ఈ రాత్రి వొడవదు ఎన్నో రాత్రి ఇది చెంప మీద ఎన్నో కన్నీటి చుక్క జారి ఆరిపోతున్నది తెల్లని మంటయ్ కురుస్తున్న మంచు కిటికీ అద్దం మీద వీధి లాంతరు విసుగు ఒక్క వెచ్చని వూహ లేదని ఫిర్యాదు దృశ్యం మారితే బాగుండు, మార్చేది ఎవరు నేనెప్పుడూ చీకట్లో ఆడుకుంటున్న ఆడపిల్లనే నా చుట్టూరా నల్లని కందకం, ప్రతిబింబం లేని అద్దం వృత్తాకార కందకంలో నాచు పట్టిన కత్తులు కందక ఖడ్గానికి పొదిగిన పచ్చల వలె చుక్కలు నల్లని అద్దాన్ని దాటే … [ఇంకా చదవండి ...]
నువ్వంతే ఎప్పుడూ నిత్య వికసిత కుసుమానివై పరిమళం వెదజల్లుతుండు నిను కాంచే చూపుల పై... దేహాలపై... ~ నీ నవ్వుకు వేలాడుతుంది ఓ ముక్క ఆకాశం కాంతి సముద్రాన్నెత్తుకొని నీ నడుమ్మోసే చంటిపాపలా ఓ మాయని మాయలా ముడతలు కొన్ని నీ ముఖంమ్మీద అందం చెక్కిన ఆనందాలౌతుంటాయి అసలే నలుపు ఆపై చెవికి చెవులై వేలాడే లోలాకులు నక్షత్రమంత కాకపోయినా అలాంటిదే ఓ ముక్కు పుడక నీ ముక్కు అందం జుర్రేసుకుంటూ అంత వరకూ చూడని రంగురంగుల సీతాకోకచిలుక దేహపుహోళిలా నిను చుట్టేసిన బట్టల అద్దాల్లోంచి తొంగి … [ఇంకా చదవండి ...]
నా లోపలి సతత హరితారణ్యానికి ఎవడో చిచ్చు పెట్టాడు మట్టిదిబ్బలూ ముళ్లపొదలూ తప్ప తుమ్మముళ్లూ బ్రహ్మజెముళ్లూ తప్ప పూల పలకరింపుల్ని ఆఘ్రాణించలేని పక్షుల రెక్కల ఆకాశాల్ని అందుకోలేని సెలయేళ్ల లేళ్లను తనలోకి మళ్లించుకోలేని జంతుజాతుల జన్మరహస్యాల్ని పసిగట్టలేని మనిషిరూపు మానవుడొకడు ఒళ్లంతా అగ్గి రాజేసుకుని అంటించేశాడు వాడు విధ్వంసపు మత్తులో తూలుతూ మంటల ముందు వెర్రిగా తాండవమాడుతూ ++++++ కాలమాపకయంత్రం మలాము పూసింది కాలిన గాయాలు కనుమరుగవుతున్నాయి పచ్చదనం మళ్లీ … [ఇంకా చదవండి ...]
Copyright © 2024 Saaranga Publishers
శాంతిప్రబోధగారూ, జాషువా కవితాతత్వాన్ని చిన్న వ్యాసంలో హృద్యంగా రూపుకట్టించారు. ఔచిత్యాలను స్పృశించారు. అభినందనలు. ‘ముప్పదిమూడు కోట్ల దేవత లెగవడ్డ దేశమున’ భాగ్యవిహీనుల క్షుత్తులారునే అని జాషువా ప్రశ్నించారు. ఇప్పుడాయన పేర్కొన్న దేవతలు నూట ఇరవై కోట్లు దాటారు. అయినా ఆయన స్వప్నించిన సమాజం ఇంకా అవతరించలేదు! బాధాకరం,
ధన్యవాదాలండీ కల్లూరి భాస్కరం గారూ. ఇప్పుడాయన పేర్కొన్న దేవతలు నూట ఇరవై కోట్లు దాటారు. నిజమే కదూ! విశ్వనరుడు స్వప్నించిన సమాజం ఎప్పుడు అవతరిస్తుందో .. కనుచూపు మేరలో అగుపించడం లేదు.
బాగుందండి, చాలా బాగా రాసారు. శాంతి ప్రబోధ గారూ !
కవి రాసిన చివరి వాక్యాలు నేను నా ఫేస్ బుక్ లో కి తీసుకుంటున్నాను.
అభినందనలతో.
ధన్యవాదాలండి దమయంతి గారూ
చాల చక్కగా రాసారు ; మీ ద్వారా, సారంగా వారపత్రిక ద్వారా జాషువ గారి గురించి తెలుసు కున్నందుకు ధన్యవాదాలు. 1970-80 లలో జాషువ గారి పద్యాలూ పాట్యపుస్తకాలలో చెప్పలేదు. వినడము తప్పితే విడిగా తెలియదు, జాషువ గారి గురించి. మీరు వ్రాసిన విధానము గ్రాంధికంగా వున్నది. మంచిదే కానీ, అందరికి అర్ధము అవ్వాలంటే, కొన్ని పంక్తులు వాడుక భాషలో వుంటే బాగుంటుంది.
ధన్యవాదాలండి రామారావు గారూ
పాడుబడ్డ మశీదే బడిగా,గుడ్డి దీపమే గురువుగా,గిజిగాళ్ళు,గబ్బిలాలు నేస్తగాళ్ళుగా చేసుకొని మహాకవిగా ఎదిగిన జాషూవాను మీ వ్యాసంలో చాల వివరంగా పరామర్శించారు.కొత్తలోకం కావ్యాన్ని పరిచయం చెయండి .