రంగుల్ని కోల్పోయిన దిగులు!

vazda

వాజ్దా ఖాన్  సిధ్ధార్థ నగర్, వుత్తర్ ప్రదేశ్ లో జన్మించిన యీ ప్రసిధ్ధ చిత్రకారిణీ వో మంచి కవయిత్రి కూడా. బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి చిత్రకళలో యెం.యె.,డి.ఫిల్. పట్టాను పొందారు.యీమె ‘జిస్ తరహ్ ఘుల్తీ హై కాయా’ (దేహం కరుగుతున్నట్టు) అనే కావ్య సంకలనాన్ని భారతీయ జ్ఞానపీఠ్ వారు ప్రచురించారు. హేమంత్ స్మృతి సమ్మాన్ పురస్కారాన్ని పొందారు.  చిత్రకళాకారిణిగా అనేక యేక, సామూహిక చిత్రకళా ప్రదర్శనల్లో పాల్గొన్నారు. యీమె కవితలు భారతీయ భాషల్లో అనువదింపబడ్డాయి.

వాజ్దా ఖాన్ కవితల్లో రంగులను శిల్పించే శిల్పి సంవేదన వుంది.యింకా ప్రపంచపు రాగతత్వంతో పాటు వర్ణహీన జీవితపు స్థితుల్లోని సుఖ దుఖాలను వేరుగా చూడడం కష్టంగానే వుంటుంది. యీమె కవితల్లోని చైతన్యపు కరుణామయ పిలుపు అస్థిత్వపు దార్శినికత వైపు తీసుకెళుతుంది. భాషా శిల్పాల జుగల్బందిలో వాజ్దా ఖాన్ కవితల్లోని అంతరంగిక లయ కారణంగా పాఠకుణ్ణి ప్రత్యేకంగా పలకరిస్తుంటాయి.

మట్టి, గాలి, నేనూ
————————

స్వప్నాలూ
మీకు యేం అవసరం వుందని
శతాబ్దాల తరబడి నా చుట్టే తిరుగున్నారు
నా సారాన్ని రహదారుపై వెతుకుతుంటే
మీరు నన్ను వెంటనే నన్ను కప్పేస్తుంటారు

మీరిలా అంటుండే వారు కదూ –
నాలో  సూక్ష్మ రూపంలో వున్నావని
నా ప్రతి చింతనలో
నా ప్రతి శ్వాసలో
వాటిని దించుకునే దానిని నేను
మనసు రెప్పల పై నుంచి
ఆకాశపు రెప్పలపైకి
నా వుత్తమ విధానాన్ని రచించేందుకు
నీలో వెతుకున్నాను
నా సారం – భూమి, ఆకాశం,సముద్రం
మట్టి,గాలి,నేను
అన్నీ నీలో విలీనం అయ్యాయి
రెప్పల తడి శివమౌతోంది
యీ ఆలోచనను కూడా నీవే నిర్మించావు
సాధనా శివంగా మారే దిశ నిర్మింపబడింది
కల్పన రూపాన్ని గ్రహించడం ఆరంభమైంది
యుగపు శాశ్వత సత్యం నీవు
నీ దేహం నుంచి తన అమూర్తత వరకు…

*

మీ మాటలు

*