తెలంగాణ చరిత్ర, సాహిత్యం, సంస్కృతిపై లోతైన పరిశోధన జరిగి మరుగున పడ్డ, వివక్షకు, విస్మరణకు, వక్రీకరణకు గురైన అసలు సిసలైన తెలంగాణ చరిత్రను సాక్ష్యాలు, ఆధారాలతో సహా రికార్డు చేయాలనే ఉద్దేశ్యంతో ‘తెలంగాణ చరిత్ర పరిశోధన కేంద్రం’ హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్తు కేంద్రంలో ఏప్రిల్ 10వ తేదీనాడు ఏర్పాటయింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత నాణేల విశ్లేషకులు, సేకర్త, పరిష్కర్త దేమె రాజారెడ్డి ఈ సంస్థకు గౌరవాధ్యక్షులుగా ఉంటారు. అలాగే సహాదారులుగా బి.నరసింగరావు, అనురాధారెడ్డి, అయూబ్ అలీ, కొల్లూరి చిరంజీవి, వి. ప్రకాశ్ లు వ్యవహరిస్తారు. అలాగే ఉపాధ్యక్షులుగా ముదిగంటి సుజాతారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్లు, సహాయ కార్యదర్శుగా సంగనభట్ల నరసయ్య, జగన్ రెడ్డిలు, కార్యనిర్వాహక కార్యదర్శిగా కటికనేని విమల, కోశాధికారిగా ద్యావనపల్లి సత్యనారాయణ వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష కార్యదర్శులుగా అడపా సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి ఎన్నికయ్యారు.
అడపా సత్యనారాయణ గారి ఇంటర్వ్యూ ….
సారంగ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలోనే తెంగాణ హిస్టరీ కాంగ్రెస్, తెంగాణ హిస్టరీ సొసైటీ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయి కదా! మళ్ళీ ఈ సంస్థ పుట్టవలసిన అవసరం ఏంటి?
అడపా: ఈ సంస్థలు పుట్టి కొంత పని చేసినా ఇప్పుడు అవి అంత చురుకుగా పని చేయటం లేదు. పైగా తెలంగాణ చరిత్ర సమగ్రంగా నిర్మాణం కావలసి ఉంది. కాబట్టి చరిత్రకారులతో పాటు సాహితీవేత్తలు, కళా రంగాల్లో నిపుణులు తదితర మేధావులు కూడా తెలంగాణ చరిత్ర నిర్మాణంలో పాలు పంచుకోవాలని వారందరి భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేశాము.
సారంగ: సంస్థ ప్రధానంగా ఏయే కార్యకలాపాలు నిర్వహించబోతున్నది? దాని లక్ష్యాలను కొంచెం వివరంగా చెప్పండి.
అడపా: మా సంస్థ ప్రధాన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సమగ్ర చరిత్రను అనేక కోణాల్లో పరిశోదించి ప్రామాణిక ఆధారాలతో పు సంపుటాలుగా ప్రచురించడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1959లో తెలుగు భాషా సమితి ఏర్పాటై తెలుగు వారి చరిత్రను ఒక సమగ్ర సంపుటంగా తెచ్చిందో అలాగే ఇంకా అంతకన్నా మెరుగ్గా తెలంగాణ చరిత్రను రచించి జన సామాన్యానికి అందుబాటులోకి తేవాలని కృషి చేస్తున్నాము.
సంస్థ ఇతర లక్ష్యాల విషయానికి వస్తే… క్లుప్తంగా చెప్పాలంటే… పరిశోధన, డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్, రచన, ప్రచురణ, త్రైమాసిక పత్రికా నిర్వాహణ, వార్షిక సమావేశాలు,, సదస్సు ఏర్పాటు చేయడం, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో సంప్రదింపులు, చారిత్రక సంపద పరిరక్షణ, అభివృద్ధి వంటి బృహత్తర లక్ష్యాలు మా సంస్థకున్నాయి.
సారంగ: తెంగాణ సమగ్ర చరిత్ర నిర్మాణ, ప్రచురణకు కొంత సమయం పట్టవచ్చు, త్రైమాసిక పత్రిక మాత్రం రెగ్యుర్గా వస్తుంది కదా! దాని బాధ్యతలు ఎవరికి అప్పగించారు?
అడపా: త్రైమాసిక పత్రికకు సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకులుగా వ్యవహరిస్తారు. సంపాదక మండలిలో ద్యావనపల్లి సత్యనారాయణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సంగనభట్ల నరసయ్య, జయధీర్ తిరుమరావు వంటి నిష్ణాతులున్నారు.
సారంగ: త్రైమాసిక పత్రిక ప్రత్యేకతలేమైనా ఉన్నాయా?
అడనా: ఉన్నాయి. గతంలో తెలుగు దేశంలో వచ్చిన భారతి అనే మాస పత్రిక విశిష్టత గురించి పరిశోధకులందరికీ తెలిసిందే! అదిప్పుడు రావడం లేదు. మా త్రైమాసిక పత్రికలో వివిధ ప్రాంతాలో వెలుగులోకి వచ్చిన, వస్తున్న ప్రాథమిక చారిత్రక అంశాలపై లోతైన ప్రామాణిక వ్యాసాలు, విశ్లేషణలు ఉంటాయి. తెలుగు, ఆంగ్ల భాషాల్లో రాసిన వ్యాసాలను విషయ నిపుణులు సరి చూశాకే ప్రచురిస్తాం. దీనితో పాటు పత్రికకు ఐఎస్ఎస్ఎన్ నంబరు తెప్పిస్తాం. కాబట్టి పత్రికలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలుంటాయి.
సారంగ: వార్షిక సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వాటి గురించి కొంచెం వివరిస్తారా?
అడపా: మన దేశంలో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో ఎపి హిస్టరీ కాంగ్రెస్ లాగా మా సంస్థ కూడా తెలంగాణలో ఉన్న చరిత్ర అధ్యాపకులు, ఉపన్యాసకులు, విద్యార్థులు, విషయ నిపుణులు, ఔత్సాహికులు తదితరులందరిని ఆహ్వానించి సంవత్సరానికి ఒకసారి ఒక్కో చోట వారి పరిశోధన పత్రాల సమర్పణతో వార్షిక సమావేశాలు నిర్వహిస్తుంది. ఎంపికైన పత్రాలను ప్రచురిస్తుంది.
సారంగ: ప్రభుత్వంతో మీ సంస్థ వైఖరి ఎలా ఉంటుంది?
అడపా: ప్రభుత్వంతో మా సంస్థ వైఖరి సామరస్యంగా, సమన్వయంగా, సహకారిగా ఉంటుంది. అనేక కారణా వల్ల రాష్ట్ర పురావస్తు శాఖలో విషయ నిపుణుల కొరత ఉంది. అందువల్ల అనేక చారిత్రక స్థలాల్లో తవ్వకాలు చేపట్టలేక పోతున్నారు. వందలాది శాసనాలను చదివించి ప్రచురించలేక పోతున్నారు. మా సంస్థ కొంత మంది విద్యార్థులను ముంబయి, నాసిక్, పూనా వంటి నగరాలకు శాసనాలు, నాణాలు, పురావస్తు శాస్త్రం వంటి సబ్జెక్టుల అధ్యయనానికి పంపించి సంపాదించిన విషయ పరిజ్ఞానంతో పురావస్తు శాఖ సమన్వయంతో అనేక చారిత్రక విషయాలను వెలువరించేందుకు కృషి చేస్తుంది.
సారంగ: మీ సంస్థ ద్వారా తెలంగాణ సమాజానికి ఒనగూరే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా?
అడపా: తప్పకుండా ఉంటాయి. మేము తెలంగాణ గత చరిత్ర వైభవాన్ని వెలికి తీస్తాము. తెలంగాణ ప్రజల్లో తమ ఘన వారసత్వం పట్ల గౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తాము. మా సంస్థ ప్రచురించే, వెలుగులోకి తెచ్చే తెలంగాణ సాంస్కృతిక, కళలు, తెలంగాణ ప్రజలకు గర్వకారణమవుతాయి. మా సంస్థ గుర్తించే పెద్ద పెద్ద చారిత్రక స్థలాలు సమీప భవిష్యత్తులో పర్యాటక స్థలాలై అలరిస్తాయి.
చరిత్ర రచనకు సామూహిక స్వరం: సుంకిరెడ్డి
తెలంగాణాలోని చరిత్రకారులు , పరిశోధకులు ఇటీవల హైదరాబాద్ లోని ఆంధ్రసారస్వత పరిషత్తులో సమావేశమై ‘తెలంగాణా చరిత్ర పరిశోధక కేంద్రం’ (తెలంగాణ హిస్టారికల్ రీసెర్చ్ సెంటర్) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డ డా॥ సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారితో ఏశాల శ్రీనివాస్ ఇంటర్యూ…..
ప్రశ్న: తెంగాణ చరిత్ర పరిశోదక కేంద్రం ఏర్పాటు గురించి చెబుతారా?
బవాబు: నిజానికి ఈ సంస్థ ఎప్పుడో ఏర్పడాల్సి ఉండింది. మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన వెంటనే సాహిత్య సాంస్కృతిక రంగాలో ఉద్యమోన్ముఖమైన కదలికలు ప్రారంభమైనవి. అట్లా 1998 నవంబర్ 1న ‘‘తెలంగాణా సాంస్కృతిక వేదిక’’ ఆరంభమైంది. మన చరిత్రను మనమే రాసుకోవాలని తీర్మానం చేసింది. ‘తెలంగాణా తోవలు’, ‘మత్తడి’ పుస్తకాలను వెలువరించడం ద్వారా తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్రను నిర్మించే పని కొంత చేసింది.
కొంత ఆలస్యమైనా 2006లో ‘‘తెలంగాణా హిస్టరీ సొసైటీ’’ ఏర్పడింది ‘1857 తిరుగుబాటు’, ‘17 సెప్టంబర్`భిన్న దృక్కోణాలు’, ‘ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు విద్రోహ చర్య’, ‘1969 ఉద్యమ కరపత్రాలు’, ‘1969 చారిత్రక పత్రాలు’ లాంటి గొప్ప పుస్తకాల్ని మెవరించిన ఆ సంస్థ ఎందువల్లనో ఆగిపోయింది. ఆ తరువాత ‘‘తెలంగాణా హిస్టరీ కాంగ్రెస్’ ఏర్పడింది . రెండు సమావేశాలు నిర్వహించి అదికూడా ఆగిపోయింది. అందువల్ల ఈ సంస్థను ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది.
ఈలోగా సంస్థాగతంగా కాకుండా వ్యక్తిగతంగా సంగిశెట్టి శ్రీనివాస్, కె.శ్రీనివాస్, ముదిగంటి సుజాతారెడ్డిలాంటి వాళ్ళు తెంగాణా ఆధునిక సాహిత్య చరిత్రను నిర్మించే విడివిడి ప్రయత్నాలు చేసినారు. అందులో భాగంగా తెలుగు కథ గురజాడతో కాకుండా భండారు అచ్చమాంబతో మొదలైందని తేల్చినారు. అయినా ఇంకా గురజాడతోనే అని ఆంధ్ర చరిత్రకారులు రాస్తున్నారు.
2005లో ప్రొ. అడప సత్యనారాయణ సంపాదకత్వంలో ‘ History and culture of telangana’, డా.రాజారెడ్డి గారి ‘‘చరిత్ర ఖజానా’’ నేను రాసిన ‘‘ముంగిలి`తెంగాణ సాహిత్య చరిత్ర’’ `2009, ‘‘తెలంగాణా చరిత్ర’’`2011 మొదలైన పుస్తకాలు తెలంగాణా కేంద్ర దృక్కోణంతో వచ్చినవి. ఇంకా సంగనభట్ల నరసయ్య, ద్యావనవల్లి సత్యనారాయణ మొదలైన వారు ఈ దృక్కోణంతోనే పరిశోధన చేసినారు. అయినప్పటికీ ఇంకా ఆంధ్ర చరిత్రకారులు కోస్తాంధ్ర కేంద్రంగానే సాహిత్య చరిత్రను, తెలంగాణ చరిత్రను రాస్తున్నారు.
అంటే తెలంగాణా అస్తిత్వవాదాన్ని స్థిరీకరించడానికి చేసే వ్యక్తిగత ప్రయత్నాలు వారికి ఆనడంలేదని అర్థమవుతున్నది. అందువల్ల ఒక సామూహిక స్వరం అవసరం అనిపించిది. అందుకే ఈ సంస్థ ఆవిర్భవించింది.
తెలంగాణ మలిదశ ఉద్యమం అస్తిత్వ వేదనతో నడుస్తున్నప్పుడే ఆ ఉద్యమ స్పిరిట్ను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా A P History congress ‘‘ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర చరిత్ర`సంస్కృతి’’ పేరుతో కొన్ని సంపుటాల్ని వెలువరించింది. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కూడా కొన్ని సంపుటాల్ని వెలువరించింది. వి.వి.కృష్ణ శాస్త్రి, పి.వి.బరబ్రహ్మ శాస్త్రిలాంటి వాళ్ళు తెలంగాణా చరిత్రకు సంబంధించిన కొత్త విషయాను ఆవిష్కరించినప్పటికీ ఈ సంపుటాలు కోస్తాంధ్ర కేంద్రంగానే వెలువడినవి. సహజంగానే అవి తెలంగాణ కేంద్రంగా వెలువడలేదు. శాతవాహన పూర్వ తెంగాణ చరిత్ర విషయంలో అలసత్వాన్ని ప్రదర్శించినారు.
ప్రశ్న: ఈ సంస్థ తరపున ఎలాంటి కార్యకలాపాలు చేపట్టనున్నారు?
జవాబు: ముందుగా ఒక త్రైమాసిక పత్రికని తేవాలనుకున్నాం. ఈ పత్రికను తెలంగాణ చరిత్ర, సాహిత్య చరిత్ర, పరిశోధనాంశాలకు వేదికగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. పరిశోధక బృందంతో తెలంగాణా సమగ్ర చరిత్రను సంపుటాలుగా రాయించి అచ్చువేయానుకుంటున్నాం.
ప్రశ్న: ఇతర రాష్ట్రాలో వున్న అరుదైన సమాచారాన్ని ఏ విధంగా సేకరిస్తారు?
జవాబు: మద్రాసు, తంజావూరు, తిరుపతి, డిల్లీ, కొల్కతాలో వున్న తెలంగాణకు సంబంధించిన తాళపత్రాను, రాతప్రతులను, పుస్తకాలను యదాతథంగా కాని, నకలు రూపంలో గాని లేదా డిజిటలైజ్ రూపంలో కాని తెప్పించాలి. ఈ పని మన రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వం ద్వారానే తెప్పించాలె.
ప్రశ్న: పురావస్తు సంపదను రక్షించడం`చరిత్ర పునర్నిర్మాణంలో భాగంగా ఏవిధమైన కార్యాచరణ వుంటుంది?
జవాబు: తెలంగాణాలో అనంతమైన పురావస్తు సంపద వుంది. సీమాంధ్ర ప్రభుత్వ వివక్ష వలన పురావస్తు తవ్వకాలు పదిశాతం కూడా జరుగలేదు. ఒక్క కోటి లింగాల ఉదాహరణ తీసుకొంటే ప్రముఖ నాణాల అధ్యయన వేత్త డా.రాజారెడ్డిగారి అభిప్రాయం ప్రకారం అక్కడ పదిశాతం కూడా తవ్వకాలు జరగలేదు. తవ్వకాలు సాగినట్లయితే ఏంతో చరిత్ర బయటపడే అవకాశం వుంది.
ప్రశ్న: ఇప్పటి వరకు పరిష్కరింపబడని తాళపత్ర గ్రంథాల పరిష్కరణ, ముద్రణ కోసం ఎలాంటి చర్యలు తీసుకొంటారు?
జవాబు: తాళపత్ర గ్రంథా పరిష్కరణ ముద్రణ కూడ బృహత్ కార్యమే. ప్రాచ్యలిఖిత భాండాగారం (ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ) ద్వారా పరిష్కరణ ముద్రణ జరిగేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తం. గతంలో వ్యక్తుగా మానవల్లి రామకృష్ణ కవి, శేషాద్రి రమణ కవులు, గడియారం రామకృష్ణ కవి, బిరుదురాజు రామరాజు, వల్లపురెడ్డి బుచ్చారెడ్డి, కపిలవాయి లింగమూర్తి, రవ్వా శ్రీహరి, శ్రీరంగా చార్య, జయధీర్ తిరుమలరావు, సంగనభట్ల నరసయ్యలాంటి వాళ్ళు గ్రంథ పరిష్కరణ చేసినారు. అట్టే ఈ పనిని చేసే వ్యక్తులకు అండదండగా ఉంటాం.
ప్రశ్న: సంస్థకు వున్న తక్షణ కర్తవ్యం ఏమిటి? ప్రాధాన్యతా క్రమం ఏమిటి?
జవాబు: ప్రభుత్వంతో సంప్రదించి, అమరావతి బౌద్ద ఉత్సవాల సందర్భంగా తెలంగాణా నుంచి తీసుకెళ్ళిన పురావస్తు సంపదను వెనక్కు తెప్పించడం, పురావస్తు శాఖ, ఆర్కైవ్స్ శాఖ, ప్రాచ్యలిఖిత భాండాగార శాఖ విభజన సందర్భంగా తెంగాణ వాటా సరిగ్గా దక్కేలా జాగ్రత్త వహించడం, కొన్ని కార్యక్రమాల గురించి రెండవ ప్రశ్నకు చెప్పిన సమాధానంలో ఉన్నవి.
ప్రశ్న: యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనను ఎలా సమన్వయం చేసుకొంటారు?
జవాబు: యూనివర్సిటీల్లోని చరిత్ర శాఖలో, తెలుగు శాఖలో ఆయా శాఖ అధ్యక్షులతో సంప్రదించి 80శాతం పరిశోధన తెలంగాణ అంశా మీద జరిగేటట్లు చూడవలసి వుంటుంది.
ప్రశ్న: ప్రభుత్వానికి చరిత్ర, సంస్కృతి పాలసీకి సంబంధించిన సూచనలు సహాలు ఏమైనా ఇస్తారా?
జవాబు: తప్పకుండా, త్వరలో సంస్థ విస్త్రృత సమావేశం ఏర్పాటు చేసి సమగ్రమైన పాల సీ రూపొందిస్తుంది.
ప్రశ్న: సంస్థకు నిధుల సేకరణ ఏవిధంగా చేయగలరు?
జవాబు: సంస్థ సభ్యుల నుంచి జీవిత సభ్యత్వ రుసుం సేకరించడం, వివిధ ప్రభుత్వ సంస్థల నుండి గ్రాంట్స్ వచ్చేలా చూడడం, వ్యక్తులనుండి విరాళాలు పోగు చేయడంలాంటి పద్దతుల ద్వారా నిధులను సమకూర్చుకుంటాం.
పాలనా బాష. _ Telugu. లేఖపోవడం —English భాష ను. ప్రమోట్. చేస్తున్న ప్రభుత్వం ??
తెలుగు చదేవే వాళ్ళు. ఉన్నారా అడపా గారు –సుంకిరెడ్డి గారు
యీ. 20 నెలలలో –మారింది–అబివృద్ది — ఎంత శాతం. Sirs —
———————————-
Buchi reddy gangula