ఆ ఆరుగురేనా?

 

 

అప్పుడు:

 

దేశ రాజధానిలో ఇండియాగేట్ దగ్గర

నిర్భయకు న్యాయం జరగాలంటూ ప్రశాంతంగా సంఘర్షిస్తున్న వేలాది స్త్రీ పురుషులను

లాఠీలతో, బుల్లెట్లతో, వాటర్ కానన్లతో మానభంగం చేసారు

 

వీడియో  పాఠాలు కొన్ని :

 

యీ దేశానిది  ఘనమైన సంస్కృతి..   యిందులో ఆడవాళ్ళకు స్థానం లేదు.

:న్యాయవాది వువాచ

 

ప్రాణాలు కాపాడుకోవాలంటే నోరు మూసుకుని చెయించుకోవాలి గాని నోరెత్తకూడదు

వీడియోలో రేపిస్టు మాట్లాడుతున్నడా లేక నేను అద్దంలో చూస్తున్నానా?

భుజాలెక్కడ?

: చాలామంది సమస్య.

 

యిప్పుడు:

 

మీ మానాలను కప్పి కాపాడుతున్నామంటూ

వీడియో ప్రసారాన్ని నిర్బంధించి

మీ కళ్ళు చెవులు నోళ్ళు మూసి

వొక్కసారిగ

సమస్త దేశంలోని

ఆడా-మగా  అందరిని లింగ వివక్ష లేకుండా

సమానంగా

మానభంగం చెయడం జరిగింది.

చట్టం నిర్వచనంలోకి రాని దానికి శిక్షా లేదు.

 

స్వగతం:

 

ఆ నిర్భయను మానభంగం చేసినవారు ఆ ఆరుగురేనా?

 – పరేశ్ ఎన్ దోశి

 

 

మీ మాటలు

*