కొలకలూరి విశ్రాంతమ్మ, భాగీరథి పురస్కారాలకు నవలలు, కథాసంపుటాల ఆహ్వానం

Awards Cover
కొలకలూరి విశ్రాంతమ్మ  పురస్కారం కోసం 2011-13 మధ్య ముద్రితమైన నవలల మూడేసి ప్రతులను ఈ నెల 20లోగా ఆశాజ్యోతి, బెంగుళూరు విశ్వవిద్యాలయం, బెంగుళూరు-56 చిరునామాకు; కొలకలూరి భాగీరథీ పురస్కారంకోసం 2011-13 మధ్య ముద్రితమైన కథా సంపుటుల మూడేసి ప్రతులను ఈ నెల 20లోగా కొలకలూరి మధుజ్యోతి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి-2 చిరునామాకు పంపించాలి. ఫిబ్రవరి 26 న  హైదరాబాద్‌లో పురస్కార ప్రదాన సభ జరుగుతుందని కొలకలూరి ఆశాజ్యోతి, మధుజ్యోతి తెలియచేసారు.  కొలకలూరి విశ్రాంతమ్మ , భాగీరథి పురస్కారాలను 2008 వ సంవత్సరం నుంచి అందచేస్తున్నారు. ఒకొక్క ఏడాది రెండేసి ప్రక్రియలను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది కథ, నవల ప్రక్రియల కింద ఈ పురస్కారాలను అందచేస్తారు. గత సంవత్సరాల్లో నాటకం, కవిత్వం, విమర్శ, పరిశోధన ప్రక్రియల కింద పురస్కారాలు అందచేసారు.

11 న హైదరాబాద్ లో ” చిత్రలిపి” కందుకూరి రమేష్ బాబు ఛాయాచిత్ర ప్రదర్శన

telugu invitation*
ముగ్గులు స్త్రీల కళా నైపుణ్యానికి, కల్పనాశక్తికి చిహ్నాలు. కేవలం హస్తమాత్ర సహాయంతో ఊహాశక్తిని అనుసరించి చిత్ర విచిత్రాలైన రచనా విధానాలతో సంప్రదాయాలను ప్రదర్శించే స్త్రీల ముగ్గులు చిత్రకళాధి దేవతకు సహజ సౌందర్య శోభిత ఆభరణాలు. ‘దృశ్యాదృశ్యం’ పేరిట సారంగ పాఠకులకు పరిచయం అయిన కందుకూరి రమేష్ బాబు సంక్రాంతి సందర్భంగా ప్రదర్శిస్తున్న చిత్రకళా ప్రదర్శన వీటిపైనే. శుభాకాంక్షలతో…ఆహ్వానం అందరికీ…. 

సంక్రాంతి శుభాకాంక్షలతో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – భాషా సాంస్కృతిక శాఖ
భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి సౌజన్యంతో

చిత్రలిపి
SAMANYASHASTRAM IMAGES

~  కందుకూరి రమేష్ బాబు ఛాయాచిత్ర ప్రదర్శన ~

11 జనవరి 2014 సాయంత్రం 6 గం॥
ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో, కళాభవన్, రవీంద్రభారతి ప్రాంగణం, హైదరాబాద్-4
ప్రదర్శనః 12 నుంచి 14 జనవరి 2014 వరకు. ప్రతి రోజూ ఉదయం 11 గం॥ సాయంత్రం 7 గం॥ వరకు

జ్యోతి ప్రకాశనం
శ్రీమతి సత్యలతా కిషన్ (చిత్రకారుడి మాతృమూర్తి)

ప్రారంభకులు
శ్రీ ఎన్.ముక్తేశ్వరరావు, ఐఎఎస్ (కార్యదర్శి, ఆం.ప్ర. భాషా సాంస్కృతిక శాఖ)

ముఖ్య అతిథి
శ్రీ బి.నరసింగరావు (ప్రసిద్ధ దర్శకులు, ఛాయా చిత్రకారులు)

విశిష్ట అతిథి
శ్రీ అల్లం నారాయణ ( సంపాదకులు, నమస్తే తెలంగాణ దిన పత్రిక)

ఆత్మీయ అతిథి
డా॥ రాళ్లబండి కవితా ప్రసాద్ ( సంచాలకులు, ఆం.ప్ర. భాషా సాంస్కృతిక శాఖ)

ముగింపు ఉత్సవం
14 జనవరి 2014. సాయంత్రం 6గం॥
ఆత్మీయ అతిథులు: డా॥ రావి ప్రేమలత (‘చిత్రలిపి’ పరిశోధకులు),
శ్రీ కె.వి.రమణా చారి (సాంస్కతిక శాఖ పూర్వ సలహాదారులు)

అందరికీ సాదర ఆహ్వానం

‘రంగు రంగుల జ్ఞాపకాలు’…మీ ముంగిట్లో…వచ్చే గురువారం నుంచి…!

memories-1

రాత్రయింది. ఊరంతా చీకటి. కానీ ఊరు ఊరంతా సందడిగా ఉంది. ఆ రోజు మా ఊర్లో సినిమా ప్రదర్శిస్తున్నారు. బహుశా మా ఊర్లో అదే మొదటి సినిమా ప్రదర్శన అనుకుంటాను. అప్పటికి నా వయసు ఎంతో కూడా నాకు తెలియదు. ఊరిలోని పీర్ల చావిడి దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశంలో సినిమా ప్రదర్శన కి ఊరు ఊరంతా తరలి వచ్చింది. నిజానికి ఈ విషయాలేవీ నాకు గుర్తు లేవు. అసలు ఆ రోజు నేను ఎవరితో కలిసి సినిమాకెళ్లానో కూడా నాకు గుర్తు లేదు.

– సినిమా ఒక అందమయిన జ్ఞాపకం. అది నిజంలాంటి కల. కలలాంటి నిజం. ఈ రెండీటి మధ్యా ఊగిసలాడే మనం! ఆ జ్ఞాపకాల తెర తీస్తున్నారు వెంకట సిద్దా రెడ్డి మీ కోసం! నెలకో సారి మీ ముందు!

ఆటా రచనల పోటీలు

ata

మెరికా తెలుగు సంఘం వారు పదమూడవ ఆటా మహాసభల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక సంచిక కోసం రచనల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు  రచయితల నుండి ఈ క్రింది సాహితీ ప్రక్రియల్లో రచనలు ఆహ్వానిస్తున్నారు:

1. కథలు

2. కవిత్వం (వచన కవిత్వం, ఛందోబద్ధమైన కవిత్వం)

3. వ్యాసాలు/గల్పికలు/వ్యంగ రచనలు/లేఖలు/పేరడీలు

పోటీల నిబంధనలు, రచయితలకు సూచనలు:

• రచయితలు పైన పేర్కొన్న ఏ విభాగానికైనా తమకు నచ్చిన ఇతివృత్తం ఎన్నుకోవచ్చును. తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని, అన్ని తరాల విభిన్న ఆలోచనా రీతుల్ని , సమాజ, ఆచార వ్యవహార స్థితిగతుల్ని ప్రతిబింబిస్తూ రాసే రచనలకు పెద్దపీట వేయబడుతుంది.

• ఉత్తమ రచనలకు $116 బహుమతితో పాటు ఆటా జ్ఞాపిక అందజేయబడుతుంది. బహుమతి ప్రధానం  జూలై 3, 4, 5 తేదీలలో ఫిలడెల్ఫియాలో జరగబోయే ఆటా వార్షికోత్సవ మహాసభలలో జరుగుతుంది.

• బహుమతి పొందిన రచనలు, సాధారణ ప్రచురణకు ఎంపిక చేయబడిన రచనలను ఆటా ప్రత్యేక సంచికలో ప్రచురించడం జరుగుతుంది.

రచనలు చేరవలసిన ఆఖరి తేదీ మార్చి 30, 2014. ఈ తేదీలోపు కంటే ముందే, వీలైనంత త్వరగా పంపగలిగితే మరీ మంచిది.

• కథలు: కథల నిడివి చేతి వ్రాతలో పది పేజీల లోపు, టైపింగ్ లో ఐదు పేజీల లోపు ఉంటే బావుంటుంది.

• కవిత్వం: కవిత చేతి వ్రాతలో ఐదు పేజీల లోపు, టైపింగ్ లో రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది. ఆదునిక కవిత, ఛందోబద్ధమైన పద్యకవిత్వం, ఇతర కవితా ప్రక్రియలూ అన్నీ ఆమోదయోగ్యమే.

• వ్యాసాలు, గల్పికలు, వ్యంగ రచనలు, పేరడీలు, లేఖలు: చేతి వ్రాతలో ఐదు పేజీల లోపు, టైపింగ్ లో రెండు పేజీల లోపు ఉంటే బావుంటుంది.

• రచయితల యొక్క అముద్రిత స్వీయ రచనలు మాత్రమే స్వీకరించబడతాయి. అనువాదాలు, అనుసరణలు, అనుకరణలు అంగీకరించబడవు. బ్లాగులు, వెబ్ సైట్స్, వెబ్ పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించబడ్డ రచనలు పరిగణింపబడవు. ఈ విషయాలను ధృవీకరిస్తూ హామీపత్రం జత చేయాలి.

• రచనలపై సర్వాధికారాలు రచయితకే చెందుతాయి. కాని, రచయితలు తమ రచనలను ఆటా ప్రత్యేక సంచికలో ప్రచురించే లోపు ఇంకెక్కడా ప్రచురించవద్దని మనవి.

• రచనల్ని యూనికోడ్ ఫాంట్స్ లో పంపాలి. ఒకవేళ మీకు యూనికోడ్ లో టైప్ చేసే సౌకర్యం లేకపోతే మీరు మీ రచనలను స్కాన్ చేసి PDF ఫైల్స్ పంపించవచ్చు. దయచేసి వీలైనంత వరకు యూనికోడ్ లో టైప్ చేసి పంపించగలరని కోరుతున్నాం. రచనను ఈమెయిలులో రాసి పంపవచ్చు, లేదా ఈమెయిలుకు జోడింపుగా టెక్స్ట్ ఫైళ్ళ రూపంలో కూడా పంపవచ్చు. రచనలు పంపే విషయంలో మీకు ఎలాంటి సందేహాలున్నా ఈ క్రింది ఈమెయిల్ అడ్రసుకు మీ ప్రశ్నలు పంపించండి. మేము సాధ్యమైనంత త్వరలో మీకు సమాధానం ఇవ్వటానికి ప్రయత్నిస్తాం.

• కనీసం ఐదుగురు న్యాయనిర్ణేతలు విజేతలను నిర్ణయిస్తారు. న్యాయనిర్ణయం అంతా తగిన నిబద్ధత, కొలబద్దల ఆధారంగానే జరుగుతుంది. విజేతల నిర్ధారణలో అన్ని విషయాలలోనూ నిర్వాహకులదే అంతిమ నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

• రచనలు పంపవలసిన ఈమెయిలు: souvenir@ataconference.org. ఈమెయిలులో మీ పూర్తి పేరు, కాంటాక్ట్ నెంబర్, చిరునామాల తో పాటు ఒక పేజీకి మించకుండా మీ నేపద్యం కూడా పంపించడం మరిచిపోవద్దు.

వేంపల్లె షరీఫ్, మల్ల్లిపురం జగదీష్‌కు విమలాశాంతి పురస్కారాలు

DSC_0062

వేంపల్లె షరీఫ్

IMG_5573

విమలా శాంతి సాహిత్య సాంఘిక సేవా ట్రస్టు ప్రతి ఏడాది అందచేసే విమలాశాంతి సాహిత్య పురస్కారాలు 2013 వ సంవత్సరానికి గాను కథా రచయిత వేంపల్లె షరీఫ్ కు, మల్లిపురం జగదీష్ కు ప్రకటించారు. విమలాశాంతి సాహిత్య సాంఘిక సేవాట్రస్టు, సమాజ వికాసం కోసం రచనలు చేస్తున్న రచయితలను గౌరవించే దిశలో 2013 కథాపురస్కారం కోసం జాతీయ స్థాయిలో రచయితల నుండి కథాసంపుటాలను ఆహ్వానించింది. ట్రస్టు ఆహ్వానాన్ని మన్నించి 47మంది రచయితలు తమ తమ కథా సంపుటాలను పంపి పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో కొత్తవాళ్లతోపాటు లబ్ధప్రతిష్టులు చాలామంది పాల్గొన్నారు.  “2013 – విమలాశాంతి సాహిత్య పురస్కారాల”ను “శాంతి రజనీకాంత్ స్మారక సాహిత్య పురస్కారాలుగా” అందజేస్తున్నారు . “2013 శాంతి రజనీకాంత్ స్మారక కథా పురస్కారాన్ని” వేంపల్లి షరీఫ్ (కడప జిల్లా) “జుమ్మా” కథా సంపుటికి, మల్లిపురం జగదీష్ (శ్రీకాకుళం జిల్లా) “శిలకోల” కథా సంపుటికి సంయుక్తంగా ప్రకటించారు.

ఉత్తమ సాహిత్య ప్రతిఫలన రూపంగా ఎదుగుతున్న మా  చిన్నబ్బాయి “శాంతి రజనీకాంత్ (27) ఒక ప్రయివేట్ ఉద్యోగ రాక్షసి కర్కశ కరాళ నృత్యఘంటికల హోరులో నలిగి తటాలున కాలగర్భంలో కలిసిపోయాడు. కళకళలాడుతూ కళ్లముందే కరిగి మాయమయి పోయిన ఆ మానవత్వపు సుగంధ పరిమళానికి స్మృత్యర్ధంగా ఈ పురస్కారాలను అందజేస్తున్నామని విమలా శాంతి సాహిత్య సాంఘిక  సేవా ట్రస్ట్ చైర్మన్ డా. శాంతినారాయణ  ఒక ప్రకటన లో తెలియచేసారు.

అక్టోబర్ నెలలో జరిగే పురస్కార ప్రధానోత్సవ సభలో రచయితలకు జ్ఞాపికల్తో పాటు ఒక్కొక్కరికి రూ.5,000/= చొప్పున నగదును బహూకరించి సత్కరిస్తారు. . ఈ పురస్కారాల ఎంపికలో ఆచార్య కాత్యాయని విద్మహే, గంటేడ గౌరునాయుడు డా. వి.ఆర్.రాసాని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ 2013

స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013)

“750 పదాల” స్మార్ట్ స్టోరీ రాయండి

రూ. 10,000/- విలువైన బహుమతులు గెలుచుకోండి

మిత్రులారా…

మీరు 28 సంవత్సరాల లోపు వారా? అయితే, మీ సృజనాత్మకతని వెల్లువెత్తించండి, మీ కీబోర్డులకి పనిచెప్పండి…. రూ.10,000/– వరకూ గెలుచుకునే చక్కని అవకాశాన్ని అందిపుచ్చుకోండి!

మీరు చేయాల్సిందల్లా.. కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013)కి 750 పదాల లోపు, ఒక స్మార్ట్ స్టోరీ రాసి submit@kinige.com కి పంపిస్తే చాలు! మీ కథ బహుమతి గెలుచుకునే అవకాశం. వివరాలు దిగువ …

ప్రథమ బహుమతి:

మీ కథ… కినిగె ప్రథమ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే…

మీకు రూ.4000/- విలువగల బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

ద్వితీయ బహుమతి

మీ కథ… కినిగె ద్వితీయ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే…

మీకు రూ.2000/- విలువగల బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

తృతీయ బహుమతి

మీ కథ… కినిగె తృతీయ ఉత్తమ స్మార్ట్ స్టోరీగా ఎంపికైతే…

మీకు రూ.1000/- విలువగల బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

ప్రోత్సాహక బహుమతులు (6 కథలకు)

మీ కథ… కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్‌లో కన్సోలేషన్ ప్రైజ్‌కి ఎంపికైతే… మీకు రూ.500/- విలువగల ప్రోత్సాహక బహుమతి లభిస్తుంది.

మీ కినిగె స్మార్ట్ స్టోరీ (2013) – అంతర్జాతీయంగా ప్రసిద్ధమైన తెలుగు ఈ-బుక్ పబ్లిషింగ్ హౌస్ కినిగె.కాం ప్రచురించబోయే ప్రత్యేక ఈ-బుక్‌లో ప్రచురితమై, ప్రపంచవ్యాప్తంగా పాఠకులకు అందుబాటులోకి వస్తుంది.

అంతే కాకుండా, విస్తృతమైన సర్క్యులేషన్ గల వివిధ వెబ్‌జైన్స్‌లోనూ, ఇతర మాగజైన్లలోనూ, ఇతర సోషల్ మీడియా సైట్లలోను ప్రచురితమయ్యే అవకాశం!

మీరు చేయదగినవి!

1. మీకు నచ్చిన ఇతివృత్తాన్ని ఎంచుకోవచ్చు

2. కావాలనుకుంటే కలం పేరు వాడవచ్చు (*కానీ, కినిగె అడిగినప్పుడు, మీ అసలు పేరు, గుర్తింపులను ఋజువులతో సహా చూపవలసి ఉంటుంది)

3. మీరు టెక్స్ట్ పాడ్, నోట్ పాడ్, లేదా ఎం. ఎస్. వర్డ్ డాక్యుమెంట్ లేదా తత్సమాన డాక్యుమెంట్ ఏదైనా ఉపయోగించవచ్చు. తెలుగు అక్షరాలను స్పష్టంగా చూపే ఏ అప్లికేషన్ని అయినా వాడేందుకు సంకోచించనవసరం లేదు.

4. మీ కినిగె స్మార్ట్ స్టోరీకి వన్నె తెచ్చే యోగ్యమైన బొమ్మలను జోడించండి (*కాపీరైట్‌ని గౌరవించడం మరచిపోవద్దు)

మీరు చేయాల్సినవి!

1. మీరు మీ రచనని కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) కోసమే రాయాలి

2. మీ కినిగె స్మార్ట్ స్టోరీని యూనికోడ్‌లో మాత్రమే* టైప్ చేయాలి

3. టైపింగ్ దోషాలు, అచ్చుతప్పులు, వ్యాకరణ దోషాలు ఉండకూడదు.

4. సబ్జెక్ట్ లైన్‍లో “కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) కోసం” అని రాయాలి. మీ స్మార్ట్ స్టోరీ (2013) పేరు ప్రస్తావించాలి.

5. మీ పూర్తి పేరు, పోస్టల్ అడ్రస్ (పిన్‌కోడ్‌తో సహా) పంపాలి.

6. మీ కథలను 20 సెప్టెంబర్ 2013లోగా కినిగెకి అందేలా పంపాలి

7. మీ రచనలను submit@kinige.com కి పంపాలి

8. మీ వయసు డిసెంబరు 2013 నాటికి 28 సంవత్సరాల లోపు ఉండాలి.

మీరు చేయకూడనివి!

1. గతంలో ప్రచురితమైన కథలు పంపకూడదు.

2. ఇతర పోటీలలోగాని లేదా ఇతర ప్రచురణకర్తలు లేదా ఇతర ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ప్రచురణల వద్ద పరిశీలనలో ఉన్న కథలను పంపకూడదు.

3. అనువాద కథలు పంపకూడదు.

4. ఒక వేళ మీ కథకు బహుమతి లభిస్తే, ఆ కథని మీరు ఏ బ్లాగులో గానీ, వెబ్‌జైన్‌లో గాని, ఇతర సోషల్ మీడియా సైట్లలో గాని లేదా ఇతర ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ప్రచురణలలో కనీసం ఒక ఏడాది వరకు ప్రచురించరాదు.

5. ఈ నిబంధనలలో దేనినైనా, అన్నింటినీ లేదా కొన్నింటిని మీ కథ ఉల్లంఘిస్తే, మీరు పోటీకి అనర్హులవుతారు.

6. వెరసి, మీరు కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటీషన్ (2013) కోసం సరికొత్త కథ, కినిగెకి మాత్రమే రాయల్సి ఉంటుంది.

మీకు సహాయపడే వనరులు:

మీ రచనలను యూనికోడ్‌లో టైప్ చేసేందుకు

1. lekhini.org

2. సురవర తెలుగు కీబోర్డు suravara.com

3. యూనికోడ్‌లో టైప్ చేసేందుకు మరింత సాయం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

గమనిక:

పోటీ ఫలితాల విషయంలో కినిగెదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఎటువంటి ఉత్తరప్రత్యుత్తరాలకు తావులేదు. ఫలితాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తే, పోటీకి అనర్హులవుతారు.

*ఒకవేళ మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే support@kinige.com కి ఈమెయిల్ చేయాలి

మీ రచనలు కినిగెకి పంపడానికి తుది గడువు 20 సెప్టెంబర్ 2013!

నామిని బహిరంగ ఉత్తరం !

చిత్తూరు జిల్లా ఎన్.ఆర్.ఐ సంఘానికి నామిని నమస్కరించి విన్నవించేది..

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, కార్పొరేట్   పాఠశాలల్లో కానీ చదువుకునే పిల్లల పరిస్థితి నిండా అధ్వాన్నంగా వుంది. మరీ ముఖ్యంగా మన రైతాంగం పిల్లల చదువు చాలా వికారంగా వుంటోంది. పదవ తరగతి చదివే పిల్లలు (a – b)3 సూత్రాన్ని కూడా చెప్పలేక తనకలాడి పోవడమే గాక 331ని 3తో భాగించలేక 11.33 అని, 3+2×4=20 అని వేస్తున్నారు.

తెలుగులో సినిమా పేర్లను కూడా రాయలేకపోతున్నారు. బీదా బిక్కీ పిల్లలు Poverty  అనే పదానికి కూడా అర్ధం చెప్పలేకపోతున్నారు.

నేను 2003 నుంచి 2006 దాకా 10 లక్షల మంది పిల్లల్ని కలిసి మంచీ చెడ్డా చెప్పడానికి ఒక రకమైన యుద్ధమే చేశాను. ఆ యుద్ధంలో అలిసిపోయి నా యింట్లో నేను కాళ్లు చాపేసి కాలం గడుపుకొస్తున్నాను.

ఎక్కడో వున్న అమెరికాలోని మీ సంఘంవారు గానీ, మరో సంఘం వారు గానీ నన్నొకమారు అమెరికాకు దయచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. నాకిది కుశాలే. అయితే, నేనున్న యింటి చుట్టుపక్కల వున్న స్కూళ్ల వాళ్లు కూడా నన్ను పిల్లల ముందుకు రానివ్వడం లేదు. ఇది మాత్రం నాకు దుఃఖం.

అందువల్ల్ల అయిదారేళ్లుగా నా యింట్లో నేను చెల్లని కాసునైపోయి విశ్రాంతి తీసుకుని తీసుకుని తీసుకుని ఒళ్లు పులిసిపోయే మాదిరిగా అలిసిపోయినాను.  ఈ అలసట తీరాలంటే, నాకు పనిచేస్తేనే అసలైన విశ్రాంతి దొరుకుతుంది.

మేధావులు మాత్రమే నా పచ్చనాకు సాక్షిగా, సినబ్బకతలు చదువుతారని భ్రమపడిన నాకు పిల్లలింకా యిష్టంగా చదువుతారని పిల్లల్లో పని చేసాక తెలిసింది. అట్లాగే నా ఇస్కూలు  పిలకాయ కత కానీ, పిల్లల భాషలో Algebra కానీ పిల్లలకు చాలా ఉపయోగకరం.

మీ బోటి వారు దయతలిస్తే.. నాకేదైనా పని కొంచం యిప్పించండి. నా అపుస్తకాలను (నాకు రాయల్టీ  ఏమీ కూడా ఇవ్వకుండా) తక్కువ ఖర్చుతో న్యూస్‌ప్రింట్ మీద ప్రచురిస్తే ,  ఆ పుస్తకాలను బీదబిక్కీ చదువుకునే స్కూళ్లకు వెళ్లి పని చేస్తాను. నాతోటి జర్నలిస్టులు ప్రస్తుతం 60,70 వేల దాకా జీతాలు తీస్తున్నారు. నాకు అందులో సగం నెల నెలా 30,40 వేలు ఇచ్చినా నేను రోజుకి 2 వేలమంది పిల్లల్ని కలిసి పని చేస్తాను.

ఆ పని ఎలా వుంటుందో మీరు కంటితో చూడాలనుకుంటే జిల్లాలో వున్న మీ సంఘ బాధ్యులెవరినైనా మీరు నాకు తెలియజేస్తే వారితోపాటు 2,3 పాఠశాలలకెళ్లి నా పని, పిల్లల స్పందన వీడియో తీసుకొని మీరు చూడవచ్చు. నా పని మంచిదని మీకు తోస్తే.. నాకు కొంత పని యిచ్చిన వారవుతారు. వరికోతలకు శ్రమ జీవి వెళ్ళడం ఎంత గౌరవప్రదమో.. పిల్లల్లో యింకా 4,5 సంవత్సరాలు యీ పని చేయగలిగితే నేను అంత గౌరవంగా భావిస్తాను.

ఈ పని కూడా నన్ను ఉద్ధరించడానికి అని గాకుండా సంఘ శ్రేయస్సు అనే వుద్ధేశంతోనే మీరు నాకు పనివ్వాలి. నేను చేయాలి. అప్పుడు మీ సంఘాన్ని  గానీ, నన్ను గానీ దేముడు కూడా మెచ్చుతాడు.

ఇంకొక్క మాట. చిత్తూరు జిల్లాలో మంచి కార్యవాదిని ‘కారివేది ‘ అనంటారు. కారివేదినెప్పుడూ విమానాల మీద అమెరికా రమ్మని గౌరవించకూడదు. పనివెంట పని చెప్పి ఎండల్లో వానల్లో తిప్పి తిప్పి పని చేయించాలి. అప్పుడు నేను వందసార్లు అమెరికాకు వచ్చినట్టు!

సందేశం అడిగారు గాబట్టి మీ సంఘానికైనా, ఇంకో అమెరికా సంఘానికైనా యిదే నా సందేశం.
(మీ సావనీర్‌లో ప్రచురించడానికి నా రెండు కథలను దయతో తీసుకున్నందుకు కృతజ్ఞతలు. ఆ కథలతోపాటే ఈ సందేశాన్ని కూడా వేయండి. )

నమస్కారాలతో…
నామిని