అవినేని భాస్కర్
జానపద శైలిలో, పామరుల వాడుక భాషలో, అచ్చ తెలుగులో అన్నమయ్య పలు కీర్తనలు రాశాడు. దంపుడు పాటలు, గొబ్బిళ్ళ పాటలు, జాజర పాటలు, వసంతాలాటల పాటలు (పసుపు నీళ్ళు చల్లుకునే పండుగ – హోలీ వంటిది), వెన్నెల్లో నృత్యం చేసుకుంటూ పాడే పాటలు, పెళ్ళి పాటలు, జలక్రీడా పాటలు ఇలా ఎన్నెన్నో జానపదాలు రచించాడు.
వెన్నెల్లో యువతీ యువకులు కోలాటం చేస్తూ పాడుకునే జానపదంగా “నెయ్యములు అల్లో నేరేళ్ళో” పాటని భావించవచ్చు.