్ అవతరణను ఆహ్వానించిన కాళోజి నారాయణరావు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరీ ముఖ్యంగా తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అప్పటి వరకున్న భ్రమలన్నీ పటాపంచలయ్యాయి. అందుకే 1959 నాటికే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వల్ల ఆశించిన ఫలితాలు సమకూరడం లేదని శాసనసభలోనే చెప్పిండు.
తెలంగాణ రచయితల సంఘంకు ఒక రకంగా పాక్షిక కొనసాగింపుగా వరంగల్లులో ‘మిత్రమండలి’ 1959లో ఏర్పాటయ్యింది. మండలి తరపున వివిధ పండితుల సాహీతీ గోష్టులను నిర్వహించారు.
(కాళోజి వర్దంతి సందర్భంగా)