నాకో తమాషా అయిన కోరిక వొకటి వుంది. ఆ కోరికని రిటైరైనా తీర్చుకోవాలని, ఒక రోజు రత్నాచల్ రైల్లో పొద్దున్నే, మర్నాడు శాతవాహనా అదీ పొద్దున్నే, మూడోరోజున పినాకినీ ప్రత్యూషాన్నే ఎక్కి, భుజాన వేలాడే సంచిలో రోజుకో పుస్తకం చొప్పున పరిగెడుతున్న రైల్లో నిదానంగా నడుస్తూ, ఒక్కొకరినీ పలకరిస్తూ విసిగిస్తూ ఈ పుస్తకం చదివి మళ్ళీ రైలు దిగేటప్పుడు ఇచ్చేయండి – అనాలని అని.
(-మిగిలిన ‘మో’ కబుర్లు ఈ పీడియఫ్ లో చదవండి-సెప్టెంబర్ రెండు త్రిపుర పుట్టిన రోజు )
సౌజన్యం: కే. కే. రామయ్య, సీత పొన్నపల్లి
త్రిపుర పాఠకుల రచయిత కాకపోవచ్చు అనే సందేహం నచ్చింది.
:-) ఇలా పైకి చెప్పడానికి చాలా మంది వెనకాడతారు.
మొన్నీ మధ్యే ఒక రీడర్ నా దగ్గర మొత్తుకున్నారు. .
ఆయన కథ ఎంత చదివినా ఒక్క ముక్కా అర్ధం కాదెందుకూ అని…
మీ జవాబు కొంతవరకు ఉపయోగ పడుతుమ్దనుకుంటాను.
మో జవాబు..
అంత బాగా కథలు రాసే రచయిత త్రిపుర, గొప్పగా విశ్లేషణ చేసే కవి ‘మో’ తెలుగువాళ్లుగా పుట్టినందుకు మనం యెంతగా గర్వించాలో, ఆ యిద్దరూ ఈ లోకాన్ని వీడిపోయినందుకు అంతగా దుఃఖించాలి. ఈ రచన మీద కామెంట్లు యెక్కువగా రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. కొన్నిసార్లు అంతేనేమో.