తెలిసిన కథే నవల అయితే…!

 

-మణి వడ్లమాని

~

 

“అబ్బా! భారతం విప్పకు ,లేదా చేట భారతం చెప్పకు. తొందరగా అసలు సంగతి చెప్పు”  లాంటి  మాటలు మనం  సాధారణంగా వింటూ ఉంటాము. అంటే ఒక విషయం గురించి చెబుతూ మరో దానిలోకి వెళ్ళిపోవడం,లేదా దానికి అనుబంధమైన విషయం మాట్లాడటం వల్ల  మూల విషయం లోకి వెళ్ళడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి.

కానీ అదే సరాసరి మూల విషయం లో నేరుగా  వెళితే? అవును, అదే వ్యాసమహర్షి రాసిన కావ్యం ‘జయేతిహాసమ్’  24 వేల శ్లోకాల భారతం, లక్షశ్లోకాలకు మించి మహాభారతం అయింది.

మూల కధ జయమ్ ని ఉపాఖ్యానానలు లేకుండా రచయత నాయుని కృష్ణమూర్తి   నవలా రూపంగా వ్యావహారికంగా,ఆధునిక దృక్పథం తో  రాసారు .

జయమ్ ఒక ఇతిహాసం. ఇది నిజంగా జరిగింది అని చరిత్ర కారులు విశ్వసించారు. ఆ నాడు  వ్యాసుడు జీవించిన కాలం లోని వారె పాండవులు,కౌరవులు  వారి మధ్య జరిగిన ఘర్షణ ఒక మహా యుద్ధానికి దారి తీసింది. తన కళ్ళముందే తన వాళ్ళందరూ సర్వ నాశనమవడం తో వ్యాసుడు క్షోబతో  ఆ పరిస్థితి రావడానికి గల కారణాలను వివరిస్తూ  జయమ్ అనే కావ్య  రచన చేసాడు.

రచయత  మాటలలో:

అయితే ఈ కావ్యం ఎక్కడా విడిగా లేదని  వ్యాసుని తరువాత ఈ కావ్యాన్ని జనమేజయుడికి  వైశంపాయనుడు కొన్ని వివరణలు,పూర్వకధలు చరిత్రలు చేర్చి భారతంగా మార్చాడని లక్ష శ్లోకాలకు పైగా ఉన్న మహా భారతం లో నే ఈ  8800 శ్లోకాలతో ఉన్న  జయమ్ ను వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని వేల సంవత్సరాలనుంచి పౌరాణికులు భారతాన్ని పెంచి చెబుతున్నారు కాని అసలు మూలకధ  ఏమయి ఉంటుంది అన్న  ఆలోచన చేయలేదు.

1883- 1894  లో ఒక స్కాండేవియన్ సాహిత్య వేత్త సోరెన్-సోరన్ సన్ మహా భారతం నుండి మూల కధను వేరు చేసే ప్రయత్నం మొదలు పెట్టాడు. లక్ష శ్లోకాలనుండి 27 వేల శ్లోకాలు వేరు చేసి  ఆ క్రమం లో దాన్ని 7-8  వేలకు తగ్గించే సమయం లో ఆయన మరణించాడు.  ఆ తరువాత 80 ఏళ్ళకి గుజరాత్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అహమ్మదాబాదు బ్రాంచి  గౌరవ డైరెక్టర్  ప్రొఫెసర్ కే కే .శాస్త్రి ఒంటరిగానే మహాభారతం నుండి విజయవంతంగా 8801 సంస్కృత శ్లోకాలతో  ‘ జయమ్’ ని వేరు చేసారు. తరువాత గుజరాత్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు  దాన్ని ‘జయసంహిత’ గ ప్రచురించారు.

జయమ్ ను యధాతధంగా కాకుండా నవలా రూపంలో రాయాలని అనుకున్న ఉద్దేశ్యం ఇలా జరిగి ఉంటుందని ఊహించి రాసే అవకాశం కొంత స్వేచ్ఛ లబిస్తాయని.

ఇక నవల లోకి వెళితే:

తింటే గారెలే తినాలి,వెంటే  మహాభారతమే వినాలి. ఒక వేళ ఇది కల్పన అయితే మహా గొప్ప గ్రంధం, నిజం అనుకుంటే భలే అద్భుతం. మనం కూడా టైం మెషిన్ లో ఆ కాలానికి  వెళ్లి ఆ పాత్రలను చూసి కలిస్తే! అప్పుడు  అది మహాద్భుతం.

jayam

ఇక కధ మొదలు  కురుదేశపు వర్ణన తో  మొదలవుతుంది. శంతనుడికి సత్యవతికిపుట్టిన కొడుకులు చిత్రాంగదుడు,విచిత్రవీర్యుడు. వీరిద్దరూ సంతానహీనులుగా మరణించటం వల్ల వంశం  అంతరించి పోయే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు సత్యవతి తనకి పెళ్లి కాకుండా పుట్టిన కొడుకు కృష్ణద్వైపాయనుడుని పిలిచి దేవర న్యాయం ప్రకారం  తన  కోడళ్ళ కి సంతానం కలిగేలా చేసింది  ఈ కృష్ణద్వైపాయనుడే వ్యాస మహర్షి గ ప్రసిద్ధి కెక్కాడు.

వ్యాసుడు చూస్తూ ఉండగానే అందరూ పెరిగి పెద్దవారు అయ్యారు. అన్నదమ్ముల మధ్య  రాజ్యం కోసం ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేసే పరిస్థితి కి  ఏర్పడుతుంది.అందువల్ల వంశం నాశనం అవుతుందని వ్యాసునికి తెలిసినా  ఎవరూ అతని మాట వినలేదు. తన మూలంగా ఏర్పడిన కురువంశం తన కళ్ళముందే సర్వ నాశనం అవడం వ్యాసునికి క్షోభ కలిగించింది.

దాయాదుల మధ్య వైరం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ  ఏ విధంగా వినాశనానికి దారితీసిందో ఆ  చరిత్రనే  కావ్య రూపంగా తేవాలన్న ఆలోచన వచ్చింది.

మహాభారత యుద్ధం ప్రకటించబడిన మూడేళ్లు కాలం లో  దీక్షతో ఈ కావ్యాన్ని రచించాడు.

“రెండుకుటుంబాల మద్య జరిగిన ఇతివృత్తం. పాండురాజు మరణం తరువాత అడవుల్లోనుండికుంతీదేవి పాండవులను వెంట బెట్టుకొని హస్తినకు రావడం తో మొదలయ్యి కౌరవ పాండవుల మధ్య జరిగిన మహా భారత  యుద్ధం చివరి రోజు రాత్రి  అశ్వద్ధామ నిద్రపోతున్న ఉపపాండవులని చంపడం తో కధ పూర్తవుతుంది.”

ముగింపు :

గంగా నది లో తర్పణాలు వదిలి శోకం తో కుమిలిపోతున్న ధర్మరాజు తో అక్కడే ఉన్న ధృతరాష్ట్రుడు అంటాడు “ నువ్వు ఇప్పుడు ఎందుకు దుఃఖిస్తున్నావు.అర్ధం లేకుండా  వందమంది .కొడుకులని, మనవలన్ని పోగొట్టుకున్న నేను గాంధారి ఏడవాలి ‘అంటాడు. పక్కనే ఉన్న శ్రీకృష్ణుడు  ధర్మరాజుకి చేయి అందిస్తూ “పోయిన వాళ్ళను నువ్వు ఎలాగూ చూడలేవు.జరగాల్సినది జరిగింది. అంతా విధి నిర్ణయం. తెలివిలేనివాడిలా ఏడవకు” అంటాడు.

ధర్మరాజు హస్తినలోకి అడుగు పెట్టగానే వృద్ధులు,స్త్రీలు,పిల్లలు చావగా మిగిలిన సేనలు జయమ్, జయమ్ అని అంటారు.

అది విన్న ధర్మరాజు  పెదవులు కూడా  ఆ పదానికి అర్ధం వెతుకుతున్నట్లు  జ…య…మ్ అని గొణిగాయి.

ఇక్కడ తో నవల ముగుస్తుంది

తెలిసిన కధనే నవలా రూపంగా చదవటం  కొత్తదనంగా  బావుంది. సరళమయిన బాషతో చదువుతున్నంత సేపు చాల  ఆసక్తి కరంగా ఉంది.

కొన్ని గుర్తుంచు కో దగ్గ  వాక్యాలు:

  • ఎవరు యెంత చేర్చినా కొన్నివేల సంవత్సరాల బాటు భారతం నిలబడింది అంటే అది ఆ కధ గొప్పదనం. మూల కధలో కృష్ణుడు ఒక రాజనీతిజ్ఞుడు.
  • నాగరికత ఒక స్రవంతి.పుట్టినప్పుడు చిన్న చెలమ. కాలం గడిచిన కొద్దీఎన్నో జ్ఞాన,అ జ్ఞానప్రవాహాలు ఏకమై చెలమలో చేరి ఉంటాయి. చెలమ ఏరుగా సాగి నదిగా మారి తన వేగాన్ని విస్తృతిని పెంచుకొని ఉంటుంది.
  • ఉరుములు మెరుపులు,వర్షాలు,వరదలు,ఎండలు సుడిగాలులు,పెనుతుఫానులు మానవుణ్ణి అయోమయ స్థితి లో పడ వేశాయి. పైన ఆకాశం లో మహోన్నతమైన వ్యక్తులు ఉన్నారని నమ్మారు.
  • భయం భగవంతుడిని పుట్టించింది
  • ప్రాణికోటికి మేలు జరగడానికి చెప్పబడిన అసత్యం సత్యం కంటే గొప్పది. కీడు కలిగించే సత్యం అసత్యం తో సమానం.
  • భారతం లో ఉన్నది ఇంకెక్కడయినా ఉంటుంది. భారతం లో లేనిది ఎక్కడా ఉండదు

***

మీ మాటలు

  1. Jayashree Naidu says:

    మణి గారూ

    మీ సమీక్షా పంక్తులు చక చకా కళ్ళు అక్షరాలా వెంట పరుగు తీసిన అలసటని కూడా తెలియనివ్వవు. క్లుప్తంగా సమీక్షించడం లో మీరు నేర్పరి సుమండీ… గతం నుంచీ వర్తమానం లోకి జ…య…మ్… ప్రయాణం బాగుంది.

Leave a Reply to Jayashree Naidu Cancel reply

*