సీమాంధ్ర కవులు అభ్యుదయం, ప్రగతి, విప్లవం, వామపక్షం, ఇంకా పైకి కనపడని అనేక రూపాల్లో, హిడెన్ ఎజెండాలతో తెలంగాణపై తమ ఆధిపత్యాన్ని ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. ఇలా చలామణిలో పెట్టిన భావజాలం కారణంగానే నేటికీ తెలంగాణ సాహిత్యకారులు తమకు జరిగిన అన్యాయాన్ని, అభ్యుదయం ముసుగులో నొక్కేసిన/ నొక్కేస్తున్న సొంత గొంతుని పసిగట్టలేక పోతున్నారు. గొంతుని నొక్కుతున్నవారినే ఇంకా ఆరాధిస్తున్నారు. అందలాలెక్కిస్తున్నారు. తమ ఆత్మగౌరవాన్ని భంగ పరిచిన వారినే బానిస మనస్తత్వంతో భళిరా అని పొగుడుతున్నారు.1956 నుంచీ వారి మెప్పుకోసం, ఆమోద ముద్రకోసం తహతహలాడుతున్న తెలంగాణవాదులు చాలామందే ఉన్నారు. వీరంతా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమిది. సాయుధ పోరాట కాలంలో ఏమి వ్రాయని శ్రీ.శ్రీ 1969లో మాత్రం ‘విడిపోవడమంటే చెడిపోవడం’ అని శాపనార్థాలు పెట్టిండు. అయినా శ్రీశ్రీని ఆరాధించే వీర తెలంగాణవాదులకు కొదువలేదు. ఆనాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పీడితుల పక్షాన గాకుండా దోపిడి పాలక వర్గాల పక్షాన నిలబడ్డ శ్రీశ్రీది ముమ్మాటికీ అభ్యుదయం ముసుగులో ఆధిపత్యమే! ఇట్లాంటి వారు చరిత్రలో ఇంకా చాలా మంది ఉన్నారు.
సంగిశెట్టి గారూ! మీ ఆవేదనకు, నిక్కచ్చితనానికి వ్యాసం అద్దం పట్టింది. తెలంగాణా సాహిత్యంలో సీమాన్ద్ర సాహిత్యకారుల ద్వంద్వ వైఖరుల పట్ల అడపా దడపా రచనలు వస్తున్నాయి కదా! మీరన్నట్లు బహిరంగంగా ,పూర్తిగా వెలివేసినట్లుగా మనవాళ్ళు వ్యవహరించకపోవడం లో నిజముంది. తెలంగాణా మట్టిలో ఆ కఠినత్వమ్ లేదుగదా ! పల్లకీ మోసినంత మాత్రాన రాజును అన్ని విషయాలలో అంగీకరించవలసిన అవసరం లేదుగదా! అయినా చర్చించాల్సిన అంశమే!
దాసరాజు గారు కఠినంగ ఉండాల్సిన అవసరం లేదు కచితంగా ఉంటె చాలు. రాజు నీతిమంతుడు కాదు అని తేలిన తర్వాత కూడా పల్లకి మోయడం అంటే మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే. అది ఈ రోజు చాలామంది వివిధ రూపాల్లో చేస్తున్నారు. ఇక నైన ఈ పద్దతికి స్వస్తి పలకాలనేదే నా కోరిక.
శ్రీనివాస్ గారు
చాల చక్కగా చెప్పారు —ఎన్ని చెప్పినా , ఎన్ని రాసినా —దోపిడీ కి —
మోసాల కు — అలవాటు పడ్డ ప్రాణాలు –అంతా –ఈజీ గా మనల్ని
వదిలి పెట్టారు గా
నిజాలు ఎప్పుడు చేదు గా నే ఉంటాయి —ఎవరికి అయినా —???
—————-బుచ్చి రెడ్డి గంగుల
1969– ఉద్యమం– లో ఆనెస్టీ— సిన్సెరిటీ– ట్రస్ట్వర్తీ కానీ నేత చెన్నా రెడ్డి గారు—
అదంతా వారి రాజకీయ లబ్ది కోసం—గా రీ డి ఆట — చూపించి–మన ఉ ధ్యా మాన్ని
మట్టి పాలు చేశాడు–అప్పుడు — ఇప్పుడు — మన లో నే మన ప్రాతం వాళ్లే
మనకు ఆసరా లేకుండా సీమాంధ్ర నేతల తో చేతులు కలుపుతూ— నేతలు న్నారు
రచయితలున్నారు—ఇపుడు కూడా మన తెలంగాణా ర చ యతలు ధాగుడు మూతలు
ఆడుతూ—అక్క్దడ ఓ మాట–ఇక్క్డ డా ఓ మాట చెప్పే వాళ్ళు లేకపోలే ధు-
( ధయతో ఆంప శయ్య నవీన్ గారి ని తెలంగాణా పై వారి ఒపీనియన్ ను అడుగండి ??? )
ధాపరికం దేనికి—భయం దేనికి ???
ఎన్నో హింది మాట్లాడే రాష్ట్రాలు ఉండగా— తెలుగు రోండు రాష్ట్రాలు గా ఉండటం లో
తప్పు ఏమిటి రచయితులారా ???
ఎంతకాలం మాకు ఈ బానిసత్వం– ఎప్పుడు మాకు విముక్తి??
నేటి వరకు నీళ్ళల్లో– నిధుల ల్లో— ఉ ధ్యొగాల్లో—అన్ని రంగాల్లో—మోసం- ధోపీడీ
ధగా— నిజం కాధా
చెప్పండి కవులు?? మేధావులు ???
ఆవేశం లో –ఉధ్యమం లో– ఎవరో నాలుగు శిలా విగ్రహారాల ను కూల్చి వేస్తే
గాయాలతో — గేయాలు రాసిన కవులారా— ఉద్యమం పేరుతో నేటికి వేయి మంధీ
ఆత్మ బలి ధానాలు చేసుకుంటే— సీమాంధ్ర కవులు— వీళ్ళ గురించి రాయారేంధుకు???
వి డి పోతే తప్పేమీ టి ?? ఇచ్చిన — తెలంగాణా ను రాజకీయ ఎత్త్హు గడాల తో—
డబ్బు తో— అన్ని రాజకీయ పార్ట్ లు ఒకటి అయ్యీ— చేసింధీ మోసం కాధా ??
ఎప్పుడు మాకు స్వాతంత్రం ?? ఎన్నడు ??
చివి రీ మాట– నా ఒపీనియన్ లో ఇపుడు శ్రీ శ్రీ గారు ఉంటే– తప్పక
తెలంగాణా ఉధ్యమాన్ని బ ల పరిచే వాడు అనుకుంటా—
ఎవరు రా సినా — రాయక పోయినా—ఏ ధో ఒక రోజు తెలంగాణా
రాక తప్పధు—
———————————————-
బుచ్చి రెడ్డి గంగుల
రగిలి, రగిలి.
మసిలి, మసిలి,
రక్తం కుతకుత ఉడికి,
ఆవేదన అక్షర రూపం దాలిస్తే..!
మహాకవులు, సాహితీవేత్తలు అని భావించే వారిలో తెలంగాణపై ఇంతటి ద్వేషం ఉందని ఊహించలేకపోయాను. వారిని గుడ్డిగా అభిమానిచడం కాస్త ఆపి, మీరన్నట్టు కచ్చితంగా వ్యవహరించడం నేర్చుకోవాల్సిందే. ఈ వ్యాసం ద్వారా చాలా కొత్త విషయాలు తెలిసాయి. కృతజ్ఞతలు.
అలా అన్న శ్రీశ్రీ ఇలా కూడా అన్నారు. మంచి పరిశోధకుడైన సంగిశెట్టి గారివి చూశారో, లేదో నాని…
శ్రీ శ్రీ 15-10-1972; గుంటూరు విరసభలో అద్యక్షోపన్యాసం నుంచి,
….రెండోది (మొదటిది స్వాతంత్రపు వెండి పండుగ) తెలంగాణా సాయుధ సమరం. దీన్ని మన ఘనత వహించిన ప్రభుత్వం గుర్తించనేలేదు. పైగా రెండువేల మండి కమ్యూనిస్టుల్ని ఊచకోత కోయించిన ప్రకాశం పంతులుగారి శతజయంతిని వైభవంగా జరుపుకుంది. బ్రిటిష్ వారి గుండు దెబ్బలకు గుండెచూపించిన వీరుదంటూ కాంగ్రెస్ వారాయన్ని మెచ్చుకుంటే నా అభ్యంతరం లేదు. విశాలాంధ్ర వాళ్లెందుకీ భానాజలో పాల్గొనాలని నేనడుగుతున్నాను. మద్రాసు నగరం కోసం మొండిపట్టు పట్టి పొట్టి శ్రీరాములు గారి ప్రాణాన్ని బలిపెట్టిన కిరాతకుడుగా ప్రకాశం గారిని నేను గర్హిస్తున్నాను. తెలంగాణా రైతాంగ పోరాటమే నెహ్రూ చేత ఆవడిలో సామ్యవాద మంత్రోచ్ఛారణ చేయించింది. అసంపూర్తిగా వుండిపోయిన ఆనాటి సమరం ఇంకా సాగుతోనే వున్నదనేది విప్లవరచయితల అవగాహన. అలా దేశమంతటా సాగిస్తున్నవారే ఆనాటి పోరాట సంప్రదాయలాకు ఈనాటి వారసులు. ఈ వారసత్వం మాదంటే మాదని చిందులు తొక్కడానికి అన్నదమ్ములు పంచుకునే ఆస్థిహక్కు కాదు. ప్రాణాలనే ఆహుతిగా సమర్పించి సంపాదించుకునే జన్మహక్కు. ఈ విప్లవాపోరాటానికి సంబందించిన సమగ్ర చరిత్ర ఇంకా రాయవలసే వుంది. ఆనాటి సాహిత్యమంతా సమీకరించవలసే వుంది.”
దీని తర్వాత (18-1-1973) విభజనను వ్యతిరేకిస్తూ విరసం అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. ఇరవై రోజాల తర్వాత (5-2-1973) తన రాజీనామాని వుపసంహరించుకున్నాడు. రాష్ట్ర విభజనని కోరుతూ విరసం కార్యవర్గం చేసిన తీర్మానానికి అసమ్మతి తెలిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శ్రీశ్రీ, దానిపై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొడానికి సమ్మతి తెలిపాడు. “నేను త్రికరణశుద్ధిగా సమైక్యవాదినైనప్పటికీ మెజారిటీ సభ్యత్వం విభజన కోరుతూ తీర్మానిస్తే అందుకు కట్టుబడతాను.” అని ఆంధ్ర పత్రిక (దినపత్రిక) లో 5-2-1973 నా ప్రకటన ఇచ్చాడు.
‘నా శాశ్వత చిరునామా విరసం’ అని 23-7-1980 లో ‘ఈనాడు’ లో వార్త: “…..విరసం పుట్టినప్పటి నుండి అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ నేను విరసం సభ్యుడినే. నా శాశ్వత చిరునామా విరసం. అఫ్హానిస్తాన్, అస్సామ్, వామపక్ష సమైక్యం మొదలైన రాజకీయ విషయాలలో నా అభిప్రాయాలన్నీ దుర్భ్రమలేనని గ్రహించాను. అందువల్ల ఇప్పటినుంచీ విరసం రాజకీయాలే నా రాజకీయాలు. సాహిత్యంలో ఎప్పుడూ అతివాదిగా వుంటున్న నేను రాజకీయాలలో మితవాదానికి, ఊగిసలాటకి లోనవుతూవచ్చాను. ఇది పొరపాటేనని ఒప్పుకుంటున్నాను..” అని
కుర్మనాథ్ గారు- 1982 సృజన తెలంగాణా విమోచనోద్యమం ప్రత్యెక సంచిక లో పేజి నెంబర్ 71 ఆరుద్ర త్వమేవాహానికి ఒక టిప్పని రాస్తూ శ్రీ శ్రీ త్వమేవాహం కావ్యానికి కాలమే ప్రదాన వస్తువు తెలంగాణా ఒక అల్ప క్షనముగా మారిపోతుంది”
ఈదే పుస్తకం పేజి 73 లో ఆరుద్ర త్వమేవాహనికి మెదలు పెట్టిన పేరు తెలంగాణే దీన్ని త్వమేవాహం గా మార్చింది శ్రీ శ్రీ నే.
విప్లవాలు-వాటిని కీర్తిస్తూ రాసిన వాళ్ళు గా – ప్రజల భుజాల మీద మోస్తున్నారు. మరి అలంటి శ్రీ శ్రీ తెలంగాన అనే పేరు కూడా మర్చి ఒక ఉద్యమాన్ని ” అల్ప క్షనముగా” రాసిన వ్యక్తిని ఎలా ఆరాధిస్తారు ఇక్కడి ప్రజలు
Srinivas garu,
I completely understand and respect your views. my point is, we should put the whole issue in perspective and not quote only parts that are relevant to our arguments.
శ్రీ శ్రీ మాత్రమె కాదు. ఎవరైనా సరే ఒక ప్రజాస్వామిక డిమాండ్ ని వ్యతిరేకిస్తే నిలదీయాల్సిందే. కానీ మెజారిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న మాటని కూడా పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుందని అన్నాను.
idea is not born in our mind, it’s part of our personality-Hegel
మీ మెజారిటి వాదం అనేది సంస్తలకు వర్తిస్తుండ వచ్చు వ్యక్తులకు కాదు
Hegel quotation చాలా బాగుంది, శ్రీనివాస్ గారు. చక్కగా చెప్పాడాయన.
కానీ, హెగెల్ తర్వాత philosophy చాలా అభివృద్ధి చెందింది. Marx-Engels, Lenin, Stalin and Mao వీళ్ళందరూ ఏమన్నారంటే వ్యక్తి సమష్టిలో చేరితేనే, సంస్థలుగా మారితేనే ఆధిపత్యాన్ని ఎదిరించవచ్చని. వాళ్ళవి నిజం చేసి చూపించారు కూడా. వ్యక్తులుగా వుంటే ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుందని కూడా చెప్పారు.
కుర్మనధ్ గారు – మర్క్సిసం ఆదిపత్యాన్ని ఏక కేంద్రిక్రుతంగానే గుర్తిస్తుంది. నిజానికి ఆధిపత్యం సమాజంలో వికేంద్రికరనగా ఉంది. అవి కులాలుగా, మతాలుగా, కుటుంబంలో ఇంక చాల రకాలుగా ఉంటుంది. వీటిని గుర్తించక పోవడం వల్లనే మర్క్సిసం ఈ శతాబ్దపు విఫల ప్రయేగంగా మారింది.
అన్యాయానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనిషి వేలాది సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే వున్నాడు. కొన్ని సార్లు గెలుస్తున్నాడు. చాలా సార్లు ఓడిపోతున్నాడు. తప్పులనుంచి నేర్చుకుని మళ్ళీ పోరాటం చేస్తున్నాడు. వాటిని విఫల ప్రయోగాలు అనరు. 1956 లో, 1969లో మోసానికి గురయిన తెలంగాణా మళ్ళీ రగులుతుంది. మరోసారి మోసానికి గురయ్యే అవకాశం వుంది. కానీ, అది మళ్ళీ లేచి పోరాడుతుంది. విఫల ప్రయోగాలు కావవి.
చిరకాల మిత్రుడు కూర్మనాథ్కు ధన్యవాదాలు..
శ్రీశ్రీ ఒక్కరే కాదు. సాయుధ పోరాటం (1946-51) గురించి ఎన్నో రచనలు చేసిన ఎందరో సీమాంధ్ర మహామహులు తమ ప్రాంతానికి సంబంధించిన అంశం వచ్చేసరికి ప్రజాస్వామికంగా కాకుండా, పక్షపాత ధోరణితో వ్యవహరించారు. ఇలా వ్యవహరించినవారు అభ్యుదయవాదులుగా ఇప్పటికీ కొనియాడబడుతున్నారు. వీళ్ళే తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకునేందుకు 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని విమర్శించారు. అంతేకాదు వీరి ప్రభావంతో దాశరథి, సి.నారాయణరెడ్డి, మొదట్లో చెరబండరాజు లాంటి వారు కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఎక్కడా సంఫీుభావం ప్రకటించలేదు. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమానికి మద్ధతు తెలపని సాహిత్యకారులు కూడా ఈ గడ్డ మీద ఉన్నారు. (బుచ్చిరెడ్డిగారు అంపశయ్య నవీన్ గురించి రాశారు కూడా) మీదు మిక్కిలి విశాలాంధ్ర కోసం కవితలల్లిండ్రు. ఒక్క కాళోజి మాత్రమే 1956లో ఆంధ్రప్రదేశ్కు మద్ధతిచ్చినప్పటికీ శాసనమండలి సభ్యత్వంతో అసలు విషయాల్ని అంచనా వేయగలిగిండు. ఆనాటి నుంచి ఆఖరి వరకూ ప్రత్యేక తెలంగాణవాదిగానే నిలిచిండు.
హైదరాబాద్లో, తెలంగాణలో శ్రీశ్రీ సంస్మరణ సభలు పెట్టుకోవడం, ప్ర.జ. ద్వారా విరివిగా అభిమానం కురిపించడం, ప్రత్యేక సంచికలు, సంపుటాలు వెలువడరించడం, టాంక్బండ్పై విగ్రహాన్ని కూలగొట్టకుండా అడ్డుకోవడం ద్వారా ఆనాటి నుంచి ఈనాటి వరకూ అన్నీ తెలంగాణ బిడ్డలు ఆయనమీద గౌరవంతోనే చేసిండ్రు. ఇవన్నీ చేసిన వారికి శ్రీశ్రీ విషయంలో ఇప్పటి వరకూ అంతగా వెలుగులోకి రాని విషయాలు తెలిసినట్లయితే ఆయన్ని పునర్ అంచనావేయడానికి వీలవుతుంది. దాని వల్ల శ్రీశ్రీకి ఏదో నష్టం జరుగుతుంది అని కాదు. తెలంగాణ సాహిత్యానికి మేలు జరుగుతుంది, జరగాలనేదే ఆశ.
ఇక రెండో విషయం. తెలంగాణవాదులందరూ మొదటి నుంచీ చెబుతున్నది ఒకటే విషయం. ఆంధ్రప్రదేశ్ అవతరణకూ పొట్టి శ్రీరాములుకూ ఎక్కడ సంబంధం లేదు అని. అయితే రాజశేఖరరెడ్డి మొదలు కిరణ్ కుమార్ రెడ్డి వరకు సమైక్యవాదులందరూ నవంబర్ ఒకటి రోజు పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పిస్తూ ఆయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం అమరుడైనట్లుగా చూపిస్తున్నారు. సమైక్య రాష్ట్రవాదులు పొట్టి శ్రీరాముల్ని తమ ప్రతీకగా ప్రదర్శిస్తుండ్రు. పొట్టి శ్రీరాములు విషయంలో శ్రీశ్రీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమకారుల వాదనలకు బలం చేకూరుస్తున్నాయి. ఇకనైనా సమైక్యవాదుల కండ్లు తెరుచుకోవాలి. తమకు ప్రతీక పొట్టి శ్రీరాములు కాదని తెలుసుకోవాలి. తమ ప్రాంతం వాళ్ళే ఆయన్ని పొట్టనబెట్టుకున్నారనే అవగాహన పెంచుకోవాలి.
అవును. 5-10 శాతం తప్పితే తెలంగాణాని వ్యతిరేకించే వాళ్ళు ఆంధ్రా ప్రాంతం లో లేరు.
అంతిమంగా కాజ్ బలపడాలి. బలపడుతుంది
శ్రీనివాస్ గారు
గోడ మీద పిల్లులు లా —కిరణ్ గారి తో బొమ్మలు –శాలువలు కప్పించో కోవాడాలు,
పేస్ బుక్ లో —పెట్టుకుంటూ –తెలంగాణా ఉద్యమానికి మద్దతు తెలుపని
తెలంగాణా సాహితి మిత్రులు లేకపోలేదు —వాళ్ళ కు కావిలిసింది పేరు — గుర్తింపు
డబ్బు సంపాదించడం —తెలంగాణా ద్రోహులు
తెలంగాణా ఫై –కాంగ్రెస్ ప్రకటన చేయనుంది అనగానే—-సీమంధ్ర నేతల హంగామాలు — ముచ్చట్లు
దోబూచలాట లు ???
తెలంగాణా ప్రకటిస్తే నేను రాజీనామా చేస్తా — రాయపాటి ప్రకటన ??లగడపాటి కూతలు ఎన్నో
వింటున్నాము — చూస్తున్నాము –ఎందుకీ యి చిరుతల రామాయాణం ??ఎంతకాలం
నేటికి నోరు మెదు పని కవుల కు — రచయితుల కు నా మనవి ?? విడి పోదాం — కలిసి
బ్రతుకుదాం –దయతో స్పందించండి —గళం విప్పండి — రాయండి
మాకు న్యాయం కావాలి
మాకు స్వాతంత్రం కావాలి
మాకు విముక్తి కావాలి —– Nehru గారు అన్నట్లు — యిది క లు వ ని సంసారం
విడి పోతే తప్పేమిటి ??
శ్రీనివాస్ గారి ఆర్టికల్స్ ను ప్రచురించిన *** సారంగ సంపాదుల కు ** నా స ల్యు టస్ ****
ఇంత కాలం శ్రీశ్రీని, ఆరుద్రను,కే.వి. రమణ రెడ్డిని తలకెత్తుకుని తిరిగాము. సంగిశెట్టి గారి వ్యాసం చదివాక,సో కాల్డ్ సమైక్య వాద కవుల కవితా వాక్యాలు చదివాక, ఇంకా నిద్ర పుచ్చే కవిత్వాలు చదివి భ్రమల్లో ఉండడం ఇంకా సాగదు. పీడితులవైపు నిలబడి కవిత్వాలు రాస్తున్నామని భ్రమలు కలిగించిన ప్రతి కవిని కాల పరీక్షకు గురిచేయాల్సి ఉంది. ఇప్పుడు తెలంగాణా తనను తానూ తెలుసుకుంటోంది. సంగిశెట్టి లాంటి వారి వ్యాసాలూ ఎంతోమందిని మేల్కొల్పుతున్నాయి. సంగిశెట్టి గారికి, సారంగకు ధన్యవాదాలు. సీమంద్ర కవులు ఈ చారిత్రక సమయంలో తమ కలాల్ని. గళాల్ని వినిపించాల్సి ఉంది. లేక పొతే చేతనత్వం ఉడిగిపోయి కాలగర్భంలో కలసిపోతారు.
వెల్దండి శ్రీధర్
ఇంకా ప్రకటన చేయక ముందే—ఎన్ని నాటకాలు— రాజీనామాలు—
డిల్లీ లో లాబియింగ్—- మళ్లీ మనను — –దోచుకున్న డబ్బు తో—తెలంగాణా
వేర్పడకుండా — ఎంత కై నా ధిగజారి పోతూ—
శ్రీధర్ గారు–
మన తెలంగాణా లో నే— ధ్వ౦ ధ వై ఖరి తో—-మనల్ని మంట గలిపె నేతలు–రచయితలు
ఉన్నారు—
ప్రాంతం వారే దోపిడీ చేస్తే– ప్రాణం తో నే పా త ర వేస్తాం—***అన్న ప్రజా కవి
కాళోజీ గారి ని తలుచు కుంటూ–కాలమ్ము రాగానే కాటేసి తీరాలి??
మార్పు కావాలి
తెలంగాణా రావాలి———–
————————————————
బుచ్చి రెడ్డి గంగుల
శ్రీనివాస్ గారు,
ఈ వ్యాసాన్ని చదివిన తర్వాత మిమ్మల్ని హృదయపూర్వకండా హత్తుకోవాలనిపించింది. తెలంగాణ సాహిత్యాన్ని, చరిత్రను అర్ధం చేసుకోవడానికి ఈ వ్యాసం అనేక దారుల్ని చూపిస్తుంది. నిజమైన పరిశోధన కనిపించిందీ వ్యాసంలో. కంగ్రాట్స్.
దార్ల
వ్సాసం బాగుంది. ఇలాంటి నిజాల్ని వెలికి చెప్పడానికి కూడా మన వాళ్ళుకూడా చాలా మంది సభల్లో వెనుకాడేవారు. శ్రీశ్రీ నిజాం దగ్గర సెక్రటరీ గా కూడా పనిచేశాడని చెబుతారు. సరిగ్గా తేదీలు తెలియవు కానీ, రజాకార్ల ఉద్యమ కాలంలోనో దానికి తర్వాతనో ఆయన పనిచేసినట్లు మానాన్నగారు చెప్పేవారు. సంగిశెట్టికి ఈ విషయం తెలిసే అవకాశం ఉంది.
సంగిశెట్టికి, అఫ్సర్ కి అభినందనలు.
అన్నా మీరు చెప్పింది అక్షర సత్యం కాకి మన తెలంగాణా అభ్యుదయ భావజాల వ్యాప్తులు దానికి దాసోహం అయిపోయారు. వారు మారాలంటే వ్యక్తిగా మార్పు రావాలి అంతేగాని మీలాంటి వాళ్ళు ఇంకా తెలంగాణ మేధావులు చెప్పిన వారి బుర్రలకు ఎక్కదు.
you are right,,sreenivadu gaaru
శ్రీనివాసన్నా! నీకు షెనార్థి. ఎంతో పరిశోధించి గింత మంచి వ్యాసం రాసి, ఆంధ్రోల్ల మూతులు నాకే మన తెలంగాణ కవుల మీద మంచి విమర్శ జేసినవ్. గిట్లనే ఇంకా రాసి మనోల్ల కండ్లు తెరిపించు.
ఇన్ని చెప్పిన వారు సీనారే గారి ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అన్నది కావాలనే మరచారా?
అధికారం, డబ్బు తీరని దాహాలు. సాహిత్యాలు, చట్టుబండలు కాలక్షేపాలు. అధికారం కావాలనుకొన్న వాడు చాలా ముందు చూపుతో వ్యవహరిస్తాడు. డబ్బుతో చెలిమి చేస్తాడు. సామాన్యుల్ని భ్రమల్లో ముంచి వుంచగల కళలను, సాహిత్యాలను చెప్పుచేతల్లో వుంచుకుంటాడు. వాటికి చైతన్యం రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాడు. ఇవన్నీ అందరికి తెలిసిన, చరిత్ర రుజువు చేసిన సత్యాలు. జరగవలసింది జరిగింది. అధికార పీఠాలు ఏ ఏ కుటుంబాలను మోయాలో మోస్తున్నాయి. వ్యాపారాలు, పెద్ద డబ్బు ఎవరి చేతుల్లో వుండాలో అక్కడే వుంది. శ్రీ శ్రీ, ఆరుద్రలు ఏదో రాస్తే ఏదో జరిగి రాయక పోతే జరక్కపోయి…అంత శక్తి కవులకు, వారి రచనలకు వుందని అనుకోవడం వ్యక్తిగత స్వేచ్చ. వర్గ స్వభావం అర్ధమైనా అప్పుడప్పుడూ వర్గ భ్రమలకు లోనై ఆత్మ విమర్శ చేసుకునే ఒక మంచి ఆచారం కమ్యూనిస్టులకు వుండేది. అది అందరికీ అనుసరణీయమే!
ఓ పేరడీ ‘తెలుగు జాతి మనది…’ కి..
(ఇది ఎవరినీ (బతికున్న, చనిపోయిన) ఉద్దేశించినది కాదు. ఎవరికైనా అలా అనిపిస్తే అది కేవలం యాదృచ్చికమే తప్ప ఉద్దేశ్యపూర్వకం కానే కాదు.)
తెలుగు జాతి మనది!
ఒకప్పుడు
వెలుగు జాతి మనది!
తెలంగాణా నాది!
రాయలసీమ నీది!
సర్కారు ఆమెది! నెల్లూరు ఆయంది!
అన్నీ పగిలిన, తెలుగు జాతి
వాడిదో, వీడిదో ఎవడిదోరా! ||తెలుగు||
సిపాయి కలహం విజృంభించ
నర సిం హాలై గర్జించారు
గాంధీ నెహ్రూల పిలుపులందుకొని
సత్యాగ్రహాలు చేశారు
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట
స్వరాష్ట్రాలు సాధించారు
దేశభక్తిలో రాష్ట్రభక్తి ఒక
భాగం కాదనిపించారు! ||తెలుగు||
ప్రాంతాలు ఏవైనా
మన కుమ్ములాటలొకటేనన్నా!
యాసలు అలగలగుంటే
మన భాష ఒక్కటెట్లన్నా?
ఒచ్చిండన్నా ఒచ్చాడన్నా
ఆంద్రా దమాక్కి సమజౌతదన్నా! ||తెలుగు||
మహాభారతం పుట్టింది
రాజులు ఏలే కాలంలో!
భాగవతం వెలిసింది
నవాబులేలే జమాన్లో!
గా ముచ్చటంత మాకు తెల్వాదు!
మీకూ మాకూ రాం రామన్నా! ||తెలుగు||
ఇంటిలోన అరమరికలు వున్నాయ్,
ఢిల్లీ వెళ్ళి చాటేశాం!
కంటిలో నలక తీయకుండనే
రెండుకళ్ళు గుంజి నూకేశాం!
పాలు పొంగు మన తెలుగు గడ్డను
పగల గొట్టి దొబ్బాం!
నలుగురిలో మన జాతి పేరును
నవ్వుల పాలు చేసేశాం! ||తెలుగు||
(సినారె గార్కి క్షమాపణలతో)
‘‘తెలుగు జాతి మనది, పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు ’’ అని వ్రాసినందుకు సినారె ఇప్పటికే తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పేరు దేవరకొండ వారూ! కొన్నేళ్ళ క్రితం బహిరంగంగానే ఆ మాట చెప్పేరు. ఆయనకు ఆ జ్ఞానోదయం కలిగి, వివేకం ఉద్భవించి చాలాకాలమే అయింది. కాబట్టి, మీరు క్రొత్తగా ఆయనకు క్షమాపణ చెప్పవలసిన పని లేదు. పేరడీలో ఇంకొంచెం వ్యంగ్యం దట్టించి తెలుగు బిడ్డలయిన మమ్మల్ని ఆనందపరచనందుకు మాకు క్షమాపణ చెప్పండి.
శ్రీశ్రీ, ఆరుద్ర అప్పుడలా అన్నారంటే ఆ కాలపు పరిస్థితుల్ని బట్టి అన్నారని అర్థం చేసుకోవాలి. వాళ్లే కనుక ఇప్పటికీ బతికుంటే తెలంగాణకు మద్దతిచ్చేవారని నా అభిప్రాయం. దాశరథి, సినారె ఆంధ్రులు సమైక్యంగా ఉండాలని చాటిచెప్పినవాళ్లే. ఎందుకంటే అప్పుడు బలంగా ఉన్నది ‘తెలుగు’ సెంటిమెంట్ కాబట్టి. ‘తెలంగాణ’ సెంటిమెంట్ బలపడ్డాకనే సీమాంధ్రకు చెందిన పలువురు రచయితలు దానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే కదా. కాలం, పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోకపోతే తప్పుడు తీర్మానాలకు ఆస్కారం కలుగుతుంది. విద్వేషాలకు బలం చేకూరుతుంది. కొత్త చరిత్ర రాయాలనుకున్నప్పుడు పాత చరిత్రను దునుమాడాల్సిన పనిలేదు. అందులోని తప్పును ఎత్తి చూపిస్తే చాలు. లేకపోతే ఆ కాలపు వాళ్లు చేసిన తప్పులే మనమూ చేసినవాళ్లమవుతాం.
మూర్తి గారు… నేను చేసిన పని కూడా అదే. తెలంగాణ వాళ్ళు కూడా చరిత్ర తెలియక ఇన్నేండ్లు కొంత భజన చేసిండ్రు. ఆ భజన అవసరం లేదు. మన వాళ్ళు (తెలంగాణ) మస్తు మంది వెలుగులోకి రాకుండా చీకట్లో ఉన్నరు. పాబ్లో నెరుడా లాంటి కవి .. కవిరాజ మూర్తి ఆయన రచనలూ ఏవీ అందుబాటులో లేవు. ఇలాంటి వారు ప్రతి జిల్లాలో ఉన్నరు..వీల్లను మోయడం ఆపితే వాళ్ళను వెతకడం ఈజీ అని నా అభిప్రాయం.. స్పందించిన అందరికి వందనాలు..
ఆంధ్ర పాలకులు తెలంగాణకి అన్యాయం చేశారనే దాని గురించి ఒక వైపు నుంచే చూస్తే తప్పు జరిగినట్టుగానే అనిపిస్తుంది.ఇవ్వాళ గయ్యాళిగా మాట్లాడుతున్న తెలంగాణా కుమేధావుల మాటలు నమ్మితే నిజంగానే మనం సిగ్గుతో తల దించుకోవాలనే అనిపిస్తుంది!యేమంటున్నారు వాళ్ళు,మా వుద్యోగాల్ని దోచుకున్నారు – కావాలంటే గిర్గ్లానీ రిపోర్టు చూడ మన్నారు.చూశాను, ఒక 1పోష్టు గూడా వేశాను, యేముంది అందులో?అన్యాయం జరగడం అంటూ వుంటే అన్ని ప్రాంతాల వారికీ జరిగిందని ఖచ్చితంగా చెప్పాడు.మిగతా యే ప్రాంతాల వారికీ అన్యాయం జరక్కుండానో, లేదా మిగతా అన్ని ప్రాంతాల వారికీ విపరీతంగా లాభం చేకూరి వీళ్ళు ఒక్కరికే అన్యాయం జరిగితే కదా ఆంధ్రావాళ్ళు మా ఉద్యోగాలు దోచుకున్నారనీ,మమ్మల్ని ముంచి బాగుపడ్డారనీ అనాల్సింది?ఒక పత్రికా విలేఖరి మరీ సూటిగా యెవరు నష్ట పోయారు?యెవరు లాభ పడ్డారు అని అడిగితే “అభివృధ్ధి చెందిన ప్రాంతాలకి వెళ్ళగలిగిన వాళ్ళు బాగు పడ్డారు, వెళ్ళ లేని వాళ్ళు నష్ట పోయారు” – అని అంతకన్నా సూటిగా జవాబు చెప్పాడు. దాని భావ మేమిటో యే తిరుమలేశుణ్ణీ అడగనక్కర్లేదు కదా?చిన్న పిల్లవాడి నడిగినా చెప్తాడు, ఇంకా “అదేంటి?అయితే యెక్కడో వున్న కృష్ణా జిల్లాల వాళ్ళు అంత దూరంలో వున్న హైదరాబాదుకి వెళ్ళి బాగు పడగలిగినప్పుడు, పక్కనే వున్న వాళ్ళు కూడా వెళ్ళి బాగుపడితే బాగుండేది కదా? వెళ్ళగలిగితే బాగు పడతామని తెలిసినప్పుడు వెళ్ళి బాగు పడకుండా యాభయ్యేళ్ళు యేమి చెస్తున్నట్టు?” అని కూడా అడుగుతాడు!నా లాంటి తింగరోడు పక్కనే వుంటే , “బహుశా యాభయ్యేళ్ళయినా వందేళ్ళయినా సరే ఆంధ్రోళ్ళు అక్కడ ఉండగా పోగూడదు ఆంధ్రోళ్ళని అక్కణ్ణించి తరిమి కొట్టాకే వెళ్ళి బాగు పడదాంలే అనుకుంటూ, యే మహానుభావుడు వచ్చి ఆంధ్రోళ్లని తరిమికొడతాడా అని జపతపాలు చేస్తూ కూర్చున్నారేమోలే” అని ఓ వంకర కూత కూస్తాడు
తెలంగాణ వాళ్ళ తింగరి వాదనల్ని మొగ్గలోనే తుంచెయ్యని మన వెనకటి తరం నాయకుల అలసత్వం వల్ల ఇదంతా జరిగింది! చెన్నారెడ్డి లాంటి పదవి పోయిన పాత పొలిటీషియన్లు భుజం మీద వేసుకుని గగ్గోలుపెట్టి మళ్ళీ పాప్యులారిటీని సాధించుకోవటానికి తెలంగాణకి జరిగిన అన్యాయం పనికొచ్చేది!అంతకు మించి అక్కడ అందరూ అనుకున్న భీభత్సాలు యేమీ జరగలేదు.పోనీ జరిగాయనే అనుకుందాం, ఇప్పటి పరిస్థితి యేమిటి?కలిసుండటం వల్లనే మా కన్యాయం జరిగిందని విడిపోతే యే న్యాయం వెయ్యి కాంతులతో వికసిస్తుందని వాళ్ళు అంటున్నారో ఇవ్వాళ్టి తెలంగాణా ఆ నమ్మకాన్ని కలిగించేవిధంగా వుందని ఈ మేధావులు చెప్పగలరా?యెన్నికల్లో గెలిచి మంత్రివర్గంలో వున్నవాళ్ళలో గానీ అక్కడ పైస్థాయిలో చక్రం తిప్పుతున్నవాళ్ళలో గానీ కొత్తముఖాలు మీకెక్కడయినా కనబడినాయా?కేసీఆర్ కుటుంబమూ, రెడ్లూ మరియూ వెలమలూ హవాహవాయీ అన్నట్టుగా వున్నారు!కోడి పోయి కత్తి వచ్చె డండండం అన్నట్టు ఆంధ్రారెడ్లు పోయి తెలంగాణారెడ్లు వచ్చె డండండం అనేట్టుగా వున్న కొత్త సీసాలో పాతసారా తంతు కోసమేనా అంతగా అంగలార్చింది?
విడిపోయి కలిసుందాం అన్నవాళ్ళు ఇవ్వాళ అదేదో సినిమాలో మూగతనం పోయిన శ్రీలక్ష్మి చిన్నప్పుడు పక్కింటివాళ్ళని తిట్టాలనుకునన్ తిట్లని ఇప్పుడు ఎదురుగా ఉన్న మొగుణి తిట్టిన చందంగా ఆంధ్రా కవుల పాత చరిత్రలు ఎత్తుకుని మరీ తిడుతున్నారు,ఎందుకు?
ఎవరో కవి విస్మృతంగా ఉండిపోవడానికి శ్రీశ్ర్రెకి వచ్చిన పేరు ప్రతిస్ఠలకీ సంబ్నధం యేమిటి?ఆ విస్మృతకవికి ఇప్పుడు కొత్తగా పేరు తీసుకురావాలంటే పాతవళ్ళని తిట్టి బజారుకీద్ఛి లాగిపారెయ్యాలా?తెలంగాణ కవుల్ని పొగడ్డానికి ఆంధ్రా కవుల్ని తెగడ్డానికి యేమిటి సంబంధం?
ప్రాంతీయాభిమానం ఉండటంలో ఏమాత్రమూ తప్పు లేదు!కానీ,పక్షపాతం అనిపించేటట్టు ఉండకూదదు,అవునా?ఈ 1969లో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళలో “దాశరధి”ని ఎందుకు వద్లిలేశారు?ఆయన ఆరోగ్యం బాగుండక ఆస్పత్రిలో చేరితే ముందుముందు కోవర్టుగా పనికొస్తాడని ఆంధ్రా పెద్దమనిషి ఒకడు వైద్యం చేయించితే ఆ విశ్వాసంతో యేదో మాట్లాడబోతే కాళోజీ నారాయణ రావు అనే మహామేధావి ఆ కుట్రని బయటపెట్టి నిలదీస్తే గుడ్లనీరు కక్కుకుంటూ జారుకున్న ద్రోహి కదా!”ప్రాంతం వాడు ద్రోహం చేస్తే…” లాజిక్కు ప్రకారం ఆయన్నీ పాతరెయ్యండి – మీరెంత నిష్పక్షపాతంగా ఉండగలరో తెలుస్తుంది.భావజాలం పట్ల నిబద్ధత ఉంది ఉందని చెప్పుకుంటే ఎలా తెలుస్తుంది,చేతల్లో కనబడినప్పుడె మీ నిజాయితీ అందరికీ అర్ధమవుతుంది.ఇప్పటికీ సమయం మించి పోలేదు.”వీళ్ళని మొయ్యడం ఆపితే..” లిస్టులో దాశరధిని కూడ చేరుస్తారు కదూ!
*
సిగ్గు లేకపోతే సరి!ఏ ఉద్దేశంతో వ్యతిరేకించారో స్పష్టంగా నాకు తెలియదు గానీ,కలపాలనీ నుకున్నప్పటి నుంచీ ఆంధ్రోళ్ళతో కలవగూడదు,విడిగా ఉండాలి అనుకున్నారు.ఇన్ని దశాబ్దాల తర్వాత సాధించుకున్నారు.గతం గతః అనుకుని ఇప్పుడు తెలంగాణకి ఉన్న సమస్యల్ని ఎట్లా అధిగమించాలి అని భవిష్యత్తు గురించి ఆలోచించటం మానేసి గత చరిత్రలు తవ్వుతున్నారు – చరిత్రలు తవ్వడం మీకు మాత్రమే తెలుసునని పెద్ద అహంకారం!రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు కూడా విడిపోయేటప్పుడు తిట్టుకున్నా,తర్వాత పెళ్ళిళ్ళలో పందగల్లో కలుస్తూ యేదయినా కష్తమొచ్చిందని తెలిస్తే మనస్పూర్తిగా సహాయాలు చేసుకుంటూ పాత ద్వేషాలు మర్చిపోయి ఆప్యాయతల్ని చూపిస్తారు – ఆపాటి మర్యాద కూడా లేదా మీకు?
*
ఇన్ని దశాబ్దాల నుంచీ ఆంధ్రోళ్ళు దోచుకోవడం వల్లనే మీ ప్రాంతం వెనకబడ్డాం అనేది నిజమైతే మీ ప్రాంతపు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు?వాళ్ళలో ఎంతమందిని మీరు పాతరెయ్యగలిగారు? వ్యక్తులుగా చూసినా పార్టీలుగా చూసినా మీరు ఆంధ్రా దోపిడీ జరిగింది అనే కాలంలో అధికారంలో ఉన్నవాళ్ళే ఇప్పుడు కూడా గులాబీ కండువాతో దర్సనమిస్తుంటే అర్ధం కావడం లేదా?వీళ్ళు మీ ప్రాంతం వాళ్ళు కాదా!వీళ్ళని పాతరెయ్యనక్కర లేదా?గురివిందల్లాగ ఆంధ్రోళ్ళని తిట్టడం ఆపి మీ తప్పుల్ని తెలుసుకుని బాగుపడండి.
*
దసరాబుల్లోడు అనే సరదా సినిమాలో ” దొంగలు దొంగలు చేరి వూళ్ళు పంచుకుంటారు,వాటా కుదరని వాళ్ళూఉ వేరే పార్టీ పెడతారు” అన్నట్టు పైస్థాయిలో ఉన్నవాళ్ళ వెసులుబాటు కోసమే పాకిస్తాన్ ఏర్పడింది, తెలంగాణ కూడా అదే లెక్క ప్రకారం ఏర్పడింది.మీరు నమ్మలేకపోతే అది మీ అమాయకత్వం! చరిత్రలు తవ్వడం ఇక ఆపితే బాగుంటుంది!
*
శ్రీశ్రీని ఎవరు తెలంగాణ మీద రుద్దారు?అతను కమ్యునిష్టు భావజాలంతో కవిత్వం రాశాడు.ఆ భావజాలం నచ్చినవాళ్ళు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారు కదా!భావజాలంలో సారూప్యత ఉండియే నిన్నటి రోజున అభిమానించారు,ఇవ్వాళ్టికీ అభిమానిస్తున్నారు,రేపు కూడా అభిమానిస్తారు – తెలంగాణలో కమ్యుఇనిష్టు భావజాలం ఉన్నవాళ్ళు శ్రీశ్రెని పొగిడితే అది ఆంధ్రోళ్లకి వూడిగం చెయ్యడం అయితే ఆంధ్రోళ్ళు పోతన భాగవతం చదవడం అది తెలంగాణకి వూడిగం చెయ్యడం అవదా!
*
ఇప్పుడు మీరు సిగ్గుపడటం మొదలుపెడితే సిగ్గుకే సిగ్గేసేటంత సిగ్గులేని తనం ఉంది మీలో! రాష్ట్రాన్ని విడదీసిన వాళ్ళు మీలాంటి నాలాంటి ప్రజల గురించి ఆలోచించి విడదియ్యలేదు – పై స్థాయిలో చేతులు మారే వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్టులను ఎవరు దక్కించుకోవాలన్న లెక్కలతో కొందరూ,ఒక రాష్ట్రం రెండయితే అదనంగా సృష్టించబడే రాజకీయ పదవుల కోసం కొందరూ – తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు చేశారు.అందుకే మనల్ని రెచ్చగొట్టి విద్వేషాలు పెంచిన అన్ని పార్టీల వాళ్ళూ ఇప్పుడు పదవుల్ని పంచుకోవడం కోసం వాళ్ళలో వాళ్ళు అంత ఐకమత్యంగా కలిసిపోగలుగుతున్నారు – కళ్ళు తెరుచుకుని చూడండి!ఈ మేకమెడచంటిపాల కోసం ఎంత ఆశపడినా లాభం లేదని త్వరలోనే తేటతెల్ల మవుతుంది ఎల్లరకూ!ఏ మనిషి ఏ దేశంలో ఏ కాలంలో వృద్ధిలోకి వచ్చినా అతని నైపుణ్యమే కారణం.మీలోని నైపుణ్యాన్ని పెంచుకోండి,అది ఆర్జనని పెంచుతుంది,అది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది – అప్పుడు ఈ విభేదాలూ ద్వేషాలూ వాటంతటవే మాయమై పోతాయి.ఆ రోజున వెనక్కి తిరిగి చూసుకుంటే అనవసరంగా ఆవేశపడ్డామని పశ్చాత్తాపపడకుండా ఉండటానికయినా ఈరోజున కొంచెం విచక్షణతో ప్రవర్తించండి!
*
మనుషుల్ని కలపటానికి పుట్టిన భాషని మనుషుల్ని విడదియ్యటానికి వాడకండి!
అయ్యా బాబు గారు నేను దాశరధిని ఎక్కడా మోసింది లేదు. ఆ ఉద్దేశం లేదు. నా రచనలు ఫాలో అయితే అది మీకు అర్థమైతది. చరిత్ర వొద్దు అన్న చంద్రబాబుకు మీకు తేడా లేకుండా పోయింది. అయినా ఈ వ్యాసం తెలంగాణ రాక ముందు రాసినది అని లెక్కలోకి తీసుకుంటే మీరు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. మీ దృష్టిలో నేను పక్షపాతంగా ఉన్నాను అనిపిస్తే దయచేసి ఆంధ్రా అద్దాలు తీసేసి మరొక్క సారి చదవండి..
గతచరిత్రలు తవ్వితే రెండువైపులా ఉన్న తప్పులు చాలా బైటికి వస్తాయి.మీరు శ్రీశ్రీని యెత్తిపొడుస్తున్నప్పుడే తెలంగాణ ఏర్పాటును సమర్ధించిన ఆంధ్రప్రాంతపు వాళ్ళూ ఉన్నారు.ఈ రెండుప్రాంతాల్నీ ఒక్కటిగా కలిపింది కాంగ్రెస్!భాషా ప్రయుక్త రాష్ట్రాలు అన్నది ఒక సెంటిమెంతల్ ముసుగు,అప్పుడు కూడా పైస్థాయిలో వాటాల పంపకమే ప్రధాన కారణం.నాకీ చరిత్రలన్నీ కొట్టిన పిండి.పెద్దమనుషుల ఒప్పందం అనే బల్లకి అటూ ఇటూ కూర్చున్న పెద్దమనుషులు ఎవరు?అప్పట్లో కాంగ్రెసు పార్టీదే కదా హవా అంతా!దాన్ని తుంగలో తొక్కటం అంటూ జరిగితే వారి వాటయే ఎక్కువ కదా ఆ పాపంలో!
*
అసెంబ్లీలో రెండు ప్రాంతాల శాసనసభ్యులూ తమ తమ వాదనలు వినిపించి ఎవరికి రావలసింది వాళ్ళు పంచుకుని మర్యాదగా విడిపోయే పద్ధతిని వ్యతిరేకించి ఆర్టికిల్ 3 ద్వారా పైనుంచి రుద్దడం అనే మొండి పద్ధతికి ఎందుకు వెళ్ళారు?ఉద్యమ కాలంలోనే ధర్మమేవ జయతే బ్లాగులో పాయింట్ల వారీగా 10 రకాలుగా “ఆంధ్రోళ్లని తిట్టి ఏకపక్షంగా పైనుంచి తెచ్చుకునే పద్ధతి” వల్ల తెలంగాణకీ అన్యాయమే జరుగుతుందని చెప్పాను. నా విశ్లేషణ ఇది:”అలా మొండిగా వెళ్ళినప్పుడు ఆంధ్రా పొలిటీషియన్లు వాళ్ళ చాణక్యం వాళ్ళూ చూపిస్తారు,తెగే దాకా లాగి ఆఖరి నిమూహం వర్కూ అడ్డుపడి అవ్స్తుందా రాదా అనే గందరగోళం సృష్టించి విడిపోయాక తెలంగాణకి కావలసిన అదనపు సౌకర్యాల కోసం పట్టూబ్ట్టకుండ వొస్తే చాలుననే విధంగా మిమ్మల్ని కార్నర్ చేస్రారు” అని.ఇవ్వాళ విబాన అలాగే జరిగింది కదా!అదే కాదు,ఫలానాది జరుగుతుంది అని నేను గట్టిగా వేసిన అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు!
*
రాష్త్ర శాసనసభకి విలువ ఇవ్వకుండా ఆర్టికిల్3 ద్వారా కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే విడగొట్టటం, అదీ ఒక ప్రాంతం నాయకుల మీద మరో ప్రాంతం నాయకులు వారికన్నా వేగంగా అభివృధ్ధి చెందడమే నేరమన్నట్టు అనరాని మాటలు అనటం, వాటికి జవాబు చెప్పుకోవడానికి చట్టసభలలో యెక్కడా కించిత్తు అవకాశం కూడా ఇవ్వకపోవటం,ఆఖరికి మాతృరాష్ట్రాన్ని కనీస మర్యాద కూడా ఇవ్వకుండా పదేపదే అవశేషంగా అభివర్ణించటం,మిగిలిన కొంచెపు ముక్కనన్నా ఒక్కటిగా ఉండటం చూడలేనట్టు అట్లా ఉంచకుండా సీమవాసులు అడక్కపోయినా రాయలతెలంగాణా పేరుతో ఆ ప్రాంతాన్ని కూడా అప్పనంగా తెలంగాణాకే దఖలు పర్చాలని ప్రయత్నించటం,రాజధాని కట్టుకోవటానికి నికరమైన నిధులూ లోటు బడ్జెట్టును యెదుర్కోవడానికి తగ్గ యేర్పాట్లు యేవీ అధికారికంగా బిల్లులో ఉంచకపోవడం లాంటి అడ్డగోలు పనులన్నిట్నీ కలిపి చూస్తే ఈ రాష్త్ర విభజనలో తెలంగాణా అనే కొత్త రాష్ట్రాన్ని యేర్పరచడంతో పాటు ఆంధ్ర ప్రాంతాన్ని నామరూపాలు లేకుండా చెయ్యాలనే దుర్మార్గపువ్యూహం కూడా వున్నదని నాకు అనుమానం!చెప్పుకుంటే జనం మెచ్చుకునే గొప్ప సంగతి కాదు గనక ఆ కుట్రలో పాల్గొన్నవాళ్ళు యెవరూ బయటికి చెప్పరు గనక ఇప్పటికిప్పుడు నిర్ధారణగా చెప్పలేము గానీ అరిభీకరంగా చెలరేగిపోతున్న ఉద్యమవీరులు కూడా తెలంగాణా నడిబొడ్దునే ధరావతులు పోగొట్టుకుంటున్న కాలంనుంచీ మొదలు పెట్టి ఇస్తానని చెప్పి తొమ్మిదిన్నరేళ్ళు సాగదీసి తెలంగాణా వాళ్లనీ యేడిపించిన కాలంలో జరిగిన సంఘటనలనన్నిట్నీ కలిపి విభజన బిల్లు పార్లమెంటులో చట్టంగా రూపుదాల్చేవరకూ తేదీల వారీగా వ్యక్తుల ప్రకటనల్నీ పత్రికలవాళ్ళు కూపీలు లాగిన రహస్యసమావేశాలవివరాల్నీ ఒక వరస ప్రకారం అమరిస్తే తేలికగా తెలుసుకోవచ్చు గుండుగుత్తంగా తెలంగాణాకి లాభం చేకూర్చే ఉద్దేశంతో కావాలనే అవన్నీ అట్లా చేశారని, యెందుకో మా మీద అంత పగ!
*
పోనీ ఇంతగా అన్నీ తెలంగాణకే దోచిపెట్టినట్టు కనిపిస్తున్నా తెలంగాణకి జరిగిన లాభం ఏంటి?రాష్ట్రంగా మ్యాపులో కనపట్టం తప్పించి విభజన వల్ల నికరంగా ఒనగూడిన మేము ఏదయినా ఉంటే చెప్పండి!మీకిప్పుడు వచ్చింది సమస్యలతో కూడిన తెలంగాణయే,కేసీయార్ ఓరుకున్నది కూడా సమస్యలతో కూడిన తెలంగాణనే!చక్కగా రుపక్షాలూ కూర్చుని ఎవరి వాటాలు వాళ్ళు వేసుకుని సమస్యలు లేకుండా విడిపోయి రేపు పరిపాలనలో ఫెయిలయితే?!ఇప్పుడు మళ్ళీ ఉపయోగించుకోవటానికి “ఆంధ్రోళ్ళు కుట్ర జేసిర్రు.మంచిగ ఇయ్యలె – నేనేం జేస్త!” అని చెప్పుకునే వెసులుబాటు ఉండె గద!
*
నేను నా బ్లాగులో రెండు రాష్ట్ర్రాలకి సంబంధించిన విషయాల మీదా పోష్టులు వేస్తూనే ఉన్నాను.ప్రత్యేకించి ఆంధ్రా కళ్ళద్దాలు లేవు అని నాకు నేను చెప్పుకోనక్కర లేదు,మీరు చూసి స్వయంగా తేల్చుకోవచ్చు! విమర్శించాల్సిన పాయింటు ఉంటే చంద్రబాబునీ విమర్శిస్తున్నాను.మెచ్చుకోవాల్సిన పాయైంటు ఉంటే కేసీయారునీ మ్రెచ్చుకుంటున్నాను. తెలంగాణ రాకముందు రాసినది ఇప్పుదు రీపోస్ట్ చేశానంటున్నారు గాబట్టి ఆ వేడి నుంచి బయటపడి చల్లబడాల్సింది మీరే!పోస్టు రాసినా కామెంటు వేసినా రీసెర్చి చెయ్యకుండా సాక్ష్యాలు లేకుండా నేనేదీ రాయను – అర్ధం చేసుకోండి!
*
2014లో విడిపోయాం,రెందేళ్ళు గడిచిన ఇప్పుడు 1965లో శ్రీశ్రీ అట్టా అన్నాడు,1950ల్లో పొట్టి శ్రీరాములు అమరుడైంది ఆంధ్రరాష్ట్రం కోసం కాదు,పిజ్జా బర్గర్లు ఇవ్వలేదని చచ్చాడు అనే విశ్లేషణలు ఎందుకు?అప్పుడూ ఇపుడూ విడిపోవటాన్ని సమర్ధించిన వాళ్ళూ వ్యతిరేకించిన వాళ్ళూ అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నారు, తమిళుల నుంచి ఆంధ్రావాళ్ళు విడిపోయినప్పుడు కూడా తమిళుల్లో విభజనని సమర్ధించిన వాళ్ళూ ఉన్నారు,ఆంధ్రావాళ్ళలో వ్యతిరేకించిన వాళ్ళూ ఉన్నారు,అవునా కాదా?ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి.మళ్ళీ చెప్తున్నా చరిత్రలు తవ్వడం మొదలుపెడితే మీవైపునుంచి జరిగిన తప్పులూ బైటికి వస్తాయి,ఎందుకొచ్చిన గోల! కవులూ కళాకారులూ అందరివాళ్ళు,వాళ్ళని ప్రాంతాలకి పరిమితం చెయ్యడం అంటే వాళ్ళ రేంజిని తగ్గించి చిన్నబుచ్చడమే!
*
P.S:అసెంబ్లీ ద్వారా విడిపోవటం,ఆటికిల్ మూడుకి వెళ్ళడం గురించి కూడా ఇప్పుడు వాదనలు అనవసరం,అలా ఎందుకు వెళ్ళరనే చరిత్రా నాకు తెలిసిందే!మీ ప్రాంతపు సాహిత్యాన్ని వృద్ధి చేస్కోండి,ఎవరు వద్దన్నారు?శ్రీశ్రీ అనే కమ్యునిష్టు కవి ఆ భావజాలంతో కవిత్వం రాయడానికీ,ఆ భావ్జాలం గలవాళ్ళు అభిమానించడానికీ కూడ అతెలంగాణని తొక్కెయ్యాలనే హిడెన్ ఎజెండా ఉన్నట్టు ప్రస్తావిస్తూ మీ వ్యాసం మొదలైంది,అలాంటి ధోరణి ఇంకా మీలో ఉన్నా లేకున్నా నేను చేయగలిగింది లేదు – ఆత్మదీపోభవ!!