హైదరాబాద్ లో 27న ‘తొండనాడుకతలు’ పరిచయ సభ

 

954820_612525435436475_1241627260_n
ఇరవై తెలుగు కతలు, ఇరవై తమిళ కతలతో తొండనాడు కతలు పుస్తకం రూపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు జిల్లాలు, చెన్నయ్, పాండిచ్చేరి నగరాలు కలిగిన ప్రాంతం తొండనాడు. రెండు వేల ఏళ్లనాటి తమిళ సంగ సాహిత్యంలో తొండనాడు ప్రస్తావన ఉంది. తొండనాడు ప్రాంతంలోని తమిళ, తెలుగు రచయితల కతలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

తొండనాడు కతలు పుస్తకం పరిచయ సభ ఈ నెల 27 మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్ బంజరాహిల్స్ లోని లామకాన్‌లో జరుగుతుంది. జయధీర్ తిరుమలరావు, సామల రమేష్‌బాబు, వే దగిరి రాంబాబు, ఓట్ర పురుసోత్తం మాట్లాడుతారు. వివరాల కోసం 8142642638, 9346814601 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.

తొండనాడుకతలు లో – తమిళ రచయితలు కీ.శే. అణ్ణాదురై, కీ.శే. ము.వరదరాజన్, జయకాంతన్, సార్‌వాగన్, శివశంకరి, బవా చెల్లదురై, వె. శేషాచలం, పారవి, ఎక్బర్డ్ సచ్చిదానందం, డేవిడ్ కనకరాజ్, అళగియ పెరియవన్, జి.మురుగన్, జె.డేనియల్, కాంచి శాంతన్, కవిపిత్తన్, ము.మురుగేశ్, వెణ్ణిల, యాళన్ ఆది, పడుదళం సుకుమారన్, ఇమైయం కథలు ఉన్నాయి. తెలుగులో- కీ.శే. కె.సభా, సి.వేణు, నామిని సుబ్రమణ్యంనాయుడు, కలువకొలను సదానంద, లంకిపల్లె కన్నయ్యనాయుడు, కీ.శే. మధురాంతకం మహేంద్ర, కీ.శే. పులికంటి కృష్ణారెడ్డి, సౌదా, కీ.శే. మధురాంతకం రాజారాం, మధురాంతకం నరేంద్ర, వి.ప్రతిమ, గోపిని కరుణాకర్, విష్ణుప్రియ, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, కె.ఎ.మునిసురేష్‌పిళ్ళె, గూళూరు బాలక్రిష్ణమూర్తి, పసుపులేటి గీత, జిల్లేళ్ళ బాలాజి, స.వెం.రమేశ్, ఓట్ర పురుసోత్తం కథలు ఉన్నాయి.

ఈ పుస్తకం కినిగెలో దొరుకుతుంది.

మీ మాటలు

*