అవినేని భాస్కర్
మనిషి జీవితంలోని అన్ని సన్నివేశాలకీ సంకీర్తనలు రాశాడు అన్నమయ్య. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ పరమాత్మ అవతారాన్నే చూశాడు. మేమేనా ఆ సంసారంలో కొట్టుమిట్టాడాల్సినది? మీరూ రండి అని దేవుళ్ళని చేయిపట్టి లౌకిక జీవితంలోకి లాక్కొచ్చి మానవ జీవితంలోని కష్టనష్టాలను దేవుళ్ళకి ఆపాదించాడు. అలా చెయ్యడంలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే, “మనకే కాదు దేవుళ్ళకైనా సంసార జీవితం సులువుగా సాగట్లేదు” అని చెప్పి విరక్తి కలగనియ్యకుండ ధైర్యాన్ని కలిగించడమే.
ఇక్కడా అక్కడ అని సిగ్గుశరములేకుండ నలుగురైదుమంది మగవాళ్ళ సాంగత్యంలో ఉంటావు అని అత్త దెప్పితే, వాడకు పదిమంది దగ్గర చేరి వాళ్ళ మధ్యనే ఉంటావు నువ్వేం తక్కువా? అంటోంది కోడలు. [ ఏగురు అంటే ఐదుగురు అని అర్థం. వాడకు నలుగురు, ఐదుగురు పండితులు ఉంటారు. సరస్వతి వాళ్ళనే కటాక్షించి ఆదుకుంటుంది అని భావం. సిరి అయినా అంతే అందరిదగ్గరా చేరదు. ఏ కొందరిచెంతో మాత్రమే ఉంటుంది].
అంకెల = అంకెల రూపంలో
అడ్డగించు = బలవంతంగా సొంతంచేసుకోవడం
నిజానికి కీర్తనలో నాకు కొన్ని పదాలు అర్ధం కాలేదు. నేనే మిమ్మల్ని అడుగుదామనుకున్నా.
కానీ, చివర్లో సాహిత్యాన్ని చక్కగా అర్ధాలతో సహా వివరించి, మా వంటి పామరుల సందేహాలన్నీ చక చకా తీర్చేసారు.
నాకు చాలా నచ్చింది కీర్తన. మురిపెంగా అనిపించింది కూడా.
ధన్యవాదాలు భాస్కర్ గారు.