మళ్ళీ మరొకసారి జాతీయ స్థాయిలో తెలుగు కవిత్వం రెప రెపలాడింది . అయితే ఈ సారి నలమల కొండల నడుమ ఉన్న , కార్పొరేట్ చదువుల వల్ల మనం మర్చిపోయిన ,మట్టి పలకల గ్రామం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కు చెందిన నవ్యభావాల యువకవి మంత్రి కృష్ణ మోహన్ ఆ ఎగసిన జెండా రెపరెపలకు కారకుడయ్యాడు . 2012 లో ప్రచురించిన అతని తొలి వచన కవితా సంపుటి “ప్రవహించే పాదాలు” 2013 కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార విజేత గా ప్రకటించటంతో కృష్ణ మోహన్ తెలుగు సాహితీ వినీలాకాశంలో మెరుపై మెరిశాడు. 44 వచన కవితలున్న యీ పుస్తకం, 35 యేళ్ళ యువకవికి ఈ అత్యన్నత స్థాయి కీర్తి పతాకం అందించింది.
దేని గురించి చెప్పాలన్నా సాహసం కావాలి, ప్రేమ కావాలి అన్నట్లు ఈ యువ కవి ఏ వస్తువు గురించి కవిత అల్లినా అందులో సాహసం తో కూడిన నిజాయితీ, మమేకమై పోయిన ప్రేమ స్పష్టంగా కన్పిస్తాయి .. కవిత్వ నిర్మాణం లో ప్రారంభ దశ నుండే ఒక టెంపో , టెక్నిక్ చిత్రంగా పట్టుకున్నాడు, కవిత్వానికి పదను పెట్టుకున్నాడు కనుకనే ఇవాళ విజేతగా నిలిచాడు .
విజేతలు భిన్నంగా ఉండరు , వారు చేసే పనులు మాత్రమే విభిన్నంగా ఉంటాయన్నట్లు ఈ యువకవి వస్తువు ఎంపిక లోను , అభివ్యక్తి లోను వైవిధ్యం, నవ్యత కనిపిస్తాయి . అన్నింటి కన్నా సమాజం పట్ల , మనిషి పట్ల ఈ కవికి ఉండే ప్రేమ , కవిత్వమంతా ఆర్త్రంగా గాఢం గా పరచుకొని పాఠకుడ్ని అలరిస్తాయి . నాలుగైదేళ్లుగా కవిత్వాన్ని తన కన్న తల్లిలా , పుట్టిన ఊరిలా ప్రేమిస్తున్నాడు.
గత మూడేళ్లుగా యువ పురస్కారాలు అందిస్తుంది కేంద్ర సాహిత్య అకాడెమీ . తొలి, మలి పురస్కారం వేంపల్లె గంగాధర్-‘మొలకల పున్నమి’ నవలకి , జుమ్మా- వేంపల్లి షరీఫ్ కథలకు అందుకున్నారు .
aanaMdaM
ప్రవహిస్తున్న పాదాలు లోని చాల కవితలు చదివినతర్వాత కూడ మన చుట్టూనే తిరుగుతుంటాయి మంత్రి కృష్ణమోహన్ నుండి మరిన్ని మంచి కవితా సంకలనాలు ఆశించవచ్చు