కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం కోసం 2011-13 మధ్య ముద్రితమైన నవలల మూడేసి ప్రతులను ఈ నెల 20లోగా ఆశాజ్యోతి, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు-56 చిరునామాకు; కొలకలూరి భాగీరథీ పురస్కారంకోసం 2011-13 మధ్య ముద్రితమైన కథా సంపుటుల మూడేసి ప్రతులను ఈ నెల 20లోగా కొలకలూరి మధుజ్యోతి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి-2 చిరునామాకు పంపించాలి. ఫిబ్రవరి 26 న హైదరాబాద్లో పురస్కార ప్రదాన సభ జరుగుతుందని కొలకలూరి ఆశాజ్యోతి, మధుజ్యోతి తెలియచేసారు. కొలకలూరి విశ్రాంతమ్మ , భాగీరథి పురస్కారాలను 2008 వ సంవత్సరం నుంచి అందచేస్తున్నారు. ఒకొక్క ఏడాది రెండేసి ప్రక్రియలను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది కథ, నవల ప్రక్రియల కింద ఈ పురస్కారాలను అందచేస్తారు. గత సంవత్సరాల్లో నాటకం, కవిత్వం, విమర్శ, పరిశోధన ప్రక్రియల కింద పురస్కారాలు అందచేసారు.
గౌరవనీయులు సంపాదకులకు నమస్కారం.
అయ్యా..కలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం కొరకు ఇటీవల నేను ప్రచురించిన కదల సంపుటి “పొడిచే పొద్దు ” పంపాలని అనుకుంటున్నాను .అయితే మీ ఈ ప్రకటన కొన్ని కారణముల వలన ఆలస్యంగా చూసుకున్నాను ..ఈరోజు 21 వతేదీ జనవరి.
ఇప్పుడు పంపిస్తే పరిశీలిస్తారా..? దయ చేసి తెలుపగలరు.