1983లో తెలుగు దేశం పార్టీ ఏర్పాటయింది. పార్టీ స్థాపించిన తొమ్మిదినెల్లకే అధికారంలోకి వచ్చింది. ఎంత తొందరగా అధికారంలోకి వచ్చిందో అంత తొందరగా ఆగస్టు సంక్షోభంలో ఇరుక్కొని మళ్లీ ఎన్నికకు వెళ్లింది. ఈ సారి థంపింగ్ మెజారిటీతో గెలిచింది. ఇట్లా తిరుగులేని మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం, ఆ పార్టీని అన్ని విధాలా ఆదుకున్న కమ్మ సామాజిక వర్గం ప్రభుత్వం తమ కులానిది మాత్రమే అన్నట్టుగా, తమకు ఎదురులేదు అని విర్రవీగుతూ కారంచేడులో దళితును ఊచకోత కోసిండ్రు. ఇది 1985లో జరిగింది. ఇది తెలుగునాట దళిత చైతన్యానికి పునాది వేసింది. ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం స్థాపించడం చైతన్య స్ఫూర్తిగా మారింది. అంబేద్కర్ తన గురువుగా చెప్పిన జ్యోతిరావు ఫూలే 1990వ దశకంలో తెలుగు వారికి పరిచయమయ్యిండు. మహారాష్ట్రలో గెయిల్ అంవెట్, ధనంజయ కీర్, రోజాలిండ్ తదితరులు చేసిన కృషితో ఆయన రచనలు ఆంగ్లంలోకి తర్జుమా అయ్యాయి. జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత చరిత్రు వెలువడ్డాయి. దాదాపు ఇదే కాంలో తెలుగునాట ‘నలుపు’ పత్రిక కొంత సామాజిక చైతన్యంతో పనిచేసింది. ఎదురీత పత్రిక దాన్ని పాక్షికంగానే అయినా కొనసాగించింది. నలుపు పత్రిక బాధ్యులే తర్వాతి కాంలో ‘హైదరాబాద్ బుక్ ట్రస్ట్’ తరపున పూలే రచనల్ని, జీవిత చరిత్రను తెలుగులో ప్రచురించారు. 2009 ఎన్నిక సందర్భంలో చిరంజీవి సామాజిక న్యాయం పేరిట ఫూలే పేరును కొంత పాపులర్ చేసిండు. అంతకు ముందు మారోజు వీరన్న 1994లోనే బహుజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి, రాజ్యాధికారాన్ని దక్కించుకోడానికి ‘ఇండియాలో ఏం జెయ్యాలి’ అని కొంత చర్చ చేసిండు. విద్యార్థి దశలో వీటన్నింటిని దగ్గర నుంచి చూసిన గాజుల శ్రీధర్ అదే ‘బహుజన’ భావజాలంతో, బ్రాహ్మణాధిపత్యాన్ని నిరసిస్తూ ‘వెన్నె కొలిమి’ కవితా సంపుటిని వెలువరించిండు.
మలిదశలో ప్రత్యేక తెంగాణ ఉద్యమాన్ని 1987లో తెంగాణ ప్రభాకర్, హరనాథ్ు చిన్న పాయగా ప్రారంభించిండ్రు. వాళ్లు వెలిగించిన వత్తిని 1990లో ఉస్మానియా విద్యార్థులు అందిపుచ్చుకున్నరు. అట్లా అందుకున్న విద్యార్థుల్లో నేనుకూడా ఒకణ్ణి. తెంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై, ఓపెన్ కోటా పేరిట మొత్తం 20శాతం సీట్లను ఆంధ్రా విద్యార్థుల తో నింపడాన్ని తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ నాయకత్వంలో అడ్డుకున్నరు. ఆ తర్వాత భువనగిరి మహాసభ, వరంగల్, సూర్యాపేట డిక్లరేషన్లు, ఇంద్రారెడ్డి, జానారెడ్డి తెలంగాణ జెండా అన్నీ రంగం మీదికి వచ్చినయి. టీఆర్ఎస్ స్థాపనతో తెలంగాణ ఉద్యమానికి ఒక అండ దొరికినట్లయింది. అప్పటి వరకూ అక్కడక్కడా వినిపిస్తున్న గొంతులు ఒక్క దగ్గరికొచ్చాయి. అస్తిత్వ సోయితో చేసిన కృషి తెలంగాణ దశ, దిశనే మార్చేసింది. అప్పటి వరకూ ఎన్కౌంటర్లకు ఎరవుతున్న బిడ్డలు తుపాకులు అడవుల్లోనే వదిలేసి ప్రత్యేక తెలంగాణ జెండా అందుకున్నరు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్నందునే ఈ కాలంలో ఎన్కౌంటర్ హత్యలు తక్కువయినయి. ‘డెమోక్రాటిక్ స్పేస్’ దొరికింది. ఈ దొరికిన డెమోక్రాటిక్ స్పేస్ని ప్రత్యేక తెలంగాణ కోసం టీచర్లను సమాయత్తం చేసేందుకు గాజుల శ్రీధర్, ఆయన మిత్రులు కృషి చేసిండ్రు. సభలు , సమావేశాలు పెట్టిండు. వ్యాసాలు రాసిండు. ఇప్పుడు తాను నాలుగేళ్లుగా రాసిన కవిత్వాన్ని మనముందుంచిండు.
అత్యంత పేదరికంలో బాల్యం గడిపిండు. టీచర్గా సర్కారు బడుల్ని అతి దగ్గరగా చూసిండు. అనుభవించిండు. అందుకే శ్రీధర్ కవిత్వంలో బడి, బాల్యం కండ్లముందు కనబడతాయి. నిలదీస్తయి. బహుజన భావజాలంతో రాసిన కవితలే గాకుండా, రాజకీయ కవితలు కూడా ఇందులో ఉన్నాయి. విమలక్క విడుదలయినప్పుడూ, పైడి తెరేష్ చనిపోయినప్పుడూ కవిత్వం రాసిండు. బతికుండి కొట్లాడాలె గెలుచుకోవాలె అని భవిష్యత్పై భరోసా కల్పిస్తడు. వాళ్ల నాయిన మీదా, సహచరి మీదా కవిత్వమల్లిండు. ప్రపంచీకరణ, ఆత్మహత్యలు, ఉస్మానియా విద్యార్థులు, మహిళలు, పురుషాహంకారం వస్తువుగా పూర్తిగా తెలంగాణ సోయితో, ఈ మట్టి వాసనను పట్టిచ్చే విధంగా కవిత్వ మల్లిండు. 36 కవితలు , ఆరు పాటలతో పాణం పోసుకున్న ఈ సంపుటి ఉద్యమ సమయంలో అటు విశ్వవిద్యాలయ విద్యార్థులు, ఇటు తెలంగాణ బిడ్డలు చేసిన ఉద్యమాలను, త్యాగాలను శ్రీధర్ అక్షరీకరించిండు.
మార్క్స్, మావో గురించి యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు లెక్చర్ల రూపంలో, అరసం, విరసం మీటింగుల కు ఎప్పుడు పోయినా పుస్తకాల రూపంలో పరుచుకుండ్రు. అందుకే మార్క్స్, మావోలు 1940 నుంచి తెలుగు వారికి సుపరిచితం. అదే 1990 నాటికి కూడా బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్, పెరియార్, కాన్షిరామ్లు అపరిచితులు. ఆంధ్రా వలసాధిపత్యంతో పాటుగా కులాధిపత్యం ఎట్లా ఉందనేది కూడా శ్రీధర్కు అర్థమయింది. లెఫ్టిస్టులు ఏనాడూ పట్టించుకోని ఫూలే, అంబేద్కర్ను శ్రీధర్ పట్టించుకుండు. అందుకే
‘‘ఇప్పుడిక
మార్క్స్, మావో స్వప్న గీతాకు
ఫూలే`అంబేద్కర్ల దండోరా దప్పు దరువు మోగాలి’’ అంటూ కర్తవ్య బోధ చేసిండు.
బ్రాహ్మణాధిపత్యం సమాజాన్ని దిగజార్చిన తీరుని కళ్లముందుంచిండు.
‘‘ఈ దేశపు
దేహమంతా జందెప్పోగు
సాలెగూడలో బందీ’’
‘‘..అక్షరం మొదలు ఆయుధం దాకా
ఈ నేపై మొకెత్తే విత్తులన్నింటికీ
నెత్తుటి గాయా గురుతులు
నిత్యం శంబూకుని అంతిమ యాత్రలు’’
‘‘…నే నేంతా
మూల వాసి దోసిలిలో పూదోటై విరిసినా
మూలాల్ని తెగనరుకుతున్న
గండ్రగొడ్డలిదే రాజ్యం’’
రాజకీయ రంగంలో బ్రాహ్మణాధిపత్యం 1970 తర్వాత తగ్గు ముఖం పట్టింది. అయితే ఈ ఆధిపత్యం ప్రస్తుతం డైరెక్ట్గా తామే రాజకీయ నాయకుల అవతారమెత్తకుండా, రాజకీయ నాయకుల్ని కీలుబొమ్మల్ని చేసి ఆడిస్తున్నరు. రాజ్యాన్ని నడిపే ఎగ్జిగ్యూటివ్ లందరూ బ్రాహ్మణులే! అంతెందుకు బీసీ ప్రధాని మోడీ అని జబ్బు చరుచుకుంటున్న వారికీ ఆ ప్రధానమంత్రి కార్యాయంలో 97 శాతం మంది అధికారులు బ్రాహ్మణులే అంటే ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఇది వాస్తవం. తెలంగాణలో ఈ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. అయితే రాజు. లేదంటే రాజగురువు. ఇదీ బ్రాహ్మణాధిపత్యం. ఈ ఆధిపత్యాన్ని తుదముట్టించేందుకే ‘వెన్నెల కొలిమి మండిస్తున్న’ అని చెప్పిండు. ఇందులో కవితాత్మకంగా చెప్పిన శంబూకుని అంతిమయాత్ర, శంఖుతీర్థాలదే శాస్త్రీయత, గోత్రం గొడుగు పడగ నీడలు , బలి చక్రవర్తుల సమాధులు, కారుమబ్బు కౌటిల్యానిదే ఆధిపత్యం అంటూ బ్రాహ్మనిజం సడుగులిరగొట్టిండు. మనువు మడిని మెటామార్ఫోస్ చేసి బడికి కార్పోరేట్ దడి కట్టాడు,
‘‘మట్టీ .. గుట్టా..
అడవీ.. నీటి నెవూ..
మొత్తంగా నే నేంతా
మనువు పిడికిట పెట్టుబడి
మట్టి గుండెకు నెత్తుటి తడిపై
కట్టిన లోహపు దడి’’ అంటూ ఆధునిక మనువు రూపాన్ని పట్టించిండు.
‘‘.. మట్టి వాసన అస్తిత్వా మొకపై
వామన పాదా దండు’’
‘‘..చిగురించే అక్షరంపై మొకెత్తే గజ్జెపై
అమ్మపైనా.. అడవిపైనా..
చెట్టు చాటు యుద్ధం
అవునూ అమరుందరూ
అసురులే!’’ అంటూ ఎవరి ఫిత్రత్ ఏందో జెప్పిండు.
‘‘ఉగాది రోజు
పంచాంగాు, ఎన్నిక మేనిఫెస్టోు
జమిలిగా
నిద్రపుచ్చే మాదక ద్రవ్యాలు!’’ అంటూ మతం, మతాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయాలపై అక్షరాయుధాన్ని సందించిండు. నిజానికి జందెప్పోగు జాతి, మనువూ.. మట్టి, చెట్టు చాటు యుద్ధం అని కవితా శీర్షికలు పెట్టడంలోనే శ్రీధర్ సాహసం కనిపిస్తది.
రాజకీయ కవితల్లో 2004 ఎన్నికకు ముందు బిజేపి ప్రభుత్వం తమ ఎన్నిక ప్రచారాన్ని దేశం వెలిగిపోతున్నది అని ప్రచారం చేసింది. అయితే అది చేసుకున్న ప్రతి ప్రచార అంశాన్ని అబద్ధంగా విప్పి చెప్పిండు శ్రీధర్.
‘‘పదునైన పత్తి ఇత్తనం కత్తి వేటుకి
తెగి పడ్డ మా అమ్మ నుదుటి కుంకుమ
నూలు పోగుకు వేలాడుతున్న తల తోరణాలు ’’
‘‘ ఇసుక బట్టీల్ల ఇంజనీర్లైన
బడీడు బుడ్డోళ్లు’’
‘‘కూలి గుడిసెల్లో చీపులిక్కరు సీసా కెత్తిన నెత్తురు’’ అంటూ బీజేపి రంగు బహిరంగం చేసిండు.
‘‘లెక్కలేని దోపిడితో మీ సోపతి
వారానికి నెలెన్నని లెక్కించే మీ మతి
చర్చంటూ సాగదీసె కుటి రాజనీతి
చరిత్రే సాక్షి కదా బేహారు దుర్గతికి’’ అంటూ గులాం నబీ ఆజాద్ ఆంద్రోళ్లకు గులామై తెంగాణను ఆజాద్ కాకుండా చేసినందుకు 2013లో కవిత రాసిండు.
ప్రపంచీకరణ చేసిన నాశనాన్ని మననం చేసుకుంటూ
‘‘పాతికేళ్ళ గర్భందాల్చి పాడుకాం
ప్రసవించిన మార్కెట్ మహమ్మారి
ప్రపంచీకరణ వేటగాడు
బిగిస్తున్న ఉచ్చుకు
వేలాడుతున్న అస్తిపంజరాలం’’ బాధపడ్డడు.
శ్రీధర్ వాళ్ళ నాయిన గురించి
‘‘దారపు కండెకు చుట్టు కోవాల్సిన నా కంటి చూపును
పుస్తకాల పేజీకు అతికిస్తివి’’ అని కృతజ్ఞత చెప్పుకుంటడు. అలాగే సహచరి గురించి
‘‘..నాలు కపై గడ్డ కట్టిన మౌనాన్ని
ఎద లోతుల్లో ఘనీభవించిన దు:ఖాన్ని
నీ పైట కొంగు వెచ్చదనంలో కరిగించుకుంటా
సఖీ…’’ అంటూ సేదదీరిండు.
మహిళా దినోత్సవం సందర్భంగా రాసిన మరో కవితలో వాళ్ళ అమ్మలాంటి అనేక మంది అమ్మలను యాద్జేసుకుంటూ
‘‘భూగోళాన్ని
రాట్నానికి కట్టి
అరిచేతుకు
జీవితాల్ని అతికించి
మీ గుండెల్ని
చీల్చి
కండెకు చుట్టుకున్న
అమ్మలారా!’’ అంటూ తల్లి పాదాకు ప్రణమిల్లిండు.
‘‘అక్షరం అందరిదీ కాకూడదు
జ్ఞానం ఇనుపకంచెల్ని దాటకూడదు’’ అంటూ సర్కారు బడుల గురించీ, ‘‘అమ్మ కడుపు నుంచే పనిముట్లతో బయటపడిన వాళ్ళం’’ అంటూ పేదల బాల్యం గురించీ రాసిండు.
‘‘విచ్చుకత్తుల అంచుపై విమల గానమై
దూలాడుతూ కదలివచ్చిన కాలిగజ్జెకు…’’ అంటూ జైలు నుంచి విడుదలయి వచ్చిన ప్రజా గాయకురాలు విమలక్కకు స్వాగతం పలికిండు. అలాగే తెలంగాణ ఉద్యమంలో కావడికుండలు మోసిన పైడి తెరేష్ చనిపోయినప్పుడు
‘‘కొన్నాళ్ల పాటు.. కొన్ని చావులపై ..
నిషేధం విధించమని ధర్నా చేస్తాం
దారి తప్పకుండా శిబిరానికొస్తావా?
గులాబి ముళ్లతోటలో గానకచ్చేరి పెడతాం
గబ్బిలమై గజల్ గానం చేస్తావా…?’’
‘‘నిశ్చల సంద్రం లాంటి ముఖాన్ని
అరిచేతుల్లో దాచుకుందామంటే
‘హిందూసముద్రం’లో అగ్ని కెరటాల్ని మొలిపిస్తున్నావు’’ అంటూ నివాళి అర్పించిండు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద కవిత్వం, పాటా రెండూ ఇందులో ఉన్నాయి.
‘‘ఈ నేల కంటున్నది
మగపిల్లల్ని కాదు!
సామూహికంగా పురుషాంగాలకు
పురుడు పోస్తున్నది’’ అని నిర్భయ అత్యాచారా సంఘటన జరిగినప్పుడు గుండెలోతుల్లోంచి రాసిండు. ఇక్కడ కూడా మనువాదం పనిచేస్తుంది అంటూ ‘‘మూల నపడి మూల్గుతున్న ముసలి మనువు భూజాలపై వేలాడుతూ వెక్కిరిస్తున్నాడు’’ అంటూ రాజకీయ నాయకు, పురుషాధిక్యతతో మాట్లాడే చాంధసుల గురించి కవిత్వ మల్లిండు. అయితే
‘‘తలలు తీసే ఉరిశిక్షలు సరే గానీ!
ఆరో నూరో తలలు తెగితే…’’ అని అన్నడు. ఉరి శిక్షలు సరే అనడం, అదీ ఎంత ఆవేశం ఉన్నా అన్నీ తెలిసిన శ్రీధర్ లాంటి కవి మాట్లాడ్డం అన్యాయం. ఆరో నూరో తలు తెగితే.. అనడం కూడా తగదు. సమాజంలో మార్పురావడానికి, బ్రాహ్మణాధిపత్యానికి, మనువాదానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉద్యమించడమే పరిష్కారం.
అస్తిత్వ సోయితో తెంగాణ సాహిత్యానికి బహుజన సొబగుల ద్ది, కనుమరుగైతున్న తొర్ర, దారపు కండె , అలుకు పిడుచ, గాలింపు గిన్నె, ఎర్రని జాజు, కందిలి, మసిబట్ట, గొరుకొయ్యల్ని, బుడ్డోళ్లని కవిత్వంలోకి తెచ్చిన శ్రీధర్ బహుజనవాదానికి కొత్త చిరునామా!
-సంగిశెట్టి శ్రీనివాస్
కవితలు కోట్ చేసినపుడు భయంకర అక్షర దోషాలు. చెప్పదలుచుకున్న విషయం అర్థం కాకుండా పోయింది .
ల అక్షరం కంపోజింగ్ లో మిస్సయ్యింది. పొరపాటు నాదే..
ల అక్షరం కొన్ని చోట్ల మిస్సయ్యింది. పొరపాటు నాదే.
మంచి కవిత్వాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు!
దారుణమైన అచ్చుతప్పులు! వ్యాసం మొత్తం చదవడానికి చాలా కష్టమైంది. దయచేసి ఇక ముందు అచ్చుతప్పుల మీద ప్రత్యేకదృష్టి పెట్టండి.
బహుజన వాదపు కొత్త గొంతును పరిచయం చేసినందుకు సంగిశెట్టి గారికి అభినందనలు. విశ్లేషణ బావుంది. ఇంకా తడి వున్న కవిత్వాన్ని హామీ ఇస్తున్నడు ఈ కవితా సంపుటి ద్వారా గాజుల శ్రీధర్ గారు.
మంచి కవిత్వానికి దివ్వె నెత్తిన మంచి వ్యాసం.