“చందమామ ఇటు చూడరా”,

దేవదాసు చిత్రంలో ‘అంతా భ్రాంతియేనా?’ అనే గీతం తెలియని తెలుగువారుండరనడం అతిశయోక్తి కానే కాదు. టాలీవుడ్ చరిత్రలో కలకాలం నిలిచిపోయే ఈ పాట తరతరాల శ్రోతలని అలరిస్తోంది.

అలాగే “చందమామ ఇటు చూడరా”, “కొండమీద కొక్కిరాయి” తదితరగీతాలు కూడా చాలా ప్రాచుర్యం పొందిన తెలుగుపాటల్లో కొన్ని. ఈ పాటలకు తన గాత్రాన్ని అందించినవారు అలనాటి మేటి గాయని కె. రాణి గారు. ఈ పాటలే కాక శ్రీలంక దేశపు జాతీయగీతం ఆలపించిన ఖ్యాతి కూడా ఈమెకి దక్కింది.

పాటల ప్రపంచం నుండి సెలవు తీసుకున్న తర్వాత మీడియా జిలుగులకు దూరంగా ప్రశాంతజీవనం గడుపుతున్న రాణిగారు ఈ మధ్యనే విశాఖపట్నంలో ‘సీతారామయ్య ట్రస్ట్” ద్వారా తనకు జరిగిన సన్మానం ద్వారా మళ్ళీ వెలుగులోకి వచ్చారు. మిగిలిన తెలుగు గాయనీగాయకులందరిలాగానే ఈమె ప్రయాణం కూడా ఆసక్తికరంగా సాగింది.

అయితే సినీప్రపంచంలోని కొన్ని అంశాలు తన కుటుంబాన్ని ప్రభావితం చెయ్యకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆమె కుమార్తెలు కవిత, విజయ గార్ల మాటల్లోనే చెప్పాలంటే నిర్మాత అయిన వారి తండ్రి, ఉయ్యాలలోనే పాడడం మొదలుపెట్టిన తల్లి సినీపరిశ్రమనుండి వారిని దూరంగానే పెంచారు. తండ్రిగారు అమరులయ్యాక తమ స్వస్థలానికి వచ్చిన కుటుంబం చాలాకాలం సినిమాకి సంబంధించిన వ్యక్తులకు దూరంగా నిరాడబరంగా బ్రతికింది.

పరిశ్రమలో పేరుకన్నా తన పిల్లల భవిష్యత్తునే ముఖ్యంగా పరిగణించి, ఎన్నో ప్రయాసలకోర్చి, వారిని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దిన తల్లి రాణిగారు.

అటువంటి రాణిగారితో సంభాషించే అఱుదైన అవకాశం సారంగ-మాలిక వెబ్ పత్రికలకు దక్కింది. ఆ ప్రత్యేక ఇంటర్వ్యూ  వీడియో ప్రత్యేకంగా మీకోసం:

మీ మాటలు

*