ఈ నిరామయ సాయంత్రాన
ఎవరిని గుర్తుకు తెచ్చుకొని
రోదించను?
ఎత్తైన ఈ రెండు పర్వతాల మద్య
లోయలో
గుబురుగా ఎదిగిన పొదలతో
నా ఒంటరి సమాధి కప్పివేయబడివుంది
మెల్లగా, భ్రమలాగా
మేఘాలు భూమిని రాసుకొని వెళుతున్నాయి
ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు
కన్నీరు కార్చేందుకు ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు
ఈ రోజెవరో నా అజ్ఞాత సమాధి మీద
రెండు పుష్పాలు ఉంచారు
రెండు కన్నీటి బొట్లూ రాల్చారు
ఆమె ఎవరో గుర్తులేదు
ఒక్క జ్ఞాపకమూ గుర్తులేదు
కన్నీరు కార్చేందుకు ఒక్క జ్ఞాపకమూ గుర్తు లేదు
-శ్రీరామ్
సంక్లిష్ట సామాజిక దశలో వొక మానసిక కల్లోలం సంగతి. కల్లోలాలన్నీ వ్యక్తీకరణలే. కవిత్వాలే. గాథలే !
వొక గాఢమైన వ్యక్తీకరణ ఈ కవిత !
బాగుంది శ్రీరాం గారు