మామిడిపండులా మధురంగా కనిపించి నా మనసు దోచుకున్న వారిని గురించి తెలుసుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండడం లోనే రోజులూ, నెలలూ సంవత్సరాలూ కాలగమనంలో దోర్లిపోయాయి. వారిని నేను మొదట చూసింది మంచిర్యాల నుండి ఆదిలాబాద్ బస్సులో వెళ్తూ. వారి ఆహార్యం వింతగా కొత్తగా ఉండి వారి పట్ల ఆసక్తి రేకెత్తించింది. ఆ తరువాత కొన్ని ఏళ్ళకి అంటే నేను నిజామాబాద్ జిల్లాలోని వర్ని వచ్చేవరకూ ఎప్పుడూ వాళ్ళని చూసే అవకాశం రాలేదు.
శాంతి ప్రభోదా గారు ,
మీరు మధుర లంబదిల గురించిన వ్యాసం చాల బాగా వున్నది. బాగా రీసెర్చ్ చేసి అన్ని విషయాలు తెలిపారు. అభినందనలు.
వేలూరి కృష్ణమూర్తి
అనన్య, 15, 14థ్ బ్లాక్, సబం కాలనీ, శ్రీరామపురం, మైసూరు-570023.
మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలండి కృష్ణమూర్తి గారు.
వ్యాసం చాలా బాగుంది. వీరిని మహారాష్ట్ర లో డినొటిఫైడ్ నొమాడిక్ ట్రైబ్ గా గుర్తించారని చెప్పారు. మరి మన దగ్గర వీరిని ఎస్సీ/ ఎస్టీ/ బీసీ / డి ఎన్ టి. … ఏ జాబితా లో చేర్చారు .
“ఏదైనా ఆర్దికపరమైన లాభం లేకుండా ఎవరూ ఏ పనీ చేయరని వారి ప్రగాఢమైన నమ్మకం.”
ఇది వారి నమ్మకమే కాదు, ఏ పల్లెకు వెళ్ళినా ఇదే నమ్మకమే! మా వూరిలో నాకిక్కడ అమెరికాలో ఎవరో ఇస్తుంటే నేనిస్తున్నానని కొందరి నమ్మకం!
వ్యాసం చాలా బాగుంది. చిత్రాలతో సహా వివరాలు బావున్నాయి.
చరిత్రలో నిక్షిప్తం చేయాల్సిన ఎన్నో వివరాలు మనముందే కాలగర్భంలో కలిసిపోక ముందే ఇలా సేకరించాల్సి వుంది.
మథుర గిరిజన సంచారజాతుల పైన సవిస్తరమైన వ్యాసం చాల బాగుంది. ఎన్నో విషయాలు తెలియచేసినండులకు ధన్యవాదాలు. 1978 ప్రాంతంలో నేను నిర్మల్ నుండి ఆదిలాబాద్ కు బస్సు లో వెళ్తుండగా కొందరు అదే బస్సులో ప్రయాణం చేయడం నేను చూసాను. వారి లో కొందరు స్త్రీలు కూడా వున్నారు. వారి కట్టు , బొట్టు, తలకట్టూ నాకు విచిత్రంగా తోచాయి. నా పక్కన సీట్ ఖాళీ గా వున్నా, కూర్చోమని నేను చెప్పినా వాళ్ళు కూర్చ్లేదు. నాగరికులంటే భయమేమో అని భావించాను. దారిలో వాళ్ళు దిగిపోయారు. ఆదిలాబాద్ లో వాకబు చేయగా వాళ్ళు మథుర అనే సంచార జాతికి సంభందించిన వాళ్ళు ,మరియూ, వాళ్ళ వృత్తి పశుపోషణ అని తెలిసింది.
చక్కని వ్యాసాన్ని అందించిన రచయితకు కృతజ్ఞతలు. . నాగరికత ఎన్ని ప్రాచీన సంస్కృతులను బలిగొంటుందో . మనం మన జీవన విధానాలను , సంస్కృతులనూ కాపాడుకోలేమేమో. ప్రపంచీకరణ వలన జరుగుతున్న నష్టమది ..