ఈ వీధి నాటకం ఈ మనిషికి ప్రత్యేకం!

ramesh

  పాత్రికేయ రచయిత, ఛాయాచిత్రకారుడూ అయిన కందుకూరి రమేష్ బాబు ‘సారంగ’ కోసం వారం వారం మానవ జీవన దృశ్యమాలికను తనదైన పద్ధతిలో పరిచయం చేస్తారు.

*

maanavudu

కన్నంటుకోని నగరం కోల్‌కత. అలుపు సొలుపూ లేని జనారణ్యం కోల్‌కోత. ప్రఖ్యాత ఛాయాచిత్రకారుడు రఘురాయ్ మాటల్లోనైతే ‘అది ఎప్పుడు మేలుకొంటుందో తెలియదు. ఎప్పుడు సద్దుమణుగుతుందో తెలియదు.’ అటువంటి మహానగరంలో కుమార్‌టౌలీ ఒక దివ్యధామం. అక్కడి వీథులన్నీ గర్భగుడికి దారులే. ఇండ్లూ వాకిళ్లూ దేవీ విగ్రహాల లోగిళ్లే.

చూస్తుండగానే, దశమి సమీపిస్తుంది. మానవుడు కనుమరుగై మహోన్నతమైన దుర్గామాత ప్రత్యక్షమౌతుంది. ఇక దేవత యజమాని పరం అవుతుంది. నిజానికి వారికది విగ్రహమే కావచ్చును. కానీ, అదొక తపస్సు. ఆహోరాత్రులూ నవరాత్రుల కోసమే అంకితమయ్యే మహోపాసన. మానవ మహత్కార్యానికి ఒక చిత్రమైన కొలుపు. ఇదంతా ఒక పార్శం. మరొక పార్శం జీవన సమరం.

తొలుత పని చిన్నగానే మొదలౌతుంది. అది అనేక దశల్లో సాగుతుంది. చివరాఖరికి రంగులద్దిన పిదప మాత కన్ను తెరుస్తుంది. విస్తుపోయే వర్ఛస్సుకు లొంగిపోతాడు మనిషి. చిత్రమేమిటంటే, తమ బొమ్మ తమ కార్ఖాణాల్లోనే తల్లిగా మారి పూజలందుకుని వీడ్కోలూ తీసుకుంటుంది. అప్పుడు చిన్నబోవడం వీళ్ల వంతు. అంతదాకా తామే భగవంతులు. ఆ పిదప పూజారులూ కూడా కాదు, చిల్లర దేవుళ్లు.

ఈ వీథి నాటకం ఈ మనిషికి ప్రత్యేకం. కుమార్‌టౌలికీ, కోల్‌కోతాకు ప్రత్యేకం.
వందనం మనిషి! జగమంత విస్తరించే కడుపేద మనిషీ, వందనం!!

మీ మాటలు

  1. రమేష్ చిత్రాలమీద ఎన్నోసార్లు వ్యాఖ్యలు చేశా. అభినందనలు చెప్పా. సారంగకీ చిత్రాలు అందించడం ఆనందకరం. మరోసారి అభినందనలు. పులికొండ సుబ్బాచారి.

  2. bommalu chesina vaallu aa vigrahaale devullai poojalu andukuntete choosi aananda padalo, avi kanu marugu avutaayani baadha padaalo lanti ayomaya stitilo vunna chillara devullu! its nice

మీ మాటలు

*