ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
చదువు కోసం ఆ ఆమ్మాయి అలా చేసిందని జగద్ధ్ధాత్రి గారు చెపుతున్నారు కానీ ఈ కధ చదివితే అల్లా అనిపించదు. ఈ కధకు ముందర ఏం జరిగి ఉంటుందని ఆలోచిస్తే, మనం దాన్ని ఇలా ఊహించవచ్చు. తల్లి తండ్రులు పిల్ల పెళ్లి కోసం ప్రయత్నం చేసి ఉంటారు. పిల్లాడి తల్లి తండ్రులు `మా పిల్లవాడికి చదువు కయ్యే ఖర్చు మీరే భరిస్తే మీ పిల్లను చేసుకుంటామని’ అని ఉండవచ్చు. ఆ విధంగా కట్నం గాని కట్నంగా అల్లుడికి డబ్బు పంపించటం కోసం తల్లి, తండ్రి ఎక్కడా లేని ఈ విచిత్రమైన దారిని కనిపెట్టారు. ఈ మధ్య భువన చంద్ర గారు కూడా ఈ విషయమే రాశారు. కట్నం ఇచ్చుకోవటం కోసం ఆడపిల్లలు ముందరే వ్యభిచారానికి దిగినట్లు. అయితే ఇందులో శారద పెళ్ళైన తరువాత ఆ పనికి పూనుకుంది. అయితే శారద ఇట్లా చెయ్యటం భర్తకు ఏమాత్రం ఇష్టం లేదు. అతను ఈ సంగతి తెలుసుకోగానే నేను వదిలేస్తాను అనటంతో, శారద తప్పంతా తన తల్లి తండ్రులదని చెప్పి తాను అమాయకురాల్నని చెప్పి (నటించి) కరుణాకరం కాళ్ళ మీద పడి అతనితో వెళ్లిపోతుంది. అతను చదువు మానేసి ఉద్యోగం చేస్తూ సంసారాన్ని లాక్కోస్తూనే వుంటాడు. కానీ మళ్ళా శారద నాయుడుతో సంబంధం పెట్టుకోవటం అతని కళ్ల పడుతుంది. అతను సహించ లేక దాని గురించి అడిగినప్పుడే అతన్ని తన దగ్గరున్న డబ్బులు తీసుకొని చదువుకొమ్మని ఆశ చూపింఛీ, కొంత బెదిరించీ తాను వ్యభిచరించటానికి అంగీకారం భర్త నుంచి పొందుతుంది. కాబట్టి ఆమె డబ్బుతో వచ్చే అంతస్థుతో పాటు ఇతరులతో వ్యభిచరించటం కూడా వదులుకోలేదని దీన్ని బట్టి అర్ధం అవుతుంది. తన వ్యభిచారాన్ని భర్త ఒప్పుకోవటం కోసం ఆవిడ భర్తకు చదువు, గొప్ప ఉద్యోగం, ఇంకా దానిలో ఉన్నతి పొందటం, చివరకు సర్ బిరుదు పొందటం ఇవన్నీ యెరలుగా వేస్తుంది. కరుణాకరం(తన బలహీనత వల్ల) అన్నిటికీ తలవొగ్గి చివరకు తన పిల్లలు కాని పిల్లలకు కూడా తండ్రిగా ఉంటూ ఉద్యోగ ఉన్నతిలోనూ, సర్ బిరుదులతోనూ సంతృప్తి పడుతూ, ఆమె ప్రియులందరి లిస్టులో చివరన నిలబడటానికి కూడా బాధపడని తాత్విక, మానసిక స్థాయికి చేరుకోవటంతో కధ సుఖాంతమవుతుంది. అయితే రచయిత ఈ కధను వ్యంగ్యంగా రాయటం వల్లా, చివర కొంత కొంటితనంగా ద్రౌపదితో పోల్చడం వల్లా, రచయిత శారదను సమర్ధిస్తున్నాడా లేదా అనేది పాఠకుడు కొంత అనుమాన పడేటట్లుగా చేస్తుంది. కధకు రచయిత కప్పిన ఆ మాయ పొరను చింపేసి కధను నగ్నంగా నిలబెట్టి జగద్ధ్ధాత్రి గారు చాలా గొప్ప పని చేశారు. దానికి ఆమెని ఎంతైనా అభినందించాలి. కట్నమిచ్చి పెళ్లిచేసుకోలేక నిజాయితీగా ఏదో ఒక పని చేసుకుంటూ అలాగే మిగిలిపోయిన స్త్రీలనూ, గంతకు తగ్గ బొంతను చేసుకొని ఆర్ధిక ఇబ్బందులు అనుభవిస్తూ అలాగే సంసారాన్ని లాక్కొచ్చే స్త్రీలనూ, సంసారానికి ఆర్ధిక సాయంగా ఉంటుందని చెప్పి తెల్లవారుజామున 4 గంటలకే లేచి భర్తకు పిల్లలకు వండి పెట్టి బస్సులు, రైళ్లు ఎక్కి వేరే ఊళ్ళకు కూడా వెళ్ళి ఉద్యోగాలు చేసే స్త్రీలనూ శారద తో పోలిస్తే హీనులని అనుకోవాలా? మానవ సంబంధాలకు సమానత్వమూ, ప్రేమా, ఆత్మగౌరవాలు ప్రాతిపదికగా ఉండాలే గానీ, అవకాశ వాదం, విశృంఖలత్వం, కపటత్వం, వంచన(కధలో కరుణాకరం చేసుకుంది ఆత్మ వంచన) ఇవి కాదు ఆదర్శం ఎవరికైనా. భూస్వామ్య వ్య్వస్థని దెబ్బ తీయటానికి, సమాజంలో ద్వంద్వ నీతినీ, స్త్రీల అణచివేతను ఎదిరించటానికి ఫ్యూడల్ పురుషుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేట్టు చెయ్యటానికీ చలం గానీ, చాసో గానీ ఇటువంటి తిరుగుబాటు చేసే విశృంఖల నాయికలను సృష్టించారు. ఈ కధలను ఆ చారిత్రక నేపద్యంలోనే చదివి వదిలెయ్యాలి తప్ప, వ్యవస్థలో ఉన్న తప్పుడు పధ్ధతులను ఎదిరించటానికి, ఇంకో తప్పుడు దోవలను పోవటం ఆదర్శంగా చూపించకూడదు. ఏ కధైనా ఎంత కష్టమైనా స్త్రీలు సమానత్వం, ఆత్మ గౌరవాల కోసం నిజాయితీగా పోరాడటమే సరైందనేది చెప్పాలి.
చాసో కధను గురించి మంచి చర్చ జరిగింది.
‘శత కోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు , అలాగే వారి దారిద్రానికి వారికి తోచిన పరిష్కారం అది.’ ఇదే నిజమైతే ఈ కధ రాయల్సిన అవసరం చాసో గారికి లేదు. మంజరి గారు చెప్పినట్లు ‘సమాజంలో ద్వంద్వ నీతినీ, స్త్రీల అణచివేతను ఎదిరించటానికి ఫ్యూడల్ పురుషుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేట్టు చెయ్యటానికీ చలం గానీ, చాసో గానీ ఇటువంటి తిరుగుబాటు చేసే విశృంఖల నాయికలను సృష్టించారు. ఈ భావమే ఈ కధకు పునాది అయి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం . అవసరం లేదు.