-శ్రీపతి పండితారాధ్యుల దత్తమాల
~
కొంత కాలం …కొంత కాలం …కాలమాగిపోవాలి
నిన్న కాలం …మొన్న కాలం… రేపు కూడ రావాలి
ఒక ప్రేమికురాలు మనసు పొంగి పాడుకునే పాట.
ఇలాంటిదే, కాలానికి ఉన్న విలువను తెలుపుతూ, కాకపోతే విషాద గీతం ఉంది.
జాలాది రాజారావు గారు వ్రాసారు.
1976 లో విజయనిర్మల దర్శకత్వం వహించిన “దేవుడే గెలిచాడు” సినిమాకు రాసిన పాట.
పల్లెసీమ కోసం వ్రాసిన “చూరట్టుకు జారతాది సిటుక్కు సిటుక్కు వాన చుక్క ” మొదటి పాటైతే ,ఇది జాలాదిగారి రెండో పాట.
లిరిక్స్ వింటుంటే మాట పడిపోతుంది.
పాట సందర్భం అలాంటిది మరి …
నేను ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకోవడం చెవులారా విన్నాను …ఇలా
అతను : ఉన్నావా ? పోయావా ?
ఆమె : అదేంటి అలా అంటావ్? జస్ట్ ఒక వారమే కదా మాట్లాడలేదు.
అతను : అంతే కాంటాక్ట్ లో లేకపోతే ఉన్నా… పోయినట్టే నాకు
అలాంటిది …చనిపోతున్నానని, తన వాడితో కలిసి బ్రతకనని తెలిసిన ప్రియురాలి మానసిక క్షోభ ఎలా ఉంటుందో
ఈ పాటలో మనసు పిండి పిండి రాసారు.
సుశీలగారైతే చెప్పకర్లేదు .ఆవిడే ఆ బాధంతా అనుభవించారా అన్నట్టు పాడారు.
ఇలా సాగుతుంది పాట ….
ఈ కాలం పదికాలాలు బ్రతకాలని…ఆ బ్రతుకులో నీవు, నేను మిగలాలని…
చెరి సగాల భావనతో, యుగ యుగాల దీవెనతో రేపు,మాపులాగా కలిసిఉందాము …కరిగిపోదాము …కరిగిపోదాము
నాలో…నీలో…నాలో నీలో ….నువ్వు నేనుగా మిగిలి పాడతాను…
పాడి ఆడతాను …
నిన్నటి లో నిజం లాగనే, రేపు తీపిగా ఉంటె, ఆ తీపి గుండె రాపిడిలో ఊపిరిగా మిగిలుంటే,
చావని కోరిక లాగే…. పుడుతుంటాము
తిరిగి పుట్టి చావకుండ… బ్రతికుంటాము
నా జన్మకు ప్రాణం నీవై
నీ ప్రాణికి ఆత్మను నేనై
కాలానికి ఋతువు నీవై, తిరుగాడే వలయం నేనై
ఎన్ని తరాలైనా … మరెన్ని యుగాలైనా…
వీడని బంధాలై… కావ్యపు గంధాలై….
నాలో…నీలో…నాలో నీలో ….నువ్వు నేనుగా మిగిలి పాడతాను
ఈ కాలం పదికాలాలు బ్రతకాలని,ఆ బ్రతుకులో నీవు, నేను మిగలాలని..
పాట లింక్
http://www.allbestsongs.com/telugu_songs/telugu-Movie-Songs.php?st=3092