కన్ఫెషన్ హద్దు దాటి కెరటమైన అరుణ్ సాగరం!

arun (2)

రుణ్ సాగర్  చివరి కవితా సంకలనం మ్యూజిక్ డైస్ పుస్తకం అట్ట మీద సీతా రాములోరి బొమ్మ. ఆ రోజు ప్రెస్ క్లబ్ లో కలిసాడు అప్పుడే ప్రెస్ నుండి వచ్చిన కవర్ పేజీ. రావుడి  చేతిలో ధనస్సు వెనక అభయం కోసం సీత. ఎంతో మందిని అడిగి ఒక  ఫోటో తీయమన్నాడు. చానా మంది తీసారు, ఎవరు తీసినా సీత కళ్ళల్లో దాగిన భయం రావడం లేదు. ఆయనకు కావాల్సింది సీతకు కేవలం రావణుడు నుంచి రక్షణ కోసం కాదు. పోలవరం మూలంగా కోల్పోతున్న సర్వస్వం ఆమె కళ్ళల్లో చూసాడు. ఒక సామూహిక దుఖం ఆమె కళ్ళలో కనుగొన్నాడు. వందలాదిగా గొడ్డూ గోడా అదృశ్యం అవుతుంటే వాళ్ళందరి సామూహిక దుఖాలు  ఆమె కళ్ళలో వెతికాడు.కానీ ఆయన కోరుకున్నట్లుగా ఫోటో దొరకలేదు.

ఏదో ఓక్ వెబ్సైటు లో చివరికి  వెబ్సైటులో వంశీ కార్తీక్ అనే అతను తీసిన  ఫోటో తీసుకొన్నాడు . ఇప్పుడు ముంపు మూలంగా పోతున్న సీతారావుని  పర్ణశాల కోసం కాకుండా దాని చుట్టూ ఉన్న అవాసాల కోసం ఏడవాలి. అందుకే ఒరే  రావుడూ ఇలా రారా మట్టి మరణ వాగ్మూలం విను, దమ్మక్క పెడుతున్న శాపనార్ధాలు వినరా విను” అని సీతతో రావుడికి వేడుకోలు చెప్పించాడు . పర్ణశాల లో మిగిలిన సీతా రావణుల బొమ్మలు అవి కేవలం బొమ్మ లేనా వాటి చుట్టూ మిగిలిన ఎట్టి మనుషులు కోల్పోతున్న ఆనవాళ్ళు , విరిగిన కళలు.అలంకార ప్రాయంగా మిగిలిపోతున్న ఎద్దుకొమ్ములు, వెదురు బుట్టలూ,జనావాసాల్లో అలంకరణ కోసం మిగిలిన ఆదిమ కళల ఆనవాళ్ళు. ఎవరయినా పాపికొండల విహార యాత్రకు వస్తే “గుడ్డి నాయాల, చెవిటి నా కొడకా అవి నీళ్ళు కాదురా కన్నీళ్లు కోట్ల క్యూసెక్కుల కన్నీళ్లు” ధైర్యం ఉందా మనకి అరుణ్ లా ఆలోచించడానికి? ఆయన చేసే ప్రతి పనిలో ఇంకా ఏదో మిగిలిపోయిన బాధ్యత. ఒక కొనసాగింపు కోసం నిరీక్షణ. అవును అరుణ్ తన పుస్తకానికి కవర్ పేజీ అట్ట కోసం  ఎన్నెన్ని లోతయిన విషయాలు ఆలోచించాడు.

ఏడాది కింద మువ్వా సార్ వాళ్ళ అమ్మానాన్న సాహిత్య పురస్కారం కోసం ఖమ్మం లో మీటింగ్. రాష్ట్ర వ్యాప్తంగా కవులంతా ఖమ్మం లోనే . మువ్వా సర్ మీటింగ్ అయినా అది అరుణ్ సాగర్ మీటింగ్ లాగానే చేసాడు .ఒక తమ్ముడికోసం అన్న చేసిన మీటింగ్.  వేలాది మంది కూర్చొనే చోటు లేక బయట ఏర్పాటు చేసిన తెరల మీద అరుణ సాగర్ ప్రసంగం. గోరటిపాట  రాష్ట్రంలో పేరుమోసిన కవుల తోబాటు, అప్పుడే కళ్ళు తెరిచిన కవికుంకల దాకా అంతా అక్కడే అదో కోలాహలం. మీటింగ్ అయ్యాక ఖమ్మం శివారులో ఒక రిసార్ట్ లో పార్టీ. గడ్డ కట్టే చలి,ఆ రాత్రి క్యాంపు ఫైర్ వేసారు. రాజేసిన నెగడులో రవ్వలు ఎగజిమ్ముతున్నాయి. ఎవరి చేతిలో ఏముందో వెచ్చటి ద్రావకం ఒక్కొక్కరి  గొంతులో జారుతోంది. ఎగిసి పడుతున్న  మంటల ముందు ఏదో ఆలోచిస్తూ అరుణ్. ఒంటరి ఊపిరితిత్తు ఆయన లోపలి ఎగసే ప్రశ్నలు, తడబడుతున్న హృదయ కవాటాలు, మొరాయిస్తున్న శ్వాస. చీకటి మధ్యలో మంటలు, తెనాలి పద్య నాటక మిత్రుల హరిచంద్ర పాటలు గోరటి   తో జుగల్బందీ . అంతా అవధులు లేని ఆనందం లో అక్కడ కేవలం ఒక్క మనిషి లో విషాదం.అదే అరుణ్ ఆయన  ఆలోచనలు. తరిగి పోతున్న నిముషాలు. ఒక్క్కొక్కటి మాయం అవుతూ ఆయన ఆయుషు తినేస్తున్నట్లు కానీ నాకు తెలుసు ఆయన మందగించిన చూపు, తడబడుతున్న శ్వాస. కోల్పోతున్న ప్రతి నిముషంకు అర్ధవంతం అయిన ముగింపు ఇవ్వాలని తపన, దగ్గరి వాళ్ళతో ఆయన బ్రతికిన క్షణాలు అన్నీ బోనస్ గా దొరికినవి అని. ఆ మిగిలిన  క్షణాలు అమూల్యమైనవి అనీ.తాను మొదలుపెట్టిన ప్రయాణం అర్దాంతరంగా ఆగడం ఇష్టం లేదు. ఆయనకు తెలుసు కాలం ఆయనని తరుముతూ ఉందని.

ఒక సారి లోయపల్లి అని ఒక ఊరు పోయాం . ఆ ఊరిలో ఒక చిరు ఉద్యోగి ఆయన పనిచేసే చానెల్ లో అతనూ,  పూసలోల్లు అని ఒక సంచార కులం నుండి వచ్చిన అతని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. రాష్ట్రం మొత్తం ఆ కులం నుండి  పాత్రికేయ ప్రపంచంలో ఒకడే ఉన్నాడు.ఆ పేరు ఇప్పుడు పాత్రికేయ వృత్తిలో సుపరిచయం. ఇంటర్వ్యూ సమయం లో అతని గురించి తెలుసో లేదో కానీ పూసలు అమ్ముకొనే ఒక తల్లి తన కొడుకుని పాత్రికేయ ప్రపంచానికి అందించిది అది కేవలం అరుణ్ మాత్రమె చేయగలడు. అగొ వృత్తిలో ఇలాంటి మానవీయ విలువలు ఉంటాయా ?

మళ్ళీ ఏడాదికి ఖమ్మంలో క్రాంతి సర్ వాళ్ళ మీటింగ్ అదే సమూహం మీటింగ్ ప్రాంగణం అరుణ్ పేరుతో. వందలాదిగా తరలి వచ్చారు,ఒక్క నిముషం అరుణ్ కోసం నివాళి. మళ్ళీ చిమ్మ చీకట్లో రాజేసిన మంటలు అక్కడ కూడిన అందరిలో ఒక పేరు మిస్ అవడం.పోయిన సారి అందరం ఇక్కడే కలిసాం కదా. అంతా నిశబ్దంగా . అంతకు ముందు. వైజాగ్ జగతి-రామతీర్ధ పిలుపు. మువ్వా,ఖాదర్అన్నా,ప్రసాద మూర్తి,పవనన్న నేను హైదరాబాదు,భద్రాచలం,సుక్మా, కుంట,మీదుగా పాపికొండలు,పోలవరం,మారేడుమిల్లి,లంబసింగి, వైజాగ్ ప్రయాణం.ప్రతి మూలమలుపులో కోల్పోయిన క్షణాలు.ఆయన పుట్టిన పరిసరాలు, శబరి వంపులో తొలి యవ్వన జ్ఞాపకాలు.అరుణ్ కు లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం. ‘’నాగరిక’ సమాజానికి సుదూరంగా కాస్త ప్రేమను వెతుక్కొనే క్రమంలో తిరిగాడు. అరుణ్ కుటుంబం రాజకీయ విశ్వాసాలకోసం విస్తాపితులు అయ్యారు. పుట్టుక,చదువు,కొలువు,చివరి మజిలీ ఏ ఒక్కటీ స్థిరంగా లేని విస్తాపన ఆయనది. నాలుగడుగుల తన చిన్న కాబిన్ లో మానసిక ఉక్కపోతలో ఆయన రాసుకున్న వాక్యాలలో స్వాంతన పొందాడు.ఆ రాతల్లో  అంతరించి పోతున్న ఒక రేలపాట, ఆ పాట  మృత్యు సంగీతంగా మారుతున్న సమయం.  లక్షలాది ఆదివాసీల గుండె గొంతుకకు ఆయన వాక్యాలతో కాస్త దైర్య వచనం అయ్యాడు . మనలో ఎక్కడయినా  కడంచున కాస్తంత మనిషి తనం మిగిలి ఉంటె ఆ వాక్యాలు చదవి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. మాయం అయిపోతున్న మనిషి జ్ఞాపకాలు ఆయన వాక్యాలు. కుంట,చీదరి చంద్రయ్య,ఇరపా లక్ష్మి. అరుణ్ సాగర్ రచనల్లో కావ్యకన్యకలు అయ్యారు.జ్ఞాపకంగా మారిన చీదర చంద్రయ్య కోసం కీట్స్ తన మిత్రునికోసం రాసినట్లు.

khader

అరుణ్ చనిపోయి ఏడాది కూడా కాలేదు. అనుకున్నట్లుగా ఆయనపేర ఒక అవార్డు రూపకల్పన చేసిన మిత్రులు.  ఈ పుట్టిన రోజు ఆయన మిత్రుల సహకారంతో ప్రెస్ అకాడమి ఆయన పేర మూడు అవార్డులు,విశ్వం బాబాయ్ అరుణ్ సాగర్  సమగ్ర కవితా సంకలనంతో ఆయనకు నివాళి. మానవీయ విలువలతో పాత్రికేయ వ్రుత్తి లో ఉన్న వాళ్ళను వెతికారు అల్లం అన్న,రాజకుమార్ అన్న. మొదటి సారి ఖాదర్ అన్నకి ఇస్తున్నారని తెలిసింది.

ఒక మనిషి పుడతాడు పోతాడు. కానీ పోయే లోపు నిన్ను కన్ననేల చెర బడుతున్నప్పుడు కాస్తంత కన్ఫెషన్ అవసరం. కానీ అరుణ్ సాగర్ ఎకంగా కోల్పోతున్నరేల పాటకోసం మరణ వాగ్మూలం రాసుకుండు. ఒక మైదాన వాసి విస్తాపితుడిగా తాను పుట్టి పెరిగిన ప్రాదేశిక ప్రాంతాలు చరిత్ర గతిలో గతంగా మారబోతున్న సంక్షుభిత సమయం లో  ఎనభై అడుగుల లోతులో సమాధి కాబోతున్న మన ఆనవాళ్ళను  దూరంగా మన బిడ్డలకు  చూపించి “అగొ అక్కడే నీ తాతలు తండ్రులు ఒకప్పుడు ప్రాణం తో ఉన్న మనిషి జ్ఞాపకాలు  అని కడసారి మనకు చూపించి కనుమరుగు అయ్యాడు అరుణ్. లేదు నలుగురు కూడిన ప్రతిచోటా అరుణ్ ఉంటాడు.

*

 

 

 

మీ మాటలు

  1. కె.కె. రామయ్య says:

    ” లక్షలాది ఆదివాసీల గుండె గొంతుకకు తన వాక్యాలతో కాస్త దైర్య వచనం అయిన ”
    అరుణసాగర్ కి అరుణారుణ వొందనాలు.

  2. అనిల్ డ్యాని says:

    అన్నా ఇంకా ఎలాబ్రేటెడ్ గా రాయొచ్చేమో అనిపించింది… ఖమ్మం లో అరుణ్ అన్న మాటలు ఎవరూ మరిచి పోలేరు … కాని ఇలాంటి వ్యాసం లో కూడా పెద్ద కవులు , అప్పుడప్పుడే కళ్ళు తెరిచిన కవి కుంకలు అనే వాక్యం ఎంతవరకు సమంజసమో మరి నాకైతే తెలీలేదు

  3. dasaraju ramarao says:

    “పోయెట్రీ ఏ స్టైల్/ సైడ్ ఆఫ్ డిఫరెంట్” అన్నప్పుడల్లా అరుణసాగర్ గుర్తొస్తడు.

మీ మాటలు

*