ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
“ఆయన మరణంపై సంతాపం తెలుపని ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి విజ్ఞతను మేము ప్రశ్నిస్తున్నాము.”
అయన నుంచి ఇలాంటివి ఆశించడం వృధా. మన ముఖ్యమంత్రి కూడా మతోన్మాద సర్కారులో భాగమే కదా. తారకం గారి గురించే కాకుండా గుజరాతులో ఔచర్మాల విషయంలో దళితులపై జరిగిన దాడిని కూడా మన సి ఎం ఖండించలేదు. యు పీ లో అఖ్లాక్ హత్యను కూడా అయన నిరసించలేదు. తీ డీ పీ కూడా బీ జీ పీ తానులో ముక్కే.
” నిశబ్దం రాజ్యమేలుతుంటే చూస్తు ఊరుకోవద్దు … మేధావి మౌనం ఈ సమాజానికి చాలా ప్రమాదం… ” అన్న పౌర హక్కుల నేత, విరసం సభ్యుడు, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత ( పదిరికుప్పం, కారంచేడు, చుండూరు, లక్ష్మింపేట దళితుల ఊచకోత ఘటనలలో, నక్సలైట్ల బూటకపు ఎన్ కౌంటర్ లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన ) హక్కుల ఉద్యమాలకు కేంద్రబిందువు గా మార్క్సిజం, అంబేద్కరిజాన్ని మేళవించి ఉద్యమించిన అరుదైన నాయకుడు ….
బొజ్జా తారకం గారి మరణంపై సంతాపం తెలుపని ఆంధ్ర ప్రదేష్ ముఖ్యమంత్రి విజ్ఞతను మేము ప్రశ్నిస్తున్నాము.
( ఎమర్జెన్సీలో బొజ్జా తారకం గారు రాసిన ” పోలీసులు అరెస్టు చేస్తే ” పుస్తకం ప్రజల చేతుల్లోకి వెళ్లకుండా పోలీసులు 40 వేల కాపీలను తగలబెట్టారు. )
పేదల పెన్నిధి –చుక్కాని –నాయకుడు
Burugu కూలిపోయింది –Srinvas గారి మాటలు నిజం
పౌర హక్కుల కోసం పోరాడిన కే.జి కన్నబిరామం గారిని –బాలగోపాల్. గారిని
మరిచి పోకూడదు
70 ఏళ్ళ స్వతంత్రం –యిప్పటికి. దొరల. పాలన లే
మారింది ఎక్కడ — ఏమిటి
విప్లవం రావాలి
మల్లి. కన్నాబి గారు –గోపాల్ గారు — తారక్. గారు పుట్టాలి
ఆశ తో
—————————
Buchi రెడ్డి. Gangula
తమపై అత్యాచారాలు చేసే వారిపాయి ప్రతీకారం తిరుచుకోవాలీ
అది ఆచరణలో పెట్టితే నే
తారకం నిజమైన నివాళి
i
బొజ్జ తారకం గారి మృతి దళితులకు,మైనారిటీలకు, బీసీఏలకు తీరని లోటు. కేంద్రంలో ,రాష్ట్రంలో మతోన్మాద ప్రభుత్వాలు గద్దెనెక్కిన తరుణంలో దళితులు,మైనార్టీలు సంక్షోభంలో వున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో తారకం గారు కన్నుమూయడం చాలా బాధాకరం. ఈ వర్గాలు ఐక్యమై పోరాటాలతో హక్కుల సాధనకోసం నిలవడం ఒక్కటే తారకం గారికి నివాళి అవుద్ది,
” బొజ్జ తారకం మృతికి విరసం నేత వరవరరావు, ప్రజా గాయకుడు గద్దర్, రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు జీవన్కుమార్, నటుడు ఆర్ నారాయణమూర్తి, గాయకుడు గోరటి వెంకన్న, మల్లు స్వరాజ్యం, ప్రొఫెసర్లు కంచె ఐలయ్య, చుక్కా రామయ్య, వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్, సహా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పలు ప్రజాసంఘాల నాయకులు తదితరులు నివాళులర్పించారు “.