ఎండపొడ కు ఆహ్వానం

పాత్రికేయ రచయిత, ఫొటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు ఈ చలికాలంలో ఎండపోడతో మన ముందుకు వస్తున్నాడు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆర్థిక సహకారంతో సామాన్యశాస్త్రం గ్యాలరీలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాడు. దాదాపు 80 ఛాయా చిత్రాలతో నెలరోజుల పాటు వెచ్చటి స్పర్శను పంచబోతున్నాడు. వెలుగు నీడల మాధ్యమం అయిన ఫొటోగ్రఫితో ఈ సారి ఎండకు, నీరెండకు, ఎండపొడకూ తేడా ఉందని, వెలుతురంతా ఒకటే కాదనీ చెప్పబోతున్నాడు. ప్రవేశం ఉచితం. అందరికీ ఆహ్వానం.
వేదిక: సామాన్యశాస్త్రం గ్యాలరీ. అలంకార్ హోటల్ దగ్గర, ఒయు కాలనీ, మనికొండ రోడ్, హైదరాబాద్.
ప్రదర్శన ప్రారంభంః 9 సోమవారం 2017. సాయంత్రం. 6.10 నిమిషాలు.
ప్రారంభకులుః మామిడి హరికృష్ణ, డైరెక్టర్, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
ముఖ్య అతిథిః కట్టా శేఖర్ రెడ్డి. ఎడిటర్, నమస్తే తెలంగాణ.
ప్రదర్శన వేళలుః ప్రతి రోజూ సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.30 వరకు.
శని, ఆదివారాలు ఉదయం 1 1 నుంచి రాత్రి 9 దాకా.
మరిన్ని వివరాలకుః  99480 77893

మీ మాటలు

  1. Bestwishes..

  2. రమేష్ బాబు ఛాయా చిత్రాలు జీవిత ప్రతి బింబాలు.బెస్ట్ విషెస్ .

Leave a Reply to Padmapv Cancel reply

*